హైదరాబాద్: దుండిగల్ సర్కిల్పరిధిలోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాజుపాలెం భావన ఈసీఐఎల్ ఉంటూ టెక్మహీంద్రా లో ప్రాసెస్ అసోసియేట్గా పనిచేస్తోంది. మూడు రోజులు సెలవు తీసుకున్నందున తనను ఉద్యోగం నుంచి తొలగించారంటూ బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అక్కడ ఎలాంటి న్యాయం దొరక్కపోవడంతో గురువారం టెక్ మహేంద్ర ముందు కూర్చొని నిరసనకు దిగింది. దుండిగల్ పోలీసులు వచ్చి యాజమాన్యంతో మాట్లాడగా తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆరోపించింది. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ..తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈనెల 17నుంచి 3 రోజుల సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. అయితే తరువాత తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ–మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది.
మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన
తనను అకారణంగా జాబ్లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు… https://t.co/9iimUJ6vu4 pic.twitter.com/J6pHXZQlew— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026


