అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక.. | Couple Attempts Ends Life In Siddipet | Sakshi
Sakshi News home page

అప్పులిచ్చినవారి వేధింపులు భరించలేక..

Dec 22 2025 7:47 AM | Updated on Dec 22 2025 8:04 AM

Couple Attempts Ends Life In Siddipet

బెజ్జంకి (సిద్దిపేట): అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్, రేణుకలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీహర్ష (33)కు మూడేళ్ల క్రితం రుక్మిణి (28)తో వివాహం జరిగింది. బెజ్జంకిలో వస్త్ర దుకాణం పెట్టుకుని అక్కడే జీవిస్తున్నారు. 

వీరికి కూతురు హరిప్రియ ఉంది. కాగా శ్రీహర్ష తన మిత్రుడి వద్ద డబ్బులు తీసుకుని, మరో మిత్రునికి ఇచ్చాడు. డబ్బులివ్వాలని అప్పుచి్చన వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వేధిస్తుండగా, తీసుకున్న వ్యక్తి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో వారి వేధింపులతో అవమానంగా భావించిన శ్రీహర్ష, భార్య, కూతురుతో కలిసి క్రిమిసంహారక మందు తాగారు. చిన్నారి రోదన విని సమీప వ్యక్తులు శ్రీహర్ష తండ్రికి సమాచారమందించారు.

 అతను వచ్చి ఇంటి తలుపులు తెరిచి వెళ్లేసరికి అప్పటికే రుక్మిణి మృతి చెందింది. శ్రీహర్ష, చిన్నారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను కరీంనగర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా చిన్నారి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమ చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య పరిశీలించారు.   

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement