హైదరాబాద్ : చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంగళవారం భక్తుల సందడి మధ్య బంగారు బోనం సమర్పించారు.
మొదట జోగినిల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, పోతురాజుల విన్యాసాల నడుమ బంగారు బోనాన్ని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకురాగా.. స్థానికులతో పాటు చార్మినార్ను దర్శించేందుకు వచ్చిన పర్యాటకులు కూడా ఘనంగా స్వాగతం పలికారు.
భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు బోనంతోపాటు పట్టువ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించారు.


