బాసర: బాసర ట్రిపుల్ఐటీలో అడ్మిషన్ దందాపై విచారణ జరిపించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓఎస్డీ మురళీదర్శకు గురువారం వినతిపత్రం అందజేశారు. 2018 నుంచి 2024 వరకు ఉన్న అధికారులు వందల కోట్ల రూపాయలు విత్డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. దీనిపై ఏసీబీతో విచారణ జరిపించాలని కోరారు. గ్లోబల్ సీట్ల పేరుతో ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల దందా కొనసాగుతోందని తెలిపారు. నిర్ణయించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నా రు. వినతిపత్రం ఇచ్చినవారిలో జాతీయ కా ర్యవర్గ సభ్యుడు కుంట హర్షవర్ధన్ స్టేట్ హాస్ట ల్స్ కోకన్వీనర్ గంగప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, విగ్నేష్, అక్షయ్, మోహన్ మణి, నాగరాజు ఉన్నారు.


