సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటజీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.1.40 కోట్ల పనుల బిల్లుల వెరిఫికేషన్ పేరుతో ఓ కంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు.. చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తోంది.


