బాసర: సామాజిక మాధ్యమాల్లో బాసర ఆర్జీయూకేటీపై జరుగుతున్న అసత్య ప్రచారంపై యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్ వెళ్లారని తెలిపింది. ఈ విషయాన్ని వక్రీకరించి అధికా రులు అందుబాటులో లేరని కొంతమంది విద్యార్థులు వీడియోలు విడుదల చేయడాన్ని ఖండించింది. ప్రస్తుతం యూనివర్సిటీలో విద్యాబోధన, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపింది. అసత్య ప్రచారం నమ్మొద్దని కోరింది.


