సాక్షి, హైదరాబాద్: ముంబై హైవే రుద్రారం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అందులో పలు అంబులెన్సులు చిక్కుకోవడంతో ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకొని వాహనాలను తరలించే యత్నం చేస్తున్నారు. గంట సేపటికిపైగా వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.


