హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం(జూలై 20వ తేదీ) రాత్రి సమయంలో కార్పిడియం పబ్లో మహిళలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
తనపై దాడి చేయవద్దని సదరు మహిళ వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.


