రాజ్యాంగ రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ రథయాత్ర

Jan 27 2026 1:02 PM | Updated on Jan 27 2026 1:02 PM

రాజ్యాంగ రథయాత్ర

రాజ్యాంగ రథయాత్ర

నిర్మల్‌టౌన్‌: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో రాజ్యాంగ రథయాత్ర నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ట్యాంక్‌ బండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు భారత రాజ్యాంగ విలువలు తెలుసుకుని, పూలే, అంబేడ్కర్‌, కాన్షీరాం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు సాయన్న, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోశెట్టి, గౌరవ అధ్యక్షుడు బర్మ చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి రాజులదేవి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు కల్లూరు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement