breaking news
Fire Accident
-
టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్ : టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్షాహీ సమాదులైన సెవెన్టూంబ్స్ సబ్స్టేషన్ పక్కనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో వాణిజ్య సముదాయాల్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది రంజాన్ మాసం కావడంతో వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
-
Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం
కెర్జర్స్: స్విట్జర్లాండ్లో పెను విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ స్విట్జర్లాండ్లోని కెర్జర్స్ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక ప్రయాణీకుల బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలని చేసిన దుశ్చర్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్విస్ రాజధాని బెర్న్కు 20 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ ప్రధాన వీధిలో మంగళవారం సాయంత్రం 6:25 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న 'పోస్ట్బస్' (PostBus) ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేస్తూ, బయటకు రావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు, హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది.ఈ ఘటనపై ఫ్రిబోర్గ్ కాంటోనల్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి దీనిని బహుశా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నాం’ అని అన్నారు. బస్సు లోపలే ఏదో జరిగి మంటలు చెలరేగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్రిమినల్ విచారణను ప్రారంభించారు. స్విట్జర్లాండ్లో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పెద్ద అగ్నిప్రమాదం. ఈ ఏడాది జనవరి 1వ తేదీన క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఒక బార్లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు బస్సులో ఆరుగురు చనిపోవడం స్విస్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్విట్జర్లాండ్లో మరోసారి ఇంతటి భయంకర అగ్నిప్రమాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ❗️⚠️🇨🇭 - BREAKING: Tragic Incident in Kerzers, SwitzerlandA public PostBus caught fire Tuesday evening in the center of Kerzers, in Switzerland’s Fribourg canton, killing several people and injuring multiple others. The vehicle was completely destroyed in the blaze.Witnesses… pic.twitter.com/bURWbOgqcC— 🔥🗞The Informant (@theinformant_x) March 10, 2026 -
పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..
గురుగ్రామ్: హర్యానాలో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురుగ్రామ్లోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ పడి, ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, జింద్ జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఏడుగురు మహిళా కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.గురుగ్రామ్లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున పోగుపోసిన మట్టి ఒక్కసారిగా జారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీయగా, మరో నలుగురిని కాపాడారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.జింద్లో అగ్నిప్రమాదంజింద్ జిల్లా సఫిడాన్ ప్రాంతంలోని ఒక పెయింట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు మహిళా కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ రెండు దుర్ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జింద్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో రంగంలోకి విధ్వంసక శక్తులు? -
బొమ్మూరు ట్రాన్స్కో స్టోర్స్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్, సామాగ్రీ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ట్రాన్స్కో ఎస్ఈ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొమ్మూరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. -
TG: అంగన్వాడిలో అగ్ని ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: కొందుర్గులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఇతరాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
-
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. -
ప్రగతినగర్ ఫర్నీచర్ షాపులో భారీగా మంటలు
-
బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు..
హైదరాబాద్లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతినగర్లోని ఓ ఫర్నీచర్ షాపులో ఈ ఘోర అగ్నప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాకుండా దీంతో పుట్పాత్పై ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నించారు. రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే షార్డ్ సర్ప్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్కడే ఉన్న కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక ఓ దుకాణంలోమంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #Telangana | #HyderabadMassive fire in Bachupally gutted a furniture store near Vignan VNR College under Nizampet Circle limits.Firefighters rushed with multiple engines. No casualties reported. Further details awaited. pic.twitter.com/VSrkerhxfn— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) March 3, 2026 -
కూలర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం ఎగిసి పడుతున్న మంటలు
సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా కర్నూల్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కర్నూలు బాలాజీ నగర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో -
కాకినాడ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం
-
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే.. ప్రత్యేక సాక్షి షాకింగ్ నిజాలు
-
వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
-
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. మంటల్లో 50 మంది..!
-
లండన్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం
నిజమాబాద్ జిల్లా: లండన్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు తెలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న దక్షిణ లండన్లోని క్రోయ్డన్ప్రాంతంలో ఉన్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం అంతా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.ఈ ఘటనలో పెద్దాపురం (కాకినాడ జిల్లా)కు చెందిన గంటి అభిషేక్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. నిజమాబాద్ జిల్లాకు చెందిన సాయి శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీకర్ను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ శుక్రవారం మృతి చెందాడు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ముగ్గురు యువకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్కు వెళ్లి, చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినట్లు తెలిసింది. క్రోయ్డన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకర్ మృతితో నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం..
-
లండన్ లో అగ్నిప్రమాదం.. ఏపీ యువకుడి మృతి
-
లాడ్జిలో అగ్ని ప్రమాదం..ఒకరి సజీవదహనం
రాజంపేట: లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయాలతో బయటపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్రోడ్లో ఉన్న దీప్లాడ్జిలోని రిసెప్షన్ కౌంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన పొగతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు లాడ్జిపైకి చేరుకున్నారు. జనసంచారం తక్కువగా ఉండే సమయంలో లాడ్జిపై నుంచి కేకలు వినిపించడం, దట్టమైన పొగ రావడంతో కొందరు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల గుండా కిందకు దించి కాపాడారు. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి వెంకట శ్రీనివాస్(32) సజీవ దహనమయ్యాడు. ఇతడు కే–సూపర్ మార్కెట్లో ఎగ్జిక్యూటివ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులను సబ్కలెక్టర్ భావన, ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే పరామర్శించారు. ఘటనాస్థలాన్ని రాజంపేట అర్బన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించడంలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఘటనాస్థలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. -
ఇంట్లో అగ్నిప్రమాదం.. లండన్లో ఆంధ్రప్రదేశ్ యువకుడు మృతి
లండన్: ఇంగ్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన అభిషేక్, ఉన్నత విద్య కోసం 2023లో లండన్కి వెళ్లాడు. ఎంబీఏ పూర్తి చేసి అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం పొందాడు.ఈ క్రమంలో దక్షిణ లండన్లోని క్రోయ్డన్ ప్రాంతంలో ఆయన నివసిస్తున్న ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మరో ఇద్దరు బయటకు తప్పించుకోగలిగారు. అయితే, అభిషేక్ మాత్రం బయటకు రాలేకపోయాడు. కమ్ముకున్న పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఈ అగ్నిప్రమాదంలో రెండు అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. కిటికీలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఒకరు ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. భిషేక్ మృతి వార్త స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పెద్దాపురం ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో ప్రతిభావంతుడైన అభిషేక్, ఎంబీఏ పూర్తి చేసి మంచి కెరీర్ అవకాశాలు పొందాలని కలలు కనేవాడు. కానీ ఈ అగ్నిప్రమాదం ఆ కలలను మధ్యలోనే చిదిమేసింది. -
Hyd: షాపింగ్ మాల్కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు
-
మంగళ గౌరి షాపింగ్ మాల్.. ప్రమాదానికి ముందు.. తర్వాత
-
తగలబడ్డ మంగళ గౌరి షాపింగ్ మాల్
-
జూబ్లీహిల్స్లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్స్ మంటలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-36లో ఉన్న ప్రముఖ దుస్తుల బ్రాండ్ మాన్యవర్ షోరూం, మంగళగౌరీ షాపింగ్ మాల్లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్కు పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు.. మంటల్లో షాపింగ్ మాల్ సిబ్బంది చిక్కుకున్నట్టు సమాచారం. -
రాజంపేట లాడ్జిలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
-
Kerala: భారీ శబ్ధాలతో మూడు బస్సులు దగ్ధం
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి త్రివేండ్రం స్కాటిష్ స్కూల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన మూడు బస్సులు మంటలకు ఆహుతి కాగా, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో మరో వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వాహనాల నుంచి పెద్ద శబ్ధాలతో పాటు మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. కజకూట్టం, చాకై ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కజకూట్టం అగ్నిమాపక కేంద్ర అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెండు పాఠశాల బస్సులతో పాటు ఒక ట్రావెలర్ వాహనం పూర్తిగా కాలిబూడిదయ్యింది.ఈ ఘటనకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బస్సులకు ఎదురుగా పార్క్ చేసి ఉండాల్సిన ట్రావెలర్ వాహనం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల వైపునకు కదిలి ఉండటాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. ఎవరో కావాలనే ఆ వాహనాన్ని నెట్టి ఉండవచ్చని, మంటలు కూడా ఆ ట్రావెలర్ నుంచే ప్రారంభమైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి -
శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన ముప్పు
-
పేలిన ఏసీ.. శ్రీశైలంలో భక్తులకు తప్పిన ముప్పు
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైల దేవస్థానంలో మరో సారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. దేవస్థాన వసతి విభాగ పరిధిలోని వీఐపీ కాటేజీలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. కాటేజీలో ఉన్న భక్తులు భయాందోళనకు గురై కిందకు పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైల దేవస్థాన పరిధిలో సుమారు 35పైగా వీఐపీ కాటేజీలు ఉన్నాయి. ఆయా కాటేజీలు దాతలు నిర్మించి దేవస్థానానికి అప్పగించారు. దేవస్థానం భక్తులకు రోజువారి బాడుగ కింద ఇస్తుంది.ఇటీవల అబ్బూరు శ్రీనివాసరావు నిలయం పేరుతో నిర్మించిన కాటేజీని భక్తులకు ఇచ్చారు. మొదటి అంతస్తులో సుమారు 13మంది వరకు భక్తులు సేద తీరుతున్నారు. అయితే ఒక్కసారిగా కాటేజీలోని మొదటి అంతస్తులోని గదిలో ఏసీ పేలడంతో మంటలు చేలరేగాయి. అందులో ఉన్న భక్తులు భయాందోళనకు గురై ఏమి చేయాలో దిక్కుతోచక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.అప్పటికే మంటలు వ్యాపించి, నల్లటి పోగ కాటేజీ మొత్తం చుట్టుకుంది. సమాచారం అందుకున్న దేవస్థాన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వసతి విభాగం అధికారుల నిర్లక్ష్యం వలనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని భక్తులు వాపోతున్నారు. త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నామని, లేకుంటే ప్రాణాలు పోయేవని భక్తులు వాపోతున్నారు. -
ఆటోమెుబైల్ షాపులో అగ్నిప్రమాదం
సాక్షి నల్గొండ: నకిరికేల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆటో మెుబైల్ షాపులో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
FSL అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ బూడిద..
-
ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్) అగ్నిప్రమాదంలో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగపూర్ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం బృందం యత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చింది.ఈ నెల(ఫిబవరి) 7వ తేదీన జరిగిన ఎఫ్ఎస్ఎల్ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితో పాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. -
చర్చనీయాంశమైన అమీర్పేట అగ్ని ప్రమాద ఉదంతం
హైదరాబాద్ : అమీర్పేట.. వ్యాపార, వాణిజ్య, సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. ఇక్కడి మైత్రీవనంతో పాటు సత్యం టాకీస్ రోడ్డును గమనిస్తే అన్ని సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలతో పాటు కంప్యూటర్ సంబంధిత ఉత్పత్తుల విక్రయ, సరీ్వసింగ్ సెంటర్లే కొలువుదీరాయి. ప్రచారంలో ముందుండాలనే ఉద్దేశంతో ఎవరికి వారు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అయితే.. అటు భవనాల మెయింటెన్స్ నిర్వాహకులు, ఇటు సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ప్రచార హోర్డింగ్లకు ఇచ్చే ప్రాధాన్యం రక్షణకు ఇవ్వడం లేదు. ఇందుకు శుక్రవారం అమీర్పేట ఆదిత్య ట్రేడ్ సెంటర్లోని నీలగిరి బ్లాక్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదమే ఉదాహరణ. ఫైర్ సేప్టీ విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది. బయటపడే మార్గమేదీ? భవనాల మెట్లు ఎటువైపు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఎక్కడికక్కడ వ్యాపార కార్యకలాపాలు, శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే ఈ భవనాలు మొత్తం ప్రచార హోర్డింగ్లతో నిండిపోయాయి. ఇంచు గ్యాప్ లేకుండా ఏర్పాటుచేసిన హోర్డింగ్లే శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు అడుగడుగునా అడ్డు తగిలాయి. కనీసం నిచ్చెన వేయడానికి కూడా వీలులేకుండా ఇక్కడ హోర్డింగ్లు ఉండడంతో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే వేసవికాలం కావడంతో కేబుళ్లపై పవర్ లోడ్ ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇక్కడి కేబుళ్ల నిర్వహణపై పూర్తిస్థాయి దృష్టిసారించాల్సి ఉంది.ప్రమాదాలు సంభవించినప్పుడే హడావుడి.. గుల్జార్హౌస్ ఘటన, నారాయణగూడ కేబుల్ ప్రమాద ఘటనతో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. పూర్తిస్థాయిలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఫైర్సేప్టీ పరికరాలు కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నాయి. ఇటీవల అగి్నమాపక సిబ్బంది, హైడ్రా సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్లు చేపట్టి పలు సంస్థలకు చెందిన భవనాలను సీజ్ చేసిన విషయం విదితమే. ఫైర్సేప్టీ నిబంధనలను కఠినతరం చేస్తేనే అగ్ని ప్రమాదాలను నివారించే అవకాశముంది. సెల్లార్లలోనే వైద్యం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు ఆస్పత్రులు సెల్లార్లలోనే వైద్య సేవలు అందిస్తున్నాయి. ఎమర్జెన్సీ సేవలు, ఎమ్మారై, సీటీ స్కాన్, ఓపీ, రేడియేషన్ అధికంగా ఉండే కొన్ని పరికరాలను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కింద ఉన్న సెల్లార్, బీ–2 ఫ్లోర్లలో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్, ఇతర సిలిండర్లను నిల్వ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ పద్ధతులు అంతగానే ఉంటున్నాయి. చిన్న ప్రైవేటు దవాఖానాల నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. -
మైత్రీవనం అగ్నిప్రమాదంలో అదుపులోకి మంటలు
-
మైత్రీవనంలో భారీ అగ్ని ప్రమాదం
-
అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అమీర్పేటలోని మైత్రివనంలో నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నీలగిరి బ్లాక్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.భవనం నాలుగో అంతస్తులోని ఇనిస్టిట్యూట్లో విద్యార్థులు ఉండటంతో వారిని రక్షించేందుకు రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
నల్లమలలో కార్చిచ్చు
అచ్చంపేట: నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో కార్చిచ్చు రాజుకుంది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట రేంజ్ వటువర్లపల్లి, ఈగలపెంట బీట్ పరిధిలోని తాటిగుండాల సెక్షన్లో తవిసిపెంట, వజ్రాలమడుగు ప్రాంతంలో సుమారు 60 హెక్టార్ల విస్తీర్ణంలో అడవికి నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిప్పుంటుకోగా గురువారం అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.శాటిలైట్ ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫైర్ వాచర్లు, బేస్ క్యాంపు వాచర్లు, టైగర్ ట్రాకర్లు, బీట్ అధికారులు, శిక్షణాధికారులు బ్లోయర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. చీకటి పడటంతో బుధవారం రాత్రి మంటలు అదుపులోకి తేలేకపోయారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పక్క నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎత్తయిన కొండలు, లోయలు ఉన్నాయి. దీంతో నడవలేని పరిస్థితి వల్ల మంటలు ఆర్పడం కొంత కష్టంగా మారింది.గురువారం ఎఫ్ఆర్వో గురుప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టాస్క్ఫోర్స్కు చెందిన 20 మంది సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతాల్లో గడ్డి, రాళ్లు ఎక్కువగా ఉండడంతో మంటలు చెలరేగాయి. పశువులు, గొర్రెల కాపరులు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇందులో గడ్డి మాత్రమే కాలిందని, చెట్లకు ఎలాంటి నష్టం జరగలేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. -
60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!
సోషల్ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో పౌర సమాజం తక్షణమే స్పందించి బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.పాలక్కాడ్లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ ఎక్స్లో ఒక వీడియో షేర్ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. పౌరసమాజం స్పందించిన తీరు, చూపింని ధైర్యసాహసాలను 60 సెకన్ల వీడియో చూడవచ్చు.థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! True Kerala Story in 60 Seconds.Ottapalam a small town in Palakkad, but what happened there is a masterclass in crisis management.A moving bus caught fire & you can see a 60 second display of citizen bravery.10th Second: The bus doors opened. People started coming out.… pic.twitter.com/7usNBTGhyZ— FeverChills🥴 (@RebelR3volution) February 18, 202610వ సెకన్: బస్సు తలుపులు తెరుచుకున్నాయి. జనం బయటకు రావడం ప్రారంభించారు.30వ సెకన్: స్థానికంగా ఉన్న ఏ ఒక్కరూ ఈ సంఘటనను రికార్డ్ చేయడానికి రాలేదు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.35వ సెకన్: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 50వ సెకన్: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.60వ సెకన్: మంటలు ఆరిపోయాయి. ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది. ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు. అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్ ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది. సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలునోట్ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్ఫోన్తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు? -
నల్లమల బ్రహ్మగిరి రేంజ్లో చెలరేగిన కార్చిచ్చు
నాగర్ కర్నూల్: అమ్రాబాద్ నల్లమల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు పెద్ద ఎత్తున అడవి దగ్ధమైంది.శ్రీశైలం- హైదరాబాద్ దారి వెంబడి దాదాపు మూడు కిలోమీటర్లు పొడవున అడవి దగ్ధమైనట్లు సమాచారంచ మంటలు ఆర్పడటానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా, నల్లమల అడవుల్లో గతంలో అనేకసార్లు కార్చిచ్చులు సంభవించాయి. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో, మానవ చర్యల కారణంగా కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి.2024, ఫిబ్రవరి నెలలో నల్లమల ప్రాంతంలోని నంద్యాల–గిద్దలూరు జాతీయ రహదారి వద్ద కార్చిచ్చు జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బాంబూ అడవికి నిప్పు పెట్టారు. అంతకుముందు కూడా అడవుల్లో వేసవి కాలంలో తరచుగా చిన్నపాటి అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇవి వన్యప్రాణులు, పర్యావరణం, స్థానిక జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పుగా పరిగణించాయి.నివారణ చర్యలునల్లమల అడవుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అటవీ శాఖ స్థానిక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్థానిక గిరిజనులను "ఫైర్ వాచ్ర్స్"గా నియమించి, అగ్నిప్రమాదాలను గుర్తించడం, నియంత్రించడం కోసం శిక్షణ ఇస్తున్నారు.నల్లమల అడవులు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి గాంచింది. కానీ కార్చిచ్చులు పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి.. అడవుల్లో వేట, చెట్లను నరికడం, నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. -
న్యూయార్క్లో ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై చర్చిలో పేలుడు
న్యూయార్క్లో బూన్విల్లే పట్టణంలోని ఓ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక ఫైర్ ఫైటర్ సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బూన్విల్లేలోని 'అబండెంట్ లైఫ్ ఫెలోషిప్' చర్చిలో గ్యాస్ లీక్ అవుతుందన్న ఫిర్యాదు అగ్ని మాపక సిబ్బందికి అందింది.దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపడుతుండగానే ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఐదుగురిని వెంటనే యూటికాలోని విన్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫైర్ ఫైటర్తో పాటు మరొక పౌరుడి పరిస్థితి విషమంగా ఉంది.చర్చి పాస్టర్ కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. చర్చిలో వేడిని పుట్టించడానికి ఉపయోగించే ప్రొపేన్ సిలిండర్ల నుండి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనలో ఎటువంటి కుట్ర కోణం లేదని, ఇది ప్రమాదవశాత్తు జరిగినదేనని న్యూయార్క్ స్టేట్ పోలీసులు స్పష్టం చేశారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది సజీవ దహనం!
భివాడీ: రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కరౌలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 25 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది బయటపడలేక ఫ్యాక్టరీలోనే సజీవ దహనమయ్యారు.పోలీసులు గస్తీలో ఉండగా ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏఎండీ) సుమితా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు ఇంకా లోపలే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఖుష్ఖేరా, భివాడీ రీకో ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంటన్నర పాటు అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తిజారా డీఎస్పీ శివరాజ్ సింగ్ ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. భివాడీ ఎస్పీ, ఏడీఎం సహా ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. విచారణ అనంతరం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు -
చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
-
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
సాక్షి యాదాద్రి: చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావనం ఫార్మా కంపెనీలో (శనివారం) ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా అక్కడి ఒక కంపెనీలో రెండు రియాక్టర్ లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, నలుగురు కార్మికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చాయి.దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి వచ్చినట్లు సమాచారం. కాగా ప్రమాద సమయంలో కంపెనీలో 11 మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అగ్నిప్రమాదం సమయంలో భారీ శబ్ధాలు రావడంతో అక్కడి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఈ ప్రమాదంపై స్థానికులతో పాటు కార్మికుల కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. కంపెనీలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే అధిక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఫార్మా కంపెనీలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యవహారం పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. -
Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి
-
అగ్ని ప్రమాదం.. 10 పూరిగుడిసెలు దగ్ధం
మామిడికుదురు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడికుదురులో సంభవించింది. ఒక ఇంట్లో సిలిండర్ పేలడంతొ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరిగుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరిగుడిసెలు వరకూ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. -
Sangareddy: స్కూల్ లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
-
సంగారెడ్డి స్కూలులో అగ్నిప్రమాదం
సాక్షి సంగారెడ్డి: పోతిరెడ్డి పల్లిలో శ్రద్ధ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని స్కూలు బిల్డింగులో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ అయ్యిుండచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ రోజు మున్సిఫల్ ఎన్నికలు కావడంలతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థిులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. -
‘ఓటుకు నోటు’ సామగ్రి ఎఫ్ఎస్ఎల్లో లేదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఏ వస్తువులూ అగ్నిప్రమాదం జరిగిన రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో లేవని డీజీపీ బి. శివధర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి సాంకేతిక ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించామని చెప్పారు. కేసులో చార్జిషీట్ దాఖలు సైతం పూర్తయిందన్నారు. కొందరు తెలిసీ తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారని.. ఈ విషయంలో ఎలాంటి అను మా నాలకు తావులేదన్నారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం మీడియా సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్తో కలిపి డీజీపీ బి.శివధర్రెడ్డి మాట్లాడారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమా దానికి కారణాలపై సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు, నాగ్పూర్ లోని ఫైర్ సర్వీసెస్ నిపుణులతో కలిసి పరిశీలిస్తున్నామని చెప్పారు. పరిశీలన పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామ న్నారు. దగ్ధమైన ఎఫ్ఎస్ఎల్ సర్వర్లలోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ సాంకేతిక నిపుణులతోపాటు బయ టి నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అన్ని నివేదికలు ఎఫ్ఎస్ఎల్ నుంచి సంబంధిత అధికారులకు ఇప్పటికే పంపించామని చెప్పారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపా లిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామన్నారు. 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక మైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. పార దర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని డీజీపీ వివరించారు.నిరంతరం నిఘా..ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 27 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ. 3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ. 15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయించామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. -
Attapur: సర్వీస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం.. 3 కార్లు బూడిద
-
అత్తాపూర్: కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మూడుకార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50కి పైగా కార్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మంటలన అదుపు చేశారు.అర్ధరాత్రి 1: 30 సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించగా.. మంటలను గమనించిన స్థానికులు.. ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలన అదుపు చేశారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదమే తప్పింది. -
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర భివాండిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక హరిహర కాంపౌండ్లో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రమాదం ప్రభుత్వమే చేసిందా? కాలిబూడిదైన కీలక ఆధారాలు
-
నాంపల్లి ప్రమాదం.. 2015 కేసు ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యథావిధిగా నడుస్తుంది.2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు. -
ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం 'కీలక ఆధారాలు ఆహుతి'?
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే ట్రాక్పై ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి కేసులో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షల కోసం ఉన్నట్లు తెలిసింది. ఇలాంటివే ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్, బ్లడ్శాంపిల్స్, హార్డ్డిస్కులు, సెల్ఫోన్లు, ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ భద్రంగా ఉందా..? లేదా అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితోపాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 10.20 గంటలకు... అగ్ని ప్రమాదం శనివారం నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్స్లో జరిగింది. ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ప్రయోగశాల మొదటి అంతస్తు నుంచి పొగలు రావడాన్ని ఆఫీస్ బాయ్ క్రిష్ణ చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిఇచ్చారు. అప్పటికే ఆఫీసులో ఉన్న ముగ్గురు సిబ్బందితో కలిసి దట్టంగా వ్యాపించిన మంటలను ఆరి్పవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పొగధాటికి తట్టుకోలేక క్రిష్ణ అస్వస్థతకు గురికాగా, చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఐదు ఫైరింజన్లు, ఒక రోబో, రెండు వాటర్ ట్యాంకులతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నార్త్ జోన్ డీఐజీ శ్వేతా, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పగటి పూట అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం సంభవించిన భవనం పక్కనే నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రి ఉంది. మరొకవైపు అపార్ట్మెంట్లు ఉన్నాయి. రాత్రి వేళలో జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ అధికారుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్తోనే జరిగిందా..? లేక ఇంకా ఏదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు స్పష్టం చేస్తేనే... ప్రమాదంలో హార్డ్ డిస్కులు, కేసుల ఫైల్స్, కంప్యూటర్లు, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, శాంపిల్స్కు సంబంధించిన రసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అయితే, కాలిపోయిన వస్తువుల్లో ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఫోన్ట్యాపింగ్ కేసులకు సంబంధించి మొత్తం సమాచారం ఎఫ్ఎస్ఎల్లోనే ఉందా? అవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయా..? లేదా ఎఫ్ఎస్ఎల్లో ఉన్నవి కేవలం నమూనా కాపీలా..? అన్నది అధికారులు స్పష్టం చేస్తే కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన అధికారి ఒకరు మాత్రం ఈ ప్రధాన కేసుల ఆధారాలు ఇక్కడ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపే ఏ రకమైన ఆధారాలైనా.. విశ్లేషించి నివేదిక రూపొందించిన తర్వాత వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా ఎక్కడి నుంచి విశ్లేషణ కోసం పంపారో ఆయా యూనిట్లకు పంపుతారని తెలిపారు. కొన్ని కేసుల్లో కోర్టులు సైతం ఎఫ్ఎస్ఎల్కు ఆధారాలు పంపుతాయని, అలాంటి కేసుల్లో విశ్లేషణ తర్వాత సదరు వస్తువులు, ఆధారాలను తిరిగి కోర్టులకే అప్పగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆధారాల విశ్లేషణ తర్వాత రూపొందించే నివేదికలకు సంబంధించిన కాపీలను మాత్రం ఎఫ్ఎస్ఎల్లో రికార్డు కోసం భద్రపరుస్తారని పేర్కొన్నారు. శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో బహుశా అలాంటి నివేదికలకు సంబంధించిన ప్రతులు కాలిపోయే అవకాశం ఉండొచ్చని వివరించారు. ఈ ల్యాబ్లో ఏం చేస్తారంటే.. రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. షార్ట్సర్క్యూతోనే...: డీసీపీ శిల్పవల్లి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్స్, ఆధారాలు, సాక్ష్యాలకు కేంద్రంగా ప్రయోగశాల పనిచేస్తుందన్నారు. మంటల్లో కీలకమైన ఫైల్స్ కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తిస్థాయి విచారణలో తేలుతుందని చెప్పారు. ఆ సమయంపైనే అనుమానాలు ప్రభుత్వ కార్యాలయాలు సరిగ్గా ఉదయం 10 గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. అప్పడే ఒక్కొక్కరు లోనికి వస్తుంటారు. ఉద్యోగులు వచ్చే సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయం తలుపులు తెరుచున్న సమయంలోనే ఇతరులు ఎవరైనా లోనికి ప్రవేశించారా? ప్రవేశిస్తే ఆ సమయంలో పోలీసు సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడున్నారు? అదే సమయంలోనే షార్ట్సర్క్యూట్ జరిగిందా లేక అంతకు ముందే జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. హార్డ్ డిస్క్లు కాలిపోయాయి: అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్ మాన్ ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై మాకు ఉదయం 10.20 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే మంటలు ఎగసి పడుతున్నాయి. సమీపంలోని మరో రెండు ఫైర్ టెండర్లు రప్పించాం. మొదటి అంతస్తులో వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఉంది, హార్డ్ డిసు్కలు, కీలకమైన డాక్యుమెంట్లు మొత్తం మంటల్లో కాలిపోయాయి. సెకండ్ ఫ్లోర్లోని కెమికల్ ల్యాబ్కు మంటలు వ్యాపించకుండా నివారించాం. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అనుమానిస్తున్నాం. ఎమ్సీబీ వద్ద కేబుల్స్ సేకరించి పరీక్షిస్తున్నాం. ఓటుకు నోటు ఆధారాలు మాయం చేసేందుకే..: కేటీఆర్ ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓటుకు నోటు కేసులో వాయిస్ రికార్డింగ్లు తొలగించడంతోపాటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాధారాల కొరతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఎక్స్లో పోస్ట్చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదంతో ఏ కేసులో ఆధారాలు చెరిపేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నారు రేవంత్రెడ్డి అంటూ బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పెట్టిన పోస్ట్ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పైవిధంగా స్పందించారు. కిషన్రెడ్డి అనుమానాలు ఈ అగ్నిప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కీలకమైన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి కీలక ఆధారాలు అగ్నికి ఆహుతయ్యాయా? లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
అగ్నిప్రమాదం అనుమానాస్పదం: కిషన్ రెడ్డి
సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. -
నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.I am guessing the voice recordings of the famous “Vote for Note” case And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj— KTR (@KTRBRS) February 7, 2026ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారంనేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందిఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదుషార్ట్ సర్క్యూట్… https://t.co/4w0yY1tB17 pic.twitter.com/TrUmEPqY4Z— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం
-
నాంపల్లి: ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలకమైన తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే సీజ్డ్ ప్రాపర్టీ గదిలోని కీలక కేసులకు సంబంధించిన పేపర్ ఫైల్స్, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ధృవీకరించారు.శనివారం ఉదయం 10గం. ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను గమనించిన వాచ్మన్ అధికారులకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం అంతటా దట్టమైన పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ ల్యాబ్లోనే డీఎన్ఏ పరీక్షలు, ఫింగర్ప్రింట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కీలక కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలను ఇక్కడే భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో ప్రమాదం జరిగింది. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చాం. ఫైర్ సిబ్బంది శ్రమతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి అంతస్తులోని వివిధ కేసుల్లో ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. పలు కేసుల్లో సీజ్ చేసిన 40-50 కంప్యూటర్లు కాలిపోయాయి. మొదటి అంతస్తులో సెన్సిటివ్గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు బూడిదయ్యాయి. కెమికల్ లాబ్ మెటీరియల్ అంత రెండవ అంతస్తులో ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది’’ అని తెలిపారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యంత కీలకమైంది. ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్కడే ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేవలం సీజ్డ్ గదిలోనే ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
HYD: ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం.. అమ్మాయిలను కాపాడిన స్థానికులు
సాక్షి, ముషీరాబాద్: హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వాష్రూమ్లో షార్ట్ సర్య్కూట్తో గీజర్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు.. మంటలు వ్యాపించిన సమయంలో హాస్టల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలను స్థానికులు నిచ్చెన సాయంతో కిందకు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీనగర్లో ‘సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్’ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా, వాష్రూమ్లో షార్ట్ సర్య్కూట్తో గీజర్ పేలి మంటలు చెలరేగినట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, హాస్టల్లో మంటలు వేగంగా వ్యాపించి భవనం నుండి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో హాస్టల్లోని ఫర్నిచర్, దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక, హాస్టల్ యజమాన్యం నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీక్ వంటి కోణాల్లో పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. -
దారిలేదు.. ముగ్గురం చనిపోయేట్టు ఉన్నాం!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: ‘హలో... అన్నా, అన్నా.. మర్జాతే అన్నా. జగా నహీహై అన్నా’ నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిశ్వాస్ చాంబర్స్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో గత శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన ఆ షాపు ఆటో డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ మాటలు ఇవి. సెల్లార్లో ఉన్న చిన్నారుల్ని రక్షించడానికి వెళ్లి, తప్పించుకునే దారిలేక, చిక్కుకుపోయిన అతడు అక్కడి నుంచే అదే దుకాణంలో పనిచేసే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఈ కాల్లో అతడు మాట్లాడుతుండగా..వెనుక చిన్నారుల అరుపులు, ఏడుపులు సైతం వినిపించాయి. సదరు స్నేహితుడి ఫోన్లో రికార్డు అయిన ఈ కాల్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారి అనేక మందిని కన్నీరు పెట్టించింది. ఈ ఫోన్ సంభాషణను పరిశీలిస్తే ఆ దుకాణంలోని సెల్లార్, సబ్ సెల్లార్ సరుకుతో నిండిపోయి ఉండటం, ఎటూ కదలడానికి ఖాళీ లేకపోవడం, తలుపులు, గ్రిల్స్కు తాళాలు వేసి ఉండటం తదితర పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. మంటలు చుట్టుముడుతుండటం ఇంతియాజ్, చిన్నారులు భయంతో, పొగ నిండిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక వారు పడిన ఇబ్బంది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది అనేక సిటీజనుల హృదయాలను కలచివేసింది. ఈ కాల్లో మాట్లాడింది దుకాణ యజమానే అని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించట్లేదు. ఇదీ జరిగింది... ఈ దుకాణం సెల్లార్లో రెండు చిన్న గదులు ఉన్నాయి. ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తున్న బేబీ, తన కుమారుడు సమీర్తో కలిసి మరో గదిలో వాచ్మన్ తోకల యాదయ్య, తన భార్య లక్షి్మ, కుమారులు ప్రణీత్, అఖిల్లతో కలిసి ఉన్నారు. సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ , శాస్త్రీపురం వాసి హబీబ్ బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పని చేసేవారు. వినియోగదారులకు సంబంధించిన సరుకు డెలివరీ వీరి బాధ్యత. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న ఇంతియాజ్, హబీబ్ అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతో పాటు ప్రణీత్, అఖిల్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగి్వషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. ఈ ఐదుగురూ అక్కడే అసువులు బాశారు.ఇంతియాజ్, స్నేహితుడి మధ్య ఉర్దూలో జరిగిన సంభాషణ తెలుగులో...ఇంతియాజ్: హలో అన్న.. అన్న.. చనిపోతాం అన్న. ఎక్కడా దారి లేదు అన్న. స్నేహితుడు: అరె ఇటు ఎందుకు వచ్చావు? అటు నుంచి వెనుక వైపు నుంచి రా ఇం: ఎక్కడా స్థలం లేదు అన్న. చనిపోతాం అన్న. తలుపు మూసి ఉంది స్నే: ఏ తలుపు మూసి ఉంది? ఇం: వెనుకాల ఉన్న తలుపు మూసి ఉంది స్నే: అదెలా మూసి ఉంది ఇం: నాతోపాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు... ముగ్గురం చనిపోతాం అన్న స్నే: ఇంతియాజ్ ముందు నా మాట విను. ఇటు నుంచి రా బయటకు ఇం: ఎటు నుంచీ అవకాశం లేదు అన్నా అన్నీ మూసి ఉన్నాయి స్నే: అక్కడ గ్రిల్ గేట్ ఉంది కదా... దాని నుంచి బయటకు రా ఇం: అంతా చూశాను ఎక్కడ నుంచీ బయటకు రావడానికి ఆస్కారం లేదు స్నే: గ్రిల్ గేట్... గ్రిల్ గేట్.. సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో ఇం: ఏదీ తెరుచుకోవట్లేదు అన్న స్నే: తెరుచుకోవట్లేదా..? సెకండ్ సెల్లార్లోకి వెళ్లు ఇం: ఇక్కడ ఏం చేయలేను అన్న స్నే: ఏదో ఒకటి చేసి సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇంతియాజ్.. లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇం: లేదు అన్న.. ఏం కనిపించట్లేదు స్నే: అక్కడ ఉన్న వస్తువులు పక్కకు పడేృయ్ (ఈ సమయంలో ఇంతియాజ్, చిన్నారులు ఊపిరి అందక ఆయాస పడటంతోపాటు దగ్గుతున్నట్లు రికార్డు అయింది) ఇం: నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతకీ కనిపించట్లేదు స్నే: అదే చెబుతున్నా... ఇంతియాజ్ సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: వెనుక ఉన్న తలుపు తీయమని చెప్పు అన్న స్నే: ఇంతియాజ్ మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. కిందకు వెళ్లే పరిస్థితి లేదు ఇం: అన్న నేనేం చేయలేను.. కనిపించట్లేదు.. సమీర్ని వాళ్ల రూమ్ తలుపు తీయమని చెప్పు (ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన బేబీ కుమారుడే సమీర్) స్నే: మంటలు ఎక్కువగా ఉన్నాయి అక్కడకు వెళ్లడం కుదరదు. సెకండ్ సెల్లార్లోకి దూకెయ్ ఇం: ఎక్కడా స్థలం లేదు... నేను బయటకు రాలేను స్నే: పిల్లల్ని తీసుకొని సెకండ్ సెల్లార్లోకి వెళ్లిపో... ఇం: అన్నా... నేను వెళ్లలేను... అంతా చీకటి, ఏం కనిపించట్లేదు స్నే: టార్చ్ వేసుకో... ఏదో ఒకటి వేసుకో... సమీర్ గది తలుపు దగ్గరే మంట అంటుకుంది ఇం: వెళ్లలేం అన్న స్నే: ఎవరెవరు ఉన్నారు కింద ఇం: ముగ్గురం ఉన్నాం స్నే: ఆగు నేను పంపిస్తాను -
Nampally : నన్ను కాపాడండి ప్లీజ్..!
-
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బెంగళూరు: రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఏ క్షణంలో ప్రమాదానికి గురవుతాయోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా కర్ణాటక శివమొగ్గ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. హోసనగర నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన హోసనగర తాలూకా రిప్పన్పేట పోలీసు స్టేషన్ పరిధిలో అరసాళు–సూడురు గ్రామాల మధ్య జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు కావడంతో శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ.. మంటలు అన్నపూర్ణేశ్వరి ప్రైవేటు స్లీపర్ బస్సు హోసనగర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో హఠాత్తుగా పొగలు వచ్చి మంటలు రేగాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన చెట్టును ఢీ కొట్టించి బస్సును నిలిపాడు. బస్సు అత్యవసర తలుపు, కిటికీల ద్వారా ప్రయాణికులు బయటకు దూకారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులోని ఇద్దరు డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలు తగిలాయి, పోలీసులు వారిని ఘటనపై విచారిస్తున్నారు. రవాణా, ఫైర్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. -
కోల్కతా అగ్నిప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
కోల్కతా పరిసర ప్రాంతంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేళ పశ్చిమ బెంగాల్ కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఆ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో కోల్కతా సమీపంలోని ఆనంద్పూర్లోని రెండు ఆహార గిడ్డంగుల్లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే యత్నం చేశాయి. అయితే గోదాంలోపల పోడి ఆహర పదార్థాలతో పాటు మండే ఆహర పదార్థాలు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఎంతకూ అదుపులోకి రాలేదు.దీంతో అందులో ఉన్న కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి నలుగురు కార్మికులు చాకచక్యంగా తప్పించుకోగలిగారు. దీంతో ఫైరింజన్ సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపులు చేపట్టగా 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉన్నందున అధికారులు మంటల్లో చిక్కుకున్న వారి బంధువుల రక్త నమూనా ఆధారంగా వాటి డెడ్ బాడీల గుర్తింపు చేపడుతున్నారు.ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు మోమో కంపెనీ రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా వారి కుటుంబాలకు ప్రతినెల ఆర్థిక సహాయం వారి పిల్లల చదువు బాధ్యతలు భరిస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో అగ్ని ప్రమాదం
-
ఐదుగురూ ఆహుతి!
సాక్షి, హైదరాబాద్/అబిడ్స్: నాంపల్లి స్టేషన్ రోడ్లోని సాయి బిశ్వాస్ చాంబర్స్లో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. మొత్తంమీద బచ్చాస్ ఫర్నిచర్ సంస్థ 18 గంటల పాటు మండింది. సెల్లార్లో మొదలైన మంటలు సాయి బిశ్వాస్ చాంబర్స్ సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతోపాటు నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. దీని గ్రౌండ్ ఫ్లోర్లో బచ్చాస్ దుకాణం ఎంట్రన్స్తోపాటు మరో ఫర్నిచర్ దుకాణం ఉంది. బచ్చాస్ ఫర్నిచర్ మూడు అంతస్తుల్లో విస్తరించి ఉండగా... సబ్–సెల్లార్, సెల్లార్లతోపాటు భవనం కుడి వైపు ఉండాల్సిన సెట్ బ్యాక్కు రేకులు వేసి గోదాములుగా వాడుతున్నారు. రెండు రోజుల క్రితం చైనా నుంచి భారీగా సరుకు వచ్చింది. వీటిని దుకాణంతోపాటు గోదాముల్లోనూ భద్రపరిచారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బచ్చాస్ దుకాణం సెల్లార్ వెనుక వైపు మంటలు అంటుకున్నాయి. ఇవి గ్రౌండ్తోపాటు మొదటి అంతస్తుకు పాకాయి. రెండు, మూడు, నాలుగు అంతస్తులతో పాటు సబ్–సెల్లార్లోకి పొగ విస్తరించింది. సబ్–సెల్లార్లో ఉన్న సరుకు మాత్రం యథాతథంగా ఉంది.కెమికల్స్ కూడా ఉండటంతో... ఈ భవనం సెల్లార్లో బచ్చాస్ ఫర్నిచర్కు సంబంధించిన సరుకుతోపాటు పెయింట్స్, కొన్ని రసాయనాలు ఉన్నాయి. వీటి వల్లే మంటల ధాటి ఎక్కువై ప్రమాద తీవ్రత పెరిగింది. సెల్లార్లో వెనుక వైపు కుడి పక్కగా రెండు చిన్న గదులు ఉన్నాయి. మెట్లకు సమీపంలో రేకులతో పార్టిషన్ చేసి వీటిని నిర్మించారు. ఈ మెట్లతోపాటు మిగిలిన చోట్ల ఉన్న గ్రిల్స్కు యజమానులు తాళాలు వేశారు. చిన్న గదుల్లోని ఒకదాంట్లో గుల్బర్గా నుంచి వలసవచ్చి బచ్చాస్ సంస్థలో స్వీపర్గా పనిచేస్తున్న బేబి (46), మరో గదిలో వాచ్మన్ తోకల యాదయ్య, తన భార్య లక్ష్మి, కుమారులు ప్రణీత్ (11), అఖిల్ (8) ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాదయ్య, లక్ష్మి బయటకు వెళ్లగా... 1.10 గంటలకు సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి అక్కడ ఉన్న సరుకుతోపాటు కెమికల్స్ కారణంగా వేగంగా విస్తరించాయి. కాపాడటానికి వెళ్లి...: సుభాన్నగర్కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ (28), శాస్త్రీపురం వాసి హబీబ్ (35) బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అర్టిప్రమాదం జరిగిన సమయంలో దుకాణం ఎదుట ఉన్న వీరిద్దరూ మంటల్ని చూసి అప్రమత్తమయ్యారు. సెల్లార్లో ఉన్న బేబీతోపాటు ప్రణీత్, అఖిల్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. దుకాణంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తీసుకొని సెల్లార్లోకి వెళ్లారు. దీనికి ఎడమ చివరన ఎంట్రన్స్ ఉండగా, కుడి చివరన వీరు ఉన్న గదులు ఉన్నాయి. అక్కడ వరకు వెళ్లిన ఇంతియాజ్ చిన్నారులు ఉన్న గదిలోకి, హబీబ్... బేబీ ఉంటున్న గదిలోకి వెళ్లారు. బేబీని తీసుకొని గది నుంచి బయటకు వచ్చిన హబీబ్కు బయటపడే మార్గం కనిపించలేదు. మంటల ధాటి పెరిగిపోవడంతో తాను లోపలకు ప్రవేశించిన మార్గం వరకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం, గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్లే మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్కు తాళం వేసి ఉండటంతో అక్కడే బేబీతో సహా పడిపోయాడు. మంటలతో ఇద్దరు... ఊపిరాడక ముగ్గురు ! కిందపడినపోయిన హబీబ్, బేబీ మంటలు అంటుకొని చనిపోయారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ఇంతియాజ్ వారు ఉన్న గదిలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం పొగ నిండిపోవడం, అది ప్లాస్టిక్, ఫైబర్తో పాటు కెమికల్స్ వల్ల వచి్చంది కావడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఈ గదిలోనే ఊపిరి ఆడక ఇందియాజ్ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయి ఉండారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. అయినా పొగ తగ్గకపోవడం, సెల్లార్, సబ్–సెల్లార్ సామాన్లతో నిండిపోవడంతో లోపలకు ప్రవేశించడానికి రెస్క్యూ టీమ్స్ శ్రమించాల్సి వచి్చంది. మొత్తమ్మీద ఆదివారం ఉదయం 9.10 గంటలకు సెల్లార్లోకి ప్రవేశించిన బృందాలు 9.15 గంటలకు హబీబ్, బేబీల మృతదేహాలు గుర్తించారు. 9.45 గంటల సమయంలో మిగిలిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. బేబీ కుమారులు లాల్ఖాన్, సమీర్ ఖాన్లు బచ్చాస్లోనే పని చేస్తున్నారు. వీరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. చిన్నారులతోపాటు ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను వారి కుటుంబీకులకు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వీరంతా ఎలా చనిపోయారన్న పూర్తి వివరాలు తెలుస్తాయి. బిశ్వాస్ చాంబర్స్ను జేఎనీ్టయూకు చెందిన నిపుణుల బృందం ఆదివారం ఉదయం పరిశీలించింది. ప్రొఫెసర్ శ్రీధర్రెడ్డి నేతృత్వంలోని టీమ్ వివిధ కోణాల్లో పరిశీలించింది. వీరు అందించే నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లేనని అనుమానిస్తున్నాందుకాణ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానిస్తున్నాం. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దుకాణ యజమాని సతీశ్ బచ్చాను అరెస్టు చేశాం. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్నకు మరమ్మతు జరిగింది , అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చు.సెల్లార్లో ఫర్నిచర్ నిల్వ ఉంచడంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. – అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా: మంత్రి పొంగులేటిబచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్ సంస్థలో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు తక్షణమే ఆ పరిహారం అందే విధంగా చర్యలు తీసు కోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను ఆదేశించినట్టు రెవెన్యూ మంత్రి కార్యాలయ వ ర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు అమాయకు లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతి విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
నాంపల్లి అగ్నిప్రమాదం.. షాపు యజమాని అరెస్ట్
సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో నిన్న అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు( ఆదివారం) ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచానిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.కాగా నిన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అఖిల్ (7), ప్రణిత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) చనిపోయినట్లు ఫైర్ డిజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బాధితులు బయిటకి రావడం కష్టమైందని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. -
నాంపల్లి: అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం
సాక్షి హైదరాబాద్: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
ఐదుగురూ చనిపోయారు.. ఆ తప్పే ప్రమాదానికి కారణం
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
నాంపల్లి ప్రమాదంలో దొరకని ఐదుగురి ఆచూకీ.. ఎందుకింత ఆలస్యం?
-
మన వాళ్ళని విదేశాలకు పంపండి.. నాంపల్లి ప్రమాదంపై రాజాసింగ్
-
రెస్క్యూ ఆపరేషన్.. ఐదుగురు మృతులు వీరే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. తాజాగా ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.అగ్నిప్రమాదంలో 90 శాతం వరకూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తియ్యిందని తెలుస్తోంది. 200 మంది సిబ్బంది 22 గంటలకుపైగా ఈ రెస్క్యూ ఆపరేషన్లోపాల్గొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం చేసుకుంది.అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నించారు.. ఇందుకోసం వారు ఆక్సిజన్ సిలిండర్తో సెల్లార్ లోకి వెళ్లారు. వీరివెంట వైద్య సిబ్బంది కూడా వెళ్లారు.తొలుత ఒక ఒక డెడ్ బాడీ లభ్యమయ్యింది. అది గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డిఎన్ఎ టెస్ట్కు అధికారులు తరలించారు. మరో డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపై మరో మూడు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారు ఫైర్ డీజీప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇది జరిగిందన్నారు. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని భవానిపురంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తులో అగ్ని కీలలు వ్యాపించాయి. ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్మెంట్లో చిక్కుకున్న వృద్ధులను కాపాడారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.ఏసీల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణలో లోపాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేయడం వల్ల విపరీతంగా వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనికి తోడు ఏసీలోని రిఫ్రిజిరేటర్ గ్యాస్ పైపులు దెబ్బతిని లీకేజీలు ఏర్పడినా, ఫిల్టర్లలో ధూళి పేరుకుపోయి గాలి ప్రవాహం ఆగిపోయినా యూనిట్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయే ప్రమాదం ఉంది. నాణ్యత లేని వైరింగ్ వాడటం, విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా వచ్చే వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్లు సంభవించి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏసీ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం రెండుసార్లు నిపుణులైన టెక్నీషియన్లతో సర్వీసింగ్ చేయించుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని గంటల తరబడి నిరంతరం వాడకుండా మధ్యలో తగినంత విరామం ఇవ్వడం వల్ల కంప్రెసర్పై భారం తగ్గుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కోసం నాణ్యమైన స్టెబిలైజర్ను, ప్రత్యేక పవర్ సాకెట్ను ఉపయోగించాలి. ఏసీ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా కనీసం రెండు అడుగుల స్థలం వదలాలని, ఏసీ నుంచి వాసనలు లేదా శబ్దాలు వస్తే వెంటనే వాడకం ఆపేసి, తనిఖీ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
నిప్పు.. ఎప్పుడు కనువిప్పు?
సాక్షి, సిటీబ్యూరో/నాంపల్లి/అబిడ్స్: గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోంది. అమాయకుల ప్రాణాలను అగి్నకి ఆహుతి చేస్తోంది. నిబంధనలను మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులిచ్చేస్తోంది. ఫలితంగా అభమూ శుభమూ తెలియని అభాగ్యులు కాలిబూడిదవుతున్నారు. నగరంలో అగ్ని ప్రమాదాలు షరామామూలుగా పరిణమించాయి. దుర్ఘటనలు సంభవించినప్పుడే నిబంధనలు, జాగ్రత్తలు, సెట్బ్యాక్లు అధికారులకు గుర్తుకొస్తాయి. అనంతరం అంతా మామూలే. ఫరి్నచర్ దుకాణాలు, గోడౌన్లు, స్క్రాప్ నిల్వల భవనాలు మంటల్లో మాడిమసి అవుతున్నాయి. ప్రాణాలు బుగ్గి అవుతున్నాయి. నివాస భవనాల్లో గోడౌన్లలోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అగి్నకీలలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు అలుముకున్నాయి. వీటిలో ఐదుగురు చిక్కుకుపోవడం తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. వాణిజ్య భవనాల్లో.. వాణిజ్య భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో గత నాలుగేళ్లలో ఎంతో మంది మరణించారు. ప్రమాదాలు జరిగిప్పుడు చర్యలు తీసుకుంటామని, నిబంధనల అమలు తనిఖీలకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారుల హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఫర్నిచర్ షాపులు, హోటళ్లు, హాస్పిటళ్లు, వివిధ షోరూమ్లు, పబ్లు ఇలా.. అన్నింటికీ ఇదే పరిస్థితి. వేటికీ నిబంధనల కనుగుణంగా సెట్బ్యాక్లుండవు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లుండవు. కాగా వచ్చేది వేసవి కాలం. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అధికారులు ప్రమాదాల నివారణకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. 835 ప్రమాదాలు.. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది దాదాపు 835 అగి్నప్రమాదాలు జరిగాయి. పలువురు క్షతగాత్రులయ్యారు. కొందరు మరణించారు. ఎంతో ఆస్తినష్టం జరిగింది. 2025 మే నెలలో జరిగిన గుల్జార్హౌస్ అగ్ని ప్రమాదంలో 8 మంది పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. నవంబర్లో శాలిబండ ఎల్రక్టానిక్స్ షోరూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. డిసెంబర్లో కాచిగూడ సుందర్నగర్లో జరిగిన అగి్నప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత ఏడాది అగ్ని ప్రమాదాల కారణంగా దాదాపు రూ.32 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. గుండెల్ని పిండేసే దుర్ఘటనలెన్నో.. నిరుడు గుల్జార్హౌస్ సమీపంలోని ముత్యాల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాతను నగర ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. గత ఏడాది టాటానగర్ ప్లాస్టిక్గోడౌన్లో, కూకట్పల్లి గ్యాస్ దుకాణం తదితర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆయా అగ్ని ప్రమాదాల్లో దాదాపు 50 మంది మరణించారు. మూడేళ్ల క్రితం బజార్ఘాట్లో నివాస భవనంలోని కెమికల్ గోడౌన్లో సంభవించిన అగి్నప్రమాదంలో 9 మంది అసువులు బాశారు. నాలుగేళ్ల క్రితం బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. గత సంవత్సరం అఫ్జల్గంజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నాంపల్లి ప్రమాదానికి కారణం అదే
-
Nampally: ఘోర అగ్నిప్రమాదం..రంగంలోకి దిగిన రోబో
-
భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)
-
Hyd: భారీ అగ్ని ప్రమాదం తగలబడుతున్న భవనం మంటల్లో చిక్కుకున్న పిల్లలు
-
Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్కు చెందినది కావడంతో భవనం సెల్లార్లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు. ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూనాంపల్లిలో ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్ ఎగ్జిబిషన్కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. -
కరాచీ మాల్ అగ్ని ప్రమాదం.. ఒకే చోట 30 మృతదేహలు
కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.ఒకే చోట 30 మంది..సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ షట్టర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.అయితే ఈ విషాధ సంఘటనలో మరణించిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు లభ్యమైన 61 మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించినట్లు సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒకరు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈ భవనంలో భద్రత లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది. -
బస్సు, లారీ అగ్నికి ఆహుతి.. ముగ్గురు సజీవ దహనం
-
26కు పెరిగిన పాక్ మాల్ మృతుల సంఖ్య
కరాచీ: పాకిస్తాన్లోకి కరాచీలో జనసమ్మర్థ గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారానికి 26కు పెరిగింది. దాదాపు 60 మంది మంది జాడ గల్లంతైంది. మంటలను ఆదివారం రాత్రి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ హోల్సేల్, రిటైల్ దుకాణాల సముదాయమైన ఈ షాపింగ్ మాల్లోకి సోమవారం ఉదయం అగి్నమాపక సిబ్బంది ప్రవేశించి శిథిలాలను తొలగిస్తున్నారు. మరికొందరి మృతదేహాలు లభ్యమవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా పలువురు ఆచూకీ తెలియాల్సి ఉందని ‘రెస్క్యూ 1122’అధికార ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్ఖాన్ చెప్పారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో కోటి పాకిస్తాన్ రూపాయలను ఆయన ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు. ప్రమాదంలో షాపింగ్మాల్లోని దాదాపు 300 కోట్ల పాక్ రూపాయల సరకు బుగ్గిపాలైందని అంచనావేస్తున్నారు. భవనం చాలా గంటలపాటు కాలిపోవడంతో నిర్మాణం బాగా దెబ్బతిన్నదని, దాదాపు భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాల్సి రావొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. కరాచీలో సరైన రక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అధిక విద్యుత్ లోడు, అక్రమ నిర్మాణాల కారణంగా గతంలో పలు షాపింగ్ మాల్స్ ప్రమాదాల బారిన పడ్డాయి. -
కువైట్ జైలులో మంటలు.. ఓ పోలీసు మృతి
కువైట్: కువైట్ సెంట్రల్ జైలులో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పోలీసు అధికారి మృతి చెందాడు. మృతుడిని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్కు చెందిన కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్గా గుర్తించారు.భవనంలో ఫర్నిచర్, తివాచీల మారుస్తున్న సమయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే జైలు సిబ్బంది, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో కల్నల్ సౌద్ అల్-ఖమ్సన్ తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఆరుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. భవనంలో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణపై సమగ్ర దర్యాప్తు జరపనున్నారు. మృత పోలీసు అధికారికి ఉన్నతాధికారులు, సహచరులు సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ లో భారీ అగ్నిప్రమాదం..14 మంది మృతి..
-
సార్ లంక అగ్ని ప్రమాద బాధితులకు అండగా దాడిశెట్టి రాజా
-
కరాచీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతి
పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది.కరాచీ అంతర్జాతీయ నౌకాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలను తీసుకెళ్తున్న కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం ఇవి వెనువెంటనే వేరే కంటైనర్లకు వ్యాపించడంతో 20 వరకూ కంటైనర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.అయితే మంటలు వ్యాపించిన సమయం మధ్యాహ్నం ఒంటిగంటతో పాటు నిన్న శుక్రవారం కావడంతో కార్మికులంతా నమాజ్ కోసం దగ్గర్లో ఉన్న మసీద్కు వెళ్లారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడంలో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
తొండ తెచ్చిన తంటా...
అనంతపురం: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు. శుక్రవారం రాత్రి వీరు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రామాంజనేయులు తన అన్న శ్రీనివాసులుపై తొండ విసరగా.. అది అతడి మెడను కరిచింది. తనపై చేతబడి చేసేందుకే తొండను విసిరాడని భావించిన శ్రీనివాసులు కోపంలో రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న రామాంజనేయులు కుమార్తె లక్ష్మి తీవ్రంగా గాయపడగా... కుమారుడు శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
హిందు ఉపాధ్యాయుని ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్లో మైనార్టీలపై విద్వేశజ్వాలలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నసంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి హింస చెలరేగింది. అక్కడి మత ఛాందసవాదులు సిల్హట్ జిల్లాలో హిందూ కుటుంబం ఉన్న ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఇది గమనించిన ఆ కుటుంబ సభ్యులు హుటాహుటీన అక్కడి నుండి పరుగు తీశారు.బంగ్లాదేశ్లో హిందువులపై హింస తీవ్రరూపం దాలుస్తుంది. షేక్ హాసీనా భారత్లో తలదాచుకున్న మెుదలు ఏదో రకంగా అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కడి విద్యార్థినేత ఉస్మాన్ సౌదీ మరణంతో అక్కడి మైనార్టీలపై దాడులు మరోసారి తీవ్రతరమయ్యాయి. అప్పట్నుంచి దాదాపు 42 ఘటనలు జరుగగా దాదాపు 12మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అక్కడి దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బంగ్లా ప్రభుత్వం స్పందించడం లేదు.తాజాగా మరోసారి ఆ దేశంలో మత విద్వేశం చెలరేగింది. బంగ్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓ హిందూ ఇంటికి అక్కడి అల్లరిమూకలు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిల్హాట్ జిల్లా గోవైన్ ఘాట్ ఉపజిల్లా నందిర్గ్రామంలో బీరేంద్రకుమార్ అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి అక్కడి మతఛాందస వాదులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన ఇంటిసభ్యులు హుటాహుటీన అక్కడి నుండి ఇంటినుండి పరుగులుతీశారు. ఈవీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇస్లామిక్ గ్రూపులే ఈ దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఒక హిందువ్యక్తిని అక్కడి దుండగులు నరికి చంపగా, అక్కడి జగత్పూర్ అనే గ్రామంలోని పంటపొలాల్లో 27ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. బంగ్లాదేశ్లో వరుసగా జరుగుతున్న ఘటనలు అక్కడి మైనార్టీలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.UNENDING XENOPHOBIA THE WORLD WATCHES SILENTLYAnother targeted attack on a Hindu family in Bangladesh. The home of teacher Birendra Kumar Dey (“Jhunu Sir”) in Sylhet’s Gowainghat was set on fire again. pic.twitter.com/injFKFqMkZ— Rahul Shivshankar (@RShivshankar) January 16, 2026 -
హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్నిప్రమాదం
-
రూ.20 లక్షలు ఇవ్వలేదని మద్యం షాప్కు నిప్పు
-
Hyd: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. -
సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా అగ్ని ప్రమాదం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని, తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి. వారికి తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష అందజేయాలి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు వారికి అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా, సార్లంకపల్లె.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని నిమిషాల్లో బూడిదైపోయింది. మన్యంలో మారుమూలన ఉండే ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా, 38 పూరిళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అడవిని నమ్ముకొని జీవించే సార్లంక గిరిజనులు సంక్రాంతి సందర్భంగా సరకుల కొనుగోళ్లకు సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఊరంతా శ్మశానంగా మారింది. ఊరికి 50 కి.మీ. దూరంలోని తుని నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికే ఊరంతా మంటల్లో ఆహుతైపోయింది. -
కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 40 పూరిళ్లు దగ్ధం
కాకినాడ: జిల్లాలోని రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్ర వేళ సార్లంక గిరిజన గ్రామంలోని పూరిళ్లు దగ్ధమయ్యాయి,. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు బూడిదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కాలి బూదిదం కావడంతో ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము సర్వస్వం కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. -
ఆగిన బ్లోఅవుట్
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5న సంభవించిన భారీ బ్లోఅవుట్ మంటలను శనివారం ఉదయం 10.30 గంటలకు పూర్తిస్థాయిలో అదుపు చేశారు. ఆరు రోజుల శ్రమ ఫలించడంతో ఓఎన్జీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున మంటలు బాగా తగ్గడంతో నీరు చల్లుతూ సిబ్బంది వెల్ మౌత్ వద్దకు వెళ్లారు.పరిస్థితిని అధ్యయనం చేసి దెబ్బతిన్న భాగాలను తొలగించి.. బ్లోఅవుట్ ప్లగ్ను ప్రత్యేక క్రేన్తో వెల్కు అమర్చడంతో గ్యాస్ మంటలు పైకి వెళ్లడం ప్రారంభమైంది. అనంతరం ప్లగ్ ద్వారా గ్యాస్ లీకేజీని అదుపుచేశారు. దీంతో మంటలు పూర్తిగా ఆగిపోయాయి. అనంతరం విజయోత్సవాలు నిర్వహించుకున్న ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, రెస్క్యూ టీమ్ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం 12 గంటలకు వెల్ మూసివేత చర్యలలో భాగంగా ప్రత్యేక యంత్రాల ద్వారా బావిలోకి మడ్ పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు.ఇది సమష్టి విజయం ఇరుసుమండ బ్లోఅవుట్ను ఆరు రోజులు శ్రమించి సమష్టి కృషితో అదుపు చేశాం. సిబ్బంది, రెస్క్యూ టీమ్ అహర్నిశలూ శ్రమించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా పూర్తిస్థాయిలో సహకరించారు. ప్రస్తుతానికి బ్లోఅవుట్ ప్లగ్ వేసి మూసేశాం. వెల్ను కూడా మడ్తో మూసివేశాం. తరువాత చర్యలు ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. – శంతన్దాస్, ఓఎన్జీసీ ఈడీ–కం–అసెట్ మేనేజర్, రాజమహేంద్రవరంత్వరితగతిన మూసివేశాం బ్లోఅవుట్ మంటలను చాలా తక్కువ సమయంలోనే కంట్రోల్ చేశాం. ఓఎన్జీసీకి సంబంధించిన సిబ్బంది సాంకేతికతతో పనిచేశారు. ఘటన సంభవించిన నాటినుంచి ఈ రోజు వరకూ అలుపెరగకుండా పని చేశాం. – గాజుల శ్రీహరి, ఇన్చార్జి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ -
అదుపులోకి వచ్చిన ఓఎన్జీసీ బ్లోఅవుట్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ: ఇరుసుమండలంలో నాలుగు రోజుల క్రితం సంభవించిన ఓఎన్జీసీ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి ఆంబ్రెల్లా ఆపరేషన్ చేపట్టడంతో పాటు గ్యాస్ సామర్థ్యం తగ్గడంతో అగ్నికీలల తీవ్రత తగ్గింది. దీంతో అక్కడికి ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది కాలిన వ్యర్థాలను తొలిగించారు. మంటలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.జనవరి 5న అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో ఓఎన్జీసీ మోరి బావి5లో భారీ బ్లోఅవుట సంభవించింది. ఓఎన్జీసీ సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ ఎగజిమ్మింది. దీంతో పెద్దఎత్తున 100 మీటర్ల పైకి మంటలు లేశాయి. అగ్నికీలల తీవ్రత చూసి బెంబేలెత్తిపోయిన రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదం జరిగిన మోరి-5 నంబర్ బావి ఓఎన్జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. భద్రతాకారణాలు సరిగ్గా లేకపోవడంతో 12 ఏళ్లక్రితమే దీనిని మూసివేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించడంతో దీని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. కాగా ప్రస్తుతం మళ్లీ అక్కడే పనులు ప్రారంభించడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అగ్నికి ఆహుతైన 200 ఏళ్ల నాటి ప్యాలెస్
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఆనాటి కియోంథల్ సంస్థానాధీశులు నిర్మించిన 200 ఏళ్లనాటి అందమైన జుంగా ప్యాలెస్ బుధవారం బుగ్గి పాలైంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్యాలెస్లో మంటలు చెలరే గాయి. వెనువెంటనే అగ్నికీలలు ప్యాలెస్ మొ త్తాన్నీ ఆక్రమించాయి. షిమ్లా నగరానికి 26 కిలోమీటర్ల దూరంలోని జుంగా ప్రాంతంలో ఈ జుంగా మహల్ ప్యాలెస్ ఉంది. అగ్నిప్రమా దంలో మహల్లోని చారిత్రక పత్రాలు, పురాతన ఫర్నీచర్, అత్యంత రమణీయమైన కళాఖండాలు, చిత్రాలు, అబ్బురపరిచే నిర్మాణ కౌశలంతో ఉట్టిపడే భవనంలోని దర్వాజాలు, కిటికీలు, షాండ్లియర్లు అన్నీ కాలిపోయాయి. హిమాచల్ ప్రదేశ వారసత్వ సందపగా ఈ మహల్కు ఎంతో పేరుంది. ఏటా ఈ మహల్ను సందర్శించే దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య సైతం చాలా ఎక్కువ. అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. -
మంటలకు పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..
-
Konaseema District : ఆగని బ్లోఅవుట్ మంటలు
-
కోనసీమలో భారీ బ్లో అవుట్
సాక్షి, అమలాపురం/మలికిపురం: పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీకి చెందిన మోరి–5వ నెంబరు బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెలరోజులుగా గుజరాత్కు చెందిన డీప్ సీ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరుగుతోంది.ఈ నేపథ్యంలో.. సోమవారం ఉ.11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా సహజ వాయువు (గ్యాస్) ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్ ఎగజిమ్మగా తరువాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్ ఎగదన్నడం.. మంటలు చెలరేగడంతో సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దశాబ్ద కాలం కిందట మూసివేసిన ఈ బావి వద్దే ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టడం, బ్లోఅవుట్ (Blow Out) సంభవించడంతో చమురు సంస్థలపై స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్దాలతో పొగలా విస్తరించిన గ్యాస్.. దీనిని అదుపు చేసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు విఫలం కావడం... రానురానూ తీవ్ర పీడనంతో గ్యాస్ బయటకు ఎగదన్నుకు వస్తుండడంతో సిబ్బంది రిగ్గును వదిలి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకూ సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి, సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లోనే భయంతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికి తేరుకుని, అక్కడి నుంచి పరుగు తీశారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్మడంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఇరుసుమండతో పాటు లక్కవరం (Lakkavaram) గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకుల్లో ప్రచారం చేశారు. మంటలు చెలరేగి భారీ విస్ఫోటనం.. డ్రిల్లింగ్ చేస్తున్న బావి నుంచి గ్యాస్ ఎగదన్నుకు వచ్చిన సమయంలో పెద్ద హోరు వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిప్పు రాజుకోవడంతో మంటలు చెలరేగి, ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తొలిగంటలో 100 మీటర్ల ఎత్తున మంటలు ఎగసిపడి ఆ తర్వాత 300 మీటర్ల మేర అగ్నికీలలు విస్తరించాయి. మ.3 గంటల సమయంలో గ్యాస్తో పాటు బావి నుంచి చమురు కూడా వస్తుండడంతో మంటలు పైకి ఎగసిపడటం తగ్గినా అవి దిగువ భాగంలో విస్తరించాయి. భారీ ఒత్తిడితో గ్యాస్ ఎగదన్నుతోంది. దీని ఒత్తిడి ఎంత అనేది నిపుణులు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. మండిందా? మండించారా!?.. తాజాగా.. ఇరుసుమండ బ్లోఅవుట్ (Irusumanda blow out) సంఘటన వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉ.11 గంటలకు బావి నుంచి ఎగజిమ్మిన గ్యాస్ మధ్యాహ్నానికి గ్రామమంతటా వ్యాపించింది. గ్యాస్ మరింత విరజిమ్మి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తే 2014లో ‘నగరం’లో చోటుచేసుకున్న ఘటన తరహా విస్ఫోటనం జరుగుతుందని ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యాస్ ఇంకా భారీగా వ్యాపిస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావించడంతో దానిని మండించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.పగటి వేళ ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఇదే కనుక రాత్రివేళ జరిగి ఉంటే గ్యాస్ వ్యాపించి విద్యుద్దీపాలు, ఇతర మండే వస్తువులవల్ల రెండు గ్రామాలు తుడిచిపెట్టుకు పోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనికితోడు ప్రస్తుతం మంచు కురుస్తుండడంతో గ్యాస్ పొరలు పొరలుగా కమ్ముకుని ప్రమాద తీవ్రత పెరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్కుమార్, ఎస్పీ రాహుల్కుమార్ మీనా, డీఆర్ఓ కె.మాధవి, అమలాపురం ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. బ్లోఅవుట్కు దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రిస్క్ అని తెలిసి కూడా..ప్రమాదం సంభవించిన మోరి–5వ నంబర్ బావి ఓఎన్జీసీ మోరి స్ట్రక్చర్ పరిధిలో ఉంది. 12 ఏళ్ల క్రితం దీనిని మూసివేశారు. అప్పటికి దాదాపు పన్నెండేళ్లపాటు ఈ బావి నుంచి గ్యాస్, చమురు వెలికితీశారు. అనంతరం వట్టిపోవడంతో దీనిని మూసివేశారు. తరువాత చమురు నిక్షేపాల కోసం చేపట్టిన సిస్మిక్ సర్వేల్లో దీనికి సమీపంగా ప్రత్యేక జోన్లను గుర్తించారు. ఇదే సైట్ వద్ద కొత్త జోన్ను గుర్తించి, ఇక్కడ అపార చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని నిర్ధారించారు. అయితే, ప్రొడక్షన్ టెస్టింగ్లో డ్రిల్లింగ్ సంస్థకు షాక్ తగిలింది. గ్యాస్ కిక్లు (బ్లోఅవుట్ సంకేతాలు) ప్రారంభం కావడంతో అప్పట్లోనే ముంబై, గుజరాత్ల నుంచి నిపుణులు వచ్చారు.ప్రత్యేక పరికరాలు తెచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ బావిని మూసివేయడం తప్ప వేరే మార్గంలేదని చేతులెత్తేశారు. ఈ బావిని తెరిస్తే బ్లోఅవుట్ తప్పదని ఆ నిపుణులు చెప్పడంతో పూర్తిగా మూసివేశారు. ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని అప్పట్లోనే ‘సాక్షి’ కూడా కథనాలు అందించింది. తాజాగా.. ఈ బావిని ప్రైవేట్ సంస్థకు అప్పగించి తెరవాలని అధికారులు నిర్ణయించడానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బీపీసీఎల్కు తప్పిన ప్రమాదం
ముత్తుకూరు (పొదలకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీర ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ కంపెనీ సమీపంలో అగ్నికీలలు ఎగసి పడ్డాయి. ఆదివారం కావడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు ఎవరో సమీపంలోని సవక తోటల్లో నిప్పు రాజేయడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదానీ కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అధికారులు మంటలను సీసీటీవీ ఫుటేజీలో పరిశీలించి అప్రమత్తమయ్యారు. మెరైన్ పోలీసులకు సమాచారం అందించి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోర్టు పరిధిలోని తీర ప్రాంతంలో బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ, గ్యాస్ కంపెనీలు ఉన్నాయి.వీటికి 200 మీటర్ల సమీపంలోనే మంటలు ఎగసిపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. పర్యాటకులపై ఆంక్షలు లేకుండా పోయాయని తీరప్రాంత గ్రామస్తులు అంటున్నారు. దీనికితోడు సెక్యూరిటీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల పేరుతో కొందరు ఆకతాయిలు వచ్చి సవక తోటల్లో పార్టీలు చేసుకుంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ గ్యాస్ కంపెనీలు ఉన్న తీర ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటున్నారు. -
Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం
-
అచ్చుతాపురం ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: అచ్చుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలడంతో కార్మికులు పరుగలు తీశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపు చేశారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఎస్వీఎస్ ఫార్మా ప్రమాద సమయంలో బీ-షిఫ్ట్లో 18 మంది కార్మికులు ఉన్నారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని ఫార్మా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తొలిత మంటలు వ్యాపించి.. రియాక్టర్ పేలినట్టు సమాచారం. -
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
స్విట్జర్లాండ్ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్లోని ఓ లగ్జరీ బార్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన భారీ పేలుడు గురించి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరుకుంది. తొలుత ఉగ్రదాడి అయ్యి ఉండొచ్చనే ప్రచారం జరగ్గా.. అధికారులు ఆ కోణాన్ని తోసిపుచ్చారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఇది ‘ఫ్లాష్ ఓవర్’ కారణంగా జరిగిన ప్రమాదం అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లాష్ ఓవర్ అంటే ఏంటో అని ఆరా తీస్తున్నారు చాలా మంది. ఇక, ఇప్పటికే ఫ్లాష్ ఓవర్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి.ప్లాష్ ఓవర్ అంటే.. అమెరికాకు చెందిన నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (NFPA) ప్రకారం.. ఒక పరిమిత స్థలంలో వేడి వాయువులు గదిలో వ్యాప్తి చెంది.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఫ్లాష్ ఓవర్ సంభవిస్తుందని పేర్కొంది. ఈ కారణంగా ఆ గదిలో త్వరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు అన్నీ ఒకేసారి అగ్నిలో చిక్కుకుపోతాయి. ఆ ఫలితంగా.. మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఎటూ తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతుంది. అయితే.. ఫ్లాష్ఓవర్ అనేది అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రమాదకరమైన దశ. కొన్ని సెకన్లలోనే మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. ఇది సాధారణంగా 500–600°C వద్ద జరుగుతుంది. ఈ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.ఈ ప్రక్రియలో మొదట ఒక వస్తువుకు మంటలు అంటుకుంటాయి. దాని వల్ల ఉత్పత్తి అయ్యే వేడి పొగ పైకప్పు దగ్గరకు చేరుతుంది. ఈ క్రమంలో పొర వేడెక్కి, గదిలోని ఇతర వస్తువులు ఆటో-ఇగ్నిషన్ ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో, ఒక్కసారిగా మొత్తం గది మంటల్లో కూరుకుపోతుంది. సెకన్ల వ్యవధిలో మంటలు వ్యాపించి.. దహనం అయిపోతుంది. ఈ స్థితిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం మంటలను అదుపు చేయలేరు.When this happened in America 23 yrs ago in Rhode Island, our National Institute of Standards and Technology (NIST) recreated the fire with the same polyurethane egg-crate foam and sparklers that ignited it.This is the video showing 1 minute to total flashover. Then, no escape. pic.twitter.com/T52qpPZf5g— Solvated Electron (@Solvatdelectron) January 1, 2026ఫ్లాష్ ఓవర్ గుర్తించే సంకేతాలుకాగా, ఫ్లాష్ ఓవర్ జరగబోయే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. అగ్నిమాపక సిబ్బంది వీటిని గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తగ్గించుకోవచ్చు.పొగ రంగు: గాఢమైన నల్ల పొగ, వేగంగా కదిలే పొగ పొర.వేడి తీవ్రత: గదిలో వేడి ఒక్కసారిగా పెరగడం, నేలస్థాయిలో కూడా వేడి తీవ్రంగా అనిపించడం.పొగ పొర కదలిక: పైకప్పు దగ్గర పొగ పొర కిందికి దిగుతూ, వేగంగా కదలడం.ఫైర్ బిహేవియర్: వస్తువులు ఇంకా మంటలు అంటుకోకపోయినా, వేడి వల్ల వాటి ఉపరితలాలు కాంతివంతంగా కనిపించడం.రేడియంట్ హీట్: గదిలో నిలబడలేని స్థాయిలో వేడి ప్రవాహం (సుమారు 20 kW/m²).నివారణ చర్యలుఫ్లాష్ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అగ్నిమాపక సిబ్బంది భవన రూపకర్తలు ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.వెంటిలేషన్ నియంత్రణ: గదిలో ఆక్సిజన్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా మంటల విస్తరణను తగ్గించడం.కూలింగ్ వాటర్ స్ప్రే: పైకప్పు పొగ పొరపై నీటిని స్ప్రే చేయడం ద్వారా ఉష్ణోగ్రత తగ్గించడం.ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్: భవన నిర్మాణంలో అగ్ని నిరోధక పదార్థాలను ఉపయోగించడం.ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్: భవనంలో పొగ డిటెక్టర్లు, హీట్ సెన్సర్లు వాడటం.ఫైర్ఫైటర్ ట్రైనింగ్: ఫ్లాష్ఓవర్ సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం.ముఖ్యమైన గత ప్రమాదాలు ఇవే..1923: టోక్యో, జపాన్: భూకంపం తర్వాత మంటలు విస్తరించి నగరం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.1964: తమిళనాడులోని మదురై స్కూల్ అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు.1997: ఢిల్లీలోని ఉపహార్ సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో 59 మంది మరణించారు.2004: తమిళనాడులోని కుంబకోణం పాఠశాలలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 90కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.2024: గుజరాత్లోని రాజ్కోట్ టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు విస్తరించి 33 మంది మరణించారు. వీరిలో 9 మంది చిన్నారులు.2025: ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు శిశువులు మరణించారు.2026: స్విట్జర్లాండ్లోని క్రాన్స్-మోంటానా బార్లో ప్రమాదం. 47 మంది మరణించారు. -
న్యూ ఇయర్లో విషాదం : అగ్నికీలల్లో చారిత్రాత్మక వోండెల్కెర్క్ చర్చి
నూతన సంవత్సర వేడుకల సమయంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లోని చారిత్రక చర్చి భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించడంతో చర్చి భవనానికి తీవ్ర నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.19వ శతాబ్దపు ఈ చర్చికి సంబంధించి 50 మీటర్ల (164 అడుగుల) టవర్ కూలిపోయింది. పైకప్పు తీవ్రంగా దెబ్బతింది గురువారం తెల్లవారుజామున చారిత్రాత్మక వోండెల్కెర్క్ (వోండెల్ చర్చి)లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల్లోనే, 154 సంవత్సరాల పురాతన స్మారక చిహ్నంలో భాగమైన చర్చి టవర్ పూర్తిగా కూలిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగితేలుతున్న నగరం అంతటా తీవ్ర గందర గోళం ఏర్పడింది. అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేదిఇంకా తెలియరాలేదు.వోండెల్కెర్క్ చర్చిని ఎపుడు నిర్మించారు?1872లో వోండెల్కెర్క్ చర్చ్ నిర్మితమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ రూపొందించారు. 1970లలో పునరుద్ధరించారు. 1977 వరకు రోమన్ కాథలిక్ చర్చిగా పనిచేసింది. De 150 jaar oude monumentale #Vondelkerk vormde het hart van de door Cuypers, architect van oa het Rijksmuseum, ontworpen Vondelbuurt. 😥 pic.twitter.com/z8KmitkUji— MaaikeDx 🖌 (@RembrandtsRoom) January 1, 2026 -
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అడుగడుగునా ఉల్లంఘనలే
పనాజీ: గోవా నైట్క్లబ్లో భారీ అగ్నిప్రమాదం, 25 మంది మరణంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మేజిస్టీరియల్ విచారణ పూర్తయ్యింది. నివేదికను అధికారులు బుధవారం బహిర్గతం చేశారు. డిసెంబర్ 6న ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ‘బిర్చ్ బై రోమియో లేన్’లో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ క్లబ్ను ఉప్పునీటి కయ్యపై చట్టవిరుద్ధంగా నిర్మించినట్లు విచారణలో తేలింది. చెల్లుబాటయ్యే ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా అక్కడ ఎన్నో లోపాలు ఉన్నాయని, అవన్నీ చివరకు అగ్ని ప్రమాదానికి దారి తీశాయని విచారణ నివేదిక పేర్కొంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పటికీ నైట్క్లబ్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియజేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే బాణాసంచాను కాల్చారని వెల్లడించింది. అక్కడ ఫైర్ సెఫ్టీ పరికరాలు కూడా తగినంత లేవని గుర్తించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవడానికి నైట్క్లబ్లో అత్యవసర ద్వారాలు లేవని, అందుకే మరణాల సంఖ్య పెరిగినట్లు స్పష్టంచేసింది. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ను క్లబ్ యాజమాన్యం ఫోర్జరీ చేశారని వెల్లడించింది. గడువు ముగిసినా పునరుద్ధరించుకోలేదు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెజిస్టీరియల్ నివేదికను అధికారులు సమర్పించారు. నైట్క్లబ్కు 2023 డిసెంబర్ 16న అర్పోరా గ్రామ పంచాయితీ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఇచ్చినట్లు నివేదిక తెలియజేసింది. ఈ లైసెన్స్ కాలపరిమితి 2024 మార్చి 31న ముగిసిపోగా, ఆ తర్వాత పునరుద్ధరించుకోలేదని వెల్లడించింది. గోవా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 72ఏ ప్రకారం ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపార సంస్థను మూసివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయినప్పటికీ నైట్క్లబ్ విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు తప్పుపట్టింది. చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవమేనని గ్రామ సర్పంచ్ రోషన్ రెద్కార్ మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించారు. ఇదిలా ఉండగా, విచారణ నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
ఆ ఘటన ఎలా జరిగింది!
యలమంచిలి రూరల్: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటనపై రైల్వే శాఖ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న రైలు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత యలమంచిలి రైల్వేస్టేషన్కు చేరుకునేసరికి అగ్నిప్రమాదానికి గురైన విషయం విదితమే. ఘటనపై యలమంచిలి రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఆకుల సురేష్కుమార్ ఫిర్యాదు మేరకు తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి కాకినాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు ఘటనకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రమాదం సంభవించిన బోగీల్లో బీడీ కాల్చిన వ్యక్తితో పాటు కోచ్ల్లో బెడ్ రోల్స్ అందించే వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలను సోమవారం అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. అగ్నికీలలు వ్యాపించి దగ్ధమైన బోగీలను రైల్వే ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించాయి. ఘటనపై బుధ, గురువారాల్లో దక్షిణ మధ్య రైల్వే సర్కిల్ సేఫ్టీ కమిషనర్ మాధవి విజయవాడలో విచారణ జరపనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలిసిన వారు సికింద్రాబాద్ సరోజినీదేవి రోడ్డులో రైల్ నిలయం ఎదురుగా ఉన్న రైల్వే సేఫ్టీ కమిషనర్ అడ్రస్కు రాతపూర్వకంగా పంపించవచ్చని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఎ.శ్రీధర్ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికీలలు
సాక్షి, అనకాపల్లి/సామర్లకోట: ఎర్నాకుళం వీక్లీ ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్లోని టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్ప్రెస్ (రైలు నంబర్–18189)లో అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద భారీగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో బీ–1, ఎం–2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. పొగ విపరీతంగా కమ్ముకోవడంతో బీ–1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ (70) అనే వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయి.. అగ్నికీలల్లో సజీవ దహనమయ్యాడు.ఈ ఘటనతో యలమంచిలి రైల్వేస్టేషన్లో రెండు గంటలపాటు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి నుంచి అగి్నమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈలోపు లోకో పైలట్లు కాలిపోతున్న రెండు బోగీలను వేరుచేసి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. పరుగులు తీసిన ప్రయాణికులు మంటలు చెలరేగిన రెండు ఏసీ బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి యలమంచిలి రైల్వే స్టేషన్లోకి పరుగులు తీశారు. లగేజీలను కూడా వదిలేసి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ మంటల్లో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సజీవ దహనమైన ఒక్కరు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు బోగీలతోపాటు ఎం–2 బోగీని కూడా తప్పించి ఉదయం 7 గంటలకు రైలు బయల్దేరింది. ఆ బోగీల నుంచి దింపేసిన సుమారు 125 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు తరలించారు. అక్కడ మూడు కొత్త బోగీలు అటాచ్ చేసి ప్రయాణికులను అదే రైలులో వారి గమ్యస్థానాలకు పంపించారు. రైలు కదలికలో తేడా రావడంతో.. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో నర్సింగిబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య బ్రేకుల్లో తలెత్తిన లోపాల కారణంగా.. ఏసీ బోగీలో అర్ధరాత్రి సమయంలో పొగ రావడం మొదలైంది. ఆ తరువాత కొద్దిసేపట్లోనే యలమంచిలి స్టేషన్కు రైలు చేరుకుంది. వాస్తవానికి ఇక్కడ ఆ ట్రైన్కు హాల్టు లేదు. ఈ రైల్వేస్టేషన్లో లోకో పైలట్ల విశ్రాంతి గది ఉండటంతో ఒక పైలట్ను దించేందుకు రైలును ఆపినట్టు రైల్వే సిబ్బంది చెప్పారు. ముందుగా రైలు వేగాన్ని తగ్గించి.. స్టేషన్కు రాగానే బ్రేక్ వేశారు. ఆ సమయంలో బ్రేకుల్లో లోపాలున్నట్టు అర్థమైంది. బ్రేక్లు పట్టేయడం, రైలు కదలికలో తేడాను పైలట్లు గమనించారు.దిగి చెక్ చేయాలని భావిస్తున్న సమయంలోనే.. ప్రయాణికులు చైన్ లాగిన సంకేతాలు వచ్చాయి. దీంతో లోకో పైలట్లు వేగంగా చైన్ లాగిన బోగీలవైపు పరుగులు తీశారు. బోగీల్లో మంటలు మొదలవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ.. ప్లాట్ఫామ్ పైకి దిగి పరుగులు తీశారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలును నిలపడంతో ప్రయాణికులు తొందరగా సులువుగా ప్లాట్ఫామ్పైకి దిగగలిగారు. ఫైర్ ఇంజిన్లు త్వరితగతిన చేరుకోగలిగాయి. అక్కడ రైల్వే పోలీసు సిబ్బంది కూడా ఉండటం వల్ల వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టగలిగారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.మృతుడి బ్యాగ్లో నగదు, బంగారం గుర్తింపు ప్రమాదంలో మృతి చెందిన చంద్రశేఖర్ సుందర్ బ్యాగులో నగదు, బంగారం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా.. అందులో రూ.6.50 లక్షల నగదు, బంగారం ఉంది. చాలావరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. మృతుడు విజయవాడలో హోల్సేల్ వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. విజయనగరంలో ఒక వస్త్ర దుకాణం నుంచి డబ్బు వసూలు చేసుకుని విజయవాడ వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి బ్యాగ్లో దొరికిన రూ.6.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. బ్రేకులు పట్టేయడమే కారణమా? ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. బ్రేకుల ఫెయిల్యూరే కారణమా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాద స్థలాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, రైల్వే డీఐజీ బి.సత్య ఏసుబాబు, రైల్వే సేఫ్టీ అధికారులు పరిశీలించారు.డీఆర్ఎం మోహిత్ మాట్లాడుతూ.. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని.. బోగీల్లో ఉన్న దుప్పట్లు అంటుకుని మంటలు శరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి రైల్వే శాఖ రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవిని విచారణాధికారిగా నియమించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమై ఒక ప్రయాణికుడు మృతిచెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీట్ల కింద నుంచి మంటలొచ్చాయిఎర్నాకుళం ఎక్స్ప్రెస్ బీ–1 బోగీలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అనకాపల్లిలో ఎక్కాను. రైలు యలమంచిలి చేరుకుంటున్న సమయంలో పైబెర్తులోని ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లూ బోగీలోని సీట్ల కింద నుంచి మంటలు వస్తున్న విషయాన్ని గమనించి నాకు చెప్పాడు. ఆయన, నేను కేకలు వేస్తూ బోగీలోని ప్రయాణికులను నిద్రలేపి చైన్ లాగాం. అప్పటికే రైలు యలమంచిలి స్టేషన్కు వచ్చి ఆగింది.వెంటనే ప్రయాణికులు రైలులోంచి ప్రాణభయంతో దిగేశారు. అదే సమయంలో సమీపంలోని ఎం–2 బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. యలమంచిలి రైల్వేస్టేషన్ ఆవరణ అంతా పొగతో నిండిపోయిది. ప్రమాదం జరిగిన బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట తీసుకు వచ్చారు. చాలామంది తమ లగేజీలను అక్కడే వదిలేసి ఇక్కడకు వచ్చారు. –నాగేంద్ర, ప్రత్యక్ష సాక్షి -
ఘోరం.. డోర్ లాక్చేసి ఐదు గృహాలకు నిప్పంటించారు..!
బంగ్లాదేశ్ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్గా జరుగుతున్న దాడులు భారత్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.🚨 BangladeshAn attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025 అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు పేర్కొన్నారు. -
Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ? -
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ప్రమాదం ఎలా జరిగిందంటే
-
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి హైదరాబాద్: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుప్రక్కల వారు భయాందోళనలకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు తీవ్రంగా ఉండడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు దగ్ధం
-
కాచిగూడలో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటల్లో కాలి చిన్నారి మృతి చెందింది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కవల పిల్లల్లో రహీం మృతిచెందగా.. రెహమాన్కు తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు. మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు. -
ఒక్కసారిగా కారులో మంటలు..8 మంది..
-
కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సజీవ దహనం
-
వరుస బస్సు ప్రమాదాలు.. 2025లో భారీగా మరణాలు
దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో బస్సులో సేదదీరుతూ గమ్యం చేరాలనుకునే సుదూర ప్రయాణికులు ఊహించని ప్రమాదాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఏడాది(2025) భారీ సంఖ్యలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.కార్లు, బైకులు, ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణం సురక్షితం. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రాణ నష్టం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కానీ, అదే అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణ నష్టం ఊహకు అందడం లేదు. ప్రయాణికులు తేరుకునేలోగానే అగ్ని కీలలు వారిని ఎలా ముంచెత్తుతాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.మేజర్ ప్రమాదాలు.. సెప్టెంబర్ 14న రాజస్థాన్లో దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది.సెప్టెంబర్ 26న హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి బయల్దేరిన బస్సు ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉమేశ్ చంద్ర విగ్రహం వద్దకు రాగానే ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి.అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్ధరాత్రి బైక్ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ది హైవేపై బస్సులో మంటలు.నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం.డిసెంబర్ 12న మారేడుమిల్లి వద్ద లోయలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు.ఈనెల 16న యూపీలోని మథుర వద్ద ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం. పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు. వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు.డిసెంబర్ 24న తమిళనాడులో రెండు కార్లను ఢీకొన్న బస్సు తొమ్మిది మంది మృతి.డిసెంబర్ 25(ఈరోజు) కర్ణాటకలో బస్సు ప్రమాదం. దాదాపు 13 మంది మృతి, పలువురికి గాయాలు. -
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 19వ తేదీ) రాత్రి ఇస్లామియా హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజస్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీనా అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. పక్క షాపులకు సైతం మంటలు వ్యాపించాయి. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియరాలేదు. -
ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు
గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్లాండ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్లో అదుపులోకి తీసుకున్నారు. -
గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం
-
గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం
గుడివాడ: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం(ఢిసెంబర్ 14వ తేదీ) ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరిజజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. -
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఫిలిప్పీన్స్లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్ను సాధించడం విశేషం. ICYMI: This is real courage.During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025 -
విజయనగరంలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధురాలు మృతి
-
‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..
న్యూఢిల్లీ: గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన భావనా జోషి అయినవారిని కోల్పోయి, తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. గత శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఆమె తన భర్త వినోద్ కుమార్ (43)తో పాటు తన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. కమలా జోషి (42), అనితా జోషి (41), సరోజ్ జోషి (39)లను కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది మృతిచెందగా, భావన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్లబ్లోని అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చూస్తున్నంతలోనే ఎగసిపడి, కొందరి జీవితాలను బుగ్గిపాలు చేశాయి. క్లబ్లో నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, పైరోగన్ల వాడకం, గడ్డితో కూడిన పైకప్పు, పలు భద్రతా లోపాల కారణంగా మంటలు నిముషాల వ్యవధిలోనే అంతటా చుట్టుముట్టాయి.నృత్య కార్యక్రమం సందర్భంగా వెలిగించిన విద్యుత్ పైరోగన్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ క్లబ్లో తగినన్ని నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, మండే పదార్థాల వాడకం, మద్యం సీసాల నిల్వలు మొదలైనవి మంటల తీవ్రతను పెంచి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేస్తామని గోవా కలెక్టర్ కార్యాలయం నుండి తనకు కాల్స్ వస్తున్నాయని భావనా జోషి తెలిపారు. అయితే తమకు ఎలాంటి పరిహారం అవసరం లేదని, న్యాయం కావాలని అని ఆమె కోరారు. వారు ఇచ్చే రెండు లక్షలు నా కుటుంబాన్ని తిరిగి తీసుకువస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. పరిహారం కంటే న్యాయమే తనకు ముఖ్యమని ఆమె రోదిస్తూ తెలిపారు.మృత సోదరీమణుల తల్లి మీనా మీడియాతో మాట్లాడుతూ ‘నేను నా పిల్లలను కోల్పోయాను. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయాను. నేరస్థులు బెయిల్పై లేదా జరిమానాతో తప్పించుకోకుండా కఠిన శిక్షలు ఎదుర్కొనేలా చూడాలని’ ఆమె డిమాండ్ చేశారు. కమల భర్త నవీన్ కూడా అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తూ.. పలు రెస్టారెంట్లు, క్లబ్లలో నిబంధనలు పాటించడం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలావుండగా నైట్క్లబ్ సహ యజమానులు, ఢిల్లీకి చెందిన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ నుండి థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నిందితులు గోవాలో ఈ క్లబ్ నిర్వహణకు భూ ఒప్పందపు నకిలీ కాపీని ఉపయోగించారని పోలీసు దర్యాప్తులో తేలింది. కాగా నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఢిల్లీ కోర్టు దానిని తిరస్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ నిందితులను త్వరలోనే సంయుక్త దర్యాప్తు బృందం భారతదేశానికి తిరిగి తీసుకువస్తుందన్నారు. ఈ విచారణను కేవలం క్లబ్ యజమానులే కాకుండా, కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు -
స్టీల్ ప్లాంట్ లో మంటలు భారీ శబ్దాలతో కార్మికుల పరుగులు
-
పోలీసులు అదుపులో లూథ్రా బ్రదర్స్
గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్ను ఎట్టకేలకు థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్క్లబ్లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే ఈ క్లబ్ యజమానులైన లూథ్రా బ్రదర్స్ థాయిలాండ్ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. భారత్- థాయిలాండ్ దేశాల మధ్య 2013లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ప్రస్తుతం థాయిలాండ్ లూథ్రా బ్రదర్స్ను భారత్కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్ రోమియో నైట్క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గోవా అగ్నిప్రమాదం: పోలీసుల ఉచ్చులో లూథ్రా బ్రదర్స్
గోవా: ఇటీవల గోవాలోని నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్పోర్ట్లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్ట పడింది.లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున 1:17 గంటలకు వారు మేక్మైట్రిప్ (ఎంఎంటీ)లో లాగిన్ అయ్యి విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమ్మిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరూ అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానం 6ఈ 1073లో ఢిల్లీ నుండి నేరుగా థాయిలాండ్కు వెళ్లిపోయారని వెల్లడయ్యింది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.ప్రస్తుతం థాయిలాండ్లోని ఫుకెట్లో తలదాచుకున్న లూథ్రా సోదరులు లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసును ఎదుర్కొంటున్నారు. ఇంతలో గోవా పోలీసులు నైట్క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్పోర్ట్లు సస్పెండ్ చేస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.ఈ కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సావంత్ మాట్లాడుతూ ‘అది థాయ్లాండ్ అయినా లేదా మరే ఇతర ప్రదేశమైనా సరే, మేము వారిని అక్కడి నుండి పట్టుకొచ్చి జైల్లో పెడతాం’ అని స్పష్టంగా ప్రకటించారు.ఇకపై బాణసంచాకు శాశ్వత నిషేధంగోవాలోని అర్పోరా నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దరిమిలా ఉత్తర గోవా పరిపాలనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడి నైట్క్లబ్లు, హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రాథమిక దర్యాప్తులో నైట్క్లబ్ లోపల నృత్య ప్రదర్శన సందర్భంగా విద్యుత్ బాణసంచా (పైరోటెక్నిక్స్) ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని వెల్లడయ్యింది. ఈ తాజా నిషేధం ద్వారా ఈ రకమైన ప్రమాదకర ప్రదర్శనలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఐదుగురు మేనేజర్లు,సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పారిపోయిన క్లబ్ యజమానుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం! -
Surat: భారీ అగ్నిప్రమాదం కాలిబూడిదైన టెక్స్టైల్ మార్కెట్
-
సూరత్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి సూరత్: గుజరాత్ సూరత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ స్తానికంగా ఉన్నరాజ్ టెక్స్టైల్స్ మిల్లులో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీ ఏడవ అంతస్తులో భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల అదుపులో గోవా నైట్క్లబ్ యజమాని
గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆ క్లబ్ యజమానులు సౌరవ్, గౌరవ్ లపై ఇంటర్ఫోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేయగా తాజాగా ఆ క్లబ్లో సహా యజమానిగా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై సీరియస్గా ఉన్న ఆ రాష్ట్ర సీఎం ఆ యజమానులకు చెందిన మరో క్లబ్ను కూల్చివేయాలని నిన్న అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నిన్న మరో క్లబ్ను నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగిన క్లబ్కు కో పార్టనర్గా ఉన్న అజయ్ గుప్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తాను క్లబ్ పార్టనర్ మాత్రమేనని అంతకు మించి తనకు ఏమి తెలియదని గుప్తా తెలిపినట్లు సమాాచారం. అజయ్ గుప్తాను విచారణ నిమిత్రం పోలీసులు రిమాండ్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రమాద ఘటన జరిగిన కొద్దిసేపటికే క్లబ్ యజమానులు సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరూ థాయ్లాండ్ పారిపోయారు. దీంతో వారిద్దరిపై పోలీసులు లూకౌట్ నోటీలుసు ఇష్యూ చేయగా, ఇంటర్నేషనల్ ఏజేన్సీ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. బ్లూకార్నర్ నోటీసులు జారీ చేయడానికి సాధారణంగా వారం రోజుల సమయం పడుతుందని కానీ ఈ ప్రమాద ఘటన తీవ్రత నేపథ్యంలో సెంట్రల్ ఏజెన్సీలు తక్షణమే స్పందించి కేవలం రెండు రోజుల్లో బ్లూకార్నర్ నోటీసులు వచ్చేలా కృషి చేశాయని గోవా పోలీసు అధికారులు తెలిపారు.అంతేకాకుండా ప్రస్తుతం పరారీలో ఉన్న లూథ్రాబ్రదర్స్ను పట్టుకోవడానకి గోవాకు చెందిన ప్రత్యేక పోలీసుల బృందం థాయ్లాండ్కు వెళ్లాయని పేర్కొన్నారు. గోవా ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని దానికోసం సీబీఐతోపాటు ఇంటర్పోల్ సహాయం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. లూథ్రా బ్రదర్స్కు ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. న్యూఢిల్లీలోని రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీస్ లూథ్రా బ్రదర్స్ పాస్పోర్ట్ ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది.ఈ శనివారం అర్థరాత్రి బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఆ క్లబ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని తేలింది. నైట్ క్లబ్కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేక పోయిందని అధికారులు తెలిపారు. దానితో పాటు క్లబ్ నిర్మాణం తాటాకులతో చేపట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. -
విశాఖ: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖ: విశాఖ బీచ్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనకర వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోనికి తెస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఇటీవలే విశాఖపట్టణంలోని కింజ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని పలు టేబుల్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. నాడు కేజీహెచ్ ఆర్ ఎం ఓ బంగారయ్య మాట్లాడుతూ ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు. ఆస్పత్రిలోని రోగులు అందరినీ షిఫ్ట్ చేశామని, ప్రమాదంలో ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. ప్రమాదంపై వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రోగుల పట్ల ప్రభుత్వానికీ, అధికారులకు శ్రద్ద లేదన్నారు. కేజీహెచ్లో అధికారుల మధ్య సమన్వయం లేదని, ఎక్కడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని గణేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఇంత జరిగినా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. -
గోవా నైట్ క్లబ్ ప్రమాదం... ఇద్దరిపై లుకౌట్ నోటీసులు
న్యూఢిల్లీ/పనజీ: 25 నిండు ప్రాణాలు బలిగొన్న గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం ఉదంతంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించి క్లబ్ యజమానులుగా భావిస్తున్న అజయ్ గుప్తా అనే భారతీయునితో పాటు సురేందర్ కుమార్ ఖోస్లా అనే బ్రిటిష్ జాతీయునిపై మంగళవారం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రాథమిక యజమానులుగా చెబుతున్న సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే థాయ్ లాండ్ కు పారిపోవడం తెలిసిందే.వారిని తిరిగి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం వారిపై ఇంటర్ ఆయిల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఐదుగురిని అరెస్టు చేసినట్టు డీఐజీ వర్షా శర్మా తెలిపారు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ఆ క్లబ్ మొత్తాన్నీ మంగళవారం నేలమట్టం చేశారు. -
ఇండోనేసియాలో అగ్ని ప్రమాదం
జకార్తా: ఇండోనేసియా రాజధాని నగరం జకార్తాలో ఏడంతస్తుల భవంతిలో ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నిండు గర్భిణి సైతం అగ్నికి ఆహుతయ్యారు. జకార్తా సిటీలోని కెమయోరన్ ప్రాంతంలోని ఒక భవంతిలోని మొదటి అంతస్తులో నిల్వచేసిన డ్రోన్ బ్యాటరీల్లో ఒకటి పేలడంతో అంటుకున్న నిప్పు రవ్వలు మెరుపువేగంతో పై అంతస్తులకు ఎగబాకి పెద్దస్థాయిలో మంటల్ని రాజేశాయి. దీంతో భవంతిలోని వాళ్లు వెంటనే తప్పించుకునే అవకాశం లేకుండాపోయిందని సెంట్రల్ జకార్తా పోలీస్ చీఫ్ సుసత్యో పూర్ణోమో కాండ్రో వెల్లడించారు. బుధవారం సిబ్బంది మధ్యాహ్న భోజనాలు చేసే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.భవనానికి నిప్పు అంటుకుందని తెల్సిన వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, 28 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక డ్రోన్ల తయారీ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఈ బహుళ అంతస్తుల భవంతిలో ఉంది. మొదటి అంతస్తులో బ్యాటరీలను నిల్వచేయడంతోపాటు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశా రు. ఇక్కడి బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్యాటరీలకు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మెరుపులు వచ్చి చివరకు అగ్గిరాజుకుందని మరో ప్రత్యక్ష సాక్షి ఇన్టాన్ పుష్పిత చెప్పారు.మంటలు పై అంతస్తులకు ఎగబాకుతుండటంతో పొడవాటి నిచ్చెనల సాయంతో ఆరో అంతస్తులో చిక్కుకున్న కొందరు కార్మికులకు ఎలాగోలా బయటకు తీసుకురాగలిగారు. బ్యాట రీలు పేలడంతో వెలువడిన పొగ భవంతిని కమ్మేసిన దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చాలా మంది చనిపోయారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఘటనకు వాస్తవిక కారణా లను ఆధా రసహి తంగా కనిపెట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు. భవంతిలో అత్యయిక పరిస్థి తుల్లో తప్పించుకునే ఏర్పాట్లు లేవని ఘటనాస్థలిని పరిశీలించిన జకార్తా గవర్నర్ ప్రమోనో అనున్గ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన భవంతిలో పీటీ రెట్రా డ్రోన్ ఇండోనేసియా అనే కంపెనీ కార్యాలయం నడుస్తోంది. ఇది నిర్మాణం, గనులు, ముడిచమురు, సహజవాయువు, ఇంధన, వ్యవ సాయం, పట్టణ ప్రణాళిక రంగ కంపెనీలకు డ్రోన్ల ను సమకూరుస్తోంది. -
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం!
ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.సెంట్రల్ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్ ప్రసారం చేస్తున్న విజువల్స్లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్ పైన నిల్చున్న దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.#இந்தோனேசியா தலைநகர் #ஜகார்த்தா-வில் வணிக கட்டிடம் ஒன்றில் இன்று ஏற்பட்ட தீ விபத்தில் 5 பெண்கள், 15 ஆண்கள் என குறைந்தது 20 பேர் பலியாகியுள்ளனர்.#indonesia #jakarta #FireAccident pic.twitter.com/yh9wKi6V0G— patrikai.com (@Patrikaidotcom) December 9, 2025ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు. -
గోవా ప్రమాదం.. మరో నైట్ క్లబ్ కూల్చివేత
ఇటీవల గోవాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన "బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్" యజమానులకు సంబంధించిన మరో క్లబ్ ను మంగళవారం కూల్చివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గోవాలోని నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అక్రమ నిర్మాణంతో పాటు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడమే అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నైట్ క్లబ్ యజమాని గౌరవ్ లూథ్రాకు చెందిన బీచ్ షేక్ అనే మరో క్లబ్ ను కూల్చివేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో అధికారులు ఆ బీచ్షేక్ను కూల్చివేశారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ "అక్రమంగా నిర్మించిన పోర్షన్ ను కూల్చివేయమని పర్యాటక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. నార్త్ గోవా కలెక్టర్ ఆకట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా పోలీసుశాఖ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఈ రోజు కూల్చివేతలు చేపడతారు" అని అన్నారు.నైట్ క్లబ్ నిర్మాణం తాటాకులతో ఉండడంతో పాటు ఆ క్లబ్ కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకైన దారులు కావడంతో సహాయక బృందాలు సరైన సమాయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయన్నారు. గతంలోనూ ఆ క్లబ్ ను కూల్చివేయాలంటూ నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆ ప్రాంతంలోని నాయకులు తెలిపారు.కాగా ఈ రోజు ఉదయం గోవా పోలీసులు విచారణ నిమిత్తం ఢిల్లీలోని నైట్ క్లబ్ యజమానుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలు లేరు. వీరిద్దరూ ప్రమాదం జరిగిన అనంతరం థాయ్లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ నైట్క్లబ్ ఓనర్ గౌరవ్ లూథ్రా థాయ్లాండ్ ఎయిర్పోర్టులో ఉన్న చిత్రాలు బయిటకి వచ్చాయి. కాగా వీరిద్దరిపై అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ తో పాటు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేశారు. -
దాద్రానగర్ హవేలీలో భారీ అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో గోవా పోలీసుల తనిఖీలు
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు. -
నిర్లక్ష్యం మంటలు!
ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్న వ్యవస్థలున్నచోట మరో ఘోరం జరిగిపోయింది. గోవాలోని అర్పోరా గ్రామ సమీపంలో ఆదివారం వేకువజామున ఒక నైట్ క్లబ్లో చెలరేగిన మంటల్లో చిక్కు కుని, పొగతో ఊపిరాడక 25 మంది కన్నుమూశారు. మరో ఆరుగురు గాయపడ్డారు.రెండేళ్లుగా ఎలాంటి అనుమతులూ, లైసెన్సులూ లేకుండా అక్కడ వ్యాపారం సాగు తున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం ఇప్పుడు సంతాపం ప్రకటించి, నష్టపరిహారం వాగ్దానం చేసింది. ఈ క్లబ్ నిర్మాణాన్ని గ్రామ పంచాయతీ సకాలంలో పసిగట్టి 2023 డిసెంబర్లో నోటీసులు జారీచేసింది. పర్యావరణపరంగా అది అత్యంత సున్నితమైన ప్రాంతం గనుక అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరపరాదని తెలిపింది. 2024 ఏప్రిల్లో దాన్ని కూల్చేయాలంటూ నోటీసులిచ్చింది. అటుతర్వాత ఏం జరగాలో అదే జరిగింది. స్థల యజమాని పంచాయతీరాజ్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అప్పీల్ చేశాడు. ఆ వెంటనే స్టే జారీ అయింది. మొన్న ఆగస్టులో బీజేపీ సభ్యుడు సంకల్ప్ అమోంకర్ దీన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఉప్పు మడులు, పంటపొలాలు ఉన్నచోట యథేచ్ఛగా, చట్టవిరుద్ధంగా నైట్ క్లబ్లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ జరిగిందేమీ లేదు. అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అంటున్నారు. మంచిదే. కానీ శాసనసభలో ప్రస్తావనకొచ్చి మూణ్ణెల్లు దాటుతున్నా చేసిందేమిటి?మంటలు ఆర్పడానికొచ్చిన అగ్నిమాపక వాహనాలు 400 మీటర్ల అవతలే నిలిచి పోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఊహించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకున్నా చాలాసేపు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో డీజేల హోరుమధ్య బెల్లీ డ్యాన్స్ కార్యక్రమం సాగు తుండగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో బాణాసంచా కాల్చడం, అలంకరణ కోసం పైకప్పుపై వెదురు, ఫైబర్, గడ్డి వగైరాలతో చేసిన నిర్మాణంపై ఆ నిప్పు రవ్వలు పడటం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆ సమయానికి బయటకు పోయేందుకు ఉన్న ఒకే ఒక తోవ ఇరుగ్గా ఉండటంతో బయటపడటం కష్టమైందనీ, దాంతో కొందరు బేస్మెంట్వైపున్న మెట్లు దిగార నీ, అటు వెళ్లినవారంతా దట్టమైన పొగ వ్యాపించటంతో ఊపిరాడక చనిపోయారనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. క్లబ్ నిర్మించాక అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు దాన్ని సందర్శించి ఉంటే ఇలాంటి విషాదాన్ని ముందే ఊహించేవారు. ఎక్కడెక్కడ వెలుపలికి పోయే మార్గాలుండాలో, మంటలు ఆర్పటానికి తోడ్పడే పరికరాలను ఎక్కడ అందుబాటులో ఉంచాలో సూచించేవారు.మంటల కారణంగా విద్యుత్ నిలిచిపోయాక ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుము కుని తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోవాలో క్లబ్ల కొచ్చేవారిలో అత్యధిక శాతం యువత. విదేశీయులతోపాటు వేర్వేరు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు వారాంతంలో బృందాలుగా గోవాకు వస్తుంటారు. ఎంతో బంగారు భవిష్యత్తుగల ఈ యువత కారణంగా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే క్లబ్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలం కావటం, పన్నుల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరించటం దుర్మార్గం. ఇలాంటి క్లబ్బుల్లో అడపా దడపా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బయటపడుతున్నాయి. అయినా ముందు జాగ్రత్తలు లేవు.పాశ్చాత్య విష సంస్కృతిని అరువు తెచ్చుకుని వ్యాపారం సాగించటం ఈ బాపతు క్లబ్బుల బతుకుతెరువు. మద్యం ఏరులై పారే, జూదం చోటుచేసుకునే ఇలాంటి వాటిని నడవనీయరాదన్న ఉన్నతాశయం ప్రభుత్వాలకు ఎటూ ఉండటం లేదు. కనీసం వాటిని నియంత్రించటమైనా తమ బాధ్యతగా భావించకపోవటం విషాదకరం. క్లబ్బులే కాదు... ఆకాశాన్ని తాకే భవంతులు సైతం ఎలాంటి ప్రమాణాలూ పాటించకుండానే నిర్మాణ మవుతున్నాయి. అసలు మన దేశంలో అగ్నిమాపక వ్యవస్థ అత్యంత నాసిరకమైనది. అగ్నిమాపక కేంద్రాలు తక్కువ. అక్కడి సిబ్బంది వాడే పరికరాలు, వాహనాలు చాలా భాగం కాలం చెల్లినవి. కనీసం తాజా ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? ఆ రంగం సమూల ప్రక్షాళనకు పురిగొల్పుతుందా? -
గోవా ప్రమాదం: తొలిసారి స్పందించిన నైట్క్లబ్
గోవా: గోవాలోని నార్త్ గోవా నైట్క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.తాజాగా క్లబ్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. జరిగిన ప్రాణనష్టంపై తాము తీవ్రంగా చలించిపోయామని విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చింది. కాగా క్లబ్ వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ భరత్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత, లూత్రా అదృశ్యం చర్చనీయాంశమైంది. భారతదేశం అంతటా 50 రెస్టారెంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న లూత్రా, ‘రోమియో లేన్’, ‘బిర్చ్ అండ్ మామాస్ బుయోయి’కి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాగా గోవాకు చెందిన సామాజిక కార్యకర్త తాహిర్ నోరోన్హా మాట్లాడుతూ లూత్రా.. గోవాకు అరుదుగా వస్తుంటాడని, చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ తన ప్రతినిధులను పంపుతాడన్నారు. క్లబ్ సిబ్బంది మాట్లాడుతూ లూత్రా నెలకు ఒకసారి మాత్రమే క్లబ్ను సందర్శిస్తారని, ఉద్యోగులతో అరుదుగా మాట్లాడతారని తెలిపారు. పరారీలో ఉన్న లూత్రో కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. Goa restaurant fire that claimed 25 lives | Saurabh Luthra, owner of Birch restaurant, issues a statement following the deadly fire that broke out in the restaurant on 7 December. pic.twitter.com/EFh9HZl35V— ANI (@ANI) December 8, 2025అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 నుండి 200 మంది డ్యాన్స్ ఫ్లోర్లో ఉన్నారని సమాచారం. మంటలు చుట్టుముట్టడంతో, ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు వంటగదివైపునకు పరుగెత్తారు. అక్కడే వారు సిబ్బందితో పాటు చిక్కుకుపోయారు. కాగా గోవా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. యజమాని సౌరభ్ లూత్రాను, అతని సోదరులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో లూత్రా కోసం దేశవ్యాప్తంగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన సంఘటనల పూర్తి క్రమాన్ని, భద్రతా ఉల్లంఘనలను అధికారులు పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్లబ్లో సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.ఇది కూడా చదవండి: తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం! -
తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!
న్యూఢిల్లీ: గోవాలో ఎంజాయ్ చేసేందుకు తొలిసారిగా వెళ్లిన ఢిల్లీకి చెందిన ఒక కుటుంబానికి తీరని విషాదం ఎదురయ్యింది. జీవితంలో మరిచిపోలేని అనుభూతిని పొందాలని ఆశపడుతూ, సాగిన వారి పర్యటన చివరికి వారిని మృత్యు ఒడికి చేర్చింది. ఆదివారం తెల్లవారుజామున ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వినోద్ కుమార్, ఆయన భార్య భావన, ఆమె సోదరీమణులు అనిత, కమల, సరోజ్లతో పాటు కమల భర్త నవీన్, పిల్లలు కలిసి గోవా ట్రిప్కు బయలుదేరారు. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో టిఫిన్ చేసి, తిరిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. ఎలాగోలా బయటకు పరుగుపెట్టిన భావన, తన సోదరీమణులు లోపల చిక్కుకోవడాన్ని గమనించి ఉలిక్కిపడింది.మరోవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగెడుతున్న జనాన్ని చూసి కూడా.. భావన తన అక్కాచెల్లెళ్లను కాపాడేందుకు ధైర్యంగా మంటల్లోకి వెళ్లారు. వినోద్ కుమార్ కూడా ఇదే ప్రయత్నంలో భావన వెంట వెళ్లారు. అంతకంతకూ ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగకు తోడు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడంతో వారు కూడా ఆ మంటల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు సోదరీమణులు.. అనిత, కమల, సరోజ్, భావన భర్త వినోద్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. భావన మాత్రం ఎలాగోలా బయటపడగలిగారు.కుటుంబంలో నలుగురు మరణించిన విషయం తెలియడంతో ఢిల్లీలోని కరావాల్ నగర్లోని వారి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆ ఇంటి పెద్ద అయిన వృద్ధురాలికి ఇంకా చెప్పలేదని కుటుంబ స్నేహితుడు హరీష్ సింగ్ తెలిపారు. ‘వారు గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారి. వారంతా చాలా ఉత్సాహంగా వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. వారి తల్లి ఆరోగ్యం బాగోలేదు. అందుకే ఆమెకు ఈ విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాం’ అని సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందారు.ఇది కూడా చదవండి: గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు -
నైట్ క్లబ్బుల్లో మరణ శాసనాలు
నిత్య జీవితంలో రోజువారీ పనులతో అలసిపోయి సరదాగా గడపడానికి నైట్క్లబ్లకు వెళితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. గోవా నైట్క్లబ్బులో 25 మంది మరణించడం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నైట్క్లబ్సుల్లో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాలక్షేపం, వినోదం, విశ్రాంతి కోసం వచ్చిన పర్యాటకులు విగత జీవులుగా మారారు. 2015 అక్టోబర్: రొమేనియా దేశంలోని బుకారెస్ట్ కలెక్టివ్ నైట్క్లబ్లో అగి్నప్రమాదం జరగడంతో 64 మంది మృతి. 2016 డిసెంబర్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఘోస్ట్షిప్ క్లబ్లో మంటలు చెలరేగడంతో 36 మంది బలి. 2022 జనవరి: ఆఫ్రికా దేశం కామెరూన్లోని యావోన్డే నైట్క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి. 2022 జనవరి: ఇండోనేషియాలో వెస్ట్పపువా ప్రావిన్స్లో సోరోంగ్ నైట్క్లబ్లో మంటలు. తుదిశ్వాస విడిచిన 19 మంది టూరిస్టులు. 2022 ఆగస్టు: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని మౌంటైన్ బీ క్లబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు. 23 మంది అగ్నికి ఆçహుతి. 2023 అక్టోబర్: స్పెయిన్లోని మర్సియాలో నైట్క్లబ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం. 13 మంది మృతి. 2024 ఏప్రిల్: టర్కీలోని ఇస్తాంబుల్లో మస్కరేడ్ నైట్క్లబ్లో చెలరేగిన మంటలు. 29 మంది అక్కడికక్కడే మృతి. 2025 మార్చి: ఉత్తర మాసిడోనియాలోని నైట్క్లబ్లో బాణాసంచా కాలుస్తుండగా మంటలు అంటుకోవడంతో 62 మంది మృతి. ఇదీ చదవండి: గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది సజీవదహనం -
గోవా విషాదం: దర్యాప్తులో సంచలన వాస్తవాలు
గోవా: ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు.పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్లు అందుబాటులో నిందితులు ప్రదర్శనను నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్ఐఆర్లో వివరించారు. The tragic loss of lives in a fire accident in Arpora, Goa, is deeply painful. My sincerest condolences to the families of those who lost their lives and prayers for the speedy recovery of the injured @goacm Goa CMO is taking the necessary actions on fire safety. pic.twitter.com/NCDe1AdkZF— INTERNATIONAL HUMAN RIGHTS - INHRF (@DirectorINHRFHC) December 7, 2025ఎఫ్ఐఆర్ లోని వివరాలు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెల్లడించాయి. రెస్టారెంట్లో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు డెక్లో అత్యవసర నిష్క్రమణ తలుపు లేకపోవడం ఎఫ్ఐఆర్లో గమనించదగిన అంశం.vTerrifying video of the Goa accident pic.twitter.com/HrCWMPM1A3— kamal Bhardwaj (@bhardwaj_k9310) December 7, 2025 అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్/క్లబ్కు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని తేలింది. Deeply pained by the tragic fire in Arpora, Goa that has claimed more than 20 innocent lives. My heartfelt condolences to the bereaved families, and prayers for the speedy recovery of those injured.This is not just an unfortunate accident — it reflects a grave failure of safety… pic.twitter.com/azA2bamXQY— Durgesh Shukla (@mydurgeshshukla) December 7, 2025నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)సెక్షన్లు 105 (నేరపూరిత నరహత్య), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్య), 125 (ఎ), 125 (బి), 287 (అగ్ని లేదా మండే పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం)తో పాటు సెక్షన్ 3 (5) (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనను మానవ తప్పిదంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో -
ఈయన క్లబ్లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్ బ్యాక్గ్రౌండ్
గోవా: గోవాలోని అర్పోరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలోని అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ నేపధ్యంలో ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నైట్క్లబ్ను ఒక గోల్డ్ మెడలిస్ట్ స్థాపించాడని తెలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బీటెక్లో బంగారు పతకం అందుకున్న సౌరభ్ లూత్రానే ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్క్లబ్ యజమాని. చదువు పూర్తయిన తర్వాత లూత్రా అంతర్జాతీయ క్లయింట్ల కోసం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశారు. తరువాత తన కెరీర్ను రెస్టారెంట్, నైట్లైఫ్ వ్యాపారం వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. 2016లో ఆహారపానీయాల (ఎఫ్ అండ్ బీ) పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది న్యూఢిల్లీలో ‘రోమియో లేన్’ అనే బ్రాండ్ను స్థాపించారు.ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని లూత్రా ప్రణాళికలు వేశారు. అతని నైట్క్లబ్ వెబ్సైట్ ప్రకారం రోమియో లేన్ ప్రస్తుతం భారతదేశంతో సహా నాలుగు దేశాలలోని 22 నగరాల్లో ఔట్లెట్లను కలిగి ఉంది. ఈ విస్తరణ అతని వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. అతని బ్రాండ్కు లభించిన పలు అవార్డులు.. ఫోర్బ్స్ ఇండియాలో ఈ బ్రాండ్ ఫీచర్ కావడం మొదలైనవి అతని వ్యాపార విజయాలకు అద్దం పడుతున్నాయి.లూత్రాకు చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను రోమియో లేన్కు మాత్రమే కాకుండా ‘బిర్చ్’, ‘మామాస్ బుయోయి’ తదితర సంస్థలకు కూడా ఛైర్మన్గా ఉన్నారు. ఇది ఆయన నైట్లైఫ్, హాస్పిటాలిటీ రంగంలో ఎంతటి విజయం సాధించారో తెలియజేస్తుంది. అయితే గోవాలోని అతని క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం అతని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నైట్క్లబ్లో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగి, 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్లో 100 మందికి పైగా జనం ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో.. క్లబ్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నియమాలను విస్మరించిందని వెల్లడయ్యింది. మృతులలో ఎక్కువ మంది వంటగది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు నైట్క్లబ్ మేనేజర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య -
Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్ వీడియో
ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.. మెహబూబా పాటకు డ్యాన్స్.. బ్యాక్గ్రౌండ్ మంటలుబాలీవుడ్ మూవీ షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అంతా మంచి జోష్లో ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఈలలు-కేరింతలు అన్నట్లు ఉంది. అయితే సడెన్గా అంఆ నిశ్భబ్దం అయ్యారు. డ్యాన్సర్ వెనుకాల గోడకు అమర్చిన చెక్క నుంచి మంటల జాడ కనిపించడంతో ఏదో జరగబోతుందని గ్రహించారు. కొంతమంది ఏం జరుగుతుందోనని పైకి వెళ్లగా, మరికొంతమంది వంట గదిలో దాక్కునే యత్నం చేశారు. ఇక డ్యాన్సర్లు, మ్యుజిషియన్లు అంతా బయటకు పరుగులు తీశారు. వారి మ్యూజికల్ సామాగ్రిని అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయే యత్నం చేశారు. ఆ క్లబ్ను అంతే వేగంగా మంటలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది వరకూ ప్రాణాలు కోల్సోగా, అందులో ఎక్కువమంది ఆ క్లబ్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఆ క్లబ్ యాజమాన్యం అజాగ్రత్త వల్ల జరిగిందా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. Watch the roof as the fire erupts.Final Moments before the deadly Arpora goa fire.At least 25 ppl dead. Bodies charred in the deadly fire which erupted from a suspected cylinder blast pic.twitter.com/OnCrR5eTyH— Shivan Chanana (@ShivanChanana) December 7, 2025 ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారం గందరగోళంమంటలు చెలరేగిన తర్వాత అక్కడున్న తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో బయటకు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. చిన్నపాటి, ఇరుకుగా ఉన్నటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. అయితే చాలామంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ , 25 మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవాలో ఇలా జరగడం ఇదే తొలిసారి.. : సీఎంఈ విషాదకర ఘటనపై గోవా సీఎం ప్రమోద సావంత్ స్పందించారు. ‘ గోవాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఆ క్లబ్లో పై ఫ్లోర్ నుంచి మంటల వ్యాపించాయని, అక్కడ డోర్స్ ఏర్పాటు కూడా సరిగా లేదన్నారు. చాలామంది తప్పించుకునే యత్నం చేశారని, కొంతమంది మాత్రం అక్కడ నుంచి బయటపడలేకపోయి ప్రాణాలు కోల్పోయారన్నారు. చాలామందికి ఏమీ చేయాలో తెలియక అండర్ గ్రౌండ్ ఏరియాకు వెళ్లి మృత్యువాత పడ్డారన్నారు. గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం -
గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో మాట్లాడినట్లు మోదీ పేర్కొన్నారు. కేంద్రం మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం అధికారులతో కలిసి పరిశీలించారు. బిర్స్ నైట్ క్లబ్ సరైన నిబంధనలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించాయి. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్హామ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.


