breaking news
Attack
-
ఆగని రష్యా, ఉక్రెయిన్ దాడులు
-
అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’
సాక్షి, నంద్యాల: అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తున్నారని.. వారితో దాడులు చేయిస్తూ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. రేషన్ బియ్యం స్మగ్లింగ్గానీ, బెల్ట్ షాపుల నుంచి వసూళ్లు లేదా అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారాల్లో ఈ బ్యాచ్ ద్వారానే దోపిడీపర్వం సాగిస్తారన్న పేరుంది. అడ్డుచెబితే ‘అడ్డు’తొలగిస్తామన్నట్లుగా వారి్నంగ్లు ఇస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే కక్షసాధింపులకూ వెనుకాడడంలేదు. గత ఎన్నికల సమయంలో ‘ఎవడైనా ఎక్కువ మాట్లాడితే జీపునకు కట్టుకుని పోతా’ అంటూ ‘బుడ్డా’ చేసిన హెచ్చరిక ఆయన నేరస్వభావానికి అద్దంపడుతోంది. అందుకు తగ్గట్లుగానే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చెలరేగిపోతూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా.. అటవీశాఖ సిబ్బందిపై ఆయన బరితెగించి చేసిన దాడి ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఈ దాడి కాకతాళీయంగా జరగలేదని.. కక్షసాధింపులో భాగంగానే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే దాడిచేసినట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువుచేస్తున్నాయి. వైఎస్సార్ స్మృతివనంలో సిబ్బంది తొలగింపు.. ఎనిమిది నెలల క్రితం టీడీపీకి చెందిన దుండగులు ఆత్మకూరు మండలంలోని వైఎస్సార్ స్మృతివనంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దుండగులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఆత్మకూరు డీడీ సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా.. డీడీ సాయిబాబాను కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అలసత్వాన్ని క్షమించలేమని డీడీ చెప్పినట్లు సమాచారం. నాటి నుంచి ఎమ్మెల్యే పగతో రగిలిపోతున్నారు. గ్రావెల్ అక్రమార్కులకు వత్తాసు.. రెండునెలల కిందట సున్నిపెంటకు చెందిన కొందరు టీడీపీ కూటమి నాయకులు నల్లమల అడవిలోకి ప్రవేశించి అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ అటవీ సిబ్బందికి దొరికారు. వెంటనే సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కూటమి నాయకులు ఎమ్మెల్యేకు విషయం తెలిపారు. దీంతో ఆత్మకూరు డీడీ సాయిబాబాకు ఎమ్మెల్యే బుడ్డా కాల్చేసి ‘ట్రాక్టర్లు మా వాళ్లవే. వదిలేయండి’.. అన్నారు. ఈ విషయంలోనూ అటవీ అధికారి నిబంధనలు పాటించి ఒక్కో ట్రాక్టర్కు రూ.60వేల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా కక్ష సాధించాలన్న లక్ష్యంతోనే ఎమ్మెల్యే మంగళవారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏడాది కాలంగా ఎమ్మెల్యే బుడ్డా ఆగడాలు.. » ఆత్మకూరు పట్టణంలో ఒక వైశ్య ప్రముఖుడిపై పట్టపగలే దాడికి పాల్పడ్డారు. తర్వాత బలవంతంగా కేసును రాజీ చేయించారు. » వెలుగోడుకు చెందిన మరో వ్యాపారిపై కేసులు పెట్టించి మానసికంగా, ఆర్థికంగా వేధించారు. » మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో జరిగిన మూడు హత్యలలో బుడ్డా అనుచరులే ప్రధాన నిందితులు. » కడపలో టీడీపీ మహానాడుకు ఆత్మకూరు నుంచి వాహనాల్లో వెళుతూ దారిలో భోజన ఏర్పాట్లు చేశారు. ఆహారం సరిపోకపోవడంతో వంట మాస్టర్ను చితకబాదారు. » బుడ్డా అనుచరుడొకరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయించుకున్నాడు. అయితే, తనకు చెప్పకుండా ఎలా చేయించుకుంటావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అడ్డొచి్చన మరో ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో వారంతా ఆస్పత్రిపాలయ్యారు. బాధితులను మీడియా ప్రతినిధులు ఎవరూ కలవకుండా ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే మనుషులను కాపలాగా ఉంచారు.రౌడీబ్యాచ్తో ఆగడాలు.. నిజానికి.. ‘బుడ్డా’ గత ఏడాది గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తరలింపు, రేషన్ బియ్యం స్మగ్లింగ్, బెల్ట్ షాపుల విషయంలో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వీటన్నింటినీ చక్కబెట్టేందుకు ఆయన ఒక రౌడీబ్యాచ్ను పెంచిపోషిస్తున్నారని, ఎవరిపైనైనా దాడిచేయాలంటే ఈ బ్యాచ్ అక్కడ వాలిపోతుందని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం కూడా ఎమ్మెల్యే వెంట ఈ రౌడీబ్యాచ్ ఉందని, వీరితోనే అటవీ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలుస్తోంది. అలాగే, రెండునెలల కిందట మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై భౌతికంగా దాడిచేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసిన ఘటన కూడా ఈ రౌడీబ్యాచ్ కనుసన్నల్లోనే జరిగింది. -
సీఎం చెంప పగలగొట్టిన వ్యక్తి
-
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై సంచలన ఆరోపణలు
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుపై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు సంచలన ఆరోపణలకు దిగారు. లోక్సభలో.. ఆయన, మరో కేంద్ర మంత్రి కలిసి తమపై దాడి చేశారని మీడియా ముందుకు వచ్చారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు(బుధవారం) లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. లోక్సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కలుగు జేసుకున్నారు. ‘‘సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం.. ప్రతిపక్షాలకే మంచిది కాదు. ప్రత్యేకించి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు. మీరెంత రచ్చ చేస్తే.. ప్రజలు మిమ్మల్ని అంతగా తిరస్కరిస్తారు. కాబట్టి.. చర్చలో పాల్గొనండి అని కోరారాయన. అయినా విపక్ష ఎంపీలు వినలేదు.అయితే నిరసన కొనసాగుతున్న టైంలో.. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రవ్నీత్ సింగ్ బిట్టూ తమపై దాడి చేశారని టీఎంసీ ఎంపీలు మిథాలీ బాగ్, శతాబ్ది రాయ్ ఆరోపించారు. ‘‘ ఆ ఇద్దరూ మమ్మల్ని తోసేశారు.. దాడి చేశారు.. ఇది సిగ్గు పడాల్సిన విషయం’’ మిథాలీ బాగ్ మీడియాతో అన్నారు. అయితే.. #WATCH | Delhi | TMC MP Mitali Bagh says, "While we were protesting against the bill, Union Ministers Ravneet Singh Bittu and Kiren Rijiju attacked me, they pushed me...This is condemnable..." pic.twitter.com/5MSkVPAGqD— ANI (@ANI) August 20, 2025దాడి ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎవరిపై అలాంటి దాడేం జరగలేదని ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. అమిత్ షా ప్రసంగిస్తున్న టైంలో బిల్లుల ప్రతులను కొందరు విపక్ష ఎంపీలు చించేసి ఆయనపై విసిరేశారు. ఆ ఎంపీలను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం లోక్సభ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘ఆపరేషన్ సిందూర్’కు తోక ముడిచిన పాక్.. శాటిలైట్ చిత్రాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి. -
Delhi: జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాపై దాడి
-
Bengaluru: సఫారీ వాహనంపైకి దూకి.. బాలునిపై చిరుత దాడి
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో గల బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్క్లో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు. జంతువులను వీక్షించేందుకు సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఆగగానే, ఒక చిరుత ఆ వాహనంపైకి దూకి, కిటికీ గుండా బాలునిపై దాని పంజాతో గాయపరిచింది. అధికారులు బాధిత బాలుడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.బాధిత బాలుడు సుహాస్.. బొమ్మసంద్ర నివాసి. తన తల్లిదండ్రులతో కలిసి సెలవు రోజున బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో సఫారీకి బయలుదేరాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిలో చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ ఘటన దరిమిలా బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘శ్రీఎక్స్’ పోస్టులో.. చిరుతపులి సఫారీ జోన్ లో.. నాన్ ఏసి బస్సు సఫారీ జరుగుతుండగా, 12 ఏళ్ల బాలునిపై చిరుత దాడి చేసిందన్నారు. బాలునికి వెంటనే ప్రధమ చికిత్స అందించారన్నారు. సఫారీ వాహనంలోని కెమెరా స్లాట్లతో సహా అన్ని విండో గ్రిల్లను సురక్షితంగా కవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాన్-ఎసి సఫారీ బస్సుల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. బన్నెర్ఘట్ట జూలాజికల్ పార్క్లోని వన్యప్రాణుల సఫారీ పర్యాటకులను ఎంతగానే ఆకర్షిస్తుంటుంది. కాగా ఈ పార్కులోని చిరుతలు, ఏనుగులు తరచూ, నగర శివార్లలోని నివాస ప్రాంతాలలోపికి ప్రవేశిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
Viral Video: కొండచిలువ ఎటాక్...నాకేం భయం!
-
ఇప్పటికీ మా వాళ్లు ఆసుపత్రిలోనే ఉన్నారు
-
Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం..
-
Jammu and Kashmir: ఆర్మీ పోస్ట్పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి
బారాముల్లా : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు మృతిచెందాడు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. The Indian Army launched a large-scale cordon and search operation in the Uri sector of Baramulla district, foiling a major infiltration attempt. | Ashraf WaniRead more: https://t.co/fqZp5RcT8I#JammuandKashmir #Baramulla #Uri pic.twitter.com/gn7SIrk8wl— IndiaToday (@IndiaToday) August 13, 2025పాక్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్కు భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ మూకలు
సాక్షి టాస్్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. -
బస్సు డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళ
-
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
Big Question: పులివెందులలో పచ్చ సైకోలు ఒక్క సీటు కోసం వందలాది తలలు!
-
టీడీపీ గూండాల దాడిపై రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు ఎమ్మెల్సీ రమేష్యాదవ్ మీద దాడిచేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో వేలాదిగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్పై దాడిచేసిన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం వర్గీయులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమని అడ్డదారుల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదన్నరగా కూటమి పాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. రెడ్బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూసి జ్యోతిరావ్ పూలే ఆత్మ క్షోభిస్తోందన్నారు. అధికారం ఉంది కదా అని బీసీలపై దౌర్జన్యానికి, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించబోమన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. శాంతియుతంగా నిరసన గుంటూరు హిందూ కాలేజీ కూడలి, తిరుపతి బాలాజీ కాలనీ, అనంతపురం జెడ్పీ కార్యాలయం, నెల్లూరు మినీ బైపాస్రోడ్డు, కర్నూలులోని బిర్లా సర్కిల్, నంద్యాలలోని పద్మావతినగర్ ఆర్చి, కాకినాడ, ఏలూరు, అనకాపల్లిల్లో జ్యోతిరావ్ పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో జ్యోతిరావ్ పూలే చిత్రపటంతో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు. -
పులివెందులలో టీడీపీ అరాచకాలపై YS జగన్ ఆగ్రహం
-
సైకిల్ పార్టీ కాదు..సైకో పార్టీ.. పులివెందులలో తెగబడ్డ టీడీపీ గూండాలు
-
YSRCP నేతలపై దాడి ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షులు
-
ఓటమి భయంతో YSRCP నేతలపై రాడ్లు, కర్రలతో దాడి
-
Ireland: ఇండియన్ డ్రైవర్పై జాత్యహంకార దాడి.. బాటిల్తో తలపై కొట్టి..
డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో భారతీయ టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్ జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీర్ సింగ్ తలపై రెండుసార్లు బాటిల్తో దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీర్ సింగ్ క్యాబ్లోకి ఎక్కిన ఇద్దరు యువకులు లఖ్వీర్ సింగ్పై దాడికి దిగారు. గడచిన రెండు వారాల్లో ఐర్లాండ్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై జరిగిన మూడవ దాడి ఇది.ఐర్లాండ్లోని డబ్లిన్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్లిన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం లఖ్వీర్ సింగ్ గత 23 ఏళ్లుగా ఐర్లాండ్లో ఉంటున్నాడు. పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి, లఖ్వీర్ సింగ్ తన క్యాబ్లో 20 ఏళ్ల వయసుగల గల ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. పాపింట్రీ వద్ద తమను దింపాలని వారు సింగ్కు చెప్పారు. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకున్నాక ఆ ఇద్దరు యువకులు సింగ్పై దాడికి దిగి, బాటిల్తో అతని తలపై కొట్టారు. అక్కడిని నుంచి వారు పారిపోతూ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అని గట్టిగా అరిచారని సింగ్ తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయడిన లఖ్వీర్ సింగ్కు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సింగ్ అత్యవసర సహాయం 999కి డయల్ చేశాడు. వారి సాయంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ ఘటన తరువాత లఖ్వీర్ సింగ్ తీవ్రంగా కుంగిపోయాడు. టాక్సీ డ్రైవర్గా తిరిగి కొనసాగడం చాలా కష్టమని భావిస్తున్నాడు. గడచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సింగ్ వాపోయాడు. ఈ ఘటన దరిమిలా తమ కుటుంబ సభ్యులు ఎంతో భయపడుతున్నారని అన్నాడు. ఆగస్టు ఒకటిన రాత్రి సుమారు 11:45 గంటలకు డబ్లిన్ 11లోని పాపింట్రీలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల ఒక వ్యక్తిని చికిత్స కోసం బ్యూమాంట్ ఆసుపత్రికి తీసుకువచ్చారని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్థానిక పోలీసులు తెలిపారు. -
జగన్ టూర్ సక్సెస్ తట్టుకోలేక ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ పై దాడి!
-
Ireland: భారత సంతతి యువకునిపై జాత్యహంకార దాడి
డబ్లిన్: ఐర్లాండ్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యువకునిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఆ యువకుడు తన అపార్ట్మెంట్కు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఆరుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్లో తాను ప్రేరేపిత జాత్యహంకార దాడిని ఎదుర్కొన్నానని భారత సంతతికి చెందిన డాక్టర్ సంతోష్ యాదవ్ ఘటనా క్రమాన్ని ‘లింక్డ్ఇన్’లో వివరించాడు.ఐర్లాండ్లో జాత్యహంకార యువకుల బృందం తనపై దాడి చేసిందని డాక్టర్ సంతోష్ యాదవ్ ఆరోపించారు.‘నేను రాత్రి భోజనం చేసిన తర్వాత, నా అపార్ట్మెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆరుగురు యువకుల బృందం నాపై వెనుక నుంచి దాడి చేసింది. తరువాత వారు నా కళ్లద్దాలను లాక్కొని, వాటిని పగలగొట్టి, నా తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపై ఆగకుండా కొట్టారు. దీంతో నాకు తీవ్ర రక్తస్రావం అయింది. గార్డ్కు కాల్ చేసి,విషయం చెప్పాను. అంబులెన్స్ నన్ను బ్లాంచర్డ్స్టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా చెంప ఎముక విరిగిందని వైద్య బృందం నిర్ధారించింది. ఇప్పుడు నన్ను ప్రత్యేక వైద్యసంరక్షణ కోసం రిఫర్ చేశారు’ అని సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.ఐర్లాండ్లో మైనారిటీలపై హింస పెరుగుతున్నదని, అయినా అధికారులు నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్ యాదవ్ ఆరోపించారు. దాడులు చేశాక వారు స్వేచ్ఛగా పారిపోతున్నారని, తిరిగి దాడి చేయడానికి ధైర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను సంతోష్ యాదవ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.యాదవ్ తన పోస్ట్లో రెండు ఫోటోలను ఉంచారు. ఒక ఫొటోలో అతని ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండగా, మరొక ఫోటోలో అతని చేతిలో విరిగిన కంటి అద్దాలు ఉన్నాయి. డాక్టర్ సంతోష్ యాదవ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేశాడు. తరువాత ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుండి పీహెచ్డీ చేసాడు. ప్రస్తుతం సంతోష్ యాదవ్ సీనియర్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉంటున్న ఆయన ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. -
హమాస్కు అరబ్ దేశాల గట్టి షాక్
టెల్ అవీవ్: గాజాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్కు అరబ్ దేశాల నుంచి గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండను అరబ్ దేశాలు ఖండిస్తూ, ఒక ప్రకటన విడుదల చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వైదొలగాలని హెచ్చరించాయి. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనను స్వాగతించింది. దీనిని చారిత్రాత్మక ఘటనగా పేర్కొంది.సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్తో సహా పలు అరబ్, ముస్లిం దేశాలు తాజాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఖండించాయి. గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ సమూహం దాని పాలనను ముగించాలని కోరాయి. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్) సమావేశంలో అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), 17 ఇతర దేశాలు ఒక ప్రకటన చేశాయి. హమాస్ తన చెరలో ఉంచిన బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో అరబ్ దేశాలు,ముస్లిం దేశాలు సంయుక్తంగా గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా శరణార్థుల కోసం పాటుపడుతున్న యూఎన్ ఏజెన్సీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయెల్ నేతలను కోరాయి. గాజాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విదేశీ దళాలను మోహరించాలని అరబ్ నేతలు కోరారు. గాజాలో తలెత్తుతున్న ఆకలి చావులను ఖండిస్తున్నామని అరబ్ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే అరబ్ ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నదన్నారు. కాగా గాజాలో ఘర్షణలు ప్రారంభమై 21 నెలలు గడిచింది. ఈ ఘర్షణల్లో 1,200 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ యుద్ధం గాజాలోని లక్షలాదిమందిని నిర్వాసితులను చేసిందని, ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభానికి కారణంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
పారిశుద్ధ్య కార్మికురాలిపై TDP నేత కఠారి ఉమామహేశ్వరరావు దాడి
-
‘గాజా’పై సిగ్గుపడేంత మౌనం?.. ప్రధాని మోదీకి సోనియా సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న మారణహోమంపై ప్రధాని మోదీ పదిమందీ సిగ్గుపడేంత మౌనాన్ని ఎందుకు వహిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారతదేశ విలువలను నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.రాజ్యాంగ విలువలకు ద్రోహంగాజా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన వైఖరి లేకపోవడం అనేది మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లే అవుతుందని సోనియా గాంధీ ప్రముఖ హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగరణ్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న విధ్వంసకర దాడి విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె అన్నారు. గాజా ప్రజలకు అనుకూలంగా భారత్ స్పష్టమైన, ధైర్యమైన వైఖరిని ప్రకటించాలని సోనియా గాంధీ కోరారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యపై ప్రధాని మోదీ సిగ్గుపడే మౌనం అవలంభిస్తున్నారని ఆమె ఆరోపించారు.పాలస్తీనాను భారత్ గుర్తించిందిఇజ్రాయెల్ చర్యలను అనాగరికం, జాతిహత్యగా సోనియా అభివర్ణించారు. 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన మెదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడులను ఎవరూ సమర్దించలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ రెండేళ్ల దాడుల కారణంగా ఇప్పటివరకూ 17 వేల మంది చిన్నారులతో సహా, 55 వేలమంది హతమయ్యారని సోనియా గాందీ ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ రియల్ ఎస్టేట్ కోసమే..ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై సైనిక దిగ్బంధనను విధించాయని, ఉద్దేశపూర్వకంగా అక్కడి జనాభాకు మందులు, ఆహారం, ఇంధన సరఫరాను అడ్డుకున్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు వారి కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ కోసం గాజాలో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నారని సోనియా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లడంలో దక్షిణాఫ్రికా ధైర్యమైన అడుగు వేసిందని సోనియా పేర్కొన్నారు. ఫ్రాన్స్.. పాలస్తీనా దేశాన్ని గుర్తించిందని, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఇజ్రాయెల్ నేతలపై ఆంక్షలు విధించాయని సోనియా పేర్కొన్నారు.జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చభారతదేశం ప్రపంచ న్యాయానికి చిహ్నంగా నిలిచిందని, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఉద్యమాలకు ప్రేరణ కల్పించిందని, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటానికి నాయకత్వం వహించిందని సోనియా గుర్తు చేశారు. అమాయక ప్రజలను క్రూరంగా వధిస్తున్న సమయంలో.. భారతదేశం తన విలువలను వదులుకోవడం మన జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చ.. మన రాజ్యాంగ విలువలకు చేసే ద్రోహం అని సోనియా పేర్కొన్నారు. సోనియా కుమార్తె, లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ గాజాలో శాంతికి గట్టిగా మద్దతు పలికారు. -
మంత్రి సత్యకుమార్ ఇలాకాలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం
-
తిరుమలలో బైక్ పై వెళుతున్న వారిపై చిరుత దాడి
-
దూసుకొచ్చిన పాక్ డ్రోన్లు.. పేల్చిసిన భారత భద్రతా బలగాలు
అమృత్సర్: నార్కో-టెర్రర్ నెట్వర్క్లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్ఎఫ్ పాక్ నుంచి భారత్ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది. ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్ డ్రోన్లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్ను,1.1 కేజీ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అమృత్సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్వర్క్లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్ఫ్, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. -
చైనా యూటర్న్?.. పాక్కు షాక్.. అమెరికాకు మద్దతు?
న్యూఢిల్లీ: ఇంతకాలం పాకిస్తాన్కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. -
మరాఠీని వ్యతిరేకించిన మార్వాడీపై దాడి
ముంబై: మరాఠీవారిని అవమానిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేశారనే ఆరోపణలతో ముంబైలోని విక్రోలిలోగల ఒక మార్వాడీ దుకాణదారుడిపై దాడి చేసి, చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎస్ఎన్) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.రాజ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు మరాఠీ భాష మాట్లాడనివారిపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో విరివిగా జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరాఠీ దుకాణదారుణ్ణి చుట్టుముట్టి, అతను చేసిన వాట్సాప్ పోస్ట్ గురించి అడగటాన్ని గమనించవచ్చు. తరువాత వారంతా అతనిపై దాడి చేసి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బలవంతం చేయడాన్ని చూడవచ్చు. तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts— MNS Videos (@mnsvideos) July 16, 2025మరాఠీ భాష, సంస్కృతిని అగౌరవపరచవద్దని ఎంఎస్ఎస్ కార్యకర్తలు ఇతరులను హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. మరాఠీ ప్రజలను అవమానించేవారి దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయవద్దని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. థానేలో ఫుడ్ స్టాల్ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. గతంలో మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు ఒక ఆటోరిక్షా డ్రైవర్పై కూడా దాడి జరిగింది. -
నా చెల్లి ఉప్పాల హారిక చేసిన తప్పేంటి
-
వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్’పై సంచలన నివేదిక
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేరకే జరిగిందని, ఇది పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.పహల్గామ్ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది. -
గంజాయి బ్యాచ్ కు కిరాయి.. హారిక హత్యకు కుట్ర
-
ఎవరు ఈ మహానటి..? తెరవెనుక..
-
YSRCP నేతలపై దాడి చేసి, హతమార్చేందుకు కుట్ర
-
పథకం ప్రకారమే బీ‘పచ్చ’ కాండ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ సైకోలు హత్యాయత్నానికి పాల్పడినా పోలీసులు కనీసం స్పందించడంలేదు. దాడిని అడ్డుకోకపోగా.. నిందితులను గుర్తించి కనీసం కేసు నమోదు చేయలేదు. పాలకవర్గ సేవకే భక్షక భటవర్గం పరిమితమైదన్న విమర్శలను నిజం చేశారు. గుడివాడలో జరగాల్సిన ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు యత్నించారు. వివాదాస్పద పోస్టర్లతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను రాకుండా అడ్డుకొనే యత్నం చేశారు. సభకు వచ్చే మార్గాల్లో ముందుగానే టీడీపీ కిరాయి గూండాలు, గంజాయి, మద్యం తాగి కాపు కాసి వీరంగం సృష్టించారు. ఇందులో భాగంగానే సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న బీసీ మహిళ, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై గుడివాడ నాగవరప్పాడు వద్ద దాడికి తెగబడ్డారు.కారు అద్దాలు పగలగొట్టి, మారణాయుధాలతో హతమార్చేందుకు యత్నించారు. రాయలేని భాషలో జిల్లా ప్రథమ మహిళపై బండబూతులతో రెచి్చపోయారు. హారిక దంపతులు గంటన్నరకుపైగా కారులోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. టీడీపీ నాయకులు, కిరాయి గూండాలు గంజాయి, మద్యం సేవించి వచ్చి దాడికి కుట్ర పన్నినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష పాత్ర వహించారే తప్ప, కనీసం పచ్చ గూండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మాత్రం అటువైపు రాకుండా భారీ బందోబస్తుతో నిలువరించారు. గుడివాడలో దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. దీనిని బట్టి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కనుసన్నల్లో దాడి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తొలుత పెడన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని, లేకపోతే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో ఫిర్యాదు తీసుకోకపోతే ఎలాగని జెడ్పీ చైర్పర్సన్ దంపతులు నిలదీయటంతో చివరకు పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. భగ్గుమన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు గుడివాడలో ఉప్పాల హారికపై జరిగిన దాడి ఘటనపై మహిళా నేతలు భగ్గుమన్నారు. జెడ్పీటీసీలు సభ్యులు, ఎంపీపీలు పెడన మండలం కోడూరులోని ఉప్పాల హారిక స్వగృహంలో ఆమెను కలిసి దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందచేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక స్వగృహానికి పార్టీ నాయకులూ వెళ్లి ధైర్యం చెప్పారు. శాసన మండలి చైర్మన్ మోషేన్రాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, గుడివాడ సీనియర్ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చి ఉప్పాల హారికకు సంఘిభావం తెలిపి పరామర్శించి ధైర్యం చెప్పారు. తరలివచ్చిన మహిళా నేతలు ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, మాజీ హోం మంత్రి తానేటి వనిత, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్షి్మ, చిటికిన వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు శీలం భారతి, విజయవాడ డెప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గతోపాటు పలు మహిళా సంఘాల నేతలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఆమెను పరామర్శించారు. నిందితులపై చర్యలేవీ? దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంత వరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదంటే పోలీసులు ఏ విధంగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే దాడి చేసిన వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు అధికార పార్టీ నాయకులు స్టేటస్లుగా పెట్టుకుని ఆనంద పడుతున్నా కనీసం పోలీసులు వాటి గురించి ఆరా తీయకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, గూండాలు, రౌడీలను తప్పించేందుకు ఎమ్మెల్యే యత్నిస్తున్నట్టు సమాచారం. అమాయకులను ఇందులో ఇరికించే యత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిలో తెలుగు యువత నేత గోవాడ శివ ఉన్నట్టు వీడియోలు ఉన్నా.. పోలీసులు చర్యలకు వెనుకాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కరువు∙జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడిని తీవ్రంగా ఖండించిన జెడ్పీటీసీ సభ్యులు ∙జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మహిళ అని కూడా చూడకుండా హారికపై హత్యాయత్నాకి పాల్పడిన టీడీపీ, జనసేన గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్తో పాటు ఆమె భర్త రాముపై దాడికి పాల్పడ్డ నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ఎస్పీ గంగాధరరావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి నేతలు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. జరిగిన దాడిపై ఉప్పాల రాము గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాఇ కళ్యాణి, కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ‘జాగృతి’ దాడి..
మేడిపల్లి/ఘట్కేసర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని క్యూన్యూస్ ఆఫీస్లోకి ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 20 మంది కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి చానల్ సిబ్బందిపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అక్కడే ఉన్న మల్లన్నపై కూడా దాడికి ప్రయతి్నంచారు. కార్యాలయంలోని ఫరి్నచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.వారిని అదుపుచేసేందుకు మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ లోపుగా మల్లన్న మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గాయపడిన ఆఫీస్ సిబ్బందిని, మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లన్న చేతికి స్వల్ప గాయం కావడంతో చికిత్స అందించి ఆస్పత్రి నుంచి పంపించారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలే ఈ దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాడులకు భయపడను: మల్లన్న తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడిని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టంచేశారు. దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘20 మంది వరకు కర్రలు, రాడ్లతో దూసుకొచ్చి నాతోపాటు మా కార్యాలయం సిబ్బందిపై పాశవికంగా దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలయ్యాయి. దాడి తీవ్రతను చూసి వెంటనే గన్మెన్ గాల్లోకి ఐదు రౌడ్లు కాల్పులు జరిపారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు బయపడేది లేదు. కంచం–మంచం అనే పదం తెలంగాణలో ఊతపదం. నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా.రౌడీల్లా నాపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నాపైనే కేసు పెట్టారు. నా ఆఫీస్లో నా రక్తాన్ని కళ్లచూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళతాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి ఘటనలో గాయపడ్డ ఆందోళనకారులు రాంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మేడిపల్లి పోలీసుల అదుపులో జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్రావు, ఓయూ జాగృతి అధ్యక్షుడు ఆశోక్ యాదవ్తోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. -
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
ఏం నేరం చేశారని ఉప్పాల హారికపై గుడివాడలో దాడులు చేయించారు? : వైఎస్ జగన్
-
అ'శాంతి'కి పోలీసుల ఆజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకలు, రౌడీలు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతూ.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ఇక్కడి పోలీసులు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే మాత్రం ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడికి తెగబడి.. విధ్వంసం సృష్టించి 48 గంటలు గడిచినా కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారు. ప్రసన్నకుమార్రెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు అందిందే తడవుగా అక్రమ కేసు నమోదు చేయడం వారి ‘పచ్చ’పాత ధోరణికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యే ప్రశాంతి పాత్ర ఉండటం వల్లే.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో సోమవారం రాత్రి టీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆయనను చంపేస్తామని కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్రెడ్డి డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పాత్ర ఉండటంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతోనే సరిపెట్టారు. దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులు నల్లపరెడ్డి ఇంటికి చేరుకున్నారు. రౌడీమూకల ధ్వంసరచనను అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా వేడుక చూశారు. టీడీపీ మూకలు దర్జాగా వెళ్లిపోతున్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి ముఖ్య అనుచరులు దగ్గరుండి దాడులకు పురిగొల్పుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా.. సాక్ష్యాధారాలను వైఎస్సార్సీసీ నేతలు బయటపెట్టినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యా దు చేసిన వెంటనే ప్రసన్నకుమార్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం, మరికొందరు నేతలను కేసులో ఇరికించేందుకు పలు సెక్షన్లు పెట్టడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. దీని పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. -
నల్లపరెడ్డి ఇంటిపై దాడికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
Anil Kumar Yadav: మేము కూడా టీడీపీ రౌడీల్లా తెగిస్తే..
-
నల్లపురెడ్డి ఇంటిపై దాడి ఘటనపై.. వైఎస్ జగన్ రియాక్షన్
-
అర్ధరాత్రి 200 మందితో.. బయటపడ్డ సంచలన వీడియో
-
Magazine Story: రాక్షస మూకల రక్తదాహం
-
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్కుమార్రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి తల్లి షాక్కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు. -
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ పక్కా స్కెచ్
-
ప్రసన్నకుమార్ ఇంటి సీసీ ఫుటేజ్ సీజ్
-
పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీæడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నకు వైఎస్ జగన్ ఫోన్..పచ్చమూకల దాడి సమాచారం తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. విమర్శలు జీర్ణించుకోలేకే దాడి..జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే.. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రం కోవూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండ్రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలను ప్రసన్నకుమార్రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. దీనిని టీడీపీ మూకలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది.ప్రశాంతిరెడ్డి అనుచరుల పనే?కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రశాంతిరెడ్డి అవినీతిని ప్రసన్నకుమార్రెడ్డి నిలదీస్తూ వచ్చారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం..నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే ప్రప్రథమం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తుండేవారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అణిచివేత ధోరణులకు బరితెగిస్తున్నారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టాలివైఎస్సార్సీపీ నేతల డిమాండ్ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించిన నెల్లూరు జిల్లా నేతలునెల్లూరు (స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అనిల్కుమార్ యాదవ్ పోలీసులను డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలుసుకున్న అనిల్కుమార్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె పూజిత పలువురు వైఎస్సార్సీపీ నేతలు పొదలకూరు రోడ్డులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరి తెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో బిహార్ సంస్కృతిని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. -
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
ఇనుప రాడ్డుతో టీడీపీ ఎటాక్.. వెంటిలేటర్ పై YSRCP సర్పంచ్..
-
YSRCP సర్పంచ్ పై లోకేష్ అనుచరుల దాడి..!
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
వీణ్ని అంతం చేస్తే వైఎస్సార్సీపీలోకి ఇంకెవ్వరూ వెళ్లరు!
సాక్షి టాస్క్ ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుండగా.. వారికి వంత పాడుతున్న పోలీసుల అచేతనానికి రాష్ట్రం సిగ్గుపడాల్సి వస్తోంది. మహిళా సర్పంచ్ కుటుంబంపై మంగళవారం టీడీపీ మూకలు దాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే మరో ఘోరం జరిగింది. 11నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టలు చించి, పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్లతో తొక్కి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత మండలం తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడి అనుచరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ ఇంట్లో ఉండగా.. సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేశ్, వామనమూర్తి, గురవయ్య, కిషోర్, చక్రవర్తి, నాగేష్, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకు వెళ్లారు. ‘వీడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు. వీడిని అంతం చేస్తే ఇంకెవ్వరూ ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్లరు’ అంటూ ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అజయ్ తల్లిదండ్రులు, చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి కళ్లలో కారం కొట్టి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళ బట్టలు చించి.. గుండెలపై తొక్కి.! తన భర్త అజయ్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగున బయటకు వచ్చారు. దాడిని అడ్డుకొని వారిని ప్రశ్నించగా.. టీడీపీ గూండాలు దళిత మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటి బిడ్డతో సహా ఆమెను కింద పడేసి, గుండెలపై కాళ్లతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుంటే తమను చంపేసి ఉండేవారంటూ ఆ దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పథకం ప్రకారమే దాడి.. డీఎసీఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆదేశాలతో పక్కా పథకం ప్రకారమే తమపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అజయ్ వాపోయారు. ఏడాదిన్నరగా విడతల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి చొరవతో మాతమ్మ ఆలయాన్ని నిర్మించామని, ఏడాదిన్నరగా ఆలయంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారన్నారు. దాడిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతం అయ్యారు. అనంతరం టవర్క్లాక్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనపై బాధితుడితో పాటు అతని భార్యను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులపై దాష్టికాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూడటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. -
‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు సింది. తాజాగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్య కూటమి క్వాడ్(క్యూయూఏడీ)పహల్గామ్ ఉగ్రదాడిపై ఒక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారిని, వారికి సహకరించినవారిని తక్షణం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది. BREAKING: QUAD condemns Pahalgam terror attack; says,'perpetrators, organizers, and financiers of this reprehensible act to be brought to justice without any delay' pic.twitter.com/zCA06YkMqZ— Sidhant Sibal (@sidhant) July 2, 20252025, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతిచెందారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. ‘క్వాడ్’ సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని, ఉగ్రవాదంపై పోరాటానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ‘క్వాడ్’ ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ‘క్వాడ్’ నేతలు కోరారు.ఇది కూడా చదవండి: ‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్ -
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
మహాటీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
-
అమెరికా దాడి చేస్తుందని ముందే జాగ్రత్తపడిన ఇరాన్
-
రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో రెండేళ్లుగా యాక్టివ్గా ఉన్న ఈ ముష్కరులు.. భారత భద్రతా దళాలపై జరిగిన మూడు ప్రధాన దాడులలో పాల్గొన్నారనే అనుమానాలున్నాయి. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఈ ఉగ్రవాదులు పూంచ్లోని డెహ్రా కి గలి (డీకేజీ) ద్వారా భారత్లోనికి చొరబడి 2022 చివర లేదా 2023 ప్రారంభం నుండి జమ్ముకశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యింది. జమ్ము ప్రాంతంలో ఒక సంవత్సరానికి పైగా చురుకుగా ఉన్న ఈ బృందం 2024 ద్వితీయార్థంలో భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడిందని తెలుస్తోంది.ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పూంచ్లోని సురాన్కోట్లోని బుఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో పాల్గొంది. నాటి దాడిలో నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. 2024 మేలో బక్రాబల్ మొహల్లా వద్ద భారత వైమానిక దళ కాన్వాయ్పై జరిగిన మెరుపుదాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పూంచ్లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలలో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బృందం 2024లో కశ్మీర్కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ దాడికి ముందు వీరు సమావేశమయ్యారని దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఇరాన్కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం -
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై మళ్లీ దాడి
తాడేపల్లి రూరల్: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంపై దుండగులు మరోసారి దాడికి యత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇంటి వద్దకు శనివారం సాయంత్రం కారులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు గేటు ముందు కారు ఆపి లోపలకు తాటికాయలు విసరడం కలకలం రేపింది. జగన్ ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఇదంతా రికార్డయింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఇది నాలుగోసారి. జగన్ ఇంటివద్ద, ఆయన పర్యటన సమయంలోనూ భద్రత కల్పించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఇంటివద్ద కూడా తూతూమంత్రపు భద్రతే ఏర్పాటు చేశారు.ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీస స్పందన కూడా కనిపించలేదు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చినా తాడేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఆయన వాహనానికి ముందు రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ పార్టీలు కనిపించడం లేదు. మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన రక్షణ కల్పించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.భద్రతా లోపం వల్లే ఇలాంటి ఘటనలుతాజా దాడిపై వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసంపై ఇద్దరు యువకులు కారులో వచ్చి ఇంటి లోపలికి తాటికాయలు విసిరినట్టు తెలిపారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రులకు జెడ్+ కేటగిరీ కల్పించాల్సి ఉన్నా.. వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లోకేశ్, చంద్రబాబు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని, ఆయన ఎక్కడ పర్యటించినా ఈ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ నివాసంపై దాడి చేశారని తాడేపల్లి పోలీస్స్టేషన్కు వెళితే.. టీడీపీ, జనసేన నేతలను సీఐ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారే తప్ప తమ ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అనంతరం ఎక్నాలెడ్జ్మెంట్ అడిగితే ఇవ్వమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. డీజీపీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినపుడు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నామని, కానీ తాడేపల్లి పోలీసుల తీరు విచిత్రంగా ఉందని అన్నారు.మాజీ సీఎం నివాసంపై దాడి జరిగిందంటే ఒక పోలీస్ అధికారి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం ప్రజాస్వామ్యంపై వారికి ఎటువంటి భావం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లిన వారిలో మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, నాగార్జునరెడ్డి, బూత్ కమిటీల అ«ధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఉన్నారు. -
జగన్ ఇంటిపై దాడి.. పోలీసులకి నారాయణమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్..
-
ఇరాన్ ఎటాక్ తో ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్
-
ప్రభుత్వం కుట్ర.. జగన్ ఇంటిపై దాడి..
-
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం -
అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
వాషింగ్టన్: అమెరికా తాజాగా ఇరాన్లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా, ఇజ్రాయెల్ హై అలర్ట్లో ఉన్నాయి. మూడు ఇరానియన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దరిమాలా న్యూయార్క్, వాషింగ్టన్తో సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక్కడి మతపరమైన, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాలకు అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. అలాగే కొలంబియాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు, నిఘాను పర్యవేక్షించడానికి, సమాఖ్య చట్ట అమలు భాగస్వాములతో సమన్వయ చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్లోని అణు సౌకర్యాలపై అమెరికన్ సైన్యం విజయవంతమైన దాడి నిర్వహించిందని,ఇది ప్రపంచానికి చారిత్రక క్షణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్ ఈ దాడులపై స్పందిస్తూ, అమెరికా వైమానిక దాడులో స్థానికులెవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొంది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా మరింత అప్రమత్తం అయ్యింది. దేశంలోని వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణ సమన్వయంతో ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.ఇది కూడా చదవండి: ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే.. -
ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా అటాక్
-
మహిళపై టీడీపీ కార్యకర్త దాడి.. సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు
-
భూ తగాదాలు సృష్టించి మహిళాపై టీడీపీ నేతల దాడి
-
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి.. వైరల్ అయ్యాక.. అప్పుడు 5 లక్షలు
-
బీజేపీ కార్యకర్త అరవింద్ రెడ్డిపై పరిటాల వర్గీయులు దాడి
-
ఇరాన్పై దాడి ప్లాన్కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్ణణలు నేటికి (గురువారం) ఏడవ రోజుకు చేరాయి. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి విషయంలో అమెరికా ప్రమేయం ఉంటుందా లేదా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాటవేత సమాధానమిచ్చారు. వైట్ హౌస్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా? వద్దా అనే దానిపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ‘నేను అలా చేయవచ్చు. అలా చేయకపోవచ్చు... నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు’ అని ఆయన అన్నారు. ఇరాన్ అధికారులు తమతో సమావేశం అయ్యేందుకు వాషింగ్టన్కు రావాలని అనుకుంటున్నారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు శుక్రవారం జెనీవాలో సమావేశం కానున్నారని జర్మన్ దౌత్య వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ విధమైన దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)కు చెందిన కొంతమంది ప్రజలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుండి రక్షణ కోరుతూ నగరం వెలుపల రహదారులను దిగ్బంధించారు.ఇరాన్పై దాడి ప్రణాళికలను తాను ఆమోదించానని ట్రంప్ తన సీనియర్ సహాయకులకు చెప్పారని, కానీ టెహ్రాన్ (ఇరాన్) తన అణు కార్యక్రమాన్ని విరమించుకుంటుందో లేదో వేచిచూసే నేపధ్యంలో తుది ఆదేశం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా ఇరాన్ ప్రభుత్వం పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? అని ట్రంప్ను అడిగినప్పుడు ఖచ్చితంగా జరగవచ్చని అన్నారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, తాము అటువంటి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నామని, అయితే తాము ఆ పని చేయబోతున్నామనే అర్థం దీనిలో లేదన్నారు.ఇదిలావుండగా, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ టెలివిజన్లో ప్రసారమైన రికార్డెడ్ ప్రసంగంలో.. ఈ ఘర్షణల్లో యూఎస్ సైనిక జోక్యం.. నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలని, ఇరాన్ దేనికీ తలొగ్గదని స్పష్టం చేశారు. కాగా ఇజ్రాయెల్ తమ వైమానిక దళం జరిపిన తాజా దాడులలో ఇరాన్ పోలీసు ప్రధాన కార్యాలయం ధ్వంసం అయినట్లు తెలిపింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయయడం తగదని సూచించారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనను భారతదేశంపైన, మానవత్వంపైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తున్నదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ప్రపంచమంతా స్పష్టమైన విధానంతో ముందుకు కదలాలని, అలాకాదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ ఆసియా దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో తల్లడిల్లిపోతున్నాయిని, ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువులు,ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ -
అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నా
కుప్పం రూరల్: ‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే.మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది. నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు. మా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించింది.నలుగురికి రిమాండ్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ప్రసాద్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆదేశించారు. కాగా.. శిరీషపై దాడిచేసిన మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అండగా ఉంటాం: ఎమ్మెల్సీ భరత్ కూటమి ప్రభుత్వం రాగానే సామాన్యులపైనా దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఎయిర్పోర్ట్ భూముల విషయంలో టీడీపీ కార్యకర్తలు మగ దిక్కులేని కుటుంబంపై దాడిచేసిన ఘటన మరువక ముందే కుప్పం మండలం నారాయణపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. భర్త అప్పులు చేస్తే భార్యను చెట్టుకు కట్టేసి బట్టలు చించేందుకు ప్రయత్నించడం చాలా దారుణమన్నారు. విడతల వారీగా అప్పు తీరుస్తానని మహిళ మొర పెట్టుకుంటున్నా చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత హేయమైన చర్య అన్నారు. కొడుకు చూస్తుండగా, తల్లిని కొడుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం మరింత దారుణమన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరత్ చెప్పారు. -
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం
-
ఏ క్షణంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. ‘ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గబోం’
జెరుసలేం: పశ్చిమాశియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ దాడి ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్పై దాడి విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ త్వరలోనే ఇరాన్పై దాడి చేయనుందని.. ఈ దాడి అమెరికా అనుమతి లేకుండానే జరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్- అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయనున్నట్లు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న అమెరికన్లు తిరిగి సొంత దేశం వచ్చేయాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి అమెరికన్ సిబ్బందిని తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రముఖ మీడియా హౌస్ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్తో అమెరికా అణుఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా జరిపే చర్చలు విఫలమైతే.. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ అనుమతి కోరననున్నారు.ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ సైతం అదే రీతిలో బదిలిస్తోందని ఆదేశ ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదె హెచ్చరించారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ బేసులపై నేరుగా దాడులు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ హెచ్చరికలతో అమెరికా విదేశాంగ శాఖ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రాచ్యం, తూర్పు యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని యుఎస్ దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించాయి. అంతేకాక, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల నుంచి అవసరం లేని సిబ్బందిని స్వచ్ఛందంగా వెనక్కు పంపేందుకు అనుమతి ఇచ్చింది.అమెరికా మిలిటరీ బేసులు ప్రస్తుతం ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయంతో పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలతో భయాందోలన నెలకొంది. -
సాక్షి కార్యాలయాల వద్ద పచ్చ మూకల విధ్వంసం
రాజానగరం/ఏలూరు/ఏలూరు టౌన్: సాక్షి కార్యాలయాల వద్ద కూటమి మూకల విధ్వంసకాండ కొనసాగుతోంది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంతోపాటు ఏలూరులోని ప్రాంతీయ కార్యాలయం వద్ద కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రౌడీ మూకలు బీభత్సం సృష్టించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయంపైకి రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన పార్టీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ), అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన ముష్కరులు దాడికి తెగబడ్డారు.ప్రధాన గేటు ముంగిట సాక్షి పత్రికలను వేసి దహనం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి నేమ్ బోర్డును పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలయ్యాయి. కాగా, సాక్షి కార్యాలయాలపై కూటమి నేతల దాడులను అరికట్టాలని కోరుతూ తూర్పు గోదావరి, కాకినాడ ఎస్పీలు నరసింహ కిషోర్, బిందుమాధవ్లకు మీడియా ప్రతినిధులు వినతిపత్రాలు అందించారు.ఫర్నిచర్ తగులబెట్టి భీతావహ వాతావరణం ఏలూరు ఎన్ఆర్ పేటలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికిపైగా టీడీపీ గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫరి్నచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్కరులు యతి్నంచారు. కార్యాలయం ఆవరణలో కింద ఉన్న ఫరి్నచర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.సాక్షి కార్యాలయాలపై దాడులు హేయం టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్ టార్గెట్గా చేస్తున్న పనులు అత్యంత హేయం. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు... మరో అడుగు ముందుకేసి, ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫరి్నచర్కు నిప్పు పెట్టడం దుర్మార్గం. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అక్రమ కేసుతో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణం. – కురసాల కన్నబాబు,వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రిపథకం ప్రకారమే దాడులుసాక్షి కార్యాలయాలపై మూడు రోజులుగా పథకం ప్రకారం టీడీపీ ముష్కరులు దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయం ఆవరణలోని ఫర్నిచర్కు నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే. హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నా. – బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో విపక్ష నేతకూటమి అరాచకాలు పతాకస్థాయికి ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం దారుణం. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయి. ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్ తగులబెట్టడం అత్యంత దారుణం. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించిన మహిళా SI
-
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు -
మద్యం మత్తులో రెచ్చిపోయిన ‘సీమరాజా’!
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు, పోలీసులే కాదు.. ఆఖరికి ఆ పార్టీలకు కొమ్ముకాసే సోషల్ మీడియా యాక్టివిస్టులూ చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకూ అంతులేకుండాపోతోంది. పోలీసులు చేష్టలుడిగి చూడటం మినహా వీరినేమీ చేయలేకపోతున్నారు. తాజాగా.. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు మన్నూరు చంద్రకాంత్ చౌదరి (సీమరాజా) ఇలాగే అధికారం అండతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పైగా.. వాళ్లపై గంజాయి కేసు నమోదుచేయాలంటూ పోలీసుస్టేషన్లో నానాయాగీ చేశాడు. అన్నమయ్య జిల్లా చిట్వేల్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. సీమరాజా, మరికొందరు ఫుల్గా మద్యం తాగి కారులో పెనగలూరు నుంచి చిట్వేల్ బయల్దేరారు. అదే సమయంలో రాజంపేటలో సినిమా చూసి మోటారుసైకిల్పై షేక్ రసూల్, కె.పెంచలయ్య చిట్వేల్ మండలం గట్టుమీదపల్లె స్వగ్రామానికి వెళ్తున్నారు. గొల్లపల్లి వద్ద మోటారు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి సీమ రాజా కారు వచ్చింది. కారు హారన్ కొట్టినా వెంటనే తప్పుకోకపోవడంతో సీమరాజాకు కోపం వచ్చింది. దీంతో కారు ఆపి బైక్పై వెళ్తున్న వారిపై దాడిచేశాడు. ‘అన్నా మీరు మాకు తెలుసన్నా, యూట్యూబ్లో చూస్తున్నాం, మేమేం చేశామన్నా’.. అంటూ ప్రాథేయపడ్డా వినకుండా.. ‘కొడకుల్లారా’.. అంటూ బండబూతులు అందుకున్నాడు. దీంతో భయపడ్డ రసూల్, పెంచలయ్య పరిచయస్తుడు శంకరయ్య ఇంట్లోకి వెళ్లి తలుపులు కొట్టారు. బయటికి వచ్చిన శంకరయ్యనూ సీమరాజా కొట్టాడు. ముగ్గురినీ కారులో చిట్వేల్ పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాడు. పోలీసుస్టేషన్లో ముగ్గురిపై గంజాయి కేసు పెట్టండని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. ‘అన్నా మేమేం చేశామన్నా’.. అంటూ పోలీసుల సమక్షంలో ఆ ముగ్గురూ బతిమాలినా విన్పించుకోకుండా అక్కడా రెచ్చిపోయాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగడాలు..పెనగలూరు మండలం కట్టవారిపల్లెకు చెందిన మన్నూరు చంద్రకాంత్ చౌదరి జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడుండగానే ‘సీమరాజా’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలెట్టాడు. అందులో వైఎస్సార్సీపీ వాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పనిచేసేది టీడీపీ కోసమేనని వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీమరాజా అరాచకాలకు అంతులేకుండాపోయింది. చంద్రకాంత్ చౌదరి అత్యంత జులాయిగా వ్యవహరిస్తూ, మద్యం మత్తులో దాదాగిరి చేయడం అలవాటుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. సీమరాజా వెకిలి వీడియోలపై వైఎస్సార్సీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు.ఏమైందంటున్నా వినిపించుకోకుండా కొట్టారు నేను నిద్రపోతుండగా మా ఇంటి గేటు కొట్టారు. గేటు తీశాను. అంతే.. ఒక్క ఉదుటున నాపైనా దాడిచేశారు. వారు ఎవరన్నది నాకు తెలీదు. ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. ఏమైందని అడిగినా వినిపించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టారు.– కడియం శంకరయ్యఅకారణంగా కొట్టారు మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లె గ్రామం. నేను నా స్నేహితుడితో కలిసి రాజంపేట నుంచి రాత్రి 10.30 గంటల సమయంలో వస్తుండగా మా వెనుక కారొచి్చంది. హారన్ కొట్టగా మీరు వెళ్లాలని చేయిచూపిస్తూ బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టారు. కారులో ఊరు బయటికి తీసువెళ్లి చెప్పుతో కూడా కొట్టారు. నీకు దిక్కున్నచోట చెప్పుకోమని పచ్చిబూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినా చంపేస్తామని చిత్రహింసలు పెట్టారు. – షేక్ రసూల్పోలీస్ స్టేషన్లోనూ రెచ్చిపోయారుచిట్వేల్ మండలం కతిరోపల్లె వద్ద వెనుక వైపు నుంచి కారు హారన్ కొడుతూ వచ్చారు. దీంతో.. మీరు వెళ్లాలని సైగల ద్వారా చెప్పగానే కారు నిలబెట్టి బండ బూతులు తిడుతూ కొట్టాడు. గొంతు పట్టుకుని కొట్టాడు. పోలీసుస్టేషన్లో కూడా అలాగే రెచ్చిపోయాడు. – కె పెంచలయ్య -
‘ఉగ్రవాదానికి తావు లేదు’: కొలరాడో దాడిపై శశి థరూర్
న్యూఢ్లిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంపై పలు దేశాలకు తెలియజేస్తూ, అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(MP Shashi Tharoor), కొలరాడోలో జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్లో ఉగ్రవాదానికి తావులేదన్నారు.కొలరాడోలోని బౌల్డర్లో జరిగిన ఉగ్ర దాడిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘బౌల్డర్లో ఈరోజు జరిగిన ఉగ్రదాడి గురించి భారత ఎంపీల ప్రతినిధి బృందం సభ్యులు తెలుసుకున్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియగానే ఉపశమనం పొందామని, ఉగ్రవాదానికి మన దేశాలలో స్థానం లేదు’ అని శశిథరూర్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. థరూర్ ప్రతినిధి బృందం ప్రస్తుతం బ్రెజిల్(Brazil)లో ఉంది. మంగళవారం అమెరికాకు చేరుకోనుంది. Members of the Indian MPs’ delegation learned with concern about the terror attack in Boulder, Colorado today. We are relieved there was no loss of life.We all share Secy of State @SecRubio’s view that “terror has no place” in our countries.#boulderattack @IndianDiplomacy…— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2025కొలరాడోలోని బౌల్డర్ డౌన్ టౌన్లోని కోర్టు భవనం సమీపంలో మొహమ్మద్ సబ్రీ సోలిమాన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో అనుమానితుడు కాక్టెయిల్స్, తాత్కాలిక ఫ్లేమ్త్రోవర్ను ఉపయోగించాడని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తి ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ కేకలు వేశాడు. హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని కోరుతూ ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండగా, అక్కడికి సమీపంలోనే ఈ దాడి జరిగిందని యాంటీ-డిఫమేషన్ లీగ్ తెలిపింది. ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే.. -
OP Spider Web: రష్యాకు తగిన శాస్తే జరిగింది
కీవ్: ఉక్రెయిన్ తాజాగా రష్యా సైనిక వైమానిక స్థావరాలపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ మెగా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Ukrainian President Zelensky) సమర్థించుకున్నారు. ఇది అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించిన ఆయన.. రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగించిందని, ఆ దేశానికి తగిన శాస్తేనని ప్రకటించారు.Today, a brilliant operation was carried out — on enemy territory, targeting only military objectives, specifically the equipment used to strike Ukraine. Russia suffered significant losses — entirely justified and deserved.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025‘స్పైడర్స్ వెబ్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించిందని, దీనికి తగిన సంఖ్యలో డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారని జెలెన్స్కీ చెప్పారు. వారు రష్యా వైమానిక స్థావరాలలో ఉంచిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ఢీకొట్టేలా చేశారని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ దాడులు చేసేందుకు ఏడాది పాటు ప్రణాళిక వేశారని, అది ఇప్పుడు ఇది సంపూర్ణంగా అమలయ్యిందని, ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్(Special operation) అని గట్టినమ్మకంతో చెబుతున్నానని జెలెన్స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ దాడితో రష్యన్లు 40 యూనిట్లకు పైగా వ్యూహాత్మక వైమానిక స్థావరాలను కోల్పోవడం తనకు సంతృప్తికరంగా అనిపించిందని, తాము ఇటువంటి దాడులను ఇకముందు కూడా కొనసాగిస్తామని జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడిలో కీవ్ సహాయం అందించిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. తాము దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు, తమకు రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజలను అన్ని విధాలుగా రక్షించుకుంటామని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నది రష్యన్లే అని జెలెన్స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్లో మాస్కో- కైవ్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి లో ప్రారంభమైంది. ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు.ఇది కూడా చదవండి: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి -
రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
మాస్కో: ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్ దాడులతో విరుచుకు పడింది. రష్యన్ భూభాగంలోని ఐదు ఎయిర్బేస్(Airbase)లపై ఉక్రెయిన్ దాడి చేసింది. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘కైవ్ (ఉక్రెయిన్)ప్రభుత్వం.. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్,అముర్ ప్రాంతాలలోని వైమానిక స్థావరాలపై ఎఫ్పీవీ డ్రోన్లను ఉపయోగించి, ఉగ్ర దాడికి పాల్పడింది. అయితే తమ సైన్యం ఆ ఉగ్ర దాడులను తిప్పికొట్టింది. సైనికులకు, పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ దాడుల్లో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ దాడులలో తమ విమానాలు కొన్ని ఆహుతయ్యాయని రష్యా తెలిపింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాలలోని సైనిక వైమానిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుండి ఎఫ్పీవీ డ్రోన్(FPV drone)లను ప్రయోగించడంతో పలు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తరువాత మంటలు ఆరిపోయాయని రష్యా పేర్కొంది. అయితే తాము చేపట్టిన ఈ దాడిలో రష్యాకు చెందిన 40 విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్బీయూ) ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.రష్యా- ఉక్రెయిన్లు ఇస్తాంబుల్లో రెండవ దఫా శాంతి చర్చలు ప్రారంభించనున్న తరుణంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ ప్రచురణ సంస్థ ప్రావ్దా అందించిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ ఈ దాడులకు ఏడాదిగా ప్లాన్ చేసింది. డ్రోన్లు బయటకు దూసుకువచ్చి, లక్ష్యంగా ఎంచుకున్న వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. క్షిపణుల ఆయుధాగారం లేని ఉక్రెయిన్ దానికి బదులుగా దాడులకు తెగబడేందుకు భారీగా డ్రోన్లను సమకూర్చుకుంది. ఇది కూడా చదవండి: దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు -
రెడ్ బుక్ రూల్.. మంత్రి ప్రోద్బలం.. సీఐ ఓవరాక్షన్
-
‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ -
Hamburg: రైల్వేస్టేషన్లో కత్తితో దాడి.. 12 మందికి గాయాలు
హాంబర్గ్: జర్మనీలోని హాంబర్గ్(Hamburg)లో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ఒక దుండగుడు కత్తితో జరిపిన దాడిలో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం హాంబర్గ్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కనీసం 12 మంది వరకూ గాయపడ్డారని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఘటనలో అనుమానిత దుండగుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. #hh2305 #Hamburg Nach ersten Erkenntnissen soll eine Person im #Hauptbahnhof mehrere Menschen mit einem Messer verletzt haben. Die tatverdächtige Person wurde von den Einsatzkräften festgenommen.— Polizei Hamburg (@PolizeiHamburg) May 23, 2025ఈ దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదని బిల్డ్ తెలిపింది. రైల్వే స్టేషన్(Railway station)లోకి అకస్మాత్తుగా చొరబడిన ఒక వ్యక్తి పలువురిని గాయపరిచినట్లు బిల్డ్ పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హాంబర్గ్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు.ఇది కూడా చదవండి: కొంకణ్ రైల్వే విలీనం.. ఇప్పుడేం జరగనుంది? -
పాకిస్తాన్కు ప్రధాని మోదీ వార్నింగ్
బికనీర్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్లోని బికనీర్లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ -
‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ
పహల్గామ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో ఏప్రిల్ 22న 25 మంది పర్యాటకులను, ఒక స్థానికుడిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. ఈ దాడి జరిగి నేటికి (మే 22)కు నెలరోజులయ్యింది. ఈ ఘటన భారత్ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.ఈ దాడి జరిగిన దరిమిలా జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్ఐఏ ప్రస్తుతం సాక్షులను విచారిస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోందని సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల(terrorists) స్కెచ్లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకూ ఫోన్ ఆపరేటర్లు, దుకాణదారులు, ఫోటోగ్రాఫర్లు, సాహస క్రీడలలో పనిచేసేవారితో సహా 150 మంది స్థానికులను విచారించారని ఒక అధికారి తెలిపారు.ఈ ఘటనకు 15 రోజుల ముందు ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా దుకాణాన్ని మూసివేసిన దుకాణదారుడిని కూడా ఎన్ఐఏ విచారించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ డంప్ డేటాను సేకరించింది. వీటిలో అధికంగా బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇవి దాడి చేసినవారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఒక అధికారి తెలిపారు. 2019 పుల్వామా దాడి(Pulwama attack) దర్యాప్తు సమయంలో ఎన్ఐఏ త్రీడీ మ్యాపింగ్ను తయారు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా మ్యాపింగ్తో దర్యాప్తు సాగిస్తోందని సమాచారం. మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించి, వందలాది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీని గురించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ రెండు రోజుల పాటు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు. వారిలో చాలా మందిని విడుదల చేశామని కూడా తెలిపారు. కాగా దాడి జరిగిన దరిమిలా భద్రతా సంస్థలు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల పాదముద్రలను గుర్తించగలిగాయని ఒక అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రమాదం బారిన జీవవైవిధ్యం -
Pakistan: స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్(Pakistan)లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఒక స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఖుజ్దార్ జిల్లాలో ఒక బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్(Ambulance)లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. అయితే పోలీసులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్ఏనే చేసింది. గత మార్చిలో బలూచిస్తాన్లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారిని మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. కాగా బలూచిస్తాన్లో చాలా కాలంగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు? -
దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
సాక్షి, అమరావతి: తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ.దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండాపోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.పోలీస్స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు... ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025 -
సోఫియా ఖురేషీ అత్తింటిపై దాడి అంటూ వదంతులు
సాక్షి బెంగళూరు: కల్నల్ సోఫియా ఖురేషీ అత్తవారింటిపై ఆర్ఎస్ఎస్ వర్గాలు దాడి చేశాయని ‘ఎక్స్’లో వదంతులు వ్యాపించాయి. కర్ణాటకలోని బెళగావిలో సోఫియా భర్త ఇంటిపై దాడి జరిగినట్లుగా వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ బీమా శంకర్ స్పష్టంచేశారు. సోఫియా భర్త ఇంటిపై ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు దాడి చేసినట్లుగా ధ్వంసమైన ఒక ఇంటిని ఫోటోను అనీస్ ఉద్దీన్ అనే పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. అది ఫేక్ పోస్టు అని పోలీసులు తేల్చారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. -
మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..
-
దళితులకు.. ‘దేశం’ వర్గం దండన
కందుకూరు: అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి.. పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనీయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో.. బాధితులు రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. పైగా.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడ్రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు.ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి, చెరుకూరి కార్తీక్ (నాని) అనే యువకులపై దాడిచేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలేగానీ అకారణంగా తమ పిల్లలను పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందార్లకు కోపాన్ని తెప్పించింది. అంతే.. రెండ్రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లెకు చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ, గ్రామంలో ఎవరూ వారికి తాగునీరు ఇవ్వొదని.. పొలాల్లోకి కూడా రానీయకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్లో ప్రకటించారు.ఆర్వో ప్లాంట్ మూసివేత.. పొలాల్లో పనులకూ నో ఎంట్రీ..ఈ ప్రకటన నేపథ్యంలో.. గ్రామంలోని ఆర్వోప్లాంట్ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. ఇది తెలీక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా.. ఆర్వో ప్లాంట్ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్చేసి దప్పళంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీరుకోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. దీంతో బాధితులు రెండ్రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి కొందరు దళిత మహిళలు పాలుపోయడానికి కేంద్రానికి వెళ్లగా.. ‘మీ పాలు తీసుకోం, మా వద్దకు రావొద్దు’ అని తేల్చిచెప్పారు. ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవర్ని రానివ్వొద్దంటూ కట్టుబాటు పెట్టారు.మీకు ఉపాధి పనులూ లేవు.. రావద్దు..ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితులను రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు. పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్లిన మహిళలను పనులకు రావొద్దంటూ వెనక్కి పంపారు. మాదిగోళ్లు ఎవరికీ ఉపాధి పనులులేవు.. ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీచేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఇలా.. రెండ్రోజులుగా దప్పళంపాడు పెత్తందారులు అంతా కలిసి మాదిగపల్లెను అష్టదిగ్బంధం చేశారు.సబ్కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు..ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక బాధితులందరూ సోమవారం సబ్కలెక్టర్ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఆమె స్పందిస్తూ.. తహసీల్దార్కు ఆదేశాలు జారీచేస్తానని, యథావిధిగా ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు రానీయకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం.. దళితులంతా కలిసి డీఎస్పీ బాలసుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.చంపేస్తామని బెదిరిస్తున్నారు..ఈ గొడవ జరిగిన తరువాత ఉపాధి పనులకు వెళ్తే.. మాదిగోళ్లు ఎవరికీ పనులులేవు, రావొద్దంటూ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పాడు. నన్ను పనిలోకి రానీయలేదు. ఇంకేమీ చేయలేక ఇంటికొచ్చేశాను. రెండ్రోజులుగా కులం పేరుతో తిడుతూ.. ‘చంపేస్తాం, మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’.. అంటూ బెదిరిస్తున్నారు. – అంగలకుర్తి ప్రభావతి, దళిత మహిళకేంద్రంలో పాలు పోయించుకోలేదు.. ఆదివారం రాత్రి పాలు పోసేందుకు గ్రామంలోని పాల కేంద్రం వద్దకు పాలు తీసుకెళ్లాను. మీ పాలు మేం తీసుకోం. మాదిగలు పాలుపోయడానికి రావొద్దంటూ కేంద్రం నుంచి వెనక్కి పంపించేశారు. దీంతో చేసేదేమి లేక ఇంటికొచ్చేశాను. – కంకిపాటి మేరి, దళిత మహిళమంచినీళ్లు తెచ్చుకోకుండా ప్లాంట్ ఆపేశారు..రెండ్రోజులుగా పూర్తిగా మంచినీళ్లు ఆపేశారు. ఆర్వో ప్లాంట్ వద్దకు రానీయకుండా ట్రాక్టరు అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారు. అదేమని అడిగితే.. ‘ప్లాంట్ మాది, మీకు నీళ్లులేవు’.. అంటూ చెబుతున్నారు. అంతేకాక.. చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్చేసి మాదిగోళ్లు వస్తే ఎవరూ నీళ్లు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు. నీళ్లులేక రెండ్రోజులుగా అల్లాడుతున్నాం.– చెరుకూరి ఏసు, దళితుడు -
కీచక సీఐ సుబ్బారాయుడు..
-
భారత్ ఆర్మీ బయటపెట్టిన సంచలన వీడియో
-
పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్
-
మరోసారి దాడికి పాక్ ప్లాన్.. మోదీ కీలక ఆదేశాలు
-
సీమాంతర ఉగ్రవాదాన్ని అణచడానికి భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది
-
పాక్ ను సర్వనాశనం చేయడానికి ఇది మంచి అవకాశం
-
గుర్తుపెట్టుకో.. నా పేరు అజిత్ దోవల్
-
ఆపరేషన్ సిందూర్ ఘన విజయం
-
పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..
-
POKలో ఇండియా దాడి చేసిన ప్రాంతాలివే !
-
పాక్ పై భారత్ మెరుపుదాడి.. ఆపరేషన్ సిందూర్
-
అధికారం మాది రెచ్చిపోతాం.. YSRCP సత్తి సత్యనారాయణపై టీడీపీ దాడి
-
ఆస్తి కోసం తల్లిని దూషిస్తూ అక్కను కాలుతో తన్నిన ఎమ్మెల్యే అనుచరుడు ఉదయ్ కిరణ్
-
పాక్పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్కు కూడా వెళ్లా. పాకిస్థాన్లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్కు చెందిన నటులు ఫవాద్ ఖాన్తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్ తన పోస్ట్ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు. -
స్నేహశీలి.. చంద్రమౌళి
విశాఖపట్నం: స్నేహశీలిగా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా, ఆధ్యాత్మిక భావాలు గల విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి జె.ఎస్.చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని వేదనను మిగిలింది. విహారం కోసం కాశ్మీర్ లోని పహల్గాం వెళ్లిన ఆయన.. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. అదే రోజు తన భార్య, మరో రెండు కుటుంబాలతో కలిసి కశ్మీర్ బయలుదేరారు. ఉగ్రదాడిలో ఆయన మరణవార్త విని వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా చంద్రమౌళి ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తరచుగా సందర్శించేవారు. చంద్రమౌళి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు తగిన శిక్ష పడాలని వారంతా కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడ్డాం కానీ..కశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందగా.. ఆయన మిత్రులు శశిధర్, సుచిత్రలు ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రమౌళి, శశిధర్, అప్పన్న కుటుంబాలు ఈ నెల 18న కాశ్మీర్ విహారయాత్రకు బయలుదేరి వెళ్లాయి. ఈ నెల 25న అందరూ విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ 22న పహల్గాం దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వారు వివరించారు. దాడి జరిగిన సమయంలో కొండపై ఉన్న క్యాంటీన్ సమీపంలో ఉన్నామని, కాల్పుల శబ్దాలు వినిపించగానే భయంతో టాయిలెట్ల వెనుక దాక్కున్నామని సుచిత్ర తెలిపారు. తుపాకీతో కనిపించిన ఉగ్రవాది తమవైపు రావడం చూసి, ప్రాణ భయంతో నుదుటిన బొట్టు కూడా చెరుపుకుని, సమీపంలోని వాగులో ముఖాలు కడుక్కున్నామని చెప్పారు. భయం ఎక్కువగా ఉన్నా.. దైవనామస్మరణ చేస్తే ఆ శబ్దం విన్నా చంపేస్తారేమోననిపించి అది కూడా చేయలేదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. శశిధర్ మాట్లాడుతూ కాల్పులకు భయపడి తాము ఫెన్సింగ్ కింద నుంచి దూరి చెట్ల వెనుక దాక్కునే ప్రయత్నం చేశామన్నారు. తన భార్య సుచిత్ర ఫెన్సింగ్ దాటడానికి చంద్రమౌళి సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. కాల్పులు జరుగుతున్నప్పుడు కళ్లముందే మనుషులు నేలకొరగడం చూశామన్నారు. చంద్రమౌళి కాల్పుల్లో మృతి చెందారని తర్వాత తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు చెప్పారు.కాశ్మీర్ వెళ్దామని రెండేళ్లుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్తే, తమ మిత్రుడిని కోల్పోవాల్సి వచ్చిందని శశిధర్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఏటా విహారయాత్రలకు వెళ్లే తమకు, ఈ పర్యటన తీరని విషాదాన్ని మిగిల్చిందని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. చంద్రమౌళి కుమార్తెలు అమెరికా నుంచి రావడంతో.. శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శ
-
పహల్గామ్ ఘటనపై మరోసారి స్పందించిన మెగాస్టార్..!
పహల్గామ్ ఉగ్రదాడిపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అమాయక ప్రజలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాక్షసుల ఆకృత్యానికి ఎంతోమంది బలైపోయారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని తన బాధను వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ తెలిపారు.ఈ ఘటనకు కారణమైన వారిని ఎవరినీ విడిచిపెట్టొద్దని మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ దాడిపై అంతకుముందే చిరు ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైందని.. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టాన్ని ఏదీ పూడ్చలేదని పోస్ట్లో రాసుకొచ్చారు. -
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్ చేశారు.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్ అవేదన వ్యక్తం చేశారు.కశ్మీర్ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్రాజ్ పోస్ట్ చేశారు. Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1— Prakash Raj (@prakashraaj) April 24, 2025 -
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి దేశం నలుమూలల నుంచే కాదు.. యావత్ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. పచ్చని గడ్డి మైదానాలు.. దూరంగా ఫైన్ చెట్ల మధ్య నుంచి కనిపించే మంచుపర్వతాలు చూపరులను ఎంతో ఆకట్టుకునే ఏప్రిల్-జూన్ సీజన్ మరేంతో ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సీజన్ ఇలా బోసిపోయి ఉంటుందని అక్కడి టూరిస్ట్ గైడులు, వ్యాపారులు కలలో కూడా ఊహించి ఉండరు!. పహల్గాం ఉగ్రదాడితో.. కశ్మీర్ పర్యాటకాన్ని చీకట్లు కమ్మేశాయి. మంగళవారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరగ్గా.. బుధవారం ఉదయం నుంచే పర్యాటకులు శరవేగంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. శ్రీనగర్ వెళ్లే విమానాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇళ్ల రైలు ప్రయాణాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణాలు కన్ఫర్మ్ కాగా.. హోటల్స్, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, రోడ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు పర్యాటకులు. 48 గంటలు.. ఎంత మారిపోయిందో?పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండు రోజులు గడిచింది. ఈ రెండు రోజులు మొత్తం జమ్ము కశ్మీర్ పర్యటకం స్తంభించిపోయింది. జమ్ము కశ్మీర్కు మణిహారంగా భావించే దాల్ సరస్సు చుట్టుపక్కల ఒక్క పర్యాటకుడు కూడా కనిపించలేదంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. నిత్యం టూరిస్టులతో బిజీబిజీగా గడిపే షికారాలు.. మూలనపడ్డాయి. అలాగే.. దాడి జరిగిన బైసరన్ లోయ పూర్తిగా సైన్యం అదుపులో ఉండిపోయింది. ఇక మిగతా పర్యాటక ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. జీవనాధారం దెబ్బ తింటుందనే.. పహల్గాం దాడి.. తదనంతర పరిణామాలు జమ్ము కశ్మీర్కు మళ్లీ పాత కల్లోల రోజులను గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ మే జూన్ నెలల జమ్ము పర్యాటకానికి ఎంత కీలకం. అలాంటి సమయంలో.. అదీ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి కశ్మీర్ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన చీడపురుగుల్ని వెతికి నలిపేయాలంటూ పద్మశ్రీ గులాం రసూల్ఖాన్ కోరుతున్నారు. ‘‘ఇక్కడి జనాలకు పర్యాటకమే జీవనాధారం. అలాంటిది దెబ్బ తింటే వాళ్లు ఎలా బతుకుతారు?’’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ క్రమంలో టూరిస్టులకు కొందరు వ్యాపారులు ధైర్యం చెబుతూ.. బతిమాలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రగిలిపోయిన కశ్మీర్ ప్రజలుఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగింది బుధవారమే. గత 35 ఏళ్లలో ఏప్రిల్ 23వ తేదీన కశ్మీర్ తొలిసారిగా మొత్తం మూత పడింది. సాధారణ ప్రజలు, వర్తకులంతా రోడ్డెక్కి ఉగ్ర చర్యను ఖండించారు. ఇది తమ ఆత్మపై జరిగిన దాడిగా భావించి ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని, నిరసన ర్యాలీలో కలిసి రావాలని మసీదుల్లోని మైకుల ద్వారా విజ్ఞప్తులు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఐ యామ్ ఇండియన్ అంటూ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. పర్యాటకులకు సాయంజమ్ము కశ్మీర్ టూరిజం విభాగం ధైర్యం చెబుతున్నప్పటికీ.. పర్యాటకులు మాత్రం కశ్మీర్ను వీడడం ఆపడం లేదు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పర్యాటకులకు సాయంగా నిలుస్తున్నారు. ఉచితంగా ఆహార పొట్లాలను, మంచి నీటిని అందిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత స్వస్థలాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయిన వాళ్లకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరికొందరు డ్రైవర్లు వాళ్లను రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులలో ఉచితంగా దించుతున్నారు. ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి పర్యాటకులు ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వద్దని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సాయాన్ని కూడా కొందరు విమర్శిస్తుండగా.. ఎక్కువ మంది అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Molitics (@moliticsindia)‘‘మేమూ మనుషులమే. ఇది పర్యాటకమో.. మా ఆదాయానికో సంబంధించింది కాదు. సరదాగా కుటుంబాలతో వచ్చిన ఆ పర్యాటకులు చేసిన తప్పేంటి?. ఈ దాడికి పాల్పడిన వాళ్లను సైన్యం వదిలిపెట్టకూడదు. అవసరమైతే మేమూ సైన్యానికి మా వంతు సాయం అందిస్తాం. ఇది డబ్బో, వ్యాపారానికో సంబంధించింది కాదు. మానవత్వానికి సంబంధించింది. అలాంటిది.. మానవత్వం మీద దాడి జరిగింది మరి’’ అని కొందరు కశ్మీరీలు భావోద్వేగంగా చెబుతున్నారు.కొసమెరుపు.. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య.. దాల్ సరస్సులో షికారా ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకవైపు టూరిస్టులు ఆ వైపు వెళ్లేందుకు జంకుతుంటే.. ఆమె మాత్రం ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం ఇష్టం లేక ఆస్వాదించానంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Vinita Chaitanya (@vinitachaitanya) -
Pahalgam: పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)
-
‘ముస్లింలు మీటింగ్కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
టోల్ రుసుము అడిగినందుకు.. సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి దాడి
రాజేంద్రనగర్: టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు మినహాయింపు ఇవ్వరా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ తాడ్బన్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ సిద్దిఖీ (49) రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సర్వే అండ్ రికార్డు సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ వైపు వచ్చాడు. టోల్ గేట్ వద్ద సిబ్బంది వాహనాన్ని ఆపి డబ్బులు చెల్లించాలని కోరారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని... కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్నానంటూ ఐడీ కార్డు చూపించాడు. సిబ్బంది మాత్రం కార్డు చెల్లదని డబ్బులు చెల్లించాలని సూచించారు. అయినా అతను వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మేనేజర్ డేవిడ్ రాజు కారును అడ్డుకుని డబ్బులు చెల్లించాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్దిఖీతో పాటు కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డేవిడ్ రాజుతో పాటు మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయంలో దౌర్జన్యం.. గేటు తీయలేదని పూజరిపై దాడి
షాజాపూర్: మధ్యప్రదేశ్లోని ఒక ఆలయంలో దారుణం వెలుగుచూసింది. 10 వాహనాల్లో వచ్చిన జనం ఆలయ పూజారిపై దాడికి దిగారు. ఈ ఘటన షాజాపూర్ జిల్లాలోని మాతా టెక్రీ ఆలయంలో రాత్రివేళ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత ఆలయ ద్వారాలు తెరవడానికి పూజారి నిరాకరించడంతో వారంతా సామూహికంగా అతనిపై దాడికి దిగారు. ఆలయ పూజారి రఘురాజ్ దాస్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన అర్ధరాత్రి 12:30కి జరిగింది. 10 వాహనాల్లో వచ్చిన 30 మంది జనం రఘురాజ్ దాస్పై దాడి చేశారు. రాత్రి 12 గంటల తర్వాత వారు ఆలయం తలుపులు తెరవమని కోరగా, పూజారి ఇది సమయం కాదనడంతో, వారు పూజారిపై దాడికి పాల్పడి, ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పూజారి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పలువురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. స్థానికులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పోలీస్ కమిషనర్ ఈ కేసును సీరియస్గా తీసుకుని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత -
మహిళపై ఎస్ఐ దాష్టీకం
రేణిగుంట: తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, పోలి భీమారం గ్రామానికి చెందిన ఓ మహిళపై రూరల్ ఎస్ఐ అభ్యంతరకర రీతిలో దాడికి పాల్పడిన సంఘటన ఇది. హత్యాయత్నం కేసు ఉందంటూ ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ఎసై.. అతను పొలానికి వెళ్లడంతో అతని భార్యపై దాడికి దిగారు. బాధితురాలి కథనం మేరకు..శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో కలిసి భీమారం గ్రామానికి చెందిన చిన్నమనాయుడు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నమనాయుడు ఎక్కడ?, అతనిపై హత్యాయత్నం కేసు ఉంది, అరెస్ట్ చేయాలని గట్టిగా కేకలు వేశారు.బూతులు తిడుతూ మాట్లాడాడు. దీంతో పొలం వద్దకు వెళ్లాడని, ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారని సంధ్య ప్రశ్నించింది. విచక్షణ కోల్పోయిన ఎస్ఐ ఆమె జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశారు. జాకెట్ చిరిగిపోయిందని, ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా తాళిబొట్టు తెంచేశాడని సంధ్య కన్నీరుమున్నీరైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఎవరిని చంపామో చెప్తే తమంతట తామే వచ్చి స్టేషన్లో లొంగిపోతామని వేడుకున్నా వినకుండా దారుణంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తిని వివరణ కోరగా, హత్యాయత్నం కేసుకు సంబంధించి కొంత కాలం నుంచి పిలుస్తున్నా చిన్నమనాయుడు స్పందించకపోవడంతో ఎస్ఐ గ్రామానికి వెళ్లారన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
మెల్బోర్న్లోని భారత కాన్సులేట్పై దాడి
మెల్బోర్న్: ఆస్ట్లేలియాలో మెల్బోర్న్లో ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతంలోనూ పలుమార్లు కార్యాలయం గోడల నిండా అభ్యంతర చిత్రాలు, వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ కార్యాలయం అధికారులకు సమాచారం అందించింది. దేశంలోని భారత దౌత్య, కాన్సులేట్ కార్యాలయాలకు, అధికారులకు రక్షణ కలి్పస్తామని ఆ్రస్టేలియా ప్రభుత్వం హామీ ఇచి్చందని హై కమిషన్ వెల్లడించింది. కార్యాలయం గేటు వద్ద గోడపై అర్ధరాత్రి దాటాక అభ్యంతరకర చిత్రాలు గీసినట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు చేపట్టామని విక్టోరియా పోలీసులు శుక్రవారం తెలిపారు. -
‘ఎక్స్క్యూజ్మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి
మరాఠీలో బదులు ఇంగ్లీషులో మాట్లాడినందుకు మహిళలని కూడా చూడకుండా ఇద్దరిపై కొందరు వ్యక్తులు అమానవీయ దాడికి పాల్పడ్డ సంఘటన డోంబివిలీలోని విష్ణునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల మేరకు..మంగళవారం డోంబివిలీలో ఇద్దరు మహిళలు తొమ్మిదినెలలపాపతో సహా ఓ స్కూటీపై తాము నివసించే హౌసింగ్ సొసైటీ ఆవరణలోకి ప్రవేశిస్తుండగా ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్న యువకుడిని తప్పుకోమంటూ ‘ఎక్స్క్యూజ్మీ’అని అడిగారు. దీనికి కోపోద్రిక్తుడైన ఆ యువకుడు అతను మరాఠీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ పైపైకి దూసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా మహిళల్లో ఒకరి చేయిని మెలితిప్పాడు. అదే సమయంలో అతని కుటుంబానికి చెందిన మరికొంతమంది వారిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేవలం ‘ఎక్స్క్యూజ్మీ’ అన్నందుకే ఇంతలా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని బాధిత మహిళలు వాపోయారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ పవార్ తెలిపారు. -
మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
తెనాలి: స్థానిక అయితానగర్కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్కు ఆదేశించారు. సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్ను స్కూటర్పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు. దూరంగా ఉంచిందని.. తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించారు.రూరల్ ఎస్ఐ ప్రతాప్కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
హైదరాబాద్ లో దారుణం.. గర్భవతిపై బండరాయితో భర్త దాడి
-
పట్టపగలు యువతికి కత్తిపోట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు. కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.బాధితురాలికి వైఎస్సార్సీపీ అండబాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు. -
వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు. విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు. -
నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి
విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానికఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. -
చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత మురళీరెడ్డిపై దాడి
-
Chittoor: ఎమ్మెల్యే గురజాల అనుచరుల వీరంగం
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది. గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
గాజాపై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లకు బుధవారం రాత్రి కాళరాత్రే అయ్యింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. సరిహద్దులకు సమీపంలోని ఖాన్యూనిస్ నగర వెలుపల అబసన్ అల్– కబీర్ గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 16 మంది చనిపోయినట్లు అక్కడున్న యూరోపియన్ ఆస్పత్రి తెలిపింది.మృతుల్లో తండ్రి, అతడి ఏడుగురు కుమారులు ఉన్నారు. వీరితోపాటు దంపతులు, వారి కుమారుడు చనిపోగా నెలల చిన్నారి, ఇద్దరు వృద్ధ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. సరిహద్దులకు సమీపంలోని బెయిట్ లహియాపై జరిగిన మరో దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారని ఇండోనేసియన్ ఆస్పత్రి వివరించింది. ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైన బెయిట్ లహియాలో తాజా దాడితో పరిస్థితులు మరింత భీతావహంగా మారాయని ఆరోగ్య విభాగం తెలిపింది.రఫాలో 36 మంది చనిపోయినట్లు అక్కడి యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, ఖాన్ యూనిస్లో ఏడుగురు మృతి చెందినట్లు నాసర్ ఆస్పత్రి తెలిపింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నామని ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికులు తెలిపారు. మృతుల్లో 200 మంది చిన్నారులు..కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం గాజాపై జరిపిన దాడుల్లో కనీసం 400 మంది చనిపోవడం తెలిసిందే. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 200 మంది చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 909 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. కాగా, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించుకుంది.డజన్ల కొద్దీ లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో మిలిటెంట్లతో పాటు వారి సైనిక వసతులు దెబ్బతిన్నాయని తెలిపింది. గురువారం ఉదయం యెమెన్లోని ఇరాన్ అనుకూల హౌతీ రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని గగనతలంలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. ఆ క్షిపణిని కూల్చి వేశామని, ఎవరికీ ఎటువంటి గాయా లు కాలేదని తెలిపింది. అదే విధంగా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా టెల్ అవీవ్పైకి తాము రా కెట్లను ప్రయోగించినట్లు హమాస్ తెలిపింది. దీంతో, బెన్ గురియె న్ విమానాశ్రయంలో రాకపో కలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రయాణికుల విమానాలను దారి మళ్లించారు.దిగ్బంధంలో ఉత్తర గాజాగాజా నగరం సహా ఉత్తర గాజా ప్రాంతాన్ని బుధవారం తిరిగి ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించింది. సుమారు ఐదు మైళ్ల పొడవైన నెట్జరిమ్ కారిడార్ను స్వాధీనం చేసుకుంది. ఉత్తర గాజా ప్రాంతాన్ని విడిచి వెళ్లరాదని, ప్రధాన రహదారిపైకి రావద్దని పాలస్తీనా వాసులకు ఆర్మీ హెచ్చరికలు చేసింది. దక్షిణ ప్రాంతానికి వెళ్లే వారు తీరం వెంబడి ఉన్న రహదారిని మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది.బెయిట్ లహియా పట్టణంలోకి అదనంగా బలగాలను పంపిస్తున్నట్లు తెలిపింది. తమ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించనందునే పోరాటం మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే గాజా ప్రాంతంలోని 20 లక్షల మంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇంధనం, ఇతర మానవీయ సాయాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్..మిగతా 59 మంది బందీలను హమాస్ విడుదల చేసేదాకా దాడులను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.ఆయుధాలు వీడే ప్రసక్తే లేదు: హమాస్శాశ్వత కాల్పుల విరమణతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీని గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంటేనే మిగతా బందీలను విడిచిపెడతామని హమాస్ స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ ఉనికిని తాము అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిగా వైదొలిగాకే పశ్చిమ దేశాల మద్దతున్న పాలస్తీనా అథారిటీకి లేదా స్వతంత్ర రాజకీయ నేతల కమిటీకి అధికారం బదిలీ చేస్తామని తేల్చి చెప్పింది. అప్పటి వరకు ఆయుధాలను వీడబోమని తెలిపింది.నెతన్యాహూ నివాసం వద్ద ఉద్రిక్తతబందీల విడుదల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వందలాది మంది పశ్చిమ జెరూసలేంలోని ప్రధాని నెతన్యాహూ నివాసాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. గాజాపై మళ్లీ దాడులు ప్రారంభిస్తే హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ సంబంధీకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి
ఇజ్రాయెల్ సైన్యం(Israeli army).. గాజాపై విధ్వంసకర దాడితో విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మందికిపైగా ప్రజలు మృతిచెందివుంటారని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం గాజాలో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి బుధవారం రాత్రి మొదలై గురువారం ఉదయం వరకు కొనసాగింది.ఈ భకర దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజాకు చెందిన వైద్యులు గురువారం ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. దక్షిణ గాజా పట్టణాలైన ఖాన్ యూనిస్, రఫా, బీట్ లాహియాలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వైద్యులు తెలిపారు. అయితే మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేదీ వెల్లడించలేదు. అయితే ఉత్తర, దక్షిణ గాజాలో ఈ తెల్లవారుజామున జరిగిన దాడిలో 70 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు అల్ జజీరా(Al Jazeera) వెల్లడించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ వారం రోజుల క్రితం విచ్ఛిన్నమైంది. నాటి నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్.. గాజాపై భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా జనం మరణించారు. తమ బందీలను విడుదల చేయనందుకు హమాస్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హమాస్పై భారీ దాడులు చేయాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర , దక్షిణ గాజాలో దాడులకు దిగుతోంది. ఇది కూడా చదవండి: Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్ ఆగ్రహం -
బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా
వాషింగ్టన్ డీసీ: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా(America) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామని వెల్లడించింది.మరోవైపు బంగ్లాదేశ్లోని ప్రజల భద్రత కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంgovernment) తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని కూడా అమెరికా పేర్కొంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరంతరం గమనిస్తున్నామని, వీటిని నియంత్రించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. బంగ్లాదేశ్పై నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించినప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఈ విధంగా స్పందించారు.బంగ్లాదేశ్(Bangladesh)లో 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పటి నుండి హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. హిందువుల ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువుల ఇళ్లను తగులబెట్టి, ధ్వంసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం మౌనం వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు -
దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి
వడోదర: గుజారాత్లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర(Vadodara) జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి వాఘోడియా పోలీస్ స్టేషన్(Police station)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అర్థం కాలేదు.దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. మండిపోతున్న ఎండలు -
Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్(Amritsar) జిల్లాలో ఠాకుర్ద్వారా ఆలయంపై గ్రనేడ్తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పంజాబ్ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని ఎన్కౌంటర్లో హతమార్చారు.Acting on specific intelligence, Commissionerate Police Amritsar decisively tracked down those responsible for the attack on Thakur Dwara Mandir, #Amritsar, on March 15, 2025. An FIR has been registered at PS Chheharta under the Explosive Substances Act, and intelligence-based…— DGP Punjab Police (@DGPPunjabPolice) March 17, 2025ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను డీజీపీ గౌరవ్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. నిఘా వర్గాల(Intelligence agencies) నుంచి అందిన సమాచారం మేరకు అమృత్సర్ పోలీసులు ఘటన జరిగిన అనంతరం నిందితులను ట్రాక్ చేస్తూ వచ్చారన్నారు. ఈ నేపధ్యంలోనే వారిని గుర్తించగలిగారని, వారు రాజాసాంసీలో ప్రాంతంలో ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, వారిని చూడగానే నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్కు గాయాలయ్యారన్నారు. ఆత్మరణక్షణకు పోలీసులు(Police) ఎదురు కాల్పులు జరిపారని ఈ నేపధ్యంలో ఒక నిందితునికి గాయాలయ్యాయని, అతనిని ఆస్పత్రికి తరలించామని, అక్కడ అతను మృతిచెందాడని గౌరవ్ యాదవ్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
పాక్ సైన్యం కాన్వాయ్ పై బలూచ్ తిరుగుబాటుదారుల దాడి
-
Punjab: హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
జలంధర్: పంజాబ్(Punjab)లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందున రోజర్ సంఘూ ఇంటిపై దాడి చేసినట్లు డాన్ షహజాద్ తెలిపాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హిందూవాదంపై ప్రచారం సాగించే రోజర్ సంఘూ ఒక వర్గాన్ని కించపరిచేవిధంగా మాట్లాడుతున్నానే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే అతని ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో జలంధర్ పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనకు ముందు పంజాబ్లోని అమృత్సర్(Amritsar_ జిల్లాలోని ఖండ్వాలా ప్రాంతంలో శనివారం రాత్రి ఠాకుర్ద్వార్ ఆలయంపై గ్రనేడ్ దాడి జరిగింది. మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలయం వెలుపల ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 12:35 గంటలకు మోటార్ సైకిల్ ఇద్దరు యువకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారి చేతుల్లో జండాలు ఉన్నాయి. కొద్దసేపు వారు ఆలయం ముందు అటుఇటు తిరిగాక, ఆలయంపైకి గ్రనేడ్లు విసిరారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలోనే ఆలయంలో నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఈ సమయంలో ఆలయంలో పూజారి నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే పేలుడు కారణంగా ఆలయంలోని కొంత భాగం ధ్వంసం అయ్యింది. ఇది కూడా చదవండి: ర్యాపిడ్ రైలు కారిడార్పై వర్క్ స్పేస్.. ప్రయోజనమిదే.. -
Bihar: మళ్లీ పోలీసు బృందంపై.. ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలు
భాగల్పూర్: బీహార్(Bihar)లో గతకొన్ని రోజులుగా పోలీసులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన భాగల్పూర్లో జరిగింది. శనివారం రాత్రి పోలీసులు గస్తీలో తిరుగుతుండగా, వారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన భాగల్పూర్ పరిధిలోని అంతీచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన గురించి అంతీచక్ పోలీసు అధికారి అశుతోష్ కుమార్ మాట్లాడుతూ తమ పోలీసు బృందం(Police team) పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మాధవ్ రామ్పూర్ హరిచక్ గ్రామ సమీపంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటాన్ని గమనించారన్నారు. పోలీసులు ఆ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారని, అయితే ఇంతలోనే గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని, పోలీసు వాహనం కూడా కొంతమేరకు ధ్వంసమయ్యిందని తెలిపారు. దాడికి పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేశారని, గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అశుతోష్ తెలిపారు. ఈ దాడికి ముందు అరారియా, ముంగేర్లో పోలీసు బృందాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. ఇది కూడా చదవండి: అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం -
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్లో గల స్వర్ణదేవాలయం(Golden Temple)లో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులపై ఒక వ్యక్తి ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆలయ సిబ్బందితో పాటు ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు.శిరోమణి గురుద్వారా కమిటీ(Shiromani Gurdwara Committee) ప్రతినిధి ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగానే అతను దాడికి పాల్పడ్డాడు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులపై రాడ్తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి హర్యానాకు చెందినవాడని, ఈ ఘటన అనంతరం ఆలయ సిబ్బంది అతనిని పట్టుకుని తమకు అప్పగించారన్నారు. గాయపడిన భక్తులు మోహాలీ, బఠిండా, పటియాలా నుంచి వచ్చినవారని తెలిపారు. గాయపడినవారందరినీ గురు రామ్దాస్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు వచ్చిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ మీడియాతో మాట్లాడుతూ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్(Darbar Sahib Complex)లోని రెండవ అంతస్థులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆలయంలో పనిచేస్తున్న జస్బీర్ సింగ్ గుర్తించి, కిందకు రమ్మని కోరగా, అందుకు అతను నిరాకరించాడన్నారు. దీంతో జస్బీర్ సింగ్ రెండవ అంతస్థుకు వెళ్లి అతనిని కిందకు దిగాలని కోరారు. అయితే అతను వెంటనే ఒక రాడ్తో జస్బీర్ సింగ్పై దాడి చేశాడు. దీనిని చూసిన ఇతర సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా గాయపడ్డారు. నిందితుడిని జుల్ఫాన్గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గురుప్రీత్ సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
అత్తమామలపై కోడలు పైశాచికం
యశవంతపుర: బెంగళూరులోని ఓ వైద్యురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి వృద్ధులైన అత్తమామలపై విచక్షణారహితంగా దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రియదర్శిని, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి తన అత్తమామలపై పైశాచికంగా దాడిచేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు భగ్గుమన్నారు.. దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ‘ఎక్స్’లో డిమాండ్ చేస్తూ ఈ పోస్టును బెంగళూరు నగర పోలీసు కమిషనర్కు ట్యాగ్ చేశారు. బాధిత వృద్ధుడు జె.నరసింహయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు. తన కొడుకు నవీన్కుమార్, కోడలు ప్రియదర్శిని విడాకులు తీసుకోడానికి 2007లో ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారని.. కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో ఆమె ఈ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు. -
సందేహాలున్నప్పుడు.. శిక్షలు విధించలేం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాక్షులు, మెడికల్ ఆధారాల్లో వ్యత్యాసం ఉండి.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్నది సందేహాస్పదంగా ఉన్నప్పుడు శిక్షలు విధించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేసిన తర్వాత అది కోర్టుకు చేరడానికి పదహారున్నర గంటల సమయం పట్టిందని.. ఇంత సమయం ఎందుకు పట్టిందో దర్యాప్తు అధికారి వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఆలస్యం పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి (పీడబ్ల్యూ 6) వాంగ్మూలం ప్రకారం.. కార్తీక్ చేతిపై షంషీర్ ఖాన్ దాడి చేశాడని.. తలపై దాడి చేసినట్లు పేర్కొనలేదని చెప్పింది. కానీ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పుర్రెపై బలమైన గాయం కారణంగా కార్తీక్ మరణించినట్లు ఉందని చెప్పింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా అతని వాంగ్మూలంపై ఆధారపడ్డారని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2018లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నామని తెలిపింది. నిందితుడు షంషీర్పై ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 ప్రస్తావన లేదు..పోలీసుల కథనం మేరకు.. ‘ఓ అమ్మాయికి సంబంధించిన విషయంలో షంషీర్, కార్తీక్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కాగజ్నగర్లోని లారీ చౌరస్తాలో కార్తీక్ను షంషీర్ కత్తితో దాడి చేసి చంపాడు. 2014, ఫిబ్రవరి 20న కార్తీక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత షంషీర్ను పోలీసులు అరెస్టు చేశారు.’ ఈ కేసు విచారణ చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. షంషీర్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ షంషీర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో షంషీర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.దామోదర్రెడ్డి, పోలీసుల తరఫున ఏపీపీ అరుణ్కుమార్ వాదనలు వినిపించారు. ‘కోర్టుకు పంపిన ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 పేరు ప్రస్తావించలేదు. విచారణ సమయంలోనూ అతని పేరు లేదు. పీడబ్ల్యూ 6 చెప్పిన దానికి మెడికల్ ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. మరణించిన వ్యక్తి తల, మెడపై దాడి జరిగిందని సాక్షి చెప్పలేదు. మెడికల్ ఆధారాల్లో తల, మెడ, ఎడమ చెవిపై గాయాలున్నాయి. ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాలున్నాయి. పీడబ్ల్యూ 6 సాక్షాలు సందేహాస్పదంగా ఉన్నా యి. అందువల్ల 2018లో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.న్యాయం గెలిచిందిఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడిపి ఈ రోజే విడుదలయ్యాను. శిక్షా కాలంలో సెంట్రల్ జైలు, వరంగల్లో ఓపెన్ జైలు పెట్రోల్ బంకులో పని చేశాను. ఇన్నేళ్లకు మళ్లీ న్యాయం గెలిచిందని నమ్ము తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. – షంషీర్ ఖాన్ -
అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ దాడి
-
YSRCP కార్యకర్త హరికృష్ణపై టీడీపీ నేతల దాడి
-
అప్పేచర్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
-
యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్ అరెస్ట్
సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్తో వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ ఆమె నోటిలో పోశాడు.తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు. -
యువతిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: పీలేరులో యువతిపై ప్రేమోన్మాది చేసిన దాడిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం(ఫిబ్రవరి 14) ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా,అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. దీంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. -
బోర్డింగ్ స్కూల్పై దాడి.. రష్యా- ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు
కీవ్: రష్యాలోని కుర్స్క్ పరిధిలో గల సుడ్జా నగరంలోని ఒక బోర్డింగ్ స్కూల్పై దాడి జరిగింది. దీనిపై ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నగరం గత ఐదు నెలలుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో నలుగురు మృతిచెందారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.ఆదివారం తెల్లవారుజామున పాఠశాలపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని పేర్కొంది. ఇదిలా ఉండగా, శనివారం ఉక్రెయిన్లోని పోల్టావా నగరంలోని ఒక అపార్ట్మెంట్పై రష్యా సాగించిన క్షిపణి దాడిలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగిందని, వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం తెలిపింది. ఐదు అంతస్తుల భవనంపై జరిగిన ఈ దాడిలో 17 మంది గాయపడ్డారని సమాచారం.మాస్కో ఉక్రెయిన్పై 55 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే 40 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. ఖార్కివ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సిన్యుహుబోవ్ తెలిపారు. పశ్చిమ రష్యాలోని ఐదు ప్రాంతాలలో రాత్రిపూట ఐదు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో మూడు డ్రోన్లను, బెల్గోరోడ్, బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించారని ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మీడియాకు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh: వసంత పంచమి అమృత స్నానాలు ప్రారంభం -
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా... అంటా ముద్రగడ ఇంటిపై దాడి.. అంబటి రియాక్షన్
-
YSRCP నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి
-
గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతయర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ.. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.