వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం
మండలంలోని పస్పులలో కృష్టానది ఒడ్డున వెలిసిన శ్రీవల్లభాపురం దత్తాత్రేయస్వామి
రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో
అలంకరించిన రథంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ ముందుకు లాగారు. ఈ సందర్భంగా రథోత్సవానికి
వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తప్ప, కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మక్తల్


