అమరులకు ఘన నివాళి  | Pm Modi Tribute To security personnel | Sakshi
Sakshi News home page

అమరులకు ఘన నివాళి 

Dec 13 2025 8:10 PM | Updated on Dec 14 2025 5:59 AM

 Pm Modi Tribute To security personnel

2001 పార్లమెంట్‌ దాడికి 24 ఏళ్లు 

నివాళులర్పించిన ప్రధాని మోదీ, రాహుల్, సోనియా 

దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరువదు: రాష్ట్రపతి ముర్ము 

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంట్‌పై ఉగ్రమూకలు విరుచుకుపడి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌ భవనంపై జరిగిన ఆ భయానక దాడిలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాస్వామ్య దేవాలయాన్ని రక్షించుకున్న వీర జవాన్లను యావత్‌ దేశం స్మరించుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో అమరవీరులకు ఘన నివాళులరి్పంచారు. 

ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు యతి్నంచగా పార్లమెంట్‌ సెక్యూరిటీ సరీ్వస్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీసులు వారిని నిలువరించారు. ఉగ్రవాదులెవరినీ లోపలికి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్‌ సెక్యూరిటీ సరీ్వస్‌ సిబ్బంది, ఒక తోటమాలి, టీవీ జర్నలిస్ట్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్‌ భవన ప్రాంగణంలోనే మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఉపరాష్ట్రపతి, మోదీ, రాహుల్, సోనియా నివాళి  
పార్లమెంట్‌ హౌస్‌ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాం«దీ, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి వీర జవాన్లకు సెల్యూట్‌ చేశారు. 

ధైర్యసాహసాలకు సలాం: ప్రధాని మోదీ 
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ’2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరులను దేశం నేడు స్మరించుకుంటోంది. ఆనాడు వారు చూపిన ధైర్యం, అప్రమత్తత, కర్తవ్య దీక్ష అమోఘం. సంక్షోభ సమయంలో వారు ప్రదర్శించిన తెగువకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’అని కొనియాడారు. 

ఉగ్రవాదంపై పోరుకు పునరంకితమవుదాం: రాష్ట్రపతి 
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఎక్స్‌’వేదికగా స్పందిస్తూ.. ’2001లో పార్లమెంట్‌ను రక్షించుకునే క్రమంలో ప్రాణాలరి్పంచిన వీరనాయకులకు దేశం సెల్యూట్‌ చేస్తోంది. వారి త్యాగం మన జాతీయ భావనను ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. అమరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా పునరంకితమవుదాం’అని సందేశం ఇచ్చారు. 

కమలేష్‌ కుమారికి సీఆర్పీఎఫ్‌ నివాళి 
ఉగ్రవాదులను అడ్డుకోవడంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి, మరణానంతరం ’అశోక చక్ర’పురస్కారం అందుకున్న సీఆరీ్పఎఫ్‌ కానిస్టేబుల్‌ కమలేష్‌ కుమారికి సీఆరీ్పఎఫ్‌ ప్రత్యేక నివాళులర్పించింది. ఆమె చూపిన తెగువ ’సదాస్మరణీయం’అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. జాతి సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని తిప్పికొట్టిన వీరుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement