తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు | Voters get till Oct 7 to file claims as Telangana SIR extended | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు

Sep 7 2026 8:40 PM | Updated on Sep 7 2026 8:59 PM

Voters get till Oct 7 to file claims as Telangana SIR extended

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువును పొడిగించారు. అభ్యంతరాలను స్వీకరించే గడువు గత షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 16 వరకు ఉంది. అయితే, దీన్ని ఇప్పుడు అక్టోబరు 7 వరకు పొడిగించారు. తుది జాబితాను గత షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబరు 19న ప్రకటించాల్సి ఉండగా, రివైజ్డ్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇప్పుడు నవంబరు 9న ప్రకటిస్తారు.  

సీఈవో కీలక సమావేశం
తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి సోమవారం అదనపు సీఈవో డాక్టర్‌ వసం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఉప సీఈవో జి.ఎస్‌. చారి కలిసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)-2026పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఓటరు నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు)తో వీడియో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఎస్ఐఆర్‌-2026 కింద నోటీసుల పంపిణీ, విచారణల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన దృష్టి సారించి, ఈ కింది సూచనలు చేశారు.

నోటీసుల పంపిణీ: ప్రతి నోటీసును సంబంధిత ఓటరుకు బూత్‌ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) వ్యక్తిగతంగా అందజేసేలా చూడాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల చిరునామాలను గుర్తించేందుకు బూత్‌ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సహాయం బీఎల్‌ఓలు తీసుకోవాలి.

పెండింగ్‌ కేసుల పరిష్కారం: జిల్లాలకు అందించిన అదనపు లాగిన్‌లను వినియోగించి పెండింగ్‌ కేసులను సకాలంలో పరిష్కరించేలా చూడాలి.

అన్‌-మ్యాపింగ్‌, అసాధారణ కేసుల జాబితాలు: రాజకీయ పార్టీల సమావేశాల్లో అన్‌-మ్యాపింగ్‌, అసాధారణతల కేసుల జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేయాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాల కాలంలో బీఎల్‌ఏలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలి.

పత్రాల అప్‌లోడ్‌: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు పత్రాలను సరిగ్గా అప్‌లోడ్‌ చేయాలి. కంప్యూటర్‌ ఆపరేటర్లు ఎలాంటి తప్పులు చేయకూడదు. వారి పర్యవేక్షణలో కంప్యూటర్‌ ఆపరేటర్లు చేసిన తప్పులకు ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు బాధ్యత వహించాలి.

విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగుల (పీడబ్ల్యూడీలు) ఇళ్లకు సూపర్‌వైజర్లు వెళ్లాలని ఆదేశించారు. ఓటర్లకు సహాయం చేసేందుకు ఈఆర్‌ఓ, డీఈఓ స్థాయిలో సహాయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి.

అదనంగా, నోటీసుల అందజేత, విచారణల షెడ్యూల్‌, ఈఆర్‌ఓ, డీఈఓ లాగిన్‌లలో పెండింగ్‌ కేసుల పరిష్కారంపై అన్ని జిల్లాల డీఈఓలతో ప్రధాన ఎన్నికల అధికారి పురోగతిని సమీక్షించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement