సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మూడుకార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50కి పైగా కార్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలన అదుపు చేశారు.
అర్ధరాత్రి 1: 30 సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించగా.. మంటలను గమనించిన స్థానికులు.. ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలన అదుపు చేశారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదమే తప్పింది.


