breaking news
Narayanpet District News
-
అన్నదాతకు అవస్థలు
మరికల్: వానాకాలం సీజన్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర దిగుబడి ఇవ్వకపోవగా.. యాసంగిలోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి ముగుస్తున్నా చలి తీవ్రతత తగ్గకపోవడంతో ఎదుగుదల కనిపించడం లేదు. అలాగే రకరకాల తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెట్టామని.. ఓ పక్క పంట పెరుగుదల లేక ఆందోళన చెందుతుండగా, మరోపక్క తెగుళ్లు సోకి అదనపు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పంటకు పురుగు మందుల కొనుగోలుకు రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తోందని.. దీనికితోడు పిచికారీ చేయడానికి ట్రాక్టర్ అద్దె రూ.1,500 అవుతుందని చెప్పుకొచ్చారు. ● మండలంలో యాసంగి సీజన్లో కోయిల్సాగర్ ఆయకట్టు కింద 6 వేల ఎకరాలు, వ్యవసాయ బోరుబావుల కింద 2 వేల ఎకరాల వరి సాగు చేశారు. వాతావరణ మార్పులతో అక్కడక్కడ కొన్ని పంటల పెరుగుదల బాగున్నా తెగుళ్లు వీడటం లేదు. మరికొన్ని పంటలైతే చల్లి తీవ్రత కారణంగా ఎదుగుదల లోపించింది. పంట పెరిగేదెప్పుడు, కోతకు వచ్చేదెన్నడోనన్న సందేహంలో రైతులు ఉన్నారు. ఇప్పటికే ఐదుసార్లు ఫర్టిలైజర్, మందులు పిచికారీ చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మరో 45 రోజుల్లో వరి పంటలు కోతకు రావాల్సి ఉందని.. ఇలాంటి పరిస్థితులు ఎన్నడు చూడలేదని చెబుతున్నారు. వీడని చలి తీవ్రత.. పెరగని వరి పైరులు తెగుళ్ల బారిన పడిన వైనం పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం రూ.1.50 లక్షల పెట్టుబడి.. నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 3 ఎకరాల పంట బాగుంది. మిగతా 3 ఎకరాలు చలి తీవ్రత కారణంగా అక్కడక్కడ పెరగడం లేదు. పంట ఎదుగుదలకు ఐదుసార్లు ఫర్టిలైజర్, పురుగు మందులు పిచికారీ చేసినా లాభం లేదు. ఇప్పటికే రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడిక కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. – ఎల్లగౌడ్, రైతు, ఎలిగండ్ల చలి కారణంగానే.. యాసంగిలో చలి ఎక్కువగా ఉండటంతో నారుమడులు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని రకాల భూముల్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర పెరగనట్లు కనిపిస్తోంది. వ్యవసాయ అధికారుల సూచనలతో మందులు పిచికారీ చేస్తే కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంది. – రహమాన్, ఏఓ, మరికల్ -
కల్యాణం.. కమనీయం
కందూరు శ్రీరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపించారు. దక్షిణకాశీగా వెలుగొందుతున్న ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో మహిళలు సిద్దం చేసిన తలంబ్రాలను గ్రామస్తులు పల్లకీలో ఉంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో ఉంచారు. అనంతరం పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సన్నాయి వాయిధ్యాల నడుమ ఆలయం లోపలి నుంచి కల్యాణ మండపంలోకి తెచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పురోహితులు ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను కట్టించి, జీలకర్ర, బెల్లం పెట్టించారు. వేదమంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య పార్వతి మెడలో మంగళసూత్రాన్ని కట్టించి కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. – అడ్డాకుల -
‘మాస్టర్ ప్లాన్’ మారేనా..?
●పట్టణం విస్తరిస్తున్నా.. పట్టణం విస్తరిస్తున్నా మాస్టర్ ప్లాన్ పాతదే కొనసాగుతోంది. 20 ఏళ్ల కిందట ఇండస్ట్రియల్ జోన్గా ఉన్న ప్రాంతం నేడు రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు నిర్మించే పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపాలిలీకి సైతం ఆదాయం తగ్గుతుంది. మాస్టర్ ప్లాన్ మార్చితే నారాయణపేట రూపురేఖలు మారుతాయి. – పీవీ సాగర్, పుర లైసెన్స్డ్ ఇంజినీర్, నారాయణపేట రివైజ్డ్ చేయొచ్చు.. పేట పురపాలిక మాస్టర్ ప్లాన్ను రివైజ్డ్ చేసుకోవచ్చు. గతంలో శాటిలైట్ ద్వారా సర్వే చేశారు. పుర పాలకవర్గం తీర్మానం చేసి పంపితే పూర్తిస్థాయిలో నిబంధనలతో మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకొని ప్రజల ముందుకు తీసుకురావచ్చు. – గజానంద్, ఆర్డీ, టౌన్ప్లానింగ్, హైదరాబాద్ నారాయణపేట: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న పట్టణ రూపురేఖలు మార్చాలనే తపన కనిపించడం లేదా. సీఎం ఇలాఖాగా చెప్పుకొంటున్న జి ల్లాలోని నాలుగు పురపాలికల్లో మాస్టర్ ప్లాన్లు అధికారులు, పాలకులకు గుర్తుకురావడం లేదా అనే సందేహాలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 23 ఏళ్లు గడిచినా.. నారాయణపేట 1945లో నగరపంచాయితీగా ఏర్పాటైంది. జీఓఎంఎస్ నంబర్ 487 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 06.11.2002లో మాస్టర్ప్లాన్ను అమలులోకి తీసుకొచ్చారు. 23 ఏళ్లుగా అదే మాస్టర్ప్లాన్ అమలవుతోంది. పట్టణంలోని బాహర్పేట, సరాఫ్బజార్, బ్రహ్మణ్వాడి, కుమ్మరివాడి, కలాల్వాడి, పళ్ల, హజీఖాన్పేట తదితర వీధులు ఇరుకుగా ఉండి ఇబ్బందులు తప్పడం లేదు. గృహ నిర్మాణాలు 1745.79 ఎకరాలు, కమర్షియల్ కోసం 51.35 ఎకరాలు, ఇండస్ట్రీయల్కు 210.89 ఎకరాలు, పబ్లిక్ అండ్ సెమీపబ్లిక్ యూజ్కు 250.46 ఎకరాలు, పార్క్లు, ప్లేగ్రౌండ్స్కు 88.35 ఎకరాలు, పబ్లిక్ యూటిలిటీ (నీరు, విద్యుత్ సరఫరా), గ్రేవ్స్కు 19.38 ఎకరాలు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్కు 8.16 ఎకరాలు, రోడ్లు 410.63 ఎకరాలు, వాటర్ కోర్సేస్ 61.46, హిల్లాక్స్ 37.92 ఎకరాలు మొత్తం ప్లానింగ్ ఏరియా 2,889.15 ఎకరాలు, అర్బన్ యూజబుల్ ల్యాండ్ 1677.29 ఎకరాలు మొత్తం 4566.44 ఎకరాలు (18.48 చదరపు కిలోమీటర్లు) మాస్టర్ ప్లాన్లో చూపించారు. ప్రస్తుతం కొలువుదీరిన పాలకవర్గం కొత్త మాస్టర్ప్లాన్పై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ● 2019, ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ జన్మదిన కానుకగా నారాయణపేట జిల్లా ఏర్పాటైంది. ఢిల్లీకి చెందిన డీడీఎఫ్ కన్సలెన్సీ మార్చి 1, 2019న పుర మాస్టర్ప్లాన్లో కాస్త మార్పుచేర్పులు చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డితో పాటు కలెక్టర్గా పదోన్నతిపై వచ్చిన ఎస్.వెంకట్రావు మొదటి సమావేశంలో పాల్గొని గ్రేడ్–3లో ఉన్నప్పుడు శాటిలైట్ ద్వారా సేకరించిన మాస్లర్ప్లాన్ వద్దని.. జిల్లాకేంద్రంతో పాటు గ్రేడ్–2 మున్సిపాలిటీగా మారిందని, భవిష్యత్ తరాలకు విద్య, ఆరోగ్యం, ఇండస్ట్రీయల్, రింగ్ రోడ్ తదితర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని వారితో పాటు నాటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, వ్యాపారులు, ప్రజల ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన డా. చిట్టెం పర్ణికారెడ్డి సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాకేంద్రంలో 2011లో 41,752 జనాభా ఉండగా.. ప్రస్తుతం సుమారు 55 వేలకు చేరింది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణం విస్తరించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా.. నారాయణపేటలో పాత మాస్టర్ప్లాన్ ప్రకారం ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీ పబ్లిక్ ప్రాంతాల్లో సైతం భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రియల్ జోన్లో 50 శాతం గృహ నిర్మాణాలు కొనసాగడం.. అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి పదేళ్లకోసారి మాస్టర్ప్లాన్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో 2002 నుంచి ఉన్న మాస్టర్ప్లాన్నే కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడదామనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోస్గి, మక్తల్, మద్దూరులో.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కోస్గి, మక్తల్లో పలు గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2023, డిసెంబర్లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మద్దూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అటు సీఎం ఇలాఖాలోని మద్దూర్, కోస్గి.. ఇటు మంత్రి ఇలాఖాలోని మక్తల్లో కొత్త మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పేట పురపాలికలో 2002లో రూపకల్పన 23 ఏళ్లుగా అదే కొనసాగింపు డీడీఎఫ్ కన్సల్టెన్సీ సవరణలు చేసి మార్చి 1తో ఏడేళ్లు మక్తల్, కోస్గి, మద్దూర్లోసైతం అదే తీరు ఆదాయానికి భారీగా గండి.. మాస్టర్ ప్లాన్ మారకపోవడంతో పేట మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోందని చెప్పవచ్చు. సెంటర్చౌక్ బజార్, సరాఫ్ బజార్, కొత్తబస్టాండ్, సత్యనారాయణ చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా వాణిజ్య సముదాయ భవనాలు నిర్మించబడ్డాయి. యాద్గిర్ రోడ్లో సత్యనారాయణచౌరస్తా నుంచి ఎర్రగుట్ట సమీపం వరకు ఎడమవైపు భాగంలో 210 ఎకరాల వరకు కేటాయిస్తూ అప్పట్లో ఇండస్ట్రియల్ జోన్గా మాస్టర్ప్లాన్లో చూయించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల్లో సైతం ఇండస్ట్రియల్ ఏరియా పెరుగుతుండటంతో అక్కడ సైతం ఆదాయానికి భారీగా గండిపడుతుందని నిపుణులు చెబుతున్నారు. -
సమకూరనున్న నిధులు
యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై ఢిల్లీలోని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టర్తో వీసీ నిర్వహించి నర్వ గురించి చర్చించి 12 ప్రతిపాదనలతోపాటు మరో 2 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో శ్రీపునరుత్పాదక పర్యావరణ అనుకూల ఆహారం (నర్వ కేజీబీవీలో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. అలాగే స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ నాలెడ్జ్ (ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల స్థాపన)కు ఆమోదం తెలిపారు. ● మండలంలో 6 అంగన్వాడీ భవనాలు, డైనింగ్హాల్ కోసం రూ.1.5 కోట్లు, మండలంలోని 3 కేంద్రాలలో ఫేర్ ప్రైస్ షాప్స్ (సూపర్ మార్కెట్ మోడల్) ఏర్పాటు కోసం రూ.3.73 లక్షలు, ఫ్రంట్లైన్ వర్కర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అప్రిసియేషన్ అవార్డు కోసం రూ.2 లక్షలు, మండలంలోని 22 పాఠశాలల్లో ఏఐ డిజిటల్ ల్యాబ్తోపాటు సోలార్ కిచెన్ కోసం రూ.1.2 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.15 లక్షల నిధులు మంజూరు కానున్నాయి. -
నర్వ.. ప్రగతి బావుటా
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్కు ఎంపికతో మహర్దశ సౌరశక్తి ఆధారిత వంటశాల.. సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో చేపట్టిన పనులపై గతేడాది డిసెంబర్ 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందుకు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతి కోసం నర్వ కేజీబీవీలో సౌరశక్తి ఆధారిత వంటశాల (సోలార్ ఫర్ హెల్తీ రినివబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఈటింగ్) స్థాపన కోసం రూ.62.15 లక్షలు మంజూరు చేసింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొదటి విడతగా రూ.15,53,750 మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు పీఎంశ్రీ పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటు కోసం రూ.58,13,070 మంజూరు చేశారు. దీంతోపాటు 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ.8 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూర్చునేందుకు ప్రీ స్కూల్ బల్లలు, కుర్చీలు, గోడలపై పేయింటింగ్స్, మ్యాపులు, మంకీ బార్స్, బెడ్షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. 2024–25లో యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది. -
చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం – 2025కిగాను సంత్ కబీర్ అవార్డులు, జాతీయ చేనేత అవార్డులకుగాను అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు డి.బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంత్ కబీర్ అవార్డుకు గతంలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు పొందిన చేనేత కళాకారులు (వీవింగ్ కేటగిరి) అర్హులని.. 31.12.2025 నాటికి 50 ఏళ్ల వయస్సు, చేనేత రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అలాగే జాతీయ చేనేత అవార్డుకు 31.12.2025 నాటికి 30 ఏళ్లలోపు వయస్సు, చేనేత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని సూచించారు. ఇతర రంగాల్లోని కళాకారులు 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు కలిగి చేనేత రంగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల చేనేత కార్మికులు వీవింగ్, డిజైనింగ్ కేటగిరీ కింద www.handlooms.nic.in వెబ్సైట్లో 23.03.2026 లోగా దరఖాస్తు చేసుకొని, అట్టి దరఖాస్తును చేనేత సేవాకేంద్రం, హైదరాబాద్లో (Weavers Service Centre, Chenetha Bhavan, 2nd foor, Nampay, Hyderabad) సమాచారం ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు సహాయ సంచాలకులు, చేనేత, జౌళిశాఖ, మహబూబ్నగర్ నారాయణపేట కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. ప్రశాంతంగాఇంటర్ పరీక్షలు నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా 3,808 మంది విద్యార్థులకుగాను 3,750 మంది హాజరుకాగా.. 58 మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,264 మందికిగాను 3,220 మంది హాజరుకాగా.. 44 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 544 మందికిగాను 530 మంది హాజరుకాగా.. 14 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధ్యాయులకురాష్ట్రస్థాయి పురస్కారాలు నారాయణపేట రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన జిల్లా ఉపాధ్యాయులు శనివారం రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్నారు. జిల్లా నుంచి హరిసూదన్రెడ్డి (పల్లెర్ల), నరేష్ (కంసాన్పల్లి), రమ్య (కర్నె), భువనేశ్వరి (కొల్లంపల్లి), సురేందర్ (శివాజీనగర్), భారతి (గుండుమాల్) ఎంపికకాగా.. వీరికి హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందించి అభినందించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్ అభినందించారు. నేడు విద్యుత్ సరఫరానిలిపివేత నారాయణపేట రూరల్: మండలంలోని చిన్నజట్రంలో ఉన్న 33 కేవీ ఉప విద్యుత్ కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏఈ సాయినాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలోని అంతారం, అయ్యవారిపల్లి, లక్ష్మీపూర్, బోయిన్పల్లి, స్వాములవారితండాలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని.. రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. చింతపండు క్వింటా రూ.9 వేలు నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.9 వేలు, కనిష్టంగా రూ.5,039 ధర పలికింది. శనగలు రూ.5,259, చింతపండు బోటు రూ.2,552–రూ1,919, పెసర రూ.8,061–రూ.6,506, ఆలసందలు రూ.6, 175–రూ.4,025, తెల్ల కంది రూ.7,609, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,829, కనిష్టంగా రూ.5,189 ధరలు లభించాయి. -
పచ్చదనానికి అడుగులు..
వన మహోత్సవాన్ని విజయవంతం చేసేలా ప్రణాళిక ● నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు ● 272 గ్రామపంచాయతీల్లో ప్రారంభమైన పనులు నర్వ: రగామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీబీజీ రాంజీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో కవర్లలో మట్టి నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో నిర్వహించే వన మహోత్సవంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది చిన్న గ్రామపంచాయతీల్లో 3 నుంచి 5 వేలు, పెద్ద గ్రామపంచాయతీల్లో 10 వేల మొక్కలు నాటారు. కానీ కొన్ని నర్సరీల్లో నామమాత్రపు పనులు చేపట్టి వదిలేయడంతో నిర్వహణ కొరవడి మొక్కలు ఎండిపోయాయి. ఈ ఏడాది నిబంధనలు మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కనీసం 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని నిర్ణయించారు. సమన్వయం కొరవడి.. నర్సరీల నిర్వహణ, కూలీలకు వేతనాల చెల్లింపునకు ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడి లక్ష్యం ఆదిలోనే దెబ్బతింటోంది. ఓ వైపు వీబీజీ రాంజీ అధికారులు మొక్కలు నాటుతుండగా.. మరోవైపు ట్రాన్స్కో అధికారులు పెరిగిన మొక్కలను యథేచ్ఛగా తొలగిస్తున్నారు. విద్యుత్ తీగల కింద ముందుచూపు లేకుండా నాటడం కూడా తప్పిదమే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అడవుల శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా పల్లె వనాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఊరికో నర్సరీ సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు నిర్ణయించి ప్రత్యేక ప్రణాళిక రూపొదించారు. పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిహామీ పథకం సంయుక్తంగా నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు పెంచి నిర్ణీత ప్రాంతాల్లో నాటేందుకు వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది లక్ష్యాన్ని ఖరారు చేసుకొని షేడ్నెట్లను ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు. -
ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచాలి
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: పట్టణంలో నిర్మించే 150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని.. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పట్టణంలోని ట్యాంక్బండ్ను రూ.3.70 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ శ్రీరాములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్గౌడ్, నాగరాజు, గోవర్ధన్, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి.. నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని మాధ్వార్ గట్టుతిమ్మప్ప ఆలయ ఆవరణలో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్యాణ మండప నిర్మాణానికి గ్రామస్తులందరు కలిసి రూ.35 లక్షల విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. గ్రామం నుంచి ఆలయం వరకు రూ.70 లక్షలతో సీసీ రహదారి నిర్మిస్తామని.. వచ్చే జాతర వరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రహదారి విస్తరణ చేపట్టేందుకు గ్రామస్తులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. కల్యాణ మండప నిర్మాణానికిగాను తనవంతు సహకారం అందించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్కుమార్, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఆలయ నిర్వాహకులు రాజేశ్వర్రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంతోష్రెడ్డి, శ్రీనివాసులు, సత్యనారాయణ, శంకర్, రామకృష్ణ, బ్యాంకు నర్సింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కవుల పోషణ
స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట కళలకు పట్టం.. ఉద్యానవనాల సాగుకు బీజం తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్కు మార్చారు. మైసూరు ప్యాలెస్ నమూనాతో రాజమహల్, మంత్రమహల్, రాణిమహల్ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది. సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధా న్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి. సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు. దక్షిణ భారతంలో రెండో విమానం కొనుగోలు చేసింది వీరే.. సుపరిపాలన అందించిన రాజా వెంకట లక్ష్మారావు హైదరాబాద్లో రాజవంశ వారసులు.. సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్ మదనగోపాలస్వామి, కొల్లాపూర్లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్లోని సురభి గార్డెన్లో నివాసం ఉంటున్నారు. కళలకు పుట్టినిల్లు.. -
దరఖాస్తుల పరిశీలన వేగవంతం
నారాయణపేట: మీ–సేవా ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ను వినియోగించి దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, జీపీఓలకు యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై పలు సూచనలు చేశారు. మీ–సేవా కేంద్రాల్లో స్వీకరించే దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ను రూపొందించిందని, సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులు డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో పరిశీలనకు వెళ్లి అక్కడ తుది ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఆదాయ, నివాస, కుల ధ్రువపత్రాల దరఖాస్తులు త్వరగా పరిష్కరించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడంతో ప్రజలకు సమయ పాలనతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని వివరించారు. శిక్షణలో యాప్ డౌన్లోడ్ విధానం, లాగిన్ ప్రక్రియ, ఫీల్డ్ వెరిఫికేషన్ నమోదు, ఫొటో అప్లోడ్, రిపోర్ట్ సమర్పణ తదితర అంశాలపై ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ కొంగళి విజయ్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారుల సందేహాలను నివృత్తి చేసి, యాప్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మీ–సేవా సూపరింటెండెంట్ దయాకర్రెడ్డి పాల్గొన్నారు. -
రేర్ డిసీజెస్.. బీ అలర్ట్!
జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధన్వాడ మండలంలో.. గతంలో కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి.. హనుమాన్పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 728, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధిక సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్ కెరటోడర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు. నేడు ‘ఎస్వీఎస్’ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ రేర్ డిసీజెస్ డే సందర్భంగా జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి ధన్వాడ మండలంలోని హనుమాన్పల్లిలో ఎస్వీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ రెసిడెంట్ డైరెక్టర్ కె.రాంరెడ్డి తెలిపారు. జన్యు లోపాలతో చర్మవ్యాధుల బారిన పడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అవగాహన లోపంతో చికిత్సకు రారని.. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత అవసరమయ్యే వారికి చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. హనుమాన్పల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జన్యు లోపాలతో చర్మ వ్యాధులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు డాక్టర్లతో వెబినార్లు మాత్రమే జరిగాయని.. స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని వివరించారు. ఈ వ్యాధులు సైతం.. మరికొందరిలో నెథర్టాన్ సిండ్రోమ్ (చర్మం ఎర్రగా, పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, తీవ్ర దురద, వెంట్రుకలు రాలిపోవడం), ఇచ్థియోసిస్ (చర్మం చాలా పొడిగా ఉండి పొలుసుల్లా ఊడిపోవడం, చర్మం గట్టి పడడం), ఎపిడెర్మలైసిస్ బుల్లోసా (పుట్టిన పిల్లల చర్మం చిట్లిపోయి ఊడిపోవడం), ఎక్రోడెర్మాటిటిస్ ఎంటరోపాథికా (నోరు, ముక్కు, కళ్ల చుట్టూ ఎర్రగా మారి ప్యాచ్లు ఏర్పడడం, చేతులు, కాళ్ల చివరి భాగాల్లో పొడిగా ఉంటూ పొలుసుల్లా ఊడిపోవడం, వెంట్రుకలు రాలిపోవడం), ఎరిత్రోపోయెటిక్ పర్ఫీరియా (సూర్యరశ్మి తగిలితే చర్మం మండడం, ఎర్రబారడం, బుడగలు, గాయాలు, మచ్చలు రావడం) వంటి రుగ్మతలు ఉన్నాయని ఎస్వీఎస్ ఆస్పత్రి ఎండీ, డెర్మటాలజిస్ట్ శరత్చంద్ర వెల్లడించారు. అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి.. రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు -
బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్
నారాయణపేట: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఫణీందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్లోని చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. 15 పరీక్షా కేంద్రాల్లో ఇంగ్లీష్ పరీక్ష జరగగా.. 4,557 మంది విద్యార్థులకుగాను 4,415 మంది హాజరయ్యారు. 142 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వివరించారు. రెగ్యులర్ విద్యార్థులు 4,048 మందికిగాను 3,926 మంది హాజరుకాగా.. 122 మంది పరీక్ష రాయలేదు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 509 మందికిగాను 489 మంది హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పోలీసు అధికారులు పర్యవేక్షించారు. అంతకుముందు విద్యార్థులను తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 3వ తేదీనే హోలీ పండుగ నారాయణపేట రూరల్: హోలీ పండుగను మంగళవారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్నా జగదీష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మురళి భట్టడ్, ప్రవీణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2న పౌర్ణమి ఉండటంతో కాముడి దహనం చేసి 3వ తేదీన రంగుల పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. అలాగే 19న ఉగాది, 27న శ్రీరామనవమి నిర్వహించుకోవాలని సూచించారు. శనగలు క్వింటా రూ.5,250 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం శనగలు క్వింటా గరిష్టంగా రూ.5,250, కనిష్టంగా రూ.5,212 ధర పలికింది. అలాగే ఆముదాలు రూ.5,605, పెసర రూ.7,787, వేరుశనగ గరిష్టంగా రూ.9,370, కనిష్టంగా రూ.5,252, ఆలసందలు రూ.7,919–రూ.6,440, కంది తెల్లవి రూ.7,589–రూ.7,419, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,919, కనిష్టంగా రూ.6,440 ధరలు లభించాయి. -
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నియంత్రణ
నారాయణపేట: మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీల నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కల్పించి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు చేపట్టకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా రైతు సాగు చేస్తున్నట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పారు. పోలీసు, ఎకై ్సజ్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని.. సమన్వయంతో మాదక ద్రవ్యాల నిషేధం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారి జయసుధ, ఎకై ్సజ్ సీఐ, ఎస్ఐ పాల్గొన్నారు. ‘స్వచ్ఛ’ పద్ధతులు పాటించాలి.. జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా శుభ్ర త, పారిశుద్ధ్య పద్ధతు లు పాటించాలని రెవె న్యూ అదనపు కలెక్టర్ శ్రీను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఆహార భ ద్రత జిల్లాస్థాయి సల హా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఆహార వ్యాపార యూనిట్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి నెల రిజిస్ట్రేషన్, లైసెనన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆహార భద్రత అధికారి మౌనిక తెలిపారు. ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేసి అనుమానిత నమూనాలను రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి నమూనాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు వివరించారు. వాటికి కూడా లైసెన్స్లు జారీ చేస్తామని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత సమావేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించినా ఎవరూ స్పందించ లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన పాఠశాలల హెచ్ఎంలు, వసతి గృహాల వార్డెన్లు, అంగన్వాడీ టీచర్లు విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో రెండోసారి జరిగిన సమావేశంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, డీడబ్ల్యూఓ కార్యాలయ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ జయరాజుతో కలిసి నూతన కన్వెన్షన్ హాల్, పాఠశాల వేదిక, టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. త్వరలో నిర్మంచబోయే 30 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణికి ఉత్కృష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. అలాగే ప్రతిభకనబర్చిన పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, పాణి, ఆర్ఐలు నర్సింహరాజు, ఆర్పీ సింగ్, ధర్మారావు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ సంజయ్కుమార్ జైన్ -
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
ఊట్కూర్/మాగనూర్: గ్రామాల్లో ప్రజలు, నాయకులు పార్టీలను కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాలని, తర్వాత ఎవరు గెలిచినా అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఊట్కూరు మండలం పులిమామిడిలో రూ.2.20 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్స్టేషన్, మాగనూరు మండలం వడ్వాట్లో సబ్స్టేషన్, గురువా లింగంపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో నియోజకవర్గంలో 1,035 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంతో రైతులకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పులిమామిడిలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి, ఎస్ఈ నవీన్కుమార్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కిశోర్కుమార్, నాయకులు లక్ష్మారెడ్డి, సూరయ్యగౌడ్, యజ్ఞేశ్వర్రెడ్డి, ప్రకాష్రెడ్డి, నాగార్జున్రెడ్డి, వడ్వాట్లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, గురువలింగంపల్లి సర్పంచ్ ఈడిగి లక్ష్మీదేవమ్మ, డీఈ నర్సింహరావు, సివిల్ ఈఈ ప్రవీణ్కుమార్, ఏఈ గంగాధర్రావు, నాయకులు ఆనంద్గౌడ్, శివరాంరెడ్డి, రాఘవరెడ్డి, నర్సింహులు, ముద్దు రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
అనూహ్య మలుపులు
లోతుగా విచారణ.. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబంపై దాడి జరగగా ఇది ఆధిపత్య వర్గం నుంచి పోరుగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ క్రమంలో నిందితులపై హత్యకేసు నమోదుచేయాలన్న డిమాండ్ వ్యక్తమైంది. అయితే పోలీసులు దాడి ఘటనలో పాల్గొన్నవారు ఎవరు.. ఏం జరిగిందన్న దాంతోపాటు బాధితులపైనా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరగా ఏం తేలుతుందోనని, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతుండగా.. ఇప్పటి వరకు ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో దాడి ఘటన అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల పోరాటం కొనసాగడంతోపాటు ఉన్నత స్థాయిలో ఎస్సీ, బీసీ కమిషన్లు సైతం విచారణలో భాగమయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్పందించి నాలుగు వారాల్లో ఘటనపై పూర్తి వివరాలను అందించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 18న జాతరలో దాడి ఘటన చోటుచేసుకోగా 21న పసిపాప మరణం నుంచి వరుసగా ఏడు రోజులపాటు నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పోలీసుల నిఘా వైఫల్యంతోపాటు బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన తర్వాత స్పందనపై విమర్శలు.. కుమ్మెర మల్లన్న జాతరలో ఏటా పదివేల మందికిపైగా భక్తులు పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రానికి 11 కి.మీ దూరంలో కుమ్మెర ఉండగా.. భారీ సంఖ్యలో పాల్గొనే జాతరలో పోలీసుల బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్టు ఎస్సీ, బీసీ కమిషన్ చైర్మన్లు స్పష్టం చేశారు. దాడి ఘటన చోటుచేసుకున్న నాటి నుంచి ఏం జరుగుతుందన్న దానిపై, అసలు నిజాలు తెలుసుకోవడంలో పోలీస్ నిఘా వ్యవస్థ సైతం వైఫల్యం చెందినట్లు విమర్శలు వస్తున్నాయి. దాడి ఘటన చోటుచేసుకున్న తర్వాత బాధితుల పట్ల పోలీసులు చూపిన వైఖరి వివాదాస్పదమైంది. బాధితులపైనే కేసుతో.. జాతరలో గణేశ్ను కొబ్బరికాయల గదిలో తలుపులు వేసి బంధించి 8 మంది వరకు దాడి చేసినట్లు బయటకు వచ్చిన వీడియోల్లోనే స్పష్టమైంది. దాడి ఘటన వెంటనే ముందుగా బాధితుడు గణేశ్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీస్స్టేషన్ దాకా వచ్చాక ముందుగా బాధితుడిపైనే కేసు నమోదు చేయడం వివాదానికి దారితీసింది. నిందితుల పట్ల పోలీసులు గౌరవ మర్యాదలతో ప్రవర్తించారని, తమను మాత్రం నిర్లక్ష్యం చేశారని బాధితులు పదేపదే ఆరోపించారు. గణేశ్పై దాడి జరిగింది స్పష్టమైనప్పటికీ, నిందితుడు శ్రీనివాస్రెడ్డికి గాయాలు అయ్యాయన్న కారణంతో బాధితులపైనే కేసు నమోదు చేయడం ఆగ్రహావేశాలకు దారితీసింది. దాడి ఘటన తర్వాత మూడు రోజులకు ఫిబ్రవరి 21న రెండు నెలల పాప మరణంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బాధితులు రోడ్డెక్కారు. ప్రజాసంఘాల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదుచేశారని, లేకపోతే మరింత నీరుగార్చేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహిరంగ చర్చకు సిద్ధం : ఎంపీ మల్లు రవి శుక్రవారం నిజనిర్ధారణ కోసమని కాంగ్రెస్ నేతల బృందం కుమ్మెర గ్రామంలో పర్యటించింది. ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం జిల్లాకేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కుమ్మెర ఘటన విషయంలో అవాస్తవాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయని, వాస్తవాలను గమనించాలని ఎంపీ మల్లు రవి అన్నారు. పసిపాప మృతిపై రాజకీయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ముఖ్యనేతలతోపాటు ఆందోళన నిర్వహించిన వారితో తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగినట్టు అనిపిస్తే తాను పార్టీని వదిలైనా వారితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. క్లిష్టతరంగా మారిన కుమ్మెర జాతరలో దాడి ఘటన అనేక మలుపులతో అంతుచిక్కని దాడి కేసు బాధితులపైనా లోతుగా సాగుతున్న విచారణ చివరికి ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానం పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యంపై విమర్శలు -
క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
● ఎస్పీ డా. వినీత్ నారాయణపేట: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించి శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని ఎస్పీ వినీత్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో హెడ్క్వార్టర్స్లోని ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది, హోంగార్డులతో ఆయన పోలీస్ దర్బార్ నిర్వహించారు. సర్వీస్కు సంబంధించిన సమస్యలు, హెడ్క్వార్టర్స్లో శుద్ధజల కేంద్రం ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్ బిల్లులు తదితర సమస్యలు తెలియజేశారు. స్వయంగా విన్న ఎస్పీ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, హోంగార్డుల పాత్ర అత్యంత కీలకమని.. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగలు, ఎన్నికల సమయంలో వీరి సేవలు అత్యంత ప్రధానమన్నారు. సిబ్బంది సంక్షేమమే ప్రధానమని.. విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వసతి, డ్యూటీ సమయాలు తదితర అంశాలను అధికారులకు నేరుగా తెలియజేయాలని సూచించారు. సమస్యలు పెండింగ్లో ఉండకుండా దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, కుటుంబాలను బాగా చూసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పోలీసుశాఖపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. హోంగార్డులు పోలీసు కుటుంబంలో భాగమేనని.. వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్లాల్, ఆర్ఎస్ఐలు శ్వేత, కృష్ణచైతన్య, శివన్న, ఏఆర్ ఎస్ఐలు పాల్గొన్నారు. -
63 మంది విద్యార్థులు గైర్హాజరు
నారాయణపేట రూరల్: జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో 3,823 మంది విద్యార్థులకుగాను 3,760 మంది హాజరుకాగా.. 63 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 3,283 మందికిగాను 3,234 మంది విద్యార్థులు హాజరుకాగా.. 49 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విద్యార్థులు 540 మంది విద్యార్థులకుగాను 526 మంది హాజరుకాగా.. 14 మంది రాయలేదు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పోలీసు అధికారులు పర్యవేక్షించారు. పరీక్ష ప్రారంభానికి ముందు విద్యార్థులను సిబ్బంది పూర్తిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
ఘటనపై ఆధారాలివ్వండి
● కుమ్మెర జాతరలో మౌనిక, పాపపై దాడికి సంబంధించి సాక్ష్యాలు లేవు ● దాడి ఘటనకు ముందే పాప ఆరోగ్యం క్షీణించడంతో నీలోఫర్లో చికిత్స ● మొదటి ఫిర్యాదులో గణేశ్, చంద్రకళపై దాడి మాత్రమే ప్రస్తావన ● చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసు నమోదు చేస్తాం ● విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నామని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యులందరినీ విచారిస్తున్నామని చెప్పారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని, అయితే కేసు పురోగతి కోసం బాధిత కుటుంబ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరలో గణేశ్, చంద్రకళపై దాడి చేసినట్లు మాత్రమే బాధితులు మొదట ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మొదట ఫిర్యాదులో మౌనిక, ఆమె బిడ్డపై దాడి ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. మౌనికతోపాటు బిడ్డపై దాడికి సంబంధించిన ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే తమకు సమర్పించి కేసు పురోగతికి సహకరించాలని కోరారు. కోర్టు అనుమతితో కేసు ‘ఈ నెల 18న కుమ్మెర జాతరలో తమపై దాడి జరిగిందని రాత్రి 8.30 గంటల సమయంలో శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తలపై రక్తస్రావం, గాయాలు ఉండటం, కాగ్నిజబుల్ ఆరోపణలు ఉండటంతో కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు గణేశ్ తమపై దాడి జరిగిందని 8 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గణేశ్తోపాటు చంద్రకళపై మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. మౌనిక, ఆమె పాప ప్రస్తావన ఫిర్యాదులో లేదు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేశాం. మెడికల్ రిపోర్టులో సాధారణ దెబ్బలు ఉన్నాయి. ఘటనరోజు ఇచ్చిన ఫిర్యాదులో కులం పేరుతో తిట్టారన్న ప్రస్తావన కూడా లేదు. ట్రీట్మెంట్ తీసుకోలేదు.. కుమ్మెర జాతరలో మౌనిక, ఆమె పాపపై దాడి జరిగిందన్న దానికి విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఏ చిన్న సాక్ష్యం దొరికినా హత్యకేసుగా మార్చి చర్యలు తీసుకుంటాం. ఈ నెల 18న ఘటన జరిగితే 21న పాప మరణించే వరకు ఎక్కడా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా లేదు. బాధితురాలికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పరిహారాన్ని త్వరగా అందించేందుకు అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఆధారాలు ఇవ్వమని అడిగినా కుటుంబం సహకరించలేదు. ఆధార్, రేషన్ లాంటి కనీస ఆధారం కూడా ఇవ్వలేదు. డిసెంబర్ 21న పాప తక్కువ బరువు 1.44 కేజీలుగా జన్మించింది. ఘటనకు ముందే పాప శ్వాస సంబంధ, న్యూమోనియా, జాండీస్ వంటి సమస్యలతో నీలోఫర్లో 30 రోజులపాటు చికిత్స పొందింది. పోస్టుమార్టం రిపోర్టులో అంతర్గత, బహిర్గత గాయాలు ఏమీ లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. హిస్టోపాథాలజీ, విస్త్రా రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అమరచింత: ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని నాగల్కడ్మూర్లో శ్రీనివాస్రెడ్డి, సంధ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి మంత్రి తన సతీమణి వాకిటి లలితతో కలిసి హాజరై శ్రీనివాస్రెడ్డి దంపతులకు కానుక అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొదటి విడతలో అర్హులై ఇంటి స్థలం కలిగిన వారికి మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, సర్పంచ్ శివకుమార్, అరుణ్కుమార్, జగన్రెడ్డి, ఆశిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదివి.. రాయగలరా?
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు అంచనా వేసినందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు సాధించేలా కృత్యాధార బోధన కొనసాగేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న బోధన, చిన్నారుల చదువు పరీక్షించేందుకు రెండోతరగతి విద్యార్థులపై సర్వే చేపడుతోంది. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడురోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుండగా శుక్రవారంతో ముగియనుంది. సర్వేలో గుర్తించిన అంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలను మరింత మెరుగ్గా అందించనున్నారు. సర్వే కొనసాగేది ఇలా.. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే సర్వే కొనసాగిస్తారు. ఇందుకుగాను జిల్లాకేంద్రం సమీపంలోని బీఈడీ కళాశాల ఛాత్రోపాధ్యాయుల ను ఎంపికచేసి వారికి శిక్షణ సైతం ఇచ్చారు. వారు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో సర్వే చే స్తారు. బొమ్మను చూపిస్తూ మాట్లాడించడం, తెలు గు, ఆంగ్లం అక్షరాలు, పదాలు, వాక్యాలను చదివిస్తారు. అదేవిధంగా అక్షరాలు, పదాలు రాయించడం గణితంలో కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం తదితర సామర్థ్యాలను పరిశీలిస్తారు. ప్రతి పాఠశాలలో 8మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించి వారు చెప్పిన సమాధానాలు మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఉపాధ్యాయులకు సైతం.. సర్వేకు వెళ్లిన పాఠశాలలో విద్యార్థులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులకు సైతం పరీక్ష నిర్వహిస్తారు. ఛాత్రోపాధ్యాయులు తీసుకెళ్లిన ప్రశ్నావళిని ఉపాధ్యాయులతో పూర్తి చేయించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరు సైతం నిర్ధారిస్తారు. పిల్లల ప్రతిభ ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. మూడురోజుల్లో పూర్తి.. విద్యార్థుల స్థాయిని నిర్ధారించేందుకు ఎన్సీఈఆర్టీ చేపడుతున్న సర్వే ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మూడురోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 25న తెలుగు, ఉర్దూ, 26న గణితం, 27న ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి సామర్థ్యాలను పరిశీలిస్తారు. వాటిని ట్యాంజెన్రియన్ యాప్లో పొందుపరుస్తారు. పరీక్ష నిర్వహణ తీరు, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై ఛాత్రోపాధ్యాయులకు డీఆర్పీలు రెండ్రోజుల పాటు శిక్షణనిచ్చారు. సర్వేలో పాల్గొన్న ఛాత్రోపాధ్యాయులకు రోజుకు రూ.500 చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. విద్యార్థితో చదివిస్తున్న ఛాత్రోపాధ్యాయురాలు జిల్లాలో విద్యార్థులసామర్థ్యాల పరిశీలన రెండోతరగతి చిన్నారులకు ఎఫ్ఎల్ఎన్ పరీక్ష నేటితో పూర్తికానున్న సర్వే క్షేత్ర పరిశీలకులుగా ఛాత్రోపాధ్యాయులు -
ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాలు
స్టేషన్ మహబూబ్నగర్: భద్రాచలంలో వచ్చే నెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ సహకారంతో టీజీఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తుల ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్, లాజిస్టిక్ ఏటీఎం బద్రి నారాయణ తెలిపారు. తలంబ్రాలు చేరవేసే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను గురువారం రీజినల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రూ.151 చెల్లించి సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం వచ్చే నెల 31 వరకు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్లు గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి డిపో 91542 98609, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో 91542 98611, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణపేట, కోస్గి డిపో 91542 98612, ఉమ్మడి జిల్లా 91542 98637 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మీధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫలితాల వెల్లడి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–5తోపాటు బ్యాక్లాక్ పరీక్షల ఫలితాలను సైతం అధికారులు వెల్లడించారు. మొత్తం 69.39 శా తం ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యమ్ నమోదు’పై అవగాహన
నారాయణపేట: జిల్లా పరిశ్రమల కేంద్రం ఈడీసీ బృందం ఆధ్వర్యంలో ఉద్యమ్ నమోదుపై జిల్లాకేంద్రంలో గురువారం పారిశ్రామితవేత్తలు, యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పరిశ్రమలశాఖ ఐపీఓ నర్సింగ్రావు హాజరై మాట్లాడారు. ఉద్యమ్ నమోదు అనేది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఆన్లైన్ నమోదు ప్రక్రియని.. చేకూరే ముఖ్య ప్రయోజనాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్య రుణాల కింద ఆర్థిక సాయం, చెల్లింపుల ఆలస్యంపై రక్షణ, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే అవకాశం, వివిధ ఎంఎస్ఎంఈ పథకాల ప్రయోజనాలు, ఉద్యమ్ నమోదు విధానం, అవసరమైన పత్రాలు, నమోదు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం భవిష్యత్లో పారిశ్రామిక వేత్తలకు అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్కుమార్, ఈడీసీ మేనేజర్ పి.నవీన్కుమార్రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నవీన్కుమార్, పీఎంఎఫ్ఎంఈ డీఆర్పీ యశ్వంత్, హ్యాండ్లూమ్స్శాఖ క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పాల్గొన్నారు. -
జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తుండగా.. బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీపై స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా వెళ్లారు. అదేవిధంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఫణిందర్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మార్చి 28నజాతీయ లోక్ అదాలత్ నారాయణపేట: రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వింధ్యానాయక్ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను మార్చి 28న నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని 14 పోలీస్స్టేషన్ల పరిధిలో 6,500 కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసు అధికారులతో ఆరా తీసి ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం పొందవచ్చన్నారు. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఎజెండాలోని క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, సైబర్ నేరాల కేసులపై చర్చించారు. అనంతరం ఉచిత న్యాయ సహాయ సేవలు టోల్ఫ్రీ నంబర్ 15100 చార్ట్ని ఆవిష్కరించి ప్రతి పోలీస్స్టేషన్లో నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, డీఎస్పీ లింగయ్య, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సజావుగా ‘పది’ పరీక్షల నిర్వహణ నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు సూచించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదోతరగతి పరీక్షల నిర్వహణపై గురువారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ను నియంత్రించాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని.. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు కేటాయించిన సామగ్రిని భద్రపర్చే విషయంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. పరీక్షల నిర్వహణపై సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని, ఇన్విజిలేటర్లకు సరైన దిశా నిర్దేశం చేయాలని కోరారు. ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాలని, సరైన సమయానికి విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్రకుమార్, పరీక్షల విభాగం అధికారి శశికుమార్, మండల విద్యాధికారులు, పరీక్ష నిర్వాహకులు పాల్గొన్నారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు గురువారం ఉదయం మంగళ వాయిద్యాలు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. యజ్ఞశాలలో హోమం, భేరీపూజ కొనసాగాయి. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల భక్తులు తరలిరాగా.. వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్యశర్మ, గోవిందాచార్యులు, సురేశాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సంగాయపల్లిలో పోలీసుల విచారణ
మహమ్మదాబాద్: కుమ్మెర ఘటనలో బిడ్డను కోల్పోయిన మౌనిక తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలం సంగాయపల్లిలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు మౌనిక తల్లి బాలికిష్టమ్మతో పలు వివరాలు సేకరించారు. బాధితురాలి అసలు పేరు యాదమ్మ అని.. తమది బీసీ సామాజిక వర్గం కాగా.. నాగర్కర్నూల్కు చెందిన గణేశ్ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు వివరించింది. అయితే బాధితురాలి పేరు, ఊరు, మండలం, జిల్లా, కులం తదితర వివరాల సేకరణ నిమిత్తం విచారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
మెళకువలు పాటిస్తే అధిక లాభాలు
మదనాపురం: మత్స్యకారులు చేపల పెంపకంలో శాసీ్త్రయ మెళకువలు పాటిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోగలరని ఖమ్మం జిల్లా పాలేరు ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎస్ ప్యాడ్ దిశ ప్రాజెక్టులో భాగంగా ‘మంచినీటి చేపలు.. వ్యాధులు నివారణ’ అనే అంశంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. పాలేరు ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ శాసీ్త్రయ సిబ్బంది రవీందర్, డా. అరుణ్, నాగరాజు, దివ్య హాజరై మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా చెరువుల్లో నీటి నాణ్యత, బయో సెక్యూరిటీ (జీవ భద్రత) చర్యలు, చేపలకు సోకే వివిధ రకాల వ్యాధుల గురించి వివరించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలు రైతుల ఉత్పాదకతను పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ లాభదాయకమైన ఆక్వా కల్చర్ వైపు అడుగులు వేయాలని సూచించారు. -
దుర్మార్గులకు శిక్ష పడాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోండి ● కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఘటనలో దాడికి పాల్పడిన నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని, అందరికీ శిక్షపడేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి కమిషన్ తరపున రూ.లక్ష చెక్కును అందజేశారు. కుమ్మెరలో కుటుంబం జీవించలేని పరిస్థితులు ఉన్నాయని వారికి రక్షణ కల్పించాలని సూచించారు. జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్రూం ఇల్లు ఏర్పాటు, గణేశ్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. పసిపాప అని చూడకుండాకాలితో తన్నాడు.. కుమ్మెర మల్లన్న జాతరలో తాను ఎంత ప్రాధేయపడినా వినకుండా దాడికి పాల్పడ్డారని బాధితురాలు మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలు మౌనిక మీడియా ఎదుట ఘటన తీరును వివరించారు. ‘మల్లన్న జాతరలో దేవుని దర్శనం కోసం వెళ్లిన మమ్మల్ని శ్రీనివాస్రెడ్డి అనుమతించలేదు. తక్కువ జాతివాళ్లు అంటూ తిట్టారు. ఎందుకు తిట్టావని అడిగేందుకు నా భర్త వెళ్తే కొబ్బరికాయల గదిలో అందరూ దాడి చేసి కొట్టారు. మా అత్తమ్మను జుట్టు పట్టుకుని కొట్టారు. పసిపాప ఉందని చెప్పి ప్రాధేయపడినా వినకుండా మధుసూదన్రెడ్డి పాపని కాలితో తన్నాడు. కిందపడ్డ పాపను మా ఆడబిడ్డ తీసుకుని భుజాన ఎత్తుకుంది. రెండు రోజులపాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదు. వాళ్లకు శిక్షపడితేనే నాకు న్యాయం జరిగిందని భావిస్తాను’ అని మౌనిక వివరించారు. -
కోఆప్షన్ ఎవరికో..?
నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో కో–ఆప్షన్ పదవులపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పుర ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని, ఎన్నికల సమయంలో కష్టపడిన సీనియర్ నేతలు, ముస్లిం మైనార్టీలకు కో–ఆప్షన్ పదవులు ఇస్తామని అధికార, విపక్ష పార్టీలు సైతం బుజ్జగింపులు చేశాయి. మూడు పురపాలికల్లో అధికార పార్టీ వారే పాగా వేయగా.. జిల్లాకేంద్రంలో మాత్రం బీజేపీ పీఠం దక్కించుకుంది. ● ప్రధానంగా పుర పరిధిలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సమాజంలో తగిన ప్రాతినిథ్యంలేని మైనార్టీలకు పురపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ఈ పదవులను కట్టబెడతారు. కో–ఆప్షన్ సభ్యులు కౌన్సిలర్లతో కలిసి పుర సమావేశాల కు హాజరవుతారు. వీరి ఎంపికకు పాలకవర్గం కొ లువుదీరిన 45రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ పదవులు ఆశించిన పలువురు ఆశావహులు ప్రజాప్రతినిధులు, చైర్మన్ల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా జనరల్ కోటాకు చెందిన కో–ఆప్షన్ పదవులకు మాత్రమే గట్టి పోటీ ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పుర చట్టం 2019 ప్రకారం.. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కో–ఆప్షన్ సభ్యులను నియమిస్తారు. వీరు కౌన్సిలర్లకు సమాన హోదా కలిగి ఉంటారు. గౌరవ వేతనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో మాత్రం వీరికి ఓటుహక్కు ఉండదు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు 45 రోజుల్లోపు పుర కమిషనర్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మైనార్టీ కోటాలో పోటీపడేవారు తమ కుల ధ్రువీకరణ పత్రం జతచేస్తే పుర కమిషనర్ పరిశీలిస్తారు. ఎక్కువ మంది పోటీలో ఉంటే కౌన్సిలర్లతో చేతులు ఎత్తడంతో పాటు రహస్య ఓటింగ్ నిర్వహించాలనే నిబంధన ఉంది. పాలకవర్గం ఉన్నంత వరకు వీరు పదవుల్లో కొనసాగుతారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. నలుగురికి అవకాశం.. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో నలుగురిని కో–ఆప్షన్ సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు (ఒక పురుషుడు, ఒక మహిళ), క్రిస్టియన్ మైనార్టీ, జనరల్, అనుభవం ఉన్న మాజీ కౌన్సిలర్లు కేటగిరీల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో ఒక్కో కేటగిరి నుంచి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పురపాలికల వారీగా ఇలా.. సీఎం ఇలాఖాలోని కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోస్గిలో ఆశావహులు తమ పేర్లు బయటకు వస్తే మరొకరు పోటీపడతారనే ప్రచారంతో బయటకు తెలియకుండా తెర వెనుక పావులు కదుపుతున్నారు. మద్దూరు మున్సిపాలిటీలో జనరల్ కేటగిరిలో కుడుగుంట నర్సింహులు, గణప రవి, రాజ్కుమార్, గణప శ్రీనివాస్, కుక్కల బాలరాజు, జంగం బాబు, కూనె సంజీవ్కుమార్, బజారి మల్లికార్జున్, చందు, జీడీ రామకృష్ణ, గుత్తి పురుషోత్తం, ముస్లిం మైనార్టీ కేటగిరిలో రహీం, గాజుల ఉస్మాన్, డా. తాజుద్దీన్ రెనివట్ల, రియాజ్, యాసిన్, పింజరి హుస్సేన్, అహ్మద్, గులాం రసూల్, బల్లి సలాం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఒకరు మహిళకు అవకాశం ఉండటంతో వారి సతీమణులకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలోని మక్తల్ మున్సిపాలిటీలో అస్మద్దీన్, శంషోద్దీన్, అబ్దుల్ రహమాన్, నాగరాజు, శివశంకర్, మీనన్, సలాంతో పాటు పలువురు తెర వెనుక పావులు కదుపుతున్నారు. మంత్రి ‘ఆప్షన్’ ఎవరికి ఇస్తారోనన్న చర్చ కొనసాగుతోంది. నారాయణపేట మున్సిపాలిటీ బీజేపీకై వసం చేసుకోవడంతో ఆ పార్టీలోని ఆశావహులు పోటాపోటీగా తమకే అవకాశం ఇవ్వాలంటూ బడా నాయకులతో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తాము గెలిచే అవకాశం ఉన్నా.. పార్టీ అధిష్టానం చెప్పినందుకు సీట్లు వదులుకున్నామని.. తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మాజీ కౌన్సిలర్ అనసూయ భర్త 1వ వార్డుకు చెందిన బీజేపీ యువ నాయకుడు చిన్న రఘు, 4వ వార్డులో మాజీ కౌన్సిలర్ జయశ్రీ భర్త విజయ్ నవుతే పాటు ముస్లిం మైనార్టీలు పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం కౌన్సిలర్తో సమాన హోదా ఆశావహుల్లో ఉత్కంఠ కొలువుదీరిన పాలకవర్గాలు 45 రోజుల్లోపు నోటిఫికేషన్.. ఎన్నిక -
పోరాటం ఆపొద్దు..!
బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో ఓ కుటుంబం పట్ల పైశాచికంగా ప్రవర్తించిన మానవ మృగాలను శిక్షించే వరకు పోరాటం ఆపొద్దని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విశారదన్ మహరాజ్ పోరాటాన్ని అభినందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులందరికీ శిక్ష పడే దాకా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం.. ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. మహేంద్రనాథ్తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నలాంటి ప్రజాకవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వది లి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు. పోలీసులను డిస్మిస్ చేయాలి కుమ్మెర దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బాధ్యులైన వారిని స స్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశా రు. బీఆర్ఎస్ హయాంలో పోలీసింగ్కు అంతర్జాతీయంగా పేరుతీసుకొస్తే.. కాంగ్రెస్ హయాంలో వ్య వస్థను నీరుగార్చారని మండిపడ్డారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ఆధిపత్యం, అహంకారంతోనే.. అగ్రకులాల ఆధిపత్యం, అహకారంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కుమ్మెరలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఇలాంటి ఘటనల నుంచే తాను పాటలు పాడానని గుర్తుచేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. బాధితులపైనే కేసు పెడతారా..? కుమ్మెర ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టేందుకు కోర్టు అనుమతి కావాలని చెప్పడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో పదేపదే ఎమ్మెల్సీ నుంచి డీఎస్పీకి ఫోన్లు వచ్చాయని ఆరోపించారు. ఎంపీ మల్లు రవి ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పకుండా.. చూసి చేయండి అని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐదోరోజు కొనసాగిన నిరసనలు కుమ్మెరలో దాడి ఘటనపై జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో బుధవారం ఐదోరోజు ఆందోళనలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతోపాటు రాష్ట్ర రజక సంఘం నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో శ్రేణులు నిరసన శిబిరం వద్దకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ట్రాఫిక్ స్తంభించింది. కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మ చ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాల కు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు. మానవత్వానికి మాయని మచ్చగా దాడి ఘటన రెండు నెలల పసిపాపపై ఇంత క్రూరత్వమా? ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు ‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ -
ప్రజలు మెచ్చే పాలన అందించాలి
● సర్పంచుల శిక్షణా శిబిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపించారని.. వారు మెచ్చే విధంగా ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణకేంద్రంలో కొనసాగుతున్న మూడోవిడత సర్పంచుల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆమె ఎస్పీ డా. వినీత్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్ అనేది కేవలం పదవి మాత్రమే కాదని, బాధ్యత, కర్తవ్యమని తెలిపారు. గ్రామాల్లో స్వచ్ఛత, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు తదితర మౌలిక వసతులు కల్పించి ఆదర్శంగా నిలవాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. శిక్షణ తరగతులకు చాలామంది సర్పంచులు గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు శిక్షణకు హాజరుకాకపోతే ఎలాగని.. జాతరలు, పండగలు అంటూ గైర్హాజరు కావడం సబబు కాదన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని చాలాగ్రామాల్లో నేటికీ ప్రజలు బహిర్భూమికి వెళ్తున్నట్లు మంత్రి చాలా సందర్భాల్లో చెప్పారని.. మరుగుదొడ్లు వినియోగించుకునేలా సర్పంచులు చైతన్యం తీసుకురావాలని సూచించారు. అవసరమైతే సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలకు సహకారం అందించాలని కోరారు. ఇళ్లులేని పేదలను గుర్తించి ఎంపీడీఓల వద్ద పేర్లు రాయిస్తే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసానిచ్చారు. పాలనను పరిశీలించేందుకు త్వరలోనే గ్రామాలను సందర్శిస్తానని ప్రకటించారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలి.. దేశ జనాభాలో 2.60 లక్షల మంది సర్పంచులు ఉన్నారని.. తమ గ్రామాలకు పెద్ద దిక్కులా ఉండి గ్రామాభివృద్ధికి పాటు పడాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలంటే నిధులు తప్పనిసరి అని.. ఎలాంటి నిధులు, ఖర్చు లేకుండా బాల్య వివాహాలు, కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని, ఘర్షణలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రతను బాధ్యతగా తీసుకోవాలని.. ఇకపై గ్రామపంచాయతీ కార్యాలయాల్లో చైల్డ్ హెల్ప్లైన్, గ్రామ పోలీసు అధికారి, షీటీమ్ నంబర్లను రాసి ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలు, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ
చేనేత ఉత్పత్తులకు గుర్తింపు నారాయణపేట: జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ ఆధ్వర్యంలో జౌళి మంత్రిత్వశాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయ సహకారంతో ‘భౌగోళిక సూచిక వినియోగం–అధికరణ(జీఐ)’పై బుధవారం జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ గార్డెనన్స్లో చేనేత కార్మికులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. సంబంధితశాఖ సీఈఓ తేజస్ చేనేత కార్మికులు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ పొందడం ప్రాముఖ్యతను వివరించారు. సర్టిఫికేషన్ కలిగి ఉంటే ఇక్కడి చేనేత చీరలు, సంప్రదాయ హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు, మార్కెటింగ్, లాభాలు పొందవచ్చని చెప్పారు. జీఐతో బ్రాండ్ విలువ పెరగడమేగాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి తోడ్పడుతుందన్నారు. జీఐ సర్టిఫికేషన్తో కళాకారులను శక్తివంతం చేయడంతో పాటు సంప్రదాయాలతో కూడిన విలువలు, చేనేత పద్ధతులను పరిరక్షించడం, అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుందని వివరించారు. శిక్షణలో రీజినల్ ఇన్చార్జ్ బీఎస్ గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్ బాబు, సాంకేతిక సిబ్బంది బాలాజీ, స్థానిక చేనేత కార్మికులు, కళాకారులు, హ్యాండ్లూమ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడా పాఠశాలల్లోప్రవేశాలకు దరఖాస్తులు నారాయణపేట: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని.. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి బుధవారం తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు వరకు tggss.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో వచ్చే నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఎంపికలు చేపడతామన్నారు. ఆధార్కార్డు, విద్యనభ్యసిస్తున్నట్లు ప్రస్తుత పాఠశాల నుంచి ధ్రువపత్రం, జన్మ, కుల ధ్రువీకరణపత్రం, మూడోతరగతి ప్రగతి పత్రం, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. – వివరాలు 8లో.. -
‘పీఎంశ్రీ’తో పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన
● నీతి ఆయోగ్ అడిషనల్ డైరెక్టర్గౌరవ్ కటియార్ నర్వ: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎంశ్రీ నిధులతో పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని నీతి ఆయోగ్ అడిషన్ల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ అన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్గా ఎంపికై న నర్వ మండలంలో మంగళవారం ఆయన పర్యటించి ఏడాదిగా చేపట్టిన పనులను స్వయంగా పరిశీలించారు. పెద్దకడ్మూర్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులు, ఏఎక్స్ఎల్ బోధన, సైన్స్ల్యాబ్, అధునాతన సైన్స్ పరికరాలు, డిజిటల్ క్లాస్రూంను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల వేసిన యోగాసనాలు చూసి అభినందించారు. పాఠశాల ఆవరణలో నాటిన ఔషద మొక్కలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకొని ఒక మొక్క నాటారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మహిళా సమాఖ్య భవనంలో స్కూల్ యూనిఫామ్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి సభ్యులతో మాట్లాడి వస్తున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రాయికోడ్ మోడల్ అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అలాగే గర్భిణులకు సీమంతాలు చేసి వస్త్రాలు అందించారు. వారికి అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. అనంతరం పాతర్చేడ్లో కొనసాగుతున్న పశు వైద్య శిభిరంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఆయన వెంట శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్, డీఆర్డీఓ మొగులయ్య, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి, యాస్పిరేషన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ బాలాజీ, సీడీపీఓ సరోజిని, పెద్దకడ్మూర్ సర్పంచ్ నాయిని గోవింద్, జీహెచ్ఎం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పది, ఇంటర్ పరీక్షలు
నారాయణపేట: జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరా లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు విద్య, వైద్య, పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టాలన్నారు. మాస్ కాపీయింగ్, చీటింగ్, మాల్ప్రాక్టీస్, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇంటర్ పరీక్షల కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 8,192 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. అలాగే పదోతరగతి పరీక్షలకు 8,318 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. 43 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో వైద్యసిబ్బంది ద్వారా హెల్త్డెస్క్లు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని స్పష్టం చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సిట్టింగ్ స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి చీటింగ్ జరగకుండా చూడాలని సూచించారు. అన్ని కేంద్రాల ఆవరణలో బీఎన్ఎస్ 163, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ పహారాలో కేంద్రాలకు తరలించి, పోలీస్శాఖ ఆధ్వర్యంలోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపర్చాలని సూచించారు. ప్రశ్నాపత్రాల కవర్లను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు మాత్రమే సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాలని.. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని.. ప్రతి కేంద్రంలో విద్యార్థులు తెచ్చిన పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులు భద్రపర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. హాల్టికెట్లను వెబ్సైట్, వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్పీ డా. వినీత్ ఆర్డీఓ రాంచందర్ పాల్గొన్నారు. -
పసిబిడ్డ చనిపోయినా పట్టించుకోరా?
● బాధితులపైనే కేసులు పెడతారా.. ● కుమ్మెర ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కందనూలు: కుమ్మెర జాతరలో నిరుపేద కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిబిడ్డను కోల్పోయిన ఘటన దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డగా చెబుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈ ప్రాంతంలోనే ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతిలో నియోజకవర్గ అధికారులంతా కీలుబొమ్మలుగా మారారని.. ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపాలన విషయంలో పట్టు కోల్పోయారని ఆయన ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేస్తే.. దాడికి పాల్పడిన నిందితుల నుంచి ఫిర్యాదు తీసుకుని బాధితులపైనే కేసులు పెట్టే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలే కొనసాగుతున్నాయని.. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని చెలాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ ఓబీసీ, ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, కట్టా సుధాకర్రెడ్డి తదితరులున్నారు. -
ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, కంటిచూపు సక్రమంగా ఉండటం అత్యవసరమని ఎస్పీ డా. వినీత్ అన్నా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా.. ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. కంటిచూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడమే కాకుండా తగిన చికిత్సలు కూడా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తామని వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులు తప్పనిసరిగా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, కారులో సీట్బెల్ట్, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలని, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలన్నారు. మొత్తం 70 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, కంటి వైద్య నిపుణులు డా. సునీల్, డా. మల్లిక, డా. సాయిఆదిత్య, డా. కనిగిరి శేఖర్, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య, ఆర్ఎస్ఐలు శ్వేత, శిరీష, పోలీస్ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద అప్రమత్తంగా ఉండాలి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ డా. వినీత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రం 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచరాదని, 163 బీఎన్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని పేర్కొన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని ప్రతి కేంద్రాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది, ఎగ్జామ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని, ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్ నుంచి కేంద్రాలకు.. పరీక్ష అనంతరం పోస్టాఫీస్కు తరలించేందుకు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని పేర్కొన్నారు. -
పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
నారాయణపేట రూరల్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా.. నిర్వహణకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా సమయసారిణి ప్రకారం కొనసాగేలా డీఐఈఓ కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 9 స్టాక్ పాయింట్లు.. జిల్లాలో 45 జూనియర్ కళాశాలలు ఉండగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నారాయణపేటలో 4, మక్తల్లో 3, కోస్గి, ధన్వాడలో 2, మద్దూర్, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్, మరికల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను 9 స్టాక్ పాయింట్లలో భద్రపర్చారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగనుండగా.. నిర్వహణకు రెండు రకాల కమిటీలు పని చేయనున్నాయి. హై పవర్ కమిటీలో చైర్మన్లుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినిత్, కన్వీనర్గా డీఐఈఓ సుదర్శన్రావు ఉండగా.. డీఈసీ కమిటీలో ఇంటర్ నోడల్ అధికారితో పాటు సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకుడు పి.నర్సింహారెడ్డి ఉన్నారు. స్ట్రాంగ్ రూం ఇన్చార్జ్గా ఆర్.రవీందర్తో పాటు నారాయణపేట, మక్తల్లో కస్టోడియన్లుగా విజయలక్ష్మి, దత్తాత్రిరావు వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కేటాయింపు.. పరీక్షల నిర్వహణకు 15 మంది సీఎస్లు, నలుగురు అడిషనల్ సీఎస్లు, 15 మంది డీఓలు, ఇద్దరు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్, మరో సిట్టింగ్ స్కాడ్ బృందం ఏర్పాటు చేశారు. 11 చోట్ల ప్రభుత్వ కళాశాలలు, 4 చోట్ల ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉండటంతో అడిషనల్ సీఎస్ల నియామకం చేశారు. ఇక 230 మంది ఇన్విజిలేటర్లుగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కళాశాల సిబ్బందిని తీసుకోగా.. తక్కువగా ఉన్నచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. 9.05 వరకు అనుమతి.. గతంలో అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయం ఉదయం 9 గంటలకు కాగా.. ఐదు నిమిషాల గ్రేస్ టైం కలుపుకొని 9.05 వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. ఇంటర్నెట్లో నేరుగా డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు వెళ్లే అవకాశం ఉంది. నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ జిల్లాలో 15 కేంద్రాలు.. 8,192 మంది విద్యార్థులు హాల్టికెట్పై ప్రిన్సిపాల్ సంతకంతప్పనిసరి కాదు ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిమిషాల వరకు అనుమతి -
నిర్లక్ష్యమే ‘పాప’మైంది
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతర నిర్వహణ మొదలు, దాడి ఘటన, తర్వాత కేసుల దర్యాప్తులోనూ అధికారుల నిర్లక్ష్యం కనిపించిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని నాగర్కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో ఆలయం వద్ద సంఘటన చోటుచేసుకున్న ప్రదేశాన్ని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్, మౌనికను పరామర్శించారు. వారి నుంచి ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర బీసీ కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, సమగ్ర విచారణ చేపడుతున్నట్టు వివరించారు. కుమ్మెర గ్రామంలో ఆలయ పరిసరాలు, సంఘటనా స్థలం, బాధిత కుటుంబం ఇంటిని పరిశీలించిన తర్వాత పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, భద్రతాలోపాలు తేటతెల్లమయ్యాయని వెల్లడించారు. నిరసనలు ఉధృతం.. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది. ప్రభుత్వం దిగిరావాలి.. కుమ్మెర ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెండు నెలల పసిపాప ఉందని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు కొనసాగుతున్నాయని, వీటిని ప్రభుత్వం అరికట్టాలన్నారు. తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తరహాలో రాష్ట్రంలోనూ ఒక వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారి అరాచకాలు పెరిగాయని చెప్పారు. వారిపై ఇలాంటి దాడులుంటాయా? పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైనే దాడులు కొనసాగుతున్నాయని, ఉన్నత వర్గాలపై ఇలాంటి దాడులు ఎక్కడైనా ఉంటాయా అని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ప్రశ్నించారు. ఉన్నత వర్గాల, పెత్తందారుల చేతుల్లో దాడికి గురైతే పోలీసులు మాత్రం బాధితులపైనే మొదట కేసులు పెట్టారన్నారు. ప్రజాసంఘాల ఒత్తిడితో మాత్రమే తర్వాత నిందితులపై కేసు పెట్టారని తెలిపారు. ఫిర్యాదు చేసిన నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని, అందరినీ రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగాలి కుమ్మెరలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఎంపీ మల్లు రవి చెప్పారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. నేడు కేటీఆర్ రాక.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 వేలకు మించి భక్తులు.. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి బృందం కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. 10 వేలకు మించి భక్తులు పాల్గొనే జాతర నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. ఆలయంలో టికెట్, నిర్వహణ విషయంలో ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా.. పూర్తిగా సర్పంచ్, గ్రామ పెద్దల పెత్తనమే కొనసాగిందన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కనీస స్థాయిలో ఏర్పాట్లు లేవన్నారు. రెవెన్యూ శాఖ అధికారుల నుంచి పర్యవేక్షణ, ఏర్పాట్లు లేవని చెప్పారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొనే జాతరలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కలెక్టర్ సంతో ష్, ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఆర్డీఓ సురేశ్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర వివరాలను నివేదిక అందించాలని ఆదేశించారు. కుమ్మెర ఘటనకు అధికారుల వైఫల్యమే కారణం రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణ కరువు చిన్నారి మృతిపై విచారణ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లాకేంద్రంలో నాలుగోరోజు కొనసాగిన నిరసనలు -
‘108’ అంబులెన్స్ వాహనాల తనిఖీ
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, కృష్ణా తదితర మండల కేంద్రాల్లోని 108 వాహనాలను మంగళవారం ప్రోగ్రామ్ మేనేజర్లు, జిల్లా కో–ఆర్డినేటర్లు, సంస్థ ఆడిట్ అధికారి కిషోర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాల లభ్యత, వాహన నిర్వహణ, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించి బాధితుల ప్రాణాలు రక్షించడానికి సిద్ధంగా ఉండాలనిసిసూచించారు. జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దాం నారాయణపేట: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆపరేషన్ మెర్సీ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ హజమ్మ కోరారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి ఎల్లమ్మ జాతరలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్య సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మూఢ నమ్మకాలు, జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించి చదివించాలని, దేవత పేరుతో జోగిని, బసివిని, దేవదాసీలుగా మార్చడం చట్టరీత్యా నేరమని.. 1986 జోగిని చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలని, మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కో–ఆర్డినేటర్ ఆశమ్మ, నారాయణ, ఆరోగ్య కార్యకర్తలు, జోగిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.9,539 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.9,539, కనిష్టంగా రూ.4,240 ధర పలికింది. అదేవిధంగా ఆలసందలు రూ.6,170, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,809, కనిష్టంగా రూ.6,536, శనగ రూ.5,270, ధరలు లభించాయి. -
సర్వేతో విద్యా ప్రమాణాలు మెరుగు
నారాయణపేట: సర్వే అనేది కేవలం ప్రక్రియ కాదని.. ఇది విద్యావ్యవస్థకు అద్దం పట్టే సాధనమని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లాలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సర్వేకు సంబంధించి ఛాత్రోపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కేజీబీవీలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రాథమిక విద్యా ప్రమాణాలను సమగ్రంగా అంచనా వేసి.. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం లక్ష్యంగా సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ నిష్పక్షపాతంగా, ఎలాంటి లోపాలు లేకుండా సర్వే నిర్వహిస్తేనే నిజమైన ఫలితాలు వెలుగులోకి వస్తాయన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల ప్రభావం ఈ సర్వే ఫలితాల్లో ప్రతిబింబిస్తుందన్నారు. అందుకే ఇది అత్యంత బాధ్యతతో చేయాల్సిన కార్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని నిజాయితీగా నమోదు చేయడంతో సరైన ప్రణాళికలు రూపొందించగలమని.. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కృషి భవిష్యత్ తరాల అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అనంతరం సర్వే నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల వినియోగం, డేటా నమోదు విధానం, సమయపాలన, విద్యార్థులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై విపులంగా మార్గదర్శనం చేశారు. నిర్ణీత తేదీల్లో కేటాయించిన పాఠశాలలను సందర్శించి సర్వేను సమర్థవంతంగా పూర్తిచేయాలని డీఈఓ సూచించారు. జిల్లాలో ఎంపికచేసిన 68 పాఠశాలల్లో సర్వే నిర్వహించనున్నట్లు శిక్షణ కోర్సు డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ నెల 25న తెలుగు, 26న గణితం, 27న ఆంగ్లంపై సర్వే ఉంటుందని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయమైన చర్య
నారాయణపేట: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని.. పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ ఉగ్రరూపం చవిచూడాల్సి వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని సవాల్ చేస్తే.. ఆ పార్టీ నాయకులు ముందుకురాకుండా ఆయన ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక ఎమ్మెల్యేకు భద్రత లేదని.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేత, వైస్చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు అపిరెడ్డిపల్లి రాము, రాఘవేంద్ర, ప్రభాకర్, లక్ష్మప్ప, సౌజన్య, మాణిక్యమ్మ, నాయకులు సత్యయాదవ్, జీఆర్ రెడ్డి, వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య, బాల్రెడ్డి, జి.రాఘవేందర్రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, వడ్డె దత్తు, సాయిబన్న, శ్రీను, చలపతి పాల్గొన్నారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
నారాయణపేట: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం వందశాతం లక్ష్యాలు సాధించాలని నీతి అయోగ్ డిప్యూటీ సెక్రెటరీ, ప్రోగ్రాం మిషన్ అడిషనల్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ అన్నారు. నర్వ మండల ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం పురోగతిపై సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన ఆయన అధికారులతో సమీక్షించారు. అంతకు ముందు కలెక్టర్ డిప్యూటీ సెక్రెటరీకి స్వాగతం పలికారు. అనంతరం వీసీ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నర్వ మండల ఆస్పిరేషనల్ బ్లాక్పై వివరణాత్మకంగా విభాగాల వారీగా పురోగతి నివేదికను సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఏబీపీని అమలు చేయడంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ గౌరవ్ కటియార్ జిల్లా అధికారులతో మాట్లాడారు. నీతి ఆయోగ్, సీఎస్ఆర్ వనరుల నుంచి అదనపు నిధులను పొందడానికి ఇన్నోవేషన్ కేటగిరీ కింద మరిన్ని ప్రతిపాదనలను సమర్పించాలని ఆయన కలెక్టర్ను కోరగా.. జిల్లా నుంచి కొత్త మండలాలను ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద చేర్చాలని సూచించారు. ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలను మంజూరు చేస్తామని.. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేస్తామని డిప్యూటీ డైరెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్, నీతి అయోగ్ రాష్ట్ర కార్యదర్శి లోకేష్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, డీపీఓ సుధాకర్రెడ్డి, పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ, ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సీడీపీఓ సరోజ, ఎంఈఓ రాంరెడ్డి ఉన్నారు. నీతి అయోగ్ డిప్యూటీ సెక్రెటరీ గౌరవ్ కటియార్ -
రగులుతున్న కుమ్మెర
దాడి ఘటనపై ముమ్మరమైన విపక్షాల నిరసనలు ● మూడోరోజున కొనసాగిన ఆందోళనలు, ధర్నాలు ● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ● ప్రభుత్వం తరపున స్పందించిన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ● నేడు జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు రాక నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు రానున్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, బీజేపీతోపాటు ప్రజాసంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పందించి హామీ ఇచ్చినా నిరసనల పర్వం ఆగడం లేదు. బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో నిర్వాహకుల దాడి ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి నిరసనల పర్వం కొనసాగుతోంది. జిల్లాకేంద్రంలో సోమవారం వరుసగా మూడోరోజు బాధిత కుటుంబానికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీఎస్పీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టగా.. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు జిల్లా కేంద్రానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇ ప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమా ండ్కు తరలించారు. మిగతా వారిని సైతం అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల తరపున నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు.. కుమ్మెర ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో రూ.100 టికెట్ కోసం మొదలైన గొడవతో గ్రామానికే చెందిన నిరుపేద కుటుంబంపై పైశాచికం ప్రదర్శిస్తూ నిర్వాహకులు దాడికి దిగడం.. ఈ క్రమంలో రెండు నెలల శిశువు కిందపడి మరణించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నేతలు స్పందించి బాధితుల తరపున ధర్నాలు, నిరసనల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, డీఎస్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఎమ్మార్పీఎస్ నేతలు ఈ నిరసనల్లో భాగమయ్యారు. నిందితులు ఎవరైనా ఉపేక్షించం కుమ్మెర ఘటనలో నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులుకు సూచించారు. నిందితులపై చర్యలేవి..: నిరుపేద కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించిన జాతర నిర్వాహకులు, గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్న పెద్దలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. గ్రామ సర్పంచ్ను వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపాలని, నిందితులందరిని రిమాండ్ చేయాలని నినదించారు. -
ఆదాయానికి గండి!
● జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం ఉలుకూ పలుకూ లేదు.. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి దుకాణాలు కేటాయించలేకపోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఉలుకూ.. పలుకూ లేదు. దుకాణాలు కేటాయిస్తే చిరువ్యాపారులకు ఎంతో లాభాదాయకం. జీవనోపాధి పొందుతారు. వెంటనే అధికార యంత్రంగం స్పందించి దుకాణాల కేటాయింపు పూర్తిచేయాలి. – శివవీర్రెడ్డి, బీకేఎస్ రాష్ట్ర నేత, నారాయణపేట త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. వాణిజ్య సముదాయం టెండర్లు పిలవాలా? లేక రైతుబజార్లో ఇచ్చిన 16 దుకాణాల మాదిరిగా ఇవ్వడమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లి చిరువ్యాపారులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. వెంటనే దుకాణాలు తెరిచేందుకు కృషిచేస్తాం. – ఆర్.శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, నారాయణపేట నిబంధనల మేరకే.. మార్కెటింగ్ నిబంధనల ప్రకారమే దుకాణాల టెండర్ల ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మార్కెట్ పాలకవర్గం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే రిజర్వేషన్ల ప్రతిపాదికన దుకాణాల కేటాయింపు పూర్తిచేస్తాం. – బాలమణి, ఇన్చార్జి డీఎంఓ నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట చేనేత, బంగారం వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది. వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జిల్లాకేంద్రం నడిబొడ్డున ఆర్టీసీ పాతబస్టాండ్ వద్ద మార్కెట్యార్డును అనుసరించి రూ. 1.56 కోట్లతో 28 వాణిజ్య దుకాణాల సముదాయం, రైతుబజార్ కాంప్లెక్స్లో రూ.38 లక్షలతో 16 దుకాణాలు నిర్మించారు. వీటిని 2018 ఫిబ్రవరి 17న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. నాటి నుంచి వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాలు వినియోగానికి నోచుకోక దిష్టిబొమ్మల్లా మారాయి. దుకాణాల కేటాయింపుపై కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించకపోవడంతోనే నిరుపయోగంగా మారాయని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య దుకాణాలకు రాజకీయ గ్రహణం పట్టిందని వాపోతున్నారు. 8ఏళ్ల క్రితం రూ. 1.56 కోట్లతో 28 దుకాణాల నిర్మాణం రిజర్వేషన్ల ఖరారుప్రతిపాదనలకే పరిమితం మార్కెట్యార్డుకు రూ. 1.50కోట్లకు పైగా నష్టం చిరువ్యాపారుల కోసం.. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. అప్పటికే అక్కడ అద్దెకు వేసుకున్న షెడ్ల తొలగింపుతో చిరువ్యాపారులు ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో 2023లో అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో రైతుబజార్లోని 16 దుకాణాలను పలువురికి కేటాయించారు. దుకాణాలు దక్కిన వారంతా అప్పట్లో ఎస్ఆర్ రెడ్డి కృషిని కొనియాడారు. -
‘సామాజిక తెలంగాణ కోసం పోరాటం’
గద్వాల: పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం దక్కలేదని, సామాజిక న్యాయం కోసం తాము మరోపోరాటం చేస్తామని, అది నడిగడ్డ నుంచే మొదలుపెడతామని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె గద్వాల జిల్లా కేంద్రంలో రైతుల సంఘర్షణ సభలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో నడిగడ్డ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురైందన్నారు. మామ, బావ, అత్త, అల్లుడు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పాలిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని, ఆయనకు ఏమైనా నిజాయితీ ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ అత్త, అల్లుడు రాజకీయానికి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామని, అది నడిగడ్డకు వజ్రాయుధంగా మారుతుందన్నారు. మార్పు ఈ ప్రాంతం నుంచే మొదలుపెడతామన్నారు. సీడుపత్తి రైతులను ఆర్గనైజర్లు, కంపెనీలు నిండా ముంచుతున్నాయని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. -
ఏఎస్పీకి అభినందన
నారాయణపేట: రాష్ట్రస్థాయి 4వ పోలీసు స్పోర్ట్స్ మీట్లో జోగుళాంబ జోన్–7 నుంచి పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్ అత్యుత్తమ ప్రతిభకనబరిచి స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ డా.వినీత్ ఏఎస్పీని అభినందించారు. 50 ఏళ్ల పైబడిన సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో పాల్గొన్న ఏఎస్పీ.. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించడం అభినందనీయమన్నారు. క్రీడా రంగంలో పోలీసు అధికారులు రాణించడం జిల్లా పోలీస్శాఖకు గర్వకారణమని.. విధుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ చాటడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ధర్నా నారాయణపేట: మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ (సీఐటీయూ) యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్యార్డు, శ్మశానవాటికల నిర్వహణ తదితర పనులు చేస్తున్నారన్నారు. కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానంతో ఉద్యోగ భద్రత కోల్పోయారని.. సెలవులు తీసుకోలేని దుస్థితి నెలకొందని తెలిపారు. పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్కు అందజేశారు. జోషి, చంద్రప్ప పాల్గొన్నారు. -
ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
నారాయణపేట రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకుగాను జిల్లావ్యాప్తంగా 5,980 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 5,777 మంది విద్యార్థులు హాజరుకాగా.. 203 మంది గైర్హాజరయ్యారు. 96.6 శాతం హాజరు నమోదైంది. 5వ తరగతి ప్రవేశానికి మరికల్, కొండాపూర్, నారాయణపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,166 మంది విద్యార్థులు హాజరుకాగా 55 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా 6వ తరగతి ప్రవేశానికి 1,623 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మక్తల్లో రెండు, ధన్వాడ, నారాయణపేట, ఉట్కూర్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,567 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 56 మంది గైర్హాజరయ్యారు. 7వ తరగతి ప్రవేశానికి 843 మంది దరఖాస్తు చేసుకోగా మక్తల్లో రెండు, జాజాపూర్లో ఒకటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 811 మంది పరీక్ష రాయగా 32 మంది గైరాజరయ్యారు. 8వ తరగతికి సంబంధించి 815 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా దామరగిద్ద (సింగారం), ధన్వాడ, మరికల్లో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. 787 మంది హాజరుకాగా.. 28 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతి ప్రవేశానికి 478 మంది దరఖాస్తు చేసుకోగా మరికల్, నారాయణపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 446 మంది పరీక్ష రాయగా 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తంగా 3,068 బాలురకుగాను 2,973 మంది.. 2,912 మంది బాలికలకుగాను 2,804 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆయా కేంద్రాల్లో నిర్వాహకులు పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. -
నిర్లక్ష్యంపై నిరసన సెగ..
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర ఆలయంలో భక్తులపై నిర్వాహకుల దాడి ఘటనలో రెండు నెలల శిశువు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల తీరుపై ఆదివారం బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట చేపట్టిన ధర్నాలో వివిధ సంఘాల నేతలు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసుల వైఖరిపై మండిపాటు.. కుమ్మెర మల్లన్న ఆలయానికి ఈనెల 18న గ్రామానికి చెందిన చంద్రకళ, కీర్తి, గణేశ్, మౌనిక దర్శనం కోసం వెళ్లారు. రూ.100 ఎంట్రీ టికెట్ విషయంలో నిర్వాహకులు, భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు గణేశ్, చంద్రకళపై నిర్వాహకులు దాడిచేశారు. ఆలయం పక్కన కొబ్బరికాయల గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మౌనికపై సైతం దాడికి పాల్పడటంతో రెండు నెలల శిశువు సైతం కిందపడిపోయింది. కాగా, ఈనెల 21న శిశువు మరణించింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి కారణంగా కాకుండా వేరే కారణంతో మరణించి ఉండవచ్చని తమనే బెదిరింపులకు గురిచేశారని బాధితురాలు మౌనిక వాపోయారు. రెండు రోజులపాటు కొనసాగిన నిరసనలు.. ఈనెల 18న కుమ్మెర ఆలయంలో దాడి ఘటన చోటుచేసుకోగా, శనివారం శిశువు మృతి చెందింది. శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం సైతం ఉదయం నుంచి పోలీస్స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈనెల 18న ఫిర్యాదు ఇస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులను ప్రశ్నించారు. మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేస్తే ముగ్గురిని మాత్రమే అదుపులో తీసుకుంటామని చెప్పడం నిందితులను కాపాడటమేనని అన్నారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి బంధువులు అయినందుకే వారిని కాపాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు.ముగ్గురు రిమాండ్కు తరలింపు.. కుమ్మెర ఆలయంలో భక్తులపై దాడికి పాల్పడిన నిర్వాహకుల్లో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కుమ్మెర గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మధుసుదన్రెడ్డిని పోలీసులు అదుపులోకి రిమాండ్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. శిశువు మృతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించినట్టు చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగించి విచారణను పూర్తిచేస్తామన్నారు. వివాదాస్పదంగా పోలీసుల తీరు మల్లన్న జాతరలో దాడి సందర్భంగా శిశువు మృతి ఘటన పట్ల పోలీసుల తీరుపై విమర్శలు నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ బాధితుల ఆరోపణ పోలీస్స్టేషన్ ఎదుటప్రతిపక్షాల నిరసన ఎట్టకేలకు ముగ్గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు -
మహిళల ప్రగతి చక్రం
●ప్రతినెలా చెల్లింపు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 10 డిపోల పరిధిలో ఇందిరా మహిళా శక్తి కింద మొత్తం 32 బస్సులు నడుస్తున్నాయి. ప్రతినెలా హైదరాబాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి మండల మహిళా సమాఖ్యల ఖాతాలో డబ్బు జమ అవుతుంది. 84 నెలల తర్వాత బస్సులను తిరిగి ఆర్టీసీ అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఆదాయం సమాఖ్యలకు చేరుతుంది. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ గ్రామ సంఘాలకు రుణం.. ప్రభుత్వం మా మండల సమాఖ్యకు ఆర్టీసీ బస్సు అందజేసింది. ఈ బస్సు మండల సమాఖ్య పేరిట రిజిస్టర్ కాగా.. అచ్చంపేట డిపో పరిధిలో నడుస్తోంది. ఆర్టీసీ నుంచి ప్రతినెలా మండల సమాఖ్య ఖాతాకు రూ.69,654 జమ చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి వస్తున్న డబ్బులను గ్రామ సంఘాలకు రుణంగా ఇచ్చి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాం. – లలిత, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఉప్పునుంతల అచ్చంపేట: మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తిని కేటాయించడంతో ఆర్టీసీ బస్సుల ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రక్రియ.. ఇప్పుడు మహిళా సమాఖ్యల ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను అప్పగించిన మహిళా సమాఖ్యలకు యాజమాన్యం క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తుండటంతో ఈ పథకం ద్వారా మహిళా సభ్యులకు మంచి ఫలితాలు అందుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టగా.. గతంలో రెండు నెలల అద్దెలు విడుదల కాగా.. ఇటీవల ఆరు నెలల అద్దెలను ఆర్టీసీ యాజమాన్యం మహిళా సమాఖ్యలకు చెల్లించింది. 64 బస్సులకు ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)కు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం 64 బస్సుల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 32 బస్సులు కొనుగోలు చేసి మహిళా సమాఖ్యలకు అందజేసింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు బస్సుల కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వగా.. రూ.9.60 కోట్లతో ఇప్పటి వరకు 32 బస్సులు మహిళా సంఘాల ద్వారా సమకూర్చారు. వీటిలో నాగర్కర్నూల్ జిల్లాలోని వంగూరు, పెద్దకొత్తపల్లి, తిమ్మాజిపేట, బల్మూర్, ఉప్పునుంతల, నాగర్కర్నూల్, కల్వకుర్తి మండల సమాఖ్యలకు ఒక్కొక్కటి చొప్పున 7 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షల చొప్పున నిధులు సమకూర్చారు. వీటిలో మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు చెల్లించగా.. ప్రభుత్వం రూ.30 లక్షలను సీఏఎఫ్ (క్రెడిట్ ఆవిడంట్ ఫండ్)గా మంజూరు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండల సమాఖ్యలకు ఆర్థిక స్థిరత్వం, మహిళా సాధికారితకు పటిష్టమైన పునాదులు పడుతున్నాయి. నెలకు రూ.69,468 ఆదాయం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 32 మండలాల మహిళా సమాఖ్యలకు చెందిన 32 బస్సులను 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున ఈఎంఐ (అద్దె రూపంలో ఆదాయం అందుతోంది. గత ఆరు నెలల కాలానికి గాను ప్రతి మండల సమాఖ్య ఖాతాలో రూ.4,16,808 జమ అయ్యాయి. మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడి పెట్టగా.. ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షల వరకు వెచ్చించింది. మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించిన బస్సులకు ప్రతినెలా సంస్థ సంబంధిత మహిళా సమాఖ్యలకు అద్దెలు చెల్లిస్తోంది. గత ఆరు నెలల కాలానికి ఆర్టీసీ జిల్లాకు సంబంధించి మొత్తం 32 బస్సులకు గాను రూ.1,33,37,856 చెల్లించింది. 84 నెలల పాటు ఒప్పందం ఆర్టీసీ బస్సులతో మహిళా సమాఖ్యలకు భారీ ఆదాయం ఈఎంఐలు సకాలంలోచెల్లింపుతో సభ్యుల ఊరట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32 బస్సుల కొనుగోలు ఇది బ్యాంకు రుణం కాదని, ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందజేసిన ఒక గొప్ప ఆర్థిక అవకాశం అని ఆధికారులు పేర్కొంటున్నారు. 84 నెలల ఒప్పందం ముగిసిన తర్వాత ఈ బస్సులను తిరిగి సంఘాలకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పటి వరకు వచ్చే ఈ ఆదాయం మహిళా సమాఖ్యల బలోపేతానికి, మండల స్థాయిలో సామాజిక కార్యక్రమాలకు ఎంతో దోహదపడనుంది. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన అద్దెలను చెల్లించడంతో జిల్లాలోని మహిళా సమాఖ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మహిళా శక్తి ద్వారా బస్సులను కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అప్పగించడం ద్వారా తాము యజమానులం కాగలిగామని, ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు మరో అడుగుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.10 డిపోల పరిధిలో.. ఇందిరా మహిళా శక్తి కింద ఉమ్మడి జిల్లాకు కేటాయించిన మండల మహిళా సమాఖ్యల ఆర్టీసీ బస్సులు 10 డిపోల పరిధిలో నడుస్తున్నాయి. ఇందులో అచ్చంపేట డిపోలో 2, గద్వాలలో 4, కల్వకుర్తిలో 2, కొల్లాపూర్లో 2, కోస్గిలో 1, మహబూబ్నగర్లో 5, నాగర్కర్నూల్లో 2, నారాయణపేటలో 3, షాద్నగర్లో 4, వనపర్తిలో 7 చొప్పున ఉన్నాయి. -
ప్రణాళికతోనే ఫలితం
అందమైన చేతిరాతతో మంచి మార్కులు ● ఆహారపు అలవాట్లు ప్రధానమే ● పంచ సూత్రాలు.. ఉత్తమ ఫలితాలు ● పరీక్షల వేళ విద్యార్థులకు నిపుణుల సూచనలు ●నారాయణపేట రూరల్: పదోతరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రణాళికతో చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలంటేనే విద్యార్థులకు భయం ఏర్పడటం సహజం. ఇలాంటి సమయంలో నేర్పుతో ఆందోళనను దూరం చేసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుంటుంది. అధ్యాపకులు ఇలా చేయాలి.. జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు. ఇంటివద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు.. ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవాలి. తీసుకునే ఆహారం.. ఆందోళనకు గురికాకుండా తరచూ తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఇప్పటికై నా మించింది లేదు.. ఇక నుంచి చదివినా చాలు విజయం మీ సొంతం అంటూ వారిలో ప్రేరణ కలిగించేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులతో చేయకూడనివి.. విద్యార్థులను ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూడొద్దు. తల్లిదండ్రులు వారితో కలిసి కడుపు నిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో వారి అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు వారి ఆశలను పిల్లలపై రుద్ది చదవాలంటూ తరచూ వేధించరాదు. అందమైన దస్తూరితో.. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అందమైన చేతిరాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలు ఆకట్టుకునేలా గుండ్రంగా రాస్తూ పదాలకు మధ్య సమదూరం పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, దోషాలు, కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి.. పరీక్షల సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం, నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు ఎక్కువగా తినాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. – డా. గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేట ప్రశాంత వాతావరణంలో చదవాలి.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికావొద్దు. మార్కులపై దృష్టి సారిస్తూ బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చురుగ్గా పనిచేసేలా ఉత్తేజం కావాలి. – పటేల్ రాంరెడ్డి, నాయకుడు, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఉత్సాహంగా పరీక్షలు రాయాలి ప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరుకావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. ప్రశాంత వాతావరణంలో చదవాలి. ఇతర విషయాలపై దృష్టి సారించొద్దు. ఇప్పటి వరకు చదివిన అంశాలనే పునశ్ఛరణ చేసుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. – సుదర్శన్రావు, డీఐఈఓ, నారాయణపేట వైద్యులతో కౌన్సిలింగ్.. పరీక్షలంటే ఒత్తిడికి గురై భయపడే విద్యార్థులకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలో తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు, సూచనలు చేయాలి. పౌష్టికాహారం, సరైన నిద్ర, యోగా, ధ్యానం చేసేలా ప్రోత్సహించాలి. టీవీ, సెల్ఫోన్కు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయాలి. -
ప్రజాతీర్పును గౌరవిద్దాం : బీఆర్ఎస్
నారాయణపేట: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి, అభిమానించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని.. వారి తీర్పును గౌరవించాలని, రానున్న రోజులు బీఆర్ఎస్వేనని ఈ ఎన్నికలు రుజువు చేశాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, 7వ వార్డు కౌన్సిలర్ భరత్ను ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పూలమాల, శాలువాతో సన్మానించి మాట్లాడారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి పుర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల ముందు మంత్రి హడావుడిగా వచ్చి శిలాఫలకాలు వేసినా, రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీలిచ్చినా ప్రజలు విశ్వసించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నారాయణపేట పుర ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. పార్టీ కౌన్సిలర్లు సమస్యలపై తమ వాణి వినిపించి ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ఓడిన అభ్యర్థులు విజయానికి తొలిమెట్టు అనుకొని ప్రజల్లో ఉంటూ సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, నాయకులు బోయ లక్ష్మణ్, సురేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, స్టాంప్ రాంరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. అలంపూర్ ఆలయాల్లో కేంద్రమంత్రి అలంపూర్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అలంపూర్ హరితహోటల్ వద్ద కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ ఆలయాల్లో కేంద్రమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జోగుళాంబ దేవిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని, మరోసారి అమ్మవారి దర్శనానికి వస్తానని కేంద్రమంత్రి పేర్కొన్నారు. -
టెన్నిస్లో అడిషనల్ ఎస్పీకి స్వర్ణం
నారాయణపేట: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా కొనసాగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ చక్కటి ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నారు. 50 ఏళ్ల పైబడిన సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానంలో నిలిచారు. సైబరాబాద్ సీపీ మస్తీపురం రమేష్ బంగారు పతకం అందజేసి అభినందనలు తెలిపారు. జోగుళాంబ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లాకు స్వర్ణ పతకం సాధించిన అదనపు ఎస్పీని ఎస్పీ వినీత్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో పోలీస్ అధికారులు రాణించడం జిల్లా పోలీస్ విభాగానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు నారాయణపేట: సీఎం కప్ రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీలో జిల్లాకు చెందిన విద్యాశ్రీ బంగారు పతకం, అండర్–16 షాట్పుట్లో నర్మద కాంస్య పతకం సాధించినట్లు జిల్లా యువజన సర్వీసులశాఖ అధికారి వెంకటేశ్ శెట్టి తెలిపారు. జిల్లా క్రీడాకారులు బంగారు, కాంస్య పతకాలు సాధించడంతో పీడీ, కోచ్లను ఆయన అభినందించారు.కోయిల్సాగర్ నీటి వృథా మరికల్: మండలంలోని పెద్ద చెరువుకు వచ్చే కోయిల్సాగర్ నీటికి అడ్డుకట్ట వేయడంతో వృథా అవుతున్నాయి. చెరువులో చేపలు పట్టేందుకుగాను నెలరోజుల నుంచి పెద్ద చెరువు నీటిని బయటకు వదిలారు. కోయిల్సాగర్ నుంచి వస్తున్న నీరు కూడా చెరువులోకి చేరకుండా మళ్లించడంపై గ్రామస్తులు, ప్రతిపక్షల పార్టీల నాయకులు మత్స్యకారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెరువులో నీరు లేక సోర్సు బోర్లలో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. -
వయో వృద్ధుల సంక్షేమానికి చర్యలు
నారాయణపేట: వయో వృద్ధుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి అందరు ఉన్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. రోజువారి మెనూను పరిశీలించి వసతులు, నిత్యావసర సరుకుల నాణ్యత, తాగు నీరు, శుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ, సీసీ టీవీల పనితీరు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ నిర్వాహకులు అనాథ పిల్లలు, వృద్దులను బాగా చూసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. మరుగుదొడ్లు, పడక గదులు శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం చిన్నారులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. -
ప్రజలకు ఉత్తమ పాలన అందించాలి
సర్పంచుల శిక్షణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: కొత్తగా ఎన్నికై న సర్పంచులు శిక్షణను సద్వినియోగం చేసుకొని తమ గ్రామాల్లో ఉత్తమ పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ఆదేశానుసారం గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో సర్పంచుల 3, 4వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో సర్పంచుల శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. డిసెంబర్ 24న సీఎం రేవంత్రెడ్డి జిల్లాలోని కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచులను సన్మానించారని చెప్పారు. 5 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు 2018 పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాలు వివరించారని తెలిపారు. మున్ముందు మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకుందామని.. వేసవి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, ఉపాధిహామీ పనులు పరిశీలించాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు 100 శాతం నిర్మించాలని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షించాలి.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో సర్పంచుల పాత్ర కీలకమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. దేశాభివృద్ధి గ్రామం నుంచే ప్రారంభమవుతుందని.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర ముఖ్యమన్నారు. దేశంలో ఇద్దరిని మాత్రమే పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నుకుంటారని.. అందులో ఒక్కటి రాష్ట్రపతి, మరోటి సర్పంచ్ అని తెలిపారు. త్వరలో మంచి కార్యక్రమం ద్వారా గ్రామానికి పోలీసు వస్తారని, ప్రతి గ్రామంలో ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం సర్పంచ్లకు కలెక్టర్, ఎస్పీ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సుధాకర్రెడ్డి, ఎంపీడీఓలు శ్రీధర్, రమేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
● ఈ నెల 25 నుంచి ప్రారంభం ● ఆన్లైన్ హాల్టికెట్లకు అనుమతి ● హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ● ‘సాక్షి’తో డీఐఈఓ సుదర్శన్రావు సుదర్శన్రావు, డీఐఈఓ నారాయణపేట రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25న ప్రారంభమై మార్చి 16న ముగియనున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిపేందుకు విద్యార్థులను సన్నద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్రావు తెలిపారు. శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. ఆయన మాటల్లోనే.. 15 కేంద్రాలు.. 8,192 మంది విద్యార్థులు... జిల్లాలో 45 జూనియర్ కళాశాలలు ఉండగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది మొత్తం 8,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పరీక్షల నిర్వహణకు 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, నలుగురు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్, మరొక సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమించాం. వీరి పర్యవేక్షణకు ఒక కన్వీనర్, ఇద్దరు సభ్యులతో డీఈసీ కమిటీ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో.. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 14 వరకు కెమెరాలు ఉన్నాయి. ఇంటర్బోర్డు కమాండ్ కంట్రోల్రూంకు అనుసంధానం చేయడంతో ఉన్నతాధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు పరీక్ష సమయంలో మూసి ఉంచాలి. కనీస సౌకర్యాల కల్పన.. పరీక్ష కేంద్రాల్లోని ప్రతి గదిలో ఫ్యాన్, లైట్ ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు వినియోగించుకునే విధంగా సిద్ధం చేశాం. వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాం. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ పరీక్షా సమయానికి బస్సులను కేంద్రాల వరకు నడపనుంది. విద్యార్థులు సన్నద్ధం.. ఈ ఏడాది ఉత్తీర్ణతలో జిల్లాను రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిపేందుకు అవసరమైన విధంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాం. సిలబస్ పూర్తిచేసి ప్రత్యేక తరగదులు నిర్వహించాం. పరీక్షల కోసం 90 రోజుల ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా మాదిరి ప్రశ్నపత్రాలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహించారు. చేసిన తప్పులను విద్యార్థులకు తెలియజెప్పి సరిదిద్దుకునేలా తగిన చర్యలు తీసుకున్నాం. ఈ ప్రక్రియ ఉత్తీర్ణత శాతం పెంపుతో పాటు రాష్ట్రస్థాయి మార్కుల సాధనకు తోడ్పాడనుంది. నిమిషం నిబంధన ఎత్తివేత.. విద్యార్థులు పోర్టల్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్షకు హాజరుకావచ్చు. ఈ ఏడాది నుంచి హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశాం. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేశారు. ప్రైవేట్ కళాశాలలు ఫీజు కోసం విద్యార్థులను ఇబ్బందిపెట్టి హాల్టికెట్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటాం. -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లనుతీసుకెళ్లేందుకు అనుమతి లేదు ● ఇంటర్ బోర్టు డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్టు డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్ సూచించారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో సీఎస్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ఏ అధికారి అయినా గేటు వద్దే ఫోన్లు డిపాజిట్ చేసి వెళ్లాలని, లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అన్ని పరీక్షకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని బోర్డులో ఉన్న కమాండ్ కంట్రోల్కు అనుసంధానంగా ఉంటాయన్నారు. ప్రశ్నపత్రాలను కేవలం సీసీ కెమెరాల ముందు మాత్రమే ఓపెన్ చేయాలని సూచించారు. కేంద్రాల్లో కాపీయింగ్ జరిగేందుకు అవకాశం ఇవ్వకూడదని, కాపీయింగ్కు పాల్పడితే సంబంధిత డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ కౌసర్జహాన్, డీఈఓ ప్రవీణ్కుమార్, డీఈసీ మెంబర్లు ఉమామహేశ్వర్, నుజత్నదీమ్ తదితరులు పాల్గొన్నారు. -
ెసేల్స్ ఎగ్జిక్యూటివ్గా..
బంకులో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. కానీ నెలకు రూ.13 వేల వేతనం ఇస్తున్నా సరిపోవడం లేదు. వేతనం పెంచడంతో పాటు వచ్చే వేతనంలో కోతలు విధించకుండా చూడాలని కోరుతున్నాం. – సోనీ, సెల్స్ ఉమన్, జడ్ఎంఎస్ పెట్రోల్ బంకు కలలోనూ ఊహించలేదు.. నారాయణపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా నడుపుతామని కలలో కూడా ఊహించ లేదు. ఇది మా వల్ల కాదనుకున్నాం.. కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో విజయవంతంగా కొనసాగిస్తున్నాం. మున్ముందు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – అరుంధతి, జిల్లా అధ్యక్షురాలు, జడ్ఎంఎస్ ఆనందంగా ఉంది.. జడ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాహనదారులు కూడా వస్తున్నారు. మైలేజ్లో నంబర వన్ అంటూ వాహనదారులు చెప్పడం సంతోషంగా ఉంది. ఏర్పాటుచేసి అప్పుడే ఏడాది పూర్తయిందా అనిపిస్తోంది. బంక్ నడపడం కష్టమనుకున్నాం.. కానీ విజయవంతంగా కొనసాగిస్తున్నాం. – చంద్రకళ, బంకు మేనేజర్ లాభాలు వస్తున్నాయి.. 35 వేల లీటర్ల (పెట్రోల్, డీజిల్) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంక్ నిరంతరం పని చేస్తుంది. నిర్వహణ ద్వారా వచ్చే కమీషన్ జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణతో 11 మందికి ఉపాధి లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ విక్రయాలతో మంచి లాభాలు వస్తున్నాయి. – మొగులప్ప, డీఆర్డీఓ ● -
అందరి సహకారంతోనే అభివృద్ధి
మక్తల్: అందరి సహకారంతో పురపాలికను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పుర చైర్పర్సన్ వాకిటి మానస తెలిపారు. శుక్రవారం పుర కార్యాలయంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి బాధ్యతలు స్వీకరించగా.. మంత్రి వాకిటి శ్రీహరి వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో పురపాలికలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర అభివృద్ధి చేపడతానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కౌన్సిలర్లు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, కౌన్సిలర్లు రహీం పటేల్, అల్కూరి పావని, సరిత, జుట్ల అనిత, శ్రీవిద్య, చెన్నమ్మ, అమరేందర్రెడ్డి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
సంత్ సేవాలాల్ మార్గం ఆచరణీయం
మహిళలే నిర్వాహకులు.. ఈ బంక్లో రోజు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. విధులు నిర్వర్తించే 11 మంది సేల్స్ ఉమెన్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13 వేలు, మహిళా మేనేజర్కు రూ.18 వేల వేతనం జిల్లా సమాఖ్య నుంచి చెల్లిస్తున్నారు. ఏడాది కాలంలో 7,49,339 లీటర్ల పెట్రోల్ విక్రయించగా రూ.8,15,80,530.. 7,90820 లీటర్ల డీజిల్ విక్రయించగా రూ.7,68,04,438 ఆదాయం సమకూరింది. లీటర్కు పెట్రోల్పై రూ.3.43, డీజిల్పై రూ.2.05 చొప్పున కమీషన్ వస్తోంది. నిర్వహణ ఖర్చులు, వేతనాలు పోను ఏడాదిలో రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఊట్కూర్: సంత్సేవాలాల్ మహారాజ్ చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లితండాలో సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతి తండాలోని పిల్లలను విధిగా చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, చదువుతోనే బంగారు భవిష్యత్ వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తండాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అంతకముందు తండావాసులు మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలు చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ వినీత్రాజ్, ఆర్డీఓ రాంచందర్నాయక్, సర్పంచ్ మోహన్నాయక్, తహసీల్దార్ చింతరవి, సీతానాయక్ పాల్గొన్నారు. -
ముగిసిన ఓఎస్సీ సర్వే
జిల్లాలో తేలిన బడిబయటి చిన్నారుల లెక్క ● జనవరి నుంచి 40 రోజుల పాటు కొనసాగిన సర్వే ● నిర్బంధ విద్య అందిస్తామంటున్న అధికారులు నర్వ: జిల్లాలో బడిబయటి పిల్లల సంఖ్య తగ్గడం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా వారి సంఖ్య అధికంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లోని సీఆర్పీలు 40 రోజుల పాటు సర్వేచేసి విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పాఠశాలకు వెళ్లని 15 నుంచి 19 ఏళ్లలోపు వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి కారణంగా జిల్లాలో 217 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వారిని స్థానిక పాఠశాలలు లేదా కస్తూర్బా, గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. నామమాత్రంగానే.. బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే నవంబర్ 15న ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాగా డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సర్వే నామమాత్రంగా సాగింది. జనవరి రెండోవారం నాటికి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వివరాల నమోదు పూర్తి కాలేదు. గతేడాది సర్వేలో 333 మంది విద్యార్థులు బడిబయట ఉన్నట్లు గుర్తించగా.. ఈసారి ఆ సంఖ్య 217కి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నా.. సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది సీఆర్పీలు క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ఉన్న చోటే వివరాలు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వేలో గుర్తించిన అంశాలు.. చదువుకోవాల్సిన వయసులో వీధుల్లో ఉంటున్న వారి వివరాలను రెండు గ్రూప్లుగా వర్గీకరించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఒక గ్రూప్గా.. 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికల మరో గ్రూప్గా విభజించి సేకరించిన వివరాలను ప్రబంద్ యాప్లో నిక్షిప్తం చేస్తారు. విద్యాసంస్థలు తెరిచాక వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ● బడిబయటి పిల్లలను గుర్తించిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అందుబాటులో ఉండే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అంతేగాకుండా బాలురు, బాలికలకు వేర్వేరుగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్), స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎస్టీసీ), సర్వేలో మైగ్రేటెడ్ (వలస పిల్లల కోసం) రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైనింగ్ సెంటర్లు (ఆర్ఎస్టీసీ) ఏర్పాటు చేసి బడిబయటి పిల్లలకు విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇవేగాకుండా ఇటుక బట్టీలు, కర్మాగారాల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం వర్క్సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడే విద్యనందించేందుకు యాజమాన్యాల సహకారంతో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. -
మహిళల ఇంధనం
పేటలో తొలి ఇందిరా మహిళాశక్తి పెట్రోల్బంక్ ఏర్పాటు ● నేటితో ఏడాది పూర్తి.. సంబరాల్లో సంఘాల సభ్యులు ● వార్షిక టర్నోవర్ రూ.15.83 కోట్లు ● లాభం రూ.25 లక్షలు నారాయణపేట: రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ను ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో జిల్లాకేంద్రంలోని సింగారం చౌరస్తాలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గతేడాది ఫిబ్రవరి 21న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ బంక్ ఏర్పాటు చేసి శనివారానికి ఏడాది పూర్తికావడం, విజయవంతంగా కొనసాగుతుండటంతో మహిళా సంఘాల స భ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు కలెక్టర్ల చొరవతో.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీఇందిరా మహిళాశక్తి’ని పటిష్టంగా అమలు చేస్తోంది. జిల్లా మహిళా సమాఖ్యలో 8,196 సంఘాలు, 91,369 మంది సభ్యులున్నారు. నాటి కలెక్టర్ కోయ శ్రీహర్ష మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించి పెట్రోల్బంకు ఏర్పాటుకు పునాదులు వేశారు. జిల్లాకేంద్రం సమీపంలోని డీఆర్డీఏ కార్యాలయానికి అనుసరించి ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ స్థలంలో డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి రూ.1.30 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా బంక్ నిర్వహణకు బీపీసీఎల్తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం వచ్చిన ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ప్రోత్సహం అందిస్తుండటంతో విజయవంతంగా కొనసాగుతోంది. -
ప్రత్యేక కేంద్రం ఏర్పాటు..
సర్వేలో బడిబయటి పిల్లలను గుర్తించి కేజీబీవీ, ఆయా గ్రామాల పాఠశాలల్లో చేర్పించాం. మండలంలోని పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో బడి బయటి పిల్లల కోసం 45 రోజుల పాటు శిక్షణ అందించాం. 15 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఓపెన్ ఇంటర్, డిగ్రీ చదివేందుకు అవగాహన కల్పిస్తాం. – నర్సింహులు, సీఆర్పీ, నర్వ పాఠశాలల్లో చేర్పించాం.. జిల్లాలోని 13 మండలాల్లో జనవరిలో ప్రత్యేక సర్వే నిర్వహించి 217 మంది బడిబయటి చిన్నారులను గుర్తించాం. ఆ వివరాలను ప్రబంద్ యాప్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించాం. ఆయా పిల్లలను సీఆర్పీలు దగ్గరుండి బడిలో చేర్పించాలని సూచించాం. ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులను చేర్పించారు. బడిఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట ● -
24న నీతి ఆయోగ్ అదనపు డైరెక్టర్ రాక
నర్వ: నీతి ఆయోగ్ సంస్థ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా మండలాన్ని ఎంపికచేసి యాస్పిరేషన్ బ్లాక్గా గుర్తించింది. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు డైరెక్టర్ మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఆమె మండలంలోని పెద్దకడ్మూర్, రాయికోడ్ గ్రామాల్లో పర్యటించారు. పెద్దకడ్మూర్లోని పీఎంశ్రీ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్లో సౌకర్యాలు, పరికరాలు విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలో వార్షిక బడ్జెట్ వ్యయంతో కొనసాగుతున్న కార్యక్రమాలను జీహెచ్ఎం భాగ్యలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం రాయికోడ్లో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి స్యామ్, మామ్ ద్వారా చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. నర్వలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్, డీఆర్డీఓ మొగులయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
పరిశీలన బృందాలు
● ‘పది’ విద్యార్థుల అంతర్గత మార్కుల మూల్యాంకనం ● మూడురోజుల్లో పూర్తికి ఆదేశాలు నారాయణపేట రూరల్: విద్యాశాఖ రూపొందించిన సీసీఈ విధానంలో భాగంగా పదోతరగతి విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే వివిధ కృత్యాలకు సంబంధించి ఉపాధ్యాయులు వేసిన అంతర్గత మార్కుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 2025–2026 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలకు ఆయా బృందాలు వెళ్లి ఉపాధ్యాయులు వేసిన మార్కులను పరిశీలిస్తున్నారు. అంశాల వారీగా.. పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది నిర్వహించిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు, ప్రాజెక్టు పని, ఫెయిర్ నోట్స్ ఇతర అంశాలకు సంబంధించి ఒక్కోదానికి ఐదు మార్కుల చొప్పున ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు పాఠశాలలో సంబంధిత ఉపాధ్యాయుడు కేటాయిస్తారు. మిగతా 80 మార్కులకు సంబంధించి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు సబ్జెక్టులకు సంబంధించి 600 మార్కులకుగాను 480 మార్కులకు పరీక్ష రాయగా.. పాఠశాలలో 120 మార్కులు కేటాయిస్తారు. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా 131 ప్రభుత్వ, 44 ప్రైవేట్ పాఠశాలలు, 11 కేజీబీవీలు, 12 గురుకుల పాఠశాలల్లో మొత్తం 8 వేల మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. వీరి అంతర్గత మార్కుల కోసం మండలాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక జీహెచ్ఎం, ఒక లాంగ్వేజ్ పండిత్, ఒక ఆప్షనల్ ఉపాధ్యాయుడు ఉంటారు. జిల్లావ్యాప్తంగా 32 బృందాలు తనిఖీ చేస్తున్నాయి. రేపట్నుంచి ఆన్లైన్లో నమోదు.. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ మార్కుల కేటాయింపు ప్రక్రియపై ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో పరీక్షలు, అసైన్మెంట్, ప్రాజెక్టులు పూర్తి చేయించి మార్కులను రాత పుస్తకాల్లో నమోదు చేశారు. ఆయా బృందాలు మూడురోజుల పాటు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి తనిఖీ చేస్తాయి. అనంతరం ఈ నెల 21 నుంచి మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. -
ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
దామరగిద్ద: హిందూ ధర్మం కోసం పోరాడిన ఛత్రపతి శివాజీని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని స్వామి ఆదిత్య పరాశ్రీ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని సర్పంచ్ కన్కిరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సంఘటితమై ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి హిందువులను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువుగా జన్మించి అన్యమతాలను అనుసరిస్తూ ధర్మ ద్రోహానికి పాల్పడటం అవివేకమని తెలిపారు. అనంతరం వక్తలు రవీంద్రనాథ్, విగ్రహ దాత వన్నడ వెంకటప్ప శివాజీ గొప్పతనాన్ని వివరించారు. అంతకుముందు శివాజీ చిత్రపటంతో యువకులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఉప సర్పంచ్ సత్యనారాయణ, విండో మాజీ అధ్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్లు భీమయ్యగౌడ్, రవీంద్రనాథ్, వన్నడ ఆశమ్మ, గోపాలరావు, విగ్రహ కమిటీ అధ్యక్షుడు వెంకటప్ప, ఆర్ఎస్ఎస్ నాయకులు రాఘవేందర్గౌడ్, మాణిక్, వన్నడ చంద్రకాంత్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. శోభాయాత్రను పర్యవేక్షించిన ఎస్పీ నారాయణపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జిల్లా పరిధిలో నిర్వహించిన శోభాయాత్రలు, బైక్ ర్యాలీలను ఎస్పీ డా. వినీత్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నారాయణపేట, కోస్గి, మద్దూర్, మక్తల్, ఉట్కూర్, మరికల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను వీహెచ్ఎఫ్ సెట్ ద్వారా ఆదేశించారు. ర్యాలీల మార్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్ఐ నరేష్, ఐటీ కోర్ టీం శ్రీనివాసులు ఉన్నారు. విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతున్న స్వామి ఆదిత్య పరాశ్రీ -
సమర్థవంతంగా ధన్ధాన్య యోజన అమలు
● ప్రధానమంత్రి ధన్ధాన్య యోజనప్రత్యేక అధికారి డా. పొన్నుస్వామి నారాయణపేట/మరికల్: జిల్లాలో ధన్ధాన్య యోజన మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు శాఖల వారీగా నివేదించాలని ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన ప్రత్యేక అధికారి, భారత ప్రభుత్వ ఆయిల్ సీడ్స్ పరిశోధన డైరెక్టర్ డా. పొన్నుస్వామి ఆదేశించారు. గురువారం జిల్లాలోని మరికల్లో పర్యటించిన ఆయన చివరగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలు వివరాలను వ్యవసాయ, మత్స్య, పాడి పరిశ్రమ, కో–ఆపరేటివ్, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖల అధికారులు శాఖల వారీగా వివరించారు. సుదీర్ఘంగా చర్చించి అమలుకు అవసరమైన సలహాలు ఇచ్చారు. అంతకుముందు మరికల్ మండలంలోని తీలేరు, ఇబ్రహీంపట్నం, జిన్నారం గ్రా మాల్లో సాగు చేసిన ఆయిల్పాం, మామిడి, దానిమ్మ తదితర తోటలను పరిశీలించారు. జిన్నారంలో రాజవర్ధన్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయిల్పాం సాగు విధానాన్ని వివరించారు. తోటలను అధికారులు పరిశీలించకపోవడంతో కొందరు రైతులు తొలగించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అడవి పందులు, కుక్కల బారి నుంచి తోటను కాపాడుకొనేందుకు రాయితీపై కంచె మంజూరు చేయాలని, అలాగే చెట్టుకు రెండు వరుసల స్ప్రింకర్లు, డ్రిప్స్ అందజేస్తే అదనపు భారం తగ్గుతుందని ఆయిల్ఫెడ్ అధికారులకు వివరించారు. పంటల స్థితిగతులు, సాగు పద్ధతులు, ఉత్పాదకత, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకొని అధికారులతో చర్చించి సూచనలు చేశారు. పథకం అమలుపై జిల్లా అధికారులు, రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కో–ఆపరేటివ్ జిల్లా అధికారి ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖచారి, ఎల్డీఎం విజయకుమార్, డీపీఓ సుధాకర్రెడ్డి, శాస్త్రవేత్త రాజేంద్రకుమార్, సమితి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
కోస్గి రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని కడా చైర్మన్ వెంకట్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చంద్రవంచలో రూ.3 కోట్లతో నిర్మించిన 33 కేవీ సబ్స్టేషన్, ముశ్రీఫాలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను వారు ప్రారంభించారు. కడా నిధులు రూ.కోటితో అదనపు తరగతి గదుల నిర్మాణం, గుండుమాల్ మండలం బలుభద్రాయపల్లిలో రూ.4.20 కోట్లతో నిర్మించే 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందజేస్తామని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, విద్యుత్ ఎస్ఈ నవీన్కుమార్, డీఈ నర్సింహరావు, డీపీఓ భిక్షపతి, ఎంపీడీఓ శ్రీధర్, ఏడీ సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, ఏఈ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
19 రోజులు.. రూ.164.18 కోట్లు
● మున్సిపల్ ఎన్నికల్లో భారీగా మద్యం విక్రయాలు ● అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లోనే.. మహబూబ్నగర్ క్రైం: సాధారణంగా ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు ఏరులై పారాల్సిందే. ప్రధానంగా ప్రచార సమయంలో ఓటర్లు మద్యం మత్తులో ఊగుతుంటారు. అలాంటిది మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అంటే భారీగా లిక్కర్ పంపకాలు చేయడం సర్వసాధారణం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో నిలబడిన ప్రతి అభ్యర్థి ఆయా వార్డులు, డివిజన్లలో ఉన్న ప్రతి ఓటరుకు మద్యం సీసాలు అధిక మొత్తంలో పంపిణీ చేయడం జరిగింది. ఒక్కో వార్డు లేదా డివిజన్లో ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 8 మంది వరకు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఒకరిని చూసి మరొకరు పోటీపడి విచ్చలవిడిగా ఓటర్లకు మద్యం పంపిణీ చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో మద్యం అధికంగా పంపిణీ కావడం విశేషం. చిన్న మున్సిపాలిటీల్లో సాధారణ మద్యం ఇవ్వగా.. కార్పొరేషన్, కొద్దిగా పెద్ద మున్సిపాలిటీల్లో బ్రాండెండ్ లిక్కర్ ఓటర్లకు అందించారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో కేవలం మద్యం కోసమే రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసిన సందర్భం కన్పించింది. ఫిబ్రవరి 1 నుంచి గురువారం వరకు ఉమ్మ డి జిల్లాలోని 227 మద్యం దుకాణాల పరిధిలో రూ. 168.18 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో అధిక మొత్తం ఈ నెల 4నుంచి 9 తేదీల మఽ ద్య జరగడం విశేషం. మద్యం అమ్మకాల్లో ప్రధానంగా మహబూబ్నగర్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. లిక్కరే అధికం ఎన్నికల్లో అభ్యర్థులు అధిక మొత్తంలో లిక్కర్ కాటన్లు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. అయితే ఓటర్లకు దాదాపు 99 శాతం లిక్కర్ బాటిల్స్ అందించగా చాలా తక్కువగా బీరు బాటిల్స్ ఇచ్చిన ఘటనలు కనిపించాయి. సాధారణ ఓటర్లకు ఇంటింటికి తిరిగి లిక్కర్ బాటిల్స్ మాత్రమే పంపిణీ చేశారు. -
ఉద్యోగాల తొలగింపు సరికాదు..
తహసీల్దార్ కార్యాలయంలో 2008 నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా చాలీచాలని వేతనంతో జీవనం గడుపుతున్నాం. మూడు, నాలుగు నెలలకు ఓసారి వేతనం చెల్లిస్తుండగా.. ఎప్పటికై నా కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని భావించాం. కానీ ఏకంగా ఉన్న ఉద్యోగాన్ని తొలగించి బయటకు పంపే ప్రయత్నం చేస్తారని ఊహించలేదు. – రమేష్, కంప్యూటర్ ఆపరేటర్, వనపర్తి తహసీల్దార్ కార్యాలయాల్లో కీలకంగా పని చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేసి ప్రతినెలా వేతనం ఇవ్వాలి. ఏళ్లుగా పనిచేస్తున్న మేము ఇప్పుడు బయటకు వచ్చి కొత్తగా ఉద్యోగం వెదుక్కొనే పరిస్థితి కల్పించొద్దు. వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, కుటుంబం మాపై ఆధారపడి జీవిస్తున్న విషయం ప్రభుత్వ పెద్దలు గుర్తించి న్యాయం చేయాలి. – రఘు, కంప్యూటర్ ఆపరేటర్, ఆత్మకూరు ఉన్నతాధికారులకువిన్నవించాం.. ధ్రువపత్రాలు, ప్రొసీడింగ్లు, ఇతర కార్యాలయ పనులు చాలావరకు టీసీసీఓలతోనే చేయిస్తాం. ఏళ్లుగా వారి సేవలు వినియోగిస్తున్నాం. కార్యాలయంలో వారి అవసరం చాలానే ఉంది. తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సైతం నివేదించాం. మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. జిల్లాకేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లు లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలకు సరైన సేవలు అందించలేం. – రమేష్రెడ్డి, తహసీల్దార్, వనపర్తి -
క్షుణ్ణంగా పరిశీలిస్తాం..
విద్యార్థులు రాసిన పరీక్షలు, ఇతర ప్రాజెక్టు పనులకు సంబంధించిన రాత పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఉపాధ్యాయులు వేసిన మార్కులను తనిఖీ చేసి సరిచూస్తాం. విద్యార్థులకు అవసరమైన సూచనలు అందిస్తాం. – అనురాధ, జీహెచ్ఎం, కొల్లంపల్లి గడువులోగా పూర్తి.. పాఠశాలలో విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. శుక్రవారంలోగా పూర్తిచేసి తప్పులను సరి చేస్తారు. అనంతరం ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఆన్లైన్లో నమోదు చేయాలి. గడువులోగా పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం. – గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ● -
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి
నారాయణపేట రూరల్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా నూతన అధ్యక్షుడిగా డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం.నర్సింహారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, కార్యదర్శి చంద్రునాయక్ పర్యవేక్షణలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించగా.. ఎన్నికల అధికారిగా రాజేశ్ వ్యవహరించారు. జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు హాజరై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దామోదర్, ఉపాధ్యక్షురాలిగా ఉదయభాను, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా శశికళ, కార్యదర్శిగా అజయ్, కోశాధికారిగా చిన్నబాలరాజ్తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన సభ్యులను శాలువా, పూలమాలలతో సన్మానించి నియామక పత్రాలను అందజేశారు. వేరుశనగ క్వింటా రూ.9,040 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 9,040, కనిష్టంగా రూ. 3,500 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ. 5,162, కనిష్టంగా రూ. 4,982, అలసందలు గరిష్టంగా రూ. 6,219, కనిష్టంగా రూ. 5,855, వడ్లు (సోన) రూ. 2,239, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,139, కనిష్టంగా రూ. 6,800, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,129, కనిష్టంగా రూ. 7,012 ధరలు పలికాయి. అద్దె ప్రాతిపదికనఆర్టీసీ బస్సులు స్టేషన్ మహబూబ్నగర్: రానున్న పెళ్లిళ్లు, శుభాకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు రీజినల్ మేనేజర్ సంతో ష్కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీజియన్లోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ ధర ఉంటుందని, డ్రైవర్ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్6 అధునాతన టెక్నాలజీ కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులను బుకింగ్ చేసుకునేందుకు అచ్చంపేట 99592 26291, గద్వాల 99592 26290, కల్వకుర్తి 99592 26292, కొల్లాపూర్ 90004 05878, కోస్గి 99592 26293, మహబూబ్నగర్ 99592 26286, నాగర్కర్నూల్ 99592 26288, నారాయణపేట 99592 26293, మహబూబ్నగర్ 99592 26286, షాద్నగర్ 99592 26287, వనపర్తి 99592 26289 నంబర్లను సంప్రదించాలని కోరారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థుల కోసం ఆమ్నీల్ ఆంకాలజీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. 80 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, రవికాంత్, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో కోడె దూడల వేలం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన మొక్కుబడి కోడె దూడలకు బహిరంగవేలం నిర్వహించారు. మొత్తం 41 కోడె దూడలను వేలం వేయగా, వాటి ద్వారా దేవస్థానానికి రూ.1,13,100 ఆదాయం సమకూరింది. స్వామివారి సేవలో భాగంగా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించిన ఈ కోడెదూడలను దేవస్థానం నియమావళి ప్రకారం వేలం ద్వారా విక్రయించారు. వేలం ప్రక్రియ దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. భక్తుల విశ్వాసం, సేవాభావంతో స్వామివారికి సమర్పించిన మొక్కుబడులు ఆలయానికి ఆదాయం వనరుగా మారడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పునరావాస కష్టాలు?
రిజర్వాయర్ల నిర్మాణం కోసం వందలాది ఎకరాల భూమిని త్యాగం చేశారు. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. కానీ వారికి ఆర్అండ్ఆర్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు దాదాపు దశాబ్దన్నరగా అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలంలో ఊటనీరు వచ్చి.. ఇళ్లు కూలిపోతున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే గడుపుతున్నారు. – మక్తల్సంగంబండ రిజర్వాయర్లో ముంపునకు గురైన నేరెడుగాంభూత్పూర్, నేరెడుగాం ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటు పట్టని ప్రభుత్వం -
‘జూరాల’.. తగ్గుముఖం
అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.262 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి పథకాలకు సరిపడా నీటిని అందించలేని పరిస్థితి ఎదురుగాక తప్పదని అనిపిస్తోంది. ప్రాజెక్టు నిల్వనీటి సామర్థ్యం 11 టీఎంసీలు కాగా.. 9 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసి ఏటా వానాకాలంతో పాటు యాసంగిలో సైతం ఆయకట్టుకు సాగునీటిని వదులుతారు. ఈ ఏడాది కూడా వానాకాలంలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించిన ప్రభుత్వం.. యాసంగిలో మాత్రం ఎడమ, కుడి కాల్వ పరిధిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో అందిస్తూ మిగిలిన వాటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ● జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. యాసంగిలో రామన్పాడు రిజర్వాయర్ వరకు కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. దిగువ ఆయకట్టు రైతులు తమకు సాగునీరు ఇవ్వాలని కోరినా.. వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా సరఫరా చేయలేమంటూ చెప్పుకొచ్చారు. సాగునీటికి 600 క్యూసెక్కులు.. యాసంగిలో వారబందీ విధానంలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు రోజుకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3.262 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనికి తోడు ప్రాజెక్టు గేట్ల లీకేజీలు, ఆవిరి రూపంలో రోజు 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. అలాగే జలాశయంలో రెండు టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది. ● జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి సత్యసాయి తాగునీటి పథకంతో పాటు రామన్పాడు, బుగ్గపల్లి, గోపాల్పేట తాగునీటి పథకాలతో 250కి పైగా గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందుతోంది. ఏటా వేసవిలో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ప్రాజెక్టులో లేకపోవడంతో ఎగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీలు సరఫరా చేయించుకొని గట్టెక్కుతున్నారు. ● ఎల్లూరు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని దాదాపు మండలాలకు తాగునీరు అందుతున్నందున వేసవిలో వనపర్తి జిల్లా ఆత్మకూర్, అమరచింత మండలాలకు మాత్రమే తాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఈ మండలాలు జూరాలపై ఆధారపడటంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. జూరాల జలాశయంలో ప్రస్తుత నీటి మట్టంరోజురోజుకు పడిపోతున్న నిల్వ నీటిమట్టం ప్రస్తుతం 3.262 టీఎంసీలు మాత్రమే.. వారబందీ విధానంలో ఆయకట్టుకు సరఫరా వేసవికి ముందే తలెత్తనున్న తాగునీటి కష్టాలు! -
ప్రభుత్వం ఆదుకోవాలి..
భూత్పూర్ రిజర్వాయర్లో గ్రామస్తులు సర్వస్వం కోల్పోయా రు. వ్యవసాయ భూ ములకు మాత్రమే నా మమాత్రపు పరిహారం అందింది. పునరావాసం కల్పించడంలో జా ప్యం చేస్తున్నారు. రిజర్వాయర్లో నీటి నిల్వ తో గ్రామంలో ఊటనీరు వస్తోంది. ఇళ్లు దెబ్బ తింటున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలి యని పరిస్థితి ఉంది. ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకోవాలి. – కుర్వ హన్మంతు, మాజీ సర్పంచ్, భూత్పూర్ నష్టపరిహారం ఇవ్వాలి.. భూత్పూర్లో తేమశాతం అధికంగా ఉండటంతో ఇళ్లు పాడవుతున్నాయి. ఇళ్లల్లో నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైన గ్రామంలో అధికారులు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. – ఆనంద శేఖర్, భూత్పూర్ ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. సంగంబండ రిజర్వాయ ర్ కింద ముంపునకు గు రైన మా గ్రామ సమస్య ను ఏళ్ల తరబడి పరిష్కరించడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలి. – ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ, నేరెడుగాం● -
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ
కోస్గి రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్కు భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం కోస్గి మండలం తోగాపూర్లో తహసీల్దార్ శ్రీనివాసులు భూ సేకరణపై నోటీసులు జారీ చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మొత్తం వెయ్యి ఎకరాల భూమి అవసరం కాగా.. తోగాపూర్లో 400 ఎకరాలు, వికారాబాద్ జిల్లా దుద్యాల, లగచర్ల గ్రామాల్లో 600 ఎకరాలు సేకరిస్తున్నారు. తోగాపూర్ శివారులోని 150–1 సర్వే నంబరులో గల 387.14 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో ప్రభుత్వ భూమి 175.22 ఎకరాలు ఉందని తహసీల్దార్ తెలిపారు. మిగతా భూమికి సంబంధించి కొందరికి పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణపై నోటిఫికేషన్ విడుదలై 60 రోజులు దాటినా ఒక్క ఫిర్యాదు అందలేదని తెలిపారు. భూ సేకరణ ప్రక్రియపై గురువారం ఆర్డీఓ రామచందర్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతారన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
నారాయణపేట ఎడ్యుకేషన్: సమాజంలో నిర్వహించ తలపెట్టే బాల్యవివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్గౌడ్ అన్నారు. జస్ట్ రైడ్ ఫర్ చిల్డ్రన్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల ప్రచార రథయాత్రను బుధవారం కలెక్టరేట్లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రచార రథం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం విజన్ సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడైనా బాల్యవివాహం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 1098 నంబర్కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అశోక్ శ్యామల, యాదయ్య, డీసీపీఓ కరిష్మా, విజన్ సంస్థ కోఆర్డినేటర్ రవికుమార్, చైల్డ్ హెల్ప్లైన్ జిల్లా కోఆర్డినేటర్ నర్సింహులు, మహిళా సాధికారత విభాగం అధికారి నర్సింహులు, సఖి సీఏ క్రాంతిరేఖ పాల్గొన్నారు. -
రెండు మండలాలకు ఇబ్బంది..
జిల్లాలోని అన్ని మండలాలకు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టు ద్వారా అమరచింత, ఆత్మకూర్ మండలాలకు మాత్రమే తాగునీరు అందుతుంది. ఈ రెండు మండలాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికను సిద్ధం చేసుకొని పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్కుమార్, డీఈఈ, మిషన్ భగీరథ తాగునీటి కష్టాలు తీర్చాలి.. గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో కావడం లేదు. సమీపంలో జూరాల ప్రాజెక్టు ఉందని సంబుర పడాల్సిందే తప్ప వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం చేతి పంపులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూడాలి. – వెంకటేష్, నందిమళ్ల నీటి సరఫరా అస్తవ్యస్తం.. గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. అమరచింత క్రాస్రోడ్ నుంచి పైప్లైన్కు మోటారు ద్వారా నీటిని సరఫరా చేస్తే తప్ప గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి గతంలో ఉన్న సత్యసాయి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తే తాగునీటి కష్టాలు తీరుతాయి. – రాజు, మస్తీపురం ● -
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కృష్ణా: చదువులో వెనకబడిన ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మంగళవారం మండలంలోని ముడుమాల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై ఆరా తీశారు. విద్యార్థులకు ప్రణాళికా బద్ధంగా బోధించి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. సమయం వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కాగా, ముడుమాల్ ప్రాథమిక పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు విద్యాభోదన అంశాలు ఆదర్శవంతంగా ఉన్నాయని డీఈఓ ప్రశంసించారు. డీఈఓ వెంట ఎంఈఓ నిజాముద్దీన్, మధ్యాహ్న భోజన పథకం కోఆర్డినేటర్ యాదయ్యశెట్టి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
● రుణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జరిగిన డీసీసీ సమావేశానికి చైర్మన్గా కలెక్టర్, కోన్వీనర్గా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా 2025–26 వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించి రూ. 4204.49 కోట్ల బడ్జెట్కు గాను రూ. 2431.39 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ సంబంధించి రూ. 310.30 కోట్ల బడ్జెట్లో రూ. 144.77 కోట్లు వ్యవసాయేతర రుణాలు మంజూరు చేశారన్నారు. ఇది వార్షిక బడ్జెట్లో 46.65 శాతమని పేర్కొన్నారు. జిల్లా ప్రాధాన్యత రంగానికి రూ. 3833.48 కోట్లు కేటాయించగా.. రూ. 1938.71 కోట్ల రుణాలు అందించడం జరిగిందన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డు జిల్లా ప్రాధాన్యతా రంగానికి రూ. 4101.82 కోట్ల అంచనాలతో ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ప్రధానంగా పంట రుణాలు రూ. 2482.61 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం స్థిర మూలధన రుణం రూ. 816.26 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 67.79 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ. 325.08 కోట్లు అవసరమని అంచనా వేయడం జరిగిందన్నారు. బ్యాంకర్లు ప్రాధాన్యతా రంగాలకు త్వరితగతిన అధిక మొత్తంలో రుణాలు అందించి.. జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సూచించారు. ఆర్బీఐ ఎల్డీఓవీ శ్రీనివాస్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖాచారి, ఎస్బీఐ సీఎం క్రెడిట్ జఫార్ మొహిద్దీన్, యూబీఐ నుంచి సీఎం క్రెడిట్ టి.రాజేశ్ ఉన్నారు. పకడ్బందీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బూత్స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ పాల్గొన్నారు. ● విద్యతోనే మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో మహిళా, శిశుసంక్షేమశాఖ – జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్గౌడ్, బాలల సంక్షేమ మండలి చైర్మన్ అశోక్ శ్యామల, డీపీఆర్ఓ రషీద్, బాల్రాజ్, సీడీపీఓలు వెంకటమ్మ, రోజా, పార్వతి పాల్గొన్నారు. -
25న రేషన్ బియ్యం వేలం
నారాయణపేట: జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 644.67 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్దారులు ఈ నెల 18 నుంచి 21వ తేదీలోగా రూ. 25వేల డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు. సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి: పీయూ వీసీ మహబూబ్నగర్ న్యూటౌన్: వెనుకబడిన వర్గాల ఆరాద్యుడు సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడుచుకోవాలని పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహాభోగ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ పీయూలో సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మధ్యపానం, ధూమపానాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సేవాలాల్ మహారాజ్ ఆనాడే బోధించారన్నారు. ప్రతి మనిషి ఉన్నతంగా జీవించాలని సంత్ సేవాలాల్ మహారాజ్ ఆకాంక్షించారని డా.తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రాల్ రమేశ్, డా.నాగం కుమారస్వామి, యూనివర్సిటీ పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డా.బి.మధుసూదన్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డా.జె.మాళవి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కరుణాకర్రెడ్డి, డా.వెంకట్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు. -
జనరల్లోనూ బీసీలు
ఉమ్మడి జిల్లాలో జనరల్ స్థానాల్లో బీసీల హవా సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలోని 8 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు జనరల్కు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఏకంగా ఏడు స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపాలిటీ మినహా మిగతా అన్రిజర్వ్డ్ మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీసీలే కై వసం చేసుకున్నారు. కల్వకుర్తి, గద్వాల, కోస్గి, నారాయణపేట, మక్తల్, అమరచింత, పెబ్బేర్ మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్రిజర్వ్డ్గా ఉండగా ఆయా చోట్ల బీసీలు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. ● ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు 8 చోట్ల మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్రిజర్వ్ అయ్యాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్పర్సన్గా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన భృంగి రత్నమాల ఎన్నికయ్యారు. గద్వాల మున్సిపాలిటీలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల జయలక్ష్మి చైర్పర్సన్ అయ్యారు. కోస్గి మున్సిపాలిటీలో బీసీ వర్గానికి చెందిన నాగులపల్లి నరేందర్, నారాయణపేటలో బీజేపీ నుంచి యాదవ వర్గానికి చెందిన కొండ శ్వేత ఎన్నికయ్యారు. మక్తల్లో చైర్మన్ స్థానం జనరల్గా ఉండగా ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ వాకిటి మానసకు అవకాశం దక్కింది. అమరచింతలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జింక సువర్ణ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. పెబ్బేర్లో చైర్మన్గా అక్కి శ్రీనివాస్గౌడ్కు అవకాశం దక్కింది. వార్డుస్థానాల్లో అత్యధికంగా బీసీల ఎన్నిక.. మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్రిజర్వ్డ్ వార్డుల్లోనూ అత్యధిక స్థానాల్లో బీసీలు గెలుపొందారు. ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 159 వార్డులు జనరల్కు కేటాయించగా, వీటిలో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. అత్యధికంగా గద్వాల మున్సిపాలిటీలో 15 మంది బీసీలు జనరల్ స్థానాల్లో విజయ ఢంకా మో గించారు. వనపర్తి మున్సిపాలిటీలో 14 మంది, నారాయణపేటలో 9 మంది, కొల్లాపూర్ లో 8 మంది, మహబూబ్నగర్ కార్పొరేషన్లో 8 మంది బీసీలు గెలుపొందారు. వీరితో పాటు మరో 8మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీ లు జనరల్గా ఉన్న వార్డుల్లో విజయం సాధించారు. కల్వకుర్తిలో రెండు జనరల్ స్థానాల్లో ఎస్టీలు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అన్ రిజర్వ్డ్గా ఉన్న 8 పురపాలికల్లో 7 చోట్ల బీసీలే చైర్మన్లు కల్వకుర్తి, గద్వాల, కోస్గి, నారాయణపేట, మక్తల్, అమరచింత, పెబ్బేరులో చైర్మన్ స్థానాలు బీసీల వశం వనపర్తిలో మాత్రమే ఓసీలకు దక్కిన చైర్మన్ పీఠం 143 జనరల్ వార్డుల్లో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపు -
ప్రజాసేవతోనే సమాజంలో గుర్తింపు
మక్తల్: ప్రజాసేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లుగా ఎన్నికై న వాకిటి మానస, బి.శైవిరెడ్డిలను ఆయన శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, కట్ట సురేశ్, అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీ క్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 15 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 15 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఒక సిట్టింగ్ స్క్వాడ్, ఇద్దరు కస్టోడియన్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీ క్షలు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, లైటింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని.. పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకో వాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో డీఈసీ కన్వీనర్ సుదర్శన్రావు, సభ్యులు శ్రీనివాసులు నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. -
‘కమల’వికాసం
నారాయణపేట● పేటలో నెగ్గిన అత్త.. తగ్గిన కోడలు ● మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ఎన్నికకు బీఆర్ఎస్ కౌన్సిలర్ల గైర్హాజరు ఆదిదంపతుల కల్యాణం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026–IIలో uనారాయణపేట: జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో కమలం వికసించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్కంఠ రేపిన పుర పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. ఎంపీ డీకే అరుణ వ్యూహరచణతో మున్సిపల్ చైర్పర్సన్గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత, వైస్చైర్పర్సన్గా మంజుల రాఘవేందర్రెడ్డి ఎన్నిక కావడం కమలనాథుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి వరుసకు మేనత్త అయిన ఎంపీ డీకే అరుణ పేట మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేసిన తరుణంలో నెగ్గిన అత్త.. తగ్గిన కోడలంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల గైర్హాజరు.. పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు కౌన్సిలర్లు పాల్గొనకుండా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొదటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం కొనసాగింది. ఈ క్రమంలోనే పుర పీఠాన్ని కై వసం చేసుకుంటామనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేశారనే చర్చ సాగుతోంది. ఆమెకే పెద్దపీట.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. మరో నలుగురు వైస్చైర్పర్సన్లుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. పేట చైర్పర్సన్గా బీజేపీకి చెందిన కొండ శ్వేత, వైస్చైర్మన్గా మంజుల ఎన్నికయ్యారు. కోస్గి మున్సిపల్ చైర్మన్గా నాగులపల్లి నరేందర్, వైస్ చైర్పర్సన్గా చింతల సరితకు అవకాశం కల్పించారు. మద్దూర్ బీసీ జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ పురుషులకు అవకాశం ఉన్నప్పటికీ.. చైర్పర్సన్గా డి.సరస్వతి, వైస్ చైర్పర్సన్గా భాగ్యశ్రీకి పట్టం కట్టారు. మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్కు రిజర్వు కాగా.. చైర్పర్సన్గా వాకిటి మానసకు పుర పీఠం వరించింది. జనరల్ స్థానాల్లో బీసీలకు పట్టం.. కోస్గి మున్సిపాలిటీ జనరల్కు రిజర్వు కాగా.. చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు నాగులపల్లి నరేందర్కు అవకాశం కల్పించారు. నారాయణపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు కాగా.. బీజేపీ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండ శ్వేతను చైర్పర్సన్ చేసింది. మక్తల్ జనరల్ రిజర్వు కాగా.. బీసీ సామాజికి వర్గానికి చెందిన వాకిటి మానసకు చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారు. వైస్చైర్మన్ ఎన్నికకు‘చెయ్యి’చ్చిన ఎంఐఎం.. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ ఎన్నికకు ఎంఐఎం ఇద్దరు కౌన్సిలర్లు చేతులెత్తారు. కానీ వైస్చైర్పర్సన్ ఎన్నిక వచ్చేసరికి ఏఐఎఫ్బీ కౌన్సిలర్కు మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యెత్తారు. ఎంఐఎం కౌన్సిలర్లు మాత్రం తటస్థంగా ఉండటంతో మరోసారి అధికార పార్టీ ఖంగుతింది. సీఎం ఇలాకా.. కాంగ్రెస్ పార్టీకే.. సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలోని కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. అదే విధంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలోని మక్తల్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మూడింటిని అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది. -
ముహూర్తం నేడే..
పురాల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్కు 14 ఖాయం.. భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్తో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ మ్యాజిక్ ఫిగర్ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది. అయిజలో బీఆర్ఎస్.. అలంపూర్లోనూ.. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో ఈ పురపాలిక పీఠాన్ని ఆ పార్టీ కై వసం చేసుకోనుంది. మరోవైపు అలంపూర్లో 10 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెరి సమానం వచ్చాయి. ఎక్స్అఫీషియోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ సైతం కారు విజయం ఖాయమైంది. వనపర్తి జిల్లా అమరచింతలో బీజేపీ, బీఆర్ఎస్ కూటమినే పీఠం వరించనున్నట్లు తెలుస్తోంది. 10 వార్డులు ఉండగా.. మూడు చొప్పున కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపొందాయి. ఒక సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్కు సీపీఎం మద్దతిస్తుండడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ఆరు కాగా.. మంతనాలు సాగుతున్నాయి. చైర్మన్ పదవిని పంచుకునేందుకు ఇరు పార్టీలు అంగీకారం తెలిపినా.. తొలి పర్యాయంపై ఎవరికి వారు పట్టుబడుతున్నట్లు సమాచారం. గద్వాలలోనూ ‘చేతి’కే అవకాశం .. అయినా.. అమరచింతలో కారు, కమలం కూటమికే.. నారాయణపేటలో బీజేపీకే మొగ్గు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం మహబూబ్నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే.. గద్వాలలో సైతం హస్తానికే అవకాశం నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు అయిజతో పాటు అలంపూర్లో బీఆర్ఎస్కు లైన్క్లియర్ అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కూటమికే.. -
అత్తాకోడళ్లకు అగ్నిపరీక్ష..!
పేటలో కమలం వికసిస్తుందా.. హస్తగతం అవుతుందా? ● అంతర్మథంలో ఆశావహులు ● 12కు చేరిన బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య ● కాంగ్రెస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ మైత్రితో 10కి చేరిన కౌన్సిలర్లు ● బీఆర్ఎస్ సైలెంట్తో పరేషాన్లో అధికార పార్టీ ● ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీకి సులువు నారాయణపేట: స్థానిక పురపాలికలో పాగా వేయడం ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. పేట మినహా మిగిలిన వాటిలో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైనట్లే. కాగా ఇక్కడ బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. బీజేపీ రెబల్గా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి జయశ్రీ శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 12కు చేరింది. ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటును ఇక్కడే వేసేందుకు దరఖాస్తు చేసుకోవడంతో పీఠం దక్కించుకోవడం నల్లేరు మీద నడకై ందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ట్రై.. టై.. డ్రా..? సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితిలో హస్తగతం చేసుకోవాల్సిందేనంటూ ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి అధిష్టానం నుంచి సాంకేతాలు రావడంతో అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ ఒకరితో కలిపి వారి సంఖ్య పదికి చేరింది. బీజేపీలో చేరిన స్వతంత్ర అభ్యర్థిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని చేయని ప్రయత్నమంటూ లేదు. ఇక అది ఫలించకపోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరిని కలుపుకొంటే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార పార్టీ సైతం 13 స్థానాలకు చేరుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు కానుండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ను డ్రా పద్ధతిలో ఎన్నుకునే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేటకు చేరుకున్న ఎమ్మెల్యే.. అనారోగ్య సమస్యలతో మూడు నెలలుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సిన పరిస్థితి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ఆదివారం నారాయణపేటకు చేరుకొని సీవీఆర్ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారపార్టీలోకి ఎవరొచ్చినా ‘కోటీ’శ్వరుడే.. అధికారపార్టీలోకి ఎవరొచ్చినా కోటీశ్వరుడే అవుతారంటూ పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి అధికార పార్టీలోకి ఒక కౌన్సిలర్ వచ్చినా తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు దూతల ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చినట్లు వీడియో కాల్చేసి చూపిస్తే తప్ప తాము నమ్మే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలుస్తోంది. -
ఎక్కడ.. ఎలా.. ఎవరు?
● పలు పురపాలికల్లో చైర్మన్, వైస్ చైర్మన్లు ఖరారు ● కొన్నింటిలోకొనసాగుతున్న సస్పెన్స్ ● నాగర్కర్నూల్ పురపాలిక హస్తగతమైంది. చైర్మన్ బీసీ జనరల్కు రిజర్వ్ కాగా.. తీగల సునేంద్ర పేరు ప్రచారంలో ఉంది. వైస్ చైర్మన్గా బాదం రమేష్ పేరు వినిపిస్తోంది. ● అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా సీఎం సురేష్ను ముందుగానే ప్రకటించారు. వైస్ చైర్మ న్ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించలేదు. ● మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యత సాధించి చైర్మన్ జనరల్కు రిజర్వ్ కాగా.. సరిత మక్తల్, శైవీరెడ్డి, కోళ్ల సంధ్య, అల్ కురుపావళని పదవి ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ కోసం మహేష్, జుట్ల అనిత ప్రయత్నిస్తున్నారు. ● కల్వకుర్తి పురపాలికలో కాంగ్రెస్ పాగా వేసింది. చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కా గా.. రత్నమాల పేరును ఖరారు చేశారు. వైస్ చైర్మన్గా షానవాజ్ ఖరారైనట్లు సమాచారం. ● మద్దూరు మున్సిపాలిటీ హస్తగతం కాగా.. చైర్మన్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ ఇప్పటివరకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. మున్సిపాలిటీలో విలీనమైన రేణివట్ల నుంచి పదో వార్డులో గెలుపొందిన గడ్డమీది గోవిందు ఈ పదవిని ఆశిస్తున్నారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన జీడి మౌనిక, 16వ వార్డు నుంచి విజయం సాధించిన డిల్లికర్ సరస్వతిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్యకుమారి, మాజీ సర్పంచ్ శ్రీదేవి గౌతమ్గౌడ్, వంగ అనూ ష రాజశేఖర్గౌడ్, గుండ్రాతి స్వప్న శిల్ప, పసుల సుజా త చైర్పర్సన్ పదవికి పోటీలో ఉన్నారు. వైస్ చైర్మన్ కోసం ముస్లిం, ఎస్టీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల్లో సోమవారం కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను అధిరోహించేది ఎవరనే దానిపై కొన్ని చోట్ల స్పష్టత వచ్చింది. మరికొన్నింటిలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆశావహులు అధికంగా ఉండడం.. పోటాపోటీ నెలకొనడంతో ఆయా పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రిజర్వేషన్ ప్రకారం ఆయా పదవులకు ఎంపికై న వారి పేర్లను ప్రకటించకుండా గోప్యతను పాటిస్తుండగా.. ప్రమాణ స్వీకారం సమయానికి క్తొ ముందస్తుగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకద్ర మున్సిపాలిటీలో చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్ పీఠం దక్కించుకోనుంది. మున్నూరు కాపు వర్గానికి చెందిన కొండా దమయంతిని ఎన్నికల సమయంలోనే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే సమయంలో వైస్ చైర్మన్ విషయంపై చర్చించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి 12వ వార్డులో గెలిచిన యుగంధర్ రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వీరిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మరో అభ్యర్థి సైతం వైస్ చైర్మన్ ఇస్తే పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. భూత్పూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్మన్ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వచ్చిన బాల్కోటిని ఎన్నికల ప్రచార సమయంలోనే ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గెలుపొందడంతో చైర్మన్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వనపర్తి చైర్మన్ పీఠం జనరల్ మహిళ రిజర్వ్ కాగా.. ఈ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. చీర్ల రజినీ చందర్, ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్తో పాటు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధనలక్ష్మి ఆశిస్తున్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పీఠం జనరల్కు రిజర్వ్ కాగా.. సుమిత్రా ఎల్లారెడ్డి, అక్కి శ్రీనివాస్ గౌడ్ పదవిని ఆశిస్తున్నారు. చైర్పర్సన్ ఎంపికపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై క్లారిటీ వస్తేనే వైస్ చైర్మన్ ఎవరనేది తెలుస్తుంది. ఆత్మకూర్ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. పదో వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందిన జుబేదాబేగం, ఏడో వార్డు నుంచి విజయం సాధించిన నాగమణి ఈ పదవిని ఆశిస్తున్నారు. ఎవరనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కొత్తకోట మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు రిజ ర్వ్ కాగా.. పోతులపల్లి అరుణ శ్రీనివాస్ పేరు ను కాంగ్రెస్ నేతలు ఇదివరకే ప్రకటించారు. వైస్ చైర్మన్గా పి.పల్లవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కాగా.. ఎన్నికల ముందే నాగులపల్లి నరేందర్కు డిక్లేర్ చేశారు. వైస్ చైర్మన్గా మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు కేటాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోవర్దన్ రెడ్డి సతీమణి చింతల సరితకు అవకాశం దక్కనుంది. గత ఎన్నికల్లో చైర్మన్గా బెజ్జు సంగీత ప్రమాణ స్వీకార సమయంలో ఎక్స్ అఫీషియో ఓట్లతో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల్లో బీఆర్ఎస్కు పీఠం దక్కగా.. ఆమె చైర్మన్ కాలేకపోయారు. ఈసారి సైతం కౌన్సిలర్గా గెలుపొందిన ఆమె వైస్ చైర్మన్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అలంపూర్ చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ పీఠం బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉండగా.. ఆ పార్టీ నుంచి ఆరో వార్డులో గెలుపొందిన జయరాముడికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. వైస్ చైర్మన్ పీఠాన్ని ఆసిఫుద్దీన్ ఖాన్, మాధురితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికై న విక్రం ఆశిస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత, పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ భార్య కల్పన, పార్టీ సీనియర్ నాయకురాలు మంజుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు నడుస్తుండగా.. బీజేపీ శిబిరానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వచ్చి.. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎంపీ డీకే అరుణకు వదిలేసినట్లు తెలిసింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠం బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ ఏఐఎఫ్బీ నుంచి వడ్డేపల్లి శ్రీనివాసులు తరఫున బరిలో నిలిచి ఎనిమిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. వడ్డేపల్లి శ్రీనివాసులు కుమారుడు అజయ్కుమార్ తొమ్మిదోవార్డు నుంచి పోటీ చేయగా.. ఆయనే చైర్మన్ అభ్యర్థి అని భావించారు. కానీ అతడు ఓటమి పాలు కావడంతో ఈ పదవిపై సందిగ్ధత నెలకొంది. ఇదే ప్యానల్లో ఐదో వార్డులో గెలిచిన యుగంధర్ శ్రీనివాసులుకు స్వయానా తమ్ముడి కొడుకు కాగా.. ఆయన ఆశలు పెట్టుకున్నారు. నాలుగో వార్డు నుంచి గెలుపొందిన మంజుల సైతం పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి ఇచ్చినా ప్యానల్లో చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
హైవే నిర్మాణంతో జిల్లాకు మహర్దశ : మంత్రి
మక్తల్: మహబూబ్నగర్–గుడెబల్లూరు రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.3,174 కోట్లు మంజూరు చేసిందని.. ఇందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలందరం సీఎం రేవంత్రెడ్డిని కలిసి రహదారి విస్తరణకు వినతిపత్రాలు అందించామని.. డిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులను కలిసి మాట్లాడినట్లు చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటన ఫలితమే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని.. ఏప్రిల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. రహదారి నిర్మాణం హ్యామ్ పద్ధతిలో చేపట్టనున్నట్లు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీకేఆర్ ట్రస్ట్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, రవికుమార్యాదవ్, కట్టా సురేష్, కోళ్ల వెంకటేష్, శ్రీనివాసులు, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ప్రత్యేక పూజలు మక్తల్: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఎస్పీ డా. వినీత్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పూజరి తిప్పయ్యస్వామి వారిని శాలువాతో సన్మానించారు. ఎస్పీ వెంట సీఐ రాంలాల్, మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు నారాయణపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని.. వచ్చే వారం నుంచి యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. -
వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం
మండలంలోని పస్పులలో కృష్టానది ఒడ్డున వెలిసిన శ్రీవల్లభాపురం దత్తాత్రేయస్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో అలంకరించిన రథంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ ముందుకు లాగారు. ఈ సందర్భంగా రథోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తప్ప, కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మక్తల్ -
18న పీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్
మహబూబ్నగర్ న్యూటౌన్: అమ్నీల్ ఫార్మా జడ్చర్ల, ఆర్–టెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 18న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్లు పీయూ ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎన్ అర్జు న్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఫార్మ సీ, ఎంకామ్, ఎంబీఏ విద్యార్థుల కోసం ఫా ర్మసీ కళాశాల ఆడియోరియంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ విభాగాల్లో, ఆర్–టెక్ సొల్యూషన్స్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
మాయమాటలునమ్మి మోసపోవద్దు: ఎస్పీ
నారాయణపేట: గొలుసుకట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం చేసే వారు పెరుగుతున్నారని, ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు అంటూ ఆశ చూపుతారని, మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో మల్టీలేవెల్ మార్కెటింగ్పై దృష్టి సారించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రకటనలిస్తూ అమాయకులను ఆకర్షించి మోసగిస్తున్నారని పేర్కొన్నారు. చాలామంది విదేశాల్లో ఉండి రాకెట్లా నడుపుతారని.. భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట అమాయకులకు వల పన్నుతారని, మాయమాటలు నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని.. మోసపూరిత ప్రకటనలు, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. పాలమూరు 53వ డివిజన్పై హై‘డ్రామా’ ● ఒక్క ఓటుతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 60డివిజన్లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. అయితే 53వ డివిజన్ ఫలితాలపై అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. మొదటి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్కు 816, బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కింపు నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండు ఓట్లు పెరిగి 818కి, బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరగడంతో 819కి చేరింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యం సాధించాడు. మూడోసారి జరిగిన రీకౌంటింగ్లో కాంగ్రెస్కు 818, బీజేపీ 819 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ను గెలుపొందినట్లు కమిషనర్ రామానుంజులరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాతనే రమేష్ గెలుపొందినట్లు ప్రకటించారు. పాక్షిక శనిత్రయోదశి పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎత్తులు.. పొత్తులు!
–8లో uనారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. కోస్గి, మద్దూర్, మక్తల్లో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైంది. నారాయణపేట మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుందోననే చర్చ కొనసాగుతోంది. పేట కమలంలో మూడు ముక్కలాట.. నారాయణపేటలో 24 వార్డులుండగా.. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ వార్డులో బీజేపీ రెబల్ అభ్యర్థి జయశ్రీ విజయం సాధించడంతో ఆమె బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 12కు చేరింది. మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి 4వ వార్డు కౌన్సిలర్ కొండ శ్వేత ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తాను చైర్మన్ అభ్యర్థిగా రంగంలో దిగానని, ఆ సమయంలో అవకాశం దక్కలేదని.. ఈ సారి కచ్చితంగా ఇవ్వాలంటూ పార్టీ రాష్ట్ర నేతలతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్ తన సతీమణి 17వ వార్డు కౌన్సిలర్ కల్పనకు చైర్పర్సన్ అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. బీజేపీకి అండగా నిలుస్తూ వస్తున్న జీఆర్రెడ్డి తన సతీమణి 6వ వార్డు కౌన్సిలర్ మంజులను చైర్పర్సన్ చేయాలంటూ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ముందు వారి బలాబలాలు సైతం నిరూపించుకునేందుకు వెనుకాడటం లేదని సమాచారం. చైర్మన్ పదవి కోసం కమలంలో మూడు ముక్కలాట మొదలైందని.. ఎవరిని చైర్పర్సన్ చేస్తారోనని చర్చ కొనసాగుతుంది. ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడే వేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని చైర్పర్సన్ చేయాలని అనుకుంటున్నారోనన్న చర్చ కొనసాగుతోంది. ‘హస్త’గతానికి ప్రయత్నాలు.. పేట మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ బడా నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్కు 7, ఎంఐఎం 2, ఎఐఎఫ్బీ ఒకటితో కలిసి మొత్తం పది స్థానాలకు చేరుకుంది. బీఆర్ఎస్ మద్దతుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ మద్దతిస్తే బలం 12కు చేరుకుంటుంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్నీకారెడ్డి సైతం ఇక్కడే తన ఎక్స్ అఫీసియో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మనోహర్గౌడ్ సతీమణి 14వ వార్డు కౌన్సిలర్ అరుణ, 20వ వార్డు కౌన్సిలర్ శ్వేత, 15వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ బండి రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సింహం బలమెవరికో..? పేటలో రాజకీయ పరిణామాలు రెండ్రోజులుగా మలుపులు తిరుగుతున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైలెంట్గా ఉండటంతో తాము పీఠాన్ని అధిరోహించడమే తరువాయి అన్న ధీమాలో బీజేపీ ఉంది. 11వ వార్డులో ఏఐఎఫ్బీ పార్టీ తరఫున విజయం సాధించిన భాగ్యవతి ఓసారి కాంగ్రెస్కే మద్దతునిస్తుందని.. మరోసారి రూట్ మారుస్తుందనే చర్చ సాగుతుంది. దీంతో సింహం బలమెవరికో వేచి చూడాల్సిందే మరి. మిగతా మూడు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతం కావడం ఖాయమని తెలవడంతో చైర్మన్ అయ్యేందుకు అశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ఇలాకాలోని కోస్గి మున్సిపాలిటీలో నాగులపల్లి నరేందర్ పేరు వినిపిస్తోంది. మద్దూర్లో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. మక్తల్ మున్సిపాలిటీలో మంత్రి మదిలో ఎవరున్నారో తెలియక ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పేట కమలంలోమూడు ముక్కలాట స్వతంత్రుడి చేరికతో 12 స్థానాలకు చేరిన బీజేపీ ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తుచేసుకున్న ఎంపీ, ఎమ్మెల్యే హస్తగతానికి కాంగ్రెస్ ఎత్తుగడలు బీఆర్ఎస్ సైలెంట్.. ‘సింహం’ బలమెవరికో? మూడు మున్సిపాలిటీల్లో ఆశావహుల్లో ఉత్కంఠ -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజార్టీ లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. గద్వాల, పేట, అమరచింత, పెబ్బేరు, అలంపూర్లో కీలకం ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూ రులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజ కీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితు లు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్ లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరి ణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. అటు ఇటుగా ఒకరికొకరు.. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కారణాలతోనే.. ● నారాయణపేటలో 24 వార్డు స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్, ఎంఐఎం రెండు స్థానాల చొప్పున, ఏఐఎఫ్బీ, ఇండింపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. బీజేపీకి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలుకుతుండగా.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి బలం మ్యాజిక్ ఫిగర్ 13కు చేరుతుంది. కాంగ్రెస్కు ఎంఐఎం అభ్యర్థులు ఇద్దరు, ఒక ఏఐఎఫ్బీ అభ్యర్థి మద్దతు తెలుపుతుండగా.. వారి బలం పదికి చేరింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎక్స్ అఫీషియోగా ఓటు వేస్తే 11కు చేరనుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా బీజేపీ కట్టడి చేసే వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● గద్వాలలో మొత్తం 37 వార్డు స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. ఇద్దరు స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎంఐఎం అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ బలం 19కి చేరింది. అదే బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే వారి బలం 18కి చేరుతోంది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్రులనుతమ వైపునకు తిప్పుకునేలా ఆ పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ● పెబ్బేరు పుర పీఠం జనరల్కు కేటాయించడం.. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్గౌడ్, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే మేఘారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఐదు వార్డుల ను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ● అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. రసవత్తరంగా క్యాంప్ రాజకీయాలు నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు నారాయణపేటలో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
కౌంటింగ్ ప్రక్రియనుపరిశీలించిన ఎస్పీ..
కొత్తపల్లి/కోస్గి రూరల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ అన్నారు. శుక్రవారం ఆమె మద్దూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేల ఏర్పాటు, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమన్నారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, గెలిచిన అభ్యర్థులు సంయమనం పాటించాలని సూచించారు.● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
బీజేపీ విజయం ఖాయం
నారాయణపేట రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ ధీమా వ్యక్తంచేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షు డు సత్యయాదవ్తో కలిసి ఆయన మాట్లాడా రు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలిచారని.. ప్రజల ఆశీస్సులతో అనూహ్య ఫలితాలు సాధించబోతున్నామని అన్నారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, అమరచింత మున్సిపాలిటీలను కై వసం చేసుకోనున్నామని.. మిగతా మున్సిపాలిటీల్లో గణనీయమైన సంఖ్యలో వార్డు కౌన్సిలర్లను గెలుచుకుంటామ ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు విసిగి న ప్రజలు బీజేపీ వైపు నిలిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మీడియా ఇన్చార్జి కిరణ్ ఉన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి నారాయణపేట రూరల్: ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫ్యాకల్టీ ఈడీ మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జాజాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడో తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించడం.. రాయించడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న జరిగే ఎఫ్ఎల్ఎం పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లిష్లో ధారాళంగా చదవడం.. గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి భాషలో తప్పనిసరిగా చదవడం, రాయడం రావాలని సూచించారు. అనంతరం ధన్వాడ మండలం కన్సన్పల్లి, మరికల్ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్ఓ భానుప్రకాశ్, హెచ్ఎంలు అనురాధ, రజిత, బాలకృష్ణ ఉన్నారు. నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్ అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తా మని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నా రు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్ల తో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. -
పారదర్శకంగా ఓట్ల లెక్కింపు
కోస్గిరూరల్/కొత్తపల్లి(మద్దూర్): మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కిపును అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, మద్దూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. కోస్గి, మద్దూరులో 16 వార్డుల చొప్పున ఉండగా.. రెండు రౌండ్లుగా విభజించినట్లు తెలిపారు. మొదటి రౌండ్లో 1–8 వార్డులు, రెండో రౌండ్లో 9–16 వార్డుల ఓట్ల లెక్కింపునకు 8 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశామని వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం 1గంట వరకు పూర్తి ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. ● ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానంపై మద్దూరులో ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పలు సూచనలు చేశారు. ఓట్లను లెక్కించే సమయంలో పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు స్పష్టంగా చూయించి.. చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లు బాటు కాని ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఏదేని ఓటును చెల్లని ఓటుగా నిర్ధారిస్తే.. మళ్లీ ఆ ఓటును పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు ఏమైనా కారణాలతో లిఖిత పూర్వకమైన నోటీసు ఇస్తేనే రీ కౌటింగ్పై నిర్ణయం తీసుకోవాలని.. దీనిపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు విధులకు వచ్చిన ఉద్యోగులకు రాత్రి బస ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ప్రత్యేకాధికారి, డీఆర్డీఓ మొగులప్ప, ఎన్నికల అధికారులు నాగరాజు, శ్రీకాంత్, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ మేనేజర్ అనిల్కుమార్ ఉన్నారు. -
మూడంచెల భద్రత ఏర్పాటు : ఎస్పీ
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్రూం ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేని వ్యక్తులు స్ట్రాంగ్రూం, కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ఇతరులు పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లుతీసుకెళ్లడం నిషేధమన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మేరకు సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదన్నారు. మోడల్ కండక్ట్ కోడ్ ముగిసిన తర్వాత పోలీసుల అనుమతితో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటుచేసిన టేబుళ్లు, అభ్యర్థుల ఏజెంట్లకు కేటాయించిన స్థానాలు, మీడియా పాయింట్, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. లెక్కింపు ప్రక్రియ ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 550 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, పురుషోత్తం ఉన్నారు. -
77.96%
2020లో‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్ 78.48%2026లోసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూర్ మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగులాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది. 10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల అత్యధికంగా మక్తల్లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్ అమరచింతలో 2.89 శాతం మేర పైకి.. -
కౌంటింగ్కు సర్వం సిద్ధం
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 71 వార్డులకు ఎన్నికలు ● మక్తల్, కోస్గి, మద్దూరులో 2 రౌండ్లు, పేటలో 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను 71 వార్డుల్లో 90,301 మంది ఓటర్లు ఉండగా.. 66,859 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకో వడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం పాఠకులకు విదితమే. ఆ వార్డు మినహా మిగతా వార్టుల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మద్దూర్, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లో రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. నారాయణపేటలో 24వార్డులు ఉండడంటంతో మూడు రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఆర్ఓ, హాల్ సూపర్వైజర్లను నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల్లోని పీఎస్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగు టేబుళ్ల చొప్పున.. నారాయణపేట మున్సిపాలిటీలో రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో నాలుగు టేబుళ్ల చొప్పున ఏర్పాటుచేసి.. ఒక్కొక్క రౌండ్లో రెండు కౌంటింగ్ హాళ్లలో 8 వార్డుల లెక్కింపు పూర్తిచేయనున్నారు. మొదటి రౌండ్లో 1, 4, 7, 10, 13, 16, 19, 22 వార్డులు, రెండో రౌండ్లో 2, 5, 8, 11, 14, 17, 20, 23, మూడో రౌండ్లో 3, 6, 9, 12, 15, 18, 21, 24 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మాస్లైన్ జిల్లా నాయకుడు కాశీనాథ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ముందుగా స్థానిక మున్సిపల్ పార్కు వద్ద సభ ఏర్పాటు చేశారు. అనంతరం సావర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చి, కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను దివాలా తీయించేందుకు, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక పాలసీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్, నర్సింహ, శశికళ, శివకుమారి, బాలమణి, అనురాధ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహి స్తున్న కార్మిక సంఘాల నాయకులు -
మహ దేవప్ప కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
● రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య పాల్గొన్నారు. -
పోలింగ్ డే
ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలను సరిచూసుకుంటున్న అధికారులు నేడే పురపాలిక ఎన్నికల పోలింగ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికలకు ముందు రోజు వరకు అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. ఒకరి కన్నా మరొకరు పోటీపడుతూ అంచనాకు మించి ఖర్చు చేశారు. వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించారు. ఓటుకు రూ. 2 వేల నుంచి 4 వేల వరకు వెచ్చిస్తూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు పూర్తిచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీతో అభ్యర్థులు యథేచ్చగా ప్రలోభాలకు పాల్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితోమక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన -
మున్సి‘పోల్స్’కు రెడీ
● జిల్లాలో 71 వార్డులకు ఎన్నికలు ● 149 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు గాను 71 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి.. 181 మంది పీఓలు, 181 మంది ఏపీఓలు, 538 మంది ఓపీఓలను నియమించారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. అధికారులు, సిబ్బంది మంగళవారమే ఎన్నికల సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణపేటలో 35,460, కోస్గిలో 20,248, మక్తల్లో 23,345, మద్దూర్లో 12,701 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని గు రుకుల బాలికల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచే సిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎ లాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలన్నారు. చెక్లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా.. లేదా అనేది జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడి న బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్రూం, కౌంటింగ్ హాళ్లను సైతం కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఉన్నారు. నేడు సాధారణ సెలవు నారాయణపేట: సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు పోలింగ్ రోజున ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకొని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. -
పాలమూరులో అధికార పాలి‘ట్రిక్స్’
● మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో రాజకీయ దుమారం ● తెరపైకి కోస్గిలో కౌన్సిలర్ ఆశావహులపై బెదిరింపుల పర్వం ● మహబూబ్నగర్లో పోలీసుల డేగకన్నుతో ప్రతిపక్ష అభ్యర్థుల కట్టడి ● కొల్లాపూర్, అలంపూర్లో సైతం ఇవే పరిస్థితులు ● ఎన్నికల కమిషన్కు అందిన ఫిర్యాదు ప్రధానంగా అమాత్యులఇలాకాల్లోనే.. -
క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్
నర్వ: గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణాన్ని వెలికితీసేందుకే సీఎం కప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి అన్నారు. సోమవారం పాథర్చేడ్ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మక్తల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించి.. క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో ఆత్మకూర్ ప్రథమ, ఊట్కూర్ ద్వితీయ, ఖోఖోలో కృష్ణా ప్రథమ, మక్తల్ అర్బన్ ద్వితీయ, కబడ్డీలో మక్తల్ అర్బన్ మొదటి, అమరచింత ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగం వాలీబాల్ పోటీల్లో ఊట్కూర్ ప్రథమ, మక్తల్ అర్బన్ ద్వితీయ, ఖోఖోలో మక్తల్ అర్బన్ ప్రథమ, ఊట్కూర్ ద్వితీయ, కబడ్డీలో నర్వ ప్రథమ, మక్తల్ రూరల్ ద్వితీయ స్థానాలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి, కాలేరు సురేష్, సర్పంచ్ లింగమ్మ, హెచ్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు సెలవు
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా స్థానిక సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు నారాయణపేట: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.వినీత్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జలాల్పూర్ ఎరగ్రుట్ట చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానాన్ని స్వయంగా పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర అనుమానాస్పద వస్తువుల తరలింపును కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్పోస్ట్ వద్ద సిబ్బంది సంఖ్య పెంచి తనిఖీలను మరింత కఠినంగా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతున్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడమే పోలీస్శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు నరేశ్ ఉన్నారు. సమస్యలపరిష్కారానికి కృషి నారాయణపేట రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ నిర్విరామంగా కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి.. యూనియన్ బలోపేతానికి కృషిచేసిన విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు కృషి చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పీఆర్పీ, డీఏ బకాయిలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, వెంకటరెడ్డి, రఘువీర్, జనార్దన్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్, సూర్యప్రకాశ్, గోపాల్రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, రమేశ్శెట్టి పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలవండి
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సభలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, అన్వర్సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పోలింగ్
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రి య పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందు కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లు, ఎన్నికల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం మున్సిపల్ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్/రిసెప్షన్ సెంటర్లలో పోలింగ్ సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ పూర్తయిందన్నారు. 99 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామన్నారు. పోలింగ్ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని.. మధ్యా హ్న భోజనం ముగించుకుని ఎవరికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారు వెళ్లిపోవాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని వసతి సౌకర్యాలు కల్పి ంచాలని కమిషనర్లను ఆదేశించారు. పోలింగ్ ఆఫీసర్స్ గుర్తింపు కార్డులు, పోలింగ్ ఏజెంట్ల పాసులు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలన్నారు. ఈ నెల 11న ఎన్నికల నియమ నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్లకు తరలించి.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూముల్లో భద్రపరచాలన్నారు. 13న కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులంతా బాధ్యతగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. 16న చైర్మన్ ఎన్నిక.. ఎన్నికై న కౌన్సిలర్లు, ఎక్స్ఆఫీషియో సభ్యులకు నోటీసులు జారీచేసి 16న చైర్మన్ ఎన్నిక నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా కోరం లేకపోతే.. ఒక గంట సమయం ఇవ్వాలన్నారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజు చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లు చేతులు ఎత్తే ప్రక్రియను పూర్తిగా వీడియో, ఫొటో చిత్రీకరణ చేయించాలన్నారు. చైర్పర్సన్ ఎన్నికై న తర్వాత వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ప్రత్యేకాధికారులు రాజేందర్గౌడ్, రామచందర్ నాయక్, మొగులప్ప, జాన్ సుధాకర్, సుధాకర్రెడ్డి ఉన్నారు. -
వలస ఓటర్లే కీలకం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు, కౌన్సిల్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపునకు వలస ఓటర్లే కీలకం కానున్నారు. ఏ వార్డు ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లా లోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా 18 మున్సిపాలిటీల్లోనూ వలస ఓటర్లు అ ధికంగా ఉన్నారు. అయితే జడ్చర్ల, అచ్చంపేట మినహా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూ త్పూర్, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్, అమరచింత, ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండటంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్ల కోసం పరుగులు పెడు తున్నారు. పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవ ధి మాత్రమే ఉండటంతో హైదరాబాద్, బెంగళూర్తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన వారితో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం వెళ్లిన వారి జాబితా పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో వెయ్యి నుంచి 3, 4 వేల మంది వరకు వలస ఓటర్లు ఉండటంతో అభ్యర్థుల విజయ అవకాశాలపై వీరు ప్రభావం చూపనున్నారు. దీంతో అభ్యర్థుల తరుఫున కొందరు వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి ఓటు వేసేందుకు రావాల్సిందిగా బతిమిలాడుతున్నారు. వీరిని రప్పించేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే వాహనాలను సమకూర్చుతున్నారు. ఒకరిద్దరు ఉంటే బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. కుల సంఘాలకు గాలం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం కుల సంఘాలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదని తెలిసినా గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆలయాలు కట్టిస్తామని, ఇళ్లు, పింఛన్లు ఇప్పిస్తామని, శుభ కార్యాలకు సహకారం అందిస్తామంటూ కుల సంఘాల ఓటర్లకు గాలం వేస్తున్నారు. మీ వార్డులకు సీసీ రోడ్లు, మురుగు కాల్వలు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు రాబట్టేందుకు కొన్ని సాధ్యం కాని పనులు కూడా చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇతరులు తమ మద్దతుదారులను బరిలో నిలిపారు. వారి గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు కుల సంఘాలను కలుస్తూ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటున్నారు. అలాగే వార్డులు, కులాల వారీగా అవసరమైన డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావితం చేసేది వీరే జీవనోపాధి కోసం వెళ్లినవారి ఓట్ల కోసంనేతల ప్రయత్నాలు వాహనాలు, బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కార్మికులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగానే వలస జీవులు -
పోలింగ్పై నిశిత పరిశీలన జరపాలి
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు పక్కాగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ.. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో బాధ్యతలు కేటాయించనున్నట్లు చెప్పారు. పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై మైక్రో అబ్జర్వర్లకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు 9 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా? లేదా అనేది పరిశీలించాలని.. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందా? లేదా అనేది నిశిత పరిశీలన చేయాలని.. గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలన్నారు. టెండర్, చాలెంజ్ ఓటింగ్ జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ తీరు తెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని.. ఎక్కడ పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని.. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా.. ఇతరులు ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, మున్సిపల్ ప్రత్యేకాధికారులు రాజేందర్గౌడ్, సుధాకర్రెడ్డి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతో రాత్రికి రాత్రే శంకుస్థాపనలు
మక్తల్: నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే తనకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే శంకుస్థాపనలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. 30 ఏళ్ల కాలంలో మక్తల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి వాకిటి శ్రీహరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి హయాంలోనే భీమా ప్రాజెక్టు సాధించి.. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మక్తల్కు భారీగా నిధులు మంజూరుచేసి.. అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రమే 60శాతం నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి మాట్లాడటం సరైంది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో కొండయ్య, ఇన్చార్జి అమరనాథ్, రాజశేఖర్రెడ్డి, నర్సింహ, బాలరాంరెడ్డి, భాస్కర్, కర్నిస్వామి పాల్గొన్నారు. -
మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మారుస్తాం
మక్తల్: మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంరతం అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి.. పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని ఓటర్లను కోరారు. ఇప్పటికే మక్తల్లో రూ. 25కోట్లతో మినీ స్టేడియం, రూ. 15కోట్లతో సీసీరోడ్లు, రూ. 210 కోట్లతో మక్తల్–పేట రోడ్డు విస్తరణ, రూ. 43కోట్లతో 150 పడకల ఆస్పత్రి, రూ. 2కోట్లతో తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు డిగ్రీ కళాశాల, కోర్టు, రిజిస్ట్రార్ కార్యాలయం, 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా దుస్థితికి చేరిన పడమటి ఆంజనేయస్వామి ఆలయ కోనేరును ఆధునికీకరించినట్లు చెప్పారు. పట్టణంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు 340 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మక్తల్ – పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో 35వేల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, కట్ట సురేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న కిడ్నీ సమస్య బాధితులు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల ప్రజలు కిడ్నీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని.. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి వైద్య బృందంతో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా మండలాల్లో నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ మండలం మంతన్గోడ్, ఎర్నాగునపల్లి, కాట్రేవ్పల్లి, నర్వ మండలం రాయికోడ్, జక్కన్నపల్లి, పాతర్చేడ్లో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండువేల జనాభా లేని కాట్రేవ్పల్లిలో కిడ్నీ సమస్యతో పదేళ్లలో పదిమందికి పైగా మృతిచెందారని, డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఐదుగురు, డయాలసిస్కి చేరువలో 15 మంది ఉన్నారని సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ.రెండు వేలు ఇచ్చి, మక్తల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకొనే ధోరణిలో ఉందని, వెంటనే ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఆయా మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలని సూచించారు. ఆయా మండల కేంద్రాల్లో వారానికి రెండుసార్లు నెఫ్రాలజిస్ట్ను అందుబాటులో ఉంచాలని, డయాలసిస్ సెంటర్ సామర్థ్యం పెంచి రోగులకు నెలకు రూ.12 వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు దిలీప్, తాళ్ల రోహిత్, సభ్యులు శ్రీధర్, వెంకటనారాయణ , బొల్లి ఆదాంరాజు ఉన్నారు. -
పుర ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
అమరచింత: పురపాలికల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలో కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచార రోడ్షోలో వారితో పాటు కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ఆయా పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించమని తెలిపారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడమే గాకుండా పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మక్తల్, ఆత్మకూర్, అమరచింత పురపాలికలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయ మన్నారు. అమరచింతలో సీపీఎం మద్దతుతో అధికారం చేపడతామని.. అమరచింత పీహెచ్సీని ఆధునికీకరించి నిరంతర వైద్యసేవలతో పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు.. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ప్రజల్లో మత విధ్వేషాలు రెచ్చగొట్టడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి రైతులు, రైతు కూలీలకు ఉపాధిని దూరం చేస్తోందని ఆరోపించారు. మతోన్మాద పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కాంగ్రెస్పార్టీతో కలిసి పుర బరిలో నిలిచామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కరించుకునే వీలుందని వివరించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కత్తి వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, విష్ణు, లక్ష్మీకాంత్రెడ్డి, తౌఫిక్, సీపీఎం నాయకులు ఎండీ జబ్బార్, రమేష్, అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
సమస్యలు పట్టవా..
రాజకీయ నాయకులకు మా సమస్యలు పట్టవా. సొసైటీకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా బకాయిలు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ చేయకపోవడం దారుణం. ఇకనైనా పట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. – శ్రీనివాస్, చేనేత కార్మికుడు.. పోరుబాట తప్పదు.. ఈసారి మా సమస్యలు పరిష్కరించకపోతే గాంధీనగర్లో ఉన్న చేనేత కార్మికులందరం పోరుబాట పట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. – బాలరాజు, చేనేత కార్మికుడు -
ఎన్నాళ్లు ఎదురుచూడాలి..
1951లో ఏర్పడిన చేనేత సహకార సంఘంలో మొదట 4,265 మంది సభ్యులుంటే ప్రస్తుతం కేవలం 72 మందికి మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు అందరికి కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఇందుకోసం 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. – వెంకటేష్, చేనేత కార్మికుడు నారాయణపేట ఎడ్యుకేషన్: ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించి చేనేత కార్మిక సంఘంలో సభ్యత్వం కల్పిస్తామని ప్రతిసారి ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇస్తున్నారే తప్ప నేటికి నెరవేర్చే నాయకుడు కరువయ్యారని స్థానిక గాంధీనగర్ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 4,265 మంది సభ్యులున్న సొసైటీలో ప్రస్తుతం కేవలం 72 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుత నాయకులైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహించిన చర్చావేదికలో పలువురు కార్మికులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇదీ సమస్య.. జిల్లాకేంద్రంలో చేనేత సహకార సంఘం 1951లో ఏర్పడింది. అప్పట్లో 4,265 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మిక సొసైటీ తరుఫున గాంధీనగర్కాలని నిర్మించారు. 104 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు చేనేత సామగ్రి పంపిణీ చేశారు. ఇందుకుగాను కార్మికుల నుంచి ప్రతినెల రూ.5 చొప్పున రూ.2,475 వసూలు చేశారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధరను 35 ఏళ్ల కిందటే లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లింపు పూర్తి చేశారు. అయినా నేటికీ సొసైటీ నిర్వాహుకులు ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. -
రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలు
నర్వ: మండలంలోని పాతర్చేడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నుంచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్ నియోజకవర్గస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ కన్వీనర్, ఎంఈఓ రాంరెడ్డి, క్రీడల ఇన్చార్జ్, పీడీ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్వహించే సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలన్నారు. ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడాపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మక్తల్, మక్తల్ అర్బన్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ, ఆత్మకూర్, ఆత్మకూర్ అర్బన్, అమరచింత మండలాల్లో ఎంపికై న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు సోమవారం ఉదయం 9 వరకు మైదానానికి చేరుకోవాలని సూచించారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత ఒప్పందం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు -
ఈవీఎం గోదాంపై నిరంతర నిఘా
నారాయణపేట: ఈవీఎం గోదాం భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. నెలవారీ తనిఖీలో భాగంగా శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను ఆయన తనిఖీ చేశారు. వీవీ ప్యాట్స్, ఈవీఎంల భద్రత, ఎంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, గోదాం చుట్టూ ప్రహరీ, సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారిణి జయసుధ, రాణిదేవి ఉన్నారు. -
పకడ్బందీగా భూ సర్వే
కోస్గి రూరల్: పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములను రక్షించేందుకు, పక్కాగా పర్యవేక్షణ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ భారతిలో భాగంగా భూ సర్వే చేపట్టిందని ఏడీ ల్యాండ్ సర్వే వేణుగోపాల్రెడ్డి అన్నారు. గ్రామ నక్షాలు సక్రమంగా లేని గ్రామాల్లో సర్వే నిమిత్తం జిల్లాలోని నారాయణపేట, నర్వ, కోస్గి మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. అందులో భాగంగా శనివారం మండలంలోని కొత్తపల్లిలో భూ సర్వేపై అవగాహన కల్పించారు. మొదటి విడతలో ప్రభుత్వ భూమి, రోడ్లు, చెరువులు, కుంటలు సుమారు 72 ఎకరాల సర్వే చేపడతామన్నారు. రెండోవిడతలో 1,160 ఎకరాల పట్టాదారుల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. 30 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టనున్నారని వివరించారు. సర్వేకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, అప్పుడే 100 శాతం లక్ష్యం పూర్తవుతుందన్నారు. సర్వేయర్తో పాటు ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్.సుభాష్, సర్వేయర్ అరుణ, కృష్ణ, గ్రామపంచాయతి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
102, 108 వాహన సేవలు భేష్
మక్తల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 102, 108 వాహనాలు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని, వాహనాలు బాగా పని చేస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కె.రవి తెలిపారు. శనివారం పట్టణంలోని వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. 102 అమ్మ ఒడి వాహనాలను గర్భిణుల వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చడానికి, ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సినేషన్కు వినియోగించాలని సూచించారు. నయాపైస ఖర్చు లేకుండా 102, 108 వాహనాలు ఇళ్ల దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ పి.సునీల్కుమార్, టెక్నీషియన్ ఆంజనేయులు, పైలెట్లు శివశంకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పేట పురపాలికపై గులాబీజెండా ఎగరాలి
● మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ నారాయణపేట: తెలంగాణ ఉద్యమ నేత.. తొలి సీఎం కేసీఆర్ బాటలో నడుస్తూ నారాయణపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల ప్రగతిలో పరుగులు పెట్టించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డికి దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం మహిమూద్ అలీ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డితో కలిసి 7, 8, 11, 12, 13, 18, 19, 23, 24 వార్డులో అభ్యర్థులతో ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసారి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. రెండేళ్ల రేవంత్ సర్కార్లో ప్రజలెవరూ మనశ్శాంతిగా జీవించడం లేదని.. ప్రజాపాలన అని చెప్పుకొనే సీఎం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలవడం లేదన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి 420 ప్రభుత్వంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఎస్.రాజేందర్రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పునాదులు పడుతాయన్నారు. ఆయనను ఈసారి మంత్రి హోదాలో ఈ ప్రాంత ప్రజలు చూడడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఎస్ఆర్ రెడ్డి జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తించారు. -
ఫైనల్లో పోరాడి ఓడిన మహిళా జట్టు
● రన్నరప్గా నిలిచిన పాలమూరు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ మహిళాజట్టు ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జట్టు ఫైనల్లో చివరి ఓవర్ వరకు పోరాడి రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో వరంగల్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పో యి 98 పరుగులు చేసింది. జట్టులో సాయి ధ్రువిజ్ఞ 38 పరుగులు చేసింది. మహబూబ్నగర్ బౌలర్లు త్రివేణి 3, అక్షర రాథోడ్, ఇందు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మ హబూబ్నగర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగుల వద్దే నిలిచిపోయింది. జట్టులో ఆర్యాని (30), ఇందు (18) మాత్రమే రాణించారు. -
‘పది’ ఫలితాల్లో జిల్లా ర్యాంకు పెంచాలి
● ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ముఖ్యమైన కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాల మెరుగు, మౌలిక వసతుల కల్పన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ పరీక్షల వివరాలు, విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల స్థాయి, బలహీనంగా ఉన్న అంశాలు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మెరిసేలా సమష్టి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం పాఠశాలల వారీగా తెలుసుకొని అసంపూర్తి పనులు, వాటి గడువు తదితర అంశాలపై సమీక్షించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎఫ్ఎల్ఎస్, ఎఫ్ఎల్ఎన్ సర్వేల అమలుపై చర్చించి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనస్థాయిని నిరంతరం గమనిస్తూ అవసరమైన అకాడమిక్ ఇంటర్వెన్షన్లు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల సన్నద్ధతే ఎఫ్ఎల్ఎన్ విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తూ వంద రోజుల పఠనోత్సవం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, భాషాపరమైన నైపుణ్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఆయా కార్యక్రమాలు నిర్దేశిత విధంగా అమలు కావాలని సూచించారు. అలాగే కేజీబీవీలు, పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి సదుపాయా లు, తరగతి గదులు, ఇతర సివిల్ వర్క్స్ పనుల పురోగతిని సమీక్షిస్తూ విద్యార్థులకు అనుకూలమైన, శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, సంగీత, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన పథకం కో–ఆర్డినేటర్ యాదయ్య పాల్గొన్నారు. -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. -
‘పది’ విద్యార్థులకుప్రణాళిక
నర్వ: పదోతరగతి విద్యార్థుల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఇన్చార్జి తహసీల్దార్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ కోరారు. శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 విద్యాశాఖ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ సమకూర్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై హెచ్ఎంలతో సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీఓ రమేష్కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, క్లస్టర్ హెచ్ఎం సునీత తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,441 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.10,259, కనిష్టంగా రూ.5,219 ధర పలికింది. అదేవిధంగా శనగలు రూ.5,441, ఆలసందలు గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.6,012, ఎర్ర కంది రూ.8,512– రూ.5,591, తెల్ల కంది గరిష్టంగా రూ.8,512, కనిష్టంగా రూ.6,032 ధరలు లభించాయి. బీజేపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బూత్స్థాయిలో బాధ్యతగా పని చేయాలని, మరో 4 రోజులు కష్టపడితే ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశ దొరుకుతుందని జాతీయ మహిళ కమిషన్ మాజీ చైర్పర్సన్ రేఖశర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి ప్రజలు ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారని, కొద్దిగా కష్టపడితే ఈ ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని తెలిపా రు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ 4 రోజులు కొంత శ్రద్ధ పెంచాలన్నారు. ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్చార్జి చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, పవన్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో టీజీఎంఐఎస్డీసీ ఏజెన్సీ చేపట్టిన పలు అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. మక్తల్లో రూ.34 కోట్లతో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు, జిల్లాకేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పక్కన 90 శాతం పనులు పూర్తయిన హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆమె చూశారు. రూ.8.50 కోట్లతో చేపట్టిన హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో తలుపులు, కిటికీలు, ఇతర ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం చుట్టూ ప్రహరీ, సీసీ రహదారి, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులు నెలలోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రూ.26 కోట్లతో నారాయణపేట మండలం అప్పక్పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మదర్, చైల్డ్ హాస్పిటల్) పనులను పరిశీలించారు. నర్సింగ్ కళాశాల రెండు బ్లాకులలో నిర్మాణంలో ఉన్న స్టడీ హాల్, డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్ బ్లాక్, మీటింగ్ హాల్ పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, భవనం చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ఆయన వెంట టీజీఎంఐఎస్డీసీ ఈఈ వేణుగోపాల్, చేనేత జౌళిశాఖ అధికారి సాయిబాబా, ఏఈ సాయి మురారి తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. మక్తల్, నారాయణపేట, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆయా పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో ఈ నెల 7, 8న ఓటు వేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు పుర కమిషనర్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం నోడల్ అధికారి, డీఏఓ జాన్ సుధాకర్(సెల్నంబర్ 63036 17267)ను సంప్రదించాలని కోరారు. -
ఇన్చార్జి తహసీల్దార్గా శిక్షణ కలెక్టర్
నర్వ: మండల ఇన్చార్జి తహసీల్దార్గా శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 వారాల పాటు ఇన్చార్జ్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానన్నారు. శనివారం జంగంరెడ్డిపల్లిలో నిర్వహించే గ్రామసభలో భూముల సర్వేపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కోస్గి రూరల్: పుర ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన భద్రత చర్యలు చేపడుతున్నామని సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని శివాజీ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, బాహర్పేట, రామాలయం, మున్నూరువాడ, తెలుగువీధి, వినాయకనగర్లో భారీ బలగాలతో ఆ యన ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేసినా.. డబ్బు, మద్యం, ఉచిత వస్తువులు వంటి ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నా రు. కార్యక్రమంలో భీంకుమార్, ఎస్ఐలు బా లరాజు, విజయ్కుమార్ తదితరులు ఉన్నారు. రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మొగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
మక్తల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
మక్తల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పుర ఎన్నికల్లో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేశవనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పట్టణంలో రూ.43 కోట్లతో 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు చేపడుతున్నామని చెప్పారు. పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషోద్దీన్, ఎండీ సలాం, కట్టా సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఊట్కూర్: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని తహసీల్దార్ చింత రవి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్–14 బాలల సాఫ్ట్బాల్ ఎంపికలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది బాలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు భవిష్యత్లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు త్వరలో మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిశోర్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, పీడీ సాయినాథ్, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, బాలరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అండర్–15 రెజ్లింగ్ పోటీలు.. ధన్వాడ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా రెజ్లింగ్ (కుస్తీ) పోటీల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. గ్రామీణప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు ఎంతగానో దోహదపడుతాయని ఎంఈఓ గాయత్రి అన్నారు. పెద్దసంఖ్యలో క్రీడాకారులు తరలిరావడంతో ఈ ప్రాంతంలో కుస్తీ పోటీల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్కుమార్, పీడీ నెల్సన్కుమార్, కోచ్ శ్రీనివాస్నాయక్, బాలాజీసింగ్నాయక్ తదితరులు తెలిపారు. -
ఆట మొదలైంది..!
● పాచికలతో అధికార పార్టీ వ్యూహాలు ● ఎత్తుకు పైఎత్తులో ప్రతిపక్షాలు ● ఎవరి మధ్య పోటీ.. అభ్యర్థులపై సర్వేలు ● రంగంలోకి దిగిన రేవంత్ సైన్యం నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్నందున అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తూ అభ్యర్థుల కదలికలు, ప్రచారంపై ఓ బృందం కన్నేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడంలో అధికార పార్టీకి కత్తిమీద సాముగా మారింది. నామినేషన్ల మొదలు ఉపసంహరణ సమయం ముగిసే వరకు జాగ్రత్తపడినా అధికార పార్టీకి అసంతృప్తులు తలనొప్పిగా మారారు. వార్డులను ఏకగ్రీవం చేయాలనుకున్నా సాధ్యపడకపోవడంతో కొత్త వ్యూహాలకు తెర తీసింది. సీఎం ఇలాఖాలోని కోస్గిలోని 4వ వార్డుకు చెందిన భానునాయక్ను ఏకగ్రీవం చేయాలని మొదటి నుంచి వ్యూహాలు చేసినప్పటికీ.. అశావహులైన శ్రీనివాస్, రామునాయక్ను ప్రతిపక్షాలైనా బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దింపి బీ ఫారాలు సైతం ఇచ్చాయి. ఆ ఇద్దర్ని ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి శుక్రవారం కాంగ్రెస్ కండువాలు కప్పడంతో వాతావరణం వేడెక్కినట్లయింది. పేటలో స్వతంత్ర అభ్యర్థి సరెండర్.. నారాయణపేటలో కాంగ్రెస్పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సరిత భట్టడ్కు చెందిన జువెల్లరీ దుకాణంలో సెల్స్ మేనేజర్ బుగ్గప్ప 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అతడిని తప్పిస్తేనే ఆ వార్డులో కాంగ్రెస్పార్టీకి ఇబ్బందులు ఉండవని భావించి శుక్రవారం సరెండర్ చేసుకుంది. తాను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పడం చూస్తుంటే అధికార పార్టీ ఎన్నికల వ్యూహం ఏ తరహాలో కొనసాగుతుందో అర్థమవుతోంది. రంగంలోకి రేవంత్ సైన్యం.. జిల్లాలోని అన్ని పురపాలికల్లో అధికార పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి సైన్యం రంగంలోకి దిగింది. మున్సిపాలిటీలు హస్తగతం కాకపోతే జిల్లాలో సీఎం ఓడినట్లేనని ముందస్తుగా భావించిన అధికార పార్టీ ప్రతిపక్షాల పాచికలను పసిగడుతూ వ్యూహరచన చేస్తున్నాయి. ఎవరి మధ్య పోటీ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థుల గెలుపోటములపై ఎవరికి వారే సర్వేలో నిమగ్నమయ్యారు. ఓ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తునే మరోవైపు తమ అనుచరులతో ప్రజల నాడి పట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సిట్టింగ్ కౌన్సిలర్లు.. కొత్తగా పోటీచేస్తున్న వారు. ఏయే పార్టీ అభ్యర్థులు ఎంత మంది గెలుస్తారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలను అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం తమ అధినేతలకు పంపిస్తున్నారు. మక్తల్, పేటలో బీజేపీకి పట్టు.. గత మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో బీజేపీకి బడా లీడర్లు, క్యాడర్ ఉండటంతో కై వసం చేసుకున్నట్లు అధికార పార్టీ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. 2020లో నారాయణపేటలో బీఆర్ఎస్, మక్తల్లో బీజేపీ, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయితే నారాయణపేట పుర చైర్పర్సన్ గందె అనసూయ తన అనుచరులతో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూటికి చే రింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్వేలో మక్తల్, నారాయణపేటలో బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలువబోతున్నట్లు తేలనుండటంతో జీర్ణి ంచుకోలేక చేయి దాటకముందే పసిగట్టి ప్రతిపక్షాల ను సెల్ఫ్అవుట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మద్దూర్లోబీఆర్ఎస్ గట్టి పోటీ.. కోస్గి పురపాలికలో హస్తం హవా కొనసాగుతుండగా.. మక్తల్, నారాయణపేటలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మద్దూర్లో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో అధికారపార్టీ కంటే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ సైన్యం కారుకు బ్రేకులేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. నాలుగు మున్సిపాలిటీలు హస్తగతం అవుతాయా.. లేదో వేచి చూడాల్సిందే మరి. -
నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. -
నైపుణ్యాల మెరుగుతోనే ఉపాధి అవకాశాలు
కోస్గి రూరల్: ప్రస్తుత సమాజంలో పోటీ తీవ్రంగా ఉన్నందున విద్యార్థులు ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. గురువారం పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి టెక్ఫెస్ట్–2026 నిర్వహించగా.. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, పెబ్బేరు, వడ్డేపల్లి కళాశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక ఆలోచనలు, సృజనాత్మకత పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ప్రథమ స్థానం, మహబూబ్నగర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలవగా.. ధ్రువపత్రాలు అందజేశారు. వీరు రాష్ట్రస్థాయి టెక్ఫెస్ట్లో పాల్గొననున్నారని చెప్పారు. ప్రదర్శనను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు తిలకించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన బృందం కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ కోర్సు ప్రారంభానికి అవసరమైన తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. కార్యక్రమంలో వసుంధరరాణి, ప్రవీణ్కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
వికసిత భారత్ కేంద్ర లక్ష్యం
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట/కోస్గి రూరల్/కొత్తపల్లి: గ్రామీణ పేదల అభ్యున్నతితో పాటు ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం కోస్గి, మద్దూర్ పురపాలికల్లో నిర్వహించిన పుర ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తన సొంత నియోజకవర్గంలో కూడా నెరవేర్చలేదన్నారు. రుణాలు ఎక్కడా లభించడం లేదని స్వయంగా ఆయనే చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ బియ్యం వంటి వాటికి నిధులు మంజూరు చేస్తోందని వివరించారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడలేదని, పేదల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2047 నాటికి వికసిత భారత్ రూపకల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో సుమారు రూ.55 వేల కోట్లతో హైస్పీడ్ రైల్ కారిడార్ను మంజూరు చేసిందని.. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే, చైన్నెకి నడువనున్నాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లిం సోదరులకు చేసిందేమీ లేదని.. ఓట్ల కోసం మత రాజకీయాలు చేపడుతుందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రధాని అభివృద్ధిలో ముందుకుసాగుతున్నారని వి వరించారు. కోస్గి, మద్దూర్ పురపాలికల అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని.. పురపాలికలపై బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు రాజవర్ధన్రెడ్డి, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూమికి హద్దులతో భూ ఆధార్
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: భూములకు ఆధునిక సాంకేతికతో కచ్చితమైన హద్దులు, నిర్దిష్టమైన కొలతలు నిర్ణయించి రైతులకు భూ ఆధార్ ఇచ్చేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో గుర్తించిన మూడు గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి ఏడీ సర్వే ల్యాండ్, తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీసర్వేకు నారాయణపేట మండలం శేర్నపల్లి, నర్వ మండలం జంగంరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలను ఎంపిక చేసిందని చెప్పారు. శేర్నపల్లిలో 1,567 ఎకరాలు, జంగంరెడ్డిపల్లిలో 1,500 ఎకరాలు, కొత్తపల్లిలో 1,167 ఎకరాలు రీ సర్వే చేసి ఆయా గ్రామాలకు సరిహద్దులు, శివార్లు, ప్రభుత్వ భూములు, రోడ్లు, భవనాలు, అటవీ, దేవాదాయ, శిఖం భూములను గుర్తించి పూర్తిస్థాయి మ్యాపులను రూపొందించాల్సి ఉంటుందన్నారు. రీసర్వేకు ముందురోజు ఆయా గ్రామాల్లో టాంటాం వేయించాలని, గ్రామసభ నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యాలయాల్లో పట్టాదారుల వివరాలు ప్రదర్శించాలన్నారు. శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో రీసర్వే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, సర్వే ల్యాండ్ ఏడీ వేణుగోపాల్, కోస్గి, నారాయణపేట తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, అమరేంద్ర కృష్ణ, సర్వేయర్లు పాల్గొన్నారు. ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి.. జిల్లాలో ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఏఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించామని.. ప్రతి ఏఈఓ 25 ఎకరాలు సాగు చేయించాలని, సర్పంచులకు సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఏడాది లక్ష్యం చేరుకోకపోవడంతో వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా లోని నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా, మరికల్, ధన్వాడ, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి, మద్దూర్ సాగుకు అ నుకూలమని.. రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఉద్యాన అధికారి సాయిబాబా, ఆయిల్ఫెడ్ అధికారులు, కో–ఆపరేటివ్ అధికారులు ఆంజనేయులు పాల్గొన్నారు. -
నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించాలి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి -
కేజీబీవీని సందర్శించిన జీసీడీఓ
ఊట్కూర్: మండలంలోని పులిమామిడిలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం జీసీడీఓ సంగీత సందర్శించారు. పాఠశాల, జూనియర్ కళాశాల రికార్డులను తనిఖీ చేసి తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని ఎస్ఓ లక్ష్మిని ఆదేశించారు. ఆమె వెంట సీఎంఓ రాజేంద్రకుమార్, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు దివ్యాంగుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తోందని.. వారికి సంక్షేమ ఫలా లు సకాలంలో అందిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్పీఆర్డీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా ప్రధానకార్యదర్శి కాశప్ప, జిల్లా సహాయ కార్యదర్శులు బాలరాజు, బస్వరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఖతల్, పెంటయ్య, నరేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల రద్దు సరికాదు : సీఐటీయూ నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి తెస్తూ 2025, నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన బిల్లులు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల హక్కులు హరించే విధంగా చట్టాలను రూపొందిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో కార్మికుల అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, జిల్లా కార్యదర్శి బండమీది బాలరాం, ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకుడు నరహరి తదితరులు పాల్గొన్నారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ కీలకం
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు ర్యాండమైజేషన్ ప్రక్రియ అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోలింగ్ సిబ్బంది కేటాయింపులో భాగంగా బుధవారం కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసిన అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించారు. మొత్తం 72 వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 20 శాతం రిజర్వుతో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 362 మందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ సమావేశంలో ఎస్పీ డా.వినీత్కుమార్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం బ్లాక్ స్పాట్స్ వద్ద చేపట్టాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణపేట, మక్తల్, మరికల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద మూడేళ్ల కాలంలో 101 రోడ్డు ప్రమాదాలు జరిగి 64 మంది ప్రాణాలు కోల్పోయ్యారని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. కాగా, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న పాఠశాలల వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసేలా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ గోవిందరాజులుకు కలెక్టర్ సూచించారు. క్షత్రగాత్రులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్ను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఓ మెంబర్ పోషల్ రాజేష్, డిపో మేనేజర్ లావణ్య తదితరులు ఉన్నారు. ● జిల్లాలో అర్హత లేని వైద్యులు స్కానింగ్ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్కు సూచించారు. జిల్లాలో తక్కువ జెండర్ రేషియో (నిష్పత్తి) ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి (0–6 ఏళ్ల) జెండర్ రేషియో పెంచాలని సూచించారు. మూడేళ్ల క్రితం ఎక్కువ ఉన్న రేషియో.. ఈ ఏడాది తక్కువ కావడంపై కారణాలను విశ్లేషించాలన్నారు. రెండోసారి స్కానింగ్ తర్వాత మళ్లీ స్కానింగ్కు రాని గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కాగా, 2024–25లో (955/1000), 2025–26లో (927/1000) జెండర్ రేషియో నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ, డీఎస్పీ లింగయ్య, ఐఎంఏ ప్రెసిడెంట్ మల్లికార్జున్, సీఐ శివశంకర్ ఉన్నారు. ● జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి 3,500 ఎకరాల ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని సాధించాలని.. అందులో భాగంగా ఈ నెలలో 500 ఎకరాల సాగు కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్పాం సాగు పురోగతిపై కలెక్టరేట్లో ఆమె సమీక్షించారు. లక్ష్య సాధన కోసం జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ అధికారులు, టీజీ ఆయిల్ఫెడ్ మేనేజర్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్సుధాకర్ ఉన్నారు. -
మిగిలింది 5 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్ పోరుతో ఆందోళన.. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. వార్డులవారీగా ఇన్చార్జిలకు బాధ్యతలు.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పార్టీ నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వార్డులో ఉన్న ఓటర్లలో కులాల వారీగా ఉన్న ఓట్లపై దృష్టి పెట్టి గంపగుత్తగా ఓట్లను పొందేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది. మహిళా ఓట్లకు గాలం.. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు వార్డులవారీగా పార్టీ ఇన్చార్జిలకు బాధ్యతలు అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం గద్వాల, మహబూబ్నగర్లో రెబల్స్ పోరుతో ఆందోళన -
క్రీడాభివృద్ధికి కృషి
ధన్వాడ: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి అన్నారు. మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేపట్టిన రెజ్లింగ్ కోర్టు నిర్మాణ పనులను బుధవారం డీఈ యశ్వంత్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రెజ్లింగ్ కోర్టు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు. వారి వెంట పీడీ సాయినాథ్, రవికుమార్ ఉన్నారు. టీజీ–ఐపాస్తో పరిశ్రమల స్థాపనకు అనుమతులు నారాయణపేట: టీజీ–ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీ–ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం వివిధ శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. సకాలంలో ఆమోదించాలన్నారు. టీ–ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు 50 పరిశ్రమలకు దరఖాస్తు చేసుకోగా.. 36 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు డిజిల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలోని ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను డీఈఈటీలో నమోదయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్, ఐపీఓ పి.నర్సింహారావు, తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ నవీన్కుమార్, డీపీఓ సుధాకర్రెడ్డి, ఆర్టీఓ మేఘాగాంధీ, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు. పెసర క్వింటా రూ.7,221 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్యార్డులో బుధవారం పెసర క్వింటాకు రూ. 7,221 ధర పలికింది. వేరుశన గ గరిష్టంగా రూ. 8,406, కనిష్టంగా రూ. 4, 050,ఉలవలు రూ. 3,529, అలసందలు రూ. 6,192, వడ్లు (సోన) రూ. 2,460, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,469, కనిష్టంగా రూ. 6,255, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,669, కనిష్టంగా రూ. 7,980 ధరలు పలికాయి. -
సెమీస్కు పాలమూరు మహిళల జట్టు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్నగర్ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్ (46 నాటౌట్), ఆర్యాని (25 నాటౌట్)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్నగర్ జట్టు సెమీఫైనల్లో ఖమ్మం జట్టుతో తలపడనుంది. -
అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఎవరూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు, టీఎస్ఎస్పీ బెటాలియన్తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్.. పాత బస్టాండ్, మెయిన్ చౌక్, సరఫ్ బజార్, పల్లా హనుమాన్ టెంపుల్, జంగిడిగడ్డ, మసుమల్లి దర్గా, అంబా భవాని టెంపుల్, మహంకాళి టెంపుల్, సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. ఫ్లాగ్ మార్చ్లో సీఐ శివశంకర్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఎస్ఐలు నరేష్, వెంకటేశ్వర్లు, రాముడు, కృష్ణ చైతన్య, రాజు, గాయత్రి, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యంతో ఇబ్బందులు..
రాష్ట్ర సరిహద్దు సమీపంలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం కావడం విచారకరం. ఈ ప్లాంట్తో మండల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. మేము నిత్యం కృష్ణానదిలోని నీటిని తాగేందుకు, పంటల సాగుకు ఉపయోగిస్తున్నాం. ఇక మీదట ఆ నీరు కలుషితమైతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. – గజ్జి శాంతమ్మ, సర్పంచ్, గుడెబల్లూర్ ప్రమాదం పొంచి ఉంది.. రాష్ట్ర సరిహద్దుకు 3–4 కి.మీ. దూరంలో ఏర్పాటుచేస్తున్న అణువిద్యుత్ కేంద్రంతో మన ప్రాంతానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కలుషిత వ్యర్థాల కారణంగా వాతావరణం, నదీ జలాలు కలుషితమవుతాయి. దీన్ని మొదట్లోనే వ్యతిరేకిస్తే కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. – నర్సింహులు, ముడుమాల్ ●


