అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పుర పౌరులు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 18 ఏళ్లు నిండిన యువత తొలి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉంది. ‘ఎవరు గెలిచినా ఒకటే‘ అన్న నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి, ‘మా ఓటుతో మార్పు రావాలి‘ అన్న అభిప్రాయంతో ఉంది. తొలి ఓటుతో భవిష్యత్తుపై మొదటి సంతకం పెట్టేందుకు ఉత్సాహం చూపుతోంది. ఈ నేపథ్యంలో తొలి ఓటర్ల అభిప్రాయం వారి మాటల్లో.. నిర్మల్టౌన్/భైంసాటౌన్/ఖానాపూర్
కుల మతాలకు అతీతంగా..
యువతే కీలకం..
ఓటు హక్కు వజ్రాయుధం. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఓటెయ్యాలి. రాజ్యాంగం కల్పించిన నా తొలి ఓటు అభివృద్ధికే వేస్తాను.
– షేక్ ఖలీల్, డిగ్రీ విద్యార్థి, భైంసా
రాజకీయాల్లో కుల మతాలకు తావుండొద్దు. ఓటర్లు అభివృద్ధి చేసే, సమస్యలు పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలి. ప్రలోభాలకు తలొగ్గవద్దు. కులమతాల కు అతీతంగా సమస్యలు పరిష్కరించే నాయకుడికి ఓటు వేస్తా. – మహ్మద్ ఇమ్రాన్, డిగ్రీ విద్యార్థి, భైంసా
అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం
అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం
అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం
అభివృద్ధికి ‘తొలి’ ప్రాధాన్యం


