నిర్మల్: ‘మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లాలో తొలిసారి కలెక్టర్గా పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రక్తహీనత, ఇతరత్రా ఇబ్బందులతో బాలింతలు చనిపోవడాన్ని అరికట్టడానికి ‘అమ్మరక్షిత’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం, మాతృమరణాల తగ్గింపులో దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపురావడం చాలా సంతృప్తినిస్తోంది. మహిళలు తలచుకుంటే, తమలోని శక్తిని గుర్తిస్తే, దేనినైనా సాధించగలరు..’ అంటూ కలెక్టర్ అభిలాషఅభినవ్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’తో మాట్లాడారు.


