Attack
-
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
పిఠాపురం వర్మపై దాడి.. సీఎం చంద్రబాబు రియాక్షన్
-
అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్?
సాక్షి, ముంబై: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన వ్యక్తి అనూహ్యంగా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. పోలీసులు నిందితుడిని మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన కారణం ఏంటి అనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి జైబ్ అన్సారీ (31) అనే వ్యక్తి 2019లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కారణాలపై స్పష్టత లేనప్పటికీ, ముంబై సమీపంలోని మీరా రోడ్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించడానికి నిరాకరించినందుకు ఇద్దరు గార్డులను కత్తితో పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు గార్డులు రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీరా రోడ్ ఈస్ట్లోని నయా నగర్లో గల 'అస్మిత గ్రాండ్ మ్యాన్షన్' కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఒక మతపరమైన శ్లోకాన్ని పఠించమని గార్డులను కోరాడని, వారు నిరాకరించడంతోనే దాడి చేశాడని కొన్ని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. భజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) థానే విభాగానికి బదిలీ చేశారు. అసలు దాడికి గల కారణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనతో మీరా రోడ్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పుకార్లు వ్యాపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని నిందితుడి నేపథ్యాన్ని ATS అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: వినాశకాలే విపరీత బుద్ధి : వీసీ సజ్జనార్ చీవాట్లు -
టోల్ సిబ్బందిపై టీడీపీ గూండాగిరీ.. మహిళ జుట్టు పట్టుకుని..!
-
చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
గుజరాత్లోని ఛోటా ఉదయ్పూర్లో నాలుగేళ్ల కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. ఈ సంఘటన ఛోటా ఉదయ్పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది. సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం అంతకన్నా లేదు. చిరుతపై ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది. అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై పావి జెట్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి స్పందిస్తూ రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలుతండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
జనసేన మహిళపై.. పచ్చి బూతులతో TDP నేతల దాడి
-
ఇరాన్ మాజీ యువరాజుపై దాడి..
ఇరాన్ బహిష్కృత యువరాజుపై బెర్లిన్లో దాడి జరిగింది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపురంగు ద్రవాన్ని మీద చల్లారు. అయితే వెంటనే ఆయన రక్షణ సిబ్బంది స్పందించి ఆందోళనకారుడిని ప్రక్కకు తోశారు.రెజా పహ్లావి గురువారం బెర్లిన్లో ఒక భవనం నుండి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో పహ్లావి తన భద్రతా సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుక నుండి వచ్చిన ఒక వ్యక్తి తన బ్యాగ్ నుంచి ఎరుపు రంగు ద్రవాన్ని (ఇది టమోటా జ్యూస్ అని భావిస్తున్నారు) ఆయనపై విసిరాడు. దీంతో ఆ ఎరుపు ద్రవం పహ్లావి తల వెనుక భాగం, మెడ మరియు ఆయన ధరించిన బ్లేజర్పై పడింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే రెజాపహ్లవిపై దాడి చేసిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే పహ్లవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు: ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల్ని గూండాలు, ఉగ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశాలన్ని ఇరాన్ పాలనపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, కేవలం యధాతథ స్థితిని కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల, ఉరిశిక్షల నిలిపివేత విషయంలో ఐరోపా దేశాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.రెజా పహ్లవీ నేపథ్యంకాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలన అంతం కోసం ఆయన పోరాడుతున్నారు. ఇరాన్లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ఇరాన్ లోపల ఆయనకు ఎంతవరకు మద్దతు ఉందనేది తెలియాల్సి ఉంది. -
కామారెడ్డిలో ఎలుగుబంటి కలకలం.. రైతుపై దాడి
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన రైతు సలావత్ మత్తు(45)పై ఎలుగుబంటి దాడి చేసింది. అడవికి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఎలుగుబంటి పారిపోయింది. మత్తు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. మొదట పులి దాడి చేసిందని ప్రచారం జరగ్గా.. ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానిక సర్పంచ్ వెల్లడించారు.రైతును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అటవీ ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.మరో వైపు, జిల్లాలో పులుల దాడులు కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం 2 లేగ దూడలు, రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. ఇసన్నపల్లి శివారులో మేకల మందపై చిరుతపులి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. -
విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నం
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు. ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
ఇళ్ల మధ్యలో బెల్ట్ షాపు.. తీసేయమన్నందుకు ఇనుప రాడ్డుతో TDP నేత దాడి
-
సామ్ ఆల్ట్మాన్ ఇంటిపై దాడి
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.ఏం జరిగింది?శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో తేలిన కీలక అంశాలునిందితుడు ఆల్ట్మాన్కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.పరిశ్రమ విమర్శలే కారణంఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్మాన్ విమర్శించారు.ఓపెన్ఏఐ vs ఆంత్రోపిక్ఓపెన్ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్మాన్ ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం
-
‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ
పహల్గామ్: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఒకపక్క ఆత్మీయులను కోల్పోయిన ఆవేదన, మరోపక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం వారిని మరింత కుంగదీస్తున్నాయి.ఆఖరి శ్వాస వరకు వెంటాడే పీడకలపహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీత మాట్లాడుతూ.. ఆ భయానక ఘటనను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేదేమీ లేదని, ప్రభుత్వంతో పోరాటం ఉంటే నేరుగా వారితోనే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు. మరో బాధితురాలు ప్రియదర్శిని ఆచార్య (ప్రశాంత కుమార్ శత్పథి భార్య) తన భర్త లేని లోటును ప్రతీ రోజు తలచుకుంటున్నానని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి, ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సాయం అందినప్పటికీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట..ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి మరీ దారుణ మారణకాండకు ఒడిగట్టారు. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ గడ్డపైకి చొచ్చుకెళ్లాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన తొమ్మిది భారీ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో దిగివచ్చిన పాక్ ఆర్మీ.. భారత డీజీఎంఓను ఆశ్రయించి మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.భయాలు వీడి.. మళ్లీ పర్యాటకుల రాకకశ్మీర్ లోయలో ఇప్పుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. పహల్గామ్తో పాటు ఇతర ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇది సందర్శకుల్లో తిరిగి చిగురించిన భద్రతా భావానికి అద్దం పడుతోంది. శ్రీనగర్ను సందర్శించిన విశాల్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ.. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయలేమని, కశ్మీర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు -
పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్లో హై టెన్షన్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటితో (ఏప్రిల్ 22) సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యంత ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ‘మానవత్వపు హద్దులు దాటినప్పుడు, మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరిగింది. భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆర్మీ చేసిన తాజా పోస్ట్ వైరల్గా మారింది. ఉగ్ర మూకలకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతూనే, దేశ భద్రత పట్ల ఆర్మీ తన ఉక్కు సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పింది.ఆ నెత్తుటి జ్ఞాపకం..2025 ఏప్రిల్ 22న అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ మారణకాండలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్లోని 44 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తెరుచుకున్నప్పటికీ, బైసరన్తో పాటు మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చందన్వాడి ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు. When boundaries of humanity are crossed, the response is decisive. Justice is Served.India Stands United.#SindoorAnniversary #JusticeEndures #NationFirst pic.twitter.com/rtgYu9Hg11— ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2026కశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రతఉగ్రదాడి ప్రథమ వార్షికోత్సవం సమీపించడంతో కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. సాధారణ ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు కలగకుండానే, వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం డేగకన్నుతో నిఘా కొనసాగుతోంది.రంగంలోకి ఉన్నతాధికారులువివిధ జిల్లాల్లో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామాలో డీఐజీ జావేద్ ఇక్బాల్ మట్టూ నేతృత్వంలో నేరాలు, భద్రతపై కీలక సమీక్ష జరిగింది. ఉగ్రవాద కట్టడి చర్యలు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా అవంతిపొరా, శ్రీనగర్లలో ఎస్ఎస్పీ జి.వి సందీప్ చక్రవర్తి శాంతిభద్రతలను సమీక్షించారు. ముఖ్యంగా దర్యాప్తులను వేగవంతం చేసి, నేరస్తులకు శిక్ష పడే శాతాన్ని పెంచడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్కు బహుళ ప్రయోజనం! -
సందిగ్ధంలో చర్చలు!
టెహ్రాన్/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనతో పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరాన్–అమెరికా యుద్ధంలో రెండో దశ శాంతి చర్చలు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తమ అ«దీనంలో ఉన్న హార్మూజ్ జలసంధిని అమెరికా హఠాత్తుగా దిగ్బంధించడంతో ఇప్పటికే గుర్రుమీదున్న ఇరాన్ ఆదివారం తమ వాణిజ్య నౌకపై అగ్రరాజ్య నావికాదళం దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోతోంది. దీంతో అమెరికాతో రెండో దఫా చర్చలకు కూర్చునేదేలేదని తెగేసి చెప్పింది. ‘‘రెండువారాల కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించింది. హార్మూజ్ను దిగ్బంధించింది. మా ‘తౌస్కా’ కార్గో నౌకపై దాడి చేసి స్వా«దీనంచేసుకుంది. అందుకే మా బృందాన్ని ఇస్లామాబాద్కు పంపట్లేదు. శుద్ధిచేసిన యురేనియంను అప్పగించడంపై ఏనాడూ అమెరికాతో చర్చించలేదు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ సోమవారం స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే రెండో దశ చర్చలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్ వెనువెంటనే రంగంలోకి దిగింది. అటు ఇరాన్ను బ్రతిమాలుతూనే హార్మూజ్ దిగ్బంధం, నౌకపై దాడి అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని అమెరికాకు హితబోధ చేస్తోంది. చర్చల కోసం ఈజిప్ట్ సైతం ఇరాన్ను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నంచేస్తోంది. దీంతో చర్చలకు యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో, అవి నేటి చర్చల్లో ఏ స్థాయిలో ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే. హెచ్చరిక, దాడి, స్వా«దీనం.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతోపాటు తమ నౌకాశ్రయాల మీదుగా ఏ ఒక్క నౌక బయల్దేరకుండా అడ్డుకుంటూ అమెరికా చేస్తున్న చేష్టలతో ఇరాన్కు చిర్రెత్తుకొస్తోంది. దీనికి తోడు ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో హార్మూజ్ దిశగా వస్తున్న 900 అడుగుల పొడవైన భారీ ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా ఆదివారం స్వా«దీనంచేసుకుంది. ఇరాన్లోని బందాస్ అబ్బాస్పోర్ట్కు వెళ్లేందుకు దుస్సాహసం చేయకుండా తక్షణం ఉన్నచోటే ఆగిపోవాలని తొలుత అమెరికా నావికాదళాలు హెచ్చరించాయి. దాదాపు ఆరుగంటలపాటు ఈ హెచ్చరికలు చేశారు. అయినా సరే తౌస్కా అలాగే ప్రయాణాన్ని కొనసాగించడంతో అమెరికా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక ‘యూఎస్ఎస్ స్పుయెన్స్’ దాడిచేసింది. తౌస్కాలోని ఇంజిన్ రూమ్పైకి కాల్పులు జరిపింది. తర్వాత యూఎస్ఎస్ ట్రిపోలీ నౌక, హెలికాప్టర్లలో అమెరికా నావికాదళాలు ‘తౌస్కా’ను సమీపించి స్వాదీనం చేసుకున్నాయి. తమ నౌకను అమెరికా స్వాదీనం చేసుకుందన్న వార్త తెల్సి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపైకి డ్రోన్ల దండును పంపి దాడిచేసింది. గడువు పొడిగించబోను: ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోనని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్కు రాని నేపథ్యంలో రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ‘‘ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపు ఇరాన్ మాతో శాంతిచర్చలు పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకోవాలి. గడువును పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం. ఒప్పందం కుదరకపోతే దాడులు తథ్యం’’ అని ట్రంప్ అన్నారు. దీనిపై ఇరాన్ స్పందించింది. ‘‘అసంబద్ధ, అతి డిమాండ్లతో అమెరికా చర్చల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేసింది. అలాంటి అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడబోం. అమెరికా దౌత్యమోసానికి మేం బలికాబోం’’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. గడువు పొడిగించబోనని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే పెజెష్కియాన్ మాట్లాడటం గమనార్హం. చర్చల కోసం అమెరికా బృందం మంగళవారం పాకిస్తాన్కు బయల్దేరే ఆస్కారముంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించలేదు. ఇరాన్, పాక్ మంతనాలు చర్చలకు ప్రతినిధి బృందాలను పంపాలని ఇరాన్ను పాక్ కోరింది. ఈ మేరకు సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. చర్చల పర్వం మరింత మందుకు సాగాల్సిన ఆవశ్యకతను అరాఘ్చీకి ఇషాక్ వివరించారు. -
భారత నౌకలపై ఇరాన్ దాడి.. ఆడియో టేప్ వైరల్
నిన్న (శనివారం) హర్ముజ్ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్గా మారింది.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్ హర్ముజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. అయితే నిన్న భారత్కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్జ్ ఆడియో టేప్ ఇప్పుడు వైరల్గా మారింది.ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఇది వరకూ భారత్కు చెందిన నౌకలకు హర్ముజ్ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.ఏం జరిగింది?శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్ నుంచి స్పష్టత కోరుతున్నాయి.కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.#BREAKING Audio clip emerges from attacked Indian oil tanker!"You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!" — Audio from the Indian oil tanker fired on by the Iranian NavyClearance given. Ship fired on anyway https://t.co/FDAxliPc7Q pic.twitter.com/KH0Y4eYGCh— Nabila Jamal (@nabilajamal_) April 18, 2026 -
వేటకొడవలితో వీరంగం.. బావపైకి కత్తి ఎత్తిన మరదలు..
-
లష్కరే టాప్ కమాండర్పై దాడి.. పరిస్థితి విషమం
లాహార్: పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో కలకలం చెలచేరింది. కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అమీర్ హంజాపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కార్యాలయం వెలుపల ఈ అనూహ్య దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన హంజా ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం లాహోర్లోని ఒక న్యూస్ ఛానెల్ ఆఫీస్ ముందు అమీర్ హంజా ఉన్న సమయంలో ముసుగు ధరించిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక కాల్పుల దాడిలో బుల్లెట్లు తగలడంతో హంజా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాది హాఫిజ్ సయీద్తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించిన హంజా.. భారతదేశంలో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారి.అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిఅమీర్ హంజా.. తన విద్వేషపూరిత ప్రసంగాలు, రచనలతో ఎంతోమంది యువతను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. లష్కరే అధికారిక పత్రిక ‘మజల్లా అల్-దావా’కు ఫౌండింగ్ ఎడిటర్గా పనిచేయడమే కాకుండా 2002లో ‘కాఫిలా దావత్ ఔర్ షహాదత్’ వంటి తీవ్రవాద పుస్తకాలను రచించాడు. అతడి ప్రమాదకర కార్యకలాపాలను గుర్తించిన అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్.. లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు, హంజాను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా పేర్కొంది. లష్కరే సెంట్రల్ కమిటీలో ఉంటూ ఉగ్రవాదుల నిధుల సమీకరణ, రిక్రూట్మెంట్లో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఇది కూడా చదవండి: New York: కుబేరులకు మేయర్ మమ్దానీ షాక్ -
గ్రామం వదిలివెళ్లండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో సుమారు 8 దశాబ్దాల క్రితం వెలిసిన చమన్ఖాన్దొడ్డి గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు మరోసారి జరిగాయి. చివరి సారిగా 2024 ఏప్రిల్లో కోర్టు, పోలీస్ సిబ్బందితో గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీనిపై ‘సాక్షి’లో అదే నెల ఐదో తేదీన ‘ఈ ఊరు మాది.. ఖాళీ చేయండి!’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు నిలిచిపోగా.. తాజాగా బుధవారం పునరావృతమైంది. కోర్టులో అనుకూల తీర్పు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన బంధువులు కోర్టు ఉత్తర్వులు, కోర్టు సిబ్బందితో కలిసి జేసీబీతో గ్రామానికి వచ్చారు. ఇళ్లను కూలగొట్టేందుకు యత్నించడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోగా.. పలువురు దాడికి దిగారు. దీంతో వారి బంధువులు ఐదుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చిన పోలీసులు గ్రామస్తులను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు చేసేదేమీ లేక వెనుదిరిగారు. గాయపడిన మైబూ, ఖాజా, షేక్ ఘనీ, మహ్మద్ రఫీ, షేక్ బషీర్ గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ తాతముత్తాతల నుంచీ ఇక్కడే జీవిస్తున్నామని, ఇప్పుడు ఇళ్లను విడిచి వెళ్లాలంటే ఎక్కడికి పోవాలి.. ఎట్లా బతకాలని స్థానికుడు ఆంజనేయులు, ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చమన్ఖాన్దొడ్డి గ్రామంలో 200 కుటుంబాల వరకు ఉంటున్నాయి. ఇదీ నేపథ్యం.. చమన్దొడ్డిలో సర్వే నంబర్ 129లో 11.02 ఎకరాల భూమి తమదేనని ఖాసిం సాబ్, మదర్సాబ్, నబి సాబ్ అనే ముగ్గురు వ్యక్తులు 2009లో గద్వాల సీనియర్ సివిల్ కోర్టులో దావా వేశారు. 2010 ఫిబ్రవరి 5న వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై 2012లో గ్రామస్తులు 52 మంది హైకోర్టులో సవాల్ చేశారు. 2020లో గ్రామస్తుల పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత 2021 డిసెంబర్లో సదరు భూమిని ఖాళీ చేయించి.. వారికి అప్పగించాలని గట్టు మండల పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ 2024 మార్చిలోనూ ఆదేశాలిచ్చింది. ఈ రెండు పర్యాయాలు ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పుడు తాజాగా కోర్టు సిబ్బందితో కలిసి పిటిషనర్ల బంధువులు జేసీబీతో గ్రామానికి చేరుకోగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఇరాన్ ప్రతినిధుల బృందంపై క్షిపణి దాడి ప్లాన్?
ఇటీవల ఇస్లామాబాద్లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. -
మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..
-
నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాల బీభత్సం
సాక్షి, నెల్లూరు జిల్లా: పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ కార్యకర్తపై దాడి చేసిన ఘటన జలదంకి మండలం తిమ్మసముద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి విషయమై కోర్టులో వివాదం జరగడంతో బాధితుడికి స్టేటస్ కో ఇచ్చారు. ఈ విషయమై టీడీపీకి చెందిన పలువురు గతంలో దాడి చేశారు.అప్పట్లో ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన నిమ్మ తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన కంచర్ల వినోద్, కంచర్ల వేణుగోపాల్, మేకల శ్రీనాథ్, కాసు మహేష్, మరికొందరు మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పక్క పొలాల వారు వారి బంధువులు, 108కు సమాచారమివ్వడంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జలదంకి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పార్టీ రైతు సంఘ జిల్లా నేత రావి ప్రసాద్నాయుడు, జలదంకి మండల కన్వీనర్ ఇస్కా మదన్మోహన్రెడ్డి పరామర్శించారు. -
అన్నంత పని చేసిన ట్రంప్.. మళ్లీ యుద్ధ మేఘాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్ డెడ్లైన్ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది. -
Iran: 30కి పైగా యూనివర్సిటీలు ధ్వంసం
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఏకంగా 30కి పైగా విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ స్వయంగా వెల్లడించారు. విద్యా, వైద్య కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.తాజాగా ఉత్తర టెహ్రాన్లోని ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు పశ్చిమాన ఉన్న ‘మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం’పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో క్యాంపస్ భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. 1960లో స్థాపించిన ఈ వర్సిటీ వేలాది మంది విద్యార్థులకు, పరిశోధకులకు ఓ కీలక కేంద్రం. దాడితో దెబ్బతిన్న ప్రాంతాన్ని శనివారం మంత్రి సర్రాఫ్ పరిశీలించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా వర్సిటీలపై దాడులు జరిగాయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, ఆస్పత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై జరుగుతున్న దాడులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘన చరిత్ర కలిగిన బయోమెడికల్ కేంద్రం ‘పాశ్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా దాడులు జరిగాయని, భవనాలు భారీగా దెబ్బతినడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హూ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దాడి జరిగినప్పటికీ పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తి నిరంతరాయంగానే కొనసాగుతున్నాయని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఇరాన్ ఆరోగ్య శాఖ, ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపాయి.ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా దేశాల్లోనూ ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలాయని, వాటికి తక్షణ సాయం అందాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ భీకర పోరు కారణంగా ఆయా దేశాల్లో ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వలసబాట పట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: మ్యాగీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు! -
ఇక అమెరికా పనైపోయింది.. పైలట్ దొరికితే పరువు పోయినట్లే.. ఈ యుద్ధం ఆగదు..
-
కువైట్లో ఉద్రిక్తత: ఆయిల్ కాంప్లెక్స్పై భీకర డ్రోన్ దాడి
కువైట్ సిటీ: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. కువైట్లోని అత్యంత కీలకమైన చమురు కేంద్రంపై ఆదివారం తెల్లవారుజామున అనూహ్య డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళితే..కువైట్ చమురు మంత్రిత్వ శాఖతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీఎస్) ప్రధాన కార్యాలయాలున్న షువైక్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు కువైట్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంధన మౌలిక సదుపాయాలకు మరింత నష్టం వాటిల్లకుండా అడ్డుకున్నారు. శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే దీటుగా అడ్డుకుంటున్నాయని కువైట్ మిలిటరీ ప్రకటించింది. ఈ దాడులను విజయవంతంగా ఛేదిస్తున్న క్రమంలోనే నగరమంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని సైన్యం ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది.ప్రభుత్వ భవనంపై ఇరాన్ దాడిశనివారం సాయంత్రం కూడా కువైట్ సిటీలోని ఒక ప్రభుత్వ భవనంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఫలితంగా భవనానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఈ వరుస దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడికి గురైన కాంప్లెక్స్ పరిధిలోని పలు మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఆదివారం ఇంటి నుంచే (రిమోట్ వర్క్) పనిచేయాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా భవనాల్లోకి సందర్శకులకు అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడులకు ప్రతీకారంగానే.. ఇరాన్ ఇప్పుడు కువైట్ సహా పలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. BREAKING: Kuwait’s Ministry of Oil building has been hit in an Iranian attack.Large fire reported at the ministry complex in Shuwaikh. The ministry runs Kuwait’s entire oil sector. Iran is now hitting the buildings that set Gulf oil policy, not just the facilities that produce… pic.twitter.com/OYtFUHb88Y— The Hormuz Letter (@HormuzLetter) April 4, 2026 -
కుప్పంలో దళిత కుటుంబంపై దాడి
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుండడంతో దళితులనే టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డప్పు కొడుతున్న ఓ దళితున్ని కొట్టిన ఘటన మరువక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మరో దళిత కుటుంబంపై టీడీపీ మూకలు దాడి చేసిన దారుణ ఘటన బయటపడింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో కోదండరామస్వామి ఆలయ ఉత్సవాల్లో గత శుక్రవారం ఐదుగురు చిన్న పిల్లలు గొడవపడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార టీడీపీ వర్గీయులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన దళితుడు మంజునాథ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. భార్య అమృత, పిల్లలపై విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కులం పేరుతో దూషించి, ఊరు వదలి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. గాయపడిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంజునాథ్ భార్య అమృత టీడీపీ నేతల దాడిపై రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై దాడి చేసి కొట్టి, కులం పేరుతో దూషించిన వారిపై కేసు నమోదు చేయకుండా తమపైనే కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, దళిత సంఘాలు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నాయకురాలిపై హత్యాయత్నం
పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్సీపీ అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్ స్టేషన్కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్రెడ్డితో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్ సైకిల్పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు ‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్రెడ్డిని నిలదీశారు. -
ట్రంప్ అల్టిమేటం.. ఆయుధాలు సిద్దం చేస్తున్న ఇజ్రాయెల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది. -
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
-
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
-
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టారు.కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందంటూ హరీష్రావు మండిపడ్డారు.‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు.. దళిత మహిళపై దాడి
-
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసేన నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు రెచ్చిపోయారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దళిత మహిళపై దాష్టీకం ప్రదర్శించారు. సెటిల్మెంట్ వివాదంలో మహిళపై జనసేన నేతలు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన ఆ మహిళను జనసేన నేత బారతాల గోవింద్ నేల మీదకు నెట్టేశారు.తన భర్త ఆర్థి లావాదేవిల సెటిల్మెంట్ కోసం సోదరుడితో కలిసి తాటిపర్తిలో సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి ఆ మహిళ వచ్చింది. తన తరపున సెటిల్మెంట్ కోసం జనసేన నేతలు కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను సుబ్రహ్మణ్యం పిలిపించుకున్నారు. తన సోదరుడు సతీష్పై సుబ్రహ్మణ్యం దాడికి పాల్పడటంతో సెల్లో ఆమె వీడియో తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనసేన నాయకులు.. సెల్ ఫోన్ లాక్కుని దాడి చేశారు. గొల్లప్రోలు పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. -
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ... రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసిన ఇరాన్
-
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మరిడిమాంబ అమ్మవారి జాతరలో 60 ఏళ్లు పైబడి ఉన్న దళిత డప్పు కళాకారుడుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నర్సీపట్నానికి చెందిన దళిత డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసు తోటి కళాకారులతో కలిసి పండగలో డప్పు కొడుతుండగా..ఒక్కసారిగా అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. వృద్ధుడు అని కూడా చూడకుండా రామదాసుపై చేయి చేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించడమే కాకుండా పరుష పదజాలంతో తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో సీఐ గఫూర్తో పాటు ఎస్ఐలు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా తన కాలు తొక్కినందుకే అయ్యన్న కొట్టాడని బాధితుడితో బలవంతంగా చెప్పించడం కొసమెరుపు.స్పీకర్ అయ్యన్నను అరెస్టు చేయాలి: కేవీపీఎస్ డిమాండ్సాక్షి, అమరావతి: దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడితల్లి పండగలో డప్పు కొడుతుండగా దళితుడైన నాగులాపల్లి రామదాసును పోలీసుల సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు చెంపదెబ్బ కొట్టడం దారుణమన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన స్పీకర్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా నివారించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్ చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలి నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ జాతరలో దళిత వృద్ధ డప్పు కళాకారుడిని అయ్యన్న చెంప దెబ్బ కొట్టారు. తక్షణమే ఆ దళిత డప్పు కళాకారుడికి అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి. కూటమి పార్టీల నాయకులకు దళితులంటే చిన్నచూపు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – డాక్టర్ బూసి వెంకటరావు, విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దాడి అమానుషండప్పు కళాకారుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడం అమానుషం. సమాజంలో దళితులను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అయ్యన్నకు తగదు. కళాకారులను ప్రోత్సహించాల్సింది పోయి దాడి చేయడం సరైన సంప్రదాయం కాదు. తక్షణమే అయ్యన్నపాత్రుడు దళితులకు క్షమాపణ చెప్పాలి.– యల్లబిల్లి కొండబాబు, డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఅయ్యన్న దిష్టిబొమ్మ దహనంకోవెలకుంట్ల: దళితుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు, గ్రేటర్ రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు కోగిల ప్రసాద్ మాట్లాడుతూ..దళితులపై అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తూ దాడి చేయడం హేయమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళితులపై దాడులు, దౌర్యన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ట్రంప్ కు షాక్.. అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్..
-
ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్
-
నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..
-
అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో
-
నడిరోడ్డుపై MLA శ్రీధర్ బాధితురాలు హర్షవీణను చంపేందుకు జనసేన నేతల కుట్ర
-
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన అతి పెద్ద దాడి ఇదే..
-
అమెజాన్ పై ఇరాన్ భీకర దాడి..
-
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు. తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్ తన ప్రతాపాన్ని చూపించాడు. పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు. బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు. తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్ మీద నుంచి తోసేశాడు!తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు -
భారత్ రావాల్సిన విమానంపై అమెరికా దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో భారత్ రావాల్సిన మహాన్ ఎయిర్ విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.. ఔషద సేకరణకు ఈ విమానం భారత్ రావాల్సి ఉంది.ఇరాన్లో జరుగుతన్న యుద్ధం కారణంగా మానవతా సహాయం అందించేందుకు భారత్లో విరాళాలు సేకరించారు. ఆ నిధులతో అక్కడి ప్రజలకు కావాల్సిన ఔషదాలు కొనుగోలు చేశారు. ఈ మందులను తీసుకెళ్లడానికి ఇరాన్కు చెందిన (Airbus A340-600)విమానం బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాగా ఇరాన్లోని ఓ ఎయిర్పోర్టు వద్ద అమెరికా జరిపిన దాడుల్లో ఈ విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది.దీంతో మందులు తీసుకెళ్లడానికి ప్రత్యామ్నయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుంది. కాగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరిస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా భారతీయులు పంపిన డబ్బుతో ఈ మందులను కొనుగోలు చేశారు. కాగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. -
కువైట్ విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి.. విదేశీ కార్మికుడు మృతి
-
యుద్ధంలో అమెరికాకు కోలుకోలేని ఎదురుదెబ్బ..
-
బాలుడి దారుణ హత్య
నందివాడ: ఇంట్లో నిద్రిస్తున్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి బాలుడు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. వివరాలు.. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో గండికోట లక్ష్మి(70) ఒంటరిగా నివాసం ఉంటూ బెల్టుషాప్ నిర్వహిస్తోంది. ఆమె కొడుకు గండికోట రామసుబ్బారావు, కోడలు రమాదేవి స్థానికంగా రొయ్యల ఫ్యాక్టరీకి రోజూ రాత్రివేళ పనికి వెళ్తారు. ఈ నేపథ్యంలో రామసుబ్బారావు తన కొడుకు బాలాజీ(10)ని నానమ్మ లక్ష్మి దగ్గర రాత్రి వదిలేసి వెళ్తాడు. ఉదయం ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. బాలుడు చిన్నలింగాలలో ప్రభుత్వ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. రోజువారీ లాగే శనివారం రాత్రి వృద్ధురాలు లక్ష్మి, మనవడు బాలాజీతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలుడు బాలాజీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని తొలుత గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. నందివాడ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలు స్థానికంగా బెల్టుషాప్ నిర్వహిస్తుండడంతో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. డాగ్స్క్వాడ్ రొయ్యల చెరువు వరకు వెళ్లి పోలీస్ జాగిలం ఆగిపోయింది. పోలీసులు పలువురి అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. వారి పనేనా ! ఇటీవల మండలవ్యాప్తంగా రొయ్యల చెరువుల వద్ద పని కోసం అస్సాం, బిహార్ రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యక్తులు వచ్చారు. వీరు వృద్ధురాలు లక్ష్మి దగ్గర తరచూ మద్యం కొనుగోలు చేస్తారు. దీనికితోడు వారు నిత్యం గంజాయి సేవిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారిపైనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో బాలుడి హత్య, వృద్ధురాలిపై దాడి ఘటన గ్రామస్తులను ఉలికిపాటుకు గురిచేసింది. -
యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్
-
భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
నంద్యాలలో దారుణం.. అత్తను చంపిన అల్లుడు
-
US స్థావరాలపై ఇరాన్ దాడి? భారీగా ప్రాణనష్టం
-
యుద్ధంలోకి హౌతీలు.. ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులు
-
సౌదీపై భీకర దాడి.. 10 మంది అమెరికా సైనికులు..
-
రఘురామ పర్యటనతో టెన్షన్!
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. డిప్యూటీ స్పీకర్ వెంట వచ్చిన కూటమి కార్యకర్తలు తమపై దాడిచేశారని స్థానిక దళితులు ఆందోళనచేశారు. ఈ గొడవ పేరుతో పలువురిని స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని వారు పేర్కొన్నారు. ఆకివీడులోని పెదపేటలో దళితుల నివాసాల మధ్య ఉన్న ఓ ఆలయంలో రఘురామకృష్ణరాజు పూజలు చేయడానికి శుక్రవారం వచ్చారు. ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, వారంతా ఏదో దాడికి వచ్చినట్లు హడావిడి చేయడం, ఆ ప్రాంతంలోని దళితులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. డిప్యూటీ స్పీకర్ మందీమార్బలం హడావుడి..శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మందీమార్బలాన్ని వేసుకుని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఆ ప్రాంత దళిత మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రఘురామ పర్యటన నేపథ్యంలో అక్కడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులురఘురామ వెంట వచ్చిన వారు దురుసుగా వ్యవహరించడంతోనే ఘర్షణ తలెత్తిందని స్థానికులు పేర్కొన్నారు. దాంతో తోపులాటకు దారితీసిందని, ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం పెదపేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయంత్రం వేళ తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుని 57 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్లో లేకపోవడం, ఎక్కడికి తరలించారనే సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. -
యుద్ధం మరో మలుపు.. రష్యాకు వెళ్తున్న నౌకను పేల్చేసిన ఇజ్రాయెల్..
-
భర్తను బయట నుంచి.. భార్యపై బాబా అఘాయిత్యం
నాసిక్: అతనొక రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్.. ఇప్పుడు నకిలీ బాబాగా అవతారమెత్తాడు. ఆధ్యాత్మికత పేరుతో మహిళలను వంచించి, భక్తుల బలహీనతలతో డబ్బులు దండుకుని, కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అశోక్ ఖారత్ అనే ఈ దొంగ బాబా గుట్టు ఎట్టకేలకు బయటపడింది. చేతబడులు, వశీకరణ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఈ మాయగాడి లీలలు ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.టెక్నాలజీతో మాయాజాలంఅశోక్ ఖారత్ తన ఆఫీసును ఒక క్షుద్ర పూజల కేంద్రంలా తీర్చిదిద్దాడు. భక్తులను భయపెట్టడానికి రిమోట్ కంట్రోల్తో నడిచే నకిలీ పాములను, పులి చర్మాలను, ఇతర వన్యప్రాణి అవశేషాలను ఉపయోగించేవాడు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి, ఐదు రూపాయలకు కూడా విలువ చేయని చింత పిక్కలను, నకిలీ రత్నాలను ‘మంత్రించినవి’ అని చెప్పి, రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయించేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే ‘వశీకరణం’ చేస్తానని, కీడు జరుగుతుందని భయపెట్టేవాడు.గర్భిణీ అని చూడకుండా..ఈ కేసులో ఇప్పటికే పలువురు మహిళలు ఖారత్పై ఫిర్యాదు చేశారు. ఒక బాధితురాలిని మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఈ నిందితుడు, ఇటీవల మరో గర్భిణిపై కూడా అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. పూజల పేరుతో ఆమె భర్తను బయట కూర్చోబెట్టి, లోపల ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితులకు మత్తు పానీయాలు ఇచ్చి, తన కోరికలు తీర్చుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది.రాజకీయ ప్రకంపనలుఖారత్ ఆధ్యాత్మిక ముసుగులో నేరాలు చేయడమే కాకుండా, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇప్పటివరకు 150 సార్లు విదేశీ పర్యటనలు చేసిన ఈయనకు సుమారు 52 విలువైన ఆస్తులు ఉన్నట్లు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. నాసిక్ సమీపంలోని ఒక దేవాలయ ట్రస్ట్కు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది. ఖారత్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. -
ఏపీ డ్రైవర్ను చితకబాది, బస్సులో తీసుకెళ్లిన కర్ణాటక సిబ్బంది
మార్కాపురం జిల్లా: ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కర్ణాటక డిపోకు చెందిన సిబ్బంది, ప్రయాణికులు దాడి చేశారు. అనంతరం ఏపీ డ్రైవర్ను తీవ్రంగా కొట్టి, తమ బస్సులోకి నెట్టి..45 కిలోమీటర్ల పాటు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల ఎస్ఐ వెంకట రమణయ్య తెలిపిన వివరాలు..రాత్రి వేళల్లో శ్రీశైలం ఘాట్రోడ్లో ప్రయాణానికి అనుమతులు లేకపోవడంతో ఆదివారం ఉదయం 6 గంటలకు వాహనాలన్నీ నంద్యాల జిల్లా శిఖరేశ్వరం చెక్పోస్టు గేట్ వద్ద ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన విజయపురి ఆర్టీసీ బస్సు వరుసగా లైనులో ఉన్న బస్సులను వేగంగా దాటి చెక్పోస్టు గేటు వద్దకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పీలేరు డిపో డ్రైవర్ చాంద్బాషాకు, కర్ణాటక బస్సు సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. దీంతో చాంద్బాషాపై కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది దాడి చేసి అతడిని తమ బస్సులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇది చూసిన మరో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెద్దదోర్నాలలోని గణపతి చెక్పోస్టు వద్ద కర్ణాటక బస్సును నిలిపేశారు. బస్సులో బందీగా ఉన్న చాంద్బాషాను విడిపించారు. కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని వారిని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. -
మూగజీవులను ప్రేమించి.. వాటి మధ్యనే తనువు చాలించి..
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్కు చెందిన పశు వైద్యురాలు డా.సమీక్షా రెడ్డి (27)కి కన్నీటితో వీడ్కోలు పలికారు. శుక్రవారం శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్లో జంతువులకు చికిత్స చేస్తుండగా నీటి ఏనుగు (హిప్పో) దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో కన్నుమూయడం తెలిసిందే. ఆనేకల్ తాలూకాలోని బన్నేర్ఘట్ట సమీపంలోని సకలవారలో శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. సమీక్షారెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆవరించింది. గ్రామస్తులు, అటవీ సిబ్బంది ఆమె భౌతికాకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ఏకైక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ధృవకుమార్, శైలజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూగజీవులంటే అమిత ప్రేమ సమీక్షారెడ్డికి చిన్నప్పటి నుంచే జంతువులు, పక్షులంటే అమితాసక్తి. ఆమె పట్టుదలతో చదివి పశు వైద్యురాలు అయ్యింది. ఆమె ఎంతో ఉత్సాహంతో పశువైద్య కోర్సును పూర్తి చేసి, పశుపక్ష్యాదుల సేవకు అంకితమైందని బంధువులు తెలిపారు. కానీ వాటి సేవలోనే అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని వాపోయారు. -
డర్టీ బాంబు వేయనున్న ఇరాన్.. అదే జరిగితే ఇక గల్ఫ్ దేశాలు..
-
దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్త..!
-
ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి
-
సౌదీపై ఇరాన్ దాడుల్లో.. తెలంగాణ వాసి మృతి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారని విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో, పశి్చమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరుకోగా మరొకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ అధికారి అసీమ్ మహాజన్ శుక్రవారం చెప్పారు. తాజా మరణానికి దారి తీసిన కారణాలను మాత్రం ఆయన వివరించలేదు.భారత్లోని మృతుడి కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వివరించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి రియాద్లోని లక్ష్యాలపై ఇరాన్ నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు కూలి్చవేశాయి. రియాద్లోని ఓ రిఫైనరీ సమీపంలో ఈ క్షిపణుల శకలాలు పడ్డాయి. శకలాలు తగలడంతోనే భారతీయుడు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.కాగా మృతిచెందిన వ్యక్తి తెలంగాణకు మహాబూబాబాద్కు చెందిన రవిగోపాల్గా సమాచారం. దీనిపై వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ " 18 వతారీఖు రాత్రి. 9.30 గంటలకు చివరి సారిగా రవితో మాట్లాడాము 20 నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్ కట్ అయ్యింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడే ఉన్న వేరేవారితోనూ మాట్లాడానికి ప్రయత్నించాము వారు సైతం కాల్లోకి రాలేదు" అని వారి కుటుంబసభ్యులు తెలిపారు.అయితే సౌదీపై జరిగిన దాడుల్లో రవి మరణించినట్లు మరుసటి రోజు రామ్ నివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పినట్లు వారు పేర్కొన్నారు. కాగా కుటుంబంలో రవి ఒక్కరే ఉద్యోగం చేస్తారని అతని కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి నాలుగేళ్ల కుమారుడని పేర్కొన్నారు. దయచేసి అతని మృతదేహాన్ని తమకు అప్పగించాలని తమకు పరిహారం ఇప్పించాలని కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
జర్నలిస్టు పైకి మిసైల్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
లెబనాన్లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్ అక్కడే పేలింది.ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్ అటాక్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్లో రికార్డయ్యింది. లెబనాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.Being a journalist in this modern day war is among hundred ways to die😰A missile strikes insanely close to him pic.twitter.com/ymUOhS5OEf— Cypher (@patocypher) March 19, 2026 -
అసలైన అస్త్రాన్ని బయటికి తీసిన అమెరికా.. B2 బాంబర్లతో బీభత్సం
-
హార్ముజ్ సమీపంలో ఎయిర్ స్ట్రైక్స్.. ఇరాన్ పై అమెరికా భారీ దాడి
-
తాలిబాన్లపై విరుచుకుపడిన పాక్.. 400 మంది మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్లో పాకిస్తాన్ దళాలు విరుచుకుపడ్డాయి. కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాక్ దాడుల్లో దాదాపు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డట్లు అఫ్గానిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఈ దాడిపై అఫ్గాన్ తాలిబన్లు స్పందించారు" పాకిస్తాన్ మరోసారి అఫ్గాన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్లోని మాదకద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది, మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు ఈ దాడుల్లో మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు". అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు.కాగా గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్.. కాబూల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా అఫ్గాన్ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. BREAKING: The Afghan health ministry said 200 people were killed and hundreds others injured after Pakistan launched airstrikes on a drug rehabilitation hospital in Kabul, Afghanistan.The Pakistan’s government rejected that they struck the hospital, claiming they targeted… pic.twitter.com/LenFAOyyYA— AZ Intel (@AZ_Intel_) March 16, 2026 -
ఇజ్రాయెల్ దాడి.. ప్రముఖ ఇన్ప్లూయెన్సర్ ఫ్యామిలీ మృతి
పశ్చిమాసియా యుద్దంలో మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ లెబనీస్ ఇన్ప్లూయెన్సర్ నటాలీ కమల్ తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి సైతం ప్రస్తుతం విషమంగా ఉంది.ఇజ్రాయెల్ ఓవైపు ఇరాన్పై దాడులు చేస్తూనే మరోవైపు లెబనాన్పై విరుచుకపడుతుంది. హిజ్బుల్లా స్థావరాలే లక్షంగా పెద్దఎత్తున మిసైల్స్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్ ఆ దేశంలోకి చొచ్చుకొని కంబాట్ ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. ఈ దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని సాధారణ ప్రజలు సైతం దాడులలో పెద్దఎత్తున మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ నటాలీ భర్త మెుహమ్మద్ షెబాద్, ఆమె చిన్న కుమార్తె తాలిన్ మరణించారు. అంతేకాకుండా ఈ అటాక్లో నటాలీ సైతం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ దాడి జరిగిన ప్రాంతం బీరూట్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం నేపథ్యంలో ఆశ్రయం కోల్పోయిన అనేక కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ అటాక్ చేసిందని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మెుత్తంగా ముగ్గురు మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. -
దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి
-
కన్న తల్లి కర్కశత్వం
భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి, అమృత దంపతుల కుమార్తె రత్నకళ (నీలిమ)ను 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె కృతిరెడ్డి (14), అక్షిత్ రెడ్డి సంతానం. కృతిరెడ్డి 8వ తరగతి, అక్షిత్రెడ్డి 6వ తరగతి చదువుతున్నారు. తన తల్లిగారి ఊరిలో గృహ ప్రవేశం ఉందని, పిల్లలకు కొత్త దుస్తులు తీసుకోవడానికి తమను తుక్కాపురం తీసుకెళ్లాలని శనివారం రత్నకళ తన భర్తను కోరింది. దీంతో నరేందర్రెడ్డి భార్యతోపాటు ఇద్దరు పిల్లలను తుక్కాపురంలో వదిలి వెళ్లాడు. కృతిరెడ్డి రాను అని వాదించినా.. ఆమెనూ వెంట తీసుకెళ్లారు. శనివారం రాత్రి రత్నకళ, ఆమె పిల్లలు తన తల్లిగారింట్లో ఓ గదిలో నిద్రించగా.. రత్నకళ తల్లిదండ్రులు హాల్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రత్నకళ కత్తితో కృతిరెడ్డి మెడపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం కుమారుడు అక్షిత్రెడ్డిపై కూడా కత్తితో దాడికి యత్నించగా.. అతడు వెంటనే మేల్కొని గాయాలతో కేకలు వేస్తూ తలుపులు తీసి హాల్లోకి పరిగెత్తాడు. హాల్లో నిద్రిస్తున్న రత్నకళ తల్లిదండ్రులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేసరికి రత్నకళ తలుపులు వేసుకుని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తలుపులు తీసి రత్నకళతో పాటు గాయపడిన ఆమె కుమారుడిని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కృతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం కృతిరెడ్డికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. రత్నకళ సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. తండ్రికి దగ్గరవ్వడంతో.. రెండేళ్ల నుంచి రత్నకళ మానసికస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తరచూ యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉంటుందని, ఈ క్రమంలో పిల్లలను సరిగా పట్టించుకోవట్లేదని, అంతేకాకుండా పిల్లలు సహజమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని వారిపై ఒత్తిడి చేసేదని పేర్కొన్నారు. దీంతో పిల్లలిద్దరూ తండ్రితో ప్రేమగా ఉంటూ ఆయనకు దగ్గరయ్యారని, ఇది తట్టుకోలేని రత్నకళ మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. -
ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు
-
యాదాద్రిలో దారుణం.. కూతురు, కొడుకుపై తల్లి దాడి
-
సిగరెట్ ఫ్యాక్టరీపై మిసైల్ దాడి.. 15 మంది మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ అటాక్ చేసింది. ఈ దాడిలో 15 మంది కార్మికులు మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి. వారిలో అత్యధిక మంది టెహ్రాన్కు చెందిన ప్రజలే. అయితే ఈ యుద్దం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో 15 మందికి పైగా మృతిచెందారు.ఇస్ఫాహాన్ నగరంలో రిఫ్రిజిరేటర్లు, హీటర్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీపై ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పత్రికా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అందులో కార్మికులు విధులు నిర్వహిస్తుండడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయని తెలిపాయి. అయితే ఇటీవల ఖర్గే ద్వీపంపై అమెరికా దాడి చేసిన తర్వాతే ఈ క్షిపణి అటాక్ జరిగింది. అయితే దీనికి ఘాటుగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది.అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇది వరకే ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేశామని ప్రకటించారు. ఇరాన్ సైతం ఎక్కడా తగ్గట్లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.అయితే ట్రంప్ ఇటీవలే హార్మూజ్ జలసంధిలో చమురు రవాణాకు రక్షణ కల్పించే విధంగా వివిధ దేశాలు తమ యుద్ధ నౌకలు అక్కడికి పంపించాలని కోరారు. అయితే ఇరాన్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. తమ అనుమతి లేకుండా ఈ జలసంధి గుండా ప్రయాణిస్తే వాణిజ్య నౌకలు పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అమెరికా ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసిన ఇరాన్..! షాక్ లో ట్రంప్
-
బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు
-
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే! -
ఇరాన్ సంచలన ప్రకటన..
టెహ్రాన్: అమెరికా- ఇరాన్ యుద్ధంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేశాయి. అమెరికా ప్రధాన యుద్ధ నౌక అబ్రహం లింకన్పై దాడి చేసినట్లు ప్రకటించాయి. అయితే, ఈ దాడిని అమెరికా ఖండించింది. అబ్రహం లింకన్పై ఏటువంటి దాడి జరగలేదని, ఇరాన్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ వెనక్కితగ్గడం లేదు. ఏక కాలంలో గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే ఇటు యుఎస్, ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అతిపెద్ద యుద్ధనౌకగా పిలిచే అబ్రహం లింకన్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఎయిర్క్రాఫ్ట్ పెద్దఎత్తున దెబ్బతిన్నట్లు పేర్కొంది.ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. అబ్రహం లింకన్పై ఎటువంటి దాడి జరగలేదని అది అమెరికా విజయంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని విజయవంతం చేయడంలో అమెరికాకు అండగా నిలుస్తోందని చెప్పింది. అబ్రహం లింకన్పై దాడి చేయడానికి ఇరాన్ నౌకలు ప్రయత్నించగా అమెరికా బలగాలు వాటిని ధ్వంసం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో ప్రారంభమైన ఇరాన్పై అమెరికా-ఉక్రెయిన్ సంయుక్త దాడులకు ముందే అబ్రహం లింకన్ చాలా పాపులర్ అయ్యింది. ఇరాన్తో అణుచర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామనే సంకేతంతో అరేబియా సముద్రంలో అమెరికా ఈ క్షిపణిని మోహరించింది. దీనితో మరో రెండు యుద్ధనౌకలను సముద్రంలో నిలిపింది. కాగా అబ్రహం లింకన్ యుఎస్ అతిపెద్ద యుద్ధనౌకThe Abraham Lincoln Carrier Strike Group continues to support Operation Epic Fury and project power from the sea. pic.twitter.com/2o7krBUp70— U.S. Central Command (@CENTCOM) March 12, 2026 -
యుద్ధ కల్లోలం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఎడతెరిపిలేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర గురువారం 100 డాలర్లు దాటేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 38 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి, దాడులు ఆపకపోతే బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరడం తథ్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తుండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచదేశాలపై.. ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదని తేల్చిచెప్పారు. శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా–ఇజ్రాయెల్లకు కొత్త ఆఫర్ ఇచ్చారు. మూడు షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తామని చెప్పారు. ముడి చమురు నౌక షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ హార్మూజ్ నుంచి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్లో ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న అమెరికా ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్ చేశామని, బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో 200 డాలర్లకు చేరబోతోందని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖారీ స్పష్టంచేశారు. భద్రతా మండలి తీర్మానం బేఖాతర్ ఇరాన్ యుద్ధం గురువారం పదమూడో రోజుకు చేరుకుంది. దాడులు ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్ తీరంలో కంటైనర్ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉన్న ముహరాఖ్ ద్వీపాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్ను ప్రయోగించింది. రాజధాని రియాద్లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్లోని బస్రా పోర్టుపైనా ఇరాన్ దాడికి దిగడంతో ఇరాక్లోని చమురు కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గల్ఫ్లో దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యూఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచే పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కువైట్లో ఓ భవనాన్ని ఇరాన్ క్షిపణి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. 200 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇరాన్తోపాటు లెబనాన్పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్లో ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా గ్రూప్ను క్షిపణులతో టార్గెట్ చేసింది. గురువారం జరిగిన రెండు దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్లోజరిగిన దాడిలో 8 మంది మృతిచెందగా, 31 మంది క్షతగాత్రులయ్యారు. అరామైన్ టౌన్పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియల్ గల్ఫ్లో ఏరులై పారుతుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలిబాఫ్ హెచ్చరించారు. తమ దీవుల జోలికి రావొద్దని అన్నారు. లెబనాన్లో 634కి చేరిన మృతులుఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే, లెబనాన్లో 1,300 మందికిపైగా మరణించారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో 12 మంది, గల్ఫ్లో ఏడుగురు అమెరికా జవాన్లు మృతి చెందారు.పెజెష్కియాన్ మూడు షరతులు పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలంటే స్పష్టమైన మార్గం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. మూడు షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరాన్ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలని, ఇరాన్కు నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలని పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్లపై ప్రతీకారానికి సిద్ధం అంటూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, అధ్యక్షుడు పెజెష్కియాన్ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే పరాజయం పాలయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అన్నారు. ఇరాన్ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు(రూ.1.04 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ ప్రకటించింది. మొజ్తబా ఖమేనీ యుద్ధ శంఖారావం యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నామని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ(56) తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్లో టీవీ న్యూస్ చానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెల్లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుందని సంకేతాలిచ్చారు. హార్మూజ్ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోమని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్–అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతోపాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమేనని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని అన్నారు. తనను సుప్రీం లీడర్గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశానని వెల్లడించారు. ఇరాన్పై యుద్ధం మొదలైన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు. -
అమెరికా నౌకలను.. పేల్చేసిన ఇరాన్
-
భారత్ వస్తున్న షిప్ పై ఇరాన్ దాడి
-
అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా?
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకార దాడులకు ఇరాన్ కుట్ర పన్నుతోందా? సముద్ర మార్గం ద్వారా డ్రోన్లతో విరుచుకుపడేందుకు ప్రణాళికలు రూపొందించిందా?.. దీనికి అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి అమెరికా నిఘా వర్గాలు. ఇరాన్ తీర ప్రాంతాల నుంచి కాకుండా, అమెరికా గడ్డకు అత్యంత సమీపంలోని అంతర్జాతీయ జలాల నుంచే డ్రోన్ దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోందనే సంచలన విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)వెల్లడించింది. పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఒక అంతర్గత బులెటిన్లో పేర్కొంది.ఎఫ్బీఐ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2026 ప్రారంభం నుంచే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. గుర్తుతెలియని నౌకల ద్వారా అమెరికా ప్రాదేశిక జలాల సమీపానికి చేరుకుని, అక్కడి నుంచి మానవరహిత విమానాల ద్వారా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే, దానికి ప్రతిగా ఈ ‘డ్రోన్ వార్’ను మొదలుపెట్టాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి? ఖచ్చితమైన లక్ష్యాలు ఏవి? అనే అంశాలపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఐ సూచించింది.ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. గత 12 రోజులుగా ఇరుపక్షాల మధ్య జరుగుతున్న పోరులో ఇరాన్ తన డ్రోన్ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. అయితే తాజాగా అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ సామర్థ్యం కొంతమేర తగ్గినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, అమెరికా పశ్చిమ తీరంలో ఎల్.ఏ. షెరీఫ్ విభాగం అప్రమత్తమైంది. మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేసింది.ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం -
ఫరూక్ అబ్దుల్లాపై హత్యా ప్రయత్నం
జమ్మూ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆయనపై దాడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. బుధవారం జమ్మూలోని గ్రేటర్ కైలాష్ వద్ద ఒక పెళ్లి వేడుకకు హాజరై వెనుదిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ‘‘పెళ్లి జరిగిన రాయల్ పార్క్ ప్రాంగణంలో పొంచి ఉన్న దుండగుడు అబ్దుల్లాపై పిస్టల్తో కాల్పులకు దిగేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు స్పందించి అదుపులోకి తీసుకునే లోపే ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే ఫరూక్ అబ్దుల్లాకు గానీ, ఆయన వెంటే ఉన్న ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరికి గానీ ఎలాంటి గాయాలూ కాలేదు. దుండగున్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని జమ్మూలోని పురానీ మండీకి చెందిన కమల్సింగ్గా గుర్తించాం’’ అని పోలీసులు తెలిపారు. -
భారత్కు వస్తున్న నౌకపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. దుబాయి నుంచి భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మెుత్తం 23 మంది సిబ్బంది ఉండగా ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది.. అయితే ఈ నౌకలో ఏం సరఫరా జరుగుతుంది. అనే వివరాలు తెలియాల్సి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని యుఎఇలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ నౌకథాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పిసిఎల్కు చెందింది. భారతదేశంలోని కాండ్లా పోర్టుకు ప్రయాణమైన ఈ నౌక.. హార్ముజ్ జలసంధిని దాటుతుండగా అటాక్ జరిగింది. ఈ దాడిపై ఇరాన్ స్పందించింది. వ్యుహాత్మక హర్ముాజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్ప్రెస్ రోమ్, థాయ్ బల్క్ క్యారియర్, మయూరీ నరీ అనే ఓడలు ప్రయాణిస్తున్నాయని.. వాటికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌక అయినా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్జీసీ కమాండర్ అలిరేజా టాంగ్సిరి స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఇరాన్ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయినప్పటీకీ భారత్కు వస్తున్న నౌకలపై దాడి చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయం. కాగా హర్మూజ్ జలసంధి గుండా దాదాపు 20 శాతం చమురు రవాణా జరుగుతుంది. దీనిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఇరాన్ ఆ మార్గం గుండా ప్రయాణించిన నౌకపై దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి -
ఇది సొసైటీ... నడబడిక!
స్కూళ్లలో గంజాయి, స్కూళ్లలో వీడియోగేమ్స్, స్కూళ్లలో చెడ్డ మాటలు, స్కూళ్లలో రౌడీయిజం చదువుకునే పిల్లల మధ్య కలుపుమొక్కలు. చివరకు క్లాస్రూమ్లో టీచర్ మీద చెయ్యెత్తే వరకూ వచ్చారు. ఇందులో ఎవరి మీద నెపం నెడదాం? ఈ విద్యా భారతాన్ని ఎలా చూద్దాం?బడి అంటే ఉత్తి భవనం కాదు. విద్యార్థుల భవితను తీర్చిదిద్దే ఆలయం. చదువు చెప్పే ప్రతి గురువు దైవంతో సమానం. తల్లిదండ్రుల తర్వాతి స్థానం మన పెద్దలు గురువుకే ఇచ్చారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ, వారి బతుకును తీర్చిదిద్దే దిక్సూచులుగా మారి వారిని గమ్యానికి చేర్చే బాధ్యత ఉపాధ్యాయులది. కానీ.. పరిస్థితి తారుమారైంది. చదువు చెప్పే గురువులకు మర్యాద కరువైంది. విద్య నేర్పే ఒజ్జలకు విలువనిచ్చే సంస్కృతి కనుమరుగవుతోంది. తప్పు చేస్తే విద్యార్థులను ఉపాధ్యాయులను దండించే కాలం పోయి, విద్యార్థులే ఉపాధ్యాయులను దండించే కాలం వచ్చింది. ఇది కాలరీతి అనుకోవాలా లేక సమాజంలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా భావించాలా తెలియని పరిస్థితి. ఇటీవలి ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ ఉన్నతపాఠశాలలో జరిగిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న ముగ్గురు విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైనా దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. బడిలో మద్యం, గంజాయి తాగడం, అమ్మాయిలను ఏడిపించడం, గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇవి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. వీటిని కట్టడి చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. గట్టిగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నా స్థానిక రాజకీయాలు, ఒత్తిడి వారి ఆ పని చేయనీయకుండా చేస్తోంది. దీంతో మిన్నకుండిపోతున్నారు.సినిమాలు... సోషల్ మీడియా ప్రభావంస్కూల్ పిల్లలు చెడ్డదారిలో పడటానికి సినిమాలు, సోషల్ మీడియా ప్రధాన కారణంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. సినిమాల్లో విద్యార్థులు తమ లెక్చరర్లను ఏడిపించడం, వారి మీద జోకులేయడం వంటి సన్నివేశాలు చూసి తామూ అలా చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు, బూతులు, అశ్లీల వీడియోలు సైతం వారి మనసుల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం వల్ల చాలా సులభంగా వీటిని చూస్తూ ఆ ప్రభావానికి లోనవుతున్నారని అంటున్నారు.తల్లిదండ్రుల మాటలనూ లెక్కచేయక...విద్యార్థులు బడిలోనే ఇలా ఉంటున్నారనుకుంటే ΄÷రపాటే. కొందరు తమ ఇళ్లల్లోనూ ఇదే రీతిలో ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా, వారి మాటలకు ఎదురుచెప్తూ, వారి మీదే దాడికి పాల్పడుతున్నవారూ ఉన్నారు. అతిగారాబం, అడిగినవన్నీ అందించడం, అందరిలోనూ గొప్పగా ఉండాలని కోరుకోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులే పిల్లల్ని ఇటువంటి ప్రవర్తనకు పురిగొల్పుతున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. చివరకు సొంత అమ్మానాన్నల మాట కూడా వినని స్థితికి చేరుకున్నాక ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు.ఇలా చేస్తే మేలు...⇒ పిల్లలను అతిగారాబం చేయకూడదు. వారి అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టు అందించాలి తప్ప వారి అడిగిన ప్రతి వస్తువూ కొనివ్వకూడదు. ⇒ పెద్దల్ని గౌరవించడం, ఆడవారితో మర్యాదగా ఉండటం, తోటివారితో స్నేహంగా మెలగడం వంటివి చిన్ననాటి నుంచే నేర్పించాలి. ⇒ పిల్లలు వారి ఫోన్ లో ఏమేం చూస్తున్నారో కనిపెడుతూ ఉండాలి. చూడకూడదని మొండికేస్తే ఆ ఫోన్ వారి నుంచి తీసుకోవాలి. ⇒ పిల్లల స్నేహితులు ఎవరు, వారి అలవాట్లు ఏమిటి, వారి పద్ధతి ఎలా ఉంది అనేది గమనించాలి. ఎక్కడైనా తప్పుడు స్నేహాల బారిన పడుతున్నట్లు అనిపిస్తే వెంటనే హెచ్చరించాలి. ⇒ కనీసం నెలకోసారైనా బడికి వెళ్లి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయాలి. కేవలం మార్కుల గురించే కాకుండా నడవడిక గురించి కనుక్కోవాలి. ⇒ రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, రోజంతా ఫోన్ లోనే గడపడం, అందరిపట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివి గమనిస్తే వెంటనే పిల్లల్ని మందలించాలి. అయినా మారకపోతే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించక తప్పదు. -
దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే
-
సౌదీ అరేబియాపై దాడి.. భారత్ స్పందన
పశ్చిమాసియాలో యుద్ధం నానాటికీ తీవ్రతరమవుతుంది. ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు జనావాసాలపై సైతం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో జరిగిన దాడి ఘటనపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. ఆ ఘటనలో భారతీయులెవరూ మృతిచెందలేదని ప్రకటించింది.ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం భారత్కు తీవ్ర ఆందోళనకరంగా మారింది. మన దేశం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఆ దేశాలలోకి జీవనోపాధి కోసం వలస వెళుతుంటారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశమై ఇది వరకే భారత ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషించారు. అక్కడి ఇండియా ఎంబసీలు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలోని భారత్ రాయబార కార్యాలయం స్పందించింది." నిన్న సాయంత్రం ఆల్ఖర్జ్లో జరిగిన ప్రమాదంలో భారతీయులెవరూ మరణించలేదు. ఇది ఉపశమనం కలిగించే అంశం. ఈ ప్రమాదంలో మన దేశానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డారు. అతనిని కౌన్సిలర్ షబీర్ కలిశారు. ఇది చాలా ప్రమాదకర మైన ఘటన" అని ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే నిన్న ఇరాన్ జరిపిన దాడుల్లో ఒక భారతీయుడితో పాటు బంగ్లాదేశ్ దేశస్థుడు మృతి చెందినట్లు సౌదీ అరేబియా పేర్కొనగా తాజాగా భారత్ దానిని ఖండించింది. -
మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు
టెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్ రాజధాని టెహ్రాన్తో పాటు అల్బోర్జ్లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్ నగరాలపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది.భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్లో వర్క్షాపులను, హార్స్రైడింగ్ క్లబ్ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్ ఎయిర్పోర్టులో ఇరాన్కు చెందిన ఎఫ్–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్లో ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్పై నిఘా కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్జీసీ ఇంటర్నల్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్ ఫోర్స్ కాంపౌండ్ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికా రాడార్లు నేలమట్టం కువైట్పై ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అల్–అదిరీ ఎయిర్బేస్పై మిస్సైల్, డ్రోన్ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. యూఎస్ థాడ్ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్–గైడెడ్ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యమే తమ డిశాలినేషన్ ప్లాంట్పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్లో తాగునీటికి డిశాలినేషన్ ప్లాంట్లే ప్రాణాధారం. స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. మంటల్లో కువైట్ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలుఇరాన్ సైన్యం కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.ఇరాన్ దాడుల్లో ఇద్దరు కువైట్ బోర్డర్ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పైనా ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ సైన్యం 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు. -
నాలుగువైపుల నుంచి తగలబడుతున్న ఇరాన్
-
టెహ్రాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ బీకర దాడులు
-
ఎస్సై గల్లా పట్టిన వ్యక్తిపై కేసు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: విధుల్లో ఉన్న ఎస్సై గల్లా పట్టి దాడి చేసిన ఘటనపై కరీంనగర్ పోలీసులు స్పందించారు. ఘటనపై ‘సాక్షి’లో శనివారం ‘ఖద్దర్నాక్’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఉన్నతాధికారులు శనివారం ఉదయమే సీపీ గౌస్ ఆలంతో ఆరా తీశారు. అనంతరం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గల్లా పట్టుకుని చేతులతో దాడిచేస్తే, విధులకు ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేయడం విడ్దూరం.‘ఖద్దర్నాక్’ఆ రోజు ఏం జరిగిందంటే?తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో ఈ నెల 4వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు జాతర సందర్భంగా విధుల్లో ఉన్న గన్నేరువరం ఎస్సై నరేందర్రెడ్డిపై చెన్నబోయిన రమేశ్ అనే వ్యక్తి గల్లా పట్టి దాడి చేశాడు. పోలీసులు అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. పరీక్షించగా.. తాగినట్లు గుర్తించారు. అదే సమయంలో అధికార పార్టీ నేతను స్టేషన్కు ఎలా తీసుకెళ్తారు? అంటూ రాజకీయ ఒత్తిడి మొదలైంది. దీంతో తిమ్మాపూర్ సర్కిల్, సీపీ కార్యాలయం ఉన్నతాధికారులు ఈ ఘటన విషయంలో చేతులెత్తేశారు. సాక్షాత్తూ సీసీ కెమెరా ఫుటేజీ ఉన్నా.. కేసు నమోదు చేయలేదు. సాక్షాత్తూ పోలీసులపై సామాన్యుడు దాడి చేసినా ప్రతిఘటించలేని స్థితికి చేరుకున్నామని వాపోయారు.దాడి చేస్తే.. విధులకు ఆటంకం కేసేంటి?ఘటనను సాక్షిలో శనివారం ‘ఖద్దర్’నాక్ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరీంనగర్ పోలీసులతో మాట్లాడారు. స్పందించిన సీపీ అదే సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇది కేవలం తూతూ మంత్రపు కేసు కావడం మరో చర్చకు దారితీస్తోంది. ఎస్సై గల్లా పట్టుకుని, చేతులతో కొడితే.. ఆయనపై దాడి కేసు పెట్టకుండా కేవలం విధులకు ఆటంకం కలిగించాడని కేసు పెట్టడం.. ఉన్నతాధికారులు తలొగ్గిన తీరుకు నిదర్శనమని కిందిస్థాయి పోలీసులు విమర్శిస్తున్నారు. ఘటన జరిగినా ఉన్నతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం, మీడియా ఎత్తిచూపితే తప్ప కేసు నమోదు చేసుకోలేని దయనీయ స్థితి ఎదురవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దుబాయ్: మెరీనా టవర్పై ‘బాలిస్టిక్’ శకలాలు.. యూఏఈ అప్రమత్తం
దుబాయ్: గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు విస్తరిస్తున్న తరుణంలో దుబాయ్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, ఆ క్షిపణి శకలాలు దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన భవనంపై పడటంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భవనం పైభాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని అధికారులు గుర్తించారు.గల్ఫ్ రీజియన్లో ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతల భద్రతను మరింత పటిష్టం చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను యూఏఈ రక్షణ విభాగం గుర్తించింది. వీటిలో 15 క్షిపణులను, 119 డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూల్చివేసిన ఒక క్షిపణి శకలాలు దుబాయ్ మెరినాలోని ఒక టవర్ ఫాసాడ్పై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని దుబాయ్ ప్రభుత్వ మీడియా విభాగం తెలిపింది.యుద్ధ సంక్షోభం మొదలైన తర్వాత మొదటిసారిగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మనం ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నాం. ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారుతాం’ అని ఆయన దేశప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులపై విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశాలకు కలిగిన ఇబ్బందులకు ఆయన క్షమాపణలు తెలిపారు.తమపై దాడులు జరిగితే తప్ప, తాము ఏ పొరుగు దేశంపైకి క్షిపణులను ప్రయోగించబోమని ఇరాన్ స్టేట్ టీవీ వేదికగా ప్రకటించారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన 'బేషరతు లొంగుబాటు'ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్ అణు కార్యకలాపాలకు నిరసనగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్పై భారీ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ♦️ התקפת כטב"ם על מגדל רב הקומות בעיר דובאי pic.twitter.com/swNhyNGk4z— Asslan Khalil (@KhalilAsslan) March 7, 2026 -
స్కూల్ దగ్గర బాంబు దాడి.. విద్యార్థులు పరుగులు
-
నైజీరియాలో దారుణం.. 300 మంది అపహరణ
నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు. నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి ప్రాంతంపై దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.అయితే గత వారం రోజులుగా తరచుగా అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు. అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి. అక్కడ మైనింగ్పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది -
ఖమేనీని చంపిన నీలి పిచ్చుక.. దీని ప్రత్యేకత ఇదే
-
మార్క్ 48.. నిశ్శబ్ద మృత్యువు
అమెరికా నావికాదళం అమ్ములపొదిలోని మరో సముద్రగర్భ అస్త్రం విశేషాలు తాజాగా ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాని పేరు మార్క్48. జలాంతర్గామి నుంచి ప్రయోగించి ఈ టోర్పెడోకు అమెరికా నావికాదళం ‘మార్క్ 48’అనే పేరుపెట్టింది. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌకను కూల్చడం ద్వారా రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా ఒక శత్రునౌకను టోర్పెడోతో జలసమాధి చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించడంతో ఇప్పుడు మార్క్48పై చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నిశ్శబ్ద సేవ.. → అమెరికా నేవీ అ«దీనంలో సేవలందించే జలాంతర్గాముల్లో ప్రస్తుతం మార్క్ 48 టోర్పెడోలను ఉపయోగిస్తున్నారు. తొలిసారిగా 1972లో దీనిని తయారుచేశారు. తర్వాత పలుమార్లు నవీకరించారు. → ఇప్పుడు మార్క్48 ఏడీక్యాప్(అడ్వాన్స్డ్ కేపబిలిటీ) వేరియంట్ను వాడుతున్నారు. ఇందులో ఆధునీకరించిన ఎల్రక్టానిక్, గైడెడ్, ప్రొపల్షన్ వ్యవస్థలు ఉన్నాయి. → ఒక్కో టోర్పెడో 21 అడుగుల చుట్టుకొలతతో 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు ఏకంగా 1,700 కేజీలు. యాక్టివ్, పాసివ్ సోనార్లతో ఇది పనిచేస్తుంది. → ఆగి ఉన్న యుద్ధనౌకతోపాటు వేగంగా వెళ్తున్న యుద్ధనౌకలను ఇది లక్ష్యంగా చేసుకుని గురిచూసి పేల్చేయగలదు. → గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. ఒక్కో టోర్పెడో తయారీకి రూ.38.48 కోట్లు ఖర్చవుతుంది. → శత్రువుల నౌకలను ఎదురుగా ‘హల్’భాగాన్ని ఢీకొట్టకుండా అడుగు భాగానికి వెళ్లి ఢీకొట్టి పేలిపోతుంది. దీంతో నౌకఅడుగుకు భారీ రంధ్రం పడుతుంది లేదా ముక్కలు చెక్కలు అవుతుంది. దీంతో నౌక వేగంగా సముద్రజలాల్లో మునిగిపోతుంది. భారీ మందుగుండు పేలడంతో నౌక అడుగున ఒక పెద్ద గాలిబుడగ ఏర్పడుతుంది. దీంతో నౌక మరింత వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ పాక్షికంగా దెబ్బతిన్నా కీలక వ్యవస్థలు విఫలంకావడంతో ఎదురుదాడి చేయలేక చేతులెత్తేస్తుంది.. → గైడెన్స్ వైర్తో ఇది అనుసంధానమై ముందుకు దూసుకుపోతుంది. ఒకవేళ వైర్ తెగిపోయినా ఆటోమోడ్లో పనిచేస్తూ పని చక్కబెడుతుంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అల్గారిథమ్లతో ఇది పనిచేస్తుంది. అత్యంత లోతైన, సంక్లిష్టమైన సముద్ర జలాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది → అమెరికా నావికాదళంలోని లాస్ ఏంజెలెస్, సీఊల్ఫ్, ఒహాయో, వర్జీనియా తరగతి బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గాముల్లోనూ ఈ టోర్పెడోలను అమర్చారు → యుద్ధనౌకలతోపాటు శత్రుదేశ జలాంతర్గాములను వెంటాడి దాడిచేయగలదు → ‘శ్రీలంక సమీప సముద్రజలాల్లో ఉన్న ఇరాన్ యుద్ధనౌకపైకి కేవలం ఒక్క టోర్పెడోనే ప్రయోగించాం. భారీ యుద్ధనౌకను జలసమాధి చేయడానికి ఇలాంటి నిశ్శబ్ద మృత్యువు ఇదొక్కటి చాలు’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేన్ కెయిన్ వ్యాఖ్యానించారంటే దీని సామర్థ్యం ఏమిటో ఇట్టే తెల్సిపోతుంది → ముఖ్యంగా అణుఇంధనంతో నడిచే జలాంతర్గాములను నాశనం చేసేందుకు ఈ టోర్పెడోను డిజైన్చేశారు. → సోవియట్ రష్యా సాంకేతికతకు దీటుగా ఎంకే37, ఎంకే14, ఎంకే16 టోర్పెడోలను రిప్లేస్ చేస్తూ ‘ప్రాజెక్ట్ నోబాస్కా’లో భాగంగా దీనిని రూపొందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ పై నిప్పుల వర్షం.. అణు ప్రాజెక్ట్ ధ్వంసం
-
ఇరాన్ యుద్ధనౌకపై దాడి.. 87 మంది మృతి
-
ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి
కొలంబో: పశ్చిమాసియా యుద్ధజ్వాలలను అమెరికా దక్షిణాసియాకూ వ్యాపింపజేసింది. విశాఖపట్నంలో గత నెలలో అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి బయల్దేరిన ఇరాన్కు చెందిన యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై అమెరికా దాడిచేసింది. అమెరికా జలాంతర్గామి నుంచి దూసుకొచ్చిన టోర్పెడో ధాటికి ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌక మంగళవారం రాత్రి ముక్కలుచెక్కలై శ్రీలంక సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 87 మంది నావికాసిబ్బంది జలసమాధి అయ్యారు. పలువురు నావికుల జాడ గల్లంతైంది. నౌక మునిగిపోయాక లైఫ్జాకెట్లతో సముద్రజలాలపై ఈదుతున్న 32 మందిని సమీపంలోని శ్రీలంక నావికాదళాలు రక్షించాయి. గాయపడిన వారిని సమీప నగర ఆస్పత్రిలో చేరి్పంచారు. నౌకపై దాడి చేసింది తామేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. దాడి వివరాలను పెంటగాన్లోని రక్షణశాఖ కార్యాలయంలో మీడియాకు మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. ‘‘యుద్ధం వేళ హిందూ మహాసముద్ర జలాల్లో శత్రుదేశ యుద్ధనౌక జాడ కనిపెట్టాం. అందుకే టోర్పెడోతో దానిని నాశనంచేశాం. రెండో ప్రపంచయుద్దం తర్వాత శత్రువుల నౌకను జలాంతర్గామితో ధ్వంసంచేయడం ఇదే తొలిసారి’’అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక నైరుతి దిశలో గల్లే నగర సముద్ర తీరం నుంచి 75 కి.మీ.ల దూరంలో సముద్రజలాల్లో నౌక మునిగిపోతోందని, కాపాడాలని శ్రీలంక తీరగస్తీ దళాలకు బుధవారం ఉదయం 5.08 గంటలకు అత్యయిక సందేశం రాగానే వెంటనే శ్రీలంక తమ నావికాదళ నౌకలు, వాయుసేన విమానాలను ఘటనాస్థలికి పంపించింది. యుద్ధనౌకకు చెందిన కొందరు సిబ్బంది లైఫ్ జాకెట్లతో సముద్రజలాలపై కన్పించారు. గాయపడిన వారిని తొలుత శ్రీలంక నేవీ సదరన్ కమాండ్ ప్రధానకార్యాలయంలో చేర్పించారు. తర్వాత గాలె నగరంలోని కరపితియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. సముద్రజలాల నుంచి 87 మృతదేహాలను లంక నేవీ స్వా«దీనంచేసుకుంది. ‘‘మేం రక్షించిన 32 మందిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో ఏడుగురిని ఐసీయూలో చేర్పించాం. ఇతరులకు చిన్నపాటి గాయాలయ్యాయి’’అని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి ఎయిర్ వైస్మార్షల్ సంపథ్ థుయకొంతా చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలను శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్ పార్లమెంట్లో వెల్లడించారు. ‘‘ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 180 మంది ఉన్నారు. మన బలగాలు అక్కడికి చేరుకునేలోపే నౌక మునిగిపోయింది. గాయపడి ఈదుతున్న నావికులను బలగాలు కాపాడాయి’’అని మంత్రి చెప్పారు. ‘‘ఘటనాస్థలి వాస్తవానికి మా సముద్రజలాల పరిధిలో లేదు. కానీ గాలింపు, సహాయక చర్యలు చేపట్టే దూరం మాత్రం మా పరిధిలోనే ఉంది. అందుకే మేం స్పందించాం’’అని శ్రీలంక నావికాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఫిబ్రవరి మూడోవారంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 వైమానిక విన్యాసాల్లో ఇరాన్కు చెందిన ఈ మౌడ్జ్ తరగతి స్వదేశీ, వేగంగా వెళ్లే తేలికపాటి యుద్ధనౌక సైతం పాల్గొంది. ఐఆర్ఐఎస్ దేనా నౌకలో భారీ స్థాయిలో గన్లతోపాటు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, యాంటీ–íÙప్ మిస్సైళ్లు, టోర్పెడోలు ఉన్నాయి. దీని మీద హెలికాప్టర్ను ల్యాండ్చేయొచ్చు. దీనికి తోడుగా ఐఆర్ఐఎస్ మక్రాన్ అనే మరో చిన్న నౌక అంతర్జాతీయ జలాల్లో పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించేది. అయితే ఉక్రెయిన్లో జనావాసాలపై దాడులకు ఉపయోగించిన మారణాయుధాలను ఈ నౌకల్లోనే రష్యాకు సరఫరాచేశారన్న ఆరోపణలపై వీటిపై అమెరికా ఆర్థికశాఖ 2023 ఫిబ్రవరిలో ఆంక్షలు విధించింది. ఇరాన్ నౌకలను నాశనంచేయడమే తమ లక్ష్యమని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ సారథి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వ్యాఖ్యానించారు. -
యూఏఈపై డ్రోన్ల దాడి.. పదుల సంఖ్యలో గాయాలు
UAEపై గడిచిన కొద్ది గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు ప్రకటించాయి. వాటితో పాటు నాలుగు బాలిస్టిక్ మిసైల్స్ దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడులలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని 78 మందికి గాయాలైనట్లు తెలిపింది. అమెరికాపై కోపంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతుంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తుంది. అయితే దాడులలో రక్షణ స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాలపైనా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై గడిచిన కొన్ని గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను చాలా మాట్టుకు గాలిలోనే కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులలో 78 మంది ప్రజలు గాయపడ్డారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. క్షతగాత్రులలో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నట్లు సమాచారం. వారిలో భారతీయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు యుఎఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలెవ్వలరూ ఇండ్లనుంచి బయిటకి రావొద్దని కిటీకిల నుంచి దూరంగా ఉండాలని సూచించింది. -
ఇరాన్ షిప్ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన షిప్పై సబ్ మెరైన్ అటాక్తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం 85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్పై యుఎస్, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది. గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం -
స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు.. 20 మంది అరెస్ట్
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 20 మందని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రెండు స్పా సెంటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో అరెస్టైన 20 మందిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. -
తీవ్రస్థాయికి యుద్ధం.. దూసుకెళుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ తమ ప్రాంతాలను నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై పదాతిదళాల ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఆపరేషన్ వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్గా దక్షిణ లెబనాన్లోకి దూసుకెళుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్ దాడులే చేసిందని అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్పై మండిపడ్డారు. ఇరాన్ ప్రతి సారి అబద్ధం చెబుతోంది. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.ఇరాన్ సుప్రీం ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇరాన్కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్ నావికాదళాన్ని తుడిచిపెట్టిందని ఇక ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని వాటిని చేధించడం అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్గా మారిందన్నారు. అయితే ఇరాన్ సైతం తీవ్రమైన ప్రతి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా విరుచుకపడుతుంది. -
‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించిన కీలక ఆధారంగా భావిస్తున్న ఒక 'గోప్రో' (GoPro) కెమెరా మూలాలను వెతుక్కుంటూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పుడు చైనా గడప తొక్కేందుకు సిద్ధమయ్యింది. నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో పాటు స్థానికుడొకరు ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు నిర్వహించిన రేక్కీ, వారి కదలికలకు సంబంధించిన దృశ్యాలు 'గోప్రో హీరో 12 బ్లాక్' కెమెరాలో నిక్షిప్తమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో ఆ పరికరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు చైనా ప్రభుత్వానికి ‘లెటర్ రోగేటరీ’ పంపేందుకు జమ్ము కోర్టు ‘ఎన్ఐఏ’కు అనుమతినిచ్చింది.దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ తొలుత నెదర్లాండ్స్లోని గోప్రో తయారీ సంస్థను సంప్రదించగా, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఆ నిర్దిష్ట సీరియల్ నంబర్ గల కెమెరాను చైనాకు చెందిన ‘ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థకు సరఫరా చేసినట్లు తయారీదారు తెలిపారు. అంతేకాకుండా ఈ పరికరం 2024, జనవరి 30న చైనాలోని డాంగ్గువాన్ ప్రాంతంలో యాక్టివేట్ అయినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలిసింది. అయితే ఆ తర్వాత ఆ కెమెరా ఎవరి చేతులు మారింది? అంతిమంగా ఉగ్రవాదుల వద్దకు ఎలా చేరింది? అనే వివరాలు తమ వద్ద లేవని సదరు సంస్థ పేర్కొంది. దీంతో ఆ కెమెరాను కొనుగోలు చేసిన వ్యక్తి, దాని వినియోగదారుడు, దానికి సంబంధించిన సాంకేతిక రికార్డులను సేకరించేందుకు చైనా అధికారుల న్యాయ సహాయం తప్పనిసరని ఎన్ఐఏ భావిస్తోంది.భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఈ పహల్గాం దాడి అనంతరం భారత్ అత్యంత కఠినంగా స్పందించింది. గత ఏడాది మే 7వ తేదీ తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి, శత్రువుల నెట్వర్క్ను దెబ్బతీసింది. ఈ దాడులకు ప్రధాన కారకులైన సులైమాన్ షా, హమ్జా అఫ్గానీ అలియాస్ అఫ్గాన్, జిబ్రాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను దాచిగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఇది కూడా చదవండి: నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి! -
ఇరాన్ విధ్వంసం.. దుబాయ్ అతలాకుతలం
-
ఖమేనీ హత్యపై ఇరాన్ ప్రతీకారం.. రంగంలోకి హిజ్బుల్లా, హౌతీలు
-
మూడో ప్రపంచ యుద్ధం? రంగంలోకి ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ
-
టెన్షన్ టెన్షన్.. దుబాయ్ లో ఎమర్జెన్సీ..
-
పేట్రేగుతున్న పేకాట గ్యాంగ్
కందుకూరు రూరల్: రాష్ట్రవ్యాప్తంగా పేకాట రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఓ సర్పంచ్పై పేకాట నిర్వాహకులు దాడికి తెగబడిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. పలుకూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఓ బడ్డీ కొట్టు నిర్వాహకుడి ఆధ్వర్యంలో స్థానిక పొలాలు, కుంటల సమీపంలో నిత్యం పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. పేకాట శిబిరానికి వచ్చేవారికి పి.జయరాం అనే వ్యక్తి అవసరమైన సరంజామా ఏర్పాటు చేస్తుంటాడు. ఈ క్రమంలో పోలీసులు ఇటీవల పేకాట నిర్వాహకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ చేశారు. ఆదివారం ఉదయం పేకాట నిర్వాహకుడికి చెందిన బడ్డీ కొట్టు వద్ద సర్పంచ్ వి.శ్రీనుకు జయరాంతో మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. పేకాట నిర్వహణపై పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటావని అనుమానిస్తూ సర్పంచ్పై దాడికి దిగాడు. దాడిలో సర్పంచ్కు గాయాలయ్యాయి. బ్లేడ్లతో గొంతు కోసి చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని సర్పంచ్ కోరుతున్నారు. టీడీపీకి చెందిన కొందరు కుట్రతోనే రెచ్చగొట్టి తనపై దాడికి ఉసిగొల్పారని సర్పంచ్ వాపోయారు. అయితే నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో పలుకూరులో పేకాట జోరుగా సాగుతోంది. గ్రామంలో రోజూ రూ.లక్షల్లో ఆట జరుగుతుండడంతో పేకాట నిర్వాహకుడితో పాటు స్థానిక నేతలకు భారీగా కమీషన్ ముడుతున్నట్లు సమాచారం. -
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఖతం: ట్రంప్
-
ఖమేనీ విగ్రహం కూల్చి.. డ్యాన్స్ లు చేస్తున్న ఇరానీయన్లు
-
అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి.. ఇరానియన్ల సంబరాలు..
-
ఇరాన్పై మొదలైన భీకర దాడులు: భారతీయులకు కీలక ఆదేశాలు
Israel Attack Iran ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్పై అనేక నగరాల్లో “ముందస్తు” వైమానిక దాడులను ప్రారంభించింది.రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఈ అమెరికా దాడులను ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై తాజా చర్చలతో తాను "సంతోషంగా లేను" అని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్ బెదిరింపులను నిలువరించేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హోమ్ ఫ్రంట్ కమాండ్ పౌరులను రక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉండాలని, బైటికి రావద్దని ఆదేశాలు జారీ చేశాయి.ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షాలలో పేలుళ్లు సంభవించాయని, టెహ్రాన్లోని రెండు ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయని దీంతో నగర కేంద్రంలో దట్టమైన పొగ కమ్ముకుందని పలు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. #WATCH | Tehran, Iran | Israel has launched a preventative missile attack against Iran, the Israeli defence minister said; visuals of the aftermath of the strike in Iran as a plume of smoke billows into the skyThe U.S. participated in the (Iran) attack and was also carrying out… pic.twitter.com/tzfR1WnDhO— ANI (@ANI) February 28, 2026అప్రమత్తంగా ఉండండిఈ దాడుల నేపథ్యంలో ఇండియా అక్కడి భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ అధికారులు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు ,సూచనలను భారతీయ పౌరులు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. -
దక్షిణ లెబనాన్పై.. ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా హిజ్బుల్లా తీవ్రవాదులు తరుచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్ లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్యంసమే టార్గెట్గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.అయితే ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యెమెన్లోని ప్రభుత్వ మద్ధతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు.దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించారు. వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్ ఫ్రంట్స్’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.మెుత్తంగా పశ్చిమాసియాలో పరిస్థితులు గంభీరంగా మారాయి. ఇటు వైపేమో ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడులకు సిద్ధమవుతుండగా మరో వైపేమే అమెరికా తన యుద్ధ నౌకలను ఇరాన్కు దగ్గరగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
వీధి కుక్కల దాడి.. బాలుడు మృతి
ముంబై: దేశవ్యాప్తంగా వీధి కుక్కల బీభత్సం నానాటికీ పెరుగుతుంది. సుప్రీంకోర్టు స్థానిక ప్రభుత్వాలు వీటిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు కనబడడం లేదు. తాజాగా మహారాష్ట్రలో రోడ్డుపై ఆడుకుంటున్న 7 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.థానే జిల్లాలోనే కళ్యాణ్ ప్రాంతంలో కుశిల్ శంకర్ వాఘే అనే 7సంవత్సరాల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అయితే ఇంతలోనే అక్కడే ఉన్న వీధికుక్కలు అతనిపై దాడి చేశాయి. ఇది గమనించిన అతని మిత్రుడు నిలేశ్ బాగ్లే పరిగెత్తుతూ వచ్చి అతనిని కాపాడే యత్నం చేశాడు. అయితే ఆ కుక్కలు ఆ బాలుడిపై కూడా దాడి చేశాయి.దీంతో ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన వారి తల్లిదండ్రులు వెంటనే వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు అధికంగా కావడంతో కుశిల్ అనే బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రస్తుతం నిలేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.అయితే ఈ ఘటనపై ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందన్నారు. అక్కడి ప్రజలపై తరచుగా దాడులకు తెగబడుతన్నాయన్నారు. స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మరోసారి భీకరంగా మారింది. నిన్న గురువారం రాత్రి ఆ దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు సమాచారం.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఇరు దేశాల మధ్య ఓ వైపు శాంతి చర్చలకు అవకాశం ఉందంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకపడింది. ఆదేశంలోని రైల్వే, ఎనర్జీ సెక్టార్ లక్షంగా దాడులు జరిపింది. ఈ అటాక్స్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా పెద్ద ఎత్తున భవనాలు నెలకొరిగాయి.అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. తమ దేశంపై 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందన్నారు. వాటిలో 374 డ్రోన్లను, 32 మిస్సైల్స్ను, 5 క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకాయన్నారు. రష్యా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వారిలో పిల్లలు అధికంగా ఉన్నారని జెలెన్స్కీ పేర్కొన్నారు. -
ఆ దాడి చేసింది మేమే.. BLA ప్రకటన
బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్ సైనిక దళాలపై జరిగిన దాడికి BLA దే బాధ్యత అని ప్రకటించింది. బలూచిస్థాన్నికి స్వతంత్ర్యం కల్పించేంతవరకూ ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.ఫిబ్రవరి 22న అలహాబాద్ ప్రాంతంలోని మాచ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై మెరుపుదాడి జరిగింది. ఈ అటాక్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యతని BLA ప్రకటించింది. పాక్ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని BLA స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు.అయితే అంతకుముందు బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. BLA ఆర్మీకి వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
మెక్సికో డ్రగ్ డాన్ మెంచో హతం.. ఇదీ మా విజయమే: ట్రంప్
మెక్సికో సిటీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు స్వర్గధామమైన మెక్సికోలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అధినేత నెమెసియో రూబెన్ ఒసెగుయెరా సెర్వాంటిస్ అలియాస్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం పక్కా వ్యూహంతో దాడి చేసి హతమార్చింది. సొంత రాష్ట్రం జలిస్కోలోని తపల్పా పట్టణంలో ఎల్ మెంచో దాక్కున్నాడని అమెరికా ఇచ్చిన కాస్తంత నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన మెక్సికో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ అ«దీనంలోకి తెచ్చుకుంది. అతను పారిపోకుండా రహదారులను కాలిపోతున్న వాహనాలతో దిగ్బంధించింది. సైన్యం మెరుపుదాడితో వెనువెంటనే అప్రమత్తమైన మెంచో అనుచరులు అత్యంత అధునాతన ఆయుధాలతో సైనికులపైకి కాల్పులు జరిపారు. సైన్యం సైతం కాల్పులతో దీటుగా బదులిచ్చింది. ఈ హోరాహోరీ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని విమానంలో సమీప సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఎల్ మెంచో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెంచోతోపాటు మరో ఆరుగురు డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. మరో ఇద్దరిని అరెస్ట్చేశారు. ఆయుధాలతో నిండిన వాహనాలను, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను సైన్యం స్వా«దీనం చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 30 మంది నేర అనుమానితులు సైతం చనిపోయారని మెక్సికో సిటీ పోలీస్ చీఫ్ ఒమర్ గార్సియా హర్ఫNఛ్ చెప్పారు. మిచోవాకన్లో మరో నలుగురు చనిపోయారు. తమ బాస్ మరణించడంతో పట్టరాని ఆవేశంతో డ్రగ్స్ ముఠా సభ్యులు దేశంలో వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఆరు ఘటనల్లో మొత్తం 25 మంది నేషనల్గార్డ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మెంచో ఆట కట్టించినందుకు సైన్యాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ అభినందించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ ముఠాల ఆటకట్టించాలన్న ప్రజా డిమాండ్లు, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా నుంచి నిఘా సాయం తీసుకున్నారు. తమ ముఠా నాయకుడు చనిపోయాడన్న పట్టరాని ఆగ్రహంతో మాదకద్రవ్యాల ముఠా సభ్యులు పేట్రేగిపోయారు. వీధుల్లోకి వచ్చి దుకాణాలు, బ్యాంకులు, వాహనాలకు నిప్పుపెట్టారు. తపల్పా పట్టణంలో జరిగిన ఆపరేషన్లో ముఠా సభ్యులు జరిగిన నేషనల్గార్డ్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. పుయెర్టో వల్లాట్రాలోని జైలులో జైలు గార్డ్ను ఎల్ మెంచో అనుచరులు చంపేశారు. గ్వాడలజారాలో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయంపై దాడి చేసి ఒకరిని చంపేశారు. అమెరికాలోకి అక్రమంగా ఫెంటానిల్ మాదకద్రవ్యాన్ని సరఫరాచేస్తూ ఎల్ మెంచో అతిపెద్ద నేరం చేశాడని ట్రంప్ సర్కార్ గతంలోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎల్ మెంచో అరెస్ట్కు వీలుగా కీలక సమాచారం ఇచ్చిన వాళ్లకు ఏకంగా 1.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.136.35 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ మెంచో సారథ్యంలోని సీజేఎన్జీ ముఠాను విదేశీ ఉగ్రసంస్థగా ట్రంప్ సర్కార్ ఈనెలలోనే ప్రకటించింది. గతంలో వేరే డ్రగ్స్ ముఠాలో పనిచేసిన ఎల్ మెంచో 2009లో అందులోంచి బయటికొచ్చి సొంతంగా ‘ది జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్(సీజేఎన్జీ) పేరుతో కొత్తడ్రగ్స్ ముఠాను తయారుచేసి మాదకద్రవ్యాల అక్రమ సరఫరాతోపాటు బెదిరింపులు, హత్యలు, అపహరణల వంటి నేరాలకు పాల్పడ్డాడు. భారతీయులకు భారత సర్కార్ అడ్వైజరీ.. ముఠా సభ్యుల విధ్వంసం నేపథ్యంలో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ సోమవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘జలిస్కో రాష్ట్రంలోని పుయెర్టో వల్లాట్రా, ఛపాలా, గ్వాడలజారా సిటీలతోపాటు మిచోవాకన్, గుయెరియో, న్యూవో లియాన్ రాష్ట్రాల్లో ఉండే భారతీయులు ఘర్షణలు జరిగే వైపు వెళ్లకండి. తదుపరి నోటీస్ వచ్చేదాకా సురక్షిత ప్రాంతాలకే పరిమితంకండి. సైన్యం జాడలేని ప్రాంతాల్లో బయట తిరగకండి. మీ షెల్టర్లలోనే ఉండిపోండి. స్థానిక అధికారుల సూచనలను పాటించండి’’అని మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. మూడు దశాబ్దాలుగా మారణ హోమం 59 ఏళ్ల ఎల్ మెంచో పశి్చమ మెక్సికోలోని మిచోవకన్ రాష్ట్రంలో 1966లో అగిలిలా పరిధిలోని మారుమూల గ్రామంలో జని్మంచాడు. ఇతని కుటుంబం అవకాడో పంట సాగుచేసేది. ఐదో తరగతిలోనే బడి చదువు మానేసిన మెంచో టీనేజీలోనే అక్రమ గంజాయి పంట సాగుకు గార్డ్గా పనిచేసేవాడు. తర్వాత మెరుగైన జీవితం కోసం 1980 దశకంలో అక్రమంగా కాలిఫోరి్నయా రాష్ట్రంలోకి చొరబడ్డాడు. హెరాయిన్ సరఫరా చేస్తూ 1994లో అమెరికా పోలీసులకు దొరికిపోయాడు. మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మరో నేరం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు దేశబహిష్కరణ చేసి మెక్సికోకు తిప్పి పంపారు. 30 ఏళ్ల వయసులో స్వదేశం వచ్చాక పోలీస్బలగాల్లో పనిచేశాడు. అప్పుడు మాదకద్రవ్యాల ముఠాల గుట్టుమట్టు తెల్సుకుని ఉద్యోగం వదిలేసి మిలేనియో కార్టెల్లో చేరాడు. అక్కడే ముఠా నేతల్లో ఒకరి చెల్లిని పెళ్లాడి కీలక నేతగా ఎదిగాడు. తర్వాత కార్టెల్లో విభేదాలు, ముఠాపై సైన్యం దాడులతో వేరే ముఠాలతో చేతులు కలిపాడు. అవి రెండు ముక్కలవడంతో చివరకు సొంతంగా 2009లో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ను ఏర్పాటుచేసుకుని మెక్సికోలోనే అతిశక్తివంతమైన ముఠాల్లో ఒకటిగా దానిని విస్తరింపజేశాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లుచేసి సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. కొకైన్, మెథాంఫెటమైన్స్, ఫెంటానిల్ డ్రగ్స్తోపాటు శరణార్థులనూ అమెరికాలోకి తరలించాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై, తమ ముఠాపై దాడి చేయడానికి వచ్చిన సైన్యంపై ఏకంగా డ్రోన్లతో దాడిచేసేవాడు. బాంబుపేలుళ్లు జరిపించేవాడు. దొరక్కుండా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో దాక్కునేవాడు. 2015లో ఏకంగా సైనిక హెలికాప్టర్పై దాడిచేసి నేలమట్టంచేశాడు. ఆన్లైన్ ద్వారా ముఠా సభ్యులను చేర్చుకునేవాడు. ఇదీ మా విజయమే: ట్రంప్ ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపానని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ సోమవారం సైతం ఎం మెంచో మరణాన్ని సైతం తన విజయంగా అభివరి్ణంచుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం మహిళా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఎల్ మెంచోను హతమార్చడానికి మెక్సికో ప్రభుత్వానికి కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికాయే అందజేసింది. గతంలోనే మెంచో ముఠాను ట్రంప్ ఉగ్రసంస్థగా ప్రకటించి మంచిపని చేశారు. నార్కోటెర్రరిజానికి పాల్పడే వాళ్లకు తగిన శిక్ష వేస్తామని ట్రంప్ గతంలోనే పునరుద్ఘాటించారు’’అని ఆమె రాసుకొచ్చారు. దీంతో సంబరపడిన ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘మేం ఈ మధ్య చాలా విజయాలను సాధిస్తున్నాం. ఇది మరీ అతిశయోక్తిగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే’’అని రాసుకొచ్చారు. దీనిపై మెక్సికో ఆగ్రహం వ్యక్తంచేసింది. పలువురు నేషనల్గార్డ్ సభ్యుల ప్రాణత్యాగాల ఫలితంగానే మా ఆపరేషన్ విజయవంతమైంది. దాడికి అమెరికా కాస్తంత మాత్రమే నిఘా సమాచారం ఇచ్చింది. మిగతా పనంతా మేమే కష్టపడి పూర్తిచేశాం’’అని మెక్సికో కరాఖండిగా చెప్పేసింది. -
ట్రంప్ నివాసంలోకి చొరబాటుకు యత్నం.. సిబ్బంది కాల్పులు
ఫ్లోరిడాలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వెలుపల కాల్పులు జరిగాయి. ఆయుధంతో లోపలికి చొరబడడానికి ఓ దుండగుడు యత్నించగా అతనిపై సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపారు. అతనికి గాయాలపై అక్కడే కుప్పకూలారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.ఈ ఘటన అనంతరం అధ్యక్షుడి నివాసం ఎదుట భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రంప్ నివాస ప్రాంతం మార్-ఎ-లాగో పరిసరాలను FBI అదుపులోకి తీసుకుంది. దాడి నేపథ్యంలో ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే ట్రంప్ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడటానికి యత్నించాడనే కారణాలు తెలియాల్సి ఉంది. -
మరో రెండు రోజుల్లో అటాక్.. హింట్ ఇచ్చిన ట్రంప్
-
భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
-
Pakistan: ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాయువ్య ప్రావిన్స్ అయిన ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. బజౌర్ జిల్లా మామండ్ తహసీల్లోని మలంగి ప్రాంతంలోని భద్రతా దళాల చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన ఒక వాహనాన్ని ఆత్మాహుతి బాంబర్ నేరుగా చెక్పోస్టులోనికి పోనివ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందితో సహా కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆత్మాహుతి దాడి పేలుడుతోనే ముగిసిపోలేదు. బాంబు దాడి జరిగిన వెంటనే సాయుధ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ముందస్తు ప్రణాళికతో చేసిన భారీ ఆపరేషన్గా దీనిని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు తొమ్మిది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సామాన్య పౌరులు కూడా ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మలంగిలోని ఒక మదర్సా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, కార్యాలయాల కిటికీలు పగిలిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చ్టుటుముట్టిన సమయంలో కాల్పుల శబ్దాలు మిన్నంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)లాంటి సాయుధ గ్రూపులు ఖైబర్ పఖ్తున్ఖ్వా అంతటా భద్రతా బలగాలపై దాడులను తీవ్రతరం చేశాయి. గతంలో కూడా ఉత్తర వజీరిస్తాన్, పెషావర్ తదితర ప్రాంతాల్లో సైనిక కాన్వాయ్లు, పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులే జరిగాయి. ఇది కూడా చదవండి: కమల్ హాసన్కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
ఏనుగుల దాడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
రాంచీ: జార్ఖండ్ లోని హజీరా బాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ( శుక్రవారం) ఏనుగుల దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మరణించిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు.ఆ రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏనుగుల దాడులు తీవ్రతరమయ్యాయి. ఏనుగుల గుంపులు గ్రామంలోనికి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఒక ఎనుగుల గుంపు చుర్చూ బ్లాక్ ప్రాంతంలోని గోండ్వార్ గ్రామంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేశాయి. ఈ దాడులలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గాయపడ్డ ఆరుగురు ఈ రోజు ఉదయం మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇందులో ఒక చిన్నారి తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.గాయపడిన అధికారులలలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అక్కడి అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏనుగుల గుంపు దాడిలో ఆరుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు బోక్రో, రామ్ ఘర్, హాజ్రీబాగ్ జిల్లాలలో పర్యటిస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. బోక్రో జిల్లాలోనూ కొంతమందిపై గజరాజులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. -
ఏలికల ‘ఎలక’ట్టలేని నిర్లక్ష్యం
ఎ.కొండూరు: ఎలుకలు కరిచి 11 మంది విద్యార్థినులు గాయపడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో జరిగింది. విద్యార్థినులు బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో చిమట ప్రసన్న, కావూరి కళావతి, చావల కుమారితో పాటు మరో ఎనిమిది మందిని ఎలుకలు తీవ్రంగా కరిచాయి. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థినిలకు స్థానిక ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు తహసీల్దార్ అరవింద్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ కేశవరావు, జీసీడీఓ విశ్వభారతిని విచారణకు ఆదేశించారు. వారు విద్యాలయాన్ని సందర్శించి ఘటనపై విచారణ జరిపారు. నివేదికను కలెక్టర్, ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఎలుక కరిచిన విద్యార్థినులను గురువారం వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్సెల్ కార్యదర్శి నరెడ్ల వీరారెడ్డి తదితరులు పరామర్శించారు. కేజీబీవీలో సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల స్వాతిని వివరణ కోరగా విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన వాస్తవమేనన్నారు. మొత్తం 11 మందిని కరవగా వారికి టీటీ, ఏఆర్వీ వ్యాక్సిన్లు వేశామని వివరించారు. -
ప్రధానిపై దాడికి యత్నం.. మోదీ సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు
-
రష్యాలో భారతీయ విద్యార్థులపై దాడి
-
సీఐపై కత్తితో దాడి
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతంలో హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిపై మోస్ట్వాంటెడ్ క్రిమినల్ కావడి నాగేంద్ర కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆత్మరక్షణలో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. శుక్రవారం టేకులోడు అటవీప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి 2024లో చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీ నల్ల»ొమ్మనపల్లి వద్ద అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటనలో హిందూపురం పట్టణం గుడ్డం ప్రాంతానికి చెందిన కావడి నాగేంద్ర ప్రధాన నిందితుడు. బెయిల్పై బయటకు వచి్చన అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో అతను ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో హిందూపురం అప్గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ మూడు బృందాలుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హిందూపురం రూరల్ స్టేషన్ కానిస్టేబుల్ రవికి నిందితుడు నాగేంద్ర కనిపించడంతో అతను పట్టుకునేందుకు వెళ్లాడు. దీంతో నాగేంద్ర తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ రవిపై దాడి చేసి అడవిలోకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రవి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న సీఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని రవిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాగేంద్రను వెంబడిస్తూ అడవిలోకి వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక నాగేంద్ర కనిపించడంతో లొంగిపోవాలని సీఐ కోరినా అతను వినిపించుకోలేదు. పైగా పట్టుకునేందుకు వెళ్లిన సీఐపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ ఆంజనేయులు తన సర్వీసు రివాల్వర్తో నాగేంద్ర కాళ్లపై కాల్చడంతో అతను కింద పడిపోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు సీఐ ఆంజనేయులుతోపాటు, నిందితుడు నాగేంద్రను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రవి, సీఐ ఆంజనేయులు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చట్టప్రకారం శిక్షిస్తాం నిందితుడు కావడి నాగేంద్రకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నాగేంద్ర చేసిన దాడిలో గాయపడిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవీంద్రను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్పీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగేంద్ర 2024లో టేకులోడు ఫ్యాక్టరీ వద్ద అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అలాగే జిల్లాలో అతడిపై 41 కేసులు, కర్ణాటకలో 70 కేసులు నమోదైనట్లు తెలిపారు. అంతకుముందు ఆయన ఘటన జరిగిన టేకులోడు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. -
లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..
-
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
జాగ్రత్త..చైనా అటాక్ చేయవచ్చు: అమెరికా
చైనా విషయంలో భారత్కు అమెరికా కీలక సూచన చేసింది. డ్రాగన్ కంట్రీతో ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండడం మంచిదని హెచ్చరించింది. చైనా, భారత్పై ఏ క్షణానైన దాడికి తెగబడవచ్చని అమెరికా మెరైన్ ఇంటిలిజెన్స్ మాజీ అధికారి భారత్కు హెచ్చరిక జారీ చేశారు.అరుణాచల్ విషయంలో డ్రాగన్ కంట్రీ తరచుగా భారత్పై కయ్యానికి కాలు దువ్వుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమస్య అంత పెద్దగా లేదు. అయితే భవిష్యత్తులో చైనా, భారత్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ మెరైన్ ఇంటెలిజెన్స్ అధికారి గ్రాంట్ న్యుషామ్ భారత్ను హెచ్చరించారు.2049వరకూ చైనా తనను ప్రపంచంలోనే తనను సూపర్ పవర్గా స్థాపించుకోవాలనుకుంటుందని దానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించుకుంటుందని తెలిపారు. తైవాన్తో సమస్య ఉన్న సమయంలోనే అకస్మాత్తగా మరో దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్, దక్షిణకొరియా, జపాన్, ఫిలీప్పీన్స్ వంటి ప్రాంతాలపై అది దాడి చేయగలదని తెలిపారు. అందులోనూ భారత్ తొలిస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.దీనికోసం ఆయన చైనా, భారత్ మధ్య గతంలో జరిగిన గల్వాన్ లోయ వివాదాన్ని ప్రస్థావించారు. అయితే ప్రస్తుతం అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియా గోర్ అధ్యక్షుడు ట్రంప్కు సన్నిహితుడని ఆయనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరో మెట్టు ఎక్కుతాయని అన్నారు. కాగా ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధిస్తున్న అధిక పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
-
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్కు తరలించి లాకప్లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్డివిజన్లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదుకు తర్జనభర్జనలు... వైఎస్సార్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు క్రైమ్ నంబర్ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం. అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా.. అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్ టీమ్తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్ టీమ్తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు. -
అంబటి హత్యకు ప్లాన్.. కుట్ర బయటపెట్టిన స్వాతి చౌదరి
-
జోగి రమేష్ ఇంటిపై దాడికి వాట్సాప్ గ్రూప్ లో ప్లాన్ చంపడానికి TDP కుట్ర!
-
విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పాఠశాల మైదానంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుని తల్లి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.పాఠశాలలోని ఐదో తరగతికి విద్యార్థి, మూడో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కలిసి తన కుమారుడిపై దాడి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులైన విద్యార్థులు బాధితుడిని కిందకు తోసివేసి, అతని కళ్లపై, ముఖంపై బలంగా కొట్టారని బాధితుడి తల్లి ఆరోపించారు. ఈ దాడిలో ఆ బాలుని కళ్లకు తీవ్ర గాయాలై, చూపు కోల్పోయాడు. ప్రస్తుతం కమాండ్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించినప్పటికీ, వారు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి దాపురించిందని ఆమె ఆరోపించారు.దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ స్టాఫ్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో భద్రతా లోపాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు! -
మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు
-
అంబటిని లేపేస్తాం.. ముందే చెప్పిన పెమ్మసాని
-
కర్రలు, రాడ్లతో అంబటిపై దాడికి టీడీపీ గూండాలు యత్నం
-
GVMC టీడీపీ రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చజెండా
-
ఒప్పందం చేసుకోకుంటే మారణహోమమే
వాషింగ్టన్/బాగ్దాద్: బద్ధ శత్రువు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దాడుల హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల్లో వినియోగం కోసం కొనసాగిస్తున్న అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలని ఇరాన్కు సూచించారు. మాట వినకపోతే మారణహోమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ భారీ స్థాయిలో యుద్ధనౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహకనౌక ‘అబ్రహాం లింకన్’ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనెజువెలాలో మాదిరే ఆపరేషన్కు సిద్ధమవుతోంది. వెనెజువెలాలో తరహాలో మిషన్ను పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. అవసరమైతే వేగంగా, హింసాత్మకంగా పని పూర్తిచేస్తారు. ఇరాన్ త్వరగానే చర్చలకు ముందుకొస్తుందని ఆశిస్తున్నా. అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన పనిలేకుండానే సామరస్యంగా చర్చలు జరుపుదాం. సమయం మించిపోతోంది. ఇప్పటికైనా ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సిద్ధంగా ఉంది. ఇరాన్ వినాశనం తప్పదు. మేం చేసే తదుపరి దాడి దారుణంగా ఉంటుంది. అలా జరక్కుండా చూసుకోండి’’ అని ట్రంప్ హెచ్చరించారు. దాడులు చేస్తామని భయాందోళనలు ఓవైపు పెంచుతూ మళ్లీ చర్చలకు కూర్చోవాలంటే కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ట్రంప్ పైవిధంగా మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం. -
సొంత సైనికులకు.. రష్యా చిత్ర హింసలు
కీవ్: ఈ చిత్రాలు చూస్తున్నారు కదా? మైనస్ డిగ్రీల చలిలో నగ్నంగా.. అర్ధనగ్నంగా.. తలకిందులుగా చెట్లకు కట్టేసిన ఈ యువకులు ఏదో ఘరానా నేరం చేసిన వారు కాదు. వారు రష్యన్ సైనికులు. వారిని దండిస్తోంది కూడా రష్యన్ సైన్యమే..! కారణం చాలా చిన్నది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాల్గొనేందుకు వీరు నిరాకరించారు. దీన్ని తీవ్ర ధిక్కరణగా భావించిన పుతిన్ సర్కారు.. కఠిన చర్యలకు ఆదేశించింది. అంతే.. రష్యన్ సైన్యం అమానవీయంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పలువురు సైనికుల బట్టలను విప్పి.. చెట్లకు కట్టేసి.. నోట్లో మంచు ముక్కలను పెట్టి.. చిత్ర హింసలకు గురిచేస్తోంది. ఇలా హింసతో సైనికులను తమ దారికి తెచ్చుకుంటోంది పుతిన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.A Russian commander is “teaching” his subordinates military discipline in the Russian armyThis time, new recruits were tied upside down to a tree as punishment for abandoning their combat positions out of fear of being killed. pic.twitter.com/RDSmCqBn9M— Visegrád 24 (@visegrad24) January 26, 2026వెలుగులోకి వచ్చిన వీడియోల్లో రష్యా సైన్యంలో జరుగుతున్న కఠిన శిక్షా విధానాలు బయటపడ్డాయి. కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, మంచు తినమని బలవంతం చేస్తున్న వీడియోలు బయటకు రావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, రష్యా సైన్యంలో అంతర్గత పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రష్యా కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, శిక్షగా మంచు తినమని బలవంతం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు రష్యా సైన్యంలో ఉన్న కఠినమైన శిక్షా విధానాలను బయటపెడుతున్నాయి.ఈ ఘటనలు రష్యా సైన్యంలో క్రమశిక్షణ పేరుతో జరుగుతున్నాయని సమాచారం. సైనికులు ఆదేశాలను పాటించకపోవడం, లేదా చిన్న తప్పులు చేసినా ఇలాంటి శిక్షలు విధిస్తున్నారని తెలుస్తోంది. చెట్లకు కట్టేసిన సైనికులు తీవ్ర చలిలో వణికిపోతూ, మంచు తినడం ద్వారా అవమానకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ఈ వీడియోలు బయటకు రావడంతో, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు కూడా మానవులేనని, వారికి ఇలాంటి అమానుష శిక్షలు విధించడం మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యంలో ఒత్తిడి పెరిగినప్పటికీ, ఇలాంటి శిక్షలు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. సైనికులను శిక్షించడానికి ఇలాంటి అమానుష పద్ధతులు ఉపయోగించడం, రష్యా సైన్యంలో ఉన్న అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తోంది.ఈ వీడియోలు బయటకు రావడంతో, రష్యా సైన్యం అంతర్జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతోంది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో, సైనికులపై ఇలాంటి శిక్షలు విధించడం రష్యా సైన్యం యొక్క కఠినమైన, క్రూరమైన వైఖరిని చూపిస్తున్నాయి. -
బట్టలు విప్పి.. చెప్పుకోలేని చోట కూటమి పాలనలో దళితులపై దాష్టీకం
-
మహిళా కానిస్టేబుల్ పై గంజాయి ముఠా దాడి
-
ఇంటిపన్ను కోసం వెళ్లిన అధికారిని తరిమికొట్టిన TDP అభిమాని
-
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్లో అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని భారత అధికారులు, వారి కుటుంబాలు వెంటనే అక్కడినుంచి దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో హిందు దేవాలయాలు, వ్యక్తులే టార్గెట్గా ఇంతకాలం దాడులు జరిగాయి. అవి కొద్ది మేర సద్దుమణుగుతాయనే సమయంలోనే అక్కిడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీని దుండగులు హతమార్చడంతో అక్కడి మతఛాందస వాదులు విరుచుకపడుతున్నారు. హిందువులే టార్గెట్గా దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ ప్రస్థావన వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత అధికారులు వారి కుటుంబసభ్యులు వెంటనే మాతృ దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది." ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా భారత అధికారులు వారి కుటుంబసభ్యులు స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది". అని అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తగ్గేంత వరకూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశంలో వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై దాడులు పెరుగుతున్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి..
పామూరు (మార్కాపురం) : మానవత్వం మంటగలిసేలా ఓ ఆటోడ్రైవర్ను అమానుషంగా ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరులో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్ శనివారం వివరాలు వెల్లడించారు. పీసీ పల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి శుక్రవారం సాయంత్రం ఆటోలో నిమ్మకాయలు వేసుకుని పామూరు వస్తున్నాడు.బొట్లగూడూరు సెంటర్కు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పక్కన నిలబడి ఉండగా తప్పించే క్రమంలో ఆటో తగిలింది. దీంతో బైక్ వద్ద ఉన్న మద్దినేని తిరుపతయ్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటో నడుపుతున్న మహర్షితో గొడవపడి కిందకు దించేశారు. ఆటో అద్దాలు పగులగొట్టి మహర్షిని తాడుతో ఇనుప స్తంభానికి కట్టేసి కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహర్షిని విడిపించి పామూరుకు తీసుకొచ్చి చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు పంపారు.అనంతరం క్షతగాత్రుడు మహర్షి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన కమ్మ ప్రసాదు, రేగలగడ్డ నాగేశ్వరరావు, దొడ్డోజి హరికృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, కోటపాటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన మిగిలిన వారిని కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆరుగురినీ తహసీల్దార్ వద్ద బైండోవర్ చేస్తామని తెలిపారు. మరోవైపు బొట్లగూడూరులో పోలీస్ నిఘా ఏర్పాటుచేశారు. సీఐ, ఎస్సైతోపాటు 10 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
కారు పైకెక్కించి.. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై కారు ఎక్కించాడు. ఈ ఘటన అక్కడి మతఛాందసవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలను భారత్ ఎంతగా ఖండించిన అక్కడి మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం మైనారిటీలపై దాడుల అంశం ప్రస్థావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ మరోసారి హిందూ యువకునిపై దాడి జరిగింది.డైలీ స్టార్ కథనం ప్రకారం.. రిపోన్ సోహ అనే హిందూ యువకుడు అక్కడి స్థానిక పెట్రోల్బంక్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అక్కడికి ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి రూ. 3,710 డిజీల్ వాహనంలో కొట్టించాడు. దీంతో అతనిని డబ్బులు చెల్లించాలని ఆ అడిగాడు. దీనికి అతను నిరాకరించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సోహ వాహనం ఎదుట నిలుచున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అతనిపైనుంచి వాహనాన్ని నడిపాడు. దీంతో రిపోన్ సోహా అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాహానాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. కాగా ఆవాహనం NCP పార్టీకి చెందిన మాజీ నేత అబుల్ హషీంకు చెందినదిగా గుర్తించిట్లు పోలీసులు తెలిపారు.బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై అక్కడి మానవహక్కుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మైనార్టీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా భయాందోళనలకు గురిచేసేందుకే అక్కడి అల్లరి మూకలు ఈ దాడులు జరుపుతున్నట్లు హుమన్రైట్స్ కమిషన్ ఆరోపిస్తుంది. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 7.95 శాతం కోటి 14 లక్షల మంది ఉన్నారు. కాగా వచ్చేనెలలో బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.


