కొన్ని కళాఖండాలు గోడపై స్థానం సంపాదించుకుంటాయి. మరికొన్ని ఎవరిదో భవిష్యత్తులో చోటు చేసుకుంటాయి. ఈ ఆగస్టులో, పరోపకార్ 2026 ఈ రెండింటినీ ఒకచోట చేర్చుతోంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధునిక మరియు సమకాలీన కళాకారుల కళాఖండాలను సేకరించమని కళా సేకర్తలను ఆహ్వానిస్తూ, అదే సమయంలో అత్యంత అవసరమైన పిల్లల కోసం విద్యా ద్వారాలను తెరిచేందుకు సహాయం చేస్తోంది.
ఆర్ట్ కనెక్ట్ సహకారంతో సుష్మా తోట క్యూరేట్ చేసిన 'పరోపకార్ 2026: ఆర్ట్ ఫర్ ఎడ్యుకేషన్' కార్యక్రమం, ఆగస్టు 15-16 తేదీలలో, ఉదయం 10:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకు జూబ్లీ హిల్స్లోని స్పిరిట్ కనెక్ట్లో జరగనుంది. ఇది గ్యాలరీ స్థలాన్ని కళ, దాతృత్వం, విద్యల సంగమ స్థానంగా మారుస్తుంది.
క్యూరేటర్ సుష్మా తోటకు, 'పరోపకార్' కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు—ఇది నాచికేత తపోవన్తో ఆమెకున్న దాదాపు పదిహేనేళ్ల అనుబంధానికి పరాకాష్ట. ఆమె ప్రదర్శనలను క్యూరేట్ చేయడం ప్రారంభించడానికి చాలా కాలం ముందు, నాచికేత తపోవన్లో స్వచ్ఛందంగా పనిచేస్తూ, సైన్స్ బోధించారు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మార్గదర్శకత్వం వహించారు.
"మీరు పరోపకార్ నుంచి ఒక కళాఖండాన్ని ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు, మీరు ఒక బిడ్డను పాఠశాలకు పంపుతున్నట్లే," అని సుష్మా తోట అంటారు. "కళకు మన జీవితాలను సుసంపన్నం చేయడమే కాకుండా, ఇతరులకు అవకాశాలను సృష్టించే శక్తి కూడా ఉంది. పరోపకార్ ముఖ్య ఉద్దేశ్యం ఎల్లప్పుడూ అదే."
ఈ ప్రదర్శనలో ఎం.ఎఫ్. హుస్సేన్, ఎస్.హెచ్. రజా, అక్బర్ పదంసీ, క్రిషన్ ఖన్నా, హిమ్మత్ షా, తోట వైకుంఠం, సీమా కోహ్లీ వంటి ప్రఖ్యాత కళాకారులచే రూపొందించి, వారిచే ఆమోదించి ప్రింట్లు, సెరిగ్రాఫ్లు, ఎచింగ్లు, సిరామిక్లు, ఎంపిక చేసిన శిల్పాలు ఉన్నాయి. ప్రతి కళాకృతి కొనుగోలుకు అందుబాటులో ఉంది, దీని ద్వారా వచ్చే ఆదాయంలో 100% నాచికేత తపోవన్ ద్వారా నిరుపేద పిల్లల విద్యకు మద్దతుగా ఉంటుంది.
నాచికేత తపోవన్లో ఇప్పటికే చేరిన పిల్లల సంపూర్ణ విద్యకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఈ ఏడాది సేకరించిన నిధులు వారి కోడ్గల్ క్యాంపస్లో వృత్తి శిక్షణా కేంద్రాలు, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయంతో కూడిన ఒక కొత్త సదుపాయం ఏర్పాటుకు దోహదపడతాయి. ఈ విస్తరణ వల్ల ప్రస్తుతం చదువుకుంటున్న 300 మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని, అలాగే రాబోయే సంవత్సరాల్లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 3వేలు నుంచి 4 వేలు మంది దాక పిల్లలకు అవకాశాలు లభిస్తాయని అంచనా.
ఈ ఏడాది 'పరోపకార్' కార్యక్రమం స్పిరిట్ కనెక్ట్లో నిర్వహించబడుతుంది. ఈ వేదిక కళ, సంభాషణలు, సామూహిక దానధర్మాలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి ముదిత ట్రైబ్ మరింత మద్దతు ఇస్తోంది. పిల్లల మానసిక శ్రేయస్సుపై వారి దృష్టి, విద్యను, సామాజిక ప్రభావాన్ని పెంపొందించాలనే 'పరోపకార్' ఉన్నత లక్ష్యానికి తోడ్పడుతుంది.
కాగా, కళను కేవలం స్ఫూర్తినివ్వడానికే కాకుండా, విద్య ద్వారా పిల్లలకు శాశ్వత అవకాశాలను సృష్టించడానికి కూడా ఉపయోగిస్తున్నాము," అని ముదిత ట్రైబ్ ఫౌండేషన్ & ఆర్ట్ కనెక్ట్ వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి అన్నారు.
(చదవండి: ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..)


