breaking news
Attack
-
కరకట్ట ప్యాలెస్ కిరాతకం.. దాడికి సహకరించిన ఓ పోలీసు అధికారి
-
టీడీపీ చేతిలో ఖా‘కీలు బొమ్మలు’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడంతోపాటు ఆయనపై హత్యాయత్నం జరిగిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలై ఆ పార్టీ అధిష్టానం చెప్పినట్టు నడుచుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గోరంట్ల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు గోరంట్ల చిల్లీస్ సెంటర్లో కర్రలు, మారణాయుధాలతో కాపుగాశారు. అంబటి రాంబాబు వాహనాన్ని అడ్డుకుని కారు మీద చేతులతో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందనాదేవి అయితే ‘‘నువ్వు మొగోడివి అయితే రారా’’అంటూ అంబటిని రెచ్చగొట్టారు. మారణాయుధాలతో తెలుగుదేశం నేతలు పెద్ద సంఖ్యలో గుమిగూడినా వారిని నియంత్రించడంలో నల్లపాడు సీఐ వంశీధర్ విఫలమయ్యారు.పైగా టీడీపీ నేతలకు కొమ్ముగాశారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రతిస్పందన రాకుండా తెలుగుదేశం మూకలకు రక్షణగా నిలబడ్డారు. పైగా అంబటి వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా దాడి.. అంబటిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అతిగా స్పందించారు. రాంబాబుకు 24 గంటల్లో తామేంటో సినిమా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు నల్లపాడు సీఐ వంశీధర్ సిద్ధార్ధనగర్లోని అంబటి ఇంటికి వెళ్లి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయితే నోటీసు ఇవ్వకుండానే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు అంబటి ఇంటి వద్ద ఎంతమంది ఉన్నారో గమనించి వెళ్లి టీడీపీ నేతలకు ఉప్పందించారని సమాచారం.ఈ నేపథ్యంలో అంబటిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో మీడియా అక్కడికి చేరుకుంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులూ తరలివచ్చాయి. సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త లంకా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి అంబటిని ‘‘నా కొడకా రా..రా.. చెప్పుతో కొడతా’’అంటూ దుర్భాషలాడింది. దీనికి వైఎస్సార్సీపీ మహిళా నాయకులు ప్రతిస్పందించారు. టీడీపీ కార్యకర్తను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లంకా మాధవిని అక్కడి నుంచి తప్పించారు. అప్పటికే వ్యూహాత్మకంగా పశ్చిమఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు, అబ్బూరి మల్లి, ఇతర కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి ఇంటికి చేరుకుని ఒక్కసారిగా మారణాయుధాలు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటికే పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వందమందికిపైగా పోలీసులు అక్కడ మోహరించినా.. వారిని అడ్డుకునే యత్నం చేయకుండా చోద్యం చూశారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు అనే టీడీపీ దివ్యాంగుల విభాగం నేత మైక్ సెట్తో వచ్చి ‘‘బయటకు రారా నా కొడకా’’అంటూ అంబటిపై బూతుపురాణం లంకించుకున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులే! సీఐలు గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ అధికారపార్టీ తొత్తులేనని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గతంలో పలుమార్లు వైఎస్సార్సీపీ ర్యాలీలు, సభలను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబుతో వాగ్వాదానికీ దిగారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం అంబటిని ఇబ్బంది పెట్టాలనే వ్యూహరచన చేశారని వైఎస్సార్సీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నాయి. పక్క సబ్ డివిజన్ స్టేషన్లో ఆ సీఐకి ఏం పని?ఉదయం టీడీపీ నేతలు అంబటిపై దాడికి యత్నించిన ప్రదేశం గోరంట్ల చిల్లీస్ సెంటర్ నల్లపాడు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా అంబటిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను శనివారం రాత్రి 10.30 గంటలకు నల్లపాడు స్టేషన్కు తరలించి లాకప్లో పెట్టారు. నల్లపాడు గుంటూరు సౌత్ సబ్డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అంబటిని కలవకుండా ఉండేలా ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి లాకప్లో నిద్రపోతున్న అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పైఅంతస్తుకు పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్తోపాటు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లూ ఉన్నారని స్వయాన అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చారు. గంగా వెంకటేశ్వర్లు, వంశీధర్ ఇద్దరూ తనను గోడకు ఆనించి కూర్చోబెట్టి రెండు కాళ్లు చీల్చి ఇబ్బందికి గురి చేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లుకు సౌత్ సబ్డివిజన్లోని నల్లపాడు స్టేషన్లో ఏం పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటిరాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.అయితే, దాడికి పాల్పడిన, పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుతోపాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటిఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జి, మరికొందరు... అంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. కేసు నమోదుకు తర్జనభర్జనలు... వైఎస్సార్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జనభర్జనల అనంతరం రాత్రి 11.45 గంటలకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు క్రైమ్ నంబర్ 43 /2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే... పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నీరు గార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి, భర్త రామచంద్రరావు పేర్లకు బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ప్రసాద్ అలియాస్ బుజ్జి మరి కొంతమంది.. అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులను ఏ1, ఏ–2గా కేసు నమోదు చేసే వరకూ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.కాగా, అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని, క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం. అంబటి ఇంటి వద్ద పోలీసుల హైడ్రామా.. అంబటి రాంబాబు ఇంటి వద్ద మంగళవారం పోలీసులు హైడ్రామా నడిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న నేపథ్యంలో... మంగళవారం సాయంత్రం అంబటి ఇంటి వద్ద క్లూస్ టీమ్తో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించిన మూడు రోజుల తర్వాత వచ్చి అంబటి ఇంటి వద్ద పగిలిన కుండీలు, విరిగిపోయిన ఫర్నిచర్, ధ్వంసమైన కార్లను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీనికి అంబటి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో తూతూ మంత్రంగా క్లూస్ టీమ్తో పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్థల పరిశీలనలో కార్లు, ఫర్నిచర్, అద్దంతో కూడిన కిటికీలు ధ్వంసమైనట్లు గుర్తించామని చెప్పారు. అంబటి కార్యాలయాన్ని తగలబెట్టిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు, దుత్తలూరులో టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు మంగళవారం మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు. -
అంబటి హత్యకు ప్లాన్.. కుట్ర బయటపెట్టిన స్వాతి చౌదరి
-
జోగి రమేష్ ఇంటిపై దాడికి వాట్సాప్ గ్రూప్ లో ప్లాన్ చంపడానికి TDP కుట్ర!
-
విద్యార్థుల దాడి.. చూపు కోల్పోయిన బాలుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పాఠశాల మైదానంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుని తల్లి కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.పాఠశాలలోని ఐదో తరగతికి విద్యార్థి, మూడో తరగతి చదువుతున్న మరో విద్యార్థి కలిసి తన కుమారుడిపై దాడి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులైన విద్యార్థులు బాధితుడిని కిందకు తోసివేసి, అతని కళ్లపై, ముఖంపై బలంగా కొట్టారని బాధితుడి తల్లి ఆరోపించారు. ఈ దాడిలో ఆ బాలుని కళ్లకు తీవ్ర గాయాలై, చూపు కోల్పోయాడు. ప్రస్తుతం కమాండ్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించినప్పటికీ, వారు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కుమారుడికి ఈ పరిస్థితి దాపురించిందని ఆమె ఆరోపించారు.దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ స్టాఫ్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో భద్రతా లోపాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు! -
మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు
-
అంబటిని లేపేస్తాం.. ముందే చెప్పిన పెమ్మసాని
-
కర్రలు, రాడ్లతో అంబటిపై దాడికి టీడీపీ గూండాలు యత్నం
-
GVMC టీడీపీ రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చజెండా
-
ఒప్పందం చేసుకోకుంటే మారణహోమమే
వాషింగ్టన్/బాగ్దాద్: బద్ధ శత్రువు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దాడుల హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల్లో వినియోగం కోసం కొనసాగిస్తున్న అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలని ఇరాన్కు సూచించారు. మాట వినకపోతే మారణహోమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ భారీ స్థాయిలో యుద్ధనౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహకనౌక ‘అబ్రహాం లింకన్’ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనెజువెలాలో మాదిరే ఆపరేషన్కు సిద్ధమవుతోంది. వెనెజువెలాలో తరహాలో మిషన్ను పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. అవసరమైతే వేగంగా, హింసాత్మకంగా పని పూర్తిచేస్తారు. ఇరాన్ త్వరగానే చర్చలకు ముందుకొస్తుందని ఆశిస్తున్నా. అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన పనిలేకుండానే సామరస్యంగా చర్చలు జరుపుదాం. సమయం మించిపోతోంది. ఇప్పటికైనా ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సిద్ధంగా ఉంది. ఇరాన్ వినాశనం తప్పదు. మేం చేసే తదుపరి దాడి దారుణంగా ఉంటుంది. అలా జరక్కుండా చూసుకోండి’’ అని ట్రంప్ హెచ్చరించారు. దాడులు చేస్తామని భయాందోళనలు ఓవైపు పెంచుతూ మళ్లీ చర్చలకు కూర్చోవాలంటే కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ట్రంప్ పైవిధంగా మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం. -
సొంత సైనికులకు.. రష్యా చిత్ర హింసలు
కీవ్: ఈ చిత్రాలు చూస్తున్నారు కదా? మైనస్ డిగ్రీల చలిలో నగ్నంగా.. అర్ధనగ్నంగా.. తలకిందులుగా చెట్లకు కట్టేసిన ఈ యువకులు ఏదో ఘరానా నేరం చేసిన వారు కాదు. వారు రష్యన్ సైనికులు. వారిని దండిస్తోంది కూడా రష్యన్ సైన్యమే..! కారణం చాలా చిన్నది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాల్గొనేందుకు వీరు నిరాకరించారు. దీన్ని తీవ్ర ధిక్కరణగా భావించిన పుతిన్ సర్కారు.. కఠిన చర్యలకు ఆదేశించింది. అంతే.. రష్యన్ సైన్యం అమానవీయంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పలువురు సైనికుల బట్టలను విప్పి.. చెట్లకు కట్టేసి.. నోట్లో మంచు ముక్కలను పెట్టి.. చిత్ర హింసలకు గురిచేస్తోంది. ఇలా హింసతో సైనికులను తమ దారికి తెచ్చుకుంటోంది పుతిన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.A Russian commander is “teaching” his subordinates military discipline in the Russian armyThis time, new recruits were tied upside down to a tree as punishment for abandoning their combat positions out of fear of being killed. pic.twitter.com/RDSmCqBn9M— Visegrád 24 (@visegrad24) January 26, 2026వెలుగులోకి వచ్చిన వీడియోల్లో రష్యా సైన్యంలో జరుగుతున్న కఠిన శిక్షా విధానాలు బయటపడ్డాయి. కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, మంచు తినమని బలవంతం చేస్తున్న వీడియోలు బయటకు రావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో, రష్యా సైన్యంలో అంతర్గత పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రష్యా కమాండర్లు తమ సైనికులను అర్ధనగ్నంగా చెట్లకు కట్టేసి, శిక్షగా మంచు తినమని బలవంతం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోలు రష్యా సైన్యంలో ఉన్న కఠినమైన శిక్షా విధానాలను బయటపెడుతున్నాయి.ఈ ఘటనలు రష్యా సైన్యంలో క్రమశిక్షణ పేరుతో జరుగుతున్నాయని సమాచారం. సైనికులు ఆదేశాలను పాటించకపోవడం, లేదా చిన్న తప్పులు చేసినా ఇలాంటి శిక్షలు విధిస్తున్నారని తెలుస్తోంది. చెట్లకు కట్టేసిన సైనికులు తీవ్ర చలిలో వణికిపోతూ, మంచు తినడం ద్వారా అవమానకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ఈ వీడియోలు బయటకు రావడంతో, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు కూడా మానవులేనని, వారికి ఇలాంటి అమానుష శిక్షలు విధించడం మానవ హక్కుల ఉల్లంఘన అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యంలో ఒత్తిడి పెరిగినప్పటికీ, ఇలాంటి శిక్షలు సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. సైనికులను శిక్షించడానికి ఇలాంటి అమానుష పద్ధతులు ఉపయోగించడం, రష్యా సైన్యంలో ఉన్న అంతర్గత సమస్యలను బహిర్గతం చేస్తోంది.ఈ వీడియోలు బయటకు రావడంతో, రష్యా సైన్యం అంతర్జాతీయ స్థాయిలో విమర్శల పాలవుతోంది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో, సైనికులపై ఇలాంటి శిక్షలు విధించడం రష్యా సైన్యం యొక్క కఠినమైన, క్రూరమైన వైఖరిని చూపిస్తున్నాయి. -
బట్టలు విప్పి.. చెప్పుకోలేని చోట కూటమి పాలనలో దళితులపై దాష్టీకం
-
మహిళా కానిస్టేబుల్ పై గంజాయి ముఠా దాడి
-
ఇంటిపన్ను కోసం వెళ్లిన అధికారిని తరిమికొట్టిన TDP అభిమాని
-
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్లో అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మృతితో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని భారత అధికారులు, వారి కుటుంబాలు వెంటనే అక్కడినుంచి దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో హిందు దేవాలయాలు, వ్యక్తులే టార్గెట్గా ఇంతకాలం దాడులు జరిగాయి. అవి కొద్ది మేర సద్దుమణుగుతాయనే సమయంలోనే అక్కిడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీని దుండగులు హతమార్చడంతో అక్కడి మతఛాందస వాదులు విరుచుకపడుతున్నారు. హిందువులే టార్గెట్గా దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ ప్రస్థావన వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత అధికారులు వారి కుటుంబసభ్యులు వెంటనే మాతృ దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది." ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా భారత అధికారులు వారి కుటుంబసభ్యులు స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది". అని అధికారులు పేర్కొన్నారు.బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు తగ్గేంత వరకూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశంలో వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై దాడులు పెరుగుతున్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి..
పామూరు (మార్కాపురం) : మానవత్వం మంటగలిసేలా ఓ ఆటోడ్రైవర్ను అమానుషంగా ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరులో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్ శనివారం వివరాలు వెల్లడించారు. పీసీ పల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి శుక్రవారం సాయంత్రం ఆటోలో నిమ్మకాయలు వేసుకుని పామూరు వస్తున్నాడు.బొట్లగూడూరు సెంటర్కు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పక్కన నిలబడి ఉండగా తప్పించే క్రమంలో ఆటో తగిలింది. దీంతో బైక్ వద్ద ఉన్న మద్దినేని తిరుపతయ్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆటో నడుపుతున్న మహర్షితో గొడవపడి కిందకు దించేశారు. ఆటో అద్దాలు పగులగొట్టి మహర్షిని తాడుతో ఇనుప స్తంభానికి కట్టేసి కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహర్షిని విడిపించి పామూరుకు తీసుకొచ్చి చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు పంపారు.అనంతరం క్షతగాత్రుడు మహర్షి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన కమ్మ ప్రసాదు, రేగలగడ్డ నాగేశ్వరరావు, దొడ్డోజి హరికృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, చల్లా శ్రీనివాసులు, కోటపాటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన మిగిలిన వారిని కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆరుగురినీ తహసీల్దార్ వద్ద బైండోవర్ చేస్తామని తెలిపారు. మరోవైపు బొట్లగూడూరులో పోలీస్ నిఘా ఏర్పాటుచేశారు. సీఐ, ఎస్సైతోపాటు 10 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
కారు పైకెక్కించి.. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై కారు ఎక్కించాడు. ఈ ఘటన అక్కడి మతఛాందసవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలను భారత్ ఎంతగా ఖండించిన అక్కడి మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం మైనారిటీలపై దాడుల అంశం ప్రస్థావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ మరోసారి హిందూ యువకునిపై దాడి జరిగింది.డైలీ స్టార్ కథనం ప్రకారం.. రిపోన్ సోహ అనే హిందూ యువకుడు అక్కడి స్థానిక పెట్రోల్బంక్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అక్కడికి ఎస్యూవీ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి రూ. 3,710 డిజీల్ వాహనంలో కొట్టించాడు. దీంతో అతనిని డబ్బులు చెల్లించాలని ఆ అడిగాడు. దీనికి అతను నిరాకరించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సోహ వాహనం ఎదుట నిలుచున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అతనిపైనుంచి వాహనాన్ని నడిపాడు. దీంతో రిపోన్ సోహా అక్కడికక్కడే మృతిచెందాడు.ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాహానాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. కాగా ఆవాహనం NCP పార్టీకి చెందిన మాజీ నేత అబుల్ హషీంకు చెందినదిగా గుర్తించిట్లు పోలీసులు తెలిపారు.బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై అక్కడి మానవహక్కుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మైనార్టీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా భయాందోళనలకు గురిచేసేందుకే అక్కడి అల్లరి మూకలు ఈ దాడులు జరుపుతున్నట్లు హుమన్రైట్స్ కమిషన్ ఆరోపిస్తుంది. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 7.95 శాతం కోటి 14 లక్షల మంది ఉన్నారు. కాగా వచ్చేనెలలో బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త కన్నుమూత
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సాల్మన్పైనే కేసు!సాల్మన్ మృతి చెందిన విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని మండిపడ్డారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటికి వెళ్లిపోయాయి. సాల్మన్ కూడా బయటే బతుకుతున్నాడు. టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడిన కోమాలోకి వెళ్లిన సాల్మన్పైనే కేసు పెట్టారు. ఈ కేసులో సీఐ పనికిమాలిన సెక్షన్స్ పెట్టాడు. రేపు పిన్నెల్లిలోనే సాల్మన్ అంత్యక్రియలు జరిపి తీరుతాం. చంద్రబాబు, లోకేష్లు మీడియా ముందు నీతులు చెప్పడం కాదు.. పిన్నెల్లి అంశంపై మాట్లాడండి అంటూ మహేష్ రెడ్డి హితవు పలికారు. -
నిన్ను బతకనీయను.. కార్యకర్త తలపై ఇనుప రాడ్డుతో టీడీపీ నేత దాడి
-
విశాఖ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి
-
బంగ్లాదేశ్లో మరో దారుణం
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవలే ఇస్లాం వ్యతిరేఖ ఆరోపణలతో పలువురు హిందు మతానికి చెందిన వ్యక్తులుపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా సునాంఘంజ్ అనే జిల్లాలో జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై దాడి చేసి అనంతరం విషం ఇచ్చి చంపినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతుంది ఇటీవల అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మృతితో హిందువులపై తిరిగి మెుదలైన దాడులు ఏమాత్రం శాంతించడం లేదు. గడిచిన 40 రోజుల్లోనే 12 మంది హిందువులు హత్యకు గురయ్యారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులకు స్పష్టమైన కారణం ఏమి లేకపోయినప్పటికే.. అక్కడి మత ఛాందసవాదులు హిందువులే టార్గెట్గా దాడులు జరుపుతున్నారనేది కాదనలేని సత్యంఈ నేఫథ్యంలో హత్యలను భారత్ పలుమార్లు ఖండించింది మైనార్టీలపై దాడులు అరికట్టాలని కోరింది. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయి సంతాపం ప్రకటించారు.పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి మతఛాందస వాదులు విద్వేశాన్ని చిమ్మడం ఆపడం లేదు. తాజాగా సునాంఘంజ్ జిల్లాలో జోయ్ మాహాపాత్ర అనే హిందూ యువకునిపై అక్కడి అల్లరిమూకలు దాడి చేశాయి. అతనిని తీవ్రంగా కొట్టి అనంతరం విషం ఇచ్చాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాపాత్రను ఉస్మానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 2026 ప్రారంభమై పదిరోజుల కూడా కాకముందే బంగ్లాదేశ్లో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు. నూతన సంవత్సర వేడుకల వేళ షరియత్ పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిపై దాడిచేసి చంపారు. జనవరి 5న హిందూ వార్త సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చిచంపారు. అనంతరం నర్సింగి జిల్లాలో వ్యాపారి మణి చక్రవర్తి ప్రాణాలు తీశారు. తాజాగా మహాపాత్ర అనే యువకుడిని విషం ఇచ్చి చంపారు. బంగ్లాదేశ్లో ఇంత పెద్దఎత్తున హిందువులపై దాడులు జరగడం భారత్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. -
పాకిస్థాన్లో హిందూ రైతు దారుణహత్య
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న ఓ హిందు రైతుని సర్ఫరాజ్ నిజామని అనే భూస్వామి కాల్చిచంపారు. దీంతో అక్కడి మైనార్టీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. భారత్లోమైనార్టీల హక్కులు కాలరాస్తున్నారని అక్కడి విదేశాంగశాఖ మంత్రి ప్రసంగించిన మరుసటి రోజే అక్కడి ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ఇస్లామిక్ అధిపత్యం ఉన్న దేశాలలో హిందువులపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రస్థాయిలో హింస చేలరేగింది. అక్కడి స్టూడెంట్ లీడర్ మృతితో అక్కడి మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. ఇస్లాం వ్యతిరేక ప్రచారాల నెపం మోపి అనేక మందిపై దాడి చేసిం చంపారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే తాజాగా పాకిస్థాన్లో మరోసారి హిందూ రైతుని కాల్చిచంపారు.సింధూ ప్రావిన్సూకు చెందిన సర్ఫరాజ్ నిజమని అనే భూస్వామికి చెందిన భూమిని కైలాస్ కోల్హి అనే హిందూ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు. రెండురోజుల క్రితం కైలాస్ కోల్హి ఛాతిపై సర్ఫరాజ్ కాల్పులు జరిపాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రైతు మృతితో పాకిస్థాన్లోని మైనార్టీలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి" అని ఆయన అన్నారు. కైలాస్ కోల్హిపై ఎందుకు కాల్పులు జరిపారో అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి, నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి." అని ఆయన అన్నారు. కాగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలని తొలగించే పనులలో భాగంగా టర్కీగేట్ వద్ద ఫైజ్-ఇ-ఇలాహి మసీదు సమీపంలోని కట్టడాలను తొలగించారు.దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ భారత్లో మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారంటూ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మైనార్టీలపై తరచుగా దాడులు చేసే దేశానికి ఈ వ్యాఖ్యలు చేసే హక్కులు లేదని విమర్శించింది. Badin SindhThe protest for the arrest of the killers of the martyred Kalash Kolhi is making history.Shiva Kachhi, Chairman of Pakistan Darawar Ittehad @PItehad is leading the historic protest sit-in.This was not just a protest—it was the cry of a wounded conscience.From… pic.twitter.com/uo9io9PAk0— Shiva Kachhi (دراوڙ)🇵🇰 (@FaqirShiva) January 9, 2026 -
దాడి చేసిన వారిని వదిలేసి గాయపడ్డ వారిపై కేసులు
-
అమెరికా దాడిలో 100 మంది మృతి
కరాకస్: గత శనివారం శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంపై విచక్షణారహితంగా బాంబులేసి అధ్యక్షభవనంలో చొరబడి అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను ఎత్తుకెళ్లిన అమెరికా బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారని వెనెజువెలా అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సారథ్యంలోని వెనెజువెలా ప్రభుత్వం ఈ మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. తమ అధ్యక్షుడిని అమెరికా సైన్యం చేతికి చిక్కకుండా రక్షించుకునే క్రమంలో మదురో అంగరక్షకుల్లో చాలా మంది వీరమరణం పొందారని వెనెజువెలా అధికారులు ప్రకటించారు. ‘‘ అమెరికా మెరుపుదాడి వేళ మా సైన్యం, అమెరికా సైనికుల మధ్య జరిగిన కాల్పులు, ఘర్షణాత్మక వాతావరణంలో మదురో కాలికి గాయమైంది. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ తలకు బలమైన గాయమైంది’’ అని అంతర్గత మంత్రి డియాస్డాడో క్యాబెల్లో చెప్పారు. వెనెజువెలా ఆర్మీ ఇప్పటికే 23 మంది మృతుల పేర్లను తమ వెబ్సైట్లో ప్రచురించడం తెల్సిందే. వెనెజువెలా సైనిక, పౌర అవసరాలు తీర్చేందుకు ఆ దేశానికి పంపించిన తమ సైనికులు 32 మంది చనిపోయారని క్యూబా ఇప్పటికే ప్రకటించింది. మరణించిన తమ సైనికుల అంత్యక్రియలను వెనెజువెలా సైన్యం బుధవారం కరాకస్ నగరంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నేషనల్ గార్డ్ సభ్యులు, మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, వందలాది మంది స్థానికులు దారిపొడవునా మృతులకు ఘననివాళులర్పించారు. మృతులను స్మరిస్తూ అధ్యక్షురాలు డెల్సీ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ‘‘ వెనెజువెలా ఏనాటికీ శత్రుదేశం ఎదుట తలవంచదు. ఘన చరిత్ర, వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ దేశమూ ఆ పనిచేయదు’’ అని మంత్రి క్యాబెల్లో వ్యాఖ్యానించారు. -
తల్లీ కూతుళ్ల మధ్య చిచ్చు పెట్టి దాడి చేసిన టీడీపీ నేత
-
మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !
-
ఘోరం.. గ్రామస్థులపై కాల్పులు 30 మంది మృతి
నైజీరియాలో ఘోరం జరిగింది. అక్కడి ఓ గ్రామంపై క్రిమినల్ గ్యాంగులు విరుచుకపడ్డాయి. గ్రామస్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారి ఇళ్లను దగ్ధం చేశాయి. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మంది పౌరులు మృతిచెందారు. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు. నైజీరియా దేశంలోని నార్త్ నైజిర్ రాష్ట్రంలో కసువాన్జీ గ్రామంలోని ప్రజలపై శనివారం సాయంత్రం దోపిడి దొంగలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారి ఇళ్లను తగలబెట్టారు. అక్కడి దుకాణాలను లూటీ చేసి, పిల్లలను ఆడవారిని అపహరించారు. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించగా వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.అపహరించిన వారికోసం గాలింపులు చేపడుతున్నామని దాడులు జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బలగాలను మెహరించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే దాడులు జరుగుతున్న సమాచారం పోలీసులకు తెలిపామని అయినప్పటికీ సరైన సమయానికి వారు అక్కడికి చేరుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా నైజిరియాలో చాలాకాలంగా గ్యాంగ్ దాడుల కాల్పులు, పిల్లలు, ఆడవారి అపహరణ చాలా కామన్గా మారింది. ఉత్తర నైజిరియాలో పేదరికం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి యువత క్రిమినల్ గ్యాంగులలో చేరుతూ దోపిడీ అపహరణలు జీవన ఆధారంగా మలుచుకుంటున్నారు. పిల్లలను, ఆడవారికి అపహరించి రాన్సమ్ ( విడుదలకు చెల్లించే డబ్బు) డిమాండ్ చేస్తున్నారు. -
థాయ్ మసాజ్కు వెళ్లాడు.. తన్నులు తిన్నాడు
థాయిలాండ్లో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఓ భారత పర్యాటకున్ని అక్కడి ట్రాన్స్జెండర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.థాయిలాండ్లోని పట్టాయాలో 52 ఏళ్ల రాజ్ జసూజా అనే భారత పర్యాటకుడిపై అక్కడి ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా దాడిచేశారు. డిసెంబర్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ జసూజా అక్కడి ట్రాన్స్ జెండర్ల సర్వీసుకు వారు అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు.దీంతో ఆగ్రహం చెందిన సెక్స్ వర్కర్స్ కారు లోంచి అతనిని లాగి పడేశారు. అనంతరం అతని తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దాడిని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.అయితే థాయిలాండ్లోని పట్టాయాలో ఇటువంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్లో ఇండియన్ టూరిస్ట్పై అక్కడి సెక్స్ వర్కర్ దాడి చేశాడు. అక్టోబర్లో ముగ్గురు ట్రాన్స్ మహిళలు హోటల్లో ఉన్న ఇద్దరు భారతీయులపై దాడి చేసి వారి వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లారు. -
మోదీజీ పాక్పై అటాక్ చేయండి: అసదుద్దీన్
వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్పై దాడి చేయాలన్నారు. అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని సూచించారు. అమెరికా ఆ పని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్మైండ్గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్కు ప్రత్యేక బలగాలను పంపండి. 26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు" అని అసదుద్దీన్ అన్నారు.అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్స్ట్రైక్స్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే. -
వెనిజువెలా ఘటన.. భారత్ రియాక్షన్ ఇదే..!
వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలోని ఇండియా ఎంబసీ అక్కడి భారతీయులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపింది.శుక్రవారం వెనిజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు జరిపింది. ఆ దేశంలోని కరాకస్ నగరంపై మిసైళ్లతో విరుచుకపడింది. సైనికస్థావరాలు, జనావాసాలపై పెద్దఎత్తున దాడులు చేసింది. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్నూ బందీలుగా పట్టుకొని న్యూయార్క్ తరలించింది. అయితే తాజాగా భారత్ ఈ ఘటనపై స్పందించింది. వెనిజువెలాపై దాడి చేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై భారత్ స్పందిస్తూ... "ప్రస్తుతం వెనిజువెలాలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న పరిస్తితులను భారత్ నిశితంగా గమనిస్తుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి" అని భారత్ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు భారత్ పూర్తి మద్ధతు అందిస్తుందని తెలిపింది.అదేవిధంగా వెనిజువెలా, కారకస్లోని ఇండియా ఎంబసీ అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. ఎవైనా సమస్యలుంటే వెంటనే అక్కడి రాయభార కార్యాలయాన్ని సంప్రదించాలని అక్కడి భారత ప్రజలకు సూచించింది. -
YSRCP జడ్పీటీసీపై హత్యాయత్నం.. చూస్తుండగానే కర్రలు, రాడ్లతో దాడి
-
పాక్ ఆర్మీపై దాడి: 15మంది మృతి
బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ దాడులను తీవ్రతరం చేసింది. దీంతో ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.ఇటీవల పాక్పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్ప్లోసివ్స్తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.1948లో పాక్లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది. -
Australia: బాండీ బీచ్ ఘటన మరువకముందే..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో యూదు సమాజం లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆ దేశంలోని శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నాయి. సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే, మెల్బోర్న్లో మరో విద్వేషపూరిత ఘటన వెలుగుచూసింది. హనుక్కా పండుగ గుర్తు ఉన్న ఒక కారుపై దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఇంటి డ్రైవ్వేలో పార్క్ చేసి ఉన్న కారుపై జరిగిన ఈ దాడిని యూదు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, గత రెండేళ్లుగా పెరుగుతున్న యూదు వ్యతిరేకతే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.డిసెంబర్ 14న బాండీ బీచ్ సమీపంలోని యూదుల సమావేశంపై జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మందికి పైగా గాయపడ్డారు. 1996 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన అత్యంత భయంకరమైన కాల్పుల ఘటనగా దీనిని అధికారులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ తండ్రీకొడుకులు మారుమూల ప్రాంతాల్లో ముందస్తుగా తుపాకీ ప్రాక్టీస్ చేసినట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.ఈ విపత్కర పరిస్థితులపై ఆస్ట్రేలియన్ జ్యూయిష్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మత విద్వేషాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెల్బోర్న్ కారు దహనం వెనుక మతపరమైన కోణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, స్థానిక యూదు సమాజం మాత్రం తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూదు వ్యతిరేక సంక్షోభం ఆస్ట్రేలియాలో ఒక సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు.కాగా ఈ దాడుల సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన వారిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ఒక కొత్త ‘జాతీయ ధైర్యసాహసాల అవార్డు’ను ప్రకటించారు. అసాధారణ ధైర్యం ప్రదర్శించిన పౌరులు, అత్యవసర సేవా సిబ్బందికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి; ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక -
చిన్నారిపై పిట్బుల్ దాడి, ఎలా విడిపించాడో చూడండి వైరల్ వీడియో
పెట్ యానిమల్స్ని పెంచుకోవడమే కాదు.వాటిని సరియైన పద్ధతిల్లో నియంత్రించడం కూడా తెలిసి ఉండాలి యజమానులకు. మరీ ముఖ్యంగా పిట్ బుల్ లాంటి పెంపుడు కుక్కల్ని పెంచుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చిన్న పిల్లలు, వృద్ధులు ప్రమాదంలో పడతారు. ఫలితంగా యజమానులకు కూడా చట్టపరమైన తిప్పలు తప్పవు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారు.న్యూయార్క్ వీధుల్లో ఒక పిట్ బుల్ ఒక పసిపిల్లవాడిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క క్షణం ఆ పసివాడి తల్లి గుండ్లో రైళ్లు పరుగెట్టిందింది. కానీ అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న వారు స్పందించడంతో ఆ పసివాడికి ప్రాణా పాయం తప్పింది.A pit bull attacked a toddler on the streets of New York, but luckily a bystander was quick enough to choke the dog before it could do further harm the child.😳 pic.twitter.com/Yh6btEwVVm— Rain Drops Media (@Raindropsmedia1) December 23, 2025ట్విటర్లో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ దక్కించుకున్న ఈ వీడియో ప్రకారం పిట్ బుల్ డాగ్ పిల్లవాడి కాలును గట్టిగా దొరకబుచ్చుకుంది. నలుగురు వ్యక్తులు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కూడా, ఎంతకీ వదలకుండా పట్టుపట్టింది. దీంతో వారిలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ కుక్కను గొంతు పట్టుకుని గాలి ఆడకుండా చేయడంతో అది నోటి తెరిచి పట్టువీడింది. దీంతో మరింత గాయం కాకుండా పిల్లవాడి కాలును తప్పించుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కుక్క కరచినపుడు ఎలా ప్రవర్తించాలో, కచ్చితంగా అదే చేశాడు. హీరో అంటూ అతని చర్యను కొనియాడటం విశేషం. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
బంగ్లాలో మరో ఘాతుకం.. హిందూ కుటుంబంపై దాడి
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
సీఐపై కత్తితో యువకుడు దాడి
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్నగర్కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు. చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్.. వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్ను పట్టుకోవాలని సవాల్గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్చాడు.ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు. అజయ్పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్ సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్పై ఇటుకలపల్లి పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. -
స్టార్లింక్ శాటిలైట్లకు రష్యా ముప్పు
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.దాని పేరు జీరో ఎఫెక్ట్అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి. ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు. ‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. దీంతో స్టార్లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.పొడవు మిల్లీమీటర్!‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం. మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్ఎస్, తియాంగ్ స్పేస్స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది. -
అనంతపురంలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపారు. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పైలట్ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్పోర్టులోని సెక్యూరిటీ పాయింట్ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎయిర్పోర్టులోని టెరి్మనల్–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పైలట్ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్కు గురైందని అంకిత్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ప్రయాణికులపై స్మోక్ బాంబులు, కత్తితో దుండగుడు దాడి
-
బీచ్ అటాక్.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు
ఆస్ట్రేలియా బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్ మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్కు, స్విమ్మింగ్కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది. అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్బర్గ్- అల్- మురాద్ ఇనిస్టిట్యుూట్లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది. -
TDP బరితెగింపు.. వల్లభనేని వంశీని కలిశారని చావగొట్టారు
-
జనసేన కార్యకర్తను చితకబాదిన టీడీపీ నేతలు
-
అమరులకు ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంట్పై ఉగ్రమూకలు విరుచుకుపడి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై జరిగిన ఆ భయానక దాడిలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాస్వామ్య దేవాలయాన్ని రక్షించుకున్న వీర జవాన్లను యావత్ దేశం స్మరించుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో అమరవీరులకు ఘన నివాళులరి్పంచారు. ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్లోకి చొరబడేందుకు యతి్నంచగా పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులు వారిని నిలువరించారు. ఉగ్రవాదులెవరినీ లోపలికి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్ సిబ్బంది, ఒక తోటమాలి, టీవీ జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ భవన ప్రాంగణంలోనే మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఉపరాష్ట్రపతి, మోదీ, రాహుల్, సోనియా నివాళి పార్లమెంట్ హౌస్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. ధైర్యసాహసాలకు సలాం: ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ’2001లో పార్లమెంట్పై జరిగిన దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరులను దేశం నేడు స్మరించుకుంటోంది. ఆనాడు వారు చూపిన ధైర్యం, అప్రమత్తత, కర్తవ్య దీక్ష అమోఘం. సంక్షోభ సమయంలో వారు ప్రదర్శించిన తెగువకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరుకు పునరంకితమవుదాం: రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ’2001లో పార్లమెంట్ను రక్షించుకునే క్రమంలో ప్రాణాలరి్పంచిన వీరనాయకులకు దేశం సెల్యూట్ చేస్తోంది. వారి త్యాగం మన జాతీయ భావనను ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. అమరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా పునరంకితమవుదాం’అని సందేశం ఇచ్చారు. కమలేష్ కుమారికి సీఆర్పీఎఫ్ నివాళి ఉగ్రవాదులను అడ్డుకోవడంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి, మరణానంతరం ’అశోక చక్ర’పురస్కారం అందుకున్న సీఆరీ్పఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారికి సీఆరీ్పఎఫ్ ప్రత్యేక నివాళులర్పించింది. ఆమె చూపిన తెగువ ’సదాస్మరణీయం’అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతి సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని తిప్పికొట్టిన వీరుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
పచ్చ నేతల దాడిపైన ఆలయ పూజారి ఆవేదన
-
ఒంటరి మహిళపై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
ఎయిర్బస్ ‘ఏ320’పై సౌరదాడి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ఎయిర్బస్ సంస్థ తయారుచేసిన ఏ320 మోడల్ విమానంపై సోలార్ రేడియేషన్ దాడి చేయడం, తద్వారా సాంకేతిక సమస్య తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్బస్ సంస్థ సూచన మేరకు భారత్లోని విమానయాన సంస్థలు ఏ320 విమానాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం శనివారం ప్రారంభించాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఏ320 విమానాలను ఉపయోగిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సమాచారం ప్రకారం.. దేశంలో 338 ఏ320 మోడల్ విమానాలు ఉండగా, 270 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయ్యింది. అయితే, ఈ ప్రక్రియ కారణంగా వందలాది ఏ320 విమానాలు 60 నుంచి 90 నిమిషాలపాటు ఆలస్యంగా నడిచాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన నాలుగు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకల్లా అన్ని విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తవుతుందని, తర్వాత విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా విమానాశ్రయాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతటా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 8,100 వరకు ఏ320 మోడల్ విమానాలు ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో దాదాపు 6,000 విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరమని గుర్తించారు. కొన్నింటికి హార్డ్వేర్ కూడా మార్చాల్సి ఉందని అంటున్నారు. ఎయిర్బస్ సూచన మేరకు సంబంధిత విమానయాన సంస్థలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. శుక్రవారం, శనివారం ప్రపంచమంతటా ఏ320 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలావరకు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వారాంతంలోనే ఈ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 5,000 విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రెడేషన్ పూర్తయ్యిందని, అవి తిరిగి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, సాధారణ పరిస్థితి నెలకొందని ఎయిర్ బస్ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన విమానాల్లో సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. అసలేం జరిగింది? అక్టోబర్ 30న మెక్సికో నుంచి అమెరికాలోని న్యూజెర్సీకి బయలుదేరిన జెట్బ్లూ ఎయిర్బస్ ఏ320 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. విమానం ప్రయాణిస్తున్న ఎత్తు హఠాత్తుగా తగ్గిపోయింది. ఏడు సెకండ్ల వ్యవధిలో విమానం 100 అడుగుల మేర వేగంగా కిందికి దిగింది. దాంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని దారి మళ్లించి, అమెరికాలో ఫ్లోరిడా తీరంలోని తంపా ఎయిర్పోర్టులో అత్యవసరంగా దించారు. సోలార్ రేడియేషన్ కారణంగా విమానంలో ఎలివేటర్, ఎలిరాన్ కంప్యూటర్(ఈఎల్ఏసీ) వ్యవస్థలో మార్పులు వచి్చనట్లు గుర్తించారు. అందుకే విమానం హఠాత్తుగా కిందికి దిగినట్లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ320 మోడల్ విమానాల్లో ఇలాంటి సమస్యే ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో తక్షణమే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని ఎయిర్బస్ సంస్థ శుక్రవారం సూచించింది. లేకపోతే ఫ్లైట్ కంట్రోల్కు సంబంధించిన డేటా సోలార్ రేడియేషన్ వల్ల తారుమారయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై డీజీసీఏ వెంటనే స్పందించింది. భారత విమానయాన సంస్థలకు శనివారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్బస్ సంస్థ నెదర్లాండ్స్ లో రిజిస్టర్ అయ్యింది. కానీ, ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ. ఏ320 అనేది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న విమానం. -
TDP నేతల నుంచి నాకు ప్రాణహాని! అంగన్వాడీ హెల్పర్ సెల్ఫీ వీడియో
-
YSRCP నేత తల్లిదండ్రులపై దుండగులు దాడి
-
రాజ్యాంగంపై నిరంతరం దాడి
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ నిరంతరం దాడి చేస్తూ దాని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్ర లేదని ఖర్గే బుధవారం ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అణచివేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముందుకు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రాజ్యాంగం అనేది పేదలకు ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని సహించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. ఈ దాడిని ఎదుర్కోవడానికి తాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటానని స్పష్టంచేశారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, గౌరవం, న్యాయం చేకూర్చడమే రాజ్యాంగం ఇస్తున్న హామీ అని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. -
26/11 "ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు"
26/ 11 సరిగ్గా 17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యావత్ దేశం విషాదంతో నిండిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై పాక్ ఉగ్రమూకలు విరుచుకపడ్డది ఈ రోజే. అమాయకులైన ప్రజలపై కాల్పులు జరుపుతూ 166 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఉగ్రదాడినుంచి తృటిలో తప్పించుకున్న దీవిక అనే బాధితురాలు ఆరోజు చేదు జ్ఞాపకాల్ని నేషనల్ మీడియాతో పంచుకున్నారు.నవంబర్ 26 సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. పాకిస్థాన్ నుంచి సముద్రమార్గం ద్వారా భారత్ వచ్చిన 10మంది ఉగ్రవాదులు హోటల్ తాజ్, ఒబెరాయ్, ఛత్రపతి మహారాజ్ టర్మినల్ రైల్వేస్టేషన్లలో చొరబడి అమాయక ప్రజలపై విచ్చల విడిగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ప్రత్యక్ష బాధితురాలైన దీవిక మాట్లాడుతూ "ఆరోజు కసబ్ కాల్పులు జరుపుతున్న సమయంలో కసబ్ మోహంలో ఏమాత్రం భయం కనిపించలేదు. కాల్పులు జరుపుతూ ఆనందిస్తున్నాడు. ఆ మోహం ఇప్పటికీ నాకళ్లేదుటే మెదులుతుంది. ఆ కాల్పుల ఘటనను కళ్లారా చూసాను. నాకళ్లేదుటే చాలా మంది చనిపోయారు. ఆ రాత్రిని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. ప్రతి రోజు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నాను" అని ఆ భయానక రోజును గుర్తు చేసుకుంటూ ఆమె ఆవేదనకు లోనయ్యారు. కోర్టులో కసబ్ ను గుర్తించడానికి వెళ్లినప్పుడు కసబ్ ను గుర్తించే ప్రయత్నంలో తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కానీ తాను ఆ రోజు కాల్పులు జరిపింది కసబ్ అని తేల్చి చెప్పానని అన్నారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300కు పైగా ప్రజలు గాయపడ్డారు. ఆరోజు జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఈ రోజు నివాళులర్పిస్తారు. ముంబై ఉగ్రదాడిలో మిగతా ఉగ్రవాదులంతా భారత బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించగా అజ్మల్ కసబ్ ఒక్కరే ప్రాణాలతో పోలీసులకు పట్టుబడ్డాడు. కసబ్ ను 2012 నవంబర్ 21న రహస్యంగా ఉరి తీశారు. -
మూడు పిట్ బుల్స్ దాడి : కేర్ టేకర్ అమెరికా యువతి దుర్మరణం
పెంపుడు కుక్కలు యజమాని మీద ఆగ్రహం చూపించడం, ఒక్కోసారి ప్రాణాలను తీయడంచాలా అరుదుగా జరిగే విషాదం. అమెరికాలో కుక్కల కేర్ టేకర్గా పనిచేస్తున్న 23 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, కుక్కల చేతిలో దారుణంగా చనిపోయింది. మూడు పిట్ బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు విడిచింది.టెక్సాస్లోని టైలర్లోని ఉండే కుటుంబం మూడు పెట్ డాగ్స్ పిట్ బుల్స్ పెంచుకుంటోంది. టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మాడిసన్ రిలే హల్కు కూడా ఇవంటే చాలా ప్రేమ. అవి కూడా ప్రేమగానే ఉండేవి. నవంబర్ 21న సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో హల్ ఇంటి వెనుక వెనుక దాడిచేయడంతో విగతజీవిగా కనిపించింది. హల్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఇటీవల కుక్కల యజమాని ఇంట్లో కుటుంబ పిల్లలను చూసుకునేంది. అలాగే కుక్కలను కూడా చూసుకునేందుకు అంగీకరించింది. ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు పట్టణంలో లేనప్పుడు ఆమెపై దాడి చేశాయి. ఆ శబ్దం విన్న పొరుగువాళలు, అత్యవసర సేవలకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న అక్కడకు వచ్చిన అధికారిపైనా దాడికి యత్నించడంతో పిట్ బుల్స్లో ఒకదానిని కాల్చి చంపాడు. మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గాయాలతో కొద్దిసేపటికే మరణించింది. హల్ తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆమె పట్ల ప్రేమగా ఉన్న కుక్కలలో ఇటీవల వచ్చిన మార్పు గురించి ప్రస్తావించిందని గుర్తు చేసుకున్నారు. -
ఘోరం: బాంబుదాడిలో 9మంది చిన్నారుల మృతి
అఫ్గానిస్థాన్ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్ తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్గా దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపై పాక్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.పాక్- అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
అణు దాడులను తట్టుకునేలా ‘ఐస్లాండ్’
చైనా దేశం మరో భారీ నిర్మాణానికి సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే తొలిసారిగా భారీ కృత్తిమ ద్వీపం నిర్మాణాన్ని డ్రాగన్ కంట్రీ చేపడుతుంది. ఈ ద్వీపాన్నిఅణు బాంబు దాడులను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కొత్త కొత్త నిర్మాణాలతో ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచే డ్రాగన్ కంట్రీ మరో భారీ నిర్మాణం చేపడుతుంది. అణుబాంబు దాడులను సైతం తట్టుకునేలా భారీ కృత్తిమ ద్వీపనిర్మాణం నిర్మిస్తున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఐస్ లాండ్ ఆరు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తైన అలలను తట్టుకోవడంతో పాటు కఠినమైన తుఫానులను సైతం ఎదుర్కొనేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏర్పరిచిన సామాగ్రి 238 మందికి నాలుగు నెలల పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ద్వీపంలో అన్ని రకాల ఎమర్జెన్సీ కంపర్ట్ మెంట్ లు నిర్మిస్తున్నామని, వాటిలో ఎమర్జెన్సీ పవర్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందని తెలిపారు. ఈ ద్వీపం 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పుతో నీటి మట్టానికి 45 మీటర్ల ఎత్తు ఉండేలా దీని నిర్మాణం చేపడుతున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని బరువు 78 వేల టన్నులుని తెలిపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దీని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీగా ఫిలవబడే ఈ ద్వీప నిర్మాణం 2028 వరకూ పూర్తి చేయనున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు.కాగా ఇటీవలే చైనాలో నిర్మించిన ఓ భారీ వంతెన ప్రారంభించిన కొద్ది రోజులకే కూలిపోయింది. దీంతో నాసిరకం నిర్మాణాలు చేపట్టారని ఆ దేశ ఇంజినీర్లపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
పథకం ప్రకారమే ఢిల్లీ బ్లాస్ట్? ఉగ్రవాది సంచలన వీడియో
ఢిల్లీ సాక్షి, ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే స్థలం, సమయం, గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ఈ నెల 10 న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన బాంబుపేలుళ్లలో ఎన్ఐఏ లోతైన దర్యాప్తు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కారుబాంబు ఉగ్రవాది ఉమర్ సంచలన వీడియో బయిటపడింది. అందులో ఉమర్ "ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు.చావే అంతిమ లక్షం అని భావిస్తేనే అది సాధ్యమవుతుంది. బలిదానం అనేది ఒక ఆపరేషన్ అని ఒక వ్యక్తి తాను నిర్ధిష్ఠ సమయంలో ఫలానా ప్రాంతంలో చనిపోతానని భావించడం . ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అది విధిరాత అయితే చావుకు ఎప్పుడూ భయపడకూడదు. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. అటువంటి దాడిని సమాజం ఒప్పుకోదు" అని ఆ వీడియోలో అన్నారు.నవంబర్ 9న ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒకరోజు ముందు అల్పాల యూనివర్సిటీలో ఈవీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ ఈవీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే కారుబాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళిక తోనే చేశారని అందుకే అది జరిగే ఒకరోజు మందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదికి సంబంధంమున్న అల్ ఫలా యునివర్సిటీపై ఎన్ఐఏ మరింత విస్తృతం చేసింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తుంది. ఈ బాంబు కుట్ర కేసుతో సంబంధమున్న పలువురు వ్యక్తులను ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు.నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుళ్ల కేసులో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
హమాస్ లా ప్లాన్ చేసిన ఆత్మాహుతి బాంబర్ అరెస్ట్..
-
విమర్శిస్తేనే దాడి చేస్తారా.. అసెంబ్లీలో తాగి మాట్లాడిన బాలయ్యను ఏం చెయ్యాలి
-
బాలకృష్ణ ఏం మాట్లాడారో మరిచిపోయారా?: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఆఫీస్ దాడి కేసును రీఓపెన్ చేసి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందూపురం ఘటనకు నిరసనగా.. సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా దాడి చేశారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. ఆ కేసును రీ ఓపెన్ చేసి మరీ అమాయకులను జైలుకు పంపించారు. కేవలం మీ ఆఫీసుపై దాడి జరిగిందని వేధింపులకు దిగారు. మరి ఇప్పుడు చేస్తోంది ఏంటి?.. దాడికి నిరసనగా ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ నేతలను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా?.. పోలీసులు మరీ టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. డీజీపీ కూడా మేం ఫోన్లు చేస్తే స్పందించరు.. ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసింది రాజకీయ విమర్శలు. అంత మాత్రానికి దాడుల సంప్రదాయం సరికాదు. మరి గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి?.. అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్ను ఆయన సైకో అనలేదా?.. నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా?. అసెంబ్లీకి తప్పతాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. కానీ, ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరూ చెప్పలేదు. ఇది న్యాయమా?.. ధర్మమా?.. బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా వైఎస్సార్సీపీ ఆందోళన కొనసాగిస్తుంది. చంద్రబాబుదంతా డ్రామానేచంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కరించలేక కార్మికులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు విశాఖలో ఇదే తరహాలో సమ్మిట్ పెట్టారు. చంద్రబాబు చేసేదంతా నాటకం.. బూటకం అని అన్నారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతి రెడ్డి వేమారెడ్డి ,అంబటి మురళి, వనమా బాల వజ్రపు బాబు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాలయ్య కామెంట్స్: వైఎస్ జగన్ ఏమన్నారంటే.. -
రెచ్చిపోయిన అచ్చన్న రౌడీలు
-
హిందూపురం YSRCP ఆఫీసుపై టీడీపీ సైకో దాడి.. సతీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో దాడికి సంబంధించిన వీడియోతో సహా పోస్టు చేశారు. ‘హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా దీన్ని భావించాలి. చంద్రబాబు నాయకత్వం మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. -
రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అటవీ అధికారిపై చిరుత దాడి
-
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల దాడిలో రైతు మృతి
-
చిత్తూరు: ఏనుగుల దాడి.. రైతు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు. కుప్పం నియోజకవర్గంలో రైతులకు రక్షణ కరువైంది. కుప్పం మండల పరిధిలోని కుర్మానిపల్లిలో ఘటన జరిగింది. మృతుడు రైతు కిట్టప్పగా గుర్తించారు. రాగి పంటకు కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు దాడి చేయడంతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు దాడి నుంచి రైతులు ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.కాగా, బంగారుపాళెం మండలంలోని అటవీ సరిహద్దు గ్రామమైన టేకుమందలో సోమవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు దాడిచేశాయి. పంటలను ధ్వంసం చేశాయి. మొగిలి దేవరకొండ సమీపంలోని కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు టేకుమంద గ్రామం మామిడి మానుకుంట మీదుగా రైతుల పొలాలపైకి వచ్చాయి.గ్రామానికి చెందిన పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మకు చెందిన సుమారు 4 ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అదేవిధంగా అరటి చెట్లను విరిచి నేలపాలు చేశాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఢిల్లీ పేలుడు: దీపావళికే ప్లాన్?
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని భయాందోళనలోకి నెట్టివేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు బృందాలు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిఘా వర్గాల నుంచి ఒక కీలక సమాచారం వెల్లడయ్యింది.ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ దర్యాప్తు అధికారుల విచారణలో.. తాను, ఉమర్.. ఎర్రకోట ప్రాంతానికి పేలుడు జరగడానికి ముందుగా చేరుకున్నామని చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 26న దాడి చేసేందుకు ప్రణాళిక ఉందని, దానిలో భాగంగా ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని గుర్తించామని ముజమ్మిల్ తెలిపాడు. అదేవిధంగా మొన్నటి దీపావళికి రద్దీగా ఉండే ప్రాంతంలో దాడి చేయాలని తాము ముందుగా ప్లాన్ చేశామని, అయితే దానిని అమలు చేయలేకపోయామని ముజమ్మిల్ విచారణ అధికారులకు తెలిపినట్లు ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది.ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన దరిమిలా దర్యాప్తు బృందం కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ను విచారిస్తున్నారు. ఇతను ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఇతని సహోద్యోగి ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కారు పేలి మరణించినట్లు భావిస్తున్నారు. మూలాల ప్రకారం ముజమ్మిల్ను విచారిస్తున్న పోలీసులు అతని ఫోన్ డేటాను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం -
మహిళపై టీచర్ అత్యాచార యత్నం
-
YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం
-
అనంతలో టీడీపీ బీభత్సం.. YSRCP కార్యకర్తలపై కర్రలతో దాడి
-
kolkata: మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై అకృత్యం
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక అపహరణకు గురైంది. ఆ తరువాత ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నదని పోలీసులు తెలిపారు. స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలితో పాటు తారకేశ్వర్లోని రైల్వే షెడ్లో దోమతెర అమర్చిన మంచం మీద నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని హుగ్లీ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. Kolkata, West Bengal: Union MoS Sukanta Majumdar says, "Nothing new for this state. Already we have faced several incidents of gang rape and rape. Few months ago even in the Durgapur, one girl doctor, lady doctor or rather I should say MBBS student has been raped by the goons. So… pic.twitter.com/udj0P7IQdU— IANS (@ians_india) November 3, 2025చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి మంచానికి అమర్చిన దోమతెరను చింపివేసి, బాలికను ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మర్నాటి మధ్యాహ్నం ఆ చిన్నారి తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో కనిపించింది. ‘పాప నా పక్కన నిద్రపోతోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాపను ఎవరో లాక్కుపోయారు. పాపను తీసుకెళ్లిన ఖచ్చితమైన సమయం కూడా నాకు తెలియదు. ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు. అయితే వారు దోమతెరను చింపేసి, పాపను తీసుకుపోయారు’అంటూ ఆ బాలిక అమ్మమ్మ చినిగిపోయిన దోమ తెరను చూపిస్తూ మీడియాకు చెప్పింది. తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధుల్లో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లతో చెప్పింది. కాగా ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ (45)ను అరెస్టు చేశారు.A 4-year old girl child has been Raped in Tarkeshwar.Family rushes to Police Station, but FIR not registered !Taken to the Hospital - referred to Chandannagar.Tarkeshwar Police busy burying the Crime. This is the True Face of Mamata Banerjee’s free-for-all regime. A… pic.twitter.com/XujzQSCmEQ— Suvendu Adhikari (@SuvenduWB) November 8, 2025ప్రస్తుతం బాధిత చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. తారకేశ్వర్ గ్రామీణ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పాక్పో)కింద ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం గురించి తెలియగానే బీజేపీ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగింది. ‘తారకేశ్వర్లో నాలుగేళ్ల ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తారకేశ్వర్ పోలీసులు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇది మమతా బెనర్జీ స్వేచ్ఛాయుత పాలనకు గుర్తు. ఒక చిన్నారి జీవితం ఛిన్నాభిన్నమైంది. అయినప్పటికీ పోలీసులు నిజాన్ని అణిచివేయడం ద్వారా రాష్ట్రంలోని నకిలీ శాంతిభద్రతల ఇమేజ్ను కాపాడుతున్నారు’ అంటూ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఇది కూడా చదవండి: అమెరికాలో ఇద్దరు భారత గ్యాంగ్స్టర్లు అరెస్ట్ -
Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం
శ్రీనగర్: భారీ ఉగ్రదాడి కుట్రను జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. దీంతో దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీనగర్ పోలీసులు కోనఖాన్లోని మమతా చౌక్ సమీపంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్న సాయుధులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు.‘ఇండియా టీవీ’ తెలిపిన వివరాల ప్రకారం సాధారణ వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక నల్లని రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్ పోలీసులలో అనుమానాలను రేకెత్తించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపాలంటూ సిగ్నల్ ఇవ్వగానే, రైడర్తో పాటు మరో ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అనుమానితులను షా ముతైబ్, కమ్రాన్ హసన్ షా,మొహమ్మద్ నదీమ్గా గుర్తించారు. వీరంతా ఖన్యార్లోని కావా మొహల్లాలో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి ఒక కంట్రీ-మేడ్ పిస్టల్, తొమ్మిది లైవ్ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ఒక ప్రణాళిక ప్రకారం ఉగ్రదాడులకు పాల్పడేవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఖన్యార్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఆయుధ చట్టం, యూఏపీఏ అండ్ మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముగ్గురూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఉగ్ర దాడికి కుట్ర పన్నారని తేలింది. అనుమానితుల నెట్వర్క్ను కనుగొనేందుకు పోలీసు అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనగర్ పోలీసుల అప్రమత్తత కారణంగా భారీ ఉగ్రదాడి తప్పిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దరిమిలా కొంతకాలం వెనుకకు తగ్గిన ఉగ్రవాదులు.. ఇప్పుడు తిరిగి సంఘటితం అవుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.ఇది కూడా చదవండి: పని ఒత్తిడి: 10 మందిని చంపిన నర్స్ -
వైఎస్సార్సీపీ గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం?.. షాకింగ్ వీడియో
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కారుకు నిప్పు అంటించిన తర్వాత సదరు వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే పలుమార్లు పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన అనంతరం తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికైనా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
పాక్ మద్దతు.. భారత్లో మరో ఉగ్రదాడి?
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ మద్దతుతో పలు ఉగ్రవాద సంస్థలు భారత్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారవర్గాలకు సమాచారం అందిందని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన దరిమిలా పాక్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం)లు కొత్తగా సమన్వయ దాడులకు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం గత సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు భారత్లోకి చొరబాట్లు, నిఘా, సరిహద్దు లాజిస్టిక్స్ను ముమ్మరం చేశాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్జీ),ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)సభ్యుల సహాయంతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి చొరబాటు మార్గాల ద్వారా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని ఎల్ఈటీ యూనిట్ డ్రోన్లను ఉపయోగించి వైమానిక నిఘా నిర్వహించిందని, ఎల్ఓసీలోకి చొరబడే మార్గాలను గుర్తించిందని, రాబోయే రోజుల్లో ఫిదాయీన్ తరహా దాడులు లేదా ఆయుధ దాడులకు ఇది సూచన అని నిఘా అధికారులు వివరించారు.మాజీ ఎస్ఎస్జీ సైనికులు, ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్లు (బీఎటీలు) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంతటా మోహరించారని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. గత అక్టోబర్లో జమాత్ ఈ ఇస్లామి, హిజ్బుల్ ముజాహిదీన్ ఐఎస్ఐ సభ్యులు ఒకచోట సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన నష్టాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సమావేశంలో ప్రణాళికలను ఖరారు చేశారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. భారత రక్షణదళ అధికారులు అధికారులు ఈ నిఘా సమాచారాన్ని క్లిష్టమైన హెచ్చరికగా అభివర్ణించారు. ఈ నేపధ్యంలో భారత సైన్యం, నిఘా యంత్రాంగం హై అలర్ట్లో ఉంది. గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో భారత్ తన త్రిశూల్ ట్రై-సర్వీస్ విన్యాసాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ నిఘా సమాచారం అందింది. ఇది కూడా చదవండి: బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి -
చర్లపల్లి జైలులో జవాన్పై ఇస్లామిక్ స్టేట్ ఖైదీ దాడి?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్పై ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేసులో జైలుకు వచ్చిన ఖైదీ దాడికి పాల్పడిన ఉదంతమిది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్ అనే జవాన్ చేతిలో లాఠీ పట్టుకుని రౌండ్స్లో ఉన్నారు. జైలులోని యూనిట్ ఆసుపత్రి వద్ద ఆయన తనిఖీల్లో ఉండగా, అప్పడే మాజ్ అనే ఖైదీ చికిత్స కోసం వచ్చాడు.ఆసుపత్రిలో మహిళా డాక్టర్తో తనను నిమ్స్ కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ రిఫర్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. చిన్న ఆరోగ్య సమస్యేనని.. అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్ చేస్తామని డాక్టర్ చెప్పారు. దాంతో శివాలెత్తిపోయిన మాజ్.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తిట్లు పురాణం ప్రారంభించారు. అదే సమయంలో రౌండ్స్లో ఉన్న రాజేష్ను తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా రాజేష్ చేతులోని లాఠీని లాక్కుని ఆయనపై దాడి చేశారు.తోటి సిబ్బంది ఇతర ఖైదీలు వెంటనే స్పందించి మాజ్ను నిలువరించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్.. మరో జవాన్ ఆ ఖైదీపై ఎదురుదాడి చేసి రాజేష్ను కాపాడారు. ఐఎస్ సంబంధింత కేసులో మాజ్ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతణ్ని గతంలో అరెస్టు చేయగా.. తొలుత చంచల్గూడ జైలుకు తరలించారు. అక్కడ మరో ఐఎస్ ఖైదీతో కలిసి మాజ్ సెల్ఫోన్ కలిగి ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో.. అతణ్ని చర్లపల్లికి తరలించారు. జవాన్పై దాడి ఘటనపై చర్లపల్లి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన ఫోన్లో స్పందించలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్గా గుర్తించిన దరిమిలా అరెస్ట్ చేశారు.ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్నగర్ పోలీసులకు అప్పగించారు.పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి. ఇది కూడా చదవండి: ‘ట్రంప్ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు -
‘నువ్వు ఎవడ్రా.. మా ఊరి పొలం చేయడానికి..’
రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పేదలు, దళితులపై దౌర్జన్యాలకు తెగబడుతూ వారి భూములను లాక్కుంటున్నారు. ఇదేమని అడిగిన వారిపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. అధికారులూ టీడీపీ నేతలకే వంత పాడుతున్నారు. న్యాయం చేయండని బాధితులు మొత్తుకుంటున్నా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.బాలాయపల్లి (సైదాపురం): ‘ఇది మా ఊరు. ఇదంతా మా భూమి. నువ్వు ఎవడ్రా మా ఊరి పొలం చేయడానికి’ అంటూ టీడీపీ నేత సీసీ నాయుడు ఓ దళిత కుటుంబంపై దాడికి తెగబడి.. ఆ కుటుంబం సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించే యత్నం చేశాడు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో అక్కసముద్రం పరిధిలోని ప్రభుత్వ భూమిని యాచవరం దళితవాడకు చెందిన దళితులు 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిపై వెంగమాంబపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత సీసీ నాయుడు కన్ను పడింది. ఆదివారం జేసీబీ, బుల్డోజర్లతో వచ్చి టీడీపీ నేత ఆ భూమిని దున్నే ప్రయత్నం చేశాడు. దీంతో దళితుడైన చిరంజీవి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీసీ నాయుడు ‘నీకు భూమి ఎక్కడ ఉంది. మా ఊళ్లో పొలాన్ని మీరెలా సాగు చేస్తారు’ అంటూ వారిపై చేయి చేసుకున్నాడు. ఈ పొలానికి సంబం«ధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, భూమిని వదిలేయాలని దళిత దంపతులు ప్రాధేయపడినా వినకుండా ఆ దంపతులపై దాడికి యతి్నంచాడు. దీంతో దంపతులిద్దరూ బుల్డోజర్కు అడ్డంగా పడుకుని పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నా సీసీ నాయుడును అడ్డుకోలేదని స్థానిక దళితులు ఆవేదనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై బాధితులు బుధవారం బాలాయపల్లి తహశీల్దార్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ నేత సీసీ నాయుడుపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ నేత, యాచవరం పీఏసీఎస్ అధ్యక్షుడు సీసీ నాయుడుపై బుధవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గోపీ తెలిపారు. తమ భూమిని ఆక్రమించేందుకు సీసీ నాయుడు ప్రయత్రించడమే కాకుండా తమను అసభ్య పదజాలంతో దూషించినట్టు వరికూటి అన్నపూర్ణమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ చెప్పారు. -
రాకేష్ కిషోర్కు ఊరట
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్పై ఇటీవల కోర్టు హాల్లో షూ విసిరిన సస్పెండెడ్ లాయర్ రాకేశ్ కిశోర్(71)పై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ లాయర్పై ధిక్కారం కింద చర్యలు తీసుకునేందుకు సీజేఐ గవాయ్ విముఖంగా ఉన్నారని తెలిపింది. కోర్టు గదిలో నినాదాలివ్వడం, చెప్పులు విసరడం వంటి చర్యలు కచ్చితంగా ధిక్కారంగానే పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిల ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంలోనూ చర్యలు తీసుకోవాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కోర్టు ధిక్కారంగా భావించిన పక్షంలో ఆ న్యాయవాదికి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని, ఆ ఘటన ప్రభావం పెరుగుతుందని అభిప్రాయపడింది. అప్పటి ఘటన దానంతటదే మరుగున పడిపోవడమే సరైనదని కూడా ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు మార్గదర్శకాలను రూపొందిస్తామంది. ఇప్పటి వరకు వివిధ కోర్టుల్లో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనల వివరాలను అందించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. అక్టోబర్ 6వ తేదీన కేసుల లిస్టింగ్ జరుగుతున్న సమయంలో సీజేఐపై రాకేశ్ కిశోర్(71) అనే లాయర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు చేపట్టాలంటూ సుప్రీం బార్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. -
ఆర్టీసీ కండక్టర్పై దాడి
రామచంద్రపురం రూరల్: బస్సు కండక్టర్పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టిన నిందితులపై ఐదు రోజులైనా చర్యల్లేకపోవడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడ్డాయి. సోమవారం రామచంద్రపురం డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపాయి. బాధిత కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుకు న్యాయం చేయాలని డిమాండ్చేశాయి. బాధితుడి కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న మంగేశ్వరరావు ఈ నెల 23న కోరుమిల్లి– రాజమండ్రి సరీ్వసులో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కోరుమిల్లికి చెందిన తుట్టపు అన్నపూర్ణ బస్సు ఎక్కి మాచవరం వెళ్లాలని చెప్పారు. అయితే ఆమె సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో చార్జీ చెల్లించాలని మంగేశ్వరరావు స్పష్టం చేశారు.దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్పై దౌర్జన్యం చేసింది. దీంతో కండక్టర్, డ్రైవర్ అన్నపూర్ణను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాలని భావించారు. అయితే తోటి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వివాదాన్ని అంతటితో ముగించారు. బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి కోరుమిల్లి చేరుకున్న సమయంలో అన్నపూర్ణ కుమారుడు భూషణం, అతడి స్నేహితుడు అడ్డాల ఆదినారాయణ బస్సు నుంచి దిగుతున్న కండక్టర్ మంగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కాలు విరగ్గొట్టారు. స్థానికులు, డ్రైవర్.. కండక్టర్ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. దీనిపై అంగర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావ డంతో పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. పైగా, మంగేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకులు జేఏసీగా ఏర్పడి సోమవారం గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపారు. బాధిత కండక్టర్ కాలుకు తక్షణం శస్త్రచికిత్స చేయించాలని, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కోలుకునేవరకు ఆన్డ్యూటీగా పరిగణించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కారి్మకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేఎస్సీ రావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఎల్.నారాయణ, నేషనల్ యూనిటీ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జీఎస్ రాజు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత రామసుబ్బారెడ్డిపై టీడీపీ దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జూటూరులో వైఎస్సార్సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై టీడీపీ నేత దాడి చేశారు. రామసుబ్బారెడ్డిపై టీడీపీకి చెందిన రవికుమార్ కొడవలితో దాడికి దిగాడు. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి గాయపడ్డారు. ఆయన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.. -
రేటు అడిగితే దారుణంగా దాడి : ఏకంగా వేళ్లు నరికేశారు!
స్వల్ప వివాదానికే 22 ఏళ్ల లా విద్యార్థిపై దాడిచేసిన ఘటన కలకలం రేపింది. మందుల ధర గురించి ప్రారంభమైన వాదన, తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చిక్సిత పొందుతున్నాడు. ఆ విద్యార్థి తలకు 14 కుట్లు వేయాల్సి వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాన్పూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి సిబ్బంది అమర్ సింగ్తో వాగ్వాదానికి దిగాడు. ఇది తీవ్రం కావడంతో విచక్షణ మరిచిన అమర్ సింగ్ దాడికి దిగాడు. ఇతనికి సోదరులు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా తోడయ్యారు. తలపై బలంగా కొట్టడంతో రక్తమోడుతున్నా, ప్రాణభయంతో పరుగు పెడుతున్నా బాధితుడిని వదలి పెట్ట లేదు. నలుగురూ కలిసి అభిజీత్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అతని కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?అభిజీత్ గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పొట్టలోని పేగులు బైటకు వచ్చేశాయి. వాటిని గుడ్డలో చుట్టి మరీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులకు పలుకుబడి ఉన్న నేపథ్యంలో చావు బతుకుల్లో ఉన్న తన కొడుకుపై, తనపైనా అక్రమ కేసు బనాయించారని చందేల్ తల్లి నీలం సింగ్ చందేల్ వాపోయారు. అయితే చౌహాన్ ఫిర్యాదు ఆధారంగా చందేల్పై దోపిడీ కేసు నమోదు చేశామని, కానీ దాడి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. చౌహాన్, సింగ్ , తివారీలను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ ధృవీకరించారు. నాల్గవ నిందితుడు ప్రిన్స్ శ్రీవాస్తవ పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధితుడు తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఇదీచదవండి శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ -
రెచ్చిపోయిన జేసీ అనుచరులు.. YSRCP నేతపై కర్రలతో దాడి
-
నల్గొండలో ఉద్రిక్తత.. కార్ల షోరూమ్పై బీజేపీ కార్యకర్తల దాడి
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడి షోరూమ్గా గుర్తించారు. బంద్ చేయకుండా షోరూం తెరవడంతో బీజేపీ, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లతో దాడి చేశారు. -
Telangana Bandh: మేం బంద్ చేస్తే.. మీరు ఓపెన్ చేస్తారా? హోటల్ పై CPI దాడి
-
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
నా భర్త పోలీస్.. ఏ ప్రయోజనం.. పోలీసులే మమల్ని బెదిరిస్తున్నారు.
-
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
ఆ బూటు విసిరింది నేను కాదు.. : రాజేష్ కిషోర్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై షూతో దాడికి ప్రయత్నించిన(Shoe Attack On CJI BR Gavai) అడ్వొకేట్(సస్పెండెడ్) రాజేష్ కిషోర్(71).. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస బెట్టి మీడియా చానెల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన.. ఆ పని తాను చేయలేదంటూ వింత వాదన చేస్తున్నారు. ‘‘ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుని ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే’’ అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్(Rajesh Kishore) తీవ్రంగా తప్పుబడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. సీజేఐ గవాయ్పై షూ విసిరిన ఘటన సోమవారం(అక్టోబర్ 6వ తేదీన) సుప్రీం కోర్టులో కలకలం రేపింది. ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో రాజేష్కిషోర్ తన షూ తీసి సీజేఐ మీదకు విసిరారు. అయితే షూ ఆయన ముందున్న టేబుల్ మీద పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తోటి లాయర్లు రాజేష్ను పట్టుకుని.. సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మూడు గంటలపాటు రాజేష్ను విచారించి వదిలేశారు. అయితే.. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచన మేరకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదుకు ముందుకు రాలేదు. అయితే.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం రాజేష్పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. జరిగిన దానికి 15రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఇదీ చదవండి: సీజేఐపై దాడి ఘటన: ప్రధాని మోదీ ఏమన్నారంటే.. -
సీజేఐ గవాయ్పై దాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖండించారు. సీజేఐ గవాయ్పై సుప్రీం కోర్టులో జరిగిన దాడి కలవరపరచే విషయం అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు,. దేశంలోని అత్యున్నత న్యాయ సంస్థ గౌరవానికే ఇది అవమానకరమైనది. మనం అందరం కలిసి రాజ్యాంగ బద్ద సంస్థల సమగ్రతను కాపాడుదాం’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పేర్కొన్నారు.The disgraceful attack on Hon’ble Chief Justice of India, Shri B.R. Gavai Ji, in the Supreme Court is deeply disturbing and must be unequivocally condemned. This is not only an assault on an individual but an affront to the dignity of our highest judicial institution. We must…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025 -
సీజేఐపై దాడికి లాయర్ యత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో సోమవారం ఉదయం 11.35 గంటలకు ఓ కేసుపై విచారణ జరుగుతుండగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయతి్నంచడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టుగదిలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ఆ బూటు జస్టిస్ గవాయ్ని తాకలేదు. సీజేఐపై దాడికి ప్రయతి్నంచిన లాయర్ను ఢిల్లీ మయూర్ విహార్కు చెందిన రాకేశ్ కిశోర్(71)గా గుర్తించారు. అతడిని కోర్టు గది నుంచి బలవంతంగా బయటకు తరలించారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోనంటూ రాకేశ్ కిశోర్ నినాదాలు చేయడం గమనార్హం. త నపై జరిగిన దాడి యత్నంపై జస్టిస్ గవాయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు తనపై ఏమా త్రం ప్రభావం చూపబోవని తేల్చిచెప్పారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా స్పష్టంచేశా రు. దాడి యత్నం తర్వాత కూడా కేసుల విచారణ ను ఆయన యథాతథంగా కొనసాగించడం విశేషంఅసలేం జరిగింది? సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం వేర్వేరు కేసుపై విచారణ నిర్వహిస్తుండగా, అక్కడే ఉన్న లాయర్ రాకేశ్ కిశోర్ వారిద్దరూ కూర్చున్న వేదిక వద్దకు దూసుకొచ్చాడు. తన కాలికున్న బూటు తీసి న్యాయమూర్తులపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మధ్యలోనే అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యల వివాదం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. ‘మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండి. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రారి్థంచండి. కొంతసేపు ధ్యానం కూడా చేయండి’’ అని పిటిషనర్కు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.లాయర్పై సస్పెన్షన్ వేటు సాక్షాత్తూ సీజేఐపైనే బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్ను రద్దు చేసింది.రాజ్యాంగంపై దాడి: సోనియాజస్టిస్ గవాయ్పై బూటుతో దాడిచేసేందుకు ప్రయతి్నంచడాన్ని కాంగ్రెస్ సీని యర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన సిగ్గుచేటు, మతిలేని చర్య అని పేర్కొన్నారు. ఇది మన రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై దాడేనని వ్యాఖ్యానించారు. విద్వేషం, ఉన్మాదం మన సమాజం చుట్టూ ఆవరించుకొని ఉన్నాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సోని యా ఒక ప్రకటన విడుదల చేశారు.జస్టిస్ గవాయ్కి ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: జస్టిస్ బి.ఆర్.గవాయ్పైకి లాయర్ బూటు విసిరేందుకు ప్రయత్నించడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అనుచిత ధోరణులకు స్థానం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ గవాయ్తో ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. లాయర్ చర్య పట్ల పూర్తి సంయమనం పాటించినందుకు జస్టిస్ గవాయ్ని ప్రశంసించానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ విలువలను, రాజ్యాంగ స్ఫూ ర్తిని బలోపేతం చేయడానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం -
చంపేస్తాం.. రౌడీల్లా పోలీసులు
-
ఆడవాళ్లు అని చూడకుండా పచ్చ ఖాకీల విధ్వంసం
-
కన్న తల్లిని సుత్తితో కొట్టి చంపిన కొడుకు
-
Delhi: విదేశీ కోచ్లపై వీధి కుక్కల వీరంగం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా, జపాన్ కోచ్లపై వీధి కుక్కలు దాడి చేశాయి. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జో కుడి కాలిపై కుక్క కరవడంతో అతనిని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడి బారినపడ్డారు. ఈ ఘటన దరిమిలా స్టేడియం భద్రతా దళం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో వీధికుక్కలను పట్టుకునేందుకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది.వివరాల్లోకి వెళితే టోర్నమెంట్లో పాల్గొనేందుకు వచ్చిన కెన్యా కోచ్ను స్టేడియం ప్రాంగణంలోకి చొరబడిన వీధి కుక్క కరిచింది. దీనిపై అథ్లెట్లు, సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జో వార్మప్ ట్రాక్పై అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కుక్క దాడికి గురయ్యారు. స్టార్టింగ్ బ్లాక్స్ను సరిచేస్తుండగా, వీధికుక్క అతని వెనుక నుండి వచ్చి ఆయన కుడి కాలిపై కరిచింది. అక్కడే ఉన్న మెడికల్ టీమ్ ఆయనకు ప్రథమ చికిత్స అందించింది. తరువాత మెరుగైన చికిత్స కోసం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. డెన్నిస్ మరాగియాకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. 🚨 Stray dogs bites Kenyan & Japanese coaches at the JLN Stadium in New Delhi during the World Para Athletics C'ship 2025! Pretty scary & embarassing as host nation 🤦 pic.twitter.com/S3S4OkcP9q— The Khel India (@TheKhelIndia) October 3, 2025కెన్యా కోచ్పై జరిగిన దాడి తరువాత జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా కుక్క దాడి చేసింది. దీంతో ఆమె ఎడమ కాలిపై తీవ్ర గాయమయ్యింది. ఈ ఘటనలన్నీ స్టేడియం ట్రాక్లోనే జరిగాయి. ఓ సెక్యూరిటీ గార్డును కూడా వీధికుక్క కరిచినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆర్గనైజింగ్ కమిటీ స్టేడియంలోనికి వీధికుక్కలు రాకుండా చూడాలని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్కు విజ్ఞప్తి చేసింది. స్టేడియం సమీపంలోనివారు ఇక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో అవి లోనికి ప్రవేశిస్తున్నాయని కమిటీ తెలిపింది. -
టీడీపీ నాయకుల దాష్టీకం
అనంతపురం: తమ భూమి ఆక్రమించవద్దంటూ అడ్డుపడిన బాలికపై టీడీపీ నేతలు దాష్టీకం ప్రదర్శించారు. దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి పక్కన పడేశారు. అసభ్యపదజాలంతో దూషించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపల చోటు చేసుకుంది. బాధితురాలు సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తన గోడు విన్నవించింది. వివరాలిలా ఉన్నాయి. జంబుగుంపల గ్రామానికి చెందిన గొల్ల దొడ్డయ్య కుమార్తె శాలిని పదో తరగతి వరకు చదివింది. అదే గ్రామ సర్వే నంబర్ 110లో వీరికి 4.05 ఎకరాల భూమి ఉంది. 109–1 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉందంటూ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేశారు. శాలిని తల్లిదండ్రులు గొల్ల లక్ష్మి, దొడ్డయ్య తమ పట్టా భూమిలో దారి లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు అధికారులు ఏమీ తేల్చకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత శనివారం టీడీపీ నాయకులైన గొల్ల బొమ్మయ్య, కుమారుడు గొల్ల తిప్పేస్వామి, గొల్ల నరసింహప్ప భార్య గొల్ల చిక్కమ్మ కలిసి శాలిని తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తన్ని నానా దుర్భాషలాడారు. జేసీబీని తెప్పించి వారి పొలం మీదుగా దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు సిద్ధం కాగా.. శాలిని అడ్డుకోబోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెట్టి మారెప్ప కుమారుడు వెట్టి హనుమంతురాయుడు, ఈరప్ప కుమారుడు జి.హనుమంతురాయుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగిపడేశారు. జేసీబీతో తొక్కించి చంపుతామంటూ.. బండ బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసి టీడీపీ నేతలే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. ఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్నా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు. దీంతో టీడీపీ నేతలకు భయపడి బాధిత కుటుంబం స్థానిక పోలీస్స్టేషన్కు కూడా వెళ్లలేకపోయింది. తమకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. -
ఈమె తల్లేనా?: చికెన్ అడిగిన పిల్లలపై రొట్టెల కర్రతో దాడి.. కుమారుడు మృతి
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్లో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించి, కొడుకు ప్రాణాలు పోయేందుకు కారకురాలయ్యింది. తమకు చికెన్ డిష్ తినాలని అనిపిస్తున్నదని ఇద్దరు అన్నాచెల్లెళ్లు తల్లిని చెప్పారు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ, రొట్టెల కర్రతో వారిని చితకబాదింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు మృతిచెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.పాల్ఘర్లో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతిచెందిన బాలుడిని చిన్మయ్ ధుమ్డేగా పోలీసులు గుర్తించారు. తొలుత చిన్మయ్ తన తల్లి పల్లవి ధుమ్డే (40)ను చికెన్ డిష్ అడిగాడు. దీంతో ఆమె ఇప్పుడు కుదరదని చెబుతూ, రొట్టెల కర్రతో కుమారునిపై దాడి చేసింది. తర్వాత తన తన పదేళ్ల కుమార్తెను కూడా అదే రొట్టెల కర్రతో కొట్టింది. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి తన కుటుంబంతో కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో ఉంటోంది. ఆమె కొట్టిన దెబ్బలకు కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) మృతిచెందాడు. 10 ఏళ్ల కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాల్ఘర్ పోలీసులు ఆ తల్లిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టు వాహనం డ్రైవర్ పై మంగళగిరి సీఐ పిడిగుద్దులు.. జడ్జీలు సీరియస్
-
వాలు జడ తోలు బెల్టు!
ఆయనో స్కూల్కు హెడ్మాస్టర్. ఓ మహిళా టీచర్ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్కు హెచ్ఎం వెళ్లారు. చేతిలో ఫైల్ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..సీతాపూర్ హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్ను వర్మ బెల్ట్తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్పై సంచలన ఆరోపణలకు దిగారామె.అవంతిక గుప్తా మహ్ముదాబాద్లోని నద్వా ప్రైమరీ స్కూల్కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్గా రావడం లేదు.దీంతో.. హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..హెచ్ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.UP govt headmaster slams file, flogs BSA using beltIn UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025 ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్ఏ అఖిలేష్ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
Pahalgam Attack Probe: ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.ఈ ఘటనపై దర్యాప్తు సంస్థల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కార్యకర్తను తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని విశ్లేషించిన దరిమిలా ఇతని అరెస్టు జరిగింది. ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో ఇతను కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా పోలీసులు గుర్తించారు. అతను టీచర్గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. అతని సహచరులను గుర్తించేందుకు, సంబందిత నెట్వర్క్ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. -
పోలీసులను తరిమి తరిమి కొట్టిన కూలీలు
-
అప్పు తీర్చమన్నందుకు మహిళను చితక్కొట్టిన టీడీపీ నేతలు
-
మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి
-
పోలీసులా? టీడీపీ కార్యకర్తలా? విద్యార్థులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు
-
మెడికోలపై ఇంజినీరింగ్ విద్యార్థుల దాడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై ఇంజినీరింగ్ విద్యార్థులు శనివారం దాడిచేశారు. దీంతో వైద్యులు విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్యం సేవించి తమ స్నేహితుడి చేయికి గాయమైందని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చారు. అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యుడు పరిశీలించి స్కానింగ్ చేయించుకోవాలని రాశారు. దెబ్బతగిలిన విద్యార్థితోపాటు వచ్చిన స్నేహితులు ఆస్పత్రిలోనే ఉన్న స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ డ్యూటీలో ఉన్న మహిళా రేడియాలజిస్ట్తో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వెంటనే సెల్ ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు ఆమెను ‘ఏం చేసుకుంటావో చేసుకో, బయటకు వస్తావు కదా నీ కథ చూస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఉద్యోగి స్కానింగ్ తీసి క్యాజువాలిటీకి వెళ్లాలని సూచించారు. రిపోర్ట్ తీసుకొని తిరిగి గుంపుగా క్యాజువాలిటీకి వచ్చిన విద్యార్థులు వైద్యులపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ అరుస్తూ హడావుడి చేశారు. దీంతో గాయపడిన విద్యార్థి వద్ద ఒకరు ఉండి మిగిలినవాళ్లు బయటకు వెళ్లాలని డ్యూటీ వైద్యుడు సూచించారు. తమనే బయటకు వెళ్లమంటావా అంటూ విద్యార్థులు ఆ వైద్యుడి ముక్కు పగలగొట్టారు. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లపైనా సుమారు 15 మంది విద్యార్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. వైద్యులను గాయపరిచారు. ఈ ఘటనతో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. జూనియర్ డాక్టర్ల నిరసన నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు శనివారం విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. దాడికి పాల్పడిన మొగిలేశ్వర్, షరీఫ్, లోకేష్, యశ్వంత్, వినేష్, సందీప్పై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఈ నెట్టికంఠయ్య తెలిపారు. -
జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: పవన్ కల్యాణ్పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారువందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. .. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. గిరిధర్కు మద్దతుగా పీఎస్కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా? -
జూకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ఘోరం జరిగింది. అక్కడి ప్రముఖ జూలో పని చేసే వ్యక్తి(58)ని సింహాల గుంపు చంపి పీక్కుతింది. పర్యాటకులంతా చూస్తుండగానే ఇదంతా జరడం గమనార్హం. బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. జియన్ రంగ్ఖరాసమీ అనే వ్యక్తి ఇరవై ఏళ్లుగా బ్యాంకాక్ సఫారీ వరల్డ్లో పని చేస్తున్నాడు. ఇది పేరుగాంచిన ఓపెన్ ఎయిర్ జూ. అందులో కొంతకాలంగా ఆయన సింహాల కేర్టేకర్(ఆహారం అందిస్తూ) విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం సింహాల ఎన్క్లోజర్లో ఉండగా ఏమరపాటుగా ఆయన తన వాహనం నుంచి కిందకు దిగారు. అంతే సింహాలు ఒక్కసారిగా ఆయనపై ఎగబడ్డాయి.సుమారు 15 నిమిషాలపాటు అవి ఆయనపై దాడి చేశాయి. ఆ సమయంలో కొందరు పర్యాటకులు.. వాహనాల హారన్లు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూకీపర్ శరీరంలో కొంత భాగాన్ని పీక్కుతిన్నాయి. ఎలాగాలో వాటి నుంచి ఆయన్ని లాగేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే దారిలోనే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై Safari World Bangkok స్పందించింది. గత 40 ఏళ్లలో ఇలాంటి దాడి జరగడం ఇదేనని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో భధ్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తామని పేర్కొంది. కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.. A zookeeper on Wed was attacked and killed by a pack of #lions at a #Bangkok #zoo, as tourists witnessed the incident and tried to intervene to save him. The shocking attack lasted about 15 minutes, with visitors attempting to intervene by honking car horns and shouting to… pic.twitter.com/8ZzsKFwXU0— Shanghai Daily (@shanghaidaily) September 11, 2025సింహాలు మనుషుల్ని తింటాయా?.. సింహాలు మనుషుల్ని వేటాడడం.. అత్యంత అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అవి మనుషుల్ని ఆహారంగా పరిగణించవు. జింకలు, జీబ్రాలు, అడవి దున్నలు.. ఇలా పరిమాణంలో పెద్దగా ఉండే జంతువులు వాటి సహజ ఆహారం. గాయపడిన సింహాలు, వయసైపోయిన సింహాలు వేటాడలేని స్థితిలో మనుషులపై దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే.. అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా పశువులు, మనుషుల మీద దాడి చేయొచ్చు. ఈ క్రమంలో.. ఒకసారి సింహం మనిషిని వేటాడితే గనుక ఆ ప్రవర్తనను కొనసాగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కొన్నిసార్లు తన పిల్లలకూ మనుషుల్ని వేటాడడం నేర్పిస్తాయట. Tsavo Man-Eaters (1898).. కెన్యాలో రెండు సింహాలు 135 మంది రైల్వే కార్మికులను చంపినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే.. Njombe Man-Eaters (టాంజానియా) పేరిట కొన్ని సింహాలు తరతరాలుగా మనుషులపై వేటాడినట్లు ఆధారాలు ఉన్నాయి. -
హమాస్ నేతలే లక్ష్యంగా ఖతార్పై ఇజ్రాయెల్ దాడి
దుబాయ్: ఖతార్లో ఉంటున్న హమాస్ నేతలే లక్ష్యంగా మంగళవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెరతీసింది. రాజధాని దోహాలోని హమాస్ రాజకీయ ప్రధాన కార్యాలయంపై దాడి జరిపింది. దాడి అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాడిలో అజ్ఞాతంలో ఉన్న హమాస్ గాజా చీఫ్ ఖలిల్ అల్ హయ్యా కుమారుడు సహా తమ సభ్యులు ఐదుగురు చనిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. కాల్పుల విరమణ చర్చల మధ్యవర్తులు త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. తమ అంతరంగిక భద్రతా దళం అధికారి కూడా మృతుల్లో ఉన్నారని ఖతార్ తెలిపింది.తామే ఈ దాడికి పాల్పడ్డామని, తమదే పూర్తి బాధ్యతని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ప్రకటించడం గమనార్హం. జెరూసలేంలో సోమవారం ఆరుగురిని చంపిన ఘటన నేపథ్యంలోనే ఈ దాడికి పథకం వేశామన్నారు. తమకు అందిన అదనపు నిఘా సమాచారంతో హమాస్ నేతలే లక్ష్యంగా దాడి చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. దీనిపై ముందుగా అమెరికాకు సమాచారం ఇచ్చామని ఓ అధికారి వెల్లడించారు. అమెరికా మిత్రదేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ చేసిన దాడితో సంక్షోభం మరింత ముదురుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే కాకుండా, బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్ చర్య అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కడమేనని ఖతార్ పేర్కొంది. ఇజ్రాయెల్ది పిరికిపంద అని వ్యాఖ్యానించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ దాడిని ఖండించారు. యూఏఈ, సౌదీ అరేబియా దాడిని తీవ్రంగా తప్పుబట్టాయి. -
గ్రామస్తుల తల పగలగొట్టిన క్వారీ యాజమాన్యం
-
నన్ను చంపేస్తారు.. టీడీపీ నుంచి ప్రాణహాని ఉంది
-
కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి
మహానంది: అధికార పార్టీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బుసిగారి నాగరాజు తమ్ముడు సురేష్పై నలుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ గురువారం రాత్రి ఆర్ఎంపీ వద్ద వైద్యం పొంది ఇంటికి వస్తుండగా అయ్యలూరిమెట్ట సమీపంలోని చెరువు, గోదాం ప్రాంతంలో నలుగురు అటకాయించారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. సురేష్ ను స్థానికులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై ఎస్ఐ గంగయ్యయాదవ్ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దౌర్జన్యాలు: శిల్పా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇప్పటికే నాలుగు హత్యలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ ను ఆస్పత్రిలో పరామర్శించిన శిల్పా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఓ యువకుడిపైన, వైశ్యులతో పాటు మరికొందరిపైనా దాడి చేశారన్నారు. గ్రామాల్లో పదిమంది టీడీపీ నాయకులు ఉంటే తలా ఒక బెల్ట్షాప్, మంత్రులకు శాఖల తరహాలో టీడీపీ నాయకులకు దోపిడీ శాఖలు కేటాయించారని ఆరోపించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే దాడి చేసినా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. -
భార్యపై యాసిడ్ దాడి.. భర్తకు మరణ శిక్ష
ఉదయపూర్: భార్యను పలు రకాలుగా వేధిస్తూ, ఆమెపై కర్కశంగా యాసిడ్ దాడి చేసిన భర్తకు కోర్టు మరణశిక్ష విధించింది. భార్య శరీరపు రంగును తూలనాడుతూ, ఆమె స్థూలకాయాన్ని హేళన చేస్తూ, హీనంగా ప్రవర్తించిన భర్త కోర్టు తీర్పు మేరకు ఉరికంబం ఎక్కనున్నాడు.రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన లక్ష్మి అనే మహిళను రంగు తక్కువ ఉన్నావంటూ, ఆమె భర్త కిషన్ తరచు ఎగతాళి చేసేవాడు. ఒక రోజు రాత్రి కిషన్ ఏదో ద్రావకం(యాసిడ్) తెచ్చి.. భార్యతో శరీరమంతా పూసుకోవాలని చెప్పాడు. ఆమె దానిని రాసుకుంది. అయితే ఏదో దుర్వాసన వస్తున్నదని భర్తకు చెప్పింది. తరువాత భర్త ఆమె కడుపుపై అగరుబత్తిని వెలిగించాడు. దీంతో ఆమె శరీరం అంతటా మంటలు వ్యాపించాయి. తరువాత మరికొంత యాసిడ్ను ఆమె శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి బూడిదయ్యింది.ఈ ఘటనకు సంబంధించి ఉదయ్పూర్లోని వల్లభ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. నిందితుడు కిషన్ను అరెస్టు చేసిన పోలీసులు అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ పలివాల్ మాట్లాడుతూ ‘నిందితుడు తన భార్య నల్లగా ఉన్న కారణంగా, ఆమెను వేధించేవాడని, ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించాడని అన్నారు. తీవ్ర గాయాలతో ఆమె మరణించిందన్నారు. ఈ ఘటనలో నిందితునికి కోర్టు న్యాయమూర్తి మరణశిక్ష విధించారు. -
వైఎస్సార్సీపీ బీసీ నాయకురాలిపై టీడీపీ మూకల దాడి
గంగవరం: చిత్తూరు జిల్లాలో ఓ వైఎస్సార్సీపీ మండల బీసీ నాయకురాలిపై టీడీపీ మూకలు శనివారం విచక్షణారహితంగా దాడి చేశాయి. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామంలో బోయ సామాజికవర్గానికి చెందిన కవిత ఇటీవలే వైఎస్సార్సీపీ మండల బీసీ మహిళాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాధితురాలి సోదరి నందినిపై గతంలో తేజ అనే యువకుడు ఈవ్టీజింగ్కు పాల్పడ్డాడు.దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గంగవరం పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును రాజీ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు నందిని, కవితలను తేజ బెదిరించాడు. ఈక్రమంలో వినాయక చవితి పండుగ కోసం సోదరి ఇంటికి నందిని వచ్చింది. అయితే తేజ ఆలకుప్పం గ్రామం టీడీపీ నేత రాజన్నకు విషయం చెప్పాడు.ఆయన ప్రోద్బలంతో పండగ రోజు నందిని, ఆమె సోదరి కవిత, తల్లి తిమ్ములమ్మపై తేజ, ఇతర నేతలు దాడి చేసి గాయపరిచారు. పాత కేసును రాజీ చేసుకోకుంటే ప్రాణం తీయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు పలమనేరులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా టీడీపీ నేతల దాడిపై బాధితులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి.. ఎగసిపడుతున్న మంటలు
కైవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున భీకర దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. డ్నిప్రో, పావ్లోగ్రాడ్లలో కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ⚡#Russia 🇷🇺 #Ukraine 🇺🇦 #Dnipro in #Ukraine's #Dnipropetrovsk region is under heavy drone attack. There have been reports of massive fires after several #Russian drone attacks in the city. pic.twitter.com/rhyiDm1tVt— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2025‘ఈ ప్రాంతం భారీ దాడుల్లో చిక్కుకుంది. పేలుళ్లు శబ్ధాలు వినిపిస్తున్నాయి’అని గవర్నర్ సెర్గి లైసాక్ ‘టెలిగ్రామ్’లో పేర్కొన్నారు. రష్యాలోని క్రాస్నోడార్ క్రైలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రేనియన్ డ్రోన్లు ఢీకొట్టిన అనంతరం రష్యా ఈ దాడులకు పాల్పడింది. 🇷🇺🇺🇦 As a result of a massive attack in the Dnipropetrovsk region, enterprises and infrastructure facilities were damaged. pic.twitter.com/EsqnMJWpZI— King Chelsea Ug 🇺🇬🇷🇺 (@ug_chelsea) August 7, 2025‘కైవ్ ఇండిపెండెంట్’ నివేదిక ప్రకారం, స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు ఎగురుతున్నాయని స్థానికులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. చమురు శుద్ధి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. 🇷🇺 ⚡️🇺🇦 #BreakingNews: A massive drone attack is underway in Dnipro, Dnipropetrovsk region.Many drones have impacted within the city, and massive fires have been reported. pic.twitter.com/z1lG07RIGA— #Insider (@insider_der) August 6, 2025 -
సూసైడ్ బోట్ తో ఉక్రెయిన్ నిఘా నౌకను పేల్చేసిన రష్యా
-
కైవ్పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి
కైవ్: వరుస దాడులతో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్పై రష్యా జరిపిన దాడిలో 21 మంది మృతిచెందారు. ఈ దాడిలో పలు ఆయుధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రాత్రివేళ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి రష్యా ఈ దాడులకు తెగబడింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్షిపణుల దాడులతో కైవ్ నగరం దద్దరిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లోని యూరోపియన్ యూనియన్ మిషన్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంతో సహా కైవ్లోని మొత్తం 33 ప్రదేశాలలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ సైనిక ఆపరేషన్ పలు ఆయుధ కర్మాగారాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కీవ్పై దాడులను మాస్కో ధృవీకరించింది. 🚨🇺🇦 KYIV – RUSSIAN ATTACK#BREAKING | Aug 28, 2025Russia launched a large-scale drone & missile attack on Kyiv overnight, killing more than a dozen people and wounding many, while damaging multiple buildings.📰 Source: Fox News#Ukraine #Russia #Kyiv #MissileStrike #Conflict pic.twitter.com/yMlq4oUgWY— NewsX - 24/7 (@NewsX_24_7) August 28, 2025కాగా ఉక్రెయిన్ సైన్యం ఇన్కమింగ్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 13 ప్రదేశాలలో రష్యా విజయవంతంగా తన దాడులను కొనసాగించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు దాడులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఉక్ర్స్పెక్సిస్టమ్స్ కార్యాలయం ధ్వంసమయ్యింది. 2014లో నెలకొల్పిన ఉక్ర్స్పెక్సిస్టమ్స్లో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తుంటారు.కాగా టర్కిష్ రక్షణ సంస్థ బేరక్తర్ నిర్వహిస్తున్న కైవ్లోని ఒక ప్లాంట్ను కూడా రష్యా ధ్వంసం చేసింది. -
డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
-
నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణాజిల్లా: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతలు దాడి చేశారు. మూడు రోజుల క్రితం నిమ్మకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ-నిమ్మకూరు మెట్రో సర్వీస్(333N) బస్సుపై దాడి చేశారు.తాము చెప్పిన చోట ఆపలేదని బస్సు అడ్డగించిన నిమ్మకూరు గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు, అనగన మురళి.. బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. రిక్వెస్ట్ స్టాప్లోనే బస్సు ఆపుతామని డ్రైవర్ చెప్పగా.. డ్రైవర్ను కిందకు లాగి దాడిచేసేందుకు యత్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కండక్టర్ వీడియో తీశారు. దీంతో కండక్టర్పై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. -
టీడీపీ గూండాల అరాచకం..! నా తమ్ముడిని కత్తులతో..
-
భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త
-
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత భీమనాథం వెంకటప్రసాద్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వెంకట ప్రసాద్పై కత్తితో దాడి చేశారు. వెంటాడి మరీ వెంకట ప్రసాద్పై టీడీపీ గూండాలు కత్తులతో దాడి చేశారు. టీడీపీ గుండాల దాడిలో వెంకట ప్రసాద్, ఆయన తండ్రి గురవయ్య, అన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపపడ్డారు.టీడీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో వెంకట ప్రసాద్ స్పాట్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రసాద్ చనిపోయాడని భావించిన టీడీపీ గూండాలు వదిలేసి వెళ్లిపోయారు. గుంటూరు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. వెంకట ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే గాని పరిస్థితి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.ఈ హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ నేత అంబటి మురళీ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘వినుకొండలో ఇది రెండో దారుణం.. గతంలో రషీద్ను అత్యంత దారుణంగా చంపేశారు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. -
తువాలుతో మెడకు ఉచ్చేసి.. చంపేయాలని..
చిలమత్తూరు: చేతిలో మారణాయుధాలు పట్టుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ మూక రెచ్చిపోయింది..! ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుడే లక్ష్యంగా దాడికి దిగింది.. పైపెచ్చు బాధితుడిని పరామర్శించేందుకు వెళ్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడం ఈ దాడి వెనుక పెద్ద కుట్రను తేటతెల్లం చేస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎంపీపీ, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నించింది. శుక్రవారం హుస్సేన్పురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. చౌడేశ్వరీదేవి ఆలయంలో పూజల అనంతరం పురుషోత్తమరెడ్డి ఇంటికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీకి చెందిన బాబూరెడ్డి, నర్సిరెడ్డి, మరో నలుగురు మారణాయుధాలతో వచ్చారు. ఎంపీపీ ఎత్తుగా ఉండడంతో ఎడమ కాలిపై ఇనుప రాడ్డుతో కొట్టి కిందపడేశారు. ఆయన మెడలోని తువాలుతోనే ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. ఇంతలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో బాబురెడ్డి, అతడి అనుచరులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పురుషోత్తమరెడ్డిని హిందూపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. దాడి సంగతి తెలిసి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక, ఆమె భర్త వేణురెడ్డిలు ఎంపీపీని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా.. రెండో పట్టణ పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిలదీయడంతో వదిలేశారు. ఆస్పత్రిలో పురుషోత్తమరెడ్డిని దీపిక దంపతులతో పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరామర్శించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా పురుషోత్తమరెడ్డిపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ హిందూపురం సద్భావన సర్కిల్లో దీపిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీపీపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలోనే దీపికను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి.. వన్టౌన్ స్టేషన్కు తరలించారు. ఆమెతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుడికే కట్లు.. టీడీపీ వింత నాటకం పురుషోత్తమరెడ్డిపై దాడిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ వింత నాటకానికి తెరతీసింది. నిందితులను పార్టీ నుంచి తొలగించాల్సిన టీడీపీ నేతలు అందుకు విరుద్ధంగా చిలమత్తూరు రప్పించుకుని, లేని గాయానికి కట్టు కట్టించారు. తర్వాత ప్రెస్మీట్ పెట్టి బాధిత ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపైనే విమర్శలు చేయించారు. నిందితుడు బాబూరెడ్డి కుడి మణికట్టు దగ్గర వాపు ఉందని చెబితే మాత్ర ఇచ్చామని, అయినా నొప్పి ఉందని కట్టు కట్టించుకున్నారని, కంప్రెషన్ బ్యాండేజీ లేకపోవడంతో రక్త గాయాలకు కట్టే బ్యాండేజ్ ను కట్టినట్టు వైద్యాధికారి రోజా చెప్పడం గమనార్హం. -
ఆగని రష్యా, ఉక్రెయిన్ దాడులు
-
అరాచకాలకు కేరాఫ్ ‘బుడ్డా’
సాక్షి, నంద్యాల: అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తున్నారని.. వారితో దాడులు చేయిస్తూ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు. రేషన్ బియ్యం స్మగ్లింగ్గానీ, బెల్ట్ షాపుల నుంచి వసూళ్లు లేదా అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారాల్లో ఈ బ్యాచ్ ద్వారానే దోపిడీపర్వం సాగిస్తారన్న పేరుంది. అడ్డుచెబితే ‘అడ్డు’తొలగిస్తామన్నట్లుగా వారి్నంగ్లు ఇస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే కక్షసాధింపులకూ వెనుకాడడంలేదు. గత ఎన్నికల సమయంలో ‘ఎవడైనా ఎక్కువ మాట్లాడితే జీపునకు కట్టుకుని పోతా’ అంటూ ‘బుడ్డా’ చేసిన హెచ్చరిక ఆయన నేరస్వభావానికి అద్దంపడుతోంది. అందుకు తగ్గట్లుగానే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చెలరేగిపోతూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా.. అటవీశాఖ సిబ్బందిపై ఆయన బరితెగించి చేసిన దాడి ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఈ దాడి కాకతాళీయంగా జరగలేదని.. కక్షసాధింపులో భాగంగానే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే దాడిచేసినట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువుచేస్తున్నాయి. వైఎస్సార్ స్మృతివనంలో సిబ్బంది తొలగింపు.. ఎనిమిది నెలల క్రితం టీడీపీకి చెందిన దుండగులు ఆత్మకూరు మండలంలోని వైఎస్సార్ స్మృతివనంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దుండగులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఆత్మకూరు డీడీ సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా.. డీడీ సాయిబాబాను కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అలసత్వాన్ని క్షమించలేమని డీడీ చెప్పినట్లు సమాచారం. నాటి నుంచి ఎమ్మెల్యే పగతో రగిలిపోతున్నారు. గ్రావెల్ అక్రమార్కులకు వత్తాసు.. రెండునెలల కిందట సున్నిపెంటకు చెందిన కొందరు టీడీపీ కూటమి నాయకులు నల్లమల అడవిలోకి ప్రవేశించి అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ అటవీ సిబ్బందికి దొరికారు. వెంటనే సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కూటమి నాయకులు ఎమ్మెల్యేకు విషయం తెలిపారు. దీంతో ఆత్మకూరు డీడీ సాయిబాబాకు ఎమ్మెల్యే బుడ్డా కాల్చేసి ‘ట్రాక్టర్లు మా వాళ్లవే. వదిలేయండి’.. అన్నారు. ఈ విషయంలోనూ అటవీ అధికారి నిబంధనలు పాటించి ఒక్కో ట్రాక్టర్కు రూ.60వేల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా కక్ష సాధించాలన్న లక్ష్యంతోనే ఎమ్మెల్యే మంగళవారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఏడాది కాలంగా ఎమ్మెల్యే బుడ్డా ఆగడాలు.. » ఆత్మకూరు పట్టణంలో ఒక వైశ్య ప్రముఖుడిపై పట్టపగలే దాడికి పాల్పడ్డారు. తర్వాత బలవంతంగా కేసును రాజీ చేయించారు. » వెలుగోడుకు చెందిన మరో వ్యాపారిపై కేసులు పెట్టించి మానసికంగా, ఆర్థికంగా వేధించారు. » మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో జరిగిన మూడు హత్యలలో బుడ్డా అనుచరులే ప్రధాన నిందితులు. » కడపలో టీడీపీ మహానాడుకు ఆత్మకూరు నుంచి వాహనాల్లో వెళుతూ దారిలో భోజన ఏర్పాట్లు చేశారు. ఆహారం సరిపోకపోవడంతో వంట మాస్టర్ను చితకబాదారు. » బుడ్డా అనుచరుడొకరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయించుకున్నాడు. అయితే, తనకు చెప్పకుండా ఎలా చేయించుకుంటావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అడ్డొచి్చన మరో ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో వారంతా ఆస్పత్రిపాలయ్యారు. బాధితులను మీడియా ప్రతినిధులు ఎవరూ కలవకుండా ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే మనుషులను కాపలాగా ఉంచారు.రౌడీబ్యాచ్తో ఆగడాలు.. నిజానికి.. ‘బుడ్డా’ గత ఏడాది గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తరలింపు, రేషన్ బియ్యం స్మగ్లింగ్, బెల్ట్ షాపుల విషయంలో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వీటన్నింటినీ చక్కబెట్టేందుకు ఆయన ఒక రౌడీబ్యాచ్ను పెంచిపోషిస్తున్నారని, ఎవరిపైనైనా దాడిచేయాలంటే ఈ బ్యాచ్ అక్కడ వాలిపోతుందని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం కూడా ఎమ్మెల్యే వెంట ఈ రౌడీబ్యాచ్ ఉందని, వీరితోనే అటవీ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలుస్తోంది. అలాగే, రెండునెలల కిందట మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై భౌతికంగా దాడిచేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసిన ఘటన కూడా ఈ రౌడీబ్యాచ్ కనుసన్నల్లోనే జరిగింది. -
సీఎం చెంప పగలగొట్టిన వ్యక్తి
-
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై సంచలన ఆరోపణలు
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుపై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు సంచలన ఆరోపణలకు దిగారు. లోక్సభలో.. ఆయన, మరో కేంద్ర మంత్రి కలిసి తమపై దాడి చేశారని మీడియా ముందుకు వచ్చారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు(బుధవారం) లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. లోక్సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కలుగు జేసుకున్నారు. ‘‘సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం.. ప్రతిపక్షాలకే మంచిది కాదు. ప్రత్యేకించి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు. మీరెంత రచ్చ చేస్తే.. ప్రజలు మిమ్మల్ని అంతగా తిరస్కరిస్తారు. కాబట్టి.. చర్చలో పాల్గొనండి అని కోరారాయన. అయినా విపక్ష ఎంపీలు వినలేదు.అయితే నిరసన కొనసాగుతున్న టైంలో.. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రవ్నీత్ సింగ్ బిట్టూ తమపై దాడి చేశారని టీఎంసీ ఎంపీలు మిథాలీ బాగ్, శతాబ్ది రాయ్ ఆరోపించారు. ‘‘ ఆ ఇద్దరూ మమ్మల్ని తోసేశారు.. దాడి చేశారు.. ఇది సిగ్గు పడాల్సిన విషయం’’ మిథాలీ బాగ్ మీడియాతో అన్నారు. అయితే.. #WATCH | Delhi | TMC MP Mitali Bagh says, "While we were protesting against the bill, Union Ministers Ravneet Singh Bittu and Kiren Rijiju attacked me, they pushed me...This is condemnable..." pic.twitter.com/5MSkVPAGqD— ANI (@ANI) August 20, 2025దాడి ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎవరిపై అలాంటి దాడేం జరగలేదని ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. అమిత్ షా ప్రసంగిస్తున్న టైంలో బిల్లుల ప్రతులను కొందరు విపక్ష ఎంపీలు చించేసి ఆయనపై విసిరేశారు. ఆ ఎంపీలను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం లోక్సభ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘ఆపరేషన్ సిందూర్’కు తోక ముడిచిన పాక్.. శాటిలైట్ చిత్రాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి. -
Delhi: జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాపై దాడి
-
Bengaluru: సఫారీ వాహనంపైకి దూకి.. బాలునిపై చిరుత దాడి
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో గల బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్క్లో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు. జంతువులను వీక్షించేందుకు సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఆగగానే, ఒక చిరుత ఆ వాహనంపైకి దూకి, కిటికీ గుండా బాలునిపై దాని పంజాతో గాయపరిచింది. అధికారులు బాధిత బాలుడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.బాధిత బాలుడు సుహాస్.. బొమ్మసంద్ర నివాసి. తన తల్లిదండ్రులతో కలిసి సెలవు రోజున బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్లో సఫారీకి బయలుదేరాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దానిలో చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ ఘటన దరిమిలా బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘శ్రీఎక్స్’ పోస్టులో.. చిరుతపులి సఫారీ జోన్ లో.. నాన్ ఏసి బస్సు సఫారీ జరుగుతుండగా, 12 ఏళ్ల బాలునిపై చిరుత దాడి చేసిందన్నారు. బాలునికి వెంటనే ప్రధమ చికిత్స అందించారన్నారు. సఫారీ వాహనంలోని కెమెరా స్లాట్లతో సహా అన్ని విండో గ్రిల్లను సురక్షితంగా కవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాన్-ఎసి సఫారీ బస్సుల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. బన్నెర్ఘట్ట జూలాజికల్ పార్క్లోని వన్యప్రాణుల సఫారీ పర్యాటకులను ఎంతగానే ఆకర్షిస్తుంటుంది. కాగా ఈ పార్కులోని చిరుతలు, ఏనుగులు తరచూ, నగర శివార్లలోని నివాస ప్రాంతాలలోపికి ప్రవేశిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
Viral Video: కొండచిలువ ఎటాక్...నాకేం భయం!
-
ఇప్పటికీ మా వాళ్లు ఆసుపత్రిలోనే ఉన్నారు
-
Viral Video: కర్మ రిటర్న్ అంటే ఇదే.. తనని తినాలనుకున్న యువతిపై రొయ్య ప్రతీకారం..
-
Jammu and Kashmir: ఆర్మీ పోస్ట్పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి
బారాముల్లా : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు మృతిచెందాడు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. The Indian Army launched a large-scale cordon and search operation in the Uri sector of Baramulla district, foiling a major infiltration attempt. | Ashraf WaniRead more: https://t.co/fqZp5RcT8I#JammuandKashmir #Baramulla #Uri pic.twitter.com/gn7SIrk8wl— IndiaToday (@IndiaToday) August 13, 2025పాక్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్కు భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ మూకలు
సాక్షి టాస్్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. -
బస్సు డ్రైవర్ పై చేయి చేసుకున్న మహిళ
-
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
Big Question: పులివెందులలో పచ్చ సైకోలు ఒక్క సీటు కోసం వందలాది తలలు!
-
టీడీపీ గూండాల దాడిపై రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసన
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ గూండాలు ఎమ్మెల్సీ రమేష్యాదవ్ మీద దాడిచేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో వేలాదిగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శనలు చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ నాయకుడు రమేష్ యాదవ్పై దాడిచేసిన వారిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలుగుదేశం వర్గీయులు ఈ దాడులకు తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేమని అడ్డదారుల్లో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏడాదన్నరగా కూటమి పాలనలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతూ, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతోందని మండిపడ్డారు. రెడ్బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూసి జ్యోతిరావ్ పూలే ఆత్మ క్షోభిస్తోందన్నారు. అధికారం ఉంది కదా అని బీసీలపై దౌర్జన్యానికి, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించబోమన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. శాంతియుతంగా నిరసన గుంటూరు హిందూ కాలేజీ కూడలి, తిరుపతి బాలాజీ కాలనీ, అనంతపురం జెడ్పీ కార్యాలయం, నెల్లూరు మినీ బైపాస్రోడ్డు, కర్నూలులోని బిర్లా సర్కిల్, నంద్యాలలోని పద్మావతినగర్ ఆర్చి, కాకినాడ, ఏలూరు, అనకాపల్లిల్లో జ్యోతిరావ్ పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావ్ పూలే విగ్రహానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్లో జ్యోతిరావ్ పూలే చిత్రపటంతో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు. -
పులివెందులలో టీడీపీ అరాచకాలపై YS జగన్ ఆగ్రహం
-
సైకిల్ పార్టీ కాదు..సైకో పార్టీ.. పులివెందులలో తెగబడ్డ టీడీపీ గూండాలు
-
YSRCP నేతలపై దాడి ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షులు
-
ఓటమి భయంతో YSRCP నేతలపై రాడ్లు, కర్రలతో దాడి
-
Ireland: ఇండియన్ డ్రైవర్పై జాత్యహంకార దాడి.. బాటిల్తో తలపై కొట్టి..
డబ్లిన్: ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో భారతీయ టాక్సీ డ్రైవర్ లఖ్వీర్ సింగ్ జాత్యహంకార దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు లఖ్వీర్ సింగ్ తలపై రెండుసార్లు బాటిల్తో దాడి చేశారు. కస్టమర్ల పేరుతో లఖ్వీర్ సింగ్ క్యాబ్లోకి ఎక్కిన ఇద్దరు యువకులు లఖ్వీర్ సింగ్పై దాడికి దిగారు. గడచిన రెండు వారాల్లో ఐర్లాండ్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై జరిగిన మూడవ దాడి ఇది.ఐర్లాండ్లోని డబ్లిన్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్లిన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం లఖ్వీర్ సింగ్ గత 23 ఏళ్లుగా ఐర్లాండ్లో ఉంటున్నాడు. పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి, లఖ్వీర్ సింగ్ తన క్యాబ్లో 20 ఏళ్ల వయసుగల గల ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. పాపింట్రీ వద్ద తమను దింపాలని వారు సింగ్కు చెప్పారు. క్యాబ్ గమ్యస్థానానికి చేరుకున్నాక ఆ ఇద్దరు యువకులు సింగ్పై దాడికి దిగి, బాటిల్తో అతని తలపై కొట్టారు. అక్కడిని నుంచి వారు పారిపోతూ ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అని గట్టిగా అరిచారని సింగ్ తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయడిన లఖ్వీర్ సింగ్కు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సింగ్ అత్యవసర సహాయం 999కి డయల్ చేశాడు. వారి సాయంతో ఆస్పత్రికి చేరుకున్నాడు. ఈ ఘటన తరువాత లఖ్వీర్ సింగ్ తీవ్రంగా కుంగిపోయాడు. టాక్సీ డ్రైవర్గా తిరిగి కొనసాగడం చాలా కష్టమని భావిస్తున్నాడు. గడచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని సింగ్ వాపోయాడు. ఈ ఘటన దరిమిలా తమ కుటుంబ సభ్యులు ఎంతో భయపడుతున్నారని అన్నాడు. ఆగస్టు ఒకటిన రాత్రి సుమారు 11:45 గంటలకు డబ్లిన్ 11లోని పాపింట్రీలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల ఒక వ్యక్తిని చికిత్స కోసం బ్యూమాంట్ ఆసుపత్రికి తీసుకువచ్చారని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్థానిక పోలీసులు తెలిపారు. -
జగన్ టూర్ సక్సెస్ తట్టుకోలేక ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ పై దాడి!
-
Ireland: భారత సంతతి యువకునిపై జాత్యహంకార దాడి
డబ్లిన్: ఐర్లాండ్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యువకునిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఆ యువకుడు తన అపార్ట్మెంట్కు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఆరుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్లో తాను ప్రేరేపిత జాత్యహంకార దాడిని ఎదుర్కొన్నానని భారత సంతతికి చెందిన డాక్టర్ సంతోష్ యాదవ్ ఘటనా క్రమాన్ని ‘లింక్డ్ఇన్’లో వివరించాడు.ఐర్లాండ్లో జాత్యహంకార యువకుల బృందం తనపై దాడి చేసిందని డాక్టర్ సంతోష్ యాదవ్ ఆరోపించారు.‘నేను రాత్రి భోజనం చేసిన తర్వాత, నా అపార్ట్మెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆరుగురు యువకుల బృందం నాపై వెనుక నుంచి దాడి చేసింది. తరువాత వారు నా కళ్లద్దాలను లాక్కొని, వాటిని పగలగొట్టి, నా తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపై ఆగకుండా కొట్టారు. దీంతో నాకు తీవ్ర రక్తస్రావం అయింది. గార్డ్కు కాల్ చేసి,విషయం చెప్పాను. అంబులెన్స్ నన్ను బ్లాంచర్డ్స్టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా చెంప ఎముక విరిగిందని వైద్య బృందం నిర్ధారించింది. ఇప్పుడు నన్ను ప్రత్యేక వైద్యసంరక్షణ కోసం రిఫర్ చేశారు’ అని సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.ఐర్లాండ్లో మైనారిటీలపై హింస పెరుగుతున్నదని, అయినా అధికారులు నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్ యాదవ్ ఆరోపించారు. దాడులు చేశాక వారు స్వేచ్ఛగా పారిపోతున్నారని, తిరిగి దాడి చేయడానికి ధైర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను సంతోష్ యాదవ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.యాదవ్ తన పోస్ట్లో రెండు ఫోటోలను ఉంచారు. ఒక ఫొటోలో అతని ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండగా, మరొక ఫోటోలో అతని చేతిలో విరిగిన కంటి అద్దాలు ఉన్నాయి. డాక్టర్ సంతోష్ యాదవ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేశాడు. తరువాత ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుండి పీహెచ్డీ చేసాడు. ప్రస్తుతం సంతోష్ యాదవ్ సీనియర్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉంటున్న ఆయన ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. -
హమాస్కు అరబ్ దేశాల గట్టి షాక్
టెల్ అవీవ్: గాజాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్కు అరబ్ దేశాల నుంచి గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండను అరబ్ దేశాలు ఖండిస్తూ, ఒక ప్రకటన విడుదల చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వైదొలగాలని హెచ్చరించాయి. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనను స్వాగతించింది. దీనిని చారిత్రాత్మక ఘటనగా పేర్కొంది.సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్తో సహా పలు అరబ్, ముస్లిం దేశాలు తాజాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఖండించాయి. గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ సమూహం దాని పాలనను ముగించాలని కోరాయి. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్) సమావేశంలో అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), 17 ఇతర దేశాలు ఒక ప్రకటన చేశాయి. హమాస్ తన చెరలో ఉంచిన బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో అరబ్ దేశాలు,ముస్లిం దేశాలు సంయుక్తంగా గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా శరణార్థుల కోసం పాటుపడుతున్న యూఎన్ ఏజెన్సీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయెల్ నేతలను కోరాయి. గాజాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విదేశీ దళాలను మోహరించాలని అరబ్ నేతలు కోరారు. గాజాలో తలెత్తుతున్న ఆకలి చావులను ఖండిస్తున్నామని అరబ్ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే అరబ్ ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నదన్నారు. కాగా గాజాలో ఘర్షణలు ప్రారంభమై 21 నెలలు గడిచింది. ఈ ఘర్షణల్లో 1,200 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ యుద్ధం గాజాలోని లక్షలాదిమందిని నిర్వాసితులను చేసిందని, ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభానికి కారణంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
పారిశుద్ధ్య కార్మికురాలిపై TDP నేత కఠారి ఉమామహేశ్వరరావు దాడి
-
‘గాజా’పై సిగ్గుపడేంత మౌనం?.. ప్రధాని మోదీకి సోనియా సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న మారణహోమంపై ప్రధాని మోదీ పదిమందీ సిగ్గుపడేంత మౌనాన్ని ఎందుకు వహిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారతదేశ విలువలను నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.రాజ్యాంగ విలువలకు ద్రోహంగాజా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన వైఖరి లేకపోవడం అనేది మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లే అవుతుందని సోనియా గాంధీ ప్రముఖ హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగరణ్లో ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న విధ్వంసకర దాడి విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె అన్నారు. గాజా ప్రజలకు అనుకూలంగా భారత్ స్పష్టమైన, ధైర్యమైన వైఖరిని ప్రకటించాలని సోనియా గాంధీ కోరారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యపై ప్రధాని మోదీ సిగ్గుపడే మౌనం అవలంభిస్తున్నారని ఆమె ఆరోపించారు.పాలస్తీనాను భారత్ గుర్తించిందిఇజ్రాయెల్ చర్యలను అనాగరికం, జాతిహత్యగా సోనియా అభివర్ణించారు. 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన మెదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడులను ఎవరూ సమర్దించలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ రెండేళ్ల దాడుల కారణంగా ఇప్పటివరకూ 17 వేల మంది చిన్నారులతో సహా, 55 వేలమంది హతమయ్యారని సోనియా గాందీ ఆవేదన వ్యక్తం చేశారు.ట్రంప్ రియల్ ఎస్టేట్ కోసమే..ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై సైనిక దిగ్బంధనను విధించాయని, ఉద్దేశపూర్వకంగా అక్కడి జనాభాకు మందులు, ఆహారం, ఇంధన సరఫరాను అడ్డుకున్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు వారి కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ కోసం గాజాలో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నారని సోనియా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లడంలో దక్షిణాఫ్రికా ధైర్యమైన అడుగు వేసిందని సోనియా పేర్కొన్నారు. ఫ్రాన్స్.. పాలస్తీనా దేశాన్ని గుర్తించిందని, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఇజ్రాయెల్ నేతలపై ఆంక్షలు విధించాయని సోనియా పేర్కొన్నారు.జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చభారతదేశం ప్రపంచ న్యాయానికి చిహ్నంగా నిలిచిందని, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఉద్యమాలకు ప్రేరణ కల్పించిందని, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటానికి నాయకత్వం వహించిందని సోనియా గుర్తు చేశారు. అమాయక ప్రజలను క్రూరంగా వధిస్తున్న సమయంలో.. భారతదేశం తన విలువలను వదులుకోవడం మన జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చ.. మన రాజ్యాంగ విలువలకు చేసే ద్రోహం అని సోనియా పేర్కొన్నారు. సోనియా కుమార్తె, లోక్సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ గాజాలో శాంతికి గట్టిగా మద్దతు పలికారు. -
మంత్రి సత్యకుమార్ ఇలాకాలో వడ్డీ వ్యాపారుల దాష్టీకం


