Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం | Fire accident in Nampally | Sakshi
Sakshi News home page

Hyd: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Jan 24 2026 2:30 PM | Updated on Jan 24 2026 7:38 PM

Fire accident in Nampally

సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్‌లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్‌ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు.  

ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూ
నాంపల్లిలో ఫర్నిచర్‌ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.

Hyd: భారీ అగ్ని ప్రమాదం తగలబడుతున్న భవనం మంటల్లో చిక్కుకున్న పిల్లలు

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement