ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి | Russia lashes out at Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

Feb 27 2026 9:03 AM | Updated on Feb 27 2026 9:51 AM

Russia lashes out at Ukraine

రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం మరోసారి భీకరంగా మారింది. నిన్న గురువారం రాత్రి  ఆ దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు,  బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకపడినట్లు తెలుస్తోంది.  ఈ దాడులలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ  పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఇరు దేశాల మధ్య ఓ వైపు శాంతి చర్చలకు అవకాశం ఉందంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకపడింది. ఆదేశంలోని రైల్వే, ఎనర్జీ సెక్టార్ లక్షంగా దాడులు జరిపింది.  ఈ అటాక్స్‌లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా  పెద్ద ఎత్తున భవనాలు నెలకొరిగాయి.

అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. తమ దేశంపై 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందన్నారు. వాటిలో 374 డ్రోన్లను, 32 మిస్సైల్స్‌ను, 5 క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకాయన్నారు.  రష్యా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వారిలో పిల్లలు అధికంగా ఉన్నారని  జెలెన్‌స్కీ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement