breaking news
Narayanpet District News
-
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం
కోస్గి రూరల్: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ.. దోపిడీ ఎక్కువ జరుగుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం పుర కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. రేడియల్ రోడ్లు, సాగునీటి కాల్వలు, ఇండస్ట్రియల్ కారిడార్లో రూ.వందల కోట్ల గోల్మాల్ జరిగిందన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో కాంగ్రెస్ నాయకుల భూములుంటే పక్కకు తప్పిస్తున్నారని, పేదల భూములు మాత్రం నిర్ధాక్షిణ్యంగా లాక్కుంటున్నారని మండిపడ్డారు. గుట్టల తవ్వకాలు, ఇసుక, ఎర్రమట్టి తరలింపులో రెవెన్యూ, పోలీస్ అధికారులను ఉంచి దోపిడీ చేస్తున్నారని.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.100 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించి నీటివసతి పెంచితే కాంగ్రెస్ నాయకులు చెక్డ్యాంలోని ఇసుకను విక్రయించి ప్రభుత్వ ఆదాయనికి గండికొడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుకపై రూ.7 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చితే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లుకు చేర్చిందని, అందుకు ప్రజాప్రతినిధులే కారణమన్నారు. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు పుర, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. 2న కొడంగల్, 3న కోస్గిలో రైతు సమస్యలు, భూ నష్ట పరిహారంపై రైతులతో చేపట్టే ధర్నాకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్ హాజరుకానున్నారని చెప్పారు. 4న మద్దూర్లో మహిళా సమస్యలు, వంటావార్పు, 5న దౌల్తాబాద్ మండలంలో విద్యార్థుల సమస్యలపై నిరసన, 6న బొంరాస్పేటలో పచ్చదనం, పల్లెల కార్యక్రమం, 7న అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణిలో ఫిర్యాదులు, 8న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహాలకు వినతులు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఇన్చార్జి వెంకటనర్సింహులు, సాయిలు, శ్యాసం రామకృష్ణ, పోషప్ప, మహిపాల్, పకీరప్ప, ఆశప్ప, గోపాల్, దినేష్, చికినె అంజయ్య, నర్సింహులు, మధుసూదన్రెడ్డి, తిరుపతి, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
నారాయణపేట: వెనుకబడిన విముక్త జాతుల సమగ్ర అభ్యున్నతికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సూచించారు. విముక్త జాతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విముక్త జాతులకు చెందిన కుటుంబాలను గ్రామస్థాయిలో గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి వారి సమస్యలు, అవసరాలను గుర్తించాలని, ఇందుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు, రేషనన్ కార్డులు, గృహ వసతి తదితర ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు అర్హత ఉన్న వారికి ఇతర సంక్షేమ పథకాలను అందించాలని అధికారులకు సూచించారు. విముక్త జాతుల కుటుంబాలకు విద్య, వైద్యం వంటి మౌలిక రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి భీమేష్, నాయకులు ఎనుముల వెంకటేష్, మందుల శేఖర్, మద్దూరు భీములు, చంద్రశేఖర్, లోకుర్తి రాజు, జిల్లాకు చెందిన వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
పడమటి అంజన్న హుండీ లెక్కింపు
మక్తల్: పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును సోమవారం ఆలయంలో నారాయణపేట డివిజన్ పరిశీలకుడు శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ప్రాణేష్చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.8,80,186 సమకూరినట్లు ఈఓ నిత్యానందం తెలిపారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిబ్బంది అరవింద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట ఎడ్యుకేషన్: ఇన్స్పైర్ అవార్డుల దరఖాస్తునకు సెప్టెంబర్ 15 వరకు గడు వు ఉందని.. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు నామినేషన్లు నమోదు చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాల ని డీఈఓ గోవిందరాజు కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలోని టీఎస్డబ్ల్యూఎస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్స్పైర్ అవార్డ్స్ 2026–27 గురించి జిల్లా సైన్స్ అధికారి అవగాహన కల్పించారు. జిల్లాలోని యాజమాన్య, యూపీఎస్, హైస్కూల్స్ పాలొ ్గనవచ్చని.. సంబంధిత వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు నామినేషన్ చేసుకోవచ్చని.. ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్ట్ను క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. ఈ అవార్డులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉంటాయని.. జాతీయస్థాయికి ఎంపికై న అవార్డు విద్యార్థుల ఖాతాలో రూ.10 వేలు జమ అవుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు www.inspireawards-dst.gov.in వెబ్సైట్ను లేదా జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్ (సెల్నంబర్ 94401 67947) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: టీచర్స్ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరో గ్యం మెరుగుపడుతుందన్నారు. రిజిస్ట్రార్ రమే ష్బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పొడిగింపా.. నియామకమా?
–8లో uనారాయణపేట: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీ కాలం పొడిగింపు కోసం పైరవీ.. కొత్త పదవుల కోసం లాబీయింగ్.. ఇప్పు డు ఇదే హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా నారాయణపేట మార్కెట్ పాలకవర్గం పదవీకాలం ముగియడానికి కేవలం 16 రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి రాజుకుంది. ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తుందా..? లేక కొత్త పాలకవర్గాలకు అవకాశం కల్పిస్తుందా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పదవీకాలం పొడిగింపుపై ఆశలు పెట్టుకున్న పాత సభ్యులు తమ రాజకీయ ప్రయత్నాలను వేగవంతం చేస్తుండగా.. కొత్త కమిటీలు వస్తే పదవులు దక్కించుకోవాలని ఆశావహులు అప్పుడే లాబీయింగ్కు తెర లేపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. శివన్న బర్త్డే కానుకగా పదవి.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం అప్పట్లో రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి మేనమామ, డీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి జన్మదినం సందర్భంగా 2024, సెప్టెంబర్ 16న మార్కెట్ కమిటీ చైర్మనన్గా ఆర్.శివారెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే పాలకవర్గం పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో సభ్యుల్లో టెన్షన్న్ మొదలైంది. పుట్టినరోజు కానుకగా వచ్చిన పదవి.. గడువు ముగిసే వేళ రాజకీయ పరీక్షగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మక్తల్ గడువు.. డిసెంబర్ వరకు... మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా అయిన మక్తల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం మాత్రం డిసెంబర్ వరకు కొనసాగనుంది. దీంతో నారాయణపేట, కోస్గి మార్కెట్ కమిటీల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మక్తల్ మార్కెట్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మూడు మార్కెట్ కమిటీలకు వేర్వేరు గడువులు ఉండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. కోస్గి గడువు వచ్చే నెల 3 వరకు.. జిల్లాలోని కోస్గి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం కూడా అక్టోబర్ 3తో ముగియనుంది. దీంతో అక్కడ కూడా పదవుల పొడగింపుపై ఆశలు కొనసాగుతున్నాయి. మార్కెట్ చైర్మన్ మద్ది భీములుతో పాటు పాలకవర్గ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పదవీకాలం పొడగింపు, భవిష్యత్పై వినతులు సమర్పించినట్లు సమాచారం. ఇంకా సమయం ఉందని.. తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీల విషయంలో ఒకేసారి నిర్ణయం తీసుకుంటుందా..? లేక ఒక్కో కమిటీ పరిస్థితిని బట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. సమీపిస్తున్న మార్కెట్ పాలకవర్గాల పదవీ కాలం పేటకు 16 రోజులు.. కోస్గికి అక్టోబర్ 3 వరకు గడువు మంత్రి ఇలాకా మక్తల్కు డిసెంబర్ వరకు.. ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు పదవి నిలుపుకొనేందుకు పాత సభ్యుల పైరవీలు -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికే 75 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్పై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలోనే మరో 33 మందికి పైగా ఉపాధ్యాయులను ఫారిన్సర్వీస్పై పంపేందుకు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉండగా.. మిగిలిన వారు డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారు. బీఈడీకి 10, డైట్కు 12 మంది ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క బీఈడీ కళాశాల, ఒక డైట్ కళాశాల ఉంది. ఇందులో అధ్యాపకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. బీఈడీ కళాశాలలో ఉన్న ఏకై న రెగ్యులర్ పోస్టు గోవిందరాజులు నారాయణపేట ఇన్చార్జి డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైట్ కళాశాలలో రెండు రెగ్యులర్ పోస్టులు ఉండగా ఇటీవల మహబూబ్నగర్ డీఈఓగా విధులు నిర్వ హించిన రవీందర్ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్లో ఉన్నారు. మరో పోస్టులో ప్రస్తుత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరాజుల్లాఖాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండు కళాశాలల్లో పోస్టుల భర్తీకి సీబీటీ పరీక్ష నిర్వహించి ఈ నెల 6వ తేదీన బీఈడీ కళాశాలకు, 7వ తేదీన డైట్ కళాశాలకు ఇంటర్వ్యూ, డెమోలు నిర్వహించారు. బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏడాది కాలానికి ఫారిన్ సర్వీస్పై విధులు కేటాయించనున్నారు. గతంలో తా త్కాలికంగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కొందరి డిప్యూటేషన్లు రద్దు చేసి.. తాజాగా ఎంపికై న వారికి అవకాశం కల్పించనున్నారు. ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పా ఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనకు ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉండగా.. అ నుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయించడంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండటంతో వారి స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే వి ద్యార్థులకు సబ్జెక్టు బోధనలో నష్టం జరిగే ప్రమా దం ఉంది. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపే అవకాశం ఉన్నా.. సబ్జెక్టు నిపుణులైన స్కూల్ అసిస్టెంట్ల స్థానాన్ని తాత్కాలిక ఏర్పాట్లతో భర్తీ చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. అయినా ఇతర విధులకు కేటాయింపు బీఈడీ, డైట్ కళాశాలలకు 22 మంది.. డీఈఓ కార్యాలయాల్లో మరికొందరు ఉమ్మడి జిల్లాలో 75 మందికిపైగా ఫారిన్ సర్వీస్లో.. 81 మంది మానిటరింగ్ టీంల్లో.. అనుభవజ్ఞులైన స్కూల్ అసిస్టెంట్లను బోధనేతర విధులకు పంపడంపై విమర్శలు మహబూబ్నగర్ జిల్లాలో 33 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్లో ఉండగా.. వీరిలో 22 మంది బీఈడీ, డైట్ కళాశాలల్లో, మిగతా వారు డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో ఆరు చొప్పున, మిగతా జిల్లాల్లో ఐదు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. -
సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేయాలి : ఎస్పీ
నారాయణపేట: నూతన కార్యవర్గం పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఈ నెల 25న పోలీసు అధికారుల సంఘం సభ్యుల ఎంపిక పూర్తికాగా.. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సుధాకర్ (హెడ్ కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా శివశంకర్ (పేట సీఐ), శివశంకర్ (ఆర్ఎస్ఐ), కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా మురళీకృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా లక్ష్మీనారాయణ (హెడ్ కానిస్టేబుల్), ట్రెజరర్గా రాజు (కానిస్టేబుల్), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శ్రీదేవి (హెడ్ కానిస్టేబుల్), యాదయ్య, పరంధాములు, శ్రీనివాసులు, రమేష్, మహేష్ (కానిస్టేబుల్స్) ఎన్నికయ్యారు. కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాదకబాదకాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను సంఘం ప్రతినిధులు తన దృష్టికి నేరుగా తీసుకురావచ్చని తెలిపారు. సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా పోలీస్శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సిబ్బంది సంక్షేమం, ఐక్యత, సమన్వయం కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలీస్శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా లేదా చట్టవిరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘం కార్యకలాపాలు పోలీస్శాఖ నిబంధనలు, చట్టపరమైన పరిధిలోనే కొనసాగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, డీఎస్పీ మహేష్, సీఐలు రాంలాల్, సైదులు, భగవంత్రెడ్డి, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు
నారాయణపేట: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియ ఉద్దేశం అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కాదని.. అవసరమైన ఆధారాలతోవారి వివరాలను ధ్రువీకరించడమేనని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా అనంతరం గుర్తించిన అనామలీస్, నాన్లింక్డ్ కేసులను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీలో అవసరమైన ఆధారాలతో హాజరయ్యేలా బీఎల్వోలు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆమోదించిన డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి ఓటరు సమర్పించినప్పుడు సంబంధిత పత్రాలను పరిశీలించి ఆనన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వివాహం, వలస, కుటుంబ వివరాల్లో మార్పులు, తల్లిదండ్రుల డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడం వంటి ప్రత్యేక కేసులను నిబంధనల ప్రకారం విడివిడిగా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికీ ఆన్లైన్లో లింక్ చేసుకునే అవకాశం ఉన్న నాన్ లింక్డ్ కేసులను సంబంధిత ఓటర్లకు తెలియజేసి వెంటనే ప్రక్రియ పూర్తి చేయించాలని ఆదేశించారు. క్లిష్టమైన కేసులను ప్రత్యేకంగా గుర్తించి ఉన్నతాధికారుల మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా ఓటరు జాబితా సవరణను పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎన్నికల విభాగం అధికారి జయసుధ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ సలీం, రాఘవ చౌదరి, రాములు, వెంకట్రామారెడ్డి, కెంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 5 ఫిర్యాదులు అందగా పరిష్కారం కోసం సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సిఫారస్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అర్జీని బాధ్యతగా పరిశీలించాలని, పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు ప్రాధాన్యం : ఎంపీ
నారాయణపేట: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆదివారం పుర పరిధిలోని 8వ వార్డు సత్యసాయికాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రహదారులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కాలనీల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయని, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, ఓబీసీ మోర్చా నాయకులు రఘురామయ్య, వైస్ చైర్మన్ మంజుల జీఆర్రెడ్డి, కార్పొరేటర్ కిరణ్కుమార్రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణ, గోపాల్యాదవ్, సీనియర్ నాయకులు ఉదయభాను, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి : ఎస్పీ నారాయణపేట: జిల్లా యువత, విద్యార్థులు క్రీడలు, ఫిట్నెస్ వైపు దృష్టి సారించాలని.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్లో ఆయనతో పాటు డీసీఆర్బీ డీఎస్పీ మహేష్ పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని.. సీఐలు, ఎస్ఐలు, సిబ్బందికి లాంగ్ రన్నింగ్, సైక్లింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కొంత సమయం వ్యాయామం, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, ధ్యానం కోసం కేటాయించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే రోజువారీ పనులను మరింత ఉత్సాహంతో సమర్థవంతంగా నిర్వహించగలమన్నారు. -
హామీల అమలుకు పోరాడుదాం
కొత్తపల్లి: హామీల అమలుకు పోరాట లక్ష్యంతో ముందుకు సాగాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మద్దూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రెండో పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ప్రకటించాలని, మేనిఫెస్టోలో ప్రకటించిన మాటకు కట్టుబడి సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓనంబర్ 317 ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. హామీల అమలుకై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు నిర్వహించే మహాధర్నాలో ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మద్దూరు మండల అధ్యక్షుడు భాస్కర్, ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, వివిధ మండలాల ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. ‘చేనేత’ ధర్నాను విజయవంతం చేయాలి నారాయణపేట ఎడ్యుకేషన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 9న జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాకు నేతన్నలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బురిడివాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేనేత కార్మికులను కలిసి మాట్లాడారు. పట్టణంలోని చేనేత కార్మికులకు గత ప్రభుత్వం మగ్గాలిచ్చి ముడి సరుకు సరఫరా చేయకపోవడంతో మూలకు పడ్డాయని.. కార్మికులకు సొసైటీలో సభ్యత్వం కల్పించి నేతన్న బీమా పథకం అమలు చేయాలన్నారు. ముడి సరుకు బయటి మార్కెట్లో కొనుగోలు చేయడానికి బ్యాంకుల ద్వారా కనీసం రుణాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేక ఫించన్ అందక చేనేత సొసైటీతో తమకు ఎలాంటి లాభం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సొసైటీల్లో 2009 నుంచి 2026 వరకు రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారని.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకుడు నారాయణ, బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గం ఇన్చార్జ్ అశోక్, సీపీఎం నాయకులు కాశప్ప, నరహరి, సోఫీ, జనసేన జిల్లా నాయకుడు విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఆరాధనోత్సవాలు నారాయణపేట: జిల్లాకేంద్రంలోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. రెండోరోజు ఆదివారం మ ధ్యారాధన సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజ ల్లో అర్చకుల వేద్రమంత్రోచ్ఛారణలతో ఆల యం మార్మోగింది. పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన రాఘవేంద్రస్వామిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. హరిదాసుల భక్తి సంకీర్తనల మధ్య గోపాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక, అనంతశయన, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్వాన్ అనిల్ దేశాయి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతి ఒక్కరూ దైవచింతనతో సన్మార్గంలో నడుస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సింహచారి, శక్తిపీఠం స్వామి శాంతానంద పురోహిత్, రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు రఘుప్రేమ్, భీంసేన్రావు, నర్సింహ, శేషు, ఆనందరావు, మంజునాథ్ జోషి, సీతారామరావు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: గ్రామాల్లో భేధాభిప్రాయాలు ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందని.. సమష్టిగా కలిసి ముందుకు సాగితేనే పురోగతి సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని జౌళాపూర్ సర్పంచ్ మహదేవమ్మతో పాటు పలువురు వార్డుసభ్యులు బీజేపీ నుంచి కాంగ్రెస్పార్టీలో చేరగా.. నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించి శాలువాలతో సన్మానించి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రూ.276 కోట్లతో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 68 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రతి పేదవాడికి 6 కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బ్యారేజ్ల నిర్మాణం ద్వారా జిల్లా సాగు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో మక్తల్–నారాయపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని.. రూ.100 కోట్లతో ముంపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామన్నారు. ఆత్మకూర్–గద్వాల నడుమ కృష్ణానదిపై వంతెన నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలు మా రుతున్నాయని వివరించారు. పదవులు శాశ్వతం కాదని.. అభివృద్ధి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్గౌడ్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, పాల కృష్ణ పాల్గొన్నారు. -
వాయిదాల పర్వం
కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. పాడైపోయిన మోటార్లు.. కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టును ఎల్లూరు సమీపంలోని రేగుమాన్గడ్డ వద్ద నిర్మించారు. ఈ లిఫ్టులో 5 మోటార్లు ఉండగా.. నాలుగు మోటార్లతో నీటి పంపింగ్ చేపట్టి, ఒక మోటార్ను స్పేర్లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 2012 సెప్టెంబర్లో కేఎల్ఐ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అదే నెలలో ఎయిర్ ఫ్రెషింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పంపు మోటార్లు పాడవగా.. వెంటనే వాటికి మరమ్మతు చేశారు. 2014 సెప్టెంబర్లో 5వ నంబర్ పంపు మోటార్లోకి నీళ్లు చేరి పాడైంది. తర్వాతి కాలంలో మరో పంపు మోటార్ కూడా మరమ్మతుకు గురైంది. మూడున్నరేళ్ల క్రితం నిధులు.. కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్ఐ ద్వారా నీటి లిఫ్టింగ్ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు. పాడైన మోటార్లు 2 కేఎల్ఐ మోటార్ల మరమ్మతుఈ సీజన్ కూడా ఆగాల్సిందే ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగితే కేఎల్ఐ ప్రాజెక్టుకు కొంత విరామం ఇవ్వాలనుకున్నాం. అయితే పలు కారణాలతో అది సాధ్యపడటం లేదు. తాగునీటి అవసరాల కోసం రెగ్యులర్గా కేఎల్ఐ ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నాం. కాబట్టి పాడైన మోటార్ల మరమ్మతుకు ఇంకా కొంతకాలం ఆగక తప్పదు. – లోకిలాల్నాయక్, నీటిపారుదల శాఖ ఈఈ -
అర్హుల ఓట్లు గల్లంతు కానివ్వొద్దు
నారాయణపేట: ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీవీఆర్ భవన్లోని డీసీసీ కార్యాలయంలో ఎస్ఐఆర్ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ రెండో దశకు శ్రీకారం చుట్టిందని.. ఈ నేపథ్యంలో బీఎల్వోల ద్వారా నోటీసులు అందుకున్న ఓటర్లు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. నోటీసులు అందిన వారు తప్పనిసరిగా సంబంధిత వివరాలను పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాలు, పత్రాలను జత చేసి నిర్ణీత గడువులోగా బీఎల్వోలకు అందజేయాలని కోరారు. ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పేట నియోజకవర్గంలో 72,861 మంది ఓటర్లకు, మక్తల్లో 73,815 మంది ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి నోటీసులు అందినట్లు తెలిపారు. వీరంతా ప్రత్యేక ఫారాల ద్వారా తమ వివరాలను నమోదు చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు కాంగ్రెస్పార్టీకి చెందిన బీఎల్ఏలు పూర్తి సహకారం అందించాలన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సంఘాన్ని నాలుగు వారాల అదనపు గడువు కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం గడువును పొడిగించాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, డీసీసీ కోశాధికారి మనోహర్ ప్రసాద్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్గౌడ్, డీసీసీ కార్యదర్శి వెంకట్రాములు చారి తదితరులు పాల్గొన్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి ● అలంపూర్ క్షేత్రంలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రారంభం అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారు లు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు ఫుడ్ కోర్టు, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన జోగుళాంబ, గద్వాల రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పను లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ● ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయ విశిష్టతను తెలయజేస్తూ, మల్టీ మీడి యా సౌండ్, లైట్ షో ప్రదర్శన ఏర్పాటు చేయ డం ద్వారా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, టూరిజం అండ్ కల్చరల్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్ర సాద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కా ర్పొరేషన్ ఎండీ గౌతమి, గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యకు శ్రీకారం
–8లో uకోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్ర భుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్ ల్యా బ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభు త్వం తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సాంకేతిక విద్యపై పట్టుకు.. ప్రభుత్వం చేపట్టిన పలు సర్వేల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేని కారణంగా నైపుణ్యాలకు దూరమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్వాలా ద్వారా ఐఐటీ, జేఈఈ, ఖాన్ అకాడమీ ద్వారా క్లాట్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మరోవైపు గతేడాది ప్లాట్ ప్యానల్ బోర్డులను సైతం ప్రభుత్వం అందించడంతో కళాశాలల్లో డిజిటల్ బోధన జరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించి విద్యార్థులు పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో కళాశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించాలని, త్వరితగతిన నిర్మాణాలు చేసేందుకు ఆ యా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేయాలని అధ్యాపకులతోపాటు విద్యార్థులు కోరుతున్నారు. ‘జూనియర్’ విద్యార్థులకు కంప్యూటర్ బోధన మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక ల్యాబ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు దశల వారీగా అన్ని కళాశాలల్లో.. -
ప్రతిభకు ప్రోత్సాహం..
● ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల ఉపకార వేతనం ● దరఖాస్తునకు సెప్టెంబర్ 1 వరకు అవకాశం ● జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 582 మంది మాత్రమే దరఖాస్తు నారాయణపేట ఎడ్యుకేషన్: పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికిగాను అర్హత పరీక్ష ప్రకటన ఇప్పటికే విడుదల కాగా.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనుంది. నవంబర్ 1న జిల్లాకేంద్రంలో ఎంపిక పరీక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. అర్హతలు.. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 2025–26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులున్నా సరిపోతుంది. 2026–27 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరిస్తూ బోనాఫైడ్ ఇవ్వాలి. గురుకులాలు, రెసిడెన్షియల్, నవోదయ, కేంద్రీయ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనర్హులు. ఎంపిక విధానం.. రాష్ట్రస్థాయి పరీక్ష ఆధారంగా మెరిట్ సాధించిన విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. మొత్తం రెండు పేపర్లు నిర్వహిస్తారు. మొదటిది మెంటలబిలిటీకి సంబంధించినది.. ఇందులో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండోది స్కాలాస్టిక్ అప్టిట్యూట్ టెస్ట్. 7, 8వ తరగతి గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 180 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. ● ఏటా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికవుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అదేవిధంగా గత విద్యా సంవత్సరం 5,153 మంది 8వ తరగతి విద్యార్థుల్లో 867 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. ఈ విద్యా సంవత్సరం కేవలం 582 మంది మత్రమే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. జాజాపూర్ ఉన్నత పాఠశాలలో మాదిరి పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్) జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులు (ఏడాది వారీగా..) విద్యార్థులు స్వయంగా కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ప్రింట్, అవసరమైనా ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత జిల్లా విద్యాధికారికి సమర్పించాలి. మరింత సమాచారం కోసం https://www.bse.telangana.gov.in/ NMMS.aspx వెబ్సైట్ను సంప్రదించాలి. -
ఎఫ్ఎల్ఎన్తో విద్యా ప్రమాణాలు మెరుగు
నారాయణపేట: నాణ్యమైన బోధన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నిరంతర ఉపాధ్యాయ మద్దతు, లక్ష్యాధారిత అభ్యసనం అనే నాలుగు సూత్రాలతో జిల్లాను ఎఫ్ఎల్ఎన్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు సమక్షంలో మండల విద్యాధికారులు, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో జిల్లాస్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం కార్యక్రమాలను నాణ్యమైన రీతిలో అమలు చేసినప్పుడే విద్యార్థుల విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంపొందించగలమన్నారు. పాఠశాలల పర్యవేక్షణ కేవలం గణాంకాలు, సందర్శనల సంఖ్యకే పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచే విధంగా జరగాలని స్పష్టం చేశారు. బోధన, అభ్యసన పరంగా వెనుకబడిన పాఠశాలలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఎఫ్ఎల్ఎన్ ఎన్రిచ్మెంట్ పిరియడ్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతి సందర్శనలో తరగతి గది పరిశీలన, విద్యార్థుల అభ్యసన స్థాయి అంచనా, ఉపాధ్యాయులతో అకాడమిక్ చర్చలు, అవసరమైన తక్షణ మార్గదర్శకత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలల విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ఉపాధ్యాయుల సాధారణ సెలవులను ముందస్తు అనుమతితోనే మంజూరు చేయాలన్నారు. ఒకే సమయంలో 10 నుంచి 15 శాతానికి మించి సిబ్బంది సెలవుల్లో ఉండకుండా ప్రధానోపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు మాట్లాడుతూ.. విద్యార్థుల పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలుగు, ఆంగ్లం భాషల్లో టైమ్డ్ రీడింగ్ ప్రాక్టీస్ను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. గణితంలో మూడేళ్లుగా అభ్యసన సాధన స్థాయి మెరుగుపడుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బోధనా ప్రక్రియలో టీచర్ హ్యాండ్బుక్స్, స్టూడెంట్ వర్క్బుక్స్, అలైన్మెంట్ షీట్స్ను తప్పనిసరిగా వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాలలో రోజుకు కనీసం 30 నిమిషాల లైబ్రేరీ పీరియడ్ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల రచనా సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి భాషా నైపుణ్యాలను మెరుగుపర్చాలన్నారు. ఎంఈఓ, జీహెచ్ఎం, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సమన్వయంతో పనిచేసి ప్రతి చిన్నారిలో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన సామర్థ్యాలను సాధించేలా కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. -
పంటల నమోదులో జాప్యం తగదు : డీఏఓ
మరికల్: డీసీఎస్లో పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని.. ఈ విషయంలో అధికారులు ఎలాంటి జాప్యం చేయకూడదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. శనివారం మండలంలోని తీలేర్, మరికల్లో కొనసాగుతున్న పంట వివరాల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటల బుకింగ్ సమయంలో రైతులు సాగు చేసిన పంటలను సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు ఎరువుల బుకింగ్ విధానంపై ఆరా తీశారు. రైతులు అవసరానికి మించి ఎరువులను వినియోగించొద్దని.. భూసార పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా సమతుల ఎరువులను వినియోగించాలని కోరారు. ఆయన వెంట ఏఓ రహమాన్, ఏఈఓ వహీదా బేగం తదతరులు ఉన్నారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ శనిదోష నివారణార్థం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర వేద మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు. -
ప్రారంభమైన రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
నారాయణపేట: పట్టణంలోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో శనివారం ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. మహా నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం నిర్వహించిన భజన సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్మీ శోభన భజన బృందం భక్తిగీతాలు ఆలపించారు. ఉత్సవాల్లో భాగంగా పల్లకీసే నిర్వహించారు. పూలతో అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. సత్యనారాయణ కమాన్ సమీపంలో లయన్స్క్లబ్, రాఘవేంద్ర సేవాసమితి సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సిహాచారి, అనిల్ దేశాయ్, హరీశ్ ఆచార్య, రఘుప్రసాద్ జోషి, రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు, లయన్న్స్క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం : ఎస్పీ
నారాయణపేట: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని, పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైన సందర్భాల్లో సంఘటనా స్థలంలోనే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాపరిధిలోని పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెనన్స్ నిర్వహించి మాట్లాడారు. బాధితుల పట్ల బాధ్యతాయుతంగా, మానవీయ కోణంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులుంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని.. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించాలని, అవసరాన్ని బట్టి అక్కడికక్కడే ఫిర్యాదు నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గాయపడిన బాధితులు, చిన్నారులు, మైనర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు, దూరప్రాంతాల్లో నివసించే బాధితులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బాధితులు పోలీస్స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, అవసరమైన సేవలను వారి వద్దకే తీసుకెళ్లేలా పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితుల భద్రత, గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు పోలీసుశాఖపై మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత నారాయణపేట ఎడ్యుకేషన్: రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం చిన్న పిల్లల ఆస్పత్రి ఫీడర్, సివిల్–1 ఫీడర్ మరమ్మతులు చేపడుతున్నామని ఏఈ మహేష్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పనుల కారణంగా ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని.. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారులు అంతరాయానికి సహకరించాలని పేర్కొన్నారు. ఓబీసీ కమిటీల పునర్నిర్మాణానికి దరఖాస్తులు నారాయణపేట: డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్ ఆధ్వర్యంలో ఓబీసీ కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం డీసీసీ కార్యాలయం సీవీఆర్ భవన్లో జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో దరఖాస్తులు, అర్హులైన నాయకుల పేర్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ పరిశీలకుడు కోట్ల చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఓబీసీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణంపై నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఓబీసీ చైర్మన్ పదవితో పాటు మండల ఓబీసీ అధ్యక్షుల నియామకాలకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే టౌన్ ఓబీసీ అధ్యక్షులు, టౌన్ కమిటీలు, మండల, గ్రామస్థాయి ఓబీసీ కమిటీల ఏర్పాటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఓబీసీ కమిటీల పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలో నియమించాల్సిన అర్హులైన నాయకుల పేర్లను కూడా స్వీకరించారు. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్పార్టీతో మరింత సన్నిహితంగా అనుసంధానం చేస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ నారాయణపేట: రాష్ట్రంలోని మైనార్టీ నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత టీజీపీఎస్సీ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు తదితర మైనార్టీ వర్గాలు, బీపీఎల్ కేటగిరీలో ఉన్న అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీపీఎల్ కేటగిరీకి చెందిన వారు అర్హులని.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ వి ద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్కార్డు, పాస్ పోర్ట్ సైజుఫొటోతో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. ఎంపికై న అభ్యర్థులకు సెప్టెంబర్ 15 నుంచి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్, ఇంది రా ప్రియదర్శిని కళాశాల, ఎంఏఎం క్యాంపస్, నాంపల్లి, హైదరాబాద్లో శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. -
అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి
మక్తల్: గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్పై ప్రత్యేక సమావేశం నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఓటర్ల పేర్లు తప్పులు లేకుండా చూడాలని.. ఇంటింటికి వెళ్లి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి, విద్య, వైద్యం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బీఎల్వోలకు బీఎల్ఏలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, జిల్లా కోశాధికారి ఆనంద్గౌడ్, మాగనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేద విద్యార్థులకు ఉపయోగకరం..
ఆర్థికంగా వెనకబడ్డ మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా చదివి ఎన్ఎంఎంఎస్ ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటి మిత్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని స్కాలర్షిప్ అందుకోవాలని కోరుకుంటున్నా. – అజయ్, కోటకొండ పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఉపకార వేతనం ఎంతో అవసరం. ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంపికయ్యేటట్లు కృషి చేస్తాం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి -
నేటి నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
● మూడురోజుల పాటు నిర్వహణ ● రంగురంగుల విద్యుద్ధీపాలు.. పచ్చటి తోరణాలతో ముస్తాబైన ఆలయం నారాయణపేట: జిల్లాకేంద్రంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో 355వ ఆరాధనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక రాఘవేంద్ర సేవాసమితి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలు, పచ్చటి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 29న శనివారం పూర్వారాధన రోజున ప్రత్యేక పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 30న ఆదివారం మధ్యారాధన సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు ప్రముఖ పండితుల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. 31న సోమవారం ఉత్తరారాధన రోజున ప్రత్యేక పూజలు, పల్లకీసేవ, భజన కార్యక్రమాలు నిర్వహించి ముగింపు పలకనున్నారు. ఆరాధనోత్సవాల అనంతరం సెప్టెంబర్ 1న మంగళవారం శ్రావణ బహుళ పంచమి సందర్భంగా షోడశబాహు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారి 103వ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రెజ్లింగ్ క్రీడాకారులకు ప్రోత్సాహం
రెజ్లింగ్లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభ చాటుతుండడం చాలా సంతోషంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించి మరిన్ని పతకాలు సాధించాలి. ధన్వాడలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ నిధులతో దాదాపు రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రెజ్లింగ్ హాల్ నిర్మాణం చివరిదశలో ఉంది. – శెట్టి వెంకటేశ్, డీవైఎస్ఓ, నారాయణపేట జిల్లా ధన్వాడ కేజీబీవీలో 8 ఏళ్ల నుంచి రెజ్లింగ్ కోచ్గా విధులు నిర్వర్తిస్తున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున ధన్వాడలో ప్రత్యేక బాలికల రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి. దీని వల్ల బాలికలకు మెరుగైన క్రీడా శిక్షణ లభించడం వల్ల జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దవచ్చు. – పాత్లోత్ శ్రీనివాస్, రెజ్లింగ్ కోచ్ ● -
కుస్తీ పట్టుతో పతకాల పంట!
13 ఏళ్లకే జాతీయస్థాయిలో పతకం ఒలింపిక్స్ మెడలే లక్ష్యమంటున్న బాలమణి రెజ్లింగ్లో సత్తా చాటుతున్న పాలమూరు ఆడబిడ్డలు ● మట్టి బరిలో మొదలైన ప్రస్థానం.. జాతీయ వేదికపై పతకాల వేట ● అంతర్జాతీయస్థాయిలో బరిలోకి దూసుకెళ్లే లక్ష్యం.. మందిపల్లిపాతతండాకు చెందిన 13 ఏళ్ల సీతామహాలక్ష్మి ధన్వాడలో 9వ తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే రెజ్లింగ్ బరిలో అడుగుపెట్టి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్, ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అండర్–15 నేషనల్స్లో పాల్గొంది. న్యూఢిల్లీలో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించి తన సత్తా చాటింది. నిరంతర శిక్షణతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని సీతామహాలక్ష్మి చెబుతోంది. మందిపల్లిపాతతండాకు చెందిన నాగలక్ష్మి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచే రెజ్లింగ్పై ఆసక్తి పెంచుకున్న ఆమె రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2023లో ఉత్తరప్రదేశ్లో జరిగిన సబ్ జూనియర్, 2024లో మధ్యప్రదేశ్లో జరిగిన అండర్–17 ఎస్జీఎఫ్ఐ, ఉత్తరాఖండ్ సబ్ జూనియర్, తమిళనాడు ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొంది. 2025లో రాజస్థాన్ సీనియర్ నేషనల్, ఛత్తీస్గఢ్ అండర్–20 నేషనల్స్లోనూ పోటీ పడింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన పోటీల్లో వరుసగా మెరుగైన ప్రదర్శనతో 2025 వీర తెలంగాణ కేసరి, 2026లో తెలంగాణ కేసరి బిరుదును దక్కించుకుంది. ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో జరిగిన ఖేలో ఇండియా జాతీయ పోటీల్లో 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. భవిష్యత్లో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలన్నదే తన కల అని నాగలక్ష్మి అంటోంది. మందిపల్లికొత్తతండాకు చెందిన కె.బాలమణి డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. 2023లో తమిళనాడులో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరాఖండ్ సబ్ జూనియర్ నేషనల్స్, 2024లో మధ్యప్రదేశ్లో జరిగిన అండర్–17 నేషనల్స్, 2025లో అండర్–17 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్లో పోటీ పడింది. నిరంతర సాధనతో అంతర్జాతీయస్థాయికి ఎదిగి ఒలింపిక్స్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగి పతకం సాధించాలన్నదే తన ఆశయమని బాలమణి చెబుతోంది. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మక్తల్: నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల ఆస్పత్రి, క్రీడా మైదానం, గొల్లపల్లి సమీపంలో 20 ఎకరాల్లో రూ.250 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఫైర్స్టేషన్ పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలో ఆస్పత్రికి సంబంధించి ఏ, బి, సి, డి బ్లాక్ పనులు పూర్తయ్యాయని.. గొల్లపల్లి శివారులో ఆర్టిఫిషియల్ విభాగానికి 9 ఎకరాలు, సెట్విన్కు 10.30 ఎకరా లు, ఏటీసీకి 1.5 ఎకరాలు, సెట్విన్ ట్రెనింగ్ సెంటర్కు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. నిర్మాణాలన్ని నాణ్యతగా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
వరల్డ్ చాంపియన్ ట్రయల్స్కు గీత
ధన్వాడ మండలం ఆకుమర్రితండాకు చెందిన కె.గీత ఏడేళ్లుగా రెజ్లింగ్లో సాధన చేస్తోంది. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 2023లో ఉత్తరప్రదేశ్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్, 2024లో ఉత్తరాఖండ్లో జరిగిన సీనియర్ నేషనల్స్, మధ్యప్రదేశ్లోని సబ్ జూనియర్ నేషనల్స్తో పాటు 2025లో రాజస్థాన్లో జరిగిన అండర్–20 నేషనల్స్, ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ పోటీల్లో బరిలోకి దిగింది. ఈ ఏడాది హర్యానాలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్ రెజ్లింగ్లో 50 కేజీల విభాగంలో రజత పతకం, అండర్–23 సీనియర్ నేషనల్ చాంపియన్షిప్లో 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 31న న్యూఢిల్లీలోని ఐజీ స్టేడియంలో జరిగే అండర్–23 వరల్డ్ చాంపియన్షిప్ ట్రయల్స్కు ఎంపికై ంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యమని గీత చెబుతోంది. -
రాఖీ సందడి
ప్రముఖుల ఇంట మక్తల్/నారాయణపేట/కోస్గి రూరల్: ప్రముఖుల ఇంట శుక్రవారం రాఖీ సందడి కనిపించింది. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ● నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి హైదరాబాద్లోని తన ఇంట్లో సోదరుడు, టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్రెడ్డికి రాఖీ కట్టారు. తన సోదరుడితో పాటు నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ● నారాయణపేట కాంగ్రెస్పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి రాఖీ కట్టి శుభాభివందనాలు తెలిపారు. -
నిధులు మంజూరు..
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున.. ● గతేడాది కంటే రూ.10 వేలు అదనం ● పర్యవేక్షణ మరింత పటిష్టం చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈలు, క్లస్టర్ జీహెచ్ఎంల పర్యవేక్షణ.. పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నాయి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది. రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. -
ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు
మక్తల్: సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన గ్రామాల వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గురువారం మండలంలోని భూత్పూర్ గ్రామాన్ని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. రిజర్వాయర్కు నీళ్లు వస్తే ఊళ్లోకి ఊట వస్తుందని, గ్రామంలో విషపు పురుగుల సంచారం అధికమైందని వివరించారు. గ్రామస్తుల సమస్యలను నమోదు చేసుకొని పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన ఎస్ఈ శ్రీధర్, ఎస్డీసీ రాజేందర్గౌడ్, తహసీల్దార్ సతీష్కుమార్, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుర్మయ్యగౌడ్, మాజీ సర్పంచ్ హన్మంతు, చెన్నయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. నేరెడుగాం గ్రామంలో.. మాగనూర్: మండలంలోని నేరెడుగాం గ్రామాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సందర్శించారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్నట్లు గ్రామస్తుల విన్నపంతో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గురువారం సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని పురాతన ఇళ్లతో పాటు పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో విషపు పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని.. అనేకమంది పాముకాటుతో మృతిచెందిన ఘటనలు గ్రామంలో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఊటనీటితో పలు ఇళ్లు కూలిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్అండ్ఆర్ సెంటర్కు తరలించాలని కోరారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో సత్తాచాటిన క్రీడాకారులు నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ తెలిపారు. సౌత్జోన్ అండర్–16 విభాగం 600 మీటర్ల పరుగుపందెంలో పూజ బంగారు, అండర్–18 విభాగం జావెలిన్ త్రోలో రాధిక కాంస్యం, అండర్–18 హైజంప్లో అజీమ్ రజత పథకం సాధించినట్లు వివరించారు. తగ్గిన విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. గురువారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 93.898 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 78.750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 172.648 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 3,510 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు. -
పీఎండీడీకేవైలో మెరుగైన ర్యాంకింగ్ సాధించాలి
నారాయణపేట: పీఎండీడీకేవై కార్యక్రమం కింద నమోదవుతున్న డేటాను సమగ్రంగా పరిశీలించి జిల్లాకు మెరుగైన ర్యాంకింగ్ సాధించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పీఎండీడీకేవై పోర్టల్లో డేటా నమోదులో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించామని.. కేవలం డేటా నమోదుకే పరిమితం కాకుండా జిల్లాలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సరైన సూచిక కింద నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య, సహకార, భూగర్భజల తదితర శాఖలు రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను సంయుక్తంగా అమలు చేస్తున్నందున ఆయా కార్యక్రమాల్లో తమ శాఖ పాత్రను గుర్తించి సంబంధిత సూచికల్లో నమోదు చేయాలన్నారు. సహజ వ్యవసాయం, విత్తనాల పంపిణీ, ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతు వేదికల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, నీటి సంరక్షణ, పాంపాండ్లు, ఇతర జల సంరక్షణ కార్యక్రమాలను కూడా సంబంధిత సూచికల కింద నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కంటే జిల్లాలో అధికంగా సాధించే అవకాశం ఉంటే.. అదనపు టార్గెట్ కోసం ప్రతిపాదనలు పంపాలని, పీఎం డీడీకేవై పోర్టల్లో నమోదైన టార్గెట్ లేదా అచీవ్మెంట్లో తప్పులుంటే ప్రశ్నల వారీగా వాటిని గుర్తించి సవరణకు అవసరమైన వివరాలను సమర్పించాలని సూచించారు. 2026–27 సంవత్సరంలో జిల్లాకు మెరుగైన ఫలితాలతో పాటు ఉన్నత ర్యాంకింగ్ సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీఓ వెంకట్రాములు, వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్, సీపీఓ ఖాగవాహన్, హౌసింగ్ పీడీ శంకర్నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
కోస్గి రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీఓ రమేష్, కడా చైర్మన్ వెంకట్రెడ్డి సూచించారు. గురువారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్సెంటర్లో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే రోగులకు నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలన్నారు. మోడ్రన్ ఆస్పత్రి ఏర్పాటు నేపథ్యంలో 15 కంప్యూటర్లు వచ్చాయని.. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షల నిమిత్తం యంత్రాలను కొనుగోలు చేయాలని, విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించాలని, కొత్త బోరు, శుద్ధజల యంత్రాన్ని సమకూర్చాలని, అవసరమైన ఫర్నీచర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మల్లికార్జున్, తహసీల్దార్ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, వైద్యుడు అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్యాలయం వద్ద ఘర్షణ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఏబీవీపీ నాయకుడి మధ్య వాగ్వాదం ● పరస్పరం ఫిర్యాదులు.. విచారణ అనంతరం చర్యలు: ఎస్ఐ నారాయణపేట: మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త సత్యయాదవ్, ఏబీవీపీ నాయకుడు చరణ్రెడ్డి మధ్య గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చరణ్రెడ్డి తన వార్డులో రోడ్ల సమస్యలు, గుంతలు తదితర సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ శంకర్ను కలిసినట్లు తెలిసింది. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పినప్పటికీ.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. విధులకు ఆటంకం కలుగుతోందని కమిషనర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కమిషనర్ ఫోన్ చేసి చైర్పర్సన్ భర్త సత్యయాదవ్కు తెలిపారు. దీంతో ఆయన చరణ్రెడ్డికి ఫోన్ చేసి సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగినట్లు సమాచారం. అనంతరం సత్యయాదవ్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా మున్సిపల్కమిషనర్ చాంబర్లో ఇద్దరి నాయకుల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చాంబర్ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఇరువురి తోపులాట జరిగిందని, దీంతో ఒకరిపై ఒకరు చేయిచేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చివరికి అక్కడున్న వారు ఇరువురిని సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇరువర్గాల ఫిర్యాదులు ఘటనపై చరణ్రెడ్డి, సత్యయాదవ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విధులకు ఆటంకం కలిగించారంటూ మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరో వ్యక్తి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదులు అందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ను ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని చరణ్రెడ్డి ఆరోపించారు. అయితే సమస్యపై మాట్లాడే విషయంలో భాష సరిగా లేకపోవడంతో వాగ్వాదం జరిగిందని సత్యయాదవ్ తెలిపారు. తనపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించడంతో అనుచరులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తోపులాట జరిగిందని వివరించారు. -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
నారాయణపేట ఎడ్యుకేషన్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నర్సింహారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం, పెండింగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల పాటువేచి చూశామని.. ప్రభుత్వం నెలలోపు పీఆర్సీ అమలు చేస్తామని ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు. మూడు నెలలుగా ఉద్యోగులు తమ వేతనం నుంచి ఆరోగ్య పథకానికి కావాల్సిన చందాను చెల్లిస్తున్నప్పటికీ ఆరోగ్య పథకం అమలు కావడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య సభ్యులు జనార్దన్రెడ్డి, శివరాములు, దేవేంద్రప్ప, హైమావతి, వెంకటస్వామి, సూర్యచంద్ర, యశ్వంత్, జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అన్నాచెల్లెళ్ల బంధాన్ని చాటే పండుగ
● రాఖీ కట్టడం సంప్రదాయం.. రక్షణగా నిలబడటం బాధ్యత ● ‘సాక్షి’తో ఎస్పీ డా. వినీత్ నారాయణపేట: రాఖీ పౌర్ణమి అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకునే పండుగ.. కాలంతో పాటు ఈ పండుగ అర్థం కూడా విస్తరిస్తోంది. రక్షణ అంటే కేవలం సోదరుడు సోదరిని కాపాడటం కాదు.. ప్రతి మనిషి మరో మనిషి గౌరవం, భద్రత, హక్కులను కాపాడేందుకు ముందుకు రావడమని ఎస్పీ డా. వినీత్ వివరించారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి నేపథ్యంలో గురువారం ఎస్పీ డా. వినీత్ పండుగ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. రాఖీ అనేది ఒక కుటుంబ వేడుకకే పరిమితమైన అంశం కాదు.. సమాజంలో పరస్పర నమ్మకం, గౌరవం, బాధ్యతను బలోపేతం చేసే విలువల పండుగ. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మా ఇంటా సంబరాలు జరుపుకొనేవాళ్లం. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ప్రస్తుతం ఫోన్లో పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయ బంధాన్ని పంచుకుంటున్నాం. రాఖీని చేతికి కట్టినప్పుడు అది కొన్ని నిమిషాల్లో జరిగిపోయే చిన్న కార్యక్రమంలా కనిపిస్తుంది... కానీ ఆ దారం వెనుక నీకు నేను అండగా ఉంటా అనే నమ్మకంతో బంధాలను బలపరుస్తూ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒకరికి ఒకరు తోడుగా నిలిచే ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే రాఖీని కేవలం అలంకారంగా కాకుండా బాధ్యతకు గుర్తుగా చూడాల్సిన అవసరం ఉంది. ఆధిపత్యం కాదు.. గౌరవం రాఖీ అంటే కొన్నిసార్లు మహిళలను రక్షించాల్సిన బాధ్యత పురుషులదనే కోణంలో చూస్తుంటాం. సమాజం మారుతున్న నేపథ్యంలో రక్షణ భావనను మరింత విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంది. రక్షణ పేరుతో ఆధిపత్యం కాదు.. స్వేచ్ఛను గౌరవించడం. రక్షణ పేరుతో ఆంక్షలు కాదు.. హక్కులకు విలువ ఇవ్వడం. రక్షణ పేరుతో మాటలు కాదు.. అవసరమైనప్పుడు అండగా నిలవడం. ఇదే రాఖీ స్ఫూర్తికి అసలైన అర్థం. ఇంట్లో మొదలై.. సమాజం వరకు... రాఖీ పండుగలో కనిపించే ప్రేమ, ఆప్యాయత ఇంటి గడప దాటాలి. కుటుంబంలో సోదరుడు–సోదరి మధ్య ఉన్న గౌరవం.. సమాజంలోని ప్రతి మహిళ పట్ల ఉండాలి. ఒక కుటుంబంలో పిల్లలకు నేర్పే విలువలు.. భవిష్యత్ సమాజాన్ని నిర్మిస్తాయి. ఆడపిల్ల, ఆమె నిర్ణయాన్ని గౌరవించడం.. భద్రతకు అండగా నిలవడం.. హక్కులను గుర్తించడం చిన్న విషయాలుగా కనిపించినా.. సమాజ మార్పుకు అవే పునాదులు. ఎస్పీ డా. వినీత్ రాఖీ పౌర్ణమికి పుట్టిన రాఖీ నారాయణపేట: జిల్లాకేంద్రంలోని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కెంచి కిష్టయ్య, ఈరమ్మ దంపతుల కుమార్తె రాఖీ 1973, ఆగస్టు 14న రాఖీ పౌర్ణమి రోజున జన్మించింది. ఆయనకు రాఖీ రెండో కుమార్తె. ఆమెకు సోదరుడు కెంచి శశిధర్ ఉన్నారు. రాఖీ పౌర్ణమి రోజున జన్మించడంతో ఆమెకు ‘రాఖీ’ అని నామకరణం చేశారు. రాఖీ ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ షాద్నగర్లో ఉంటోంది. అయినప్పటికీ ఏటా తన తమ్ముడు కెంచి శశిధర్కు రాఖీ కట్టేందుకు ఆమె పేటకు వస్తారు. సోదరుడి చేతికి రాఖీ కట్టిన అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె జన్మదిన వేడుకలు కూడా జరుపుకొంటారు. తమ్ముడి శశిధర్కు రాఖి కడుతున్న అక్క రాఖీ (ఫైల్) యువతే మార్పునకు చోదకశక్తి.. నేటి యువత రాఖీ స్ఫూర్తిని కొత్త కోణంలో అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన సమయంలో మాట, ఫొటో, వీడియో, సందేశం ద్వారా కూడా ఇతరుల గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే డిజిటల్ ప్రపంచంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం.. ఎదుటివారి గోప్యతను గౌరవించడం.. అవమానకరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండటం కూడా ఆధునిక రక్షాబంధన్లో భాగమే. -
వరుణుడి కరుణ కరువాయే..!
గతేడాది ఆగస్టులో జిల్లాలోని చెరువులు నీటితో కళకళలాడాయి. 373 చెరువులు సర్ప్లస్ స్థాయికి, 228 చెరువులు 75–100 శాతం, 118 చెరువులు 50–75 శాతం వరకు నిండాయి. ఈసారి మాత్రం అదే చెరువులు చుక్కనీటి కోసం ఎదురుచూస్తున్నాయి. 75–100 శాతం స్థాయికి చేరిన చెరువులు అతి కొద్దిగా ఉండగా.. సర్ప్లస్ స్థాయికి చేరిన చెరువులు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పంట చేతికి రావాలంటే వాన పడాలి.. చెరువు నిండాలంటే వరద రావాలి.. భూగర్భ జలాలు పెరగాలంటే జలాశయాలు నిండాలి. కానీ ఈసారి మూడు దశల్లోనూ ప్రకృతి పరీక్ష పెడుతోంది. గతేడాది ఇదే సమయంలో మత్తడి దుంకిన చెరువులు.. ఈసారి చుక్కనీటి కోసం ఎదురుచూస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే చెరువుల నీటిమట్టాలు పెరిగి భూగర్భ జలాలకు ఊతం లభించే అవకాశం ఉంది. నారాయణపేట: చెరువులు నిండితే పల్లె పులకించేది.. మత్తడి దుంకితే రైతన్న పంట పండేది.. అలుగు పారితే సాగుకు భరోసా వచ్చేది.. కానీ ఈ ఏడాది వర్షాకాలంలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా 87 రోజుల కాలంలో కేవలం 26 రోజులే వర్షం కురవడం.. సాధారణ వర్షపాతంలో 20 శాతం లోటు నమోదు కావడం.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 53 శాతం తక్కువ వర్షపాతం ఉండటం జిల్లాలో నెలకొన్న వర్షాభావ తీవ్రతను కళ్లకు కడుతోంది. చినుకు పడినా.. చెరువుకు చేరని నీరు జూన్ 1 నుంచి ఆగస్టు 24 వరకు జిల్లాలో సాధారణంగా 326.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 262.2 మి.మీ. మాత్రమే నమోదైంది. వర్షం కురిసిన రోజులు తక్కువగా ఉండటంతో ఆ నీరు కూడా చెరువులు, కుంటల్లోకి భారీగా చేరలేదు. ఫలితంగా మత్తడులు మూగబోయాయి.. అలుగులు ఎండిపోయాయి.. చెరువులు వెలవెలబోయాయి. ధన్వాడలో దారుణం.. మండలాల వారీగా చూస్తే ధన్వాడలో 35 శాతం లోటు వర్షపాతం నమోదై జిల్లాలోనే అత్యధిక వర్షాభావం కనిపిస్తోంది. నారాయణపేట, నర్వలో 33 శాతం, ఊట్కూర్లో 29 శాతం, మరికల్లో 28 శాతం, దామరగిద్దలో 27 శాతం, మాగనూర్, మక్తల్లో 26 శాతం చొప్పున వర్షపాతం లోటు నమోదైంది. అయితే మద్దూర్లో సాధారణం కంటే 12 శాతం, కోస్గిలో 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 87 రోజుల్లో.. వర్షం కురిసింది 26 రోజులే జిల్లాలో 20 శాతం లోటు వర్షపాతం గతేడాదితో పోలిస్తే 53 శాతం తక్కువ ఆందోళనలో అన్నదాతలు -
క్రాప్ బుకింగ్ ఆలస్యం
–9లో uనర్వ: జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడంతో అసలైన రైతులు మాత్రమే పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు పంటల సాగును కాస్త అటు ఇటు చేసుకోవడంతో పంట వివరాల నమోదు ప్రక్రియ గతేడాది కంటే రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో విక్రయించాలంటే వ్యవసాయశాఖ అధికారులు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయాలు సేకరించి లొకేషన్తో పాటు పంట ఫొటోలను అప్లోడ్ చేయాలి. వీటి ఆధారంగా దిగుబడులను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు అంచనా వేసి కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. పంట వివరాలు నమోదు చేసుకొన్న రైతులు మాత్రమే పత్తి, కంది, మొక్క జొన్న, సోయాబిన్ తదితర పంటలను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంది. మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్, సీసీఐ కేంద్రాలకు రైతులు పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ సిబ్బంది ఆన్లైన్లో పొందుపర్చిన వివరాలు ఉంటేనే కొనుగోళ్లు చేపడతారు. సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా.. వానాకాలం సీజన్ ప్రారంభమైన రెండు నెలలకు వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. గతేడాది కూడా పంట వివరాల నమోదులో జాప్యం కారణంగా పత్తి తదితర పంటల కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైతే వివరాల నమోదులో ఖచ్చితత్వం ఉండకపోవడం వంటివి జరగవచ్చు. దీంతో అసలైన రైతులు తమ పంట ఉత్పత్తులను మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉండకపోవడంతో పాటు దళారులకు మేలు చేకూరనుంది. పంట సాధారణం ప్రస్తుత సాగు పత్తి 1,78,963 1,66,447 వరి 1,63.479 35,660 కంది 68,810 61,228 జొన్న 5,245 5,253 పెసర 3,569 2,664 చెరుకు 1,712 1,200 ఆముదం 829 675 మినుములు 235 105 మొక్కజొన్న 165 230 వేరుశనగ 124 20 వానాకాలం పంట వివరా ల నమోదును ప్రభు త్వం డీసీఎస్ పద్ధతిలో చేయా లని ఆదేశాలిచ్చింది. జిల్లా లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వేనెంబర్ల వారీగా పంట వివరాలు నమోదు చేస్తాం. ఎ లాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పక డ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. పంటల నమోదులో ఏ ఒక్క రైతు నష్టపోకుండా సెప్టెంబర్ 30 వరకు సర్వే పూర్తి చేయాలని ఏఓలు, ఏఈఓలకు ఆదేశాలిచ్చాం. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎల్నినోతోనే జాప్యమంటున్న అధికారులు గతేడాది కూడా ఇదే పరిస్థితి దళారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు సకాలంలో పూర్తి చేస్తామంటున్న అధికారులు -
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, చేనేత సొసైటీల్లో జరుగుతున్న అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని అఖిలపక్ష నేతలు, చేనేత కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం జిల్లాకేంద్రంలోని 16వ వార్డు మడి ప్రాంతంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. చేనేత సొసైటీల్లో ఇప్పటి వరకు రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలపై వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని, నేతన్న చేయూత బీమా పూర్తిస్థాయిలో అందడం లేదని తెలిపారు. సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, జౌళిశాఖ అధికారులు కుమ్మక్కవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. నేతన్న పొదుపు పథకం జియో ట్యాగింగ్ ప్రక్రియలో సొసైటీ పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం కాపాడాలని, సొసైటీల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, అర్హులైన కార్మికులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు కెంచి నారాయణ, ఎస్సీ ఉపకులాల రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు సల్ల వెంకటేష్, బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి అశోక్, మదర్ థెరిస్సా సొసైటీ అధ్యక్షుడు యూసుఫ్ తాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుల్జారామ్, సీపీఎం పట్టణ నాయకుడు నరహరి, చేనేత కార్మిక సంఘం పట్టణ నాయకులు యాబన్న చౌదరి, వద్ది నారాయణ, తగడఘర్ ప్రకాష్రావు, తగడఘర్ పుండరిక్రావు, శ్రీకాంత్, చిన్నజట్రం సిరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. పార్టీ సి ద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, చిన్నచింతకుంట మండలం గూడూర్కు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముది రాజ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీపీసీ సీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి,జహీర్ అఖ్తర్, ఆనంద్గౌడ్, బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్,బెక్కరి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మక్తల్: గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాగనూర్, కృష్ణా మండలాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్కుమార్, నాయకులు కోళ్ల వెంకటేష్, రవికుమార్, శివరాంరెడ్డి, ఆనంద్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి స్వల్ప అస్వస్థత.. కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నట్లు అవుతుందని సన్నిహితులకు చెప్పడంతో వెంటనే స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి తాత్కాలిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్కు వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి.. మక్తల్ మండలం గొల్లపల్లిలో బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లబ్ధిదారు పొర్ల నరేష్ దంపతులకు కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, సర్పంచ్ సూర్యకుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్, వాకిటి హన్మంతు, వాకిటి శ్యామ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాన్న ఆశయాల సాధనకు కృషి’
మక్తల్: మా నాన్న ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకల్లో వారు పాల్గొని మినీ ట్యాంకుబండ్పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పూర్, భీమా ప్రాజెక్టులను సాధించి రైతులకు సాగు, తాగునీరు అందించిన ఘనత నర్సిరెడ్డిదేనన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నాయకుడని.. తుది శ్యాస వరకు ప్రజాసేవకే అంకితమయ్యారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉద్యమాలు చేసిన ఘనత ఆయనదేనని.. చిట్టెం కుటుంబం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం సుచరిత, చిట్టెం చాణక్యరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రామారెడ్డి, రతంగ్పాండురెడ్డి, మహిపాల్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, సుధాకర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, శివారెడ్డి, చిన్నహన్మంతు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవక్త చూపిన మార్గం ఆచరణీయం
ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు నారాయణపేట: ప్రవక్త చూపిన మార్గం ఆచరణీయమని.. హిందూ, ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పరస్పర సహకారంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్చౌక్ వద్ద ఎస్పీ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మతసామరస్యానికి జిల్లా ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యత, స్నేహభావంతో జీవించాలని సూచించారు. పండుగలు ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ఫ కట్టుదిట్టమైన బందోబస్తు.. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ర్యాలీ మార్గంలోని ముఖ్య కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ర్యాలీని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతియుతంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పండుగలను ప్రశాంతంగా నిర్వహించగలుగుతామని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, సీఐలు శివశంకర్, రవిబాబు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, శిరీష, కృష్ణచైతన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్న కేసులకూ రెఫరల్?
అత్యవసర, క్లిష్ట కేసులను రెఫర్ చేయడం సమంజసమే అయినా.. పాము కాటుకు గురైన వ్యక్తిని సైతం ఉస్మానియాకు తరలించడం చర్చనీయాంశమైంది. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెన్నయ్య ఈ నెల 22న పాము కాటుకు గురికాగా కుటుంబసభ్యులు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐదు రోజుల చికిత్స అనంతరం బుధవారం ఉస్మానియాకు తరలించారు. కాగా.. ఆస్పత్రిలో పాము కాటుకు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్ల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. కావాల్సిన డ్రగ్స్, మెరుగైన చికిత్స విధానం అందుబాటులో లేక చాలా వరకు కేసులు హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. సర్జరీ కోసం.. నెలల తరబడి నిరీక్షణ! అడ్డాకుల మండలం పొన్నకల్కు చెందిన జేసీబీ డ్రైవర్ ఆంజనేయులుకు ఎడమ చేయి విరిగింది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి రాడ్ వేశారు. రెండేళ్ల తర్వాత రాడ్ తొలగించేందుకు వెళ్లగా రూ.50 వేల ఖర్చవుతుందని చెప్పడంతో గత ఏప్రిల్ నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఓపీ తీసుకుని వైద్యులను సంప్రదించినా.. 15 రోజులు, నెల రోజుల తర్వాత రావాలని తిప్పుతున్నారని వాపోయాడు. మరోసారి ఆస్పత్రికి వచ్చిన అతడి సమస్యను ‘సాక్షి’ వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా.. శనివారం అడ్మిట్ చేసుకుని రాడ్ తొలగిస్తామని అర్థో విభాగం వైద్యులు తెలిపారు. ఓపీలతో సరి.. సర్జరీలు ఏవీపాలమూరు: పేదలు, సామాన్యులకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా సన్నగిల్లుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపీ సమయాల్లో వైద్యులు అందుబాటు లో ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అత్యవసర సేవలకు సీనియర్ వైద్యుల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు రాత్రివేళ ఆస్పత్రికి వస్తే నిపుణులైన వైద్యులు అందుబాటులో లేక హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 340లో 212 ఖాళీ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎస్ఆర్, జేఆర్, ట్యూటర్లతో కలిపి 340 వైద్య పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 128 మంది మాత్రమే పనిచేస్తుండగా.. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేస్తున్న వారిలో 67 మంది రెగ్యులర్, 61 మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. పరిపాలన, టెక్నికల్, నర్సింగ్, ఫార్మసిస్ట్ తదితర విభాగాల్లో 363 పోస్టులకు 235 మంది పనిచేస్తుండగా 128 ఖాళీగా ఉన్నాయి. ఔట్సోర్సింగ్లో 112 పోస్టులకు 95 మంది ఉండగా 17 ఖాళీగా ఉన్నాయి. రాత్రివేళ జూనియర్లే.. కొంతమంది సీనియర్ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓపీ సమయంలో ఎస్ఆర్, జేఆర్, పీజీ వైద్యులు సేవలందిస్తుండగా.. రాత్రివేళ క్యాజువాలిటీలో హౌజ్ సర్జన్లపైనే ఆధారపడాల్సి వస్తోందని రోగుల బంధువులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థో విభాగం నుంచి రాత్రి అత్యవసర సేవలకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండాల్సి ఉన్నా ఆ విధానం అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థోలో 15 ఖాళీలు ఆర్థో విభాగంలో 25 పోస్టులకు గాను 10 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో అవసరమైన పరికరాలు లేక కొన్ని సర్జరీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న రూ.15 లక్షల సీ–ఆర్మ్ యంత్రం, రూ.3 లక్షల ఆర్థో డ్రిల్ మిషన్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక సర్జరీలు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరుస ఘటనలతో కలవరం ఆస్పత్రిలోని కొన్ని విభాగాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఇంజక్షన్ మార్పిడి ఘటనలో యువకుడు మృతి చెందగా.. తాజాగా నెల రోజుల శిశువు తొడలో సూది విరిగిన ఘటన కలకలం రేపింది. వార్డుల్లో సిబ్బంది ప్రవర్తనపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్లు.. రాత్రివేళ హౌజ్ సర్జన్లతోనే వైద్యం 340 వైద్య పోస్టుల్లో 212 ఖాళీలు.. జనరల్ ఆస్పత్రిలో కలవరపెడుతున్న వరుస ఘటనలు ప్రధాన విభాగాల్లో శస్త్రచికిత్సలకు రోగుల నిరీక్షణ అర్థో విభాగంలో గతంలో పరికరాల కొరత కా రణంగా కొన్ని శస్త్రచికిత్సలు జరగలేదు. ప్రస్తు తం సీ–ఆర్మ్, అర్థో డ్రిల్ మిషన్లు అందుబాటులోకి వ చ్చినందున అన్ని రకాల అర్థో శస్త్రచికిత్సలను పెంచుతాం. రోజుకు రెండు, మూడు సర్జరీలు చే సేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల్లో హెచ్ఓడీలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ పెంచి సేవలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. – డాక్టర్ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్ -
చదువు, క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
నారాయణపేట: చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్రీడలశాఖ సహకారంతో కౌమారదశ బాలికల జిల్లాస్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆమె హాజరై సరస్వతిదేవి, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూజలు చేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారుల క్రీడా వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని క్రీడలు నేర్పిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడిలో పట్టుదల, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఓటమిని స్వీకరించి దాని నుంచి పాఠాలు నేర్చుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అన్నారు. ఆడ పిల్లలను రక్షించడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించి అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని, బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యల నిర్మూలనలో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం పుర చైర్పర్సన్తో కలిసి ధన్వాడ, మక్తల్ మక్తల్ కేజీబీవీ జట్ల మధ్య నిర్వహించిన కబడ్డీ పోటీని కలెక్టర్ స్వయంగా ఆడి ప్రారంభించారు. అలాగే నర్వ కేజీబీవీ, నర్వ జ్యోతిబాపూలే కళాశాల బాలికల జట్ల మధ్య ఖో–ఖో పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీల్లో జిల్లాలోని 25 జూనియర్ కళాశాలలు, 4 డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 600 మంది బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా సత్యయాదవ్, వైస్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, డీసీపీఓ కరిష్మా, కౌన్సిలర్లు సత్యమ్మ, నాగమ్మ, కల్పన, గొల్ల రవితేజ యాదవ్, రాము, ప్రభాకర్, రాజేశ్ ఘట్, పీఈటీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
గిరిజనేతరులు సై.. చెంచులు నై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. తొలి దశలో 4 గ్రామాలు.. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు. వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం.. గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంగీకారం తెలపని 166 కుటుంబాలు.. నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన -
పూర్తిగా పరిహారం అందాకే నిర్ణయం..
మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు, గిరిజనేతరుడు, సార్లపల్లి కొందరు ఇబ్బంది పెడుతున్నారు సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ, అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అమ్రాబాద్ ఫారెస్ట్లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం. – రేవంత్ చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ ● -
ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
నారాయణపేట: చెక్బౌన్స్ కేసుల పరిష్కారం కోసం నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణపై ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, బ్యాంకు అధికారులతో ఆమె కోర్టులో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, జిల్లావ్యాప్తంగా రాజీ చేసుకునే అవకాశం ఉన్న 152 పెండింగ్ చెక్బౌన్స్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీమార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. లోక్ అదాలత్తో కక్షిదారుల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసులను సులభతరంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు, కక్షిదారులు, బ్యాంకు అధికారులు, సంబంధిత వర్గాలు తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయపరమైన సలహాలు, సందేహాలు లేదా ఉచిత న్యాయ సాయం అవసరమైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. లోక్ అదాలత్కు సంబంధించిన మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 నంబర్ను సంప్రదించాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె.అవినాష్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మాగనూర్: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి జిల్లా మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి గణేష్సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్టీ (హిందీ) పోస్టు ఖాళీగా ఉందని.. డిగ్రీ, బీఈడీ పూర్తిచేసిన వారు 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో కూడిన బయోడేటాను స్వయంగా పాఠశాలలో అందజేయాలని సూచించారు. డీఈఓ ఆకస్మిక తనిఖీ నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వేదాంత విద్యాలయం, బ్రిలియంట్, శ్రీ చైతన్య, లిటిల్స్టార్, శ్రీసాయి తదితర ప్రైవేట్ పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు, ఎంఈఓ బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, టాయిలెట్స్, తరగతి గదుల నిర్వహణను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. -
పాలకుల నిర్లక్ష్యానికి ప్రాజెక్టులు బలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
పరిశోధనలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పరిశోధనలు దోహదపడాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూ ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ మనోజ్ ఆధ్వర్యంలో ఎంవీ సిద్ధార్థ ‘వాయిస్ ఆఫ్ ది సబాల్టర్న్’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించి పీహెచ్డీ పట్టా పొందారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తగ్గించేలా పరిశోధనలు సాగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, హెచ్ఓడీ మాళవి, శ్రీలత పాల్గొన్నారు. ఫార్మసీ రంగంలో ఆధునిక పరిశోధనలు పీయూ ఫార్మసీ కళాశాల అధ్యాపకుడు ప్రభాకర్రెడ్డి రచించిన ‘కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఇన్ ది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ’ పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఫార్మసీ రంగ అభివృద్ధికి ఆధునిక సాంకేతికత, పరిశోధనలు కీలకమని, అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో వీసీ తనిఖీ పీయూలో బీఫార్మసీతో పాటు వివిధ గ్రూపుల విద్యార్థులకు సోమవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పీజీ కళాశాల, ఫార్మసీ కళాశాల పరీక్ష కేంద్రాలను వీసీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు మధుసూదన్రెడ్డి, ఈశ్వర్కుమార్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
నారాయణపేట: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయా లని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మిలాద్ ఉన్ నబి బందోబస్తు ఏర్పాట్లు, పోలీస్ సంఘం ఎన్నికలు, దీర్ఘకాలిక పెండింగ్ కేసులు, దొంగతనం కేసులపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బుధవారం నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా ర్యాలీలను రికార్డు చేయాలని, ప్రధాన చౌరస్తాల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో మంగళవారం నిర్వ హించనున్న పోలీస్ సంఘం ఎన్నికలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నోడ ల్ అధికారి డీసీఆర్బీడీఎస్పీ మహేష్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, సీఐలకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సూచనలు చేశారు. ప్రత్యేక సమీక్ష డీజీపీ వార్షిక క్రైం రివ్యూ సమావేశానికి తమ పరిధిలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ కేసులు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాపర్టీ దొంగతనం కేసుల్లో నిందితులను గుర్తించి, చోరీకి గురైన ఆస్తులను రికవరీ చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ మహేష్, సీఐలు శివశంకర్, రామ్లాల్, భగవంత్రెడ్డి, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సతీష్రెడ్డి, నరేష్, విజయ్కుమార్, రాజు, రమేష్, ఎస్ఎం నవీద్, అశోక్ బాబు, గాయత్రి, రేవతి తదితరులు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి
దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఒకే రకమైన న్యాయం చేయాలని భూ నిర్వా సిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని లింగారెడ్డిపల్లిలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలో లగచర్ల ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.23 లక్షలు, ఒక ప్లాటు అందించారన్నారు. పేట– కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మాత్రం రూ. 20 లక్షలు మాత్రమే అందజేశారని వాపోయారు. సొంత నియోజకవర్గంలో ఒక న్యాయం, పేట నియోజకవర్గంలో మరొక న్యాయం చేయడం సరికాదన్నారు. అభివృద్ధికి సహకరిస్తూ తమ తరతరాల జీవనాధారమైన భూములను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గోపాల్రావు, సర్పంచ్ మొగులప్ప, నారాయణ, జగపతిరెడ్డి, రాజు, రైతులు పాల్గొన్నారు. -
కొత్త చిక్కులు!
నారాయణపేటమంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026మరికల్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రేమ్ వ ర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్ (ఎఫ్ఎఫ్ఎస్) అన్నదాతలకు చుక్కలు చూపిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్కు రైతులు ఇప్పుడిప్పు డే అలవాటుపడుతుండగా.. మళ్లీ కొత్త యాప్ తేవడంతో ఏ యాప్లో యూరియా బుకింగ్ చేసు కోవాలో తెలియక తికమక పడు తున్నారు. అధికారులు ఎఫ్ఎఫ్ఎల్పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అందని ఎరువులు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ఫోన్లో యాప్కు సంబంధి ంచిన సిగ్నల్ లేకపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. దుకాణానికి యూరి యా వచ్చిందని యాప్లో చూపించగానే రైతులు బుకింగ్ చేసుకొని, ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు.కానీ యూరియా మాత్రం చేతికి రా వడం లేదు. అప్పటికే స్టాక్ అయిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు.డీలర్లకు తక్కువ మొత్తమే వచ్చినా, యూప్లో మాత్రం ఎక్కువగా చూపిస్తోందని షాపు యజమానులు చెబుతుండడంతో విసిగిపోయిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు పనిచేయని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్తో తంటాలు వేధిస్తున్న సర్వర్ సమస్య ఆందోళనలో అన్నదాత -
సారుసారుకో కొత్త కారు..!
అక్షరాస్యతలో ముందు వరుసలో నిలవాలి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) లో విద్యార్థుల భవిష్యత్ను పట్టించుకునే నాథు డే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకు తో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. వీసీ మారినప్పుడల్లా.. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్ చాన్స్లర్ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణకు ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్కు కేటాయించి.. సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్ మోడల్) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం ప్రస్తుతం వీసీ శ్రీనివాస్ ఇన్నోవా హై 2.5జెడ్, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్ రమేష్బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్ రాథోడ్ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు యూనివర్సిటీలో సరిపడా హాస్టల్ గదులు లేవని.. తాగడానికి మంచి నీరు, చదువుకోవడానికి లైబ్రరీలో ఆధునిక పుస్తకాలు, ల్యాబ్ సౌకర్యాలు లే వని.. విద్యార్థుల కష్టాలు పట్టని అధికారులకు ఈ లగ్జరీ కార్ల మోజు ఎందుకని విద్యార్థి సంఘాల నా యకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని.. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. వసతి మరిచి.. లగ్జరీ మోజు ఎలా.. పీయూలో లా, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో వసతి లేదనే కారణంతో ఏకంగా 159 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఎంబీఏ, ఎమ్మెస్సీ, లా కోర్సుల్లో పీయూ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన 140 మందికి 97 మంది చేరితే.. ఇందులో 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం యూనివర్సిటీలో హాస్టల్ వసతి లేకపోవడమే. అంతేకాదు.. బాలికల హాస్టల్ సామర్థ్యం 680 మంది కాగా.. అంతకు మించి 870 మంది ఉంటున్నారు. ఒక గదిలో నలుగురు ఉండాల్సిన చోట ఆరు నుంచి ఎనిమిది మంది వరకు సర్దుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భవనాలను హాస్టళ్లుగా మార్చాలని విజ్ఞప్తులు చేస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవేమీ పట్టకుండా.. పీయూ ఉన్నతాధికారులు రూ.లక్షలు వెచ్చించి అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం పట్ల విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..! విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది. నారాయణపేట: అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులైన మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, అక్షరాస్యతలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మండలంలోని సింగారంలో అమ్మకు అక్షరాస్యత కేంద్రాలను ఆయన సందర్శించి, కార్యక్రమం అమలును పరిశీలించారు. 38 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఆయా సంఘాల్లోని నిరక్షరాస్యులైన 107 మంది మహిళా సభ్యులు ఉల్లాస్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకోవడంతో పాటు తమ కుటుంబాల్లోని వారిని కూడా విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు. అక్షర వికాసం పుస్తకంలోని బొమ్మల రూపంలో రూపొందించిన 16 పాఠాలను మహిళలకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా చైతన్యం వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ రఘునాథ్, ఏపీఎం నీలి నారాయణ, సీసీ సుమతి, గ్రామ సంఘం ప్రతినిధులు సుజాత, వీరమణి, వీఓఏలు నవనీత, మల్లమ్మ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నిబంధనలకు నీళ్లు..పీయూ ఉన్నతాధికారులు లగ్జరీ సౌకర్యాల మోజులో పడి ప్రభుత్వ జీఓకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికశాఖ జారీ చేసిన సర్క్యులర్.మెమో.నం.826/29/ఏ2/డీసీఎం/2017 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో, యూనివర్సిటీల్లో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం ఉంది. జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు తిరిగేందుకు నెలకు (2,500 కి.మీ) గరిష్టంగా రూ.33,000 అద్దె ప్రాతిపదికన మాత్రమే ప్రైవేట్ వాహనాలను వాడాలనే ఆదేశాలు ఉన్నాయి. కానీ పీయూ అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి డెవలప్మెంట్ ఫండ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం అధికారులపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు -
నిబంధనల మేరకే లేఅవుట్లకు అనుమతులు
నారాయణపేట: ప్రభుత్వ నిబంధనల మేరకే లే అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. సోమవా రం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా లే అవుట్ కమిటీ సమావేశం నిర్వహించగా.. జిల్లా లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆరు లే అవుట్ల దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ వివరాలపై ఆరా తీశారు. కమిటీ పరిశీలన అనంతరం మూడు లే అవుట్లకు అనుమతులు మంజూరు చేయగా.. మరో మూడు దరఖాస్తులను తిరస్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ అనుమతుల ప్ర క్రియలో అధికారులు పూర్తి స్థాయి జాగ్రత్తలు పా టించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ అశోక్, నీటిపారుదల శాఖ ఈఈ సాల్మన్, ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణయ్య, డీటీసీపీఓ కిరణ్, కోస్గి, మక్తల్, మద్దూరు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గడువులోగా లక్ష్యం పూర్తి చేయాలి. జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలును వేగవంతం చేసి, నిర్ధేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో సంబంధిత శాఖల అధికారులతో వివిధ కార్య క్రమాలపై నిర్వహించిన సమీక్ష మాట్లాడుతూ.. ఆగస్టు 25న నిర్వహించనున్న వన మహోత్సవంలో మండల, గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. చేయూత పథకంలో అర్హుల నమోదును ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఆగస్టు 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీసీహెచ్బీ 2027 డేటా.. జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని డీసీహెచ్బీ–2027 కు సంబంధించిన డేటా సేకరణ, నమోదు ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఉల్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఓలు, వీఓఏలు తమ పరిధిలోని పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అభ్యసకుల శిక్షణ, అభ్యసన ప్రక్రియ పూర్తైన అనంతరం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వారికి సర్టిఫికెట్లు అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాల యూనిఫాంల తయారీకి అందిన మెటీరియల్తో వీఓఏలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కుట్టు పనులను పూర్తి చేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు వ్యవసాయ చెరువుల పనులను చేపట్టి పూర్తి చేయడంతో పాటు, 50 నుంచి 100 మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అనుమతుల మాటున..!
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● జిల్లా సరిహద్దులు దాటుతున్న వైనం ● పట్టుబడితే మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలతో ఫోన్లు ● పోలీసులు తరచూ పట్టుకుంటున్నా ఆగని దందా –8లో uమరికల్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు నిరాటంకంగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ పనుల అనుమతుల పేరిట ఇతర ప్రాంతాలకు యథేచ్చగా తరలిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నియోజకవర్గ నడ్డిబొడ్డున ఉన్న పెద్దవాగు సరిహద్దున కృష్ణానది నుంచి మహబూబ్నగర్కు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు ఇసుకను పెద్ద పెద్ద టిప్పర్లలో తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అధికారులు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పలు సందర్భాల్లో పట్టుకున్నా దందా మాత్రం ఆగడం లేదు. పెద్దవాగు, కృష్ణానది నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ పేరుతో ఇసుక తరలిస్తున్నారు. దీంతోపాటు ఇటుకల తయారీకి వినియోగించే బోజు ఇసుక అనుమతుల మాటున కూడా కృష్ణానది ఇసుకను కూడా యథేచ్ఛగా తరలించుకు పోతున్నారు. ఇటీవల మహబూబ్నగర్కు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను మరికల్లో పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు. జిల్లా హద్దులు దాటుతూ.. మక్తల్ పరిధిలోని పెద్దవాగు, కృష్ణానది నుంచి కేవలం నారాయణపేట జిల్లా వరకే రోజుకు ఒక టిప్పరుకు ఒక ట్రిపు చొప్పున అధికారులు అనుమతులు ఇస్తున్నారు. కానీ అక్రమ దందాకు అలవాటుపడ్డ అక్రమార్కులు మాత్రం అధికారులు ఇచ్చిన రసీదుతో కృష్ణానది, పెద్దవాగు నుంచి మాగనూర్, మక్తల్, మరికల్ మీదుగా టిప్పర్లపై గ్రీన్మ్యాట్ కప్పి మహబూబ్నగర్కు ఇసుకను తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ టిప్పర్లను విడిపించుకోవడానికి మంత్రుల, ఎమ్మెల్యేల పీఏలతో ఫోన్లు చేయిస్తున్నారు. మరికల్ పోలీసులు పట్టుకున్న ఇసుక టిప్పర్లు -
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేయొద్దు
నారాయణపేట: సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాలు రెచ్చగొట్టేలా, కుల, మత, ప్రాంతీయ విభేదాలకు దారితీసేలా పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రానున్న పండగల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రచారా న్నీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తమకు తెలియని మూలాల నుంచి వచ్చిన వీడియోలు, ఫొటోలు, సందేశాలను వాస్తవ నిర్ధారణ లేకుండా ఇతరులకు పంపవద్దని సూచించారు. గ్రూపుల్లో వచ్చే సందేశాలపై అడ్మిన్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను మంచి పనులు, సమాచార వినిమయానికి మాత్రమే వినియోగించాలని, ఒక్క క్లిక్తో సమస్యల్లో చిక్కుకోకుండా ప్రతి పోస్టును షేర్ చేసే ముందు ఆలోచించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఆలయంలో ఎంపీ పూజలు గద్వాల: జిల్లాకేంద్రంలోని నల్లకుంటలో దాతల సహకారంతో భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె నల్లకుంటలో ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, కలిసికట్టుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. పెద్దచింతరేవుల అంజన్న సన్నిధిలో.. ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 48వ చాతుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజలకు ఆమె హాజరవగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యారాజేశ్వర శ్రీపాదుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, మద్వాచార్యులు, కిష్టాచార్యులు, ధర్మకర్త గిరిరావు తదితరులు పాల్గొన్నారు. అఖండ విష్ణు సహస్రనామ పారాయణం మహబూబ్నగర్ రూరల్: శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభమైంది. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా 24 గంటల పాటు నిరంతరంగా పారాయణం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పారాయణంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్ / అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్సాగర్కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది. 153.052 మి.యూ. విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 86.912 మి.యూ., దిగువన 4 యూనిట్ల నుంచి 160 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 153.052 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
చదువుతోనే ఉన్నత శిఖరాలు
● విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ ● కష్టపడి చదివితే అద్భుత భవిష్యత్.. స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలని సూచన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలతో ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బాసర ట్రిపుల్ఐటీ వైస్ చాన్స్లర్ గోవర్ధన్ అన్నారు. కష్టపడి చదివి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. మహబూబ్నగర్ బీకేరెడ్డి కాలనీలోని ట్రిపుల్ఐటీ కొత్త క్యాంపస్లో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని వీసీ సూచించారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ వినియోగంతో విలువైన సమయం వృథా కాకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. అవసరమైతే విద్యార్థులకు స్మార్ట్ఫోన్లకు బదులుగా కీప్యాడ్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వారి యోగక్షేమాలను తెలుసుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బాసర ట్రిపుల్ఐటీ ఒకటని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో ఐదు ప్రాంతాల్లో బ్రాంచ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహబూబ్నగర్ క్యాంపస్లో గతేడాది 200 మంది విద్యార్థులతో బోధన ప్రారంభించగా.. ఈ ఏడాది మరో 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం 33 వేల మంది విద్యార్థులు పోటీ పడగా.. కేవలం 1,800 మందికి మాత్రమే అవకాశం లభించిందని తెలిపారు. దీనిని బట్టి సంస్థకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజనం, విద్యాబోధన విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని అంశాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాధ్యతగా మెలగాలని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. చురుకై న ఆలోచనతోనే ముందడుగు.. ట్రిపుల్ఐటీ పరిపాలన అధికారి మురళీదర్శన్ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చురుకుగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రవణ్కుమార్, విశిష్ట అతిథి విఠట్, సైకాలజిస్టు శ్రీనివాస్, అధ్యాపకులు పసునూరి రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళా జట్టు ఎంపిక
నారాయణపేట: జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు ఆదివారం జిల్లాకేంద్రంలోని స్టేడి యం గ్రౌండ్లో ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి సు మారు 100 మంది క్రీడాకారిణులు పాల్గొని తమ ప్రతిభ చాటారు. చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వచ్చే నెల సూర్యాపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొననుంది.రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే లా క్రీడాకారిణులను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషనన్ అధ్యక్షుడు నాగేశ్వర్రెడ్డి తెలిపారు. 14 మంది క్రీడాకారిణులను ప్రధాన జట్టుగా, మరో 8 మందిని అదనపు క్రీడాకారిణులుగా.. మొత్తం 22 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేయనున్నామని తెలిపారు. ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లయన్ హరినారాయణభట్టడ్, జిల్లా కబడ్డీ అసోసియేషనన్ ఉపాధ్యక్షుడు నర్సింహులు, పీఈటీలు వెంకటప్ప, సాయినాథ్ పాల్గొన్నారు. -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
వాస్తవానికి ట్రాన్స్కో ద్వారా విద్యుత్ చార్జీలు యూనిట్కు రూ.8.50 పడుతుండగా.. సోలార్కు మాత్రం రూ.5.50 చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్కు రూ.3 ఆదా అవుతోంది. ప్రతినెలా సరాసరి నాగర్కర్నూల్లో రూ.24 వేల పైచిలుకు, షాద్నగర్ లో రూ.21 వేలు, కొల్లాపూర్లో రూ.14 వేలు, మహబూబ్నగర్, గద్వాల లో రూ.11 వేల చొప్పున, నారాయణపేటలో రూ.7 వేలు, కల్వకుర్తిలో రూ.4 వేలు, వనపర్తిలో రూ.3 వేల పైచిలుకు చొప్పున ఆర్టీసీకి ఆదా అవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఆరు నెలల క్రితం నిర్వహణ బాధ్యతల నుంచి కార్వీ తప్పుకొంది. దీని స్థానంలో మరో సంస్థకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు బిల్లుల చెల్లింపులకు సంబంధించి లెక్కలు తేల్చకపోవడం గమనార్హం. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్లో 30 (20+10), మహబూబ్నగర్లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్కర్నూల్లో 20 , షాద్నగర్లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మెయిన్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్నగర్ 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
‘చేనేత’ సమస్యల పరిష్కారానికి పోరాటం
నారాయణపేట: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, సొసైటీల లావాదేవీలపై సమగ్ర విచారణ కోరుతూ సెప్టెంబర్ 9న కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అఖిలపక్ష, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణపేట చేనేత సొసైటీల్లో రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, అవినీతి ఆరోపణలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. చేనేత సొసై టీల్లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. సొసైటీలు చేనేత కార్మికుల సంక్షేమానికి పనిచేయాల్సి ఉండగా.. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు వేధికలుగా మారకూడదన్నారు. అర్హులైన కార్మికులకు సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సొసైటీ లావాదేవీలను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్న అధ్యక్ష, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడిన వారిని సభ్యత్వాల నుంచి తొలగించాల ని డిమాండ్ చేశారు. నేతన్న బీమా యోజన కింద ప్రభుత్వం అందజేస్తున్న రూ.5 లక్షల బీమా ప్ర యోజనం అర్హులైన కార్మికులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీనగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న చేనేత కార్మికుల ఇళ్ల కు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. మ హాధర్నాకు ముందు చేనేత కార్మికులను చైతన్యపర్చేందుకు వీధివీధిన సమావేశాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. అనంతరం చేనేత ఉద్యమానికి సంబంధించిన కరపత్రాన్ని అఖిలపక్ష నా యకులు విడుదల చేశారు. సమావేశంలో టీడీపీ రా ష్ట్ర నాయకుడు ఓం ప్రకాష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగల శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర రక్షణసేన జిల్లా అధ్యక్షుడు గవినోల శ్రీనివాస్, సీఐటీయూ జి ల్లా కార్యదర్శి బలరాం, రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ మడివాల్, చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకుడు కెంచి నారాయణ, జనసేన జిల్లా నాయకుడు గుడ్సె నర్సింహ, టీడీపీ నాయ కుడు రాఘవ నాయుడు, సీపీఎం పట్టణ నాయకుడు సోఫీ బజార్ హుస్సేన్, బీఎస్పీ నాయకులు అశోక్, గౌతమ్ శివ, అజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హౌజీ తుల్జారం, చేనేత కార్మిక సంఘం పట్టణ నాయకుడు యాబన్న చౌదరి పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తే కేసులే..
మక్తల్ నుంచి మరికల్ మీ దుగా మహబూబ్నగర్కు ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను గుర్తించి కేసులు నమోదు చేశాం. మూడునెలల్లో ఆన్లైన్ పేరిట ఆఫ్లైన్లో వెళ్తున్న 20 టిప్పర్లను గుర్తించాం. అక్కడి అధికారులు ఇచ్చిన రసీదులను పరిశీలిస్తే రోజుకు ఒక టిప్పర్కు ఒక ట్రిపునకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉండగా.. వారు మాత్రం అదే రసీదుపై రోజుకు రెండు, మూడు టిప్పర్లను తరలిస్తున్నారు. అలాంటి వాటిపై నిఘా ఉంచి కేసులు నమోదు చేసి తహసీల్దార్కు రాయడం జరిగింది. – భగవంత్రెడ్డి, సీఐ, మరికల్ ● -
పంట వివరాలు నమోదు చేయించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. శనివారం మండలంలోని ఏక్లాస్పూర్లో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం పంట వివరాలు డిజిటల్ క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్లో సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్నామని.. వారికి చెప్పి వివరాలను తప్పక నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్, సర్వేయర్ తిమ్మప్ప, సర్పంచ్ చంద్రశేఖర్, ఆనంద్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ● నారాయణపేట: వానాకాలం–2026 పంట కాలంలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు సాగు చేసిన రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు విత్తనాలను ఏ దుకాణం నుంచి కొనుగోలు చేశారో అక్కడికి వెళ్లి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని, సొంతంగా వరి విత్తనాలను సమకూర్చుకుని సాగు చేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేయని రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
ప్రతి ఇంట్లో ఇది భాగమే..
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే. – కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు ఎవరికీ రాసివ్వలేదు.. చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను. – మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు కేసులు నమోదు చేస్తాం.. ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం. – పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల -
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
నారాయణపేట: కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేధికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న మూడో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు న్యాయ, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోక్ అదాలత్లో కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి అధికసంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 5,300 కేసులను పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా 18వ ర్యాంకు సాధించిందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, న్యాయశాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. సెప్టెంబర్ 12న జరిగే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఎగ్జిక్యూషనన్ పిటిషన్లు (ఈపీ), సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్న్బీడబ్ల్యూ) ఉన్న కేసులు అధికసంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల పరిష్కార ప్రక్రియను కూడా యథావిథిగా కొనసాగించాలని సూచించారు. సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింద్యానాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, డీఈఈ రాములు, శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
మూడు ముక్కలాట..!
నారాయణపేట: జిల్లాలోని కోస్గి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతున్నా.. సంబంధిత అధికారుల నిఘా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోస్గిలోని పలు ప్రాంతాల్లో పేకాట క్లబ్లు పోటాపోటీగా ఏర్పడి.. జూదగాళ్లకు ఏసీ గదులు, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ దందా సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పట్టణ శివారులోని వ్యవసాయ పొలాల్లో కూడా ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసి రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకేంద్ర శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు, ఫాంహౌస్లు, పొలాలు, గుట్టల వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకొని పేకాట దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. చేతులు మారుతున్న రూ.లక్షలు.. పేకాట కేంద్రాల్లో రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు నిర్వాహకులు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించుకొని ఆటగాళ్లను సమీకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు బానిసైన పలువురు అప్పులు చేసి మరీ ఆడుతున్నారని.. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరా యువ నాయకుడు..? పోలీసులను మేనేజ్ చేసేందుకు కోస్గిలో ఓ యువ నాయకుడు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతి కేంద్రం నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఆరోపణలపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మూడు ముక్కలు.. నాలుగు వాటాలుగా పేకాట గ్యాంగ్ వ్యవహరిస్తోన్నట్లు సమాచారం. పేకాట కేంద్రాలకు యువత పెద్దసంఖ్యలో ఆకర్షితులవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు, సంబంధిత అధికారులు తక్షణమే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పేకాట కేంద్రాల నిర్వాహకులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాలుగేళ్లు.. 101 కేసులు.. జిల్లావ్యాప్తంగా పోలీసులు తరచూ దాడులు నిర్వహించి నాలుగేళ్లలో 101 కేసులు నమోదు చేయడంతో పాటు 581 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.14,81,421 నగదు, 330 మొబైల్స్, 226 బైక్స్, రెండు ఇతర వాహనాలు, కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయినా రహస్య ప్రాంతాల్లో నేటికీ పేకాట శిభిరాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కేసుల నమోదు ఇలా.. మార్చి 23న నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో 11 మందిని అరెస్టు చేసి, రూ.1,22,900, 9 బైక్లు, 11 సెల్ఫోన్లు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 9న నారాయణపేట మండలం బొమ్మన్పాడులో ఏడుగురిని పట్టుకొని వారి నుంచి రూ.4,330, 4 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్11న కోస్గి బస్టాండ్ సమీపంలో ఎన్.రాకేష్ నివాసంలో టాస్క్ఫోర్స్, కోస్గి పోలీసులు సంయుక్తంగా దాడిచేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1,89,800, 8 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. మే నెల 15న నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో టాస్క్ఫోర్స్, నర్వ పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడిచేసి రూ.1,13,200, 15 బైక్లు, 18 స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకొని 16 మందిపై గేమింగ్యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మే నెల 22న కోస్గి శివారులో పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకొని వారినుంచి 5 సెల్ఫోన్లు, రూ.29,180 స్వాధీనం చేసుకున్నారు. జూలై 26న మరికల్లోని నంది లాడ్జ్, శెట్టి కాంప్లెక్స్ వద్ద ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.45,100, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 8న మక్తల్ మండలం కల్లంగడ్డ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.9,630 నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట, కోస్గిలో జోరుగా పేకాట దందా జూదగాళ్లకు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు పట్టణ, గ్రామీణ శివారుల్లో రహస్య స్థావరాలు రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు పోలీసుశాఖ సహకారంతోనేనన్న ప్రచారం? నాలుగేళ్లలో 101 కేసులు.. రూ.14,81,421 స్వాధీనం -
‘పీఎంశ్రీ’లు.. సమగ్ర వికాసానికి వేధికలు
నారాయణపేట: పీఎంశ్రీ పాఠశాలలను కేవలం తరగతులకే పరిమితం చేయకుండా సమగ్ర వికాసానికి వేధికలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు బాలికల భద్రత, సైబర్ సేఫ్టీ, చట్ట విజ్ఞానం, ఆర్థిక అక్షరాస్యత, స్వీయ రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల వారీగా చేపట్టిన ఉత్తమ కార్యక్రమాలు, వాటి ఫలితాలను ప్రతి నెల ప్రజెంటేషన్న రూపంలో సమర్పించాలని కోరారు. బాలికలకు వచ్చే వారంలో గుడ్, బ్యాడ్ టచ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అవసరమైతే నిపుణులను పాఠశాలలకు ఆహ్వానించి ప్రదర్శనాత్మకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. అక్టోబర్, నవంబర్లో చట్ట విజ్ఞానం, సైబర్ సేఫ్టీ, స్వీయ రక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్, సైబర్వింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా భద్రత, బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే పొదుపు అలవాటు పెంచేందుకు పిగ్గీ బ్యాంక్ చేపట్టాలని.. డబ్బు విలువ, పొదుపు, ఆర్థిక నిర్వహణపై ప్రాథమిక అవగాహన కల్పించాలని కోరారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలకు వచ్చే గ్రాంట్లను పారదర్శకంగా, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. గ్రీనరీ, లైబ్రరీ, క్లబ్లు, ఆర్ట్అండ్క్రాఫ్ట్ తదితర కార్యక్రమాలకు నిధులను సద్వినియోగం చేయాలన్నారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, హాజరు, రిజిస్టర్లు, సమావేశ వివరాలు, నివేదికలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి సమీక్షలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలు, ఎదురైన సమస్యలు, పెండింగ్ అంశాలు, తదుపరి కార్యాచరణపై స్పష్టమైన ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా సమన్వయకర్త నాగమణిమాల, ఎంఈవోలు పాల్గొన్నారు. -
జవాబుదారీగా సేవలందించాలి: ఎస్పీ
నారాయణపేట: ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో సేవలు అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యతని ఎస్పీ డా. వినీత్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రహరీ చుట్టూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. స్టేషన్లోని రికార్డులు, మాల్ఖానా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది టర్న్అవుట్, క్రమశిక్షణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. స్టేషన్కు వచ్చే ప్రతి వ్యక్తితో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులకు తగిన విధంగా స్పందిస్తూ ఫిర్యాదులను తప్పనిసరిగా ఆన్లైన్ చేయడంతో పాటు రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ పరిశీలించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో కనీసం నాలుగు కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్, కమ్యూనిటీ పోలీసింగ్, పెట్రోలింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం స్టేషన్్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. ఆయన వెంట డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, సీఐ శివశంకర్, ఎస్ఐ సతీష్రెడ్డి, ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, విజయభాస్కర్, మన్యం, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
మక్తల్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం అన్నారు. ఆదివారం పట్టణంలో ఉమ్మడి జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి మాట్లాడారు. యూత్ గేమ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సైక్లింగ్కు 76 మంది బాలికలు పాల్గొనగా.. 24 మంది ఎంపికయ్యారన్నారు. వీరు సెప్టెంబర్ రెండోవారంలో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సంఘం ఉపాధ్యక్షుడు శివకుమార్, పీడీలు, పీఈటీలు అంబ్రేష్, రేణు, అవంతి, బాల్రెడ్డి, త్రివేణి, యాదగిరి పాల్గొన్నారు. పాముకాటుకు చిన్నారి బలి దామరగిద్ద: పాలబుగ్గల పసిపాప పాముకాటుకు బలైన విషాదఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని మల్రెడ్డిపల్లికి చెందిన మాణిక్యప్ప, పద్మమ్మ కుమారుడు శివకార్తికేయ(18 నెలలు) రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చేతిపై పాము కాటు వేసింది. బాలుడు తెల్లవారుజామున దాహం వేస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు నీళ్లు తాపించారు. గదిలో పాము ఉండటం, చిన్నారి చేతికి పాముకాటు వేసినట్లు గుర్తించి చికిత్స నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు మహుబూబ్నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా మొదటి కుమార్తె నాలుగేళ్ల క్రితం అనారోగంతో మృతి చెందింది. మూడో సంతానం శివకార్తికేయ పాముకాటుకు బలికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ధర్నా విజయవంతం చేద్దాం కోస్గి: తెలంగాణ ప్రభుత్వం జేఏసీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తాత్సారం చేస్తోందని టీజీఈజేఏసీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. శనివారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల ఉద్యమ సన్నాహక సమావేశంలో ఆ యన మాట్లాడారు. డీఏల బకాయిలు చెల్లించడమేగాక పాతపింఛన్ విధానం అమలు చేయాలన్నారు. హెల్త్కార్డుల వ్యవహారంలో ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్య లు చేపట్టాలని, పంతానికి పోకుండా సమస్య లు పరిష్కరించాలని కోరారు. 27న జిల్లాకేంద్రంలోని వివేకానందపార్క్ వద్ద చేపట్టే ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ నేతలు భీమయ్య, రెడ్డప్ప, యశ్వంత్, రాజేందర్రావు పాల్గొన్నారు. అలసందలు @ రూ.6,818 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం ఆలసందలు క్వింటా గరిష్టంగా రూ.6,818, కనిష్టంగా రూ.3,600 ధర పలికాయి. అదేవిధంగా పెసర గరిష్టంగా రూ.9,062, కనిష్టంగా రూ.5,509 ధర లభించింది. -
క్రీడాపోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: ఆలిండియా సివిల్ సర్వీసెస్–2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎస్.వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పోటీలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్.బి. స్టేడియం, సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 31లోగా స్టేడియం గ్రౌండ్లోని జి ల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో త మ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాంశాలు : అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్ , క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో. ధర్నాను విజయవంతం చేయాలి నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక భవిత కేంద్రంలో టీజీఈ జేఏసీ భాగస్వామ్య సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యల సాధన కోసం చేపట్టే ధర్నాలో జేఏసీలోని అన్ని భాగస్వామ్య సంఘాలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ అదనపు కార్యదర్శి జనార్దన్రెడ్డి, కో–చైర్మెన్లు రెడ్డప్ప, భీమయ్య, సూర్యచంద్ర, భాగస్వామ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు క్రీడాకారుల ఎంపిక నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో ఈ నెల 26, 27న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అండర్–14, 16, 18, 20 విభాగంలో జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారికదేవి, యాదమ్మ, మహేష్, మమత తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామపంచాయతీగా గొల్లపల్లి ఎంపిక మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని గొల్లపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసింది. మొదట ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామంలో పాంపాండ్లు, చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యకుమార్ మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
అడ్డంకిగా మారుతున్న వివాదాలు
పేరపళ్లలో భూ రీ–సర్వే షురూ ● అసలు పట్టాదారుల్లో తీవ్ర అసహనం ● తలలు పట్టుకుంటున్న సర్వే సిబ్బంది నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణలో భాగంగా మండలంలోని పేరపళ్ల జాయమ్మ చెరువును రిజార్వాయర్గా మార్చేందుకు కావాల్సిన 326 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ అధికారులకు అంతుచిక్కని సమస్యగా మారుతోందా..? పదేపదే సర్వేలు నిర్వహిస్తున్నా ఎందుకు స్పష్టత రావడం లేదు..? అసలు పట్టాదారుల అభ్యంతరాలు, భూముల హద్దులు, రికార్డుల మధ్య వ్యత్యాసాలపై తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు..? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భూ సేకరణలో భాగంగా గతంలో నిర్వహించిన సర్వేలపై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు మరోసారి రీ–సర్వేకు సిద్ధమయ్యారు. ఇందుకోసం నాలుగు సర్వే బృందాలను రంగంలోకి దించారు. దీంతో ఇప్పటికే భూముల వివరాలు నమోదు చేయించుకున్న పట్టాదారుల్లో ఆందోళన మొదలైంది. సర్వే.. రీ–సర్వే... భూముల హద్దులు, సర్వేనంబర్లు, పట్టాదారు వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను నిర్ధారించేందుకు అధికారులు సర్వేలు చేపడుతున్నారు. అయితే ఒక దశలో సర్వే పూర్తయిందని భావించినా.. కొన్ని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తడంతో మళ్లీ సర్వే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అసలు ఏ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారు? అన్న సందేహం పట్టాదారుల్లో వ్యక్తమవుతోంది. రికార్డులు ఒకలా.. క్షేత్రస్థాయి పరిస్థితి మరోలా... భూ సేకరణలో పాత రికార్డులు, ప్రస్తుత రెవెన్యూ రికార్డులు, భూముల హద్దులు కీలకంగా మారాయి. రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు మధ్య తేడాలు ఉంటే వాటిని పరిష్కరించడం అధికారులకు సవాల్గా మారుతోంది. ఒకే భూమికి సంబంధించి వేర్వేరు హక్కుదారుల వాదనలు తెరపైకి వస్తే.. అసలు పట్టాదారు ఎవరు? ఎవరి పేరున రికార్డు ఉంది? భౌతిక స్వాధీనం ఎవరి వద్ద ఉంది? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. – తాజాగా ఏర్పాటు చేసిన నాలుగు సర్వేబృందాలు శుక్రవారం పేరపళ్ల గ్రామానికి చేరుకున్నాయి. తహసీల్దార్ పర్యవేక్షణలో మరోసారి భూములను పరిశీలించేందుకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సర్వే నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి సర్వేనంబర్ను పరిశీలించి హద్దులు నిర్ధారించి సంబంధిత రికార్డులతో సరిపోల్చి తుది వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత సర్వే బృందాలపై ఉంది. ఎవరికి లాభం..? గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొందరి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా స్థానికంగా వినిపిస్తోంది. అయితే రాజీ పేరుతో అసలు హక్కుదారులకు అన్యాయం జరగకూడదన్నది పట్టాదారుల ప్రధాన డిమాండ్. భూమి ఎవరిదైనా.. హక్కు ఎవరిదైనా.. తుది నిర్ణయం మాత్రం అధికారిక రికార్డులు, చట్టబద్ధమైన ఆధారాలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే ఉండాలని వారు కోరుతున్నారు. పట్టాదారుల్లో అసహనం.. ఇప్పటికే పలుమార్లు సర్వే చేశారు.. మళ్లీ ఇప్పుడు సర్వే అంటున్నారు.. భూముల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ప్రక్రియను పూర్తి చేయాలంటూ పలువురు పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ ఆలస్యం కావడంతో భూములపై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల్లోనూ అసహనం పెరుగుతోంది. -
తప్పటడుగులకే జై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: విద్యాశాఖలో స్వార్థ ప్రయోజనాల పర్వం నడుస్తోంది. పాఠశాలల్లో విద్యాబోధన, పర్యవేక్షణను పక్కనబెట్టిన కొందరు గురువులు తమ రూటే సెపరేటు అనేలా పైరవీలకు ప్రాధాన్యమిస్తున్నారు. భావిభారత పౌరులకు విలువలతో కూడిన విద్యనందించాల్సింది పోయి పక్కదారి పడుతున్నారు. నిబంధనలను కాలరాసేలా అడ్డూ అదుపు లేకుండా బేరసారాలకు దిగుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడంతో పాటు మెరుగైన విద్యావ్యవస్థ కోసం కృషి చేయాల్సిన పెద్దలు సైతం తప్పుదారి పట్టిన వారికే జై కొడుతున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేటకు సంబంధించి పలు వివాదాస్పద నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి. ఆయా జిల్లాల్లో విద్యాశాఖ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారగా.. ఉన్నతాధికారుల మౌనం అక్రమాలకు ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ వివాదమే.. 2024లో సీసీకుంట మండలం నుంచి మహబూబ్నగర్ రూరల్ మండల విద్యాశాఖ అధికారిగా ఒకరు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం రెండోరోజు అర్బన్ మండల విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఎంఈఓ కుర్చీలో కూర్చున్నారు. అక్కడ మహిళా ఎంఈఓ ఇదివరకే విధులు నిర్వర్తిస్తుండగా.. ఆమెను బేఖాతరు చేస్తూ అతడు పెత్తనం చెలాయించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందగా.. ప్రస్తుతం ఆయనే అర్బన్ మండలానికి ఎంఈఓగా చెలామణి అవుతున్నాడు. అయితే రూరల్ మండలంలో పంచాయతీరాజ్శాఖ నుంచి వేతనం పొందుతుండడం, అర్బన్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై దుమారం కొనసాగుతోంది. ఆ తర్వాత సెల్ఫ్ డ్రాయింగ్ పేరిట.. సీటు లొల్లి సద్దుమణిగిన క్రమంలో తాను అర్బన్ మండల ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, వేతనం ఇచ్చేందుకు అర్బన్లో ఎంపీడీఓ పోస్ట్ లేకపోవడంతో సెల్ఫ్డ్రాయింగ్ పేరిట సొంతంగా వేతనాలు పొందేలా ఆర్జేడీ కార్యాలయంలో చక్రం తిప్పాడు. ఈ మేరకు గతేడాది ఉత్తర్వులు వెలువడ్డాయి. వేతనాలు చేసేందుకు ఎంపీడీఓ లేని క్రమంలో మాత్రమే సెల్ఫ్డ్రాయింగ్ అధికారాలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. లెక్కప్రకారం అర్బన్లో ఎంఈఓ పోస్ట్ ఉండి.. ఎంపీడీఓ లేని పక్షంలో మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ క్రమంలో అర్బన్లో లేని పోస్ట్కు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఇవ్వాలని తన పలుకుబడిని ప్రదర్శిస్తూ పంచాయతీరాజ్ అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. 1986 జీఓ ఏం చెబుతోంది.. 1986 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంఈఓ పోస్టు మహబూబ్నగర్ మండల పరిషత్కే కేటాయించబడింది. కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత, కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఎంఈఓ పోస్టు మంజూరు కాలేదు. పంచాయతీరాజ్ పరిధిలోని పోస్టును రద్దు చేయాలన్నా, బదిలీ చేయాలన్నా అదే శాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాలి. ఇది పట్టించుకోకుండా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. స్పష్టత రావాల్సి ఉంది.. అర్బన్లో ఎంఈఓ పోస్టు ఉందని పంచాయితీరాజ్ శాఖ నుంచి జీఓ రాలేదు. ఎంఈఓ పోస్టును రూరల్ మండలం నుంచి అర్బన్ మండలంలోకి మార్చే ప్రక్రియపై సందిగ్ధం ఉంది. పోస్టు మార్పుపై జెడ్పీ సీఈఓ సంబంధిత శాఖకు లేఖరాశారు. అక్కడి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కానీ విద్యాశాఖ నుంచి ఎంఈఓ పోస్టును రూరల్ నుంచి అర్బన్ మార్చాలని ఆదేశాలు వచ్చాయి. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. స్పష్టత వచ్చే వరకు ప్రక్రియ ముందుకు సాగదు. –విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ వివాదాల విద్యాశాఖ.. లేని పోస్ట్కు రాయ‘బేరాలు’? రూరల్ ఎంఈఓ పోస్ట్ను ఎత్తివేసి అర్బన్కు బదిలీ చేస్తూ, సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఇచ్చినట్లు ఆర్జేడీతో పాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆయన ఇటీవల మరోసారి ఉత్తర్వులు తీసుకురావడం విద్యాశాఖలో సంచలనంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని రూరల్ నుంచి అర్బన్కు ఎంఈఓ పోస్టు బదిలీ చేయాలంటూ జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్ అధికారులపై ఒత్తిడి చేయడం పంచాయితీకి దారితీసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని.. తాము చేయలేమంటూ ఆ శాఖ అధికారులు తేల్చిచెప్పడంతో ఈ లొల్లి జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో లేని అర్బన్ పోస్టు కోసం రూరల్ మండల ఎంఈఓ కుర్చీని ఖాళీ చేసేలా సదరు అధికారి రాయబారాలతోపాటు భారీ స్థాయిలో బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహబూబ్నగర్,నారాయణపేటలో ఇష్టారాజ్యం నిబంధనలకు తిలోదకాలిచ్చిఅనాలోచిత నిర్ణయాలు కార్పొరేషన్ పరిధిలో లేని అర్బన్ పోస్టుకు పైరవీల బేరం రూరల్ మండల ఎంఈఓ కుర్చీనిఖాళీ చేసే కుయుక్తులు పేటలో కాక రేపుతున్న ఓ పథకం ఇన్చార్జి వ్యవహారం అక్రమాలకు ఊతమిస్తున్న ఉన్నతాధికారుల మౌనం -
జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద
● 11 యూనిట్లతో 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి ● శ్రీశైలానికి తగ్గిన వరద.. 167.87 టీఎంసీల నిల్వ గద్వాల/ఆత్మకూర్/అచ్చంపేట: ఎగువ ప్రాంతాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శుక్రవారం 70,495 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరగా.. వివిధ కాలువలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరింది. నీటి నిల్వ 8.73 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తికి 42,401 క్యూసెక్కులు, నెట్టెంపాడు, భీమా–1, భీమా–2, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం ప్రాజెక్టు నుంచి 76,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టారు. ఎగువ కేంద్రంలో ఆరు యూనిట్లతో 234 మెగావాట్లు, దిగువ కేంద్రంలో ఐదు యూనిట్లతో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. కాగా.. శ్రీశైలం జలాశయంలో 167.8764 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 875.90 అడుగులకు చేరింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా కాల్వకు 3,050 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎంజీకేఎల్కు 2,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
25న పోలీసు అధికారుల సంఘం ఎన్నికలు
నారాయణపేట: పోలీసు అధికారుల సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 13 పదవులకు 36 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పోలీసు హెడ్క్వార్టర్స్ నుంచి అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, సర్కిల్ వారీగా సీఐలు, వివిధ విభాగాల వారీగా డీఎస్పీ మహేష్ నామినేషన్లను స్వీకరించారు. ఎన్నికల నోడల్ అధికారిగా డీసీఆర్బీ డీఎస్పీ మహేష్ వ్యవహరించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ శనివారం జరగనుంది. ఇవీ నిబంధనలు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ ఏడాది జనవరి 1 నాటికి కనీసం ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఉద్యోగ విరమణకు ఇంకా కనీసం ఐదేళ్ల సర్వీస్ మిగిలి ఉండాలి. మూడేళ్లలో ఎలాంటి మేజర్ పనిష్మెంట్ ఉండకూడదు. అదేవిధంగా సంఘం పదవిని రెండు పర్యాయాల కంటే ఎక్కువగా నిర్వహించి ఉండరాదు. ఆయా నిబంధనల మేరకు నామినేషన్లను పరిశీలించి తిరస్కరించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 25న పోలింగ్.. ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి తదితరులను ఎన్నుకోనున్నారు. ఎన్నికై న సంఘం మూడేళ్ల పాటు కొనసాగనుంది. సంక్షేమమే ప్రధాన ఎజెండా.. పోలీసు అధికారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సంఘంలో ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 13 పదవులకు 36 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికలపై పోలీసు అధికారుల్లో ఆసక్తి నెలకొంది. -
ఎస్జీఎఫ్లో.. క్రీడల సందడి!
మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీ యస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు మహబూబ్నగర్ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలతో పాటు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరో సారి ఎస్జీఎఫ్ క్రీడల సందడి నెలకొననుంది. ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు హైదరాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ, అండర్– 17, అండర్–19 బాల,బాలికల వాలీబాల్, క్రికె ట్, అండర్–14, అండర్–17, అండర్–19 బా ల, బాలికల హ్యాండ్బాల్, అండర్–19 బాల, బాలికల నెట్బాల్, అండర్–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్జీఎఫ్ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువు రు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో జడ్చర్ల, మహబూబ్నగర్ పట్టణాల్లో అండర్–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది. రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్నగర్ నుంచి ప్రతిపాదనలు అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు అండర్–17 బాలికల జాతీయ క్రికెట్ టోర్నీకి ప్రతిపాదన -
వృద్ధుల హక్కులపై అవగాహన ఉండాలి
నారాయణపేట: వృద్ధుల హక్కులు, సంక్షేమం, న్యాయపరమైన రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ ఆదేశాల మేరకు మండలంలోని శాసన్పల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007 గురించి వివరించారు. వృద్ధులను గౌరవించడం, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలోని ప్రతి వర్గం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు అవసరమైన భరణం, వైద్యసేవలు, ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలు అందేలా చట్టం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం అందించే పింఛన్లు, పన్ను మినహాయింపులు, బ్యాంకు ఎఫ్డీ వడ్డీ ప్రయోజనాలు, ఆరోగ్యబీమా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి సఖి కేంద్రం, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అర్హులు, నిర్దేశిత ఆదాయ పరిమితిలో ఉన్నవారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు టోల్ఫ్రీ నంబర్ 15100 నంబర్కు ఫోన్చేసి సమస్యను తెలియజేస్తే తగిన న్యాయ సహాయం, పరిష్కార మార్గాలపై మార్గదర్శనం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ న్యాయవాది క్రాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి దినకర్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామ సర్పంచ్తో పాటు పోలీసు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
అసలేం జరుగుతోంది?!
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పేరపళ్ల భూ సేకరణ వ్యవ హారం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. భూ సేకరణలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వస్తు న్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు లోకాయుక్తను ఆశ్రయించగా.. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ బీజేపీ పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తోంది. మరోవైపు భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తున్నామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. దీంతో ఆ భూముల వ్యవహారంలో అసలు వాస్తవం ఏమిటి? అన్నది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ దుమారం.. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సేకరణలో పేరపళ్ల గ్రామం కీలకంగా మారింది. భూముల సర్వే, రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, పరిహారం చెల్లింపుపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలను వివిధ రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. భూ సేకరణలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి ఈ నెల 13న లోకాయుక్తకు ఫి ర్యాదు చేసింది. భూ సేకరణ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ వ్యవహారం రాజకీయ విమర్శల స్థాయి నుంచి విచారణ డిమాండ్ వరకు వెళ్లింది. రైతుల పక్షాన బీజేపీ హెచ్చరికలు.. బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యయాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరపళ్లలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్వేనంబర్ల వారీగా భూ ముల వాస్తవ పరిస్థితిని పరిశీలించి అర్హులైన రైతులకే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సర్వేనంబర్లే కీలకం.. పేరపళ్ల భూ వ్యవహారంలో ప్రధానంగా 11, 87, 92, 101 సర్వేనంబర్లపైనే చర్చ జరుగుతోంది. ఈ సర్వేనంబర్లలో వాస్తవంగా సాగులో ఉన్న రైతులు ఎవరు? రికార్డుల్లో భూమి యజమానులు ఎవరు? భూ సేకరణకు సంబంధించి ఎవరికి నోటీసులు ఇచ్చారు? పరిహారం ఎవరికి మంజూరైంది? అన్నది తేలాల్సి ఉంది. రిజర్వాయర్గా మారనున్న పేరపళ్ల జాయమ్మ చెరువు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి బుధవారం పేరపళ్ల రైతువేధికకు చేరుకొని భూములు కోల్పోతున్న రైతులతో ముఖముఖి నిర్వహించారు. రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎకరాల భూములు పోతుంటే మిగిలిన గుంట, రెండు, మూడు గుంటలు ఏం చేసుకోవాలని రైతులు తెలిపారు. ఇంకొందరు రైతులు తమ భూములు గుట్టపై ఉన్నాయని.. రిజర్వాయర్ నిర్మాణం తర్వాత అక్కడికి వెళ్లేందుకు రహదారి ఉండదని చెప్పుకొచ్చారు. తమకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలు విన్న తర్వాత శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా రీ సర్వే చేయించి హద్దులు నిర్ణయించి నిబంధనల ప్రకారమే సర్వేలు, భూ సేకరణ, పరిహారం ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. పేరపళ్లలో ఇప్పటికే 326 ఎకరాల భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. అదనంగా మరో 92 ఎకరాలు కావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో వాటిని సైతం రైతులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. రిజర్వాయర్ పక్కన భూములుంటే భవిష్యత్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే తమ రాజకీయ మనుగడ కష్టమవుతుందనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని గ్రామ రైతులు, ప్రజలను కోరుతున్నామన్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీపై కూడా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 100 ఎకరాలకు సంబంధించి కొత్త పాసు పుస్తకాలు వస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో రికార్డులపై స్పష్టత ఇవ్వా లని రైతులు కోరుతున్నారు. పాత రికార్డులు, ప్రస్తుత రికార్డులను అధికారులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేరపళ్ల భూముల చుట్టూ నేతల రాజకీయం ఎత్తిపోతల భూ సేకరణపై మూడు పార్టీలు.. మూడు వాదనలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్ఎస్ రైతులకు అన్యాయం జరిగితే పోరాటమేనంటున్న బీజేపీ నిబంధనల మేరకే భూ సేకరణ.. రైతులకు న్యాయం చేస్తున్నామంటున్న కాంగ్రెస్ -
భూ సేకరణ వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: బుద్వేల్–నాచారం రేడియల్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి కోస్గి మండలం నాచారం, తోగాపూర్ గ్రామాల పరిధిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతులతో వేర్వేరుగా జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని కోరారు. భూ నష్ట పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత భూమి ప్రాథమి క మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో అమలవుతున్న పరిహార చెల్లింపులను జిల్లాతో నేరుగా పోల్చడం సరికాదన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రాథమిక మార్కెట్ విలువ, భూ సేకరణ నిబంధనల ఆ ధారంగానే పరిహారం నిర్ణయిస్తామని తెలిపా రు. ప్రస్తుత మార్కెట్ వి లువలో వచ్చిన మార్పులను కూడా నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పా రు. భూ సేకరణ చట్టం ప్రకారం అర్హత కలిగిన భూ యజమానులకు మార్కెట్ విలువతో పా టు చట్టబద్ధమైన సొలాటియం, అదనపు పరి హారం తదితర ప్రయోజనాలు అందుతాయని వివరించారు.భూ యజమానులు అంగీకరిస్తే ప రస్పర సమ్మతితో పరిహారం చెల్లింపు ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. అంగీకారం లేని పక్షంలో చట్ట ప్రకారం జనరల్ అవార్డు ప్రక్రి యను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణ ప్రక్రియ ఆలస్యం కాకుండా పూర్తి చేస్తే రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి పూర్తిచేసే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూ యజమానుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలకు లోబడి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లా అభివృద్ధితో పాటు రేడియల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి భూ యజమానులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మనన్్ వార్ల విజయ్కుమార్, ఆర్డీఓ రమేష్, కోస్గి తహసీల్దార్ కళ్యాణి, భూ సేకరణ విభాగం డీటీలు, నాచారం, తోగాపూర్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మత్తులో టీనేజర్స్..!
మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని హైదరాబాద్లోని ఒక ఇంటర్ కళాశాలలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదివిన సదరు విద్యార్థి రెండో సంవత్సరంలో గంజాయికి అలవాటు పడి పరీక్షలు తప్పాడు. దీంతో అప్రమత్తమైన తండ్రి హైదరాబాద్ నుంచి మకాం మహబూబ్నగర్కు మార్చాడు. గంజాయి మత్తులో నుంచి బయటకురాలేని సదరు టీనేజర్ జులాయిగా తిరగడంతో.. మూడేళ్లుగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాడు. ● మహబూబ్నగర్లోని ఓ ఏరియాకు చెందిన నలుగురు టీనేజర్స్ గంజాయికి బానిసలుగా మారారు. చదువు మధ్యలో వదిలేసి పూర్తిగా జులాయిగా తిరుగుతూ.. ఇటీవల ఓ పాన్ షాప్ దగ్గర సిగరెట్స్ ఇవ్వలేదని కత్తులతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. మరో ఘటనలో ఐఫోన్ కోసం గంజాయి మత్తులో ఒక టీనేజర్పై కత్తితో దాడి చేయడంతో హైదరాబాద్లో చికిత్స అందించారు.’ పాలమూరు: ‘ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసగా మారుతున్న కొందరు టీనేజర్స్, యువకులు.. చివరికి వాటి విక్రేతలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఎకై ్సజ్– పోలీసులు చేసిన దాడుల్లో 16 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికంగా పట్టుబడటం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. గంజాయి అధికంగా వినియోగంతో విచక్షణ కోల్పోయి.. పలు నేరాలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. మెడికల్ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఇతర కళాశాల్లోనే గంజాయి సరఫరా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నా.. మరోవైపు గంజాయి వినియోగం మాత్రం కట్టడి కావడం లేదు. ఒక్కో పాకెట్లో 12 గ్రాములు నింపి ప్యాక్ చేసి రూ.400–500 విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్లో ఉండే పొగాకులో కలిపి తీసుకుంటూ.. ఒక రకమైన మత్తుకు బానిసగా మారుతున్నారు. ఇందుకోసం యువత గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక గదులు, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 16–25 ఏళ్లలోపు వారితోపాటు ఆటోడ్రైవర్లు దీనిని అధికంగా తీసుకుంటున్నారు. ఒడిశా, హైదరాబాద్ నుంచి.. ఒడిశాలోని సుక్కా, మల్కాన్గిరి, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి గంజాయిని ఉమ్మడి పాలమూరుకు తరలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహబూబ్నగర్తోపాటు జడ్చర్ల ఏరియాలో సరఫరా అవుతుంది. దీనికితోడు పోలేపల్లి సెజ్ ఏరియాలోనూ కూలీలుగా పనిచేసే యూపీ, బీహార్ కార్మికులు రాకపోకలు సాగించినప్పుడు స్వరాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్లోని దూల్పేట నుంచి ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు ఓ యువకుడిని పట్టుకోగా అతడికి గంజాయి కావాలని గంటల వ్యవధిలో దాదాపు 20 మంది ఫోన్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా మైనర్లతో గంజాయి దందా చేస్తున్నారు. కౌన్సెలింగ్.. చికిత్స గంజాయి బాధితులకు చికిత్స కోసం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఇందులో 30 మంది గంజాయి పాజిటివ్ బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహణ కొసాగుతుంది. వీరిలో 20 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరు వారాలపాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్ట్ ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 7 మందికి నాన్ గంజాయి అడిక్టర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు.ప్రముఖ విద్యాసంస్థల వద్ద గంజాయి అడ్డాలు తరుచూ వినియోగంతో మానసికంగా పలు మార్పులు సరఫరాలో ప్రముఖంగా మైనర్లతో పాటు 25 ఏళ్లలోపు యువతే.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఇదే పరిస్థితి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 30 మందికి కౌన్సెలింగ్ తల్లిదండ్రులు గమనించాలి.. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చ దువుతున్నారు అనేది చూడాలి. మత్తు ప దార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడై నా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్నగర్ విస్తృతంగా తనిఖీలు.. జిల్లాలో గంజాయి సరఫరా కట్టడికి పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో గంజాయి పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. అనుమానాస్పదంగా కనిపిస్తే తప్పక పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ వస్తే వెంటనే జనరల్ ఆస్పత్రి డీ–అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నాం. దీంతోపాటు కళాశాల, పాఠశాల, వైద్య కళాశాలల్లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ ప్రత్యేక దృష్టి సారించాం.. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ నుంచి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ఏరియాలోని పరిశ్రమలు ఉండే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేశాం. గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారం వచ్చిన ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నాం. – శ్రీనివాసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా -
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
నారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ విమర్శించారు. గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్క్ సమీపంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి రాకముందు ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు రూ.5 వేల నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డిగ్రీ, పీజీ, బీఈడీ, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన యువత సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతున్న దుస్థితి నెలకొందన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్ల వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, బండమీది బలరాం, అంజిలయ్యగౌడ్, జ్యోషి, మహేష్కుమార్గౌడ్, కాశప్ప, నరహరి, దస్తప్ప, అశోక్, శివకుమార్, మల్లేష్, కనకప్ప, సోఫీ, మజార్ హుస్సేన్ పాల్గొన్నారు. -
పేరపళ్లలో భూ రీ–సర్వే
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు 326.34 ఎకరాల భూ సేకరణ జరుగుతున్న వేళ మండలంలోని పేరపళ్లలో భూముల సర్వే వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. భూ భారతి రికార్డుల్లో వివరాలు ఒకలా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటం అధికారులకు కొత్త చిక్కులు తెచ్చింది. పలు సర్వేనంబర్లలో రికార్డులు, భౌతిక అనుభవం సరిపోలక భూ సేకరణ, పరిహారం చెల్లింపులో జాప్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక దిశా నిర్ధేశంతో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను పేరపళ్లలో సమగ్ర పునః సర్వేకు ఆదేశిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్శాఖ మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో భూముల కొలతలు చేసి వాస్తవ అనుభవాన్ని నమోదు చేయనున్నారు. జియో–రెఫరెన్న్స్ కొలతలు, ఫొటోలు, జియో–ట్యాగ్డ్ ఆధారాలతో రికార్డులను పరిశీలించి వ్యత్యాసాలున్న చోట సబ్–డివిజన్ స్కెచ్లు సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్ 5లోగా పూర్తికి.. భూముల పునః సర్వే కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సెప్టెంబర్ 5లోగా సర్వే ప్రక్రియను పూర్తిచేసి తుది అసమతుల్యత, ఉపవిభజన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి బృందం ఉదయం 8 గంటలకే గ్రామానికి చేరుకొని కేటాయించిన పని పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి సర్వేనంబర్లో ఎవరు ఉన్నారో గుర్తించి వారి సమక్షంలో భూమి ఫొటోలు తీయనున్నారు. ఆక్రమణలు, విస్తీర్ణ వ్యత్యాసాలున్న చోట ప్రత్యేక ఉప విభజన రికార్డులు రూపొందించనున్నారు. ప్రభు త్వ భూములు, ఎంఎన్కేఎల్ఐఎస్ పరిధిలోని నోటిఫైడ్ భూములు కూడా సర్వేలో పరిశీలిస్తారు. రోజువారీగా నివేదిక.. రోజు నిర్వహించిన సర్వే, భూ వివరాలు, స్కెచ్లను అదేరోజు సాయంత్రం ఆర్డీఓకు సమర్పించాలి. పునః సర్వే పురోగతిని ఆర్డీఓ, డీఎస్ఓ (ఎస్అండ్ఎల్ఆర్)లు పర్యవేక్షించనున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. పేరపళ్లలో చేపడుతున్న ఈ రీ–సర్వే భూ సేకరణకు మాత్రమే కాకుండా రికార్డులు, హద్దులు, వాస్తవ అనుభవంపై ఉన్న వ్యత్యాసాలకు కూడా పరిష్కారం చూపే కీలక ప్రక్రియగా మారనుంది. 326.34 ఎకరాల సేకరణ.. ఎంఎన్కేఎల్ఐఎస్ స్టేజ్–1 (జూరాల ట్యాంక్) ప్రాజెక్టు కోసం పేరపళ్లలో 326.34 ఎకరాల భూ సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్న్ ఇప్పటికే జారీ అయింది. అయితే భూ సేకరణకు సంబంధించి క్షేత్ర పరిశీలన, జాయింట్ సర్వే సందర్భంగా సర్వేనంబర్లు 56, 81, 82, 83, 85, 87, 660, 662, 663, 664 తదితరాల్లో భూ భారతి రికార్డులు, వాస్తవ అనుభవం మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి.. భూ రికార్డుల్లో ఉన్న చైన్ సిస్టమ్ కారణంగా రికార్డుల్లోని వివరాలు, వాస్తవ భూమి అనుభవానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రభావం భూ సేకరణ సర్వేనంబర్లకే కాకుండా గ్రామంలోని సాధారణ భూ రికార్డులపైనా ఉన్నట్లు తెలిపారు. దీంతో భూ సేకరణకు పట్టాదారుల సమ్మతి, పరిహారం చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో శాఖ నిబంధనల ప్రకారం సర్వేయర్, లైసెనన్స్డ్ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా రీ–సర్వే చేపట్టి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. దీంతో భూ సేకరణతో పాటు పట్టాదారుల హక్కుల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. తప్పిదాలకు తావులేకుండా.. భూ సేకరణ సర్వే ప్రక్రియపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్డీఓ రమేష్ సర్వేయర్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూ హద్దుల విషయంలో ఒక్క తప్పిదం జరిగినా భవిష్యత్లో మరో వివాదానికి దారితీసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా సర్వే చేయాలని సూచించారు. ఒకవైపు భూములపై హక్కులు, మరోవైపు రికార్డుల్లోని వివరాలు.. మధ్యలో సర్వే వివాదం. ఈసారి నాలుగు బృందాలతో చేపడుతున్న సర్వే అయినా పేరపళ్ల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందా? అన్నదే ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగు బృందాలు.. 15 రోజుల పాటు... భూ రికార్డుల్లో గందరగోళంతో సమగ్ర పునః సర్వేకు శ్రీకారం 326.34 ఎకరాల ‘మక్తల్––పేట–కొడంగల్’ భూ సేకరణపై ప్రభావం నేటి నుంచి ప్రారంభం -
నేడు విద్యాసంస్థల బంద్
నారాయణపేట ఎడ్యుకేషన్: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేపీకాలనీలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఈ నెల 11న అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు అతి దారుణంగా హత్య చేసిన ఘటనను సంఘం జిల్లాశాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రస్మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి తెలిపారు. రాష్ట్రశాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడంతో పాటు పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా విద్యాధికారి గోవిందరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్కుమార్, ఈసీ సభ్యుడు మహేష్, పట్టణ అధ్యక్షుడు ఖదీర్ పాల్గొన్నారు. 23న జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక నారాయణపేట: సూర్యాపేట జిల్లా కోదాడలో సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు జరిగే 73వ తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ టోర్నీలో పాల్గొనే జిల్లా మహిళా కబడ్డీ జట్టును 23వ తేదీన ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషనన్ అధ్యక్షుడు జి.నాగేశ్వర్రెడ్డి, కార్యదర్శి సి.వెంకటప్ప గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని.. ఆసక్తి గల మహిళా క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. 75 కిలోలలోపు బరువు ఉండాలని, ఆధార్కార్డుతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 99591 86668, 94914 89754 సంప్రదించాలన్నారు. 131.279 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 73.297 మి.యూ., దిగువన 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 57.982 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 131.279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వేయాలి మహమ్మదాబాద్: విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఆర్జేడీ సోమిరెడ్డి సూచించారు. గురువారం మహమ్మదాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు బలమైన పునాది కల్పిస్తూ.. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగేలా బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చాలన్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. మహమ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని దుకాణ సముదాయం అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని ఆర్జేడీ సూచించారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో పాఠశాలను సందర్శించిన ఆయన ఆదాయ, వ్యయ వివరాలను పరిశీలించారు. వచ్చిన ప్రతి రూపాయి, చేసిన ఖర్చుపై ఆడిట్ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజునాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘పాలిటెక్నిక్’ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
కోస్గి: ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించి ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్, కళాశాల కార్యదర్శి అనిల్కుమార్ కోరారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీచౌరస్తాలో మహబూబ్నగర్–తాండూర్ ప్రధాన రహదారిపై కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటీకరణవైపు వెళ్లడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీ ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉందని.. పాలిటెక్నిక్ విద్యపై స్పష్టత ఇవ్వడంతో పాటు జీఓనంబరు 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలలో అవసరమైన ల్యాబ్లు, హాస్టళ్లు, పరికరాలు, బోధన సిబ్బందిని నియమించాలని, ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులతో చర్చించిన తర్వాతే విద్యా విధానంపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలి
నర్వ: ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. గురువారం మండలంలోని కుమార్లింగంపల్లి శివారులో రైతు గోపాల్రెడ్డి సాగుచేస్తున్న ఆయిల్పామ్ తోటను ఉద్యాన అధికారులతో కలిసి పరిశీలించారు. రైతుతో మాట్లాడి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2022 నుంచి 8 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నానని.. సుమారు 40 టన్నుల దిగుబడి సాధించడంతో రూ.6.80 లక్షల ఆదాయం వచ్చిందని రైతు వివరించారు. ఈ సందర్భంగా గోపాల్రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడించారు. ఆయిల్పామ్ సాగుతో పొందుతున్న లాభాలు, అనుభవాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని మంత్రి కోరారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, మక్తల్ ఉద్యాన అధికారి రామకృష్ణ, జిల్లా ఆయిల్ఫెడ్ మేనేజర్ రాధాకృష్ణ, విస్తరణ అధికారులు జనార్దన్, లింగరాజ్, ఫయాజ్, ఈశ్వర్ పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మక్తల్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నియోజకవర్గంలో రూ.178.84 కోట్లతో 25 అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని కాచ్వార్ టోల్గేట్ వద్ద పార్టీ శ్రేణులు వారికి స్వాగతం పలికి బైక్ ర్యాలీగా నల్లజానమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి మంత్రి వాకిటి శ్రీహరి ఇంటికి చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వాకిటి తల్లి రాములమ్మ ను సీతక్క శాలువాతో సన్మానించారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి 25 ఏళ్లు రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి ద్వారక ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీడీ విడుదల.. మక్తల్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన సీడీని మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. తన రాజకీయం 2001, ఆగస్టు 20న మక్తల్ సర్పంచుగా ప్రారంభమైందన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తల అండదండలతో నేడు ఈ స్థాయికి ఎదిగానని.. కార్యకర్తలే దేవుళ్లని.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. మక్తల్, ఆత్మకూర్, నర్వ, మాగనూర్, అమరచింత మండలాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఊట్కూర్ మండంల మల్లేపల్లి వంతెన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశామని పనులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. -
కళాశాలలకు నిధుల జోష్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కళాశాలలు కాంపోజిట్ ల్యాబ్ గ్రాంట్ నిధులు జోగుళాంబ గద్వాల 8 5.50 4.80 మహబూబ్నగర్ 15 12.25 9.40 నాగర్కర్నూల్ 16 9.25 6.20 నారాయణపేట 10 6.50 6.20 వనపర్తి 12 6.50 6.64 61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు కేటాయించారు. కళాశాల, ల్యాబ్ల నిర్వహణకు మంజూరైన నిధులను నిబంధనల మేరకు వినియోగించుకోవాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం అభినందనీయం. – రమణి, డీఐఈఓ -
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలి
నారాయణపేట: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, ఏఈఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న సర్ పురోగతిపై సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలు తదితర అంశాల్లో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పాటించాలని సంబంధిత అధికారులు, ఏఈఆర్వోలకు మార్గదర్శకాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మహ్మద్ సలీం, రాఘవ చౌదరి, రాములు, వెంకట్రామారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కెంచి నారాయణ పాల్గొన్నారు. -
సీటుంది.. వసతి లేదు!
ప్రత్యామ్నాయం ఏదీ? కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్గా వినియోగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్తోపాటు పరిసరాల్లో కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నా.. వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వసతులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేక పలు వురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులు ఉంటుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. లా, ఇంజినీరింగ్లో ఖాళీలు లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో 140 సీట్లకు 97 మంది చేరగా.. 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది చేరగా.. 53 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.ఇంజినీరింగ్లో 180 సీట్లకు 125 మంది చేరగా.. 55 సీట్లు మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు ఉన్నాయి. హాస్టల్ వసతి లేకపోవడంతో ముఖ్యంగా బాలికలు సీట్లు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే వీటిలో చేరే వారికి ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది బాలికల హాస్టల్లో 680 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి 190 మందికిపైగా ఉండటంతో గదుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నలుగురు ఉండాల్సిన గదుల్లో ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల భారం కొత్త హాస్టళ్లు నిర్మాణం.. అప్పటి వరకు అవస్థలే! -
అభివృద్ధి పనుల్లో అలసత్వం సరికాదు
కోస్గి: కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక హెచ్చరించారు. మంగళవారం స్థానిక పుర కార్యాలయ సమావేశ మందిరంలో నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వసతిగృహాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులపై శ్రద్ధ వహించాలని, వచ్చే విద్యాసంవత్సరం నాటికి వినియోగంలోకి తీసుకొచ్చేలా పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాలు గుర్తించాలని కోరారు. మండలాలకు కేటాయించిన అధికారులు క్షేత్రస్థాయిలో పనుల పరోగతిని పరిశీలించాలన్నారు. పింఛన్ దరఖాస్తుల డేటా ఎంట్రీ, పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఫిర్యాదులు రాకుండా అర్హులకే ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి మద్దూర్, కోస్గి పురపాలికలకు మంజూరైన నిధులు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు కలెక్టర్ గుండుమాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసతిగృహం, మండల సముదాయ నిర్మాణ పనులను పరిశీలించి గడువుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, కోస్గి, మద్దూర్ మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, శ్రీకాంత్, తహసీల్దార్ కళ్యాణి, ఎంపీడీఓలు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్తపల్లి: మద్దూరులోని చింతల్దిన్నె మార్గంలో రూ.30 కోట్లతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవనాన్ని కలెక్టర్ ప్రియాంక మంగళవారం పరిశీలించారు. అకాడమిక బ్లాక్, డైనింగ్హాల్, ప్రిన్సిపాల్ క్వార్టర్స్, టాయిలెట్ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధన ప్రకారం నవంబర్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాల్సి ఉందని, వచ్చే మార్చి నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం రూ.6.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదుల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్, పుర కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
నర్వ సమగ్రాభివృద్ధికి కృషి : మంత్రి
నర్వ: రూ.కోట్ల నిధులతో నర్వ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి తీరుతామని.. మంత్రిగా ఉన్నా ఎల్లప్పుడు మీ సేవకుడినేనని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.55 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు పీఏసీఎస్లో రూ.22 లక్షల రైతుల రవాణా చార్జీల పంపిణీ, రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా యాస్పిరేషన్బ్లాక్గా నర్వ ఎంపికై తే కొందరు బాణాసంచ కాల్చి సంబురాలు చేసుకోవడం అత్యంత దౌర్భాగ్యమన్నారు. విద్యాపరంగా అభివృద్ధి చేద్దామని నవోదయ విద్యాలయ ఏర్పాటుకు ఎంపీని కోరితే రాజకీయం చేశారని ఆరోపించారు. వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగుచేయాలని పని చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రహదారి, అంతర్గత రహదారులను సీసీగా మార్చడం, విద్య, వైద్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించామని వివరించారు. జంగంరెడ్డిపల్లి లిఫ్ట్తో సాగునీటి కష్టాలు తీర్చేలా ముందుకు సాగుతున్నామన్నారు. ఇటీవల చంద్రఘడ్, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల మరమ్మతు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలీస్ చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మన్న, సర్పంచ్ హన్మంత్రెడ్డి, నాయకులు పోలీస్ జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వివేక్వర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
నారాయణపేట: వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని.. విధులకు వెళ్లే ముందు శుభ్రం చేయడంతో పాటు టైర్లు, బ్రేకులు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్యాటరీ, లైట్లు, ఇండికేటర్లు, హారనన్ తదితరాలను పరిశీలించాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్ డ్రైవర్లకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లోని పోలీసు వాహనాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, పెట్రోలింగ్, అత్యవసర సేవలు, నేరాల నియంత్రణలో పోలీసు వాహనాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. వాహనాల మెకానిజం, ప్రాథమిక సాంకేతిక అంశాలపై ప్రతి డ్రైవర్కు అవగాహన ఉండాలన్నారు. వాహనంలో సాంకేతిక సమస్య గుర్తించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతు చేయించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో వాహనం మొరాయిస్తే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వాహనాల నిర్వహణ, భద్రత, డ్రైవర్ల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఎంటీఓ ఆర్ఐ విజయ్భాస్కర్ తదితరులు ఉన్నారు. -
మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి
మక్తల్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం మండల కేంద్రంలోని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయాన్ని పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రూ.10 వేల కోట్లకుపైగా ఉన్న ఉపకార వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నాయకులు సాయికుమార్, మహేష్, బాలకృష్ణ, రాజు, అజయ్, శివ, వైష్ణవి, వెంకటేష్, శ్రావణి, పవిత్ర, రేవతి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకం
నారాయణపేట: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాపన్నగౌడ్ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పించే దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సూపరింటెండెంట్ అఖిల ప్రసన్న, గౌడ సంఘం నాయకులు సతీష్గౌడ్, రఘురామయ్య, గురునాథ్గౌడ్, కలాల్ ఆనంద్గౌడ్, సర్పంచ్ శేఖర్గౌడ్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం
పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
మత్స్యబీజం.. జాప్యం
టెండర్ దాఖలు గడువు మరోమారు పొడిగింపు –8లో uనారాయణపేట: చేప విత్తనాల సరఫరా టెండర్ ప్రక్రియకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. సాంకేతిక సమస్యలతో పాటు కొన్ని జిల్లాల్లో టెండర్లు అందకపోవడంతో ఈ నెల 20 వరకు గడువు పొడిగిస్తూ మత్స్యశాఖ సంచాలకులు నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ఈ నెల 6న టెండర్ల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేసి 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా.. తాజాగా 20న మధ్యాహ్నం 3 వరకు పొడిగించారు. బిడ్లను అదేరోజు మధ్యా హ్నం 3.30 గంటలకు ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 148 మత్స్య సహకార సంఘాలు, 11,039 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో చాలా కుటుంబాలకు చేపల వేటే ప్రధాన జీవనాధారం. వర్షాభావ పరిస్థితులు రైతులతో పాటు మత్స్యకారుల కుటుంబాల ఉపాధిపైనా ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలకు ఆశించిన స్థాయిలో నీరు చేరకపోతే చేపల పెంపకానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 26 శాతం లోటు వర్షపాతం ఉండటం.. 13 మండలాల్లో 8 మండలాలు లోటు వర్షపాతం నమోదుకావడం మత్స్యకారులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. 2024లో టెండర్ల జాప్యం.. 2024లో చేప పిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో పంపిణీ సకాలంలో చేపట్టలేకపోయారు. సీజన్న్ దాటిపోవడంతో జిల్లాలో కేవలం 60 చెరువుల్లోనే చేప పిల్లలను వదిలి ప్రక్రియను ముగించినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సమయానికి చేప పిల్లలు అందకపోవడంతో చెరువులపై ఆధారపడిన మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2025లో బిల్లుల బకాయి సమస్య.. 2025లో పరిస్థితి మరో రూపం దాల్చింది. గతంలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో సరఫరాదారుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు వారు వెనుకడుగు వేశారు. ఫలితంగా ప్రక్రి య మళ్లీ ఆలస్యమైంది. చి వరకు సీజనన్ ముగిసే సమయానికి సుమారు 60 చెరువుల్లో చేప పిల్లలు వదిలి మమ అనిపించారనే విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది రెండుసార్లు పిలుపు.. ఈ ఏడాది చేపపిల్లల సరఫరాకుగాను ఈ నెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు. కేవలం రెండు దరఖాస్తు మాత్ర మే రావడంతో 20వ తేదీ వరకు గడువు పెంచారు. మండలం కురిసిన వర్షం సాధారణంలోటు (శాతం) దామరగిద్ద 214.1 314.2 32 నారాయణపేట 203.1 336.0 40 ఊట్కూర్ 208.0 308.4 33 మాగనూర్ 207.9 291.2 29 కృష్ణా 245.7 278.6 12 మక్తల్ 198.3 264.5 25 నర్వ 195.1 285.1 32 మరికల్ 173.9 302.9 43 ధన్వాడ 183.5 328.1 44 మద్దూరు 266.0 270.1 2 కోస్గి 338.8 347.8 3 గుండుమాల్ 249.2 308.3 19 కొత్తపల్లి 224.2 269.8 17 జిల్లాలో చేప పిల్లల పంపిణీ వ్యవహారం మత్స్యకారులకు ఏటా నిరాశనే మిగులుస్తోంది. వరుసగా మూడేళ్లుగా కారణాలు మారుతున్నా.. చేప పిల్లల పంపిణీలో జాప్యం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. వానాకాలం సీజన్న్ ప్రారంభంలోనే చెరువుల్లో చేప పిల్లలు వదలాల్సి ఉండగా.. అధికారిక ప్రక్రియ ఆలస్యం కావడంతో కీలక సమయం గడిచిపోతోంది. చివరికి పంపిణీ జరిగినా.. మత్స్యకారులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది కూడా టెండర్ల జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ● జిల్లాలో 651 చెరువుల్లో 1.87 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. టెండర్లకు మరోసారి అవకాశమిచ్చి ఈ నెల 20 వరకు గడువు పొడిగించినా.. ఇప్పటివరకు రెండు దరఖాస్తులు మాత్రమే రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గతంలో సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు కొత్త టెండర్లపై ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో జులైలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. ఆగస్టులోనూ వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో చెరువులు నిండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టెండర్లు పూర్తయినా.. చేప పిల్లలను ఎక్కడ వదలాలి? అన్న ప్రశ్న అధికారులు, మత్స్యకారుల ముందుంది. వర్షాలు ఆలస్యంగా కురిసి చెరువులు నిండే సమయానికి చేప పిల్లలు వదిలితే.. అవి పెరిగే సమయం తగ్గిపోతుంది. దీంతో చేపల పరిమాణం, దిగుబడి తగ్గి మత్స్యకారుల ఆదాయంపైనే ప్రభావం పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు వచ్చింది రెండు దరఖాస్తులే.. బిల్లుల చెల్లింపులు.. టెండర్ల ఆలస్యంతో కాంట్రాక్టర్ల వెనుకడుగు ఎదుగుదలపై ప్రభావం మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన -
రేపు, మాపు అంటున్నారు..
అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తిచేశా. 2 నెలల క్రితం గృహప్రవేశం చేశాం. ఇప్పటి వరకు రూ. 3.40లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయి. చివరి బిల్లు రూ. 1.60లక్షలు రావాలి. ఈ బిల్లు కోసం రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. రేపు, మాపు అంటున్నారే తప్ప.. బిల్లు మాత్రం రావడం లేదు. – మడ్డి ఎల్లమ్మ, మరికల్ ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం పూర్తిచేసి 5 నెలల క్రి తం గృహప్రవేశం చేశాను. ఇప్పటి వరకు మూడు బిల్లులు మాత్రమే వచ్చా యి. చివరి బిల్లు రూ. 1.60లక్షల కోసం ఎదురుచూస్తున్నాం. పెండింగ్ బిల్లు అందిస్తే ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగపడుతుంది. – రాములు, మరికల్ ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లు సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. 3.40లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద మంజూరయ్యే బిల్లుతో కలిపి మొత్తం బిల్లు వస్తుంది. ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా బిల్లులు వస్తాయి. – హరికృష్ణ, డీఈఈ, నారాయణపేట ● -
అభివృద్ధికి సమగ్ర సమాచారం కీలకం
నారాయణపేట: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర సమాచారం కీలకమని కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో నిర్వహించిన డీసీహెచ్బీ జనగణన– 2027 సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా లో ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయి లో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్లో మౌలిక వసతు లు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు సమగ్ర సమాచారం ప్రధాన ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 400 అంశాలు, మున్సిపాలిటీలకు సుమారు 420 అంశాల సమా చారాన్ని సంబంధిత శాఖల నుంచి సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, వాటి నిర్వహణ విధానం, దూరం తదితర వివరాలను నమోదు చేయాలన్నారు. వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యసిబ్బంది, పడకల సంఖ్య, పారామెడికల్ సిబ్బంది, మెడికల్ షాపుల వివరాలను సేకరించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పోస్టల్, మొబైల్ నెట్వర్క్, విద్యుత్, బ్యాంకింగ్, భూముల వినియోగం, సాగునీరు, వ్యవసాయం, పశుసంవర్ధక, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. డేటా సేకరణ, పరిశీలన, అవసరమైన సవరణల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వచ్చే వారంలో మండల, జిల్లా స్థాయిలో సమీక్షించి.. ప్రతి గ్రామ పంచాయతీలో డేటా సేకరణ పురోగతి, అధికారుల ధ్రువీకరణపై పరిశీలన చేస్తామని తెలిపారు. ● ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి.. వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించి, అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎదురుచూపులు
● ఒక్కో ఇంటికి రూ. 3.40లక్షలు మాత్రమే విడుదల ● చివరి విడత రూ. 1.60లక్షల బిల్లు కోసం నెలల తరబడి నిరీక్షణ ● జిల్లాలో 1,878 ఇళ్ల నిర్మాణాలు పూర్తి మరికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో వేగంగా కొనసాగుతున్నా యి. నిర్మాణ ముడిసరుకు ధరలు పెరిగినా.. ప్రభు త్వం అందిస్తున్న ఆర్థికసాయం సరిపోకపోయినా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. అయితే దశల వారీగా మంజూరు చేస్తున్న నాలుగు విడతల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొ దటి మూడు బిల్లులు సకాలంలో వస్తున్నా.. చివరి బిల్లు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోందని వాపోతున్నారు. పట్టణాల్లో కంటే గ్రామా ల్లో ఈ సమస్య అధికంగా ఉండటం గమనార్హం. అప్పులు చేసి నిర్మాణాలు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ. 5లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదు. లబ్ధిదారులు అప్పులు చేసి మరీ నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం పూర్తిచేసి, గృహప్రవేశాలు జరిగి నెలలు కావొస్తున్నా చివరి బిల్లు మాత్రం అందడం లేదు. పునాది స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష, స్లాబ్ నిర్మాణం చేపట్టాక రూ. 1.40లక్షలు మంజూరు చేశారు. మిగతా రూ.1.60 లక్షల బిల్లును ఇతర పథకాలకు అనుసంధానం చేశారు. ఇందులో వీబీ–జీ రామ్జీ (ఉపాధి హామీ) ద్వారా రూ. 27వేలు, స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12వేలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద రూ. 21వేలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు సైతం నెలల తరబడి ఆలస్యమవుతోంది. ఆవాస్ యోజన కింద రూ. 21 వేలు అసలే రావడం లేదని బాధితులు వాపోతున్నారు. పట్టణంలో మాత్రం ఉపాధి హామీ లేకపోవడంతో మూడో బిల్లు రూ. 2లక్షలు జమ చేస్తున్నారు. నిరుపేదల ఆందోళన.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల జాప్యంతో చాలామంది ల బ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు వెనుకంజ వే స్తున్నారు.అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు కావడంతో బిల్లు రాకుంటే అప్పులు భారమవుతాయని ఆందోళన చెందుతున్నారు.ఇ లా ఇంటి నిర్మాణాలు ప్రారంభించని వారు జిల్లా లో అ ధికంగానే ఉన్నారు. తొలుత వారి ఇళ్లను రద్దు చేయా లని అధికారులు జాబితా సేకరించినా ఆలస్యమైనా కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు.మరికల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు -
ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి
మక్తల్: మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమ వారం మక్తల్ మండలం మంతన్గోడ్లో నూతనంగా ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఛత్ర పతి శివాజీ విగ్రహ దాత ఉప్పరి అశోక్కుమార్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దత్తాత్రేయ ఆల యం వద్ద ఎంపీ నిధులు రూ. 10లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణాన్ని ప్రా రంభించారు. గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రతంగ్పాండురెడ్డి, నర్సింహాగౌడ్, పడకుల శ్రీనివాస్, వెంకట్రాములు, బాల్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, కర్నిస్వామి పాల్గొన్నారు. -
ఖాకీల్లో అవినీతి చిచ్చు!
తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఓ ఉన్నతాధికారిపై సీఐడీ విచారణ! ● రోజురోజుకు తెరపైకి వస్తున్న కొత్త అంశాలు ● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ ● వాస్తవాలు తేలాలంటే సమగ్ర విచారణే మార్గం మహబూబ్నగర్ క్రైం/గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదా లో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖ లోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైన ట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మ డి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది. రాజకీయ అండ ఉందంటూ.. కొంతమంది అధికారులకు రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని కారణంగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కొందరికి వరుసగా అనుకూల పోస్టింగులు లభిస్తున్నాయనే చర్చ శాఖలో ఉంది. మొత్తంగా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు వెలువడుతున్న సమాచారంతో గద్వాల పోలీస్శాఖలో గతంలో చోటుచేసుకున్న వ్యవహారాలపై మళ్లీ చర్చ మొదలైంది. భూముల లావాదేవీలు, అక్రమ వసూళ్లు, ఇసుక–మట్టి వ్యవహారాలు, పోస్టింగుల విషయంలో ఆరోపణలు.. ఇలా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తప్పు చేశారా? లేక ఆరోపణలు నిరాధారమా? అన్నది విచారణ పూర్తయ్యే వరకు తేలాల్సి ఉంది. సీఐడీ విచారణ అంశం తెరపైకి రావడంతో గద్వాల జిల్లాలోనూ గతంలో జరిగిన పలు వ్యవహారాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఓ రేంజ్ స్థాయి అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఆయనకు మధ్యవర్తులుగా కొందరు డివిజన్ స్థాయి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్థాయి అధికారులు వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్శాఖలో విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, నెలవారీ నేర నివేదికలు, సమీక్షలు తదితర అంశాలు అధికారుల పనితీరుకు ప్రామాణికాలుగా ఉంటాయి. అయితే కొందరు అధికారులకు పోస్టింగులు, ఇతర ప్రయోజనాల విషయంలో అనధికారిక లావాదేవీలు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి. నెలవారీ మామూళ్ల విషయంలోనూ ఆరోపణలు వస్తున్నప్పటికీ.. వాటి వాస్తవాలను అధికారిక విచారణలో నిర్ధారించాల్సి ఉంది. -
రోడ్డెక్కని సర్వేలు
●సానుకూలంగా స్పందించారు.. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు– మన్ననూర్– సిరిగిరిపాడు వరకు జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాముఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ రహదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ ప్రతిపాదనలు పంపించాం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపా దనలు పరిగణలోకి తీ సుకోవడం లేదు. కొత్త రోడ్ల మంజూరు కో రుతూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్త ల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం. – డీకే అరుణ, ఎంపీ, మహబూబ్నగర్ అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. మారిన ప్రతిపాదనలతో.. మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి. భూత్పూర్– చించోలి రహదారితో.. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మక్తల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. శనివారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కష్టపడాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను జీవిత లక్ష్యాలు సాధించేందుకు వినియోగించాలన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమయోధుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. వారి త్యాగాలను మరువొద్దని కోరారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని.. ముఖ్యంగా బాలికల కోసం పోక్సో, బాల్య వివాహల నియంత్రణ చట్టం ఉందన్నారు. ప్రాథమిక హక్కులు, విధులు అందరికి సమానంగా ఉంటాయని.. పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చని తెలిపారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు న్యాయమూర్తిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున్, సీనియర్ సూపరింటెండెంట్ హన్మంత్రావు, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరయ్య, న్యాయవాదులు దత్తాత్రేయ, ఆడెం శ్రీనివాసులు, తిమ్మన్న, సునీత, సతీష్కుమార్, సూర్యప్రకాష్, నరేందర్సాగర్, క్రాంతికుమార్, ఏఎస్ఐ శంకరయ్య, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం
దేశంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నాం నారాయణపేట: పేదల సంక్షేమం, సమగ్ర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, పారదర్శక సుపరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాటికి శ్రీహరి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, శిక్షణ కలెక్టర్ ఫణికుమార్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణపేట, మక్తల్ గురుకుల, కస్తూర్బా విద్యార్థినులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్, టూరిజం పాలసీలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. భూ సేకరణలో ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 3,112 మంది రైతులకు రూ.366.95 కోట్ల పరిహారం పంపిణీ చేశామని వివరించారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంట ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2026–27 వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 1,82,031 మంది రైతులకు రూ.259 కోట్ల రైతు భరోసా, రైతుబీమా కింద 618 కుటుంబాలకు రూ.30.90 కోట్లు చెల్లించామని, వానాకాలం సాగుకు 18,251.94 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. జడ్ఎంఎస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ ద్వారా రూ.12.93 లక్షల లాభం ఆర్జించినట్లు చెప్పారు. నారాయణపేట, కోస్గి ఆర్టీసీ పరిధిలో 2.91 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం ద్వారా రూ.110.13 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, మిల్క్ పార్లర్ల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో గణనీయమైన పురోగతి రూ.4,725 కోట్లతో లక్ష ఎకరాలకు సాగునీటి ఎత్తిపోతల పథకం మహిళా సాధికారతకు పెద్దపీట రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
సీఎన్ఆర్, సీవీఆర్కు ఘన నివాళులు
ధన్వాడ: మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయడు చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి వర్ధంతిని శనివారం ధన్వాడలోఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్లో ఉన్న చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, నారాయణపేట మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోటపక్క వీధిలో ఉన్న ఆయన సమాధి (ఘాట్) వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో అన్నదానం నిర్వహించారు. జిల్లాకేంద్రంలోనూ.. నారాయణపేట: జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి విగ్రహాలకు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, చిట్టెం అభిజయ్రెడ్డి, మార్కెట్ చైర్మనన్ ఆర్.శివారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి. -
‘త్యాగధనుల ఆశయాలు సాధిద్దాం’
నారాయణపేట: ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలు, జీవితాలను త్యాగం చేయడంతోనే నేడు దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఎస్పీ డా. వినీత్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని.. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీస్శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని చట్టపరంగా తక్షణ సాయం అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలన్నారు. తెలంగాణ పోలీస్శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని విధుల్లో వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి విధులను బాధ్యతగా నిర్వర్తిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, పోలీస్శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి తావులేదు
దామరగిద్ద: ఈ ప్రాంత రైతుల కోసం దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి కలను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్యెల్యేలు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాన్కుర్తి రిజర్వాయర్ దగ్గర నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు సాధనలో రెవెన్యూ అధికారులు, అఖిలపక్ష నాయకుల కృషి ఉందన్నారు. 800 ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు మధ్యవర్తిత్వం లేకుండా ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముందే పరిహారం డబ్బులు అందజేసిన ఘనత భారతదేశ చరిత్రలోనే లేదన్నారు. పేరపళ్ల భూ సేకరణలో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడమేనని మండిపడ్డారు. ధైర్యం ఉంటే స్థానిక రైతుల దగ్గరకు వచ్చి అడిగితే సమాధానం చెబుతారన్నారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మాత, శిశు ఆస్పత్రి, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. నదీ జలాలకు 300 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతానికి పైప్ల ద్వారా కాకుండా కాల్వల ద్వారా ఎలా నీటిని సరఫరా చేస్తారో చెప్పాలన్నారు. అనంతరం ప్రాజెక్టు పనులను విలేకర్లకు చూపించారు. కార్యక్రమంలో కాన్కుర్తి సర్పంచ్ నారాయణ మల్రెడ్డిపల్లి సర్పంచ్ శ్వేతా శివకుమార్, ఏఎంసీ చైర్మన్ సదాశివారెడ్డి, విండో అధ్యక్షుడు ఈదప్ప, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
సర్వే సాగిందిలా..
పాలనలో మార్పు రావాలి.. Iస్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. దేశం అన్నిరంగాల్లో ముందుకుసాగుతున్నా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలనలో మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది. అవినీతికి తావులేని పారదర్శక, సమర్థవంతమైన ప్రజాపాలన అందాలి. పోలీస్, న్యాయవ్యవస్థల్లో సంస్కరణలు రావాలి. మహిళలకు సత్వర న్యాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. మారుమూల గిరిజన గూడెంలలో కూడా సాంకేతికత అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజల జీవితాల్లో మరింత మెరుగైన మార్పే లక్ష్యంగా పాలన సాగాలని యువత ఆకాంక్షిస్తోంది. – చాతుర్య, డిగ్రీ విద్యార్థిని, నారాయణపేట ఆగస్టు 15 వస్తే ఇప్పటికీ పండగ గుర్తుకొస్తుంది. దసరా, దీపావళి మాదిరిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకునేవాళ్లం. ఆ రోజు ఊరంతా ఒకచోట చేరి జాతీయ జెండా ఎగురవేసి, మిఠాయిలు పంచుకునేవాళ్లం. అనంతరం సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలపై చర్చించి, అవసరమైన తీర్మానాలు చేసుకునేవాళ్లం. ఇన్నేళ్ల స్వాతంత్య్రంలో గతంతో పోలిస్తే ప్రజల్లో స్వార్థం పెరిగింది. గతంలో ‘మన ఊరు.. మన ప్రాంతం’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘నాకేమిస్తారు?’ అనే ధోరణి కనిపించడం బాధ కలిగిస్తోంది. 25 ఏళ్లుగా దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా.. పల్లెలు ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. – రంగారావు, తెలంగాణ పోరాట యోధుడు, మాజీ జెడ్పీటీసీ స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు? పల్లెలు మరింత అభివృద్ధి చెందాలి.. -
స్వేచ్ఛా సంబురం
నేడు స్వాతంత్య్ర వేడుకలు.. ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం నారాయణపేట: జిల్లాకేంద్రంలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుంచి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వరకు ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సాగేందుకు అన్ని సిద్ధం చేశారు. మరోవైపు భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరేడ్ మైదానం మొదలు జనం రద్దీగా ఉండే ప్రాంతాల వరకు ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ తనిఖీ.. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, వీఐపీలు, విద్యార్థులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అప్రమత్తమైన పోలీసులు.. వేడుకల నేపథ్యంలో భద్రత చర్యలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. శుక్రవారం పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీస్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్, కలెక్టరేట్, కోర్టు ప్రాంగణం, ప్రధాన కూడళ్లు, జనం రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, సంచులు, వాహనాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లావ్యాప్తంగా బందోబస్తు, నిఘాను ముమ్మరం చేశారు. పోలీస్ పరేడ్ మైదానంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పరేడ్ మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు రెండ్రోజులుగా కొనసాగుతున్న పోలీసు కవాతు రిహార్సల్స్ ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి.. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉదయం 9.30 గంటలకు మువ్వన్నెల జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 10.15 గంటలకు ముఖ్యఅతిథి సందేశం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత కార్యక్రమాలు కొనసాగనున్నాయి. -
ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచాలి : ఎస్పీ
నర్వ: ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అవసరమైన సందర్భాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆన్లైన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. డయల్ 100, 112 ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట మరికల్ సీఐ భగవంత్రెడ్డి, ఎస్ఐ పబ్బతి రమేష్ తదితరులు ఉన్నారు. -
ఆధునిక సాగు పద్ధతులు పాటించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. శుక్రవారం మండలంలోని జాజాపూర్ రైతువేధికలో ఆత్మ ఆధ్వర్యంలో బ్లాక్ ఫార్మర్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమిటీ ప్రధాన బాధ్యతలు, రైతుల సమస్యల గుర్తింపు, వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను గుర్తించి సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లడం, వారి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించేందుకు సూచనలు చేయడం, ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలును సమీక్షించడం, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ సలహాలు అందించడం ప్రధాన బాధ్యతల్లో భాగమని వివరించారు. అనంతరం ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ శాంతినిర్మల మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధరంగాలైన ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ తదితర శాఖాలతో సమన్వయం చేసుకుంటూ రైతులను ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ నరేష్, వ్యవసాయశాఖ అధికారులు దినకర్, నవీన్కుమార్, బాలాజీ ప్రసాద్, రహమన్, బీఎఫ్ఏసీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం మరికల్: సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ లాంగ్టర్మ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి బి.నాగమణిమాల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని చిలుకూరు టీజీఎస్డబ్ల్యూఆర్ ఫౌండేషన్లో బాలురు, మహేంద్రహిల్స్ ఫౌండేషన్లో బాలికలకు వేర్వేరుగా శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరం బైపీసీలో ఉత్తీర్ణులై నీట్–2026 పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అర్హులని తెలిపారు. వైబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారాలు తీసుకొని 22వ తేదీలోగా నారాయణపేట డీసీఓ లేదా మరికల్ గురుకుల పాఠశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 63045 73781 సంప్రదించాలని సూచించారు. గురుకుల సీట్ల భర్తీకి.. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి నాగమణిమాల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరికల్, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్, మద్దూర్, ఉట్కూర్ గురుకులాల్లో మొత్తం 130 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నారాయణపేట గురుకుల పాఠశాలలో జరిగే కౌన్సిలింగ్కు హాజరుకావాలని సూచించారు. -
79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం ● అవినీతి కూడా ప్రధాన సమస్య ● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయినా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం తమ జీవితాల్లో పూర్తిస్థాయిలో ప్రతిఫలించడం లేదనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. సామాజిక, ఆర్థిక అంతరాలు, అవినీతి, పేదరికం, నాణ్యమైన విద్య–వైద్య సేవల కొరత వంటి సమస్యలు ఇంకా సామాన్యులను ప్రభావితం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాల్లో సమానత్వం వంటి విలువలను రాజ్యాంగం ప్రతి పౌరుడికి హామీ ఇస్తోందని, వాటి అమలులో సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పలువురు పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి లభించే అవకాశాలు, పేదలకు అందే అవకాశాల మధ్య వ్యత్యాసం తగ్గాల్సి ఉందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రక్రియలను మరింత సరళీకరించాలని పలువురు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చట్టసభలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కులం, సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వివక్షకు తావులేని వాతావరణం ఏర్పడాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులకు ఏ మేరకు అందుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం పరిస్థితి ఎలా ఉంది? 79 ఏళ్ల ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరం? వంటి అంశాలపై ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన 250 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.79 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? -
ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సమగ్ర విచారణ
కోస్గి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాఖాలో అధికారులు, నాయకులు కుమ్మకై ్క ఇంటి స్థలం లేని ఓ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు. ఆ ఇంటిని ఓ రాజకీయ పార్టీ నాయకుడు పట్టణానికి దూరంగా వ్యవసాయ పొలంలో నిర్మించుకుంటున్న విషయాన్ని శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అధికారులా.. మజాకా’ శీర్షికన సమగ్ర వివరాలతో కథనం ప్రచురించడంతో జిల్లా అధికారులు స్పందించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని హౌజింగ్ పీడీ శంకర్ శుక్రవారం డీఈని ఆదేశించారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా ఏవైనా అక్రమాలు జరిగినట్లు రుజువైతే బాధ్యులైన అధికారులతో పాటు తప్పుచేసిన లబ్ధిదారులపై సైతం చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించిన బిల్లులను సైతం రికవరీ చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. పుర అధికారులు సంబంధిత మహిళను అడిగి తన దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని సూచించారు. ఏం కావాలన్నా ఇంటి నిర్మాణం చేస్తున్న సదరు నాయకుడినే అడగాలని మహిళ అధికారులకు తేల్చి చెప్పారు. ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సమగ్ర విచారణ జరిపి దుర్వినియోగమైన ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు బాధ్యులపై అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రత్యేక అధికారులు విస్తృతంగా పర్యటించాలి
నారాయణపేట: మండల ప్రత్యేక అధికారులు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మండలాల్లో నెలకొన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని, పీహెచ్సీలు, ఎంపీపీఎస్ పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. డ్రై డే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేజీబీవీల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. ఊట్కూరు, నారాయణపేట మండలాల అవసరాలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షనన్హాల్లో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారని.. లబ్ధిదారులకు ముందస్తు సమాచారం అందించి పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
అధికారులా మజాకా!
–8లో uసొంత స్థలం లేని మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు.. కోస్గి: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలో కొందరు అధికారులు నాయకులతో కుమ్మక్కవడంతో పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. కోస్గి పుర పరిధిలో వెలుగు చూసిన ఓ ఘటనే అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. కాగా తప్పు చేసింది మేము కాదంటే.. మేము కాదంటూ ఇటు పుర అధికారులు, అటు హౌజింగ్ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం విశేషం. పూర్తి వివరాలు పరిశీలిస్తే.. కోస్గి పుర పరిధిలోని 14వ వార్డులో ఉంటున్న కాకి చెన్నమ్మకు ఎలాంటి సొంత స్థలం లేకపోయినప్పటికీ అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు బిల్లులు రాగానే సగం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆమె పేరుతో 290074/620722 అప్లికేషన్ నంబర్తో మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించుకున్నారు. పుర అధికారులు ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ పొలంలో ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి త్వరితగతిన పనులు చేయించి తమవంతు సహకారం అందించారు. గతేడాది అక్టోబర్లో మొదటి విడత బెస్మెంట్ బిల్లు చెల్లించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అధికారుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపడంతో కోస్గితో పాటు పోతిరెడ్డిపల్లిలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోతిరెడ్డిపల్లిలో ఇళ్లు మంజూరుకాని వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇంటి నిర్మాణం చేయించిన అధికారులు ఎలాంటి నిర్మాణం చేయని వారికి బిల్లులు చెల్లించిన ఘటన వెలుగులోకి రావడంతో సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన వారికే బిల్లులు ఇవ్వాలని అప్పట్లో అధికారులు ఆదేశించారు. కాని స్థానిక అధికారులు గుట్టుచప్పుడు కాకుండా అర్హతలు లేని ఇంటి నిర్మాణాలకు బిల్లులు చెల్లించి అందినంతా దండుకున్నారు. అదే ఇంటిని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఓ నాయకుడు బినామీదంటూ ఏడాదిగా బిల్లులు మంజూరు చేయని అధికారులు తాజాగా గుట్టుచప్పుడు కాకుండా చెల్లింపులు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు.. సమగ్ర విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు -
జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం
నారాయణపేట: జిల్లాలోని పలుచోట్ల గురువారం వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 5.27 మి.మీ.గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా గుండుమాల్ మండలంలో 18.0 మి.మీ., దామరగిద్దలో 16.2, కొతపల్లిలో14.8, కోస్గిలో 6.4, మద్దూరులో 5.4, కృష్ణాలో 3.8, నారాయణపేటలో 2.6, ధన్వాడలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఊట్కూర్, మాగనూర్, మక్తల్, నర్వ, మరికల్ల్లో వర్షం కురవలేదు. 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు 21న ఉదయం 9 గంటల వరకు రిపోర్టు చేయాలని.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొననున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 91007 53683 సంప్రదించాలని సూచించారు. దత్తక్షేత్రంలో సినీనటుడు శ్రీకాంత్ సందడి మక్తల్: మండలంలోని పస్పుల వద్ద పవిత్ర కృష్టానది ఒడ్డున వెలసిన శ్రీదత్తక్షేత్రంలో ప్రము ఖ నటుడు హీరో శ్రీకాంత్ సందడి చేశారు. పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం కావడంతో గురువారం ఆయన కుటంబ సభ్యులతో కలిసి దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు. బోటులో ఆలయానికి చేరుకొని పూజలు జరిపించి మొక్కు లు చెల్లించుకున్నారు. సినీ నటుడు శ్రీకాంత్ పస్పులకు వచ్చారనే సమాచారంతో స్థానికులు, అభిమానులు అక్కడి చేరుకొని ఫొటో లు దిగేందుకు పోటీ పడ్డారు. జాతీయ జెండా ఎగురవేసేది వీరే.. ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జరిగే జాతీయ పతాకాన్ని ఎగురవేసే వారి పేర్లను గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర కు ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహ బూబ్నగర్ జిల్లాకేంద్రంలో రాష్ట్ర ఎకై ్సజ్, పరా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నారాయణపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి, నాగర్కర్నూల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జోగుళాంబ గద్వాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, వనపర్తిలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అలాగే ప్రభు త్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. స్వాతంత్య్ర వేడుకల పరేడ్ ప్రాక్టిస్ నారాయణపేట: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించే పోలీస్ పరేడ్ ప్రాక్టిస్ను గురువారం అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్ పరిశీలించారు. సిబ్బంది కవాతు, బ్యాండ్ సమన్వయం, ఏకరూపత తదితర అంశాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమన్వయం, క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని సూచించారు. ఆర్ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు. తగ్గిన వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి అచ్చంపేట/ఆత్మకూరు: ఎగువ నుంచి వస్తు న్న వరద తగ్గిపోవడంతో గురువారం జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 101.356 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. మరోవైపు శ్రీశైలం జలాశయంలో పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879.30 అడుగులు నమోదైంది. జలాశయంలో 183.8486 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి 30,003 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,160 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు పదివేల క్యూసెక్కులు విడుదల చేశారు. -
కోయిల్సాగర్ నీటిని విడుదల చేయాలి
రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు మరికల్: కోయిల్సాగర్ ఆయకట్టుకు ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం మరికల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులో 16 అడుగులకు నీళ్లు చేరగానే సాగునీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 17 అడుగులకు చేరినా అధికారులు కాల్వల ద్వారా రైతులకు సాగునీరు వదలడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండుముఖం పడడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో ఇరుక్కురన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయకట్టు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ వైస్ ఎంపీపీ రవి, నాయకులు రామస్వామి, బసంత్, నారాయణ, ప్రకాశ్శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
కేసుల దర్యాప్తులో జాప్యం సరికాదు
నారాయణపేట ఎడ్యుకేషన్: కేసుల దర్యాప్తులో జా ప్యం చేస్తే సహించేది లేదని, పోలీసు అధికారులు నీతి నిజాయితీతో పని చేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో నిర్వహించిన జిల్లాస్థాయి క్రైం రివ్యూకు ఆయన హాజరై మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన విచారణ జరగాలని.. సరైన ఆధారాలతో నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిషేధిత గంజాయి, గుట్కా, మట్కా, జూదంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని కోరారు. అనంతరం జూలైలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 33 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. -
ఆ ఇద్దరి రూటే సపరేటు!
డిస్ట్రిక్ట్ క్లబ్లో దావత్లు? బదిలీ కోసం వచ్చే సిబ్బంది నుంచి డిస్ట్రిక్ట్ క్లబ్లో నాటుకోడి పులుసు, ఖరీదైన మద్యం బాటిళ్లతో దావత్ ఏర్పాటు చేయించుకునేవారని కొందరు ఆరోపిస్తున్నట్లు సమాచారం. తమకు తగిన ‘మర్యాద’ చేయని వారిపై ఉన్నతాధికారి వద్ద ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురిచేసేవారని సిబ్బంది వాపోతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ క్లబ్లో సదరు వ్యక్తి కోసం ప్రత్యేక గది కూడా ఉండేదన్న ప్రచారం పోలీస్శాఖలో ఉంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఉన్నతాధికారి పేరు చెప్పి కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మహబూబ్నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖలో ఓ ఉన్నతాధికారి వ్యవహారాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. డీఐజీ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపైనా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి పేరు చెప్పుకుంటూ బదిలీలు, ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. తమ మాట వినని సిబ్బందిపై పెద్ద సార్కు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023లో ఐదు జిల్లాలను కలిపి జోగుళాంబ జోన్–7 ఏర్పాటు చేయడంతో దాని పర్యవేక్షణకు డీఐజీ స్థాయి అధికారిని నియమించారు. డీఐజీ కార్యాలయంలో విధుల కోసం వివిధ హోదాల్లో సిబ్బందిని అటాచ్ చేశారు. వీరిలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు గన్మెన్స్, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఏఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులున్నారు. వీరిలో ఇద్దరు సిబ్బంది డీఐజీకి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీఐజీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐల బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సదరు ఇద్దరు సిబ్బంది బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన ఓ సిబ్బంది బదిలీల వ్యవహారాన్ని చక్కబెట్టేవారని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమను సంప్రదించే సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని.. మాట వినని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయించేలా ఉన్నతాధికారులపై ప్రభావం చూపేవారని కొందరు ఆ రోపిస్తున్నట్లు సమాచారం. అనంతరం వారు సర్దుబాటు చేసుకుంటే తిరిగి కోరుకున్న ప్రాంతాలకు మార్పులు జరిగేవన్న విమర్శలు ఉన్నాయి. డీఐజీ కార్యాలయంలో వారు చెప్పిందే వేదం బదిలీల్లో జోక్యం.. దావత్లు, డబ్బుల డిమాండ్పై ఆరోపణలు మాట వినని సిబ్బందిపై పెద్దసార్కు చాడీలు ఉన్నతాధికారి పేరు చెప్పి పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు.. ఎస్ఐల బదిలీలకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు డిమాండ్ చేసేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిమాండ్కు అంగీకరించని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేవారని.. ఆ తర్వాత వారు సర్దుబాటు చేసుకుంటే కోరుకున్న స్థానాలకు మార్పులు జరిగేవన్న ఆరోపణలు ఉన్నాయి. గత మూడున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు కలిపి సుమారు 300 మందికి పైగా.. ఎస్ఐలు వంద మందికిపైగా బదిలీ అయినట్లు సమాచారం. ఈ బదిలీల్లో సదరు ఇద్దరి పాత్రపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు పోలీసు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహించలేక గతంలో పలువురు పోలీసు సిబ్బంది హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అక్కడ పనిచేయడం కంటే ఉద్యోగమే వదిలేస్తామని కొందరు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వారి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించిన ఘటనలు పలుమార్లు జరిగాయని తెలుస్తోంది. బదిలీలకు ‘రేటు’? విచారణకు డిమాండ్ డీఐజీ కార్యాలయంలో పనిచేసిన ఈ ఇద్దరు సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని పోలీస్ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. బదిలీలు, దావత్లు, డబ్బుల డిమాండ్ వంటి ఆరోపణల్లో వాస్తవమెంత? ఉన్నతాధికారి పేరు చెప్పుకుని వారు వ్యవహరించారా? అనే అంశాలపై విచారణ జరిపితే స్పష్టత వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు.. వారిని ఆ స్థానం నుంచి బదిలీ చేయాలని కోరుతున్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
మక్తల్: గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఎస్ఈ నవీన్కుమార్ తెలిపారు. గురువారం నియోజకవర్గంలోని కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మక్తల్ సబ్స్టేషన్ దగ్గర ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ఏమైనా ఇబ్బందులుంటే పరిశీలించి నమోదు చేసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. త్వరలో ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని అన్ని గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్మెన్ల పరిధిలో లేని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రెండు, మూడు గ్రామాలకు ఒక అధికారిని నియమించి క్షేత్రస్థాయిల్లో పరిశీలిస్తామని చెప్పారు. ఆయన వెంట ఏడీఈ విజయకుమార్, ప్రదీప్కుమార్, గంగాధర్, సుధారాణి, డీఈలు నర్సింగ్రావు, రాజునాయక్, ఏఈలు వెంకటేష్గౌడ్, మహేష్గౌడ్, సిబ్బంది ఉన్నారు. -
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట: బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రియాంక అన్నారు. గురువారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్పీ డా. వినీత్ పాల్గొని పురోహితులు, పాస్టర్లు, ఖాజీ లకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహం చేయడంతో విద్య, ఆరోగ్యం, భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బాల్య వివాహాల నివారణలో పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు కీలక పాత్ర పోషిస్తారని, బాల్య వివాహం నిర్వహించేందుకు ఎవరైనా సంప్రదిస్తే అడ్డుకోవాలని చెప్పారు. కుటుంబ ఒత్తిడి, ప్రేమ వ్యవహారం, సామాజిక పరిస్థితులు తదితర కారణాలను చూపుతూ బాల్య వివాహాలను సమర్థించడం సరికాదని స్పష్టం చేశారు. చిన్న వయసులో గర్భధారణతో రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే తహసీల్దార్, సీడీపీఓ లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శ్రావణ మాసంలో జరిగే వివాహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద సందర్భాల్లో తక్షణమే పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. బాల్య వివాహం చట్ట విరుద్ధం.. వివాహం పవిత్రమైన కార్యక్రమమే అయినప్పటికీ బాల్య వివాహం మాత్రం చట్టవిరుద్ధమని ఎస్పీ డా. వినీత్ స్పష్టం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించే సమయంలో జాతకం, గుణమేళనం వంటి అంశాలను పరిశీలించినట్లే వధూవరుల వయసును కూడా తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. 18 ఏళ్లు పూర్తికాని బాలిక వివాహానికి అంగీకరించవద్దని, వయస్సుపై అనుమానం ఉంటే వివాహాన్ని నిర్వహించకుండా పోలీస్, సీడీపీఓ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తప్పుడు ధ్రువపత్రాలతో వివాహం జరిపించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలకు వివాహమే జీవిత లక్ష్యం కాదని, విద్య, ఉద్యోగం, స్వయం సమృద్ధి, మంచి భవిష్యత్ లక్ష్యాలుగా ఉండేలా సమాజం ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సర్పంచులు, చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మక్తల్, కొడంగల్, కోస్గి తదితర ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన బ్రోచర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, డీపీఆర్వో రషీద్, డీసీపీఓ కరిష్మా, చైల్డ్లైన్ తిరుపతయ్య, సీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
ఒత్తిళ్లతోనే బిల్లులు మంజూరు..
కాకి చెన్నమ్మకు మొదటివిడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ముగ్గు వేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన మాట వాస్తవమే. కాని ఆ మహిళకు, నిర్మాణం చేస్తున్న స్థలానికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో అధికారుల ఆదేశాల మేరకు బిల్లులు నిలిపి వేశాం. తర్వాత స్థానిక పుర అధికారితో పాటు పురపాలికకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో బెస్మెంట్ బిల్లు, రూఫ్ లెవల్ బిల్లు మంజూరు చేయాల్సి వచ్చింది. మంజూరైన బిల్లులు సైతం కాకి చెన్నమ్మ బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. చెత్తు లెవల్ బిల్లు సైతం మంజూరైంది కాని బ్యాంకులో జమ కాలేదు. – అర్బాజ్, వార్డు అధికారి, కోస్గి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేవలం ప్రభుత్వం నిర్దేశించిన కొలతల మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయం పర్యవేక్షించడం మాత్రమే నా బాధ్యత. ఇళ్లు మంజూరు చేయడం, ముగ్గు వేయడం, నిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాల పరిశీలన అంశాలు పూర్తిగా పుర అధికారులదే. వార్డు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి బిల్లు మంజూరు కోసం ఏఈ లాగిన్కు పంపిస్తారు. నిర్మాణ కొలతలు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఓకే చేయడం మాత్రమే నా బాధ్యత. – శివకుమార్, హౌజింగ్ ఏఈ, కోస్గి ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను మొదట వార్డు అధికారి పరిశీలించి హౌజింగ్ అధికారుల లాగిన్కు పంపిస్తారు. వార్డు అధికారి, హౌజింగ్ ఏఈ నిర్ధారించిన బిల్లులను మాత్రమే అప్రూవల్ చేస్తా. బిల్లుల మంజూరు విషయంలో పూర్తి బాధ్యత క్షేత్రస్థాయిలో పరిశీలించే వార్డు అధికారి, హౌజింగ్ ఏఈదే. అనర్హులకు బిల్లు మంజూరు చేసిన విషయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, పుర కమిషనర్, కోస్గి ● -
ఆరుతడి పంటలే సాగు చేయాలి
వనపర్తి: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.. ఉమ్మడి పాలమూరు రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకొని నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సూచించారు. బుధవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి వారితో పాటు ఎమ్మెల్యేలు, నీటిపారుదల, వ్యవసాయశాఖ అఽధికారులు హాజరయ్యారు. ఎల్నినో కారణంగా కరువు పరిస్థితులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టం, రాబోయే రోజుల్లో సాగు, తాగు అవసరాల దృష్ట్యా నీటి నిల్వలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదతో ప్రస్తుతానికి ప్రాజెక్టులు నింపుకొన్నామని.. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. రాబోయే రోజుల్లో తిరిగి నీటి విడుదల జరిగితేనే రైతులకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సాగునీటి విడుదలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అదృష్టవశాత్తు కర్ణాటకలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో జూరాలకు వరద వచ్చిందని.. వరి సాగు చేస్తే డిసెంబర్ వరకు నీరు అవసరం ఉంటుందన్నారు. అప్పటి వరకు ఇవ్వాలంటే వర్షాలు కురవడం తప్పనిసరని.. ఎల్నినో ప్రభావంతో రానున్న రెండు, మూడునెలలు ఆశించిన మేర వర్షాలు కురిసే అవకాశాలు లేవని తెలిపారు. రూ.వేల పెట్టుబడితో వరి సాగు చేసి నష్టపోవడం కంటే ఆరుతడి పంటలు సాగు చేయడమే రైతుకు శ్రేయస్కరమన్నారు. ప్రస్తుత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వచ్చినప్పుడు సరిపడా సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వారబంధి విధానంలో నీళ్లు వదలాలన్నారు. జిల్లాలోని జలాశయాలకు ఎంత నీరు వస్తోంది.. ఎంత వదులుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, విజయుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, సీహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్బాషా, హేమంత కేశవ్ పాటిల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నీటి విడుదల, పంటల సాగుపై సుదీర్ఘంగా చర్చ పాల్గొన్న ఎమ్మెల్యేలు, సాగునీటి, వ్యవసాయశాఖ అధికారులు -
‘చేయూత’ దరఖాస్తుల స్వీకరణ
నారాయణపేట ఎడ్యుకేషన్/కోస్గి: చేయూత పింఛన్కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట పుర చైర్పర్సన్ కొండా శ్వేత, పుర కమిషనర్ శంకర్, కోస్గి పుర కమిషనర్ శ్రీకాంత్ బుధవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఇతర అర్హులైనా వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, సంబంధిత కేటగిరి ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు జత చేయాలని సూచించారు. దరఖాస్తులను పుర కార్యాలయం లేదా సంబంధిత వార్డు అధికారికి అందజేయాలని కోరారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింద్యానాయక్ సూచించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని ద్వారక పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమెతో పాటు డీఎంహెచ్ఓ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ప్రభుత్వ చట్టాల మీద అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థితో చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్లైన్ నంబర్ 181, ఉచిత న్యాయ సాయం టోల్ఫ్రీ నంబర్ 15100, అత్యవసర సేవలు 112 నంబర్లు ఉండాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ డా. జయచంద్రమోహన్ అవవయ దానం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, అడ్వొకేట్ నందూనామాజీ, ప్రిన్సిపాల్ అలేఖ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. -
పారదర్శక దర్యాప్తుతో శిక్షల శాతం పెంచాలి
నారాయణపేట: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో మక్తల్, కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్,్ గ్రేవ్, నాన్గ్రేవ్ కేసుల దర్యాప్తు, పురోగతిని సీఐలు, ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలు, సేకరించాల్సిన ఆధారాలు, ప్రామాణిక విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో కేసులను ఛేదించాలని సూచించారు. శిక్షల శాతం పెంచేందుకు పటిష్టమైన సాక్ష్యాదారాలు సేకరించడం కీలకమన్నారు. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దాడులు నిర్వహించి అరికట్టాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి స్టేషన్న్ నిర్వహణతో పాటు దర్యాప్తులో పూర్తిస్థాయి నైపుణ్యాలు కలిగి ఉండాలని తెలిపారు. కేసుల వివరాలను ప్రతిరోజూ ఆనన్లైన్లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ‘మన గ్రామం–మన పోలీసు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పోలీసువాల్ వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే వినాయకచవితిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సీఐలు రాంలాల్, సైదులు, ఎస్సైలు అశోక్బాబు, రాజు, ఎస్ఎం నవీద్, రమేష్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డీఐజీ చౌహాన్పై బదిలీ వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ● ఇన్చార్జి డీఐజీగా షాన్వాజ్ ఖాసీం మహబూబ్నగర్ క్రైం: పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో ఉంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు.. తనిఖీలకు వెళ్లిన ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్పై ఆకస్మికంగా వేటు పడింది. ఆయనను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (వెయిటింగ్) చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాత్కాలికంగా ఐజీ షాన్వాజ్ ఖాసీంకు ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ జోన్–7 ఏర్పాటైన తర్వాత తొలి డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆయనను రామగుండం సీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినప్పటికీ.. అవి అమలు కాకపోవడంతో ఇక్కడే కొనసాగారు. దాదాపు మూడున్నరేళ్లుగా ఇదే పోస్టులో కొనసాగుతున్న ఆయన తీరుపై మొదటి నుంచీ పోలీసు వర్గాల్లో పలు విమర్శలు వినిపించాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీల వ్యవహారంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. తనిఖీల సందర్భంగా కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని, బదిలీల విషయంలోనూ తనకు అనుకూలంగా వ్యవహరించేవారనే విమర్శలు పోలీసు వర్గాల్లో వినిపించాయి. -
రాజీవ్గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు ఘన స్వాగతం
నారాయణపేట/మక్తల్: రాజీవ్గాంధీ జ్యోతి సద్భావన యాత్రకు బుధవారం జిల్లాలో కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తమిళనాడు నుంచి ప్రారంభమైన యాత్ర వివిధ రాష్ట్రాల మీదుగా కర్ణాటకకు చేరుకొని అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. ఉదయం 10 గంటలకు మక్తల్ మండలంలోని కృష్ణా వంతెన వద్ద సద్భావన జ్యోతిని రాయచూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, సద్భావన యాత్ర కర్ణాటక కన్వీనర్ ఆర్.దోరైవేలు స్వామి చేతుల మీదుగా డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి స్వీకరించారు. అక్కడ ప్రారంభమైన యాత్ర 12 గంటలకు మక్తల్కు, మధ్యాహ్నం ఒంటిగంటకు నారాయణపేట సింగారం గేట్కు చేరుకుంది. అక్కడి నుంచి జిల్లాకేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా జలాల్పూర్ వరకు కొనసాగింది. అనంతరం సద్భావన జ్యోతిని కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేశారు. రాజీవ్గాంధీ ఆశయమైన జాతీయ సమైక్యత, సోదరభావం, శాంతి, సద్భావన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ఉద్దేశమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మక్తల్లో జరిగిన కార్యక్రమంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్టా సురేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, యువజన అధ్యక్షుడు భాస్కర్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, నారాయణపేటలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగదీష్, సుజేంద్రశెట్టి, మార్కెట్ చైర్మన్ ఆర్,శివారెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు మనోహర్గౌడ్, కోట్ల రవీందర్రెడ్డి, కోట్ల మధుసూదన్రెడ్డి, వెంకటేష్గౌడ్, కొంకల్ శ్రీనివాస్రెడ్డి, పేరపళ్ల శంకర్, వకీల్ సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
అక్టోబర్ 2 లక్ష్యంగా వేగవంతం
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ఆయా మండలాల్లో కేటాయించిన సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడుగుంతల ని ర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని కొత్తపల్లి మండలం భూనీడు, గుండుమాల్ మండలం ఆమ్లీకుంటలలో కేంద్రబృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. అక్టోబర్ 2 డెడ్లైన్తో పనులు పూర్తి చేసేలా పనుల వేగవంతం చేస్తున్నాం. పైలెట్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో పనులను పర్యవేక్షిస్తున్నాను. మరో కొన్నిరోజుల్లో లక్షా్య్న్ని చేరుకుంటాం. – మాలిక్, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ కలెక్టర్ ఆదేశాల మేరకు జి ల్లాకు కేటాయించిన లక్ష్యా న్ని అందిపుచ్చుకునేలా మహిళా సమాఖ్య, ఎస్బీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశాం. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటాం. కేంద్ర బృంధం యూ నిసెఫ్ సభ్యులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అంచనా నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించేందుకు ఇటీవల పర్యటన చేపట్టారు. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
మక్తల్: నాగర్కర్నూల్లో సీనియర్ న్యాయవా ది ఎం.వేణుగోపాల్రావుపై దాడికి నిరసనగా బుధవారం మక్తల్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఎం.వేణుగోపాల్రావుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో న్యాయవాదులు తిమ్మన్న, ఆడెం శ్రీనివాసులు, దత్తాత్రేయ, పసుల నీరజ్, రవికుమార్గౌడ్, వెంకటేష్గౌడ్, సురేందర్, శివకుమార్, సూర్యప్రకాష్, సతీష్కుమార్, ఆచారి, రంకుల ఆనంద్, రవికుమార్గౌడ్, సురేందర్, ఆనంద్ పాల్గొన్నారు. కోయిల్సాగర్లో 16 అడుగుల నీటిమట్టం మరికల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తుండటంతో బుధవారం కోయి ల్సాగర్ ప్రాజెక్టులో 16 అడుగుల నీటిమట్టం ఉంది. జూరాలకు ఎగువ నుంచి మళ్లీ వరద కొనసాగడంతో కోయిల్సాగర్ నిండుతుందనే ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తీలేర్ పంపుహౌస్ నుంచి ఒక మోటార్ ద్వారా 15 రోజులుగా నీటిని తరలిస్తున్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 32 అడుగులు కాగా.. ప్రస్తుతం సగం నిండింది. దీంతో ఆయకట్టు రైతుల్లో సాగుపై ఆశలు పెరుగుతున్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ఇంటర్వ్యూలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అధికారులు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ క్రాంతికిరణ్, సభ్యులు గోవర్ధన్రెడ్డి, నిరంజన్గౌడ్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. ● పీయూ బాలుర హాస్టల్ను రిజిస్ట్రార్ రమేష్బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. వార్డెన్లు కృష్ణయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి వాలీబాల్ అకాడమీ పునఃప్రారంభం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా వాలీబాల్ అకాడమీని ఈనెల 13 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరూ యథావిధిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కోచ్లు, వార్డెన్తో పాటు సిబ్బంది అందరూ విధుల్లో చేరాలని సూచించారు. సీతాఫల్ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం మహబూబ్ననగర్ న్యూటౌన్: జిల్లాలో అటవీశాఖ పరిధిలోని మూడు యూనిట్లకు నిర్వహించిన సీతాఫల్ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం వచ్చింది. డీఎఫ్ఓ రేవంత్చంద్ర ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం ప్రాంగణంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించారు. మహబూబ్నగర్, నవాబ్పేట, మహమ్మదాబాద్ యూనిట్లకు అటవీ ప్రాంతంలో సీతాఫలాల సేకరణ హక్కులు కల్పించేందుకు టెండర్లు నిర్వహించారు.మహబూబ్నగర్ యూనిట్కు నిర్వహించిన వేలం పాటలో పది మంది పాల్గొనగా.. తాటి శ్రీనివాసులు రూ.14 లక్షలకు దక్కించుకున్నారు. నవాబుపేట యూనిట్ను మక్సూ ద్ అలీ రూ.5.41 లక్షలకు, మహమ్మదాబాద్ యూనిట్ను జి.కేశవులు రూ.8.05 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ అటవీ రేంజ్ అధికారి రాజేందర్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్హాయ్, పరిపాలనాధికారి పద్మజ పాల్గొన్నారు. -
స్వచ్ఛతే లక్ష్యంగా నిధులు
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70 శాతం నిధులు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్ల మంజూరు ● మహిళా సంఘ భవనాలు, రద్దీ ప్రాంతాలు, ఆలయాల వద్ద నిర్మాణాలు ● అక్టోబర్ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్ మిషన్ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు. 17 మరుగుదొడ్లు.. 30 మహిళా సంఘాల భవనాలు జిల్లాలో 17 సామూహిక మరుగుదొడ్లు, మహిళా సంఘాల భవనాల వద్ద 30 మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యంగా నిర్ణయించారు. డ్రైనేజీ ఎండింగ్ పాయింట్ల వద్ద 235 సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. ఇందుకోసం గ్రామ పంచాయతీ తీర్మానం, ఎంపీడీఓ అనుమతి తప్పనిసరి చేశారు. ఇప్పటికే నారాయణపేట మండలం కోటకొండ, దామరగిద్ద మండలం క్యాతన్పల్లి, గుండుమాల్ మండలం ఆమ్లీకుంట, కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ పంచాయతీల్లో కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం జరిపారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. షాద్నగర్కు చెందిన గుండ్రాతి స్వామి, స్వరూప కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
మాగనూర్/కృష్ణా: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులుండే అవకాశం ఉన్నందున రైతులు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.సక్రియానాయక్ సూచించారు. మంగళవారం కృష్ణా మండలంలోని ఆలంపల్లి, చేగుంట గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్తో కలిసి తనిఖీ చేయడంతో పాటు మాగనూర్ రైతువేధికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని, ఎఫ్ఎస్ఎస్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవాలన్నారు. రైతులు ఎరువులు బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే డీలర్లు ఆ సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ఓ వలంటీర్ను నియమించుకోవాలని, ప్రతి ఒక్కరు యాప్పై అవగాహన ఉండాలని కోరారు. ఎరువుల పంపిణీ, లభ్యత విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా రైతువేధిక ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాగనూరులో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్, ఏఈవో పవన్, రాధిక, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
సర్.. సక్సెస్
జిల్లాలో ముగిసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ● నారాయణపేట 84.92, మక్తల్ 84.27, కొడంగల్ 84.19 శాతం ● ఈసీకి తుది నివేదిక సమర్పణపై అధికారుల కసరత్తు ● జిల్లాలో 7.46 లక్షల మంది ఓటర్ల వివరాల పరిశీలన ● 829 మంది బీఎల్వోలు.. 45 రోజుల పాటు... బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026–8లో uఓటరు జాబితా పకడ్బందీగా ఉంటేనే ప్రజా స్వా మ్య ప్రక్రియ మరింత పార దర్శకంగా ఉంటుంది. అందుకే ప్రతి ఓటరు వివరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ, వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. – సీహెచ్ ప్రియాంక, కలెక్టర్ మత్స్యకారులకు రూ.5 లక్షల ప్రమాద బీమా నారాయణపేట: మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం వద్ద స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలో సభ్యత్వం కలిగిన సుమారు 12 వేల మంది మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందినా, శాశ్వత వైకల్యం పొందినా కుటుంబానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రమాదవశాత్తు ఆస్పత్రిలో చికిత్స పొందిన సందర్భంలో వైద్యం కోసం గరిష్టంగా రూ.25 వేల వరకు చెల్లిస్తారని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి బీమా పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డికి జిల్లా మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 85.590 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్:ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగు వ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో మంగళవా రం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వా రా 234 మెగావాట్లు, 49.266 ఎంయూ, దిగు వ కేంద్రంలోని 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 36.324 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేసి నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రెండు కేంద్రాల్లో కలిపి 85.590 ఎంయూ వి ద్యుదుత్పత్తి చేసినట్లు చెప్పారు.ప్రస్తుతం 40, 537 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలి గద్వాల: ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నారాయణపేట: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, క్షేత్రస్థాయి పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రి య జిల్లాలో ముగిసింది. మక్తల్లో 284, నారాయణపేటలో 270, కొడంగల్లో 275 మంది, మొత్తం 829 మంది బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పనిచేశారు. సేకరించిన వివరాలను క్రోడీకరించి అనర్హత, డూప్లికేట్, మృతిచెందిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను పరిశీలించి తుది నివేదికలను ఎన్నికల సంఘానికి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొడంగల్పై స్పెషల్ ఫోకస్.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి దశలోనూ పురోగతిని పర్యవేక్షిస్తూ బీఎల్వోల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయించింది. 2,51,255 మంది ఓటర్లకుగాను 2,11,527 మంది వివరాలు డిజిటలైజ్ కాగా.. 84.19 శాతం ప్రక్రియ పూర్తయింది. మక్తల్ నియోజకవర్గంలో.. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రా తినిథ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 2, 52,801 మంది ఓటర్లుండగా.. 2,13,044 మంది వివరాలు డిజిటలైజ్ చేయడంతో 84.27 శాతం నమోదైంది. నారాయణపేట ముందంజ.. నారాయణపేట ని యోజకవర్గం డిజిటలైజేషన్లో మిగతా నియోజకవర్గాల కంటే ముందంజలో నిలిచింది. మొత్తం 2,42 ,773 మంది ఓటర్లకుగాను 2,06,170 మంది వివరాలు ఆన్చేసి 84.92 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. డబుల్ ఓట్లు మరో సవాల్.. కొడంగల్లో 10, 182, నారాయణపేటలో 5,672, మక్తల్లో 4,314 మంది ఓట్లు డబుల్ ఎంట్రీగా గుర్తించారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో ఇది కీలక అంశంగా మారింది. ఈసీవైపు చూపు.. ఎన్యూమరేషనన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవడంతో తదుపరి దశపై ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో మృతిచెందిన, వలస, డబుల్ ఓట్లు, అందుబాటులో లేని ఓటర్లు తదితర వివరాల ఆధారంగా ఎన్నికల సంఘానికి నివేదిక లు సమర్పించనున్నారు. అనంతరం వచ్చే మార్గదర్శకాల మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగనుంది. నారాయణపేటలో వివరాలు ఆన్లైన్ చేస్తున్న బీఎల్వోలు (ఫైల్)మక్తల్ నియోజకవర్గం మండలం బీఎల్వోలు ఓటర్లు డిజిటల్ తొలగింపు మృతి షిఫ్టింగ్ అమరచింత 26 23,080 20,701 2,379 622 1,476 ఆత్మకూర్ 35 31,500 26,859 4,641 993 2,782 కృష్ణా 29 22,439 18,012 4,427 628 3,577 మాగనూర్ 25 20,208 17,772 2,436 799 1,380 మక్తల్ 74 68,791 55,439 13,352 2,717 9,163 నర్వ 31 29,087 25,450 3,657 993 1,989 ఊట్కూర్ 51 46,768 39,113 7,655 1,813 4,755 మదనాపురం 4 2,022 1,836 286 62 73 మరికల్ 9 8,906 7,862 1,044 294 534 నారాయణపేట నియోజకవర్గం.. దామరగిద్ద 53 45,694 39,811 5,883 1,217 3,117 ధన్వాడ 39 30,864 26,593 4,271 787 2,408 కోయిల్కొండ 61 56,594 49,101 7,493 2,043 2,775 మరికల్ 27 24,617 20,314 4,303 787 3,045 నారాయణపేట 90 85,004 70,351 14,653 2,630 10,168 కొడంగల్ నియోజకవర్గం.. దౌల్తాబాద్ 46 41,328 34,551 6,764 1,840 1,784 మద్దూర్ 44 39,501 33,223 6,278 1,329 2,577 కొత్తపల్లి 18 16,972 14,537 2,345 555 1,039 కోస్గి 39 37,537 30,542 6,995 1,397 3,400 గుండుమాల్ 20 17,860 15,359 2,501 589 1,239 బొంరాస్పేట 38 32,858 28,448 4,410 1,029 1,723 దుద్యాల 29 25,094 21,072 4,022 820 2,262 కొడంగల్ 41 40,105 33,795 6,310 1,587 2,962 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్తో కథ ముగియలేదు. డిజిటలైజ్ కాని వాటిలో మృతిచెందిన, డబుల్ ఎంట్రీ, అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరణించిన ఓటర్లు మక్తల్లో 8,921, కొడంగల్లో 9,146 మందిగా నమోదయ్యాయి. నారాయణపేటలోనూ వేలాది మంది ఉన్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. కాగా.. వలస వెళ్లిన, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. మక్తల్లో 25,729 మంది, నారాయణపేటలో 21, 508 మంది, కొడంగల్లో 16,986 మంది ఉన్నట్లు తెలిపారు. మండలాల వారీగా వివరాలు ఇలా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఎల్వోలు సుమారు 45 రోజుల పాటు ఇల్లిల్లూ తిరిగి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఎన్యూమరేషనన్ ఫారాల పంపిణీ, వివరాలు పూర్తి చేసిన తర్వాత సేకరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
సైబర్ నేరస్తులతో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా, వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. మ న ఊరు–మన పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని లింగంపల్లిలో పర్యటించి గ్రామస్తులకు పోలీస్శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలు, చట్టపరమైన అంశాలు, ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేసేందుకు గ్రామంలో పోలీస్వాల్ ఏర్పా టు చేశామని.. ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆఫర్లు, బ్యాంకింగ్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఇతరులకు వెల్లడించరాదని సూచించారు. ఎవరైనా సైబర్క్రైం బారినపడితే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎస్ఐ సతీష్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయకట్టు.. ఆందోళన
●రైతుల ప్రయోజనాల కోసమే.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుచేయాల్సిన పంటలు, సాగునీరు అందించేందుకు ఉన్న వనరులపై చర్చించి.. రైతులు నష్టపోకుండా సమష్టి నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు ఐఏబీ సమావేశం దోహదపడుతుంది. కొన్నేళ్లుగా ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నందున సమావేశాల అవసరం రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం వచ్చింది. – చంద్రశేఖర్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ, వనపర్తి గద్వాల/వనపర్తి: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద వస్తోందని సంబురపడ్డారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. అయితే వీరి ఆనందం తాత్కాలికమేనని జూరాలకు తగ్గిన వరదతో స్పష్టమైంది. ప్రియదర్శిని జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 15 రోజులకు పైగా భారీగా వరద వచ్చి చేరగా.. ఆదివారం నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు జూరాల క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేశారు. పదేళ్ల కాలంలో వానాకాలం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మంగళవారం తిరిగి ఎనిమిది గేట్లు తెరిచారు. దీనితో పాటు విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తుండగా.. నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలకు నీటి విడుదలను తగ్గించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుచేసిన వరిపంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలకే సాగునీటిని విడుదల చేస్తామంటున్న అధికారుల ప్రకటనతో అన్నదాతల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం వనపర్తిలో జరిగే ఇరిగేషన్ బోర్డు సమావేశంలో పంటలకు సాగునీటి లెక్కలు తేలనున్నాయి. గడ్డు కాలమే.. వానాకాలంలో నెలన్నర రోజులపాటు జూరాల జలాశయం నీరులేక వెలవెలబోయింది. వానాకాలంలో జలాశయం అడుగంటిన పరిస్థితి దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. దీంతో అధికారులు జలాశయంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాజెక్టు ఆయకట్టులో ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించి ప్రకటించారు. అయితే అప్పటికే 60 వేలకు పైగా ఎకరాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే కృష్ణాబేసిన్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఊరట పొందిన అన్నదాతలు.. వానదేవుడిపై భారం వేసి, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంట సాగుచేశారు. నెట్టెంపాడు కింద 1.20లక్షలు, జూరాల కుడి కాల్వ పరిఽధిలో 20వేలు, భీమా లిఫ్ట్–2 కింద 92వేలు, జూరాల ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో 73,639, ఎంజీకేఎల్ఐ కింద 1,18,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఇందులో అత్యధికంగా వరిసాగైంది. మూడున్నరేళ్ల తర్వాత ఐఏబీ సమావేశం.. సాగునీటి లభ్యత, పంటల ప్రణాళిక, ఆయకట్టు ప్రాంతాలకు నీటి కేటాయింపులు, వినియోగంపై మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏటా వానాకాలం, యాసంగి పంటల సాగుకు ముందు ఐఏబీ (ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పాలకులు మూడున్నరేళ్లుగా ఆ ఊసే ఎత్తలేదు. ఎల్నినో ప్రభావంతో సమస్య తీవ్రతరమైన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఐఏబీ సమావేశాలను పునరుద్ధరించి.. ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు, ఇప్పటి వరకు సాగుచేసిన పంటల వివరాలు, పంటకాలం ముగిసే వరకు సరిపడా నాటి నిల్వలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకు వనపర్తి కలెక్టరేట్ వేదిక కానుంది. ఉమ్మడి జిల్లాలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐ, కోయిల్సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఇప్పటికే సుమారు 4 లక్షల ఎకరాలకు పైబడి వరిసాగు చేసినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కేవలం 5.5 టీఎంసీల నిల్వ ఉన్న జూరాల నీటితో పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించటంపై సాధ్యాసాధ్యాలను చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రియదర్శిని జూరాల జలాశయం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా వరిసాగు ఆరుతడి పంటలకే సాగునీరు సరఫరా అంటున్న అధికారులు ఇప్పటికే జూరాలకు తగ్గిన వరద.. క్రస్ట్గేట్లు మూసివేత నేడు వనపర్తి కలెక్టరేట్లో ఐఏబీ సమావేశం అంతా గందరగోళ పరిస్థితి.. జూరాలకు వరదనీరు వచ్చిందనే ఆనందంలో వరినాట్లు వేసుకున్న రైతన్నలకు ఆదిలోనే చుక్కెదురైంది. కర్ణాటక ప్రాంతం నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులతో పాటు జూరాల ప్రాజెక్టు గేట్లను పూర్తిగా మూసివేశారు. దీంతో జలాశయంలో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటినినిల్వ చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.567 టీఎంసీలు) కాగా.. ప్రసుతం 317 మీటర్ల మేర (8.81 టీఎంసీలు) నిల్వ చేస్తున్నారు. జలాశయంలో ఉన్న నీటిని గరిష్టంగా 5.6 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. జలాశయంలో ఉన్న నీటిని విడుదల చేస్తే నెలరోజుల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో జూరాల కింద సాగుచేసిన లక్ష ఎకరాల వరిపంటతో పాటు మిగిలిన ప్రాజెక్టుల కింద సాగు చేసిన 3 లక్షల వరిపంటకు సాగునీటిని ఏ విధంగా విడుదల చేస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ప్రభుత్వ కళాశాలలకు రాత పుస్తకాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా రాత పుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాత పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే 38 కళాశాలలకు రాత పుస్తకాలు చేరాయి. మిగిలిన 23 కళాశాలలకు మరో రెండు, మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కళాశాలలకు చేరిన నోటుపుస్తకాలను మంగళవారం పలు కళాశాలల్లో విద్యార్థులకు అందజేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 రాత పుస్తకాల చొప్పున పంపిణీ చేయనున్నారు. యూనిఫాంలు కూడా.. రాత పుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తొలిసారిగా యూనిఫాంలను కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందుకు సంబంధించిన యూనిఫాం క్లాత్ ఎంఈఓ కార్యాలయాలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మహిళా సంఘాలకు క్లాత్ను అందించి, మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలను కుట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుట్టు ప్రక్రియ పూర్తయిన అనంతరం విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేయనున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఒకవైపు విద్యార్థులకు అవసరమైన రాత పుస్తకాలను అందిస్తూనే.. మరోవైపు యూనిఫాం కూడా ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు, హాజరు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలిసారి రాత బుక్కులతో పాటు, యూనిఫాం పంపిణీ ఉమ్మడి జిల్లాలో 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు.. 40,382 మంది విద్యార్థులకు లబ్ధి -
చెరువులను నింపాలి..
తీలేర్ లిఫ్ట్ నుంచి లింక్ కె నాల్కు నీటిని విడుదల చే స్తే, పది గ్రామాల చెరువు లు నిండే అవకాశం ఉంది. చెరువులు నిండితే వ్యవసాయ బోరుబావుల్లో భూ గర్భజలమట్టం పెరుగుతుంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. తాగునీటి అవసరాలనే చూడకుండా, రైతులను ఆదుకునే చర్యలు కూడా చేపట్టాలి. – కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, అప్పంపల్లి అప్రోచ్ కెనాల్లో పేరుకుపొయిన పూడికను తీ యకపోవడంతోనే పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి సరిపడా నీరు రావడం లేదు. తీలేర్ పంప్ హౌజ్ నుంచి ఒక మోటారుతో నీటిని ఎత్తిపోస్తే, కోయిల్సాగర్ నిండటానికి మూడు నెల ల సమయం పడుతోంది. చెరువులను కూడా నింపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – శ్రీనివాసులు, రైతు, తీలేర్ అప్రోచ్ కెనాల్లో అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. పూడికతీత పనులు చేపట్టి ఉంటే పర్దీపూర్ నుంచి తీలేర్ పంపుహౌజ్కు రెండు మోటార్లకు సరిపడా నీరు వచ్చేవి. మూడు రోజుల క్రితం రెండో మోటారును నడిపిస్తే నీరు ముందుకు పారక పైపు పగిలిపోయింది. మరమ్మతు చేయిస్తున్నాం. ప్రస్తుతం ఒక మోటారుతో కోయిల్సాగర్ను నింపుతున్నాం. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తాం. – నయిమొద్దీన్, డీఈఈ ● -
భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే సహించం
నారాయణపేట ఎడ్యుకేషన్: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. రైతులకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. సోమవారం నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద పేరపళ్ల గ్రామంలోనే భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అధికారులు 30 పర్యాయాలు భూ సర్వే నిర్వహించినా రైతులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. సర్వేనం.11, 92, 87లోని భూములను సాగుచేస్తున్న రైతుల వివరాలను అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సుమారు 100 ఎకరాలకు కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు వస్తున్నాయని.. దీంతో అసలైన రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. సర్వేనం.101 భూముల పరిస్థితి ఏమిటో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులకు అన్యాయం చేస్తున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పంటనష్ట పరిహారం అందిస్తున్నారని విమర్శించారు. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. అనంతరం జయమ్మ చెరువును పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసులు, కోశాధికారి సిద్ధి వెంకట్రాములు, సాయిబన్న, కిరణ్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆరుద్ర పూజలు
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ వద్దనున్న శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో సోమ వారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆరుద్ర పూజల సందర్భంగా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. -
లారీ రూటు మార్చిందెవరు?
ఆశన్పల్లిలో పట్టుబడిన 580 బస్తాల రేషన్ బియ్యంపై పలు అనుమానాలు నారాయణపేట: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరికల్ సమీపంలోని శ్రీగణేశ్ రైస్మిల్ నుంచి వేయింగ్ చేసిన 580 బస్తాల బియ్యాన్ని చంద్రకల్ బఫర్ గోదాంకు తరలించాల్సి ఉండగా.. దామరగిద్ద మండలం ఆశన్పల్లి రైస్మిల్ వద్దకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. పోవాల్సిన గమ్యస్థానం ఒకటైతే.. లారీ చేరిన చోటు మరొకటి కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సూత్రధారులెవరు? చంద్రకల్ బఫర్ గోదాంకు వెళ్లాల్సిన బియ్యం లారీ ఆశన్పల్లి రైస్మిల్ వద్ద ఎందుకు ఆగింది..? అక్కడికి బియ్యం తరలించాల్సిన అవస రం ఏమొచ్చింది..? లారీకి మార్గమధ్యంలో దారి మళ్లి ంచారా..? లేక ముంద స్తు ప్రణాళికతోనే బి య్యాన్ని మిల్లుకు తరలించారా..? అనే ప్రశ్నలు సివిల్ సప్ల య్ అధికారుల్లోనే త లెత్తడం ఆశ్చర్యంగా ఉందని చెప్పవచ్చు. పట్టుబడిన లా రీ దామరగిద్ద మండలం అయ్యవారిపల్లికి చెందినదిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొన్నాళ్లుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆశన్పల్లి ఘటనపై అధికారులు లోతు గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి వ్యవస్థలోకి చేర్చే రీసైక్లింగ్ దందా జరుగుతోందా.? ఇందులో రైస్మిల్లర్లు, డీలర్ల పాత్ర ఏమైనా ఉందా.? ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యం మళ్లిస్తున్నారా.? అనే కోణాల్లో విచారణ జరపాల్సి ఉంది. పంచనామా.. శాంపిల్స్ సేకరణ లారీలోని బియ్యం బస్తాల లాట్ నంబర్లను అధికారులు పరిశీలించారు. పంచనామా నిర్వహించి.. బియ్యం నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నధర్పల్లి గోదాం వద్ద నమూనాలను పరిశీలించగా.. వచ్చిన ఫలితాల ఆధారంగా ఆ బియ్యం ఇటీవలే మిల్లింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా తుది నిర్ధారణ కావాల్సి ఉంది. అధికారుల తలోమాట.. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బియ్యం నమూనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టు నారాయణపేట సివిల్ సప్లయ్ టెక్నికల్ అధికారుల ద్వారా దామరగిద్ద పోలీస్స్టేషన్, సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు చేరినట్లు సమాచారం. అయితే రిపోర్టు విషయమై అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. తలోమాట చెబుతుండటం దాగుడుమూతలను తలపిస్తోంది. రిపోర్టు తమకు వచ్చిందని దామరగిద్ద ఎస్ఐ నరేశ్ చెబుతుండగా.. తమకు ఇంకా అందలేదని డీటీఎఫ్ నాగరాజు, డీఎస్ఓ బాలరాజు పేర్కొన డం కొసమెరుపు. దీంతో అసలు రిపోర్టు ఎవరి వద్ద ఉంది.? ఎప్పుడు వచ్చింది.? ఎవరికి అందింది.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిల్లర్పై ఆరోపణలు.. పట్టుబడిన బియ్యం వ్యవహారంలో సంబంధిత రైస్మిల్లర్పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నా యి. రేషన్ డీలర్లతో కుమ్మకై ్క బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆశన్పల్లి రైస్మిల్పై గతంలో వచ్చిన ఆరోపణలు.. తాజాగా పట్టుబడిన 580 బస్తాల బియ్యం వ్యవహారాన్ని కలిపి అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేబర్ కోడ్లను రద్దు చేసేదాక పోరాటం డీలర్లు, మిల్లర్ కుమ్మక్కుపై ఆరోపణలు శాంపిల్ రిపోర్టుపై అధికారుల దాగుడుమూతలు? సమగ్ర విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి దామరగిద్ద మండలం ఆశన్పల్లి మిల్లు వద్ద పట్టుబడిన లారీలోని బియ్యం శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. ఇంకా తమకు అధికారికంగా రిపోర్టు రాలేదు. సివిల్ సప్లయ్ ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే ఆ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. – బాల్రాజు, డీఎస్ఓ -
ఒక్క మోటారుతోనే..
కోయిల్సాగర్కు 200 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపింగ్ ● అప్రోచ్ కెనాల్లో పేరుకుపోయిన పూడిక ● సాఫీగా ముందుకు సాగని సాగునీరు ● ఇటీవల రెండో మోటారు ఆన్చేస్తే పగిలిన పైపు ● అధికారుల ముందుచూపు కొరవడటంతోనే దుస్థితి –8లో uమరికల్: ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో కోయిల్సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపించడం లేదు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 32 అడుగులు కాగా.. ప్రస్తుతం 15 అడుగులకు మాత్రమే నీరు చేరింది. ఐదు రోజుల క్రితం ఉంద్యాల స్టేజీ–1 వద్ద రెండు మోటార్లను ప్రారంభించి.. 630 క్యూసెక్కుల నీటిని పర్దీపూర్ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తీలేర్ స్టేజీ–2కు నీరందాల్సి ఉంది. అయితే పర్దీపూర్ చెరువు నుంచి టన్నెల్ వరకు 10 కి.మీ. అప్రోచ్ కెనాల్ ఉండగా.. 2014లో కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు పూడికతీతకు నోచుకోలేదు. దీంతో పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి తీలేర్ పంపుహౌజ్కు వచ్చే నీరు మధ్యలోనే వృథాగా పారుతూ మన్నెవాగులో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తీలేర్ స్టేజీ–2 పంపుహౌజ్ నుంచి కోయిల్సాగర్కు ఒక మోటారుతోనే 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. అందులో 115 క్యూసెక్కుల మేర తూము లు, మోటార్ల ద్వారా పంట పొలాల్లో పారుతోంది. ఇక 200 క్యూసెక్కుల నీరు మాత్రమే కోయిల్సాగర్లోకి చేరుతోంది. 50వేల ఎకరాల ఆయకట్టు.. కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా పాత ఆయకట్టు 12 వేలు, కొత్త ఆయకట్టు 38వేల ఎకరాలకు సాగునీ రు అందించాల్సి ఉంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు నీటి ఎత్తిపోతల ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు పూర్తిస్థాయిలో 50 వేల ఎకరాలకు సా గునీరు అందించిన దాఖలాలు లేవు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోంది. అప్రోచ్ కెనాల్లో పూడికతో.. పర్దీపూర్ రిజర్వాయర్ నుంచి తీలేర్ పంపుహౌజ్ నడుమ ఉన్న 10 కి.మీ. అప్రోచ్ కెనాల్ అస్తవ్యస్తంగా తయారైంది. పూడిక పెరిగి నీరు ముందకు సాగని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది. ఈ కారణంగానే ఒక మోటారు ద్వారా మాత్రమే నీటి పంపింగ్ చేస్తున్నారు. ఇటీవల రెండో మోటారును 45 నిమిషాలు ఆన్ చేయగా.. నీరు సాఫీగా ముందుకు వెళ్లక మోటారు పైపు పగిలిపోయింది. నీటిపారుదలశాఖ అధికారులు వేసవిలోనే అప్రోచ్ కెనాల్ పూడిక తీసి ఉంటే, పర్దీపూర్ నుంచి రెండు మోటార్ల ద్వారా సరిపడా నీరు వచ్చేవని ఆయకట్టు రైతులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పూడిక తీయకపోతే ఒక మోటారు నీరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. -
శుద్ధజలం.. పుష్కలం!
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. నీటి అవసరాలు ఇలా.. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ఇకపై కేఎల్ఐతో పాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ శాశ్వతంగా తీరనున్న తిప్పలు ఇకపై సమస్య ఉండదు.. గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటిి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ -
కబడ్డీ.. కబడ్డీ..
మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడలను ఈ సారి తెలంగాణలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక క్రీడాపాలసీ రూపొందించింది. గత ఏడాది సీఎం కప్ క్రీడలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏదైనా ఒక క్రీడను మహబూబ్నగర్లో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్లో ఖేలో ఇండియా యూత్ కబడ్డీ చాంపియన్షిప్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహబూబ్నగర్ నగరంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలురు ఎనిమిది, బాలికలు ఎనిమది జట్లతో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు నవంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవంతంగా నిర్వహిస్తాం మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి కృషితో మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు జిల్లా క్రీడారంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్ని క్రీడాసంఘాలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. – జె.రాజశేఖర్రెడ్డి, డీవైఎస్ఓ పాలమూరులో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు రెండు, మూడు రోజుల్లో రానున్న అధికారిక ప్రకటన ఎనిమిది రాష్ట్రాల బాలబాలికల జట్లతో చాంపియన్షిప్ నవంబర్లో నిర్వహించే అవకాశం -
అక్రమానికి.. అడ్డుకట్టేది?
రెండేళ్లలో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ● నేటికీ ఆగని దందా ● తాజాగా శనివారం ఆశన్పల్లిలో పట్టుబడిన బియ్యం లారీ ● నమూనాలు సేకరణ.. నివేదికే ఆలస్యం నారాయణపేట: జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ ర వాణాపై రెండేళ్లలో టాస్క్ఫోర్స్ పోలీసులు చేపట్టి న దాడుల్లో సుమారు 900 క్వింటాళ్లు పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. బియ్యం తరలింపుతో సంబంధం ఉన్న సుమారు 60 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం. నియంత్రణకు ప్రభు త్వం ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చినా పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతునే ఉంది. తాజాగా శనివారం దామరగిద్ద మండలం ఆశన్పల్లి రైస్మిల్లు దగ్గర బియ్యం లారీ పట్టుబడింది. అవి రేషన్ బియ్యమా..? లేక సీఎంఆర్ బియ్యమా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలో లోపాలే కారణమా..? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 301 రేషన్ దుకాణాలు, 1,72,075 రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడు నెలలకు కలిపి సుమారు 12,050 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో బియ్యం ఒకేసారి అందుబాటులోకి రావడంతో అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. పంపిణీ నుంచి లబ్ధిదారుడి ఇంటి వరకు, లబ్ధిదారుడి నుంచి తిరిగి మార్కెట్ దాకా ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉందా..? సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైనన్ ట్రాకింగ్ ఉన్నా బియ్యం పట్టుబడుతుండటం వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తోంది. లారీ పట్టివేతతో కలకలం గతంలో పౌరసరఫరాలశాఖ అధికారులు ఆశన్పల్లిలోని రైస్మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా శనివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో అదే మిల్లు దగ్గర బియ్యంలోడ్తో ఉన్న లారీని గ్రామస్తులు గుర్తించి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని బియ్యం నిల్వలను పరిశీలించి పూర్తి వివరాలు సేకరించి పౌరసరఫరాలశాఖ అధికారులకు తెలియజేశారు. వారు ఆదివారం బియ్యం నమూనాలు తీసుకొని పరీక్షలకు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే రేషన్ బియ్యమా.. సీఎంఆర్ బియ్యమా అన్నది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. లాట్నంబరే క్లూ.. ఈ వ్యవహారంలో బియ్యం సంచులపై ఉన్న లాట్నంబర్లు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. లాట్నంబర్లను స్టాక్ రిజిస్టర్తో సరిపోల్చాలి. మిల్లు రికార్డులు, వే బిల్లు, వాహనం నంబర్, లోడింగ్ వివరాలు, గమ్యస్థానం.. ఇలా ప్రతి అంశాన్ని ఒకదానితో మరొకటి క్రాస్ చెక్ చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది. డీలర్ పాత్రపై అనుమానం.. దామరగిద్ద మండలానికి చెందిన ఓ రేషన్ డీలర్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ డీలర్ మూడునెలల కోటకు సంబంధించి ఓ వాహనంలో ఉన్న బియ్యం బస్తాలను మిల్లులోనే శనివారం వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వాహనాన్ని పట్టుకునేందుకు వెళ్లిన గ్రామస్తులకు లారీ కనిపించిందని తెలుస్తోంది. ఆశన్పల్లి రైస్ మిల్లు వద్ద ఉన్న బియ్యం లారీ ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. పౌరసరఫరాలశాఖ డీటీల ద్వారా బియ్యం నమూనాలు తీసి పరీక్షలకు పంపించాం. సివిల్ సప్లయ్ డీఎం నివేదిక వచ్చిన తర్వాత రేషన్ బియ్యమా.. సీఎంఆర్ బియ్యమా అన్నది తెలుస్తుంది. – బాలరాజు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
క్రీడలతో ఉన్నత విలువలు
వనపర్తిటౌన్: క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి ఉన్నత విలువలను నేర్పుతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆరేపల్లి వెంకటేశ్వర్లు స్మారక 72వ స్టేట్ సీనియర్ మెన్, ఉమెన్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంపొందించే క్రీడన్నారు. క్రీడాకారులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని నిరంతరం సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని సూచించారు. ఒలింపిక్స్లో మహబూబ్నగర్ జిల్లా నుంచి పాల్గొని పతకాలు సాధించి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో మహిళల భాగ్యస్వామ్యం పెరుగుతుండటం ఆనందకర విషయమని, తమ ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, సమానంగా స్వీకరించే ఓర్పు, క్రమశిక్షణ క్రీడలతోనే అలవడుతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్గౌడ్, భాస్కర్గౌడ్, రవీందర్రెడ్డి, రామ్మోహన్రావు, కోచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి బాబా, ద్వారపోగు విజయ్బాబు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
మదనాపురం: రైల్వేలైన్ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రసూల్బీ, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
మెయిన్ స్టేడియాన్ని పరిశీలించిన ఖేలో ఇండియా బృందం
ఇటీవల ఖేలో ఇండియా కేంద్రం, రాష్ట్ర బృందా లు మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంతో పాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమర్జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్ట ర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానా లు, జిల్లాకేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షి యల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందలే చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరి
నారాయణపేట: వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని.. లేకుండా నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్ లేకపోవడంతో నేరాలు జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడం కష్టమవుతుందని, దర్యాప్తులోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అక్షరాలు, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, ఇతర రకాల ప్లేట్లు వినియోగించడం వంటి ఉల్లంఘనలను సహించబోమని స్పష్టం చేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెనన్స్, వాహన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ తదితర వాటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ధరించాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
● గ్రామీణ స్థాయి నుంచే విద్యా ప్రమాణాల పెంపు ● పోటీ ప్రపంచంలో రాణించాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి ● పీయూ నేషనల్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ● హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సర్.. రెండు రోజులే!
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 85.50 శాతం డిజిటలైజేషన్ ● వరుస సెలవులు ఉన్నప్పటికీ పూర్తిచేయాలని ఆదేశాలు అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో దాదాపు పూర్తి కావొచ్చింది. దీనికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బీఎల్ఓలకు ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తేనే ఈ నెల 10 వరకు డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 85.50 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మిగిలినవి 24.50 శాతం కూడా పూర్తిచేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. అయితే శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నప్పటికీ సర్ విధులు నిర్వరిస్తున్న వారు విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. బీఎల్ఓలు వివరాలు ధ్రువీకరించుకుని మరణించి వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓ టరు జాబితా నుంచి తొలగించేలా చర్య లు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,డిజిటలైజేషన్ ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ అన్ కలెక్టబుల్ శాతం మహబుబ్నగర్ 7,32,488 6,29,126 1,03,351 85.89 నాగర్కర్నూల్ 7,31,632 6,17,695 1,13,937 84.43 వనపర్తి 2,75,570 2,36,619 38,951 85.87 జో.గద్వాల 5,03,859 4,39,552 64,169 87.24 నారాయణపేట 4,95,574 4,19,055 76,519 84.56 మొత్తం 27,39,123 23,42,047 3,96,927 85.50 అడవి మనుషులం సార్.. ఆదుకోండి!ఉమ్మడి పాలమూరులోని జిల్లాల వారీగా సర్ ప్రక్రియను పరిశీలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 84.43 శాతంతో చివరన ఉంది. ఇక ఐదు జిల్లాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజర్ జాబితాతోపాటు ఇతరులు కలిపి మొత్తం 3,96,927 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైరాజర్ జాబితాలో ఉన్న ఓటర్ల తరపున ఎన్యూమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసీ ఓట్లు ఉన్నవారు, గైర్జాజర్ జాబితాలో అత్యధికంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. -
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు
నారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో ఈ నెల 7, 8న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి 5వ జావెలిన్ అథ్లెటిక్స్–2026 మీట్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటి పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడారు. అండర్–6 విభాగం 60 మీటర్ల పరుగుపందెంలో అశ్రిత్ స్వర్ణం, అండర్–12 స్టాండింగ్ బ్రాడ్జంప్లో శివరాజు కాంస్యం, అండర్–12 విభాగంలో 60 మీటర్ల పరుగుపందెంలో పార్వతి కాంస్యం, అండర్–18 హెప్టాథ్లాన్లో సందీప్ రజతం, వెంకటేష్కు కాంస్యం, అండర్–18 షాట్ఫుట్లో ఆనంద్ కాంస్య పతకాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా కోచ్లు హారికాదేవి, జగదీష్, సత్యం, రాజేశ్వరిని అసోసియేషన్ తరుఫున అభినందించారు. ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండినారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి టి.నర్సింహులు ఆరోపించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కోస్గి నుంచి నారాయణపేట వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం ముగిసింది. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పాదయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ధరలు, అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. మోదీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా అపూర్వ ప్రగతి సాధిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నియామకాల ఆలస్యం, పరీక్షల రద్దు, వరుస ప్రశ్నపత్రాల లీకేజీలు యువతను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయన్నారు. పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటేష్, శ్రీనివాస్, సరోజమ్మ, నారాయణమ్మ, నర్సింగమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. శనేశ్వరుడికి అభిషేక పూజలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని సూచించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు.


