హైదరాబాద్: నగర శివార్లలోని కాటేదాన్, బాలాపూర్ కేంద్రంగా సాగుతున్న ఆహార కల్తీ దందాకు హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సరై్వలెన్స్ టీమ్ (హెచ్–ఫాస్ట్) చెక్ చెప్పింది.
మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు మూడు సంస్థల్లో కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
వీటి యజమానుల్ని అరెస్టు చేసిన అధికారులు 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.1 టన్నుల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
సీపీ సజ్జనర్ చేతుల్లోని ఈ గ్లాసులు చూశారా.. ఒకటి రంగు నీళ్లతో ఉండగా.. మరొకటి సాధారణ నీటితో కనిపిస్తోంది. విషయమేమిటంటే.. కల్తీ లవంగాలున్న నీళ్ల గ్లాసు రంగులోకి మారగా.. మామూలు లవంగాలు ఉంచిన గ్లాసులోని నీళ్లు మాత్రం స్వచ్ఛంగా ఉన్నాయి. కల్తీ మసాలా దినుసులు పట్టుబడిన సందర్భంగా తేడా ఇలా ఉంటుందని సీపీ చూపించారు.
ఓ మిక్సర్లో 200 కేజీల ఆవాలు, నల్లటి క్లాత్ డై 200 గ్రాములు (వస్త్రాలకు వేసే రంగు) 5 లీటర్ల నీటిలో కలిపి వేస్తున్నారు.
ఆవాలు మెరుస్తూ ఆకర్షణీయంగా ఉండటానికి టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కూడా కలుపుతున్నారు.
సాధారణంగా కల్తీ మసాలా దినుసుల్ని నీళ్లల్లో వస్తే వాటి రంగు నీటిలో కలుస్తుంది. ఫ్యాబ్రిక్ డై వాడితే అలా జరగదు.


