breaking news
Narayanpet District News
-
రూ.558 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
● నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు ● మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు నారాయణపేట/మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈమేరకు రూ.558 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణా నదిపై రూ.123 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ – నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు రూ. 210 కోట్లతో, మక్తల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూ.25 కోట్లతో ప్రారంభించనున్నారు. ఎప్పుడెప్పుడా అని మక్తల్ – నారాయణపేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తామని చెప్పిన పరిహారం చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేయించారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. -
వారిదే పైచేయి..
ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్విల్తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 54 1,634 49.02 నాగర్కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 -
ఏకగ్రీవమే..!
నారాయణపేటఆ జీపీలుకాటేస్తున్న ఎయిడ్స్ భూతం ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్ర యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. -
రెండో విడత తొలి రోజు 59 నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యులకు జరుగుతున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆదివారం ఆయా కేంద్రాల వద్ద అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్ మండలాల్లోని 35 క్లస్టర్లలో 95 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచుకు 59 మంది, 900 వార్డులకు గాను 59 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా సరిసమానంగా నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. తొలి రోజు నామినేషన్లు మందకొడిగా కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో నామినేషన్లు ఊపందుకోనున్నాయి. సీఎం ఇలాఖాలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో నారాయణపేట నియోజకవర్గంలో సైతం ఏకగ్రీవం చేయించేందుకు ఎమ్మెల్యే వ్యూహరచన చేస్తున్నారు. అధికార పార్టీ ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతుండడంతో ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపి సత్తాచాటేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలో తొలిరోజు నామినేషన్ల వివరాలిలా.. మండలం సర్పంచు వార్డు దామరగిద్ద 17 20 ధన్వాడ 14 12 నారాయణపేట 15 7 మరికల్ 13 20 -
సీనియర్ సిటిజన్లసంక్షేమానికి కృషి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని బారంబావి సమీపంలో ఉన్న వృద్ధాశ్రమం, బాలసదనం హోమ్స్ను శనివారం ప్రిన్సిపాల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి బి.సాయిమనోజ్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వారి ఆరోగ్య సమస్యలు గురించి ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడుతూ.. వృద్ధులకు, చిన్నారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారికి వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. నిత్యవసర వస్తువులు, ఆహార ధాన్యాల నాణ్యత, తాగునీరు, పరిశుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ, సీసీ పుటేజీలను, మూమెంట్ రిజస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అని వివరాలు సేకరించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి రద్దు నారాయణపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు, 2025 నిర్వహిస్తున్నందున డిసెంబర్ 1, సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి కొనసాగిస్తామని, వివరాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మక్తల్ ‘నో ఫ్లయింగ్ జోన్’ నారాయణపేట: మక్తల్ పట్టణాన్ని రెండు రోజులు పాటు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మక్తల్కు డిసెంబర్ 1న వీవీఐపీలు, వీఐపీలు రానుండడంతో భద్రతా కారణాల వల్ల ఆదివారం నుంచి సోమవారం వరకు మక్తల్ పరిధిలో డ్రోన్లు, యూఏఐలు, రిమోట్ కంట్రోల్ ఫ్లయింగ్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. శనివారం మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచిపోయి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోంశేఖర్గౌడ్, లక్ష్మణ్, శేఖర్గౌడ్, ప్రతాప్రెడ్డి, అశోక్గౌడ్, కృష్ణయ్య, బ్యాటరి రాజు, రాజుగౌడ్, కుర్వలింగం, నరేశ్, సూరి, ఉసేనప్ప పాల్గొన్నారు. -
జిల్లాలో ఆరు ఏకగ్రీవాలు
సాక్షి, నెట్వర్క్: సర్పంచ్కు ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. సర్పంచ్ స్థానానికి ఒకటే నామినేషన్ వచ్చిన అభ్యర్థి ఎన్నికను లాంఛనప్రాయమే అయినా.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ● గుండుమాల్ మండలంలోని అప్పాయపల్లితండా, పెద్దతండా గ్రామ పంచాయతీలను ఆయా గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో గ్రామస్థుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అప్పాయపల్లితండా సర్పంచ్గా రాజేందర్నాయక్, ఉప సర్పంచ్గా వెంకట్రాములు నాయక్ను, పెద్దతండా సర్పంచ్గా శ్రీకృష్ణ, ఉప సర్పంచ్గా రవీందర్నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు పంచాయతీల్లో ఉన్న 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్లే దాఖలయ్యాయి. ● మద్దూరు మండలంలోని నాలుగు పంచాయతీలకు సర్పంచ్లకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదిరిపాడ్ ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో కోతులగుట్టతండాకు చెందిన అనుసూయ తారాసింగ్ ఒక నామినేషన్ దాఖాలు చేశారు. పర్సపూర్ ఎస్సీ జనరల్ కావడంతో సర్పంచ్గా అభ్యర్థిగా మ్యాతరి అంజిలమ్మ, వార్డులకు ఒకటే నామినేషన్ దాఖలు చేశారు. అప్పిరెడ్డిపల్లి సర్పంచ్గా మల్లీశ్వరీ ఒక్కరే నామినేషన్ వేశారు. దామ్లతండాలో కూడా సర్పంచ్, వార్డు సభ్యులకు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. -
నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించాలి
కోస్గి రూరల్: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్ధులు వేసే ప్రతి నామినేషన్ను నిశితంగా పరీశీలించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సీతాలక్ష్మి అధికారులకు ఆదేశించారు. శనివారం గుండుమాల్ మండలంలోని గుండుమాల్, బోగారం, కొమ్మూర్ క్లస్టర్లలో ఎన్నికల ప్రక్రియను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల గురించి వారికి వివరించాలన్నారు. నామినేషన్ పత్రాలను సరి చూసి తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సర్పంచ్లకు 391.. వార్డులకు 1,224
కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని 67 పంచాయతీలకు 391 నామినేషన్లు, 572 వార్డులకు సంబంధించి 1,224 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు మొత్తం 97 నామినేషన్లు, 122 వార్డులకుగాను 324 నామినేషన్లు దాఖలయ్యాయి. మద్దూర్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు 127 నామినేషన్లు, 206 వార్డులకు 411 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తపల్లి మండలంలో 16 సర్పంచ్ స్థానాలకు 78 నామినేషన్లు, 130 వార్డులకు 276 నామినేషన్లు దాఖలయ్యాయి. గుండుమాల్ మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు 89 నామినేషన్లు, 114 వార్డులకు 213 నామినేషన్ దాఖలైనట్లు ఆయా మండలాల అధికారులు తెలిపారు. మొదటి రోజు మొత్తం సర్పంచ్ స్థానాలకు 69 నామినేషన్లు, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మిల్లర్ల దోపిడీపై రైతుల ఆందోళన
మరికల్: ధన్వాడ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అక్రమాలను నిరసిస్తూ రైతులు శనివారం అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర లారీలను ఆపి ఆందోళన చేశారు. ఈ నెల 25న అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర 7 మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తూకం వేయగా 796 బస్తాల ధాన్యం కాగా, 318.40 క్వింటాళ్లు వచ్చింది. అయితే లారీ డ్రైవర్ కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు తీసుకెళ్లి అక్కడ వే బ్రిడ్జి తూకం వేయగా 796 బస్తాలకు బదులు 786 బస్తాల ధాన్యం వచ్చినట్లు ట్రాక్సిట్ తెచ్చి రైతులకు ఇచ్చాడు. తూకంలో 10 బస్తాల ధాన్యం తక్కువ రావడంపై ఆగ్రహించిన రైతులు మిల్లు యాజమానిని నిలదీయగా దురుసుగా మాట్లాడాడు. కష్టపడి పండించిన ధాన్యంను మిల్లర్లు దోచుకుంటున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సివిల్ సప్లయ్ డీఎం సైదులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మక్తల్: పట్టణ కేంద్రంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్థానిక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో సీఎం సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాలను శనివారం వారు పరిశీలించారు. మున్సిపల్, ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్, అత్యవసర సేవలు, ఫైర్ సేఫ్టీ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సభా వేదిక సమీపంలో భారీకేడ్లు ఉంచి, సీఎం మీటింగ్కు అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, కమిషనర్ శ్రీరామ్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు. -
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానం సుస్థిరం
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టమని, ఆరు దశాబ్దాల కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోషించిన పాత్ర తిరుగులేనిదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు శనివారం బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ 2001లో ఉద్యమాన్ని పునర్నిర్మించడం నుంచి 2014లో రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ అసమాన పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జిల్లా నాయకులు, ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి, అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష దివాస్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు విజయ్సాగర్, భీమయ్యగౌడ్, కన్నాజగదీశ్, వేపూరిరాములు తదితరులు పాల్గొన్నారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ ఆరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ ఆరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్లీడర్గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గగన్చంద్ర ప్రతిభ గర్వకారణం జాతీయస్థాయిలో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న గగన్చంద్ర ప్రతిభ గర్వకారణమని కలెక్టర్ సంతోష్ అన్నారు. –8లో uఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
‘ఉద్యోగంలో అందించిన సేవలే గుర్తుంటాయి’
నారాయణపేట: ప్రతి ఉద్యోగికి విరమణ అనేది తప్పనిసరి అని, కానీ వృత్తి రీత్యా చేసిన సేవలే గుర్తుండి పోతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీపీఓ యోగానంద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది పాటు నుంచి సీపీఓతో కలిసి తాను పని చేశానని, పేట లాంటి రిమోట్ జిల్లాలో పని చేసేందుకు చాలా మంది అధికారులు కొంత సంశయిస్తుంటారని తెలిపారు. కానీ ఎంతో ఒత్తిడితో కూడిన ముఖ్య ప్రణాళిక శాఖలో సీపీఓగా యోగానంద్ పాజిటివ్ మైండ్ సెట్తో పని చేశారని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సీపీఓ యోగానంద్ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, డీపీఆర్ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ఖలీల్, ఏఓ శ్రీధర్, జయసుధ, డిప్యూటీ సీపీఓ శ్రీదేవి, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రజాపాలన వారోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి
● డిసెంబర్ 1న మక్తల్లో బహిరంగ సభ ● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట/మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పట్టణానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మక్తల్ మండలంలో నిర్వహించాల్సిన సభను మక్తల్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మైదానానికి మార్పు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎస్పీ డా.వినీత్ పరిశీలించారు. సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల భద్రత, ట్రాపిక్ నియంత్రణ, అత్యవసర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. -
మందకొడిగా నామినేషన్లు
భూమి కబ్జా చేశారని.. కోర్టు ఆదేశించినా.. తమ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ కుటుంబం పెట్రోల్ సీసాతో నిరసన తెలిపింది. ● రెండో రోజు సర్పంచ్కు 57, వార్డు స్థానాలకు 114 దాఖలు వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. రాత్రిళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది.–8లో uమద్దూరు: జిల్లాలోని మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో రెండో రోజు శుక్రవారం కూడా నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. మొదటి విడతగా ఎన్నికలు నిర్వహిస్తున్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు గాను రెండో రోజు సర్పంచ్కు 57, వార్డు స్థానాలకు 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేడే చివరి రోజు.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో.. వారిని బుజ్జగించే పనిలో రాజకీయ పార్టీల నాయకులు పడ్డారు. దీంతోనే గురు, శుక్రవారాల్లో నామినేషన్లు ఊపందుకోలేదని తెలుస్తోంది. చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీల మద్దతుదారులకు రెబల్ బెడదను తప్పించడానికి గ్రామ పెద్దల సమక్షంలో మంతనాలు, బుజ్జగింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన శనివారం నామినేషన్లు పెద్దఎత్తున దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ● మద్దూరు మండలం దోరేపల్లి పంచాయతీలో నామినేషన్ల ప్రక్రియను డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ ఫణిరాజ్ పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ఓలకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
యంత్రాంగం సిద్ధం
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 13 మండలాల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకంతో పాటు ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు పూర్తయింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరిగే ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్ బృందాల ఏర్పాటు.. జిల్లాలోని 272 జీపీల్లో జరిగే ఎన్నికల పరిశీలన, ఆకస్మిక తనిఖీల కోసం 26 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 10 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను కలెక్టర్ నియమించారు. ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రెండు చొప్పున ఏర్పాటుచేయగా.. కర్ణాటక సరిహద్దులో వాహనాల తనిఖీలు చేపట్టేందుకు గాను 10 ఎస్ఎస్ బృందాలను ఏర్పాటుచేశారు. అందులో నారాయణపేట, దామరగిద్ద, మాగనూర్, ఊట్కూర్, కృష్ణా మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో తనిఖీల నిమిత్తం ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులను నియమించారు. ఎంసీపీ అధికారులుగా తహసీల్దార్లు.. అన్ని మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను తహసీల్దార్లను ఎంసీసీ అధికారులగా నియమించారు. వీరు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరును పక్కాగా పర్యవేక్షిస్తారు. దామరగిద్దకు తిరుపతయ్య, ధన్వాడకు సింధూజ, గుండుమాల్కు భాస్కర్గౌడ్, కోస్గికి శ్రీను, కృష్ణాకు శ్రీనివాస్, కొత్తపల్లికి జయరాములు, మక్తల్కు సతీశ్, మరికల్కు రాంకోటి, మాగనూరుకు సురేశ్, మద్దూరుకు మహేశ్గౌడ్, నారాయణపేటకు అమరేందర్ కృష్ణ, నర్వకు మల్లారెడ్డి, ఊట్కూర్కు రవిని నియమించారు. అదే విధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 77మందిని జోనల్ అధికారులుగా నియమించారు. వీరు తమ పరిధిలోని పోలింగ్ ప్రాంతాన్ని కనీసం రెండుసార్లు సందర్శిస్తారు. పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ శాతంపై సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు వివిధ స్థాయిల్లో అధికారుల నియామకం నిఘా బృందాల ఏర్పాటు కలెక్టర్ దిశానిర్దేశంతో ముందుకు.. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు పునరావాసం కల్పించాలి
నారాయణపేట: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ‘మాతృత్వం ఒక వరం – అందుకు దత్తత మరో మార్గం‘ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నవంబర్ను దత్తత తీసుకునే నెలగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకునే విధానంపై అందరికీ సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకునే వారు మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంస్థాగత పునరావాసం అనే థీమ్తో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు దత్తతపై ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించాలని వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, డీసీపీ కరిష్మా, ఆరోగ్యశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు. -
నామినేషన్లు షురూ
నారాయణపేట/కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కీలక ఘట్టం ప్రారంభమైంది. మొదటి విడతగా డిసెంబర్ 11న జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి చేపట్టారు. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలో 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 69, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 జీపీలకు గాను 5 క్లస్టర్లు ఏర్పాటుచేయగా.. మొదటి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చెన్నారం, నాచారం, పీసీ తండా పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోనూ పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. జి ల్లావ్యాప్తంగా నామినేషన్ల పర్వం సాఫీగా సాగింది. పటిష్ట బందోబస్తు.. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, గుండు మాల్, మద్దూర్, కోస్గి మండలాల్లోని పలు నామినేషన్ కేంద్రాలను సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ సందర్శించి.. పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా భద్రతా చర్యల ను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పల్లెల్లో కోలాహలం.. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల దాఖలకు అతి తక్కువ సమయం ఉండటంతో అందరితో ముమ్మర చర్చలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి రోజు నామినేషన్ దాఖలుపై పెద్దగా దృష్టిసారించలేదని తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ఊపందుకునే అవకాశం ఉంది. 29వ తేదీ వరకు గడువు అందరి మద్దతు కూడగడుతున్న ఆశావహులు సజావుగా ఎన్నికల ప్రక్రియ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్కు వచ్చిన పరిశీలకురాలికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూంను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లి మండలం నిడ్జింత, మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువపత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ ఫారాలను స్పష్టంగా చూసి.. వాటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. ఆమె వెంట ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, డీవైఎస్ఓ శెట్టి వెంకటేశ్ ఉన్నారు. -
టీ–పోల్ యాప్లో సమగ్ర సమాచారం
నారాయణపేట: టీ–పోల్ యాప్లో ఎన్నికల సమగ్ర సమాచారం పొందుపర్చడం జరిగిందని.. పంచాయతీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వివరాలతో పాటు ఓటరు స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా లోని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియాగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నియమావళి పక్కాగా అమలు నారాయణపేట: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియను శాంతి యుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేశామని ఎస్పీ డా.వినీత్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అశాంతి, అవకతవకలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు డీఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనుమతి పొందిన అభ్యర్థులు, వారి సహాయకులకు మాత్రమే ప్రవేశముంటుందన్నారు. అనవసర గుంపులు, అతి ఉత్సాహ చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా సరిహద్దులో ఏర్పాటుచేసిన 5 చెక్పోస్టుల వద్ద, ప్రధాన రహదారుల పై తనిఖీలను మరింత ముమ్మరం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని లైసెన్స్ ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రబుల్ మేకర్లు, రౌడీ షీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. కార్మికుల వేతనాల్లో కోత విధించొద్దు కోస్గి రూరల్: కోస్గి సామాజిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల్లో కోత విధించడం సరైంది కాదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ అన్నారు. గురువారం స్థానిక సీహెచ్సీ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికుల వేతనాల్లో కోత విధించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించకుండా అన్యాయానికి గురిచేస్తున్న సదరు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు సంతోష్, కృష్ణ, అశోక్, వెంకటేశ్, సత్య ప్రకాష్, కిష్టమ్మ, శ్యామలమ్మ, నవీన లక్ష్మి, సులోచన, అనురాధ పాల్గొన్నారు. -
వేలం.. ఏకగ్రీవం!
● సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ ● పలు పల్లెల్లో గ్రామస్తుల మూకుమ్మడి కార్యాచరణ ● చక్రం తిప్పుతున్న పెద్దలు.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సంస్కృతి ● వేలం పాట నేరమంటున్న అధికార యంత్రాంగం ● శిక్ష తప్పదంటూ బస్వాపూర్ ఘటనను ఉదహరిస్తూ హెచ్చరికలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలు కాగా.. తొలి రోజే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పలు జీపీల్లో ఆలయాల నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు తదితర అభివృద్ధి పనుల పేరిట ‘పెద్దలు’ చక్రం తిప్పుతూ బహిరంగ వేలం పాటలకు శ్రీకారం చుట్టారు. రేటు ఫిక్స్ చేసి మరి పోటీ లేకుండా మూకుమ్మడి నిర్ణయంతో ఏకగ్రీవ ఆఫర్లు ప్రకటించగా.. ఔత్సాహికులూ అదే ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ లెక్కన గతంతో పోల్చితే వేలం పాటల సంస్కృతి ఈసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేరమంటున్న అధికారులు.. పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలు.. ఏదైనా వేలం పాట నిర్వహించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే పదవి అంటూ వేలం వేయడం చట్ట విరుద్ధమంటున్నా రు. ఎన్నికలతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం చెదిరిపోకుండా ఉండడంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు పారితోషికంగా రూ.10 లక్షలు ఇస్తుందని.. అలా అని డబ్బు ఉన్న పెద్ద లు పదవులకు వేలం పాడితే శిక్షార్హులవుతారని వివరిస్తున్నారు. 2013 ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్లో ఈ విధంగా వేలం పాట దక్కించుకున్న వారి ఎన్నిక చెల్లలేదని.. దీంతో పాటు వేలం నిర్వహించిన పెద్దలు, వేలం పాడి న వ్యక్తి జైలు పాలయ్యారని ఉదహరిస్తున్నారు. పాట పాడి.. వాయిదా వేసి.. గట్టు మండలం అరగిద్ద గ్రామ సర్పంచ్కు వేలం నిర్వహించగా.. ఓ గ్రామ నాయకుడు రూ.35 లక్షల వరకు వేలం పాడారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగలడంతో వేలం పాట ను పెద్దలు శుక్రవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ● అంతంపల్లిలో సైతం సర్పంచ్ పదవికి రూ.24 లక్షలకు వేలం పాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయాడు. దీంతో పెద్దలు వేలాన్ని నిలిపివేసినట్లు సమాచారం. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
బీసీలను దగా చేసిన కాంగ్రెస్
నారాయణపేట టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. చివరకు 17 శాతం రిజర్వేషన్లతో దగా చేసిందని బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీలను నమ్మించి మో సం చేసిన పార్టీలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ జాగృతిసేన నాయకులు లక్ష్మీకాంత్రాజ్, ప్రవీ ణ్, కుమార్, నరేశ్, అశోక్, సాయితేజ్, రామకృష్ణ, నవీన్, బాలు, రామ్, రాజేందర్ ఉన్నారు. -
ఇబ్బందులు లేకుండా వరిధాన్యం సేకరణ
నారాయణపేట టౌన్:రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా వరిధాన్యం కొనుగో లు ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మె ప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేర కు ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకులోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయడంలో అలసత్వం వహించొద్దని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపా రు. కమిషనర్ వెంట మెప్మా డీఎంసీ శివకుమార్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్లో ఢీసీసీ..!
కుంపటి రాజేసిన జిల్లా అధ్యక్షుల ఎంపిక ● వనపర్తిలో శివసేనారెడ్డికి ఇవ్వడంపై మేఘారెడ్డి, చిన్నారెడ్డి నారాజ్ ● తన ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం బోర్డు ఎత్తేసిన చిన్నన్న ● అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం ● ఇటు మహబూబ్నగర్, గద్వాల జిల్లాల్లో ఆశావహ నేతల్లో అసంతృప్తి ● పంచాయతీ ఎన్నికల వేళ పరిణామాలపై ‘హస్తం’ శ్రేణుల్లో గుబులు -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
మక్తల్: వచ్చే నెల 1న మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. గురువారం ఏఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లింగయ్యలతో కలిసి ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా చర్యలపై పోలీసు అధికారులతో చర్చించారు. సీఎం సభా స్థలం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలతో పాటు ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ప్రచారంపై ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనుతో కలిసి తహసీల్దార్లు, ఎస్ఎస్టీ, ఎస్ఎఫ్టీ బృందం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి తహసీల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని చెక్పోస్టుల్లో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుస్తు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీపీఓ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టరేట్లోమీడియా సెంటర్ ప్రారంభం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో మీడియా సెంటర్ను కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీపీఆర్ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ఖలీల్, డీఏఓ జాన్సుధాకర్, డీపీఆర్ఓ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పల్లె పోరు.. కసరత్తు జోరు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు. సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా.. అదే దూకుడును కొనసాగించేలా నాయకులు ముందస్తు ప్రణాళికతో పోరు బాట పట్టారు. ఇదేక్రమంలో ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం దిశగా నడవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్.. పంచాయతీ పోరులో విజయం సాధించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలా బీజేపీ ముఖ్యులు పక్కా కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ఎవరికి వారు వ్యూహాలు.. పంచాయతీ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు వ్యూహాలకు పదునుబెట్టారు. తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ● ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, గృహజ్యోతి, పేదలకు సన్న బియ్యం, చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకాల ధాన్యానికి బోనస్ వంటి వివిధ పథకాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ● 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. యూరియా కొరతతోపాటు అరకొర రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఉదహరిస్తూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి తదితర అంశాలతో పాటు తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరించేలా వ్యూహాలను అమలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. ● కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. గ్రామాలకు అందుతున్న నిధుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అరాచకాలు తమకు కలిసి వస్తుందని.. ఈసారి సత్తా చాటుతామని ‘కమలం’ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ధన్వాడ కేజీబీవీ ఎస్ఓ తొలగింపు
నారాయణపేట రూరల్: జిల్లాలోని ధన్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) జి.గంగమ్మను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ గోవిందరాజు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. సాక్షి దినపత్రికలో బుధవారం ‘కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లావ్యాప్తంగా కేజీబీవీలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురితమైన కథనం విద్యాశాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. అవినీతి విషయంలో పలుమార్లు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ కస్తూర్బాలో తనిఖీ సమయంలో రిజిస్టర్లలో గుర్తించిన తేడాలపై విచారణకు ఆదేశించింది. జీఈసీఓ నర్మద, ఎఫ్ఏఓ యాదగిరి బృందం విచారణ చేసి 2024 జూన్ నుంచి మెస్ ఇన్చార్జీని నియమించకపోవడం, విద్యార్థుల సంఖ్యకు భోజన బిల్లుకు సరిలేకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.25వేలు నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించి రిపోర్ట్ అందించారు. దీనిపై ధన్వాడ ఎస్ఓ గంగమ్మకు మెమో ఇచ్చి వివరణ కోరగా.. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో అదే పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలు పీజీసీఆర్టీ (గణితం) వి.కల్పనకు ఇన్చార్జి ఎస్ఓ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేశారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే చూస్తు ఊరుకోం
● మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ● ఇసుక టిప్పర్ల అడ్డగింత మాగనూర్: మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చూస్తు ఊరుకోమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో ఇసుకలోడ్తో వస్తున్న టిప్పర్ను అడ్డుకుని టైర్లకు గాలి తీయించారు. అనంతరం మాట్లాడుతూ.. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు లేవన్నారు. తాను స్వయంగా హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఆర్డర్ను సంబంధిత కలెక్టర్, తహసీల్దార్తో పాటు పోలీస్ అధికారులకు సైతం అందించామన్నారు. అయినా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి వనరులు స్థానికులకే చెందాలని డిమాండ్ చేశారు. బుధవారం వాగు నుంచి తరలిస్తున్న ఇసుకకు సంబంధించిన అనుమతులను కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని సంప్రదించగా.. అనుమతులు లేవని తెలిపినట్లు మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నా మండల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు అంతా కలిసి మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా ఒక ఇసు క టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే రెండు గంటలు కూడా గడవక ముందే టిప్పర్ పోలీస్స్టేషన్ నుంచి బయటకు వచ్చేయడంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. ఇదే విషయంపై స్థానిక ఎస్ఐ పి.అశోక్బాబును సంప్రదించగా అ నుమతి పత్రాలు సంబంధిత కాంట్రాక్టర్ చూయించడంతో టిప్పర్ను వదిలేశామని తెలిపారు. -
మీ సమస్యలన్నీ తీరుస్తా
జిల్లా అల్లుడిగా వచ్చా.. రూ.42.70 కోట్లతో అనుగొండ పునరావాస కేంద్రం మక్తల్: ఉమ్మడి జిల్లా అల్లుడిగా వచ్చా.. ఇక్కడి ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటిన్నింటి పరిష్కారానికి కృషి చేస్తా అని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నా రు. బుధవారం మక్తల్ మండలం అనుగొండలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు, సంగబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. అనుగొండ పునరావాస కేంద్రం ఏర్పాటుకు రూ.42.70 కోట్లు మంజూరు చే యడం జరిగిందన్నారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి సాగునీటి పారుదలకు అడ్డుగా ఉ న్న బండను తొలగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న బండను తొలగించడంతో పాటు భూ నిర్వాసితులకు రూ.13 కోట్ల పరిహారం అందించామని గుర్తుచేశారు. భూత్పూర్, నేరడ్గం గ్రామాల్లో నిర్వహించిన ఏరియల్ సర్వేలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభు త్వం ముంపు గ్రామాలకు సంబంధించిన పైళ్లను మూలకు పడేసిందని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఎత్తిపోతల పథకాలు, చెక్డ్యాంలు, కాల్వల మరమ్మతు, నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా చెక్పోస్టు సమీపంలోని బ్రిడ్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో నిరంతరాయంగా నీరు నిల్వ ఉంటుందని.. అక్కడ చెక్డ్యాం నిర్మించి రైతులకు సాగునీటి వసతిని మెరుగుపర్చాలని మంత్రి ఉత్తమ్ను కోరారు. అదే విధంగా ముంపునకు గురైన దాదాన్పల్లి, అంకెన్పల్లి, భూత్పూర్, నేరగడం గ్రామాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండగా.. కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నామని మంత్రి వాకిటి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మక్తల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ను వాకిటి శ్రీహరి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా పాల్గొన్నారు. సంగంబండ వద్ద బండను తొలగించి రైతాంగానికి నీరందించిన ఘనత మాదే.. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
రాజ్యాంగ పరిరక్షణ
అందరి బాధ్యత నారాయణపేట: రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ కోరారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ పీఠికను పోలీస్ అధికారులు చదివి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించందన్నారు. దీంతో ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటి హక్కులను రాజ్యాంగ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, శివశంకర్, నరేష్, పురుషోత్తం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈగా నవీన్కుమార్ బాధ్యతలు నారాయణపేట: విద్యుత్శాఖ ఎస్ఈగా నూతనంగా నియమితులైన నవీన్కుమార్ బుధవారం జిల్లా ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, 1104 యూనియన్ తరఫున సర్కిల్, డివిజన్ నాయకులు మొగులప్ప, శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఎస్ఈని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, డీఈటీ జితేందర్, ఏడీ సుధారాణి, మహబుబ్నగర్ ఏడీ చంద్రశేఖర్, జడ్చర్ల నవీన్కుమార్, ఏఈ వెంకట్నారాయణ, ఏఈటీ వెంకట్రాంరెడ్డి, కాంట్రాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోలెమోని కృష్ణ, కాంట్రాక్టర్ కతాల్ అహామ్మద్, మోనోద్దీన్, తిప్రాస్పల్లి కృష్ణ, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు సరికాదు నారాయణపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎస్కేఎమ్ నాయకులు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో బుధవారం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్య క్షత వహించారు. ముఖ్య వక్తలుగా విచ్చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శి, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు అబ్దుల్సలీ మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల కు, రైతులకు క్షమాపణ చెప్తూ ప్రధాని మోదీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపోరుకు సై..
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. అయితే మొదటి విడతలో 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 565 గ్రామాలు, 5,221 వార్డులకు, మూడో విడతలో 563 గ్రామాలు, 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉండనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహించనుండగా, పోలింగ్ రోజునే కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. గ్రామాల్లో రాజకీయ సందడి.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాల కు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహు లు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీ సం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో ని రాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గు ర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మూడు విడతల్లోపంచాయతీఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రేపటి నుంచే తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడి ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు -
కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు
నారాయణపేట రూరల్: అవినీతి, అక్రమాలకు జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కేజీబీవీలకు మంజూరైన నిధులతో పాటు పిల్లలకు అందించే భోజనం వరకు అన్నింటిలోనూ ఎస్ఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రశ్నించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు విచారణ చేసే అధికారులను సైతం రాజకీయ, ఉపాధ్యాయ సంఘాలతో భయపెట్టిస్తున్నారు. వీరిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. చర్యలు తీసుకోలేదు అనేది నగ్న సత్యం. ఉన్నది ఒకటి.. రాయడం మరొకటి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో విద్యార్థుల సంఖ్యకు డైలీ అటెండెన్స్, జనరల్ అటెండెన్స్, మెనూ రిజిస్టర్కు సరిపోలడం లేదు. ప్రతిరోజు విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్లో 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలలో చేరినా.. మొదటి నుంచే వారికి హాజరు వేసి భోజనం పెట్టించినట్టు లెక్కలు రాసినట్లు సమాచారం. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏడాది రూ.లక్షకు పైగానే కేటాయిస్తోంది. కానీ అందుకు సరిపోయే వసతులు మాత్రం విద్యార్థులకు అందడం లేదనేది బహిరంగ రహస్యం. టెండర్లు మినహాయించి మిగతా వస్తువుల కొనుగోలులో ఎస్ఓలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అడ్మిషన్లలో అనర్హులే అధికం తల్లిదండ్రులు లేని పిల్లలు, వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో నిజమైన అర్హులు 10శాతం కంటే ఎక్కువ లేకపోవడం గమనార్హం. చాలామంది విద్యార్థులను రాజకీయ నాయకులు సిఫారసు చేయగా.. మరికొందరికి డబ్బులకు సీట్లు అమ్ముకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పాఠశాలలో సంఖ్య పెరిగిన కొద్దీ వారి వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో చేరికలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఒకే చోట స్థిరపడి.. దుర్వినియోగానికి పాల్పడి.. ఏళ్ల తరబడి ఎస్ఓలు ఒకే కేజీబీవీలో విధులు నిర్వర్తిస్తుండడంతో వారి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. వారు చేసిన తప్పులను ప్రశ్నించిన సీఆర్పీలు, పీజీసీఆర్పీలను వేధిస్తున్నారు. అధికారులు తనిఖీకి వెళ్తే ఉపాధ్యాయ సంఘాలతో అడ్డుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో పనిష్మెంట్కు గురైన వారు సైతం తిరిగి అదే చోట పనిచేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలోని 2,136 మహిళా సంఘాలకు రూ.1.79 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్లో మహిళా సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను మార్కెట్ చైర్మన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దామరగిద్దలో 716 సంఘాలకు రూ.58.52 లక్షలు, నారాయణపేటలో 705 సంఘాలకు రూ.59.57 లక్షలు, ధన్వాడలో 346 సంఘాలకు రూ.33.03 లక్షలు, మరికల్లో 369 సంఘాలకు రూ.27.87 లక్షలు కలిపి 2,136 సంఘాలకు గాను రూ.1,79 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, మార్కెట్ డైరెక్టర్ శరణప్ప, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మాధవరెడ్డి, డీఆర్డీఏ డీపీఎం మాసన్న, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు అరుంధతి, సుజాత, అంజమ్మ ఏపీఎంలు నారాయణ, అంజిలయ్య, వెంకట చారి, చెన్నప్ప, సీసీలు శ్రీనివాస్, అశోక్, లక్ష్మి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. మహిళ సంఘాల సభ్యులకు చెక్కును అందజేస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి అమలులోకి కోడ్.. పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. మచ్చుకు కొన్ని.. ధన్వాడ కేజీబీవీలో విద్యార్థుల సంఖ్య, పంపిణీలో తేడాలు వెలుగు చూశాయి. అధికారుల తనిఖీలు చేసే సమయంలో జూన్ ఇష్యూ రిజిస్టర్ లేకపోవడం, విద్యార్థులు ఇంటికి వెళితే అవుట్ గోయింగ్ రిజిస్టర్ సరైన విధంగా నమోదు చేయట్లేదు. ప్రతిదీ రెండు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. కోస్గి కేజీబీవీలో మార్చిలో వచ్చిన నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టి చేతులు దులుపుకున్నారు. వస్తువు కొనుగోలు, చేయించిన పనులకు మూడింతలు ఖర్చు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఒక్కరోజు భోజనం మెనూ ప్రకారం ఉండదని సమాచారం. ప్రశ్నించిన వారిపై బూతు పురాణం, రాజకీయ నాయకులతో బెదిరింపులకు దిగుతున్నారు. కృష్ణా కేజీబీవీలో అక్రమాలు బయటపడొద్దనే ఉద్దేశంతో నిరంతరం వంటవారిని మారుస్తున్నట్లు సమాచారం. రాజీనామా లేకుండానే కొత్తవారిని తీసుకున్నారని కార్యాలయంలో ఫిర్యాదు వచ్చినట్లు తెలిసింది. అక్కడ టార్చర్ భరించలేక ఓ విద్యార్థిని రాత్రి గోడ దూకి పారిపోగా గ్రామస్తులు తిరిగి పాఠశాలలో అప్పజెప్పగా.. ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. మార్చిలో రూ.3.5 లక్షల నిధులు వస్తే ఇష్టానుసారంగా ఏప్రిల్లో బిల్లులు సబ్మిట్ చేశారు. అధికారులు విచారణకు వస్తే ఉపాధ్యాయ సంఘ నాయకులతో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేడు అనుగొండలో మంత్రుల పర్యటన మక్తల్: అనుగొండలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పశుసంవర్ధక, మత్స్యసహకార మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం పర్యటిస్తారని మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ సర్పంచు గడ్డం రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుగొండ, అంకేన్పల్లి, దాదాన్పల్లి, గడ్డంపల్లి, ఆర్అండ్ఆర్ సెంటర్ గ్రామాలకు చెందిన రైతులతో ముఖా ముఖి కార్యక్రమం ఉంటుందని, ముంపు బాధితులందరూ విధిగా హాజరుకావాలని కోరారు. అంతకముందు హెలికాప్టర్లో భూత్పూర్, నేరడుగం గ్రామాల మీదుగా ఏరియల్ సర్వే చేస్తారని తెలిపారు.నిధుల ఖర్చులో ఎస్ఓల చేతివాటం మెనూ పాటించని వైనం విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపిసరుకులు మాయం ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తారనే ఆరోపణలు చర్యలు తీసుకుంటాం జిల్లాలోని కొన్ని కేజీబీవీలపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. తనిఖీల్లో కొన్ని మా దృష్టికి వచ్చాయి. విచారణ జరిపి వీటిపై కలెక్టర్ నివేదిక ఇచ్చాం. అవినీతి రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ -
నేడు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
నారాయణపేట రూరల్: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా పట్టణంలోని బాపునగర్ హనుమాన్ ఆలయంలో బుధవారం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు సామాల మాణిక్యప్ప తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక పూజలు, కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికలు నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 30న ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు డిసెంబర్ 4న రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్–20 బాలురకు 8 కి.మీ, బాలికలలకు 6 కి.మీ, అండర్–18 బాలురకు 6 కి.మీ, బాలికలకు 4 కి.మీ, అండర్–16 బాలికలకు, బాలురకు 2 కి.మీ.ల చొప్పున పరుగు పందెల పోటీ లు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు జనన ధృవీకరణ పత్రం, పదో తరగతి మెమో తీసుకొని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 91007 53683, 90593 25183, 90635 00718 నంబర్లకు సంప్రదించాలన్నారు. యువత సన్మార్గంలో నడవాలి నారాయణపేట రూరల్: భారత ప్రభుత్వ యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేరా యువభారత్ కార్యక్రమాల నిర్వహణకు నారాయణపేట జిల్లా కోఆర్డినేటర్గా మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ను నియమించారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవేందర్ వ్యాస్ భాస్యర్కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో యువతను ప్రోత్సహించి సన్మార్గంలో నడిపేందుకు కృషి చేస్తానని, వికసిత్ బారత్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అందరితో సమన్వయంతో ముందుకు వెళ్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్ సుధాకర్ సూచించారు. మండలంలోని జాజాపూర్ రైతువేదికలో మంగళవారం యాసంగి సీజన్కు సంబంధించిన వరి విత్తనాలను రైతులకు అందించారు. ఆర్ఎన్ఆర్ 15048 రకానికి చెందిన 25 కిలోల బస్తాకు సబ్సిడీ పోను రూ. 500 మాత్రమే చెల్లించాలన్నారు. వ్యవసాయ రంగానికి ప్రభు త్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, రైతులు వ్యవసాయ అధికారు ల ద్వారా సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఆర్టీఏ సభ్యులు పోషల్ రాజేష్, మండల వ్యవసాయ అధికారి దినకర్, ఏఈఓలు రాజేష్, అనిల్, అంజమ్మ, సుధాకర్, అనిల్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్రెడ్డి, శరణప్ప, వెంకటేష్, రవి, రాములు, తిరుమలప్ప పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత ఉండదు..
2014 కంటే ముందు నుంచి చాలామంది విధులు నిర్వహిస్తున్నారు. వారిని నేరుగా యూనివర్సిటీ నియమించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీఓలో నేరుగా ఔట్సోర్సింగ్కు ఇస్తున్నట్లు ఉంది. కనీసం సిబ్బందికి చెప్పకుండా ఔట్సోర్సింగ్కు ఇస్తే ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. కాంట్రాక్టు విధానం లేదా నేరుగా యూనివర్సిటీ కింద కొనసాగిస్తూ జీఓ ప్రకారం వేతనాలు ఇస్తే చాలు. – రామ్మోహన్, పీయూ నాన్టీచింగ్ సంఘం అధ్యక్షుడు ఈ అంశాన్ని పరిశీలిస్తాం.. పీయూలో నాన్టీచింగ్ సిబ్బంది ఔట్సోర్సింగ్ అంశాన్ని పరిశీలిస్తాం. వారు వినతిపత్రం ఇస్తే దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ ● -
జాతీయ స్థాయికి పేట విద్యార్థి
నారాయణపేట రూరల్: మద్దూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లికి చెందిన కనకప్ప కుమారుడు శ్రీకాంత్ నారాయణపేట పట్టణంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో సబ్ జూనియర్ కబడ్డీలో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. దీంతో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నెల చివరలో హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటాడని పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. కళాశాల యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు శ్రీకాంత్ను అభినందించారు. -
ముహూర్తం ఖరారు
ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్ వద్ద, హెలిప్యాడ్కు సంబంధించి ఆత్మకూర్ జాతర మైదానం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. రవాణా సౌకర్యం మెరుగు.. ఆత్మకూర్ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10కిలోమీటర్లకు ఆత్మకూర్ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎ మ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణా టకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి.. జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్అండ్బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం గద్వాల– ఆత్మకూర్ మధ్య తగ్గనున్న22 కిలోమీటర్ల దూరం ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి రెవెన్యూ డివిజన్ దిశగా ఆత్మకూర్ అడుగులు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి పర్యటన -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలను అందజేశారు. వారి సమస్యలను వినడంతో పాటు అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో 20 ఫిర్యాదులు అందాయి. నేటి నుంచి గీతా జ్ఞానయజ్ఞం ప్రారంభం నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానం శక్తి పీఠంలో మంగళవారం నుంచి డిసెంబర్ 1, సోమవారం వరకు గీతా జ్ఞాన యజ్ఞం–భగవద్గీత సప్తాహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ గీతా జ్ఞాన యజ్ఞం ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి శాంతానంద సభ మండపంలో జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు దోమ సుధాకర్, నంది రాజశేఖర్, కర్నె గంగాధర్రెడ్డి కోరారు. ‘బీజేపీ కార్యకర్తలజోలికొస్తే సహించం’ కోస్గి: కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నామనే దీమాతో బీజేపీ కార్యకర్తల జోలికి వస్తామంటే చూస్తు ఊరుకోబోమని, దాడులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు. మండలంలోని మీర్జాపూర్ చెందిన బీజేపీ నాయకుడు రమేష్ తన ఇంటి గేటుకు కమలం పువ్వు గుర్తు వేసుకొని, బీజేపీ అని రాసుకోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం రాత్రి రమేష్ ఇంటిపై దాడి చేశారు. వెంటనే గేట్కు వేసిన బీజేపీ గుర్తును తీసివేయాలని వాగ్వాదానికి దిగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అరుణ స్థానిక నాయకులతో కలిసి సోమవారం మీర్జాపూర్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీసులతో ఫోన్లో మాట్లాడి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితువు పలికారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేరని అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ట్ర నాయకులు నాగురావ్ నామాజీ, రతంగ్పాండు రెడ్డి, లక్ష్మీశ్యాంసుందర్ గౌడ్, నాయకులు ప్రతాప్రెడ్డి, వార్ల అంజయ్య, ప్రశాంత్, పద్మ, కోటకొండ రాము, నర్సిములు, శ్రీకాంత్, యాదయ్య, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నారాయణపేట రూరల్: పోరాటాలతోనే విద్యారంగ సమస్యలను పరిష్కరించుకుందామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర సహా కార్యదర్శి సాయికుమార్ స్పష్టం చేశారు. జిల్లా 3వ మహాసభల విజయవంతం, నూతన జిల్లా కమిటీ ఎన్నికలపై సోమవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం ఉన్నత విద్య మాత్రమే కాక, సమాజంలోని అసమానతలు, అన్యాయాలపై కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పేట అన్ని రంగాల్లో వెనుకబడినప్పటికీ, అభివృద్ధిపై ఏ ప్రభుత్వానికీ నిజమైన ఆసక్తి లేదన్నారు. కార్పొరేట్కు కొమ్ము కాస్తూ పేదలను విద్యను దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల, సంక్షేమ వసతి గృహాలకు సొంతభవనాలు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్, బీఈడీ, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా బి.మహేష్, ఉపాధ్యక్షుడిగా హోపి, సహ కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా గణేష్తో పాటు 15మంది కార్యవర్గ సభ్యులుగా నియమించారు. -
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం. – అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి గ్రామం, గద్వాల జిల్లా పూర్వవైభవం తీసుకువస్తా.. ఇచ్చిన మాట ప్రకారం జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం భూమి పూజకు డిసెంబర్ 1న సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారు. ఒకప్పుడు సంస్థానంగా, తాలుకా కేంద్రంగా అన్ని రకాల కార్యాలయాలతో ఆత్మకూర్ వెలుగొందింది. ఆత్మకూర్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో సహా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించగా.. సానుకూలంగాస్పందించారు. ఆత్మకూర్కు పూర్వవైభవం తీసుకువస్తా. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ● -
పటేల్ జీవితం యువతకు ఆదర్శం
నారాయణపేట రూరల్: దేశాన్ని ఏక ఖండ భార తంగా రూపుదిద్దడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనలో సమైక్యతా స్ఫూర్తిని నింపిన మహానుభావుడని ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని బారంబావి నుంచి మినీ స్టేడియం వరకు 4కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిరస్మరణీయ నేత అని కొనియాడారు. భారత స్వతంత్ర సమరయోధుడు, రాజనీతిజ్ఞుడిగా సమాజంలో అపార సేవలందించారని తెలిపారు. స్వతంత్ర భారత్కు తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పటేల్ 530కుపైగా సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించారని, అందుకే ఆయనను ఉక్కు మనిషిగా చిరస్మరణీయుడిగా నిలిచారన్నారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ నిర్మాణంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత ఉత్సాహంగా 4కే రన్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో రన్నింగ్ వంటి క్రీడలకు పెద్దపీట వేయాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా.. యువత గంజాయి, ఇతు మత్తు పదార్థాలతో పాటు సైబర్ నేరాలకు పాల్పడడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎంపీ, కలెక్టర్ సూచించారు. మత్తుకు బానిసై ఎన్నో కుటుంబాలు చీకటిలో మునిగిపోతున్నాయని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు నాగురావు నామాజీ, రతంగ్పాండు రెడ్డి, ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోటానాయక్, కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డీఈఓ గోవిందురాజు, తపస్ జిల్లా అధ్యక్షుడు షేర్ కృష్ణారెడ్డి, డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టి, ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నాన్ టీచింగ్ సిబ్బంది ఔట్ సోర్సింగ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు సిబ్బంది మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ మేరకు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంగేజ్ చేస్తున్నట్లు జీఓ 1626ను ఈనెల 15న జారీ చేసింది. అయితే ఈ జీఓను నాన్టీచింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న వారు ఉండగా.. మరికొంతమంది 2014 కంటే ముందు విధుల్లో చేరి జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వకపోయినా నేరుగా యూనివర్సిటీ కిందే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాన్ టీచింగ్ సిబ్బంది రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో పనిచేసిన పలువురు వైస్ చాన్స్లర్లు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తే 21 రోజులపాటు ధర్నా చేపట్టి.. ఆ విధానంలోకి వెళ్లలేదని పీయూ రిజిస్ట్రార్కు తెగేసి చెప్పారు. జీఓలో ఔట్సోర్సింగ్ విధానం అని చెప్పి ఏ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానో వేతనాలు ఇవ్వకూడదని, నేరుగా యూనివర్సిటీ లేదా, ట్రెజరీ నుంచి ఇవ్వాలని కోరారు. ఆ విధానంతో నష్టం.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల తీవ్రనష్టం జరుగుతుందని నాన్టీచింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు యూనివర్సిటీ కింద తాత్కాలిక సిబ్బంది లేదా అడ్హక్ పద్ధతిలో పనిచేస్తూ వచ్చిన సిబ్బందిని ఇప్పుడు నేరుగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు సమస్య వస్తే నేరుగా యూనివర్సిటీ అధికారులను చెప్పుకొనేందుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తే ఏజెన్సీ కాంట్రాక్టర్ చెప్పినట్లు వినాల్సి వస్తుందని సిబ్బంది భయపడుతున్నారు. జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చినప్పటికీ ఈఎస్ఐ, ఈపీఎఫ్, జీఎస్టీ, ఏజెన్సీ కమీషన్ వంటివి వేతనాల్లో కోత విధించి అరకొర వేతనాలు మాత్రమే చేతిలో పెడతారని, అందుకు తాము ఒప్పుకొనేది లేదని తెగేసి చెబుతున్నారు. 2014 తర్వాత పలువురు సిబ్బందిని అవసరం మేరకు గతంలో తీసుకున్న అధికారులు నేరుగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. అయితే 2014 కంటే ముందు విధుల్లో చేరిన వారు సుమారు 75 మందికిపైగా ఉన్నారని వారిని నేరుగా కాంట్రాక్టు విధానంలో తీసుకోవాలని నాన్టీచింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కేటగిరీల వారీగా విభజన.. జీఓ 1626 ప్రకారం మొత్తం 512 మంది సిబ్బందిని ఎంగేజ్ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 38, సెల్ప్ ఫైనాన్స్ ద్వారా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు 24, అకాడమిక్ కన్సల్టెంట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ 34 ఉన్నారు. పార్ట్ టైం ద్వారా మరో 66 మంది పనిచేస్తున్నారు. వీరికి వేతనాలను జీఓ 60, 11 ప్రకారం చెల్లిస్తున్నారు. అలాగే ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారు మొత్తం 350 మంది ఉన్నారు. రూ.19,500 వేతనం స్లాబ్లో వంద మంది, రూ.15,500 వేతనం స్లాబ్లో 236 మంది, రూ.22,750 వేతనం స్లాబ్లో 14 మంది ఉన్నారు. పీయూలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి బదలాయింపునకు చర్యలు వచ్చే ఏడాది మార్చి వరకు ఎంగేజ్ చేస్తూ జీఓ జారీ తమను సంప్రదించకుండా ఎలా విలీనం చేస్తారని సిబ్బంది ఆవేదన అన్యాయం చేయొద్దని పీయూ రిజిస్ట్రార్కు వేడుకోలు -
క్రీడలతో మానసికోల్లాసం
నారాయణపేట: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఎస్పీ స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ క్రికెట్ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసికోల్లాసాన్ని పెంచడానికి మంచి సాధనంగా ఉంటాయని తెలిపారు. యువతలో ప్రతిభను వెలికితీయడం, వ్యక్తిత్వాన్ని నిర్మించడం కోసం ఇలాంటి పోటీలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. మెగా క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా 30 జట్లు పాల్గొంటుండటంతో పాటు రెవెన్యూ, పోలీసు, మీడియా, డాక్టర్లు, లాయర్ జట్లు పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువత టీమ్లు పోటీపడుతున్న ఈ వేదిక ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
కేసులు నమోదు చేస్తే తాటతీస్తా..
● మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకో.. ● హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్: రైతాంగ సమస్యలపై రాస్తారోకో చేస్తున్న రైతులపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి వాకిటి శ్రీహరి పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయించడం జరిగిందని, ఇలాంటి పనులు చేస్తే తాట తీస్తామని, ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. సోమవారం మక్తల్లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మక్తల్ ట్యాంకుబండ్ దగ్గర చేస్తున్న పనులు చేపట్టడం సరియైందికాదన్నారు. రాస్తారోకో చేస్తున్న రైతులు, బీఆర్ఎస కార్యకర్తలపై మంత్రి వాకిటి శ్రీహరి పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయించడం జరిగిందన్నారు. మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. గతంలో ట్యాంకు బండ్ కోసం రూ.4.50 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి పనులు చేయడం జరిగిందన్నారు. పార్కు కోసం మున్సిపాల్టీలో తీర్మానం చేసి నిర్మాణం కోసం రూ.కోటి 40 లక్షలు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసు నమోదు చేస్తే కక్ష పూరితమైన రాజకీయ చర్యలకు నిదర్శనమన్నారు. లేనిపోని మాటలు అడితే తగిన పరిణమాలు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. సమావేశలలో మార్కెట్ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు అన్వర్, మొగులప్ప, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, ఈశ్వర్యాదవ్, నేతాజీరెడ్డి, శివారెడ్డి, మన్నన్ పాల్గొన్నారు. -
పోస్టర్ డిజైన్లో ప్రతిభ
మిడ్జిల్: తెలంగాణ రాజ్ భవన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘తెలంగాణ ఉత్తర– తూర్పు కాంటెస్ట్’ కోసం నిర్వహించిన పోస్టర్ డిజైన్ పోటీల్లో మిడ్జిల్ మండలం బోయిన్పల్లికి చెందిన విష్ణువర్ధన్ అత్యుత్తమ ప్రతిభ చాటారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పోస్టర్ల కంటే విష్ణువర్ధన్ రూపొందించిన పోస్టర్ ఆకర్షణీయంగా ఉండటంతో ఆదివారం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించి.. ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. తెలంగాణ ఉత్తర–తూర్పు ప్రాంతాల్లో సాంస్కృతిక మార్పు, వ్యాపార అనుబంధం, విద్య, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని విష్ణువర్ధన్ తెలిపారు. ఈ అంశాన్ని ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా ప్రతిబింబించినందుకు తన పోస్టర్ డిజైన్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. బోయిన్పల్లి యువకుడికి గవర్నర్ ప్రశంస -
స్పెల్బీ.. మ్యాథ్స్బీకి విశేష స్పందన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మౌంట్బాసిల్ పాఠశాలలో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ, మ్యాథ్స్బీ పరీక్షలకు విశేష స్పందన లభించింది. మెయిన్ స్పాన్సర్స్ డ్యూక్ వఫే, అసోసియేషన్ విత్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి వారి సౌజన్యంతో నిర్వహించిన పరీక్షలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షలు రాయడంతో తమకు ఇంగ్లిష్పై అవగాహన పెరిగిందని పలువురు విద్యార్థులు తెలిపారు. ముందుగానే వివిధ అంశాలను నేర్చుకోవడం వల్ల సులభంగా పరీక్ష రాసినట్లు చెప్పారు. వివిధ స్థాయిల్లో పరీక్షలు రాయడం వల్ల పోటీ పరీక్షలకు సైతం సులభంగా ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు పరీక్షలో కఠినమైన ప్రశ్నలకు సైతం సులభంగా జవాబులు రాశామన్న విద్యార్థులు -
టెండర్ ఫీజు తగ్గించినా స్పందన కరువు
దేవరకద్ర రూరల్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చిన్నరాజమూర్ ఆంజనేయస్వామికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి ఉత్సవాలకు రాష్ట్రం నుంచేగాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. నెలరోజుల పాటు కొనసాగే స్వామివారి ఉత్సవాల్లో ప్రసాద విక్రయానికిగాను అధికారులు రెండుసార్లు బహిరంగ వేలం నిర్వహించినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. వచ్చే నెల 2 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ప్రసాద విక్రయ టెండర్పై మాత్రం పీటముడి వీడటం లేదు. ● ఉత్సవాల సమయంలో స్వామివారిని లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. గతంలో ప్రసాదాల పంపిణీ ఆలయం తరుఫున కొనసాగుతుండగా.. ఎక్కువ ఆదాయం సమకూరేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకోసం ముందుగా రూ.2 లక్షల డిపాజిట్ రుసుంతో వేలం నిర్వహించగా, స్పందన రాలేదు. దీంతో డిపాజిట్ ఫీజును రూ.లక్ష తగ్గించి మరోసారి టెండరు పిలిచారు. అయినప్పటికీ టెండరు దాఖలుకు ఎవరూ ముందుకురాకపోవడంతో గత్యంతరం లేక వాయిదా వేశారు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ అధికారులు మరోసారి టెండర్ పిలుస్తారా.. లేక పాత పద్ధతిలోనే కొనసాగిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. గ్రామస్తులే దక్కించుకున్నారు.. ఆలయ పరిధిలో జరిగే టెంకాయలు, తలనీలల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణకు అధికారులు నెలరోజుల కిందట బహిరంగ వేలం నిర్వహించారు. మూడు టెండర్లలో బయటి వ్యక్తులు పాల్గొనకున్నా.. గతం కంటే కొంచెం ఎక్కువ పాడి గ్రామస్తులే దక్కించుకున్నారు. టెంకాయల టెండర్ను రూ.2.76 లక్షలకు గోవర్ధన్, తలనీలల సేకరణను రూ.4.91 లక్షలకు వన్నాడ గోపాల్, కొబ్బరి చిప్పల సేకరణను రూ.90 వేలకు కుర్మయ్య దక్కించుకున్నారు. చిన్నరాజమూర్లో ప్రసాదాల విక్ర య టెండర్ వాయిదా రూ.లక్ష తగ్గించిన అధికారులు డిసెంబర్ 2 నుంచి జాతర ప్రారంభం -
పరీక్ష బాగా రాశాను..
‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ పరీక్షలో స్పెల్లింగ్స్, గ్రామర్ తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. గతంలో ఇచ్చిన మెటీరియల్ను ప్రిపేర్ కావడం వల్ల చాలా సులభంగా ప్రశ్నలకు జవాబులు రాశా. గతంలో కూడా నేను స్పెల్బీ పరీక్ష రాయడం వల్ల ఇంగ్లిష్పై చాలా వరకు అవగాహన పెంచుకున్నా. కాన్పిడెన్స్గా ప్రశ్నలకు జ వాబులు రాశాను. – వసుంధర, 9వ తరగతి, మౌంట్బాసిల్ స్కూల్, మహబూబ్నగర్ గణితంపై పట్టు సాధించేలా.. మొదటిసారిగా పాఠశాలలో నిర్వహించే పరీక్షలు కాకుండా ఓ పోటీ పరీక్ష రాశాను. ఈ పరీక్షలో అందరికంటే ఎక్కు వ మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నించా. చాలా సులభంగా జవాబులు రాసే విధంగా ప్రశ్నపత్రం వచ్చింది. భవిష్యత్లో మ్యాథ్స్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు మ్యాథ్స్బీ పరీక్ష ఎంతగానో దోహదపడుతుంది. – సాయిహర్షిత, 9వ తరగతి, మౌంట్బాసిల్ స్కూల్, మహబూబ్నగర్ -
ఆటోను ఢీకొట్టిన కారు
మహబూబ్నగర్ క్రైం: కారు డ్రైవర్ అతివేగంగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో బాలుడితో పాటు మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. ధన్వాడ మండలం ఆకుమర్రితండాకు చెందిన శ్రీను అనే ఆటో డ్రైవర్ ఆదివారం కుటుంబంతో కలిసి ఫతేపూర్ మైసమ్మకు మొక్కులు చెల్లించి మహబూబ్నగర్ నుంచి కోయిలకొండ వైపు వెళ్తుండగా, కోయిలకొండ వైపు నుంచి మహబూబ్నగర్కు వస్తున్న కారు కోయిలకొండ ఎక్స్రోడ్ సమీపంలో ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న శక్రిబాయి, కవిత, ఏడేళ్ల అఖిల్ అనే బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురికి గాయాలు -
అపురూప జైన శిల్పాలు లభ్యం
● చాళుక్య, కాకతీయుల కాలం నాటివిగా గుర్తింపు ● జైన విద్యా కేంద్రం ఉన్నట్లుగా ఆనవాళ్లు వీపనగండ్ల: మండల పరిధిలోని తూముకుంట గ్రామ శివాలయ ప్రాంగణంలో పురాతన జైన శిల్పాలు లభించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధులు బైన్రోజు చంద్రశేఖర్, డా.బైరోజు శ్యాంసుందర్ ఆదివారం తెలిపారు. శిల్పాల్లో జైన తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు, ధ్యాన సంసిద్ధుడై ఉండగా అతని తలపై మూడు వరుసలలో గొడుగు, ఇరువైపుల ఛామరాలు చెక్కబడి ఉన్నాయన్నారు. శిల్పం కింది అంతస్తులో జ్ఞాన పీఠానికి రెండు వైపులా ఇద్దరు శ్రామికులు కూర్చొని ఉన్నారన్నారు. ఈ విగ్రహాలను పుస్తకదక్ష్చ లేదా సరస్వతీగక్ష్చ అంటారన్నారు. వీటి ఆధారంగా తూముకుంటలో జైన విద్యా కేంద్రం ఉండేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొరన్నారు. విగ్రహాల్లో చెప్పదగినవి.. గండపెండేరం సాధారణ వీరుడుకి ఉందని, ఒక విగ్రహం చాళుక్యుల కాలం, మరోక విగ్రహం కాకతీయుల కాలానికి చెందిందన్నారు. గ్రామానికి సమీపంలో సింగోరం గుట్టపై పది అడుగుల పైగా ఉన్న సుపార్శనాథుడి విగ్రహం కూడా లభించిందని పేర్కొన్నారు. ఇట్టి విగ్రహాలను ముందు తరాల వారు గుర్తుంచుకునే విధంగా భద్రపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
మెట్ల పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
కొల్లాపూర్: పట్టణంలోని తెలుగువీధికి చెందిన జలకం నర్సింహ (46) ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి జారిపడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆదివారం పాలీష్ బండలు పర్చేందుకు నర్సింహ ఓ భవనం వద్దకు వెళ్లాడు. అక్కడ బండలు మెట్లమీది నుంచి కిందికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నర్సింహకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం నాగర్కర్నూల్ క్రైం: ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. జిల్లా కేంద్రంలోని వివేకానందనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ రాజకీయపార్టీకి చెందిన కార్యకర్త నర్సింహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పురుగు మందు తాగి ఆత్మహత్య కొడేరు: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొడేరు మండలం ఎత్తం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్డెర విష్ణు (45) భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్లో వాచ్మెన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నెల 14న భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో స్వగ్రామానికి వచ్చి కలుపు మందు తాగి స్నేహితుడు రామ్కు ఫోన్ చేశాడు. అతను కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పాలమూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీ.. లారీ డ్రైవర్ మృతి మహబూబ్నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కండికి చెందిన శ్రీనివాసులు (46) ఆదివారం లారీలో ఇనుపలోడ్ వేసుకొని హైదరాబాద్ నుంచి కర్ణాటకు బయలుదేరాడు. మన్యంకొండ స్టేజీ దగ్గర లారీని ఆపి అద్దాలు శుభ్రం చేసి రోడ్డు దాటుతుండగా రాయచూర్ నుంచి మహబూబ్నగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. జాతీయ రహదారి దిగ్బంధంపై కేసు నమోదు మాగనూర్: పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించి పబ్లిక్ న్యూసెన్స్, ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్బాబు ఆదివారం తెలిపారు. ఈ నెల 17న మిల్లర్ల సమ్మె కారణంగా మండల పరిధిలోని వడ్వాట్ గేట్ దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రైతులు మిల్లుకు తీసుకొచ్చిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని చేపట్టిన రైతు ధర్నాకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బసంత్రెడ్డి, నర్సింహారెడ్డి, అశోక్రెడ్డి, బీజేపీ ఉమ్మడి మండల అధ్యక్షుడు నల్లె నర్సప్పతో పాటు మరికొందరు జాతీయ రహదారిపై సుమారు నాలుగు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి ● మూడుకు చేరిన మృతుల సంఖ్య జడ్చర్ల: మండలంలోని గొల్లపల్లి సమీపంలో ఉన్న సాలసార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మూడురోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు ఉత్తర్ప్రదేశ్కు చెందిన దేవరాజ్ (20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మిల్లులో అగ్ని ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం పాఠకులకు విధితమే. క్షతగాత్రులు దేవరాజ్, సంబుశెట్టిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. దేవరాజ్ మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నిర్వాసితులకు అండగా ఉంటా
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కొత్తకోట రూరల్: ముంపు గ్రామ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి– జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాగృతి వనపర్తి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో మండలంలోని కానాయపల్లి ముంపు నిర్వాసితులతో ఆమె మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని శంకరసముద్రం రిజర్వాయర్ను పరిశీలించారు. 2005లో నాటి ముఖ్యమంత్రి దివంతగ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ముంపు గ్రామంగా ప్రకటించగా.. ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో భూములు, ఇళ్లు కోల్పోయిన గ్రామస్తులు పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఢిల్లీ స్థాయి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించి పంపిస్తే అందరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు భరోసానిచ్చారు. అధికార, ప్రతిపక్షంలో తాను లేనని, చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని, అవసరం ఉన్నప్పుడు పిలిస్తే అందరూ కలిసికట్టుగా రావాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవాలి.. చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. మొదట పట్టణంలోని అంబభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వీవర్స్కాలనీలో చేనేత కార్మికులు కుమార్, చంద్రకళ, రాములు, వెంకటమ్మ ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి మగ్గం వేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికులు దేశవ్యాప్తంగా దుర్భర జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ఆలోచనలతో నేతన్నలకు పింఛన్లు, నూలుకు సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాయితీ నిలిపివేయడంతో పింఛన్లు తప్ప ఎలాంటి ఆదరణ లేదన్నారు. బీసీల్లో అత్యధికంగా పద్మశాలీలు, ముదిరాజ్లు ఉంటారని.. వీరిని అన్ని రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగా చూస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల పక్షాన నిలబడేందుకు తెలంగాణ జాగృతి ముందుంటుందన్నారు. జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్గౌడ్, మహిళా అధ్యక్షురాలు మర్రిపల్లి మాధవి, ఉపాధ్యక్షురాలు లలితాయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రయాదవ్, రాష్ట్ర వైద్య విభాగం కన్వీనర్ వెంకటరమణమూర్తి, మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ శ్రీదేవి, కరాటే శ్రీనివాస్, వనపర్తి జిల్లా కో–కన్వీనర్ మాలతి, బీర్ల ఎల్లయ్యయాదవ్, స్వామి, రవిసాగర్, మనోహర్గౌడ్ తదితరులు ఉన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి
● మహబూబ్నగర్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన ● మృతి చెందిన విషయం ఆలస్యంగా చెప్పారంటూ ఆరోపణపాలమూరు: వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమంటూ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని కోడూర్ గ్రామానికి చెందిన లలిత(35) అనారోగ్య సమస్యలతో మూడు రోజుల కిందట మేనక థియేటర్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. చికిత్స అందిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు సమాచారం. వైద్యం చేస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకున్నారని, పరిస్థితి విషమిస్తే కనీసం సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణించిన విషయం కూడా ఆలస్యంగా చెప్పారని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. విషయం తెలసుకున్న వన్టౌన్, టూటౌన్, రూరల్ పోలీసులు పరిస్థితి అదుపు దాటకుండా మృతురాలి భర్త నాగరాజు, కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. -
ప్రశాంత్కుమార్రెడ్డికే మళ్లీ డీసీసీ పగ్గాలు
నారాయణపేట: జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మరోసారి కె.ప్రశాంత్కుమార్రెడ్డికే దక్కాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరుగురు పోటీ పడ్డారు. అయితే పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డిల గెలుపునకు కృషిచేసిన ప్రశాంత్కుమార్రెడ్డికే పార్టీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించినట్ల రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో వాకిటి శ్రీహరి డీసీసీ అధ్యక్షుడిగా ఉండి మక్తల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సమయంలో ప్రశాంత్కుమార్రెడ్డి సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి క్షణం వరకు పోటీ పడ్డారు. కాగా, బీసీ సామాజికి వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టికెట్ ఖరారు చేయించడంతో ఆశలు వదులుకున్నారు. ఆ సమయంలో అధిష్టానం మాట వినడంతో ఆయనకు వెంటనే డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ విధేయుడిగా పనిచేస్తుండటంతో.. మరోసారి అవకాశం కల్పించేందుకు అధిష్టానం మొగ్గుచూపింది. ● ప్రశాంత్రెడ్డిది నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేర్ గ్రామం. ఆయన 1975 మే 8న జన్మించారు. మెకానికల్ ఇంజినీర్ పూర్తిచేశారు. ఆయన తండ్రి వీరారెడ్డి రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి అమరచింత ఎమ్మెల్యేగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా రెండు పర్యాయాలు పనిచేశారు. తండ్రి బాటలో తనయుడిగా 1992లో అమరచింత ఎన్ఎస్యుఐ నియోజకవర్గ ఇన్చార్జిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో మరోసారి డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
1న మక్తల్కు సీఎం రేవంత్రెడ్డి
● మక్తల్–కొడంగల్–పేట ఎత్తిపోతల పనులకు శ్రీకారం ● రూ. 200కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి భూమిపూజ ● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ మక్తల్: నియోజకవర్గంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డా.వినీత్తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని కాట్రేవ్పల్లిలో మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించడంతో పాటు గొల్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అదే విధంగా మక్తల్–నారాయణపేట బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేస్తారని అన్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొటోకాల్ తప్పొద్దని సూచించారు. గొల్లపల్లి వద్ద సీఎం బహిరంగ సభకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సీఎం పర్యటన షెడ్యూల్ను పక్కాగా రూపొందించాలని సూచించారు. అధికారలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట.. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా మహిళా సంఘాలతో స్కూల్ యూనిఫాం తయారీతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చేందుకు రాయితీపై రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. గత ప్రభుత్వం తూకం వేసిన నాసీకరకం చీరలను పంపిణీ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతమైన నేత చీరలను పంపిణీ చేస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే రహదారుల అభివృద్ధికి రూ. 70కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మక్తల్కు డిగ్రీ కాలేజీ, 150 పడకల ఆస్పత్రి, రూ. 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ఆర్డీఓ రామచందర్, ఎస్డీసీ రాజేందర్, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, ఆర్అండ్ఆర్ ఈఈ వెంకటరమణయ్య, పీఆర్ ఈఈ హీర్యానాయక్, డీవైఎస్ఓ వెంకటేశ్, డీపీఆర్ఓ రషీద్, డీఈఓ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
నారాయణపేట రూరల్: చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో శనివారం ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14 బాలబాలికలకు వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్ వంటి క్రీడా పోటీలు క్రీడాకారుల్లో ఒప్పందం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభకనబర్చే వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. కాగా, జిల్లాలోని 13 మండలాల నుంచి దాదాపు 260 మంది క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన పోటీల ముగింపు కార్యక్రమానికి డీఈఓ గోవిందరాజులు హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభకనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24న గద్వాలలో జరిగే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సదాశివారెడ్డి, వైస్చైర్మన్ హన్మంతు, ఆర్టీఓ సభ్యుడు రాజేశ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, పీడీలు నర్సింహులు, రత్నయ్య, వెంకటప్ప, అనంతసేన, సాయినాథ్, రామకృష్ణ, నర్సింహారెడ్డి, శ్రీధర్, వేణు, పారిజాత, రాజేశ్వరి, అక్తర్, బసంతరెడ్డి పాల్గొన్నారు. ఆహారంలోనాణ్యత లోపించొద్దు మక్తల్: విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించొద్దని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్ అన్నారు. మక్తల్ పట్టణంలోని మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. స్టోర్రూంలో ఉన్న కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నారు. ప్రైవేటీకరణ అభివృద్ధికి ప్రమాదకరం నారాయణపేట రూరల్: విద్య, వైద్యం వంటి కీలక రంగాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద, మధ్యతరగతి వారి భవిష్యత్కు ప్రమాదకరమని ఇల్లేందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్యతో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి, మాజీ అధ్యక్షుడు హన్మేష్ మాట్లాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం మాత్రమే కాక, రైతుల గిట్టుబాటు ధరలు, లింగ అసమానతలు, కుల,మత వివక్ష వంటి సమస్యలపై కూడా పోరాడాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా పిల్లలకు మెరుగైన ఉచిత విద్య అందకపోవడం పాలకుల వైఫల్యమని విమర్శించారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడినప్పటికీ, అభివృద్ధిపై ఏ ప్రభుత్వానికీ నిజమైన ఆసక్తి లేదన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ పేదలను విద్యకు దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోవడం, మెస్ చార్జీల పెంపుపై స్పందించకపోవడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి అంశాలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి తెచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠ్యాంశాల్లో అశాసీ్త్రయ అంశాలు చొప్పించడం దేశ భవిష్యత్కు ప్రమాదమని పేర్కొన్నారు. అంతకుముందు మహాసభల సందర్భంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్, డాక్టర్ నాగేష్, న్యాయవాది కాళేశ్వర్, రాము, రామకృష్ణ, సలీమ్, కాశీనాథ్, అజయ్, సంధ్య, వెంకటేష్, గౌస్, మహేష్ పాల్గొన్నారు. -
సర్పంచు రిజర్వేషన్లు ఖరారు!
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కొన్ని రోజులుగా సర్పంచు రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్పంచు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీఓ 46 విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇచ్చిన జీఓకు అనుగుణంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశంతో ఆర్డీఓ రాంచందర్నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి, డీఆర్డీఓ మొగులప్పలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు చేయగా.. మండలాల్లో ఎంపీడీఓలు వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లాటరీ పద్ధతిలో.. సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనగణన, ఎస్ఈ ఈసీపీ డేటా వినియోగిస్తూ.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అధికారులు ఖారారు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వు చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వందకు వందశాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు చేశారు. మొదట ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేసి.. ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయింపులు చేశారు. 272 జీపీలు.. 2466 వార్డులు జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 272 జీపీలు, 2,466 వార్డులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేసి.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు. మొత్తం 3,96,541 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,94,124 మంది పురుషులు, 2,02,410 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2,470 పోలింగ్స్టేషన్లను అధికారులు గుర్తించారు. మొత్తం 272 జీపీలకు గాను జనరల్కు 68 స్థానా లు, జనరల్ మహిళకు 56, ఎస్సీ జనరల్కు 26, ఎస్సీ మహిళలకు 17 స్థానాలు, ఎస్టీ జనరల్కు 20, ఎస్టీ మహిళలకు 13 స్థానాలు, బీసీ జనరల్కు 38, బీసీ మహిళలకు 34 స్థానాలు కేటాయించారు. జీఓ 46కు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు రొటేషన్ పద్ధతిలో మహిళలకు కేటాయింపులు అధికారికంగా వెల్లడించని అధికారులు -
మూడు నెలలు నిల్వ..
మత్స్య కళాశాల విద్యార్థులు తయారు చేసే జల పుష్పాల పచ్చళ్లు గరిష్టంగా మూడు నెలలపాటు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 90 రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండేందుకు నిమ్మ రసాన్ని ఉపయోగించడంతోపాటు స్టెరిలైజ్ చేసిన గాజు సీసాలో నింపి లేబుల్ చేస్తారు. నాణ్యమైన నూనె, దినుసులను ఉపయోగిస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఈ చేప, రొయ్యల పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు మత్స్య కళాశాల నుంచి అధికారిక అనుమతులు పొంది పచ్చళ్లు తయారు చేస్తున్నారు. -
అలవి వలల నిషేధాన్ని అమలు చేస్తాం
● ఈ అంశంపై ఏపీ అధికారులతో మాట్లాడతా ● రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొల్లాపూర్: కృష్ణానదిలో అలవి వలలతో వేటను పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తామని, దీనిపై ఏపీకి చెందిన పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడుతామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరితోపాటు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేత నీలం మధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.122 కోట్లు కేటాయించిందని, వాటితో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. మంత్రి జూపల్లి లేఖ పంపిస్తే కొల్లాపూర్లో చేపపిల్లల ఉత్పత్తి యూనిట్, మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కొల్లాపూర్ చేపలను ప్రపంచ స్థాయి మార్కెట్కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ మత్స్యకారుల కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మామిడి, చేపల విక్రయాల కోసం 116 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అడుక్కుంటే పదవులు రావని, గుంజుకోవాలని ముదిరాజ్లకు సూచించారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ పదవులకు పోటీపడాలని, ఇందుకు ఐక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని, ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా కేంద్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం అవసరమైన కృషిచేస్తానన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ముదిరాజ్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేత నీలం మధు మాట్లాడుతూ బీసీ ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించాలని మంత్రులను కోరారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు, ఎల్లేని సుధాకర్రావు, కేతూరి వెంకటేష్, పెబ్బేటి కృష్ణయ్య, మల్లికార్జున్, వెంకటస్వామి, గాలెన్న, హుస్సేనయ్య, హరికృష్ణ, శివవర్మ, చెన్నరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుకుందాం రండి
జిల్లాలో 42 రోజుల పాటు నిర్వహించనున్న బడి బయటి పిల్లల సర్వే సర్వే ప్రారంభం జిల్లాలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు వరకు చేపట్టే బడి బయటి పిల్లల సర్వే ఇప్పటికే ప్రారంభించాం. గత సర్వేలో 333 మంది విద్యార్థులను గుర్తించాం. ఈ వివరాలను ప్రబంద్ యాప్ పోర్టల్లో సర్వే వివరాలు నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించాం. సీఆర్పీలు దగ్గరుండి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. నాలుగు పద్ధతుల ద్వారా బడీడు పిల్లలకు విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ నారాయణపేట నర్వ: బడికి రాని పిల్లలు ఎంతమంది ఉన్నారు? పాఠశాలకు రాకపోవడానికి కారణం ఏమిటి అని లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బడి బయటి పిల్లల గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని తెలంగాణ సమగ్రశిక్ష సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్పీలు తమ పరిధిలోని పాఠశాలలకు వెళ్లి మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలు సేకరిస్తారు. 30 రోజుల పాటు నిరంతరంగా గైర్హాజరైన పిల్లవాడిని డ్రాపౌట్గా పరిగణిస్తారు. విద్యార్థుల వివరాల సేకరణ సర్వే ఈ నెల 20 నుంచి ప్రారంభమై డిసెంబర్ 31న పూర్తవుతుంది. సర్వేపై ఎంఈఓ, స్కూల్కాంప్లెక్స్ హెచ్ఎంలు, పాఠశాల హెచ్ఎంలు, సీఆర్పీలు, ఎంఐసీసీఓలతో సమావేశం నిర్వహిచారు. షెడ్యూల్ ప్రకారం సేకరించిన పిల్లల వివరాలను ఎంఐసీసీఓలు మండలాల వారీగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సర్వే పూర్తి చేసిన తర్వాత వివరాలను జనవరి 2 లోపు ప్రబంద్పోర్టల్లో నమోదు చేయాలి. డిసెంబర్ 12 వరకు డీఈఓలు రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక అందజేయనున్నారు. 2024–25 కు సంబంధించి.. గతేడాది బడి బయటి పిల్లల వివరాలను జనవరిలో సేకరించారు. పలు కారణాలతో విద్యాసంస్థల్లో చేరని బడిఈడు పిల్లల వివరాలను ప్రభంద్ పోర్టల్ యాప్లో నమోదు చేశారు. విద్యాశాఖ 2024–25 ఏడాదికి సంబంధించి జనవరి 4 నుంచి 25 వరకు మరోసారి సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో గతేడాది జనవరిలో గుర్తించిన బాలబాలికల్లో ఎంతమంది విద్యా సంస్థల్లో చేరారు.. మిగితా వారు ఎందుకు చేరలేదు అనే వివరాలను ఈ సర్వేలో నమోదు చేశారు. గత సర్వేలో జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులను గుర్తించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వయస్సు బాలురు బాలికలు మొత్తం 6–14 67 84 151 15–19 40 90 130 26 26 52 మొత్తం 133 200 333 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు.. సీఆర్పీలకు బాధ్యతలు గత సర్వేలో 333 మంది బడిబయటి పిల్లల గుర్తింపు అందుబాటులో లేని యూఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా నారాయణపేట, ములుగు జిల్లాల్లో తప్ప అన్ని జిల్లా కేంద్రాల్లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎస్) అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాల్లో యూఆర్ఎస్ ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ పాఠశాలలకు బడిబయటి పిల్లలను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా యూఆర్ఎస్ పాఠశాలను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
యాంటీ డ్రగ్ సైనికులుగా యువత పనిచేయాలి
నారాయణపేట రూరల్: యువత యాంటీ డ్రగ్ సైనికులుగా పనిచేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ వినీత్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కళాశాల విద్యార్థులకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజమే మన అందరి లక్ష్యంగా పని చేయాలన్నారు. నార్కోటిక్ డ్రగ్ అనేది ఒక టెర్రరిస్ట్ లాంటిదన్నారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందనని, సమస్యను నిర్మూలించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయం, వినియోగం చేస్తూ కనిపించినట్లయితే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా డయల్ 100 కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సునీత, ఆయా సంఘాల ప్రతినిధులు కన్న శివకుమార్, వడ్ల శ్రవణ్, మురళిబట్టడ్, నరేష్, వెంకటరమణ, వెంకటేష్, ఆకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి నివారించాలి నారాయణపేట టౌన్: మహబూబ్నగర్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధాకర్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు చట్టం అమలు మరింత బలోపేతం చేయాలని కోరారు. పోలీస్, ఎకై ్సజ్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. -
చిత్తడి నేలల జాబితా సిద్ధం చేయాలి
నారాయణపేట: జిల్లాలో చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ చిత్తడి నేలల (సంరక్షణ, నిర్వహణ) నియమాలు, సర్వే, సరిహద్దులు, 2017 ప్రకారం తడి భూముల నోటిఫికేషన్పై జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్గా అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 3 నెలల్లోపు జిల్లాలోని అన్ని చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనల ప్రకారం నియంత్రణ, వాటి సంక్షిప్త పత్రాల ఆధారంగా గుర్తించబడిన చిత్తడి నేలలను సిఫార్సు చేయాలన్నారు. ఏడాది లోపు అన్ని చిత్తడి నేలల సమగ్ర డిజిటల్ జాబితా రూపొందించాలని సూచించారు. అలాగే నోటిఫైడ్ చిత్తడి నేలలు వాటి ప్రభావ జోన్లలో నియంత్రించాల్సిన, అనుమతించాల్సిన కార్యకలాపాల సమగ్ర జాబితాను అభివృద్ధి చేయాలని చెప్పారు. నిషేధిత కార్యకలాపాల జాబితాకు ఏవైనా చేర్పులు ఉంటే సిఫార్సు చేయాలన్నారు. నోటిఫై చేయబడిన ప్రతి తడి భూములకు సమగ్ర నిర్వహణ ప్రణాళికను సమీక్షించాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీలో చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్ సభ్యుడిగా జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్లతో కూడిన ఏడుగురు సంబంధిత శాఖల అధికారులు ఉంటారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్రెడ్డి, డీఏఓ జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహ్మాన్, డీపీఓ సుధాకర్రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు. -
ఊగిసలాడుతోంది..!
అచ్చంపేట: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానించే ఐకానిక్ కేబుల్ వంతెన కల ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణానదిపై నిర్మించనున్న 1.07 కి.మీ., మేర వంతెన నిర్మాణ టెండర్ ప్రక్రియను మరోసారి పొడిగించారు. ఈ నెల 27 వరకు బ్రిడ్ వేసేందుకు అవకాశం కల్పించగా.. 28న ఓపెన్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పనులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు వచ్చిన టెండర్ దాఖలులో తగినంత అర్హత లేనందున గతంలో చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాయి. వంతెన నిర్మాణం కోసం 2023 అక్టోబరు 7న టెండర్లు ఆహ్వానించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 34 సార్లు పొడిగిస్తూ వస్తున్నారు. 2024 ఫ్రిబవరిలో నిధుల సర్దుబాటు కారణంగా నిలిపివేశారు. గతంలో పిలిచిన టెండర్ల కొనసాగిస్తూ.. ఈ ఏడాది మార్చి 17వరకు జాతీయ రహదారుల విభాగం కొత్త తేదీని ప్రకటించింది. వివిధ కారణాలతో అప్పటి నుంచి పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నెల 7న టెండర్ ఓపెన్ చేయాల్సి ఉండగా.. 27 వరకు బిట్ దాఖలుకు అవకాశం కల్పించారు. మొత్తంగా వంతె న నిర్మాణం కోసం పిలిచిన టెండర్ ప్రక్రియ వాయిదాలు పడుతూ వస్తుండగా.. ఈసారైనా మోక్షం లభిస్తుందా.. లేదా అనేది వేచి చూడాల్సిందే. మూడేళ్లుగా ఎదురుచూపు.. సోమశిల (మల్లేశ్వరం)– సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై ప్రతిపాదిత 800 మీటర్ల రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మూడేళ్లగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టాల్సి ఉండగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా వ్యయం చేయాల్సి రావడంతో నీతి ఆయోగ్ అప్పట్లో అభ్యంతరం తెలిపింది. దీంతో కొంత జాప్యం జరగడంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగింది. ఫలితంగా భారత్మాల ప్రయోజన జాబితాలో ఉండి అనుమతి లభించని ప్రాజెక్టులను కేంద్రం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టు కూడా అందులోనే ఉండటంతో ఆలస్యమైంది. దీనిని ఇప్పుడు నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్హెచ్– ఓ) జాబితాలోకి మార్చడంతో వంతెన మళ్లీ తెరపైకి వచ్చింది. తీగల వంతెన నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు మంజూరు కాగా.. 2023 అక్టోబరు 7న జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టాండింగ్ పైనాన్స్ కమిటీ(ఎస్ఎఫ్సీ) ఆమోదం తెలిపింది. అదే నెలలో మల్లేశ్వరం– సిద్దేశ్వరం కేబుల్ వంతెన నమూనాను నేషనల్ హైవే అథారిటీ రూపొందించి టెండర్లకు ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయంగా అనుభవనం ఉన్న సంస్థల నుంచి బ్రిడ్స్ రాకపోవడంతో టెండర్ గడువు పొడిగిస్తూ వస్తున్నారు. అప్రోచ్ రోడ్డు, వంతెన నిర్మించే ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండటంతో అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో రహదారి, బ్రిడ్జి కోసం సేకరించే అటవీ భూమిని ఆ శాఖ అధికారులు పరిశీలించారు. రహదారి నిర్మాణం కోసం అటవీ భూమి సేకరించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. భూమికి భూమి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కావడంతో దాదాపు క్లియర్స్ వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే జనవరిలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మల్లేశ్వరం– సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న తీగల వంతెన నమూనా భూ సేకరణ పూర్తయితే.. కొల్లాపూర్– సోమశిల రహదారి వరిదేల శివారు నుంచి రహదారి పనులు మొదలు కావాల్సి ఉంది. మూడో ప్యాకేజీలో ఐకానిక్ వంతెన ఇవతల 8 కి.మీ., ఏపీ పరిధిలో సిద్దేశ్వరం గుట్టల మధ్య 5.4 కి.మీ., అప్రోచ్ రహదారి నిర్మించాలి. వంతెన నిర్మించే ప్రాంతం వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో అటవీ శాఖకు చెందిన భూమితోపాటు రెవెన్యూ, రైతుల పట్టా భూమలు ఉన్నాయి. ఇప్పటి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే టెండర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. – రాజేందర్, ఈఈ జాతీయ రహదారుల శాఖ మల్లేశ్వరం– సిద్దేశరంవంతెనకు లభించని మోక్షం ఏళ్ల తరబడిగా వాయిదాలు పడతున్న టెండర్ ప్రక్రియ సరైన అర్హత లేనందునే గతంలో చాలాసార్లు తిరస్కరణ తాజాగా ఈ నెల 27 వరకు గడువు పొడిగింపు, 28న ఓపెన్ మూడో ప్యాకేజీ పనుల మొదలుకు అడ్డంకిగా భూ సేకరణ? -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
మాగనూర్: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని హౌసింగ్ పీడీ శంకర్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని వడ్వాట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి, మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా బేస్మెంట్ లెవల్ పనులు పూర్తయిన వెంటనే తొలి విడత బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్, హౌసింగ్ ఏఈ అంజనేయులు, మాజీ సర్పంచ్ రవీందర్, రాఘవరెడ్డి, బుక్క రాములు, కళ్యాణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ‘విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు’ నారాయణపేట: రూరల్: విద్యారంగ సమస్యల సాధనకు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పీడీఎస్యూ మూడో జిల్లా మహాసభలను విజయవంతం చేద్దామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినా విద్యారంగంలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదని, మధ్యాహ్న భోజనంలోనూ నాణ్యత లోపించిందని విమర్శించారు. విద్యా రంగానికి సరైన బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ పెండింగ్లో ఉంచడం సరికాదన్నారు. రెండు రోజుల పాటు సభలు.. విద్యారంగ సమస్యలను సమీక్షించేందుకు ఈ నెల 22, 23 తేదీల్లో మహాసభలను ఏర్పాటు చేస్తున్నామని సాయికుమార్ అన్నారు. ముఖ్య అతిథులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, పీవైఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హన్మేష్, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీ, అనిల్, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నగేష్ పాల్గొంటారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు అజయ్, గౌస్, వెంకటేష్, మహేష్, రాజు, సురేష్ పాల్గొన్నారు. నేటినుంచి డిగ్రీ పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 34,066 మంది విద్యార్థులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు శనివారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెమిస్టర్ 1, 3, 5కు సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. సెమిస్టర్–1లో 18,966 మంది, సెమిస్టర్–5లో 8,100, సెమిస్టర్–3లో 7000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్కు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టిండ్ స్క్వాడ్తో పాటు ఫ్లయింగ్స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరిస్తాం స్టేషన్ మహబూబ్నగర్: డయల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎంకు వచ్చిన సలహాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రీజినల్ పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఆర్ఎం సలహాలు, ఫిర్యాదులను స్వీకరించారు. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ రూట్లో శంకరాయపల్లి వద్ద బస్సులు, మహబూబ్నగర్లోని భగీరథకాలనీ వద్ద బస్సులు ఆపాలని ప్రయాణికులు ఫోన్లో కోరారు. ఉదయం సమయంలో కోస్గి నుంచి మహబూబ్నగర్ మీదుగా లింగచేడ్, కొమ్ము రు, కోయిలకొండకు బస్సులు నడపాలని, గద్వాల బస్సును అల్లపాడు నుంచి మానవపా డు ఎక్స్రోడ్ వరకు పొడిగించాలని కోరారు. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం వరకు నేరుగా బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి చేశారు. -
భక్తి పారవశ్యంతో ఉన్నప్పుడే విముక్తి
● అంతర్జాతీయ యోగా శిక్షణ నిపుణులు ఆధ్మాత్మిక ధర్మ ప్రచారకులు రహెత్తమాచార్య ● ఉమామహేశ్వర ఆలయంలో దీపోత్సవం మక్తల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో ఉన్నప్పుడే విముక్తి ఉంటుందని అంతర్జాతీయ యోగా శిక్షణ నిపుణుడు ఆధ్మాత్మిక ధర్మ ప్రచారకులు రహెత్తమాచార్య అన్నారు. గురువారం పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో ముక్కంటి దీపోత్సవం 33,333 కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉమామహేశ్వర ఆలయం నుంచి అజాద్నగర్ చౌరస్తా వరకు దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రహెత్తమాచార్యులు మాట్లాడుతూ ప్రతి మనిషి తనలో జ్ఞాన దీపాలను వెలిగించాలని, కార్తీక మాసంలో సాన దీపారాధన, ఉపవాస వనభోజనాలకు ప్రసిద్ధి అని అన్నారు. పరమశివుడికి ప్రీతిపాత్రమైన జ్యోతిని వెలగించడం ద్వారా సకల పుణ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, అర్బన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, అంజనేయులు, సూర్యఅంజి తదితరులు పాల్గొన్నారు. ఆలయాల్లో.. పట్టణంలోని మల్లికార్జునస్వామి ఆలయం, పడమటి ఆంజనేయస్వామి ఆలయం, ఉమామహేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, షిర్డిసాయి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. -
రైస్మిల్లు వేబ్రిడ్జిలో అవకతవకలపై తనిఖీ
మాగనూర్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మిల్లు వద్ద బాట్లు (తూనికపు రాళ్లు), ఒక టన్ను టెస్ట్ వెయిట్లు అందుబాటులో ఉంచుకోవాలని, స్టాంపింగ్ లేకుండా వేబ్రిడ్జి వినియోగించరాదని తూనికల కొలతల శాఖ అధికారి రవీందర్, సివిల్ సప్లై డీఎస్ఓ బాల్రాజు ఆదేశించారు. మండలంలోని వర్కూర్ సమీపంలో గల ఎంఎస్ఆర్ రైస్ మిల్లును వారు గురువారం పరిశీలించారు. సదరు రైస్ మిల్లులోని వేబ్రిడ్జిలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ గతంలో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో బుధవారం స్థానిక ఇన్చార్జి తహసీల్దార్ సురేష్కుమార్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులో జరుగుతున్న అవకతవకలకు కారణాలు తెలుసుకోవడానికి మిల్లుకు ధాన్యం సప్లై నిలిపివేశారు. ఇందులో భాగంగా జిల్లా తూనికల శాఖ అధికారులతో పాటు సివిల్ సప్లై అధికారులు మిల్లును పరిశీలించారు. అయితే సదరు అధికారులు వచ్చినా మిల్లు యాజమాని అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉండాల్సిన బాట్లు (తూకపు రాళ్లు), ఒక టన్ను టెస్ట్ వెయిట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 4న తనిఖీలకు వచ్చి కేసు నమోదు చేసిన సమయంలోనే అధికారులు తప్పకుండా బాట్లు, ఒక టన్ను టెస్ట్ వెయిట్లు ఉంచుకోవాలని చెప్పిన ఇంకా నిర్లక్ష్యంగా ఉండటంపై అధికారులు యజమాని తీరుపై మండిపడ్డారు. చివరికి గత్యంతరం లేక వారే తెచ్చుకున్న కారుతో వేబ్రిడ్జి టెస్టింగ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తూనికల కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ.. మిల్లుల యాజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లులో జరుగుతున్న అవకతవకలను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రజలకు అండగా ఉంటా: మంత్రి వాకిటి
మక్తల్: నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలోనే కాకుండా జీవనోపాధికి ఎక్కడికి వెళ్లిన వారి ఇబ్బందులు తీర్చేందుకు అండగా ఉంటానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన, పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నుంచి వెళ్లి హైదరాబాద్లో టూవీలర్పై పండ్లు, ఇతర వ్యాపారం చేసుకుంటున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురువారం రాత్రి మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి చిరు వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భవిష్యత్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని, ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. -
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
పాలమూరు: ఇటీవల కాలంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే.. అంతకంటే ఎక్కువగా ఫ్యాన్సీ, లక్కీ నంబర్ తీసుకోవడానికి ఎంతైన ఖర్చు చేసే సంప్రదాయం బాగా పెరిగింది. చాలా వరకు కార్లకు, బైక్లకు ఫ్యాన్సీ నంబర్ పెట్టుకోవడం హోదాగా భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రత్యేక నంబర్లకు అధిక ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఏడాది జనవరి నుంచి నవంబర్ 19వరకు జిల్లాలో 5,516 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ లక్కీ నంబర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఇందులో అధికంగా 9999తో పాటు 9, 7777, 7 సిరీస్, 01తో పాటు 7, 6, 5 వంటి సిరీస్ నంబర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రవాణా శాఖలో నూతన వాహనాల నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ముందే రిజర్వేషన్ చేసుకునే ముఖ్యమైన నంబర్ల ఫీజు పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ ఆర్టీఏ కార్యాలయంలో 9999 నంబర్ రిజర్వేషన్ చేసుకోవాలంటే సదరు వాహనదారుడు ముందుకు రూ.1.50 లక్షలు డీడీ చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వాహనదారుడు పోటీ వచ్చి వేలం పాట నిర్వహిస్తే మళ్లీ ఫీజు ధర పెరుగుతుంది. అదేవిధంగా 1, 9, 6666 నంబర్లకు ఫీజు రూ.లక్ష ఫీజు కేటాయించగా 99, 999, 3333, 4444, 5555, 7777 నంబర్లకు ఫీజు రూ.50వేలుగా నిర్ణయించారు. దీంతోపాటు 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111 నంబర్లకు రూ.40వేలుగా ఫీజు కేటాయించారు. ఇకపై జాబితాలో లేని నంబర్లకు కారు నంబర్కు అయితే రూ.6వేలు, ద్విచక్ర వాహనం అయితే రూ.3వేల ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఆరోజు అందుబాటులో ఉండి రిజర్వ్ కాని నంబర్లకు రూ.2వేల ఫీజు చెల్లించి నంబర్ తీసుకోవచ్చు. పెరిగిన నంబర్ల ఫీజు వల్ల ఆర్టీఏ శాఖకు ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఆసక్తి చూపుతున్న వాహనదారులు ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో 5,516 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి రూ.3.30 కోట్ల ఆదాయం పాలమూరు ఆర్టీఏ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ రిజిస్ట్రేషన్లో వాహనదారుడు టీజీ 06బీ 0009 నంబర్ కోసం వేలం పాటలో రూ.7.75 లక్షలు పలికి నంబర్ సొంతం చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే ఫ్యాన్సీ నంబర్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. మరో వాహనదారుడు టీజీ06బీ0999 నంబర్ కోసం వేలం పాట ద్వారా రూ.1,05,500 ఖర్చు చేసి సొంతం చేసుకున్నాడు. టీజీ 06బీ5555 నంబర్ను రూ.1.34 లక్షలకు దక్కించుకున్నాడు. ఫ్యాన్సీ, లక్కీ నంబర్లతో పాటు తాత్కాలిక రిజర్వేషన్ పద్ధతిలో జరిగే రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ఫీజుల ధరల వల్ల రెవెన్యూ ఎలా ఉంటుంది అనే విషయం ప్రస్తుత సిరీస్ పూర్తి అయితే తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్ తప్పక ఏర్పాటు చేసుకోవాలనే వారు కొంత మేర పెరుగుతున్నారు. – కిషన్, డీటీసీ -
ఆస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష
నారాయణపేట టౌన్: జిల్లాలోని ‘వాటర్ బడ్జెటింగ్ ఇన్ ఆస్పిరేషన్ బ్లాక్స్’ పరిధిలోని నర్వ మండలంలో వివిధ విభాగాల ప్రగతిపై గురువారం నీతి అయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నీతి అయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్కు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి అయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్కుమార్ హాజరుకాగా, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా 47వ కార్యదర్శుల సాధికరత సమావేశం నర్వ బ్లాక్ ఇన్నోవేషన్ కేటగిరి ప్రాజెక్ట్ ప్రతిపాదనల గురించి వీసీలో చర్చించారు. నర్వ బ్లాక్లో ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, ఉద్యానవన, పశువైద్య విభాగాల్లో 12 ప్రతిపాదనలు సమర్పించగా.. విద్యారంగం నుంచి స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ అండ్ నాలెడ్జ్, శ్రీ పునరుత్పాదక మరియు పర్యావరణ అనుకూల ఆహారం కోసం సోలార్ (నర్వ కేజీబీవీ లో సౌర శక్తితో పని చేసే వంట గది) కోసం మొత్తం 1.2 కోట్లు మంజూరు చేశారు. అనంతరం కలెక్టర్ శిక్తా పట్నాయక్ ప్రాజెక్ట్ పూర్తి వివరాలను వెల్లడించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్, డీఈఓ గో విందరాజులు, సమన్వయకర్త బాలాజీ ఉన్నారు. -
‘ఉపాధి’కి సరికొత్త సంస్కరణలు
నర్వ: కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇప్పటికే ఉపాధి పనులకు జియోఫెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా ‘యుక్తధార పోర్టల్’ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా గతేడాది మండలానికి ఓ గ్రామం చొప్పున జిల్లావ్యాప్తంగా 13 గ్రామాలను ఎంపిక చేసి పనుల ప్రతిపాదనలను తయారు చేశారు. తాజాగా మిగిలిన గ్రామాలను ఈ పోర్టల్లోకి తీసుకొచ్చారు. పక్కగా నమోదు గతంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసే వారు. తాజాగా వచ్చిన యుక్తధార పోర్టల్లో జియో స్పెషియల్ ప్లానింగ్ పోర్టల్ ద్వారా పనులు చేపట్టనున్నారు. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) భువన్ పోర్టల్ ఆధారంగా అధికారులు యాప్లో పనులు గుర్తించాల్సి ఉంటుంది. గ్రామాల్లో పనులు చేపట్టే ప్రాంతాలను యాప్లో ఆన్లైన్ ద్వారా లైవ్లో నమోదు చేస్తారు. ఇది వరకు ఈ ప్రాంతాల్లో పనులు చేపట్టారా.. పనులు చేపట్టడానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉందా అనే వివరాలు నిర్ధారించడంతో పాటు ఫొటోలను ప్రత్యక్షంగా చూపిస్తుంది. దీంతో పనులు చేపట్టే ప్రాంతాలను సులభంగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్లు జిల్లాలో ఎలాంటి పనులు చేపట్టాలో గుర్తించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ప్రతి గ్రామానికి ఓ లాగిన్ ఐడీని క్రియేట్ చేశారు. దాని ఆధారంగా పోర్టల్లో పనులు చేపట్టే ప్రాంతాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియలో గ్రామ సభల ద్వారా పనులు గుర్తించారు. యుక్తధార పోర్టల్ ద్వారా అమలు గతేడాది పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మండలానికి ఒక్కో గ్రామం ఎంపిక మిగిలిన గ్రామాల వివరాల నమోదుకు శ్రీకారం -
ఆరోగ్య బీమా జీవితానికి ధీమా
నారాయణపేట: ఆరోగ్య, ప్రమాద బీమా ప్రతి ఒక్కరికి ధీమానిస్తుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్హక్ అన్నారు. ఎస్పీ డా. వినీత్ సూచన మేరకు బుధవారం హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్లకు ఆరోగ్య, ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో బీమా అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమన్నారు. ఏదైనా అనుకోని ఘటనలు జరిగినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఇలాంటి బీమాలు దోహదపడుతాయన్ని తెలిపారు. అలాగే ఆర్థిక భద్రతపై దృష్టి సారించాలని, యాప్లలో రుణాలు తీసుకొని ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ బీమా ఎంచుకోవడంతో కుటుంబ సభ్యులకు ధీమా కలిగి ఉంటుందని తెలిపారు. సంబంధిత బ్యాంకు అధికారులు మాట్లాడుతూ.. బ్యాంకులో ఖాతా ఉన్న సిబ్బంది ఏటా రూ.11,650 ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలోని నలుగురికి రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే బ్యాంకులో వేతన అకౌంట్ కలిగి ఉండి ప్రతినెల డెబిట్ కార్డు వినియోగిస్తే ప్రమాదవశాత్తు మృతిచెందితే బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ప్రమాద బీమా అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జ్, ఆర్ఎస్ఐ మద్దయ్య, ఆర్ఎస్ఐలు శ్వేత, శిరీష, పాల్గొన్నారు. -
వయోవృద్ధులకుతోడ్పాటునందించాలి
నారాయణపేట: వయోవృద్ధులు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు తోడ్పాటు అందించాలని ఆర్డీఓ రామచంద్రనాయక్ కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు వృద్ధాప్యంలో తమకు ఏదో చేస్తారని ఆశించరని.. పిల్లలు గొప్పగా ఉండాలని, కీర్తి ప్రతిష్టలతో జీవించాలని కోరుకుంటారని తెలిపారు. కానీ ఈ మధ్యకాలంలో పత్రికల్లో డబ్బు కోసం తల్లిని చంపిన తనయుడు, ఆస్తి కోసం తండ్రిని కడతేర్చిన తనయుడు అనే వార్తలు వస్తుండటం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధులకు కొన్ని హక్కులు ఉన్నాయని.. వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పిల్లలకు ఇచ్చిన ఆస్తిని వయోవృద్ధులు తిరిగి పొందే అధికారం సిటిజన్ యాక్ట్లో ఉందని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ ఫణికుమార్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు తమశక్తి మేరకు వ్యాయామం, నడక చేయాలని, జిల్లాకేంద్రంలో వారికోసం ప్రత్యేకంగా పార్కు కూడా ఉందని గుర్తుచేశారు. ఎలాంటి సమస్య ఉన్నా.. టోల్ఫ్రీ నంబర్ 14567 ఫోన్చేసి చెప్పాలని సూచించారు. సీనియర్ సిటిజన్ ఆత్మారాం ఏడికే, సుదర్శన్రెడ్డి సీనియర్ సిటిజన్ యాక్ట్ గుర్తించి వివరించారు. జిల్లాకేంద్రంలో వయోవృద్ధుల సంక్షేమ భవనాన్ని నిర్మించాలని ఆర్డీఓను కోరారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శైలజ, డీపీఆర్వో రషీద్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. మల్లికార్జున్, డీడబ్ల్యూఓ ఉద్యోగి సాయి, డీసీపీఓ కరిష్మా, నర్సిములు, భారతి పాల్గొన్నారు. 23న ఉమ్మడి జిల్లావాలీబాల్ జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాజన్న సిరిసిల్లలోఈనెల 29 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అంతర్జిల్లా వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలను 23వ తేదీన ఉదయం 8.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనేవారు కోచ్ పర్వేజ్పాషా–బాలురు (77805 82604), జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య–బాలికలు (94403 11067) సంప్రదించాలన్నారు. రేపు సీనియర్ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: ఆదిలాబాద్లో ఈనెల 28 నుంచి 30 వరకు జరగనున్న సీనియర్ పురుషుల రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికను ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు జి.రాఘవేందర్, బి.నాగరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు ఆధార్కార్డు, ఇతర సర్టిఫికెట్లతో స్టేడియంలో రిపోర్టు చేయాలని కోరారు. వివరాల కోసం 99590 16610, 99592 20075 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
బాల్య వివాహాల నిర్మూలన సమష్టి బాధ్యత
నారాయణపేట: సమష్టి కృషితోనే బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహిళ, శిశు సంక్షేమ, బాలల సంరక్షణ విభాగం రూపొందించిన లోగోను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ఆర్డీఓ రాంచందర్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, డీపీఆర్వో రషీద్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, కోస్గి తహసీల్దార్ బక్క శ్రీనివాస్, జిల్లా బాలల సంరక్షణ అధికారి కరిష్మా తదితరులు పాల్గొన్నారు. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు.. జిల్లాలోని బాలల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై స్ఫూర్తిదాయక అభిప్రాయంతో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి బాలలే భావిభారత పౌరులని.. బాలల హక్కుల సంరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పలువురు జిల్లా అధికారులు, చైల్డ్ హెల్ప్లైన్ సమన్వయకర్త నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది, సఖి సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పకడ్బందీగా చీరల పంపిణీ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరా మహిళశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణ రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుందతి, అన్ని మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎర వేసి.. మోసం చేసి
ఆయుర్వేద ఉత్పత్తులు.. రియల్ ఎస్టేట్ ఉచిత క్యాంప్లతో విస్తృత ప్రచారం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా మేకలవారిగూడేనికి చెందిన ఓ డాక్టర్ హైదరాబాద్లోని వనస్థలిపురం కేంద్రంగా తన కూతురి పేరుతో ఆయుర్వేద నిలయం ఏర్పాటు చేశాడు. మహబూబ్నగర్ జిల్లా జానంపేటకు చెందిన ఓ వ్యక్తి, మరో 8 మందితో కలిసి తొర్రూరులో ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ పరిశ్రమ, తన కూతురి పేరుతో మార్ట్ను నెలకొల్పాడు. కేన్సర్, హెచ్ఐవీ, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, బీపీ తదితర వ్యాధులను సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేస్తామని వనస్థలిపురంతోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత క్యాంప్లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేశాడు. నెట్వర్క్ బిజినెస్ ఆధారంగా తమ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాడు. ఆయుర్వేద వైద్యం పేరిట కుచ్చుటోపీ -
రూ.60 లక్షలు రావాలి..
కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణంలో 3 ఎకరాల భూమి కోల్పోతున్నా. ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తామంటూ ప్రభుత్వ యంత్రాంగం ఒప్పంద పత్రాలు తీసుకొని రెండు నెలలు కావస్తోంది. ఇంతవరకు పరిహారం చెల్లించలేదు.. ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి.. డబ్బులు వచ్చేసరికి దొరకని పరిస్థితి ఉంది. – పల్లెర్ల అశోక్గౌడ్, భూ నిర్వాసితుడు, కానుకుర్తి (దామరగిద్ద) పరిహారం చెల్లించాలి.. ముంపునకు గురవుతున్న మా భూములకు ఎకరాకు రూ.20 లక్షలు నష్టపరిహారం ఇస్తామని అధికారులు హడావుడిగా ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. చెల్లింపులపై ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలి. – మాల నర్సిములు, భూ నిర్వాసితుడు, కాట్రేవుపల్లి (మక్తల్) త్వరలోనే తీపికబురు.. పేట–కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో రైతులు స్వచ్ఛందంగా ఒప్పంద పత్రాలు రాసిచ్చారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలోనే భూ నిర్వాసితులకు తీపికబురు అందనుంది. – రాంచందర్నాయక్, ఆర్డీఓ, నారాయణపేట ● -
ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదు..
ఆయుర్వేద నిలయంలో రూ.లక్ష పెడితే ఓ ఐడీ కార్డు ఇచ్చేవారు. ఇలా ఆ డాక్టర్ తన బినామీలకూ ఇచ్చాడు. భారీగా దండుకున్న తర్వాత తన బినామీతోనే వనస్థలిపురం పీఎస్లో ఫిర్యాదు చేయించుకున్నాడు. కేసు పెట్టించుకుని చర్లపల్లి జైలుకెళ్లాడు. ఆ తర్వాత బెయిల్పై విడుదలై కనిపించకుండా పోయాడు. మేము ఎక్కడికెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు. మా గోసను అర్థం చేసుకుని.. న్యాయం చేయాలి. – బొల్లెద్దుల నాగరాజు, గోపాల్పేట, వనపర్తి -
చరిత్ర తిరగరాసే కుట్రలు చేస్తున్న మోదీ
● నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలు ఎవరూ చేయలే.. ● టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అచ్చంపేట: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తూ.. చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. బుధవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. ప్రపంచంలో ఉక్కు మనిషి అనే పేరు కొందరికే ఉంటుందని.. వారిలో దివంగత ఇందిరాగాంధీ ఒకరు అని అన్నారు. పాకిస్థాన్పై యుద్ధంచేసి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని కొనియాడారు. బీజేపీ శాఽశ్వత అధికారం కోసం ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు కుల, మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేయాలని చూస్తోందన్నారు. నెహ్రూ కుటుంబం తమ ఆస్తులు, పదవులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని.. అలాంటి నాయకత్వం ఏ పార్టీలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఆలోచనలు, సూచనల మేరకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి చూపిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 50వేల ఉద్యోగాలు ఇస్తే.. అనతి కాలంలోనే 70వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కిందన్నారు. రానున్న మూడేళ్లలో మరో 1.30 లక్షల ఉద్యోగాలను అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కోస్గి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. బుధవారం మండలంలోని చెన్నారం గ్రామంలో బంగినపల్లి ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలంటే కనీస ప్రమాణాలు పాటించాలన్నారు. తేమశాతం 17 శాతం ఉండేలా చూసుకొని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు సైతం రైతులకు నష్టం కలగకుండా నిబంధనల మేరకు ధాన్యం తీసుకోవాలని సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఓ రామకృష్ణ, ఏఈఓలు, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
మాకు న్యాయం జరిగేలా చూడాలి..
తన బిడ్డ పేరుతో కంపెనీ మొదలు పెట్టానని.. ఎలాంటి మోసానికి అవకాశం లేదని ఆయుర్వేద నిలయం యజమాని తెలిపాడు. ఆయుర్వేద ఉత్పత్తులకు కావాల్సి మెటీరియల్ను చెంచులు తక్కువ ధరతో ఇస్తారని.. పెట్టుబడి రూ.3 వేలు అయితే తమకు రూ.30 వేలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో ఇంట్లో ఆడవాళ్ల మీద ఉన్న బంగారు పుస్తెల తాడు, నెక్లెస్ అన్నీ బ్యాంక్లో కుదవ పెట్టి, ప్లాటు అమ్మి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయా. నాతో పాటు పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మాకు అన్యాయం జరగకుండా చూడాలి. – జానంపేట ఆంజనేయులు, చిన్నగుమ్మడం, పెబ్బేరు, వనపర్తి -
మోడల్ సీహెచ్సీలుగా తీర్చిదిద్దుదాం
కోస్గి రూరల్/మద్దూరు: కోస్గి, మద్దూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మంగళవారం కోస్గి, మద్దూరు సీహెచ్సీల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. కోస్గి ఆస్పత్రిలో చేపట్టిన పోస్టుమార్టం గది, ప్రహరీ, వేయిటింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆస్పత్రిలో ఇంకా అవపరమైన సౌకర్యాల కోసం నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్ అనుదీప్కు సూచించారు. మద్దూరు ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వచ్చే వారంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రానున్న నేపథ్యంలో ఆస్పత్రిలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించాలని సూపరింటెండెంట్ మల్లికార్జున్, డా.పావనిలను ఆదేశించారు. ము ఖ్యంగా ఆస్పత్రి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని పుర కమిషనర్ శ్రీకాంత్కు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ జ్ఞానేశ్వర్ ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
గోపాల్పేట: ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ఏదుల గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు డీడీలు కట్టాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ త్వరగా ఇవ్వాలని కోరగా విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్రెడ్డి రూ.50 వేలు డిమాండ్ చయగా.. రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా రూ.20 వేలు ఇవ్వాలని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన తర్వాత మిగతా రూ.20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు మంగళవారం విద్యుత్ సబ్స్టేషన్లో రైతు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈని అదుపులోకి తీసుకున్నామని, బుధవారం నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఇద్దరు సీఐలు, పది మంది సిబ్బంది పాల్గొన్నారు. కాగా..ఏఈ హర్షవర్ధన్రెడ్డి స్వగ్రామం అమరచింత మండలం కొంకన్వానిపల్లిలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విలువైన డ్యాకుమెంట్లతో పాటు నగదును సేకరించినట్లు అధికారులు తెలిపారు. ● ట్రాన్స్ఫార్మర్ మంజూరుకురూ.50 వేలు డిమాండ్ ● రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
ఇక పంచాయితీనే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా సం‘గ్రామానికి’ అడుగులు పడ్డాయి. డిసెంబర్లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీంతో జనరల్/అన్ రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువ శాతం మేర బీసీలు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చట్టపరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. పార్టీ పరంగా అయితే పలు గ్రామాలకు సంబంధించి చిక్కులు, చికాకులు తప్పవని సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘హస్తం’ దారిలోనే ప్రతిపక్షాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్లో జీఓ 9 జారీ చేసింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమయంలో బీసీ రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకిస్తలేరని, తామూ సిద్ధమని.. అయితే చట్టబద్ధత అవసరమని ప్రధాన ప్రతిపక్షాల నేతలు చెప్పారు. ప్రస్తుతం జీపీ ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం అదే దారిలో నడిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎవరికి వారు తమదైన వాదంతో.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ వాదమే అందరి ఎజెండాగా నిలిచే అవకాశం ఉంది. ఆటంకాలు ఎదురైనా తాము ఇచ్చిన హామీ మేరకు పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్నామని.. చట్టబద్ధతపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను స్థానికంగా వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రణాళికతో ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇదేక్రమంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోవడం.. అమలు కాని కాంగ్రెస్ ఎన్నికల హామీలు.. వివిధ పథకాల అమలులో జాప్యం, లోపాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల కదనరంగంలోకి దూకనున్నట్లు తెలుస్తోంది. పాత రిజర్వేషన్లతోనే సం‘గ్రామం’ మంత్రివర్గం నిర్ణయంతో ఆశావహుల పోరు సన్నాహాలు బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్తో ‘హస్తం’ ముందుకు.. అదే బాటలోనే కారు, కమలం నడిచే అవకాశం ఈ లెక్కన జనరల్ స్థానాల్లో ఎక్కువ శాతం బీసీలకే చాన్స్ చట్టపరంగా కాకపోవడంతో చిక్కులు తప్పవని నేతల బెంబేలు -
క్రీడలతో పోటీతత్వం
నారాయణపేట రూరల్: క్రీడలతో విద్యార్థుల మధ్య పోటీతత్వం పెరగడంతో పాటు స్నేహభావం అలవడుతుందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–17 విభాగలో ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా.. మైదానంలో క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పీడీలు అనంతసేన, కథలప్ప, సాయినాథ్, రవికుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
బీసీ సర్పంచ్ స్థానాలు 704..
● కాంగ్రెస్ శ్రేణులతోపాటు వెనుకబడిన వర్గాల్లో జోష్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం.. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేయడంతో రాజకీయ పరంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాలపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 1,678 గ్రామపంచాయతీలు ఉండగా.. 15,068 వార్డులు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. 704 జీపీల్లో ఆ వర్గానికి చెందిన వారికి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికి వారు లెక్కలు వేస్తూ ఊహాగానాల్లో మునిగిపోయారు. మరోవైపు వచ్చే నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్, మూడో వారం చివర లేదంటే నాలుగో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. పలువురు ఆశావహులు పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల వారీగా ముఖ్య నేతల వద్దకు క్యూ కడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో సందడి నెలకొంది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్రపరిచింది. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లతో పాటు ఓటరు జాబితాలను ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించగా.. మళ్లీ అన్నీ సిద్ధం చేస్తున్నారు. -
సివిల్ కోర్టునుఅందుబాటులోకి తేవాలి
మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో సివిల్ కోర్టును అందుబాటులోకి తేవాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం మక్తల్కు చెందిన న్యాయవాదుల బృందం రాష్ట్ర సచివాలయంలో మంత్రితో పాటు న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డిని కలిసి సివిల్ కోర్టును ప్రారంభించాలని విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే కోర్టు భవనాన్ని పునరుద్ధరించడం జరిగిందని, ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా హైకోర్టు పోర్ట్ ఫోలియో జడ్జి అనిల్కుమార్ను నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, న్యాయవాదులు నాగురావు నామాజీ, నందు నామాజీ, చెన్నారెడ్డి తదితరులు కలిసి మక్తల్లో సివిల్ కోర్టు భవనాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రే య, ఆనంద్, ప్రకాశ్, సురేందర్, రామ్మోహన్, సూర్యనారాయణ, మోహన్యాదవ్ తదిత రులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు మక్తల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. మంగళవారం మక్తల్ మండలం గుడిగండ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలుచేసి.. మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఏఈఓ కిరణ్మయి, జయమ్మ, లలితమ్మ, జనార్దన్, శంకర్ ఉన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు పాటుపడాలి
నారాయణపేట: ప్రతి పౌరుడు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్గా పనిచేయాలని ఎస్పీ డా.వినీత్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోలీసు అధికారులు, సిబ్బందితో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసగా మారితే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా డయల్ 100 లేదా టోల్ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని.. సదరు వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి పోలీసు, యువత సైబర్ వారియర్గా పనిచేస్తున్నారని, ఇక నుంచి యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, సురేశ్, పురుషోత్తం, సునీత తదితరులు పాల్గొన్నారు. పొగమంచుతో జాగ్రత్త.. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు వీలైనంత వరకు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయొద్దని.. అత్యవసరమై తే నెమ్మదిగా, సురక్షితంగా వాహనాలను నడిపి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ ఒక ప్రకటన లో తెలిపారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించే సామర్ధ్యం తక్కువుగా ఉంటుందన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనా ల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవడంతో పా టు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నా యో లేదో సరిచూసుకోవాలని సూచించారు. -
తెల్లబోతున్నారు..!
సీసీఐ కొర్రీలు.. కొనుగోళ్ల బంద్తో చిక్కులు నిలిచిన కొనుగోళ్లు..పలు చోట్ల ఆందోళనలు జిన్నింగ్ వ్యాపారుల బంద్తో సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలు భారీగా క్యూ కడుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ● నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గేట్ వద్ద ఎన్హెచ్–167పై రైతులు ధర్నాకు దిగారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితోపాటు పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు. ● జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రం వద్ద రైతులు మధ్యాహ్యం సమయంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయుడు సాయంత్రం సెంటర్ వద్దకు చేరుకుని అధికారులతో కలిసి కొనుగోలు చేసేలా మిల్లు యజమానిని ఒప్పించారు. దీంతో రాత్రి వరకు ఆన్లైన్ ప్రక్రియ కొనసాగగా.. రైతులు అర్ధరాత్రి వరకు పడిగాపులు కాశారు. ‘ప్రైవేట్’లో నిలువు దోపిడీ.. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో కొర్రీల నేపథ్యంలో రైతులు విధిలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు ధర భారీగా తగ్గించారు. సీసీఐ సెంటర్లలో ప్రభుత్వం క్వింటాల్కు రూ.8,110 మద్దతుతో కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.5,500 నుంచి రూ.7 వేల వరకు మాత్రమే పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కొర్రీల మీద కొర్రీలు.. ఈ ఏడాది వానాకాలం పత్తి కొనుగోళ్లలో తొలి నుంచీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సీజన్లోనే అందుబాటులోకి తెచ్చిన కపాస్ యాప్ కష్టాలను తెచ్చింది. యాప్ లో రైతులు, పంట నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లకు అవకాశం ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డా రు. ఆ తర్వాత ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేసేలా కొత్త నిబంధన పెట్టి.. యాప్లో మార్పు చేయడం తంటాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల, మహబూబ్నగర్ రూరల్ మండలంలోని అప్పాయిపల్లి.. నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మరోవైపు తేమ ఎనిమిది నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే కొర్రీ వెంటాడుతోంది. దీంతో రైతులు పత్తిని ఆరబెడుతూ కొనుగోళ్లకు పడిగాపులు కాయక తప్పడం లేదు. -
ఉత్సాహంగా సదర్ ఉత్సవాలు
కోస్గి పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ముందుగా వేణుగోపాలస్వామి ఆలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు దున్నపోతులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిరంపల్లి శ్రీనివాస్, నాయకులు వెంకటేశ్, నర్సింహులు, హన్మంతు, భాస్కర్, రమేశ్ పాల్గొన్నారు. – కోస్గి రూరల్ -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 22 అర్జీలు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు. ● సీనియర్ సిటిజన్ యాక్ట్పై క్షేత్రస్థాయిలో సంపూర్ణ అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో అధికారులకు సీనియర్ సిటిజన్ యాక్ట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్కు కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిపై గ్రామస్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంచేసే వారిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేయవచ్చని.. మూడు నెలల్లో బాధిత వృద్ధులకు న్యాయం చేకూరుతుందన్నారు. దూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేదని.. టోల్ఫ్రీ 14567 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ
కోస్గి రూరల్/నర్వ/మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని.. అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం కాడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముదిరెడ్డిపల్లికి 104 ఇళ్లను మంజూరు చేయగా.. అందులో ఆరు ఇళ్లను ఒకే రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మరో 20 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ న్నారు. మిగిలిన ఇళ్ల పనులను కూడా లబ్ధిదారులు త్వరగా పూర్తిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గుండుమాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, హౌసింగ్ పీడీ శంకర్ పాల్గొన్నారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అన్నారు. మద్దూరు మండలం దోరేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని గుర్తించిన కలెక్టర్.. పాఠశాల ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులపై ఆగ్రహ ం నర్వ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ అసహ నం వ్యక్తంచేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై ఆమె సమీక్షించారు. మండలానికి 308 ఇళ్లు మంజూరు కాగా.. 170 ఇళ్లకు మార్కింగ్ వేశారని, 98 ఇళ్లు బేస్మెంట్ లేవెల్, 10 స్లాబ్ లేవల్, మరో 17 గోడల దశలో కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలైలో ప్రా రంభించిన ఇళ్ల పనులు నేటికీ ప్రగతిలో లేకపోవడం, జిల్లాలో నర్వ మండలం వెనకబడటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా యాస్పిరేషన్ బ్లాక్ కింద ఎంపికై న నర్వ మండలం నీతి అయోగ్ మార్గదర్శకాల ప్రకారం అన్ని అంశాల్లో ప్రగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం కోసం రైతులకు రూ. 15లక్షలు, కేజీబీవీకి సోలార్ కిచెన్ కోసం రూ. 58లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ అఖిలారెడ్డి ఉన్నారు. లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
వందశాతంఫలితాలు సాధించాలి
నారాయణపేట రూరల్: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ట్రెయినీ కలెక్టర్ వి.పాణిరాజ్ సూచించారు. సోమవారం మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రార్థనా సమయంలోనే సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ తెలుసుకున్నారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం, లెక్కింపు నైపుణ్యం పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. రివిజన్ టెస్టుల్లో విద్యార్థులు చేసిన తప్పిదాలను తెలియజేసి.. వాటిని సరిచేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సీఎంఓ రాజేంద్రకుమార్, మిడ్ డే మిల్స్ జిల్లా ఇన్చార్జి యాదయ్యశెట్టి, డీఎస్ఓ భాను ప్రకాశ్, హెచ్ఎం భారతి ఉన్నారు. పదోన్నతితోమరింత బాధ్యత నారాయణపేట: పదోన్నతి విధి నిర్వహణలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను పెంచుతుందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన శ్రీనివాసులుకు ఎస్పీ పట్టీలు తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హూల్ హక్ పాల్గొన్నారు. 16 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏడీ దినేష్కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నగరంతో పాటు, జడ్చర్ల, గద్వాల పట్టణంలో, వనపర్తిలో ఉన్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లఘించిన 16 మెడికల్ దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదనపు ధరలతో పాటు స్టాక్ రిజిస్టర్లు, బిల్లింగ్ రికార్డులు షెడ్యూల్, హెచ్1 రిజిస్టర్లు, డ్రగ్ లైసెన్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ప్రతి దుకాణంలో డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలు, నిల్వ చేసే విధానం సక్రమంగా ఉండాలని, ప్రిస్క్రిప్షన్ ద్వారానే మందుల విక్రయాలు జరగాలని, రిజిస్టర్ ఫార్మాసిస్ట్ సమక్షంలో విక్రయాలు జరగాలన్నారు. తనిఖీల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు రఫీ, రష్మి, విశ్వంత్రెడ్డి, వినయ్ పాల్గొన్నారు. -
చేనేత కార్మికులను విస్మరించడం తగదు
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కళను అందలమెక్కిస్తున్నామంటూనే కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లీ ధ్వజమెత్తారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత బాట కార్యక్రమంలో భాగంగా ఆయన అమరచింతలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్వేస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీని అమలు చేయడంతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జియోట్యాగ్ ఉన్న నేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. మరుగున పడిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి.. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలను త్రిఫ్ట్ ఫండ్తో ఆదుకోవాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు రూ. 5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. -
దిక్కుతోచడం లేదు..
రెండ్రోజుల కిందనే స్లాట్ బుక్చేసుకొని లింగంపల్లి శివారులోని వినాయక కాటన్ మిల్లు దగ్గర పత్తిని ట్రాక్టర్లో తీసుకొస్తే క్యూలైన్లో నిలబెట్టారు. ఇప్పుడు కాటన్మిల్లు బంద్ అని చెప్పడంతో దిక్కుతోచడం లేదు. స్లాట్ క్యాన్సల్ చేసుకొని మళ్లీ బుక్ చేసుకుంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. – దేవర రాము, లింగంపల్లి, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా ఆందోళనలు చేస్తాం.. లింగంపల్లి పత్తి మిల్లు దగ్గర మూడు రోజుల నుంచి ట్రాక్టర్లు అద్దెకి తీసుకొని క్యూలో నిలబడి ఉన్నాం. సోమవారం కొనుగోలు చేసేది ఉండే.. తీరా బంద్ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల స్పందించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. – లక్ష్మణ్, పత్తిరైతు, మల్లేపల్లి 20 క్వింటాళ్లు తెచ్చా.. 20 క్వింటాళ్ల పత్తిని సోమవారానికి స్లాట్ బుక్చేసుకొని వడ్వాట్ సమీపంలోని కాటన్ మిల్లుకు తీసుకొచ్చా. ఇక్కడికి వచ్చాక బంద్ అని చెప్పిండ్రు. ఇది ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలి. – కిష్టప్ప, పత్తిరైతు, వడ్వాట్ గ్రామం, మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా రెండ్రోజులుగా ఇక్కడే ఉన్నాం.. దేవరకద్ర మండలం నుంచి మిడ్జిల్ మండలంలోని రాణిపేట శివారులోని సీసీఐ కేంద్రానికి ఆదివారం సాయంత్రం పత్తిని బొలెరో వాహనంలో తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక బంద్ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజురోజుకూ బండి కిరాయి పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను తీర్చాలి. – ఆనంద్, పత్తి రైతు, అమ్మాపూర్, దేవరకద్ర మండలం ● -
సహజ సిద్ధంగా..
●రైతులు ముందుకు రావాలి.. ఆహార అవసరాల డిమాండ్ పెరగడంతో అధిక దిగుబడులు పొందేందుకు వ్యవసాయ సేద్యంలో ఉపయోగిస్తున్న ప్రమాదకర ఎరువులు, పురుగు మందులు, రకరకాల సాగు విధానాలు పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్నాయి. వ్యవసాయాన్ని సహజ పద్ధతులతో చేయడం వల్ల ఆరోగ్యకర దిగుబడులు లభించడమే కాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదు. ఈ పథకం దేశం మొత్తంలో యుద్ధప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. అపోహలు వీడి రైతులు ముందుకు రావాలి. – వార్ల మల్లేశం, సేవ్ నేచర్ ప్రతినిధి, కోస్గి కార్యాచరణ సిద్ధం.. ప్రకృతిలో దొరికే వనరులను వినియోగించడంతోపాటు రసాయనాలు, పురుగు మందుల వాడకం తగ్గించి సహజ పద్ధతిలో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ఎంపిక చేసిన రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం. – వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ జిల్లా క్లస్టర్లు రైతులు మహబూబ్నగర్ 20 2,500 నాగర్కర్నూల్ 15 1,875 నారాయణపేట 10 1,250 జోగుళాంబ గద్వాల 20 2,500 వనపర్తి 10 1,250 మహబూబ్నగర్ (వ్యవసాయం): అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతులతో కూడిన ప్రకృతి వ్యవసాయానికి రైతులను సమాయత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ అండ్ నేచురల్ ఫార్మింగ్ పథకానికి పచ్చజెండా ఊపింది. సేంద్రియ పద్ధతులతో విభిన్న పంటలు పండించడానికి రైతులకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందించనుంది. ఆరోగ్యకర దిగుబడులతోపాటు పర్యావరణ హితంగా పంటలు పండిస్తూ.. భూమి, సహజ వనరులను కాపాడుతూ.. రైతులు తక్కువ ఖర్చులతో కూడిన సుస్థిర వ్యవసాయ విధానం వైపు అడుగులు వేసేందుకు ఈ పథకం తోడ్పడనుంది. సంప్రదాయ వ్యవసాయాన్ని సహజ రీతిలో ప్రకృతి వ్యవసాయంగా మార్చాలనే దృక్పథాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేయనున్నాయి. 2025– 26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. ఇవీ మిషన్ విశేషాలు.. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025– 26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, పీఏసీఎస్లు, ఎఫ్పీఓలు, ఎస్హెచ్జీలు లాంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2 వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. జిల్లా లో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు ‘కృషి సఖులు’ సాగు సహాయకులను ఉపయోగించనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలో ఇలా.. చేకూరే ప్రయోజనాలు ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా మూస ధోరణికి స్వస్తిపలికి.. విభిన్న పంటలకు ప్రోత్సాహం ప్రతిరైతు సేంద్రియ పద్ధతిని అవలంభించేలా చర్యలు తద్వారా సురక్షితమైన పోషకాహారం తీసుకొచ్చేందుకు కృషి ఉమ్మడి జిల్లాలో 9,375 మంది రైతుల ఎంపిక ప్రతీ మండలంలో.. సహజ వ్యవసాయ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామం లేదా గ్రామ సముదాయంలో 125 మంది చొప్పున జిల్లాలో 20 క్లస్టర్ల నుంచి మొత్తం 2,500 మంది ఔత్సాహిక రైతులను గుర్తించారు. వారి వ్యవసాయ కమతంలో మొదట ఒక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆచరించేలా ప్రోత్సహిస్తారు. మొదటి సంవత్సరం రైతులు శిక్షణలో భాగంగా క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో అవసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. రెండు, మూడేళ్లలో ఆవుపేడ, గోమూత్రం సేకరణ, జీవామృత లాంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులు అవలంభించనున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలుపెట్టాలి. 4–5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఆచరించాలి. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 క్లస్టర్లలో 9,375 రైతులను ఎంపిక చేశారు. వీరందరికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు, జీవసంబంధం పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కర్బన ఉద్ఘారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. సహజ వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. స్థానిక వనరుల వినియోగం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. -
కూరగాయలు కుతకుత
మార్కెట్లో ఏది కొనాలన్నా కిలో రూ. 60పై మాటే.. ● భారీగా పెరిగిన ధరలతో సామాన్యుల బెంబేలు ● జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న తోటలు ● ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి ● మార్కెట్లో అమాంతం పెరిగిన ధరలు ●నారాయణపేట: కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో గత వానాకాలం కూరగాయల సాగు 100 ఎకరాలు కూడా దాటలేదు. యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతున్నా కూరగాయల సాగు అంతంతమాత్రమే. వానాకాలంలో సాగుచేసిన కూరగాయల తోటలన్నీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దిగుబడులు భారీగా పడిపోయాయి. జిల్లాకు కర్ణాటకలోని రాయచూర్, ఏపీలోని కర్నూలు నుంచి కూరగాయలను నిత్యం దిగుమతి చేసుకోవాల్సిందే. ఆయా ప్రాంతాల్లోనూ వర్షాలకు తోటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరిగాయి. జిల్లాలోని రైతుబజారుతో పోలిస్తే బయట కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు అధికంగా ధరలు ఉన్నాయి. ప్రతి కూరగాయ కిలో ధర రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ ఆందోళన చెందుతున్నారు. మక్తల్ పట్టణంలోని రైతుబజార్ భూనేడు, నిడ్జింత గ్రామాల్లో 40 ఎకరాలకు పైగా రైతులు టమాటా, వంకాయ, మిరప సాగుచేస్తారు. పండించిన కూరగాయలను సమీప గ్రామాల్లో ఉదయం పూట సంత బజార్లలో విక్రయించేవారు. ఆ సంతల్లో ధరలు తక్కువగా ఉండేవి. గత నెలలో కురిసిన వానలతో కూరగాయల తోటలు పాడైపోయ్యాయి. ఇప్పుడు మహబూబ్నగర్ రైతు బజారులో కూరగాయలు తెచ్చి అమ్ముతున్నారు. ఆటోల కిరాయి భారం మాపై పడుతుంది. – గొల్ల సాయమ్మ, భూనేడు, కొత్తపల్లి మండలం గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. 15–20 రోజుల క్రితం టమాటా కిలో రూ.20, కాలీఫ్లవర్, బెండ, చౌలకాయ ఇలా ఏ కూరగాయ కొన్నా రూ. 60 లోపే ఉండేవి. ప్రస్తుతం కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి. టమాటాతో సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. రైతుబజారులో రైతులు తెల్లవారుజామున గంపగుత్తగా విక్రయించి వెళ్తున్నారు. కూరగాయల వ్యాపారం చేసే వారు వాటిని కొనుగోలుచేసి.. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రైతుబజార్ ఉన్నా లాభం లేదంటూ జనం వాపోతున్నారు. రైతుబజార్లోని ధరలు బోర్డుకే పరిమితం కావడం కొసమెరుపు. -
పటేల్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం
నారాయణపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ నెల 24న జిల్లా కేంద్రంలో ఐక్యత పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా యువజన అధికారి వి.కోటానాయక్ తెలిపారు. ఐక్యత పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు మరువలేనివన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేయడంతో పాటు తెలంగాణ బానిసత్వానికి విముక్తి కల్పించారని గుర్తుచేశారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడలశాఖ ఆధ్వర్యంలో 20 రోజుల క్రితం చేపట్టిన ఐక్యత పాదయాత్ర నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పూర్తిచేసుకొని.. ఈ నెల 24న నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో 4 కి.మీ. పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై ప్రారంభిస్తారని.. పాదయాత్రలో కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పాదయాత్ర జిల్లా కన్వీనర్ డోకూరు తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, ప్రచార కార్యదర్శి కిరణ్ ఉన్నారు. -
మహబూబ్నగర్ రైల్వేస్టేషన్కు మహర్దశ
స్టేషన్ మహబూబ్నగర్: అమృత్ భారత్ స్టేషన్ పథకంతో హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో పెద్ద స్టేషన్లలో ఒకటైన మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకంతో మహబూబ్నగర్ రైల్వే స్టేషన్కు మహర్దశ కలగనుంది. రైల్వే స్టేషన్ను అనేక వసతులతో ఆధునీకరించనున్నారు. జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో అమృత్భారత్ స్టేషన్ పథకం కింద పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎఫ్ఓబీ, ఇతర పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ పాత భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న బుకింగ్ కౌంటర్, విచారణ (ఎంక్వయిరీ) కేంద్రాలను స్టేషన్కు కుడివైపు ఉన్న ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ వెనుకాల ఉన్న తాత్కాలిక భవనంలోకి, రిజర్వేషన్ కౌంటర్ను ఎడమవైపు ఉన్న రైల్వే మెయిల్ కార్యాలయ భవనంలో ఎస్బీఐ ఏటీఎం పక్కన ఏర్పాటు చేశారు. -
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి..
జిల్లాలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడంతో ఏపీలోని కర్నూలు, హైదరాబాద్ – శంషాబాద్, కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ కూరగాయల ధరలు పెరగడంతో ఇక్కడ వాటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. – చిట్టెమ్మ, కూరగాయల వ్యాపారి, మరికల్ అధిక వర్షాలతో కూరగాయల తోటలు దెబ్బతినడంతో మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఏ కూరగాయ కొనాలన్నా కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. నెలరోజుల క్రితం రూ.200 తీసుకెళ్తే బస్తా నిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా బస్తా నిండటం లేదు. దీంతో చేసేదేమి లేక టమాటా చారుతో పొద్దు గడుపుతున్నాం. – ఎల్లప్ప, మరికల్ మాకు ఉన్న అరెకరా పొలంలో బెండకాయ, బీరకాయ, వంకాయ, పచ్చిమిర్చిని సాగుచేశాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోటలన్నీ పాడయ్యాయి. తీరా ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు కొనాలని పోతే రేట్లు బాగా పెరిగాయి. రోజు పప్పు, పచ్చళ్లతో సరిపెట్టుకుంటున్నాం. – అనసూయ, మద్దెల్బీడు -
నేటి నుంచి పత్తి కొనుగోలు నిలిపివేత
నారాయణపేట టౌన్: ఉమ్మడి జిల్లాలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు పోతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాటన్ జిన్నింగ్ మిల్లులపై సీసీఐ నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ.. సీసీఐ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేటు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. తమకు పత్తి రైతులు సహకరించాలని కోరారు. గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు నారాయణపేట: మల్టీ లేవెల్ మార్కెటింగ్ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ప్రయోగిస్తున్నారన్నారు. గొలుసుకట్టు వ్యాపారాలతో మోసంచేసే మల్టీ లేవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయని.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాట్సప్, టెలీగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి.. అమాయకులకు ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారన్నారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింక్లు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. నేడు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు కందనూలు: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇన్చార్జి నిరంజన్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల జట్లకు ఎంపికై న క్రీడాకారులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో నిర్వహించే 44వ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ చాంపియన్షిప్లో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 18 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. మరింత సమాచారం కోసం 95531 24166, 94934 50450, 91331 48136 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి నారాయణపేట టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద బీసీ జాగృతిసేన, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సామాజిక న్యాయ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, సామాజిక న్యాయ దీక్షకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ మద్దతు తెలిపి మాట్లాడారు. బీసీల పోరాటం తెలంగాణ ఉద్యమంలా సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్యాదవ్, మడిపల్లి కృష్ణయ్య, వెంకట్రామిరెడ్డి, కాశీనాథ్, బలరాం, కాళేశ్వరం పాల్గొన్నారు. 14,485 బస్తాల మొక్కజొన్న రాక నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదివారం 14,485 బస్తాల మొక్క జొన్న ధాన్యం వచ్చింది. కాగా మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,034 కనిష్టంగా రూ.1,767 ధర పలికింది. అలాగే 2,078 బస్తాల వరిధాన్యం రాగా.. సరాసరిగా రూ.2,552 ధర లభించింది. మొక్కజొన్నతోపాటు వరి ధ్యానం సైతం బుధ, ఆదివారాలు పెద్ద మొత్తంలో మార్కెట్కు వస్తుందని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
వనపర్తి రూరల్: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి
మాగనూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు అన్నారు. శనివారం సంబంధిత అధికారి అమన్కుమార్ తదితరులు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిరుపేద ప్రజల కల నెరవేర్చడానికి ఈ పథకం తీసుకురావడం జరిగిందన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుండటం అభినందనీయం, లబ్ధిదారులు అధికారుల సూచనలు పాటిస్తూ ఇళ్లు నిర్మించుకోవాలని అన్నారు. ముఖ్యంగా అధికారులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ డిప్యూటీ డీఈ హరికృష్ణ, ఉమ్మడి మండల హౌసింగ్ ఏఈ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పర్రిశమలకు గడువులోగా అనుమతులు
నారాయణపేట: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి నిర్దేశిత గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. ఎస్సీ 12, ఎస్టీ 4, పీహెచ్సీ 1కి సంబంధించి పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు డిఐపిసి కమిటీలో ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో జీఎం లింగేశ్వర్ గౌడ్, ఐపీఓ నర్సింగ్ రావు, ఎల్డీఎం విజయ్ కుమార్ సీటిఓ ప్రవీణ్ కుమార్, నరేశ్, అసిస్టెంట్ హైడ్రాలాజిస్ట్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, విద్యుత్ ఎస్సీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ‘చదువుల పండుగ’ కొనసాగించాలి జిల్లాలో చదువుల పండగ కార్యక్రమం కొనసాగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన మార్కులు, హాజరు వివరాలు వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉదంగత్ యాప్ను డెవలప్ చేయాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక పీటీఎం, పదో తరగతి అనంతరం విద్యార్థులు ఇంటర్ ఎక్కడ చదువుతారో అధికారులు రికార్డు చేయాలన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో ట్రైని కలెక్టర్ ప్రణయ్, ఆర్డీఓ రాంచందర్, డిప్యూటీ కలెక్టర్ ట్రైని శ్రీరామ్ ప్రణీత్, ఫణిరాజ్ డిప్యూటీ కలెక్టర్ ట్రైని, డిపిఓ సుధాకర్ రెడ్డి, రాజేష్ కుమార్, యాద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో ఏదైనా సాధించవచ్చు
నారాయణపేట రూరల్: ప్రతి వ్యక్తి జీవితంలో చదువుతూనే ఎంతటి స్థాయినైనా పొందవచ్చునని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిమళపురంలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి పిల్లలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో కూడా ముందుండాలని సూచించారు. చదువు ద్వారా ఏదైనా సాధించడం సాధ్యమని, చదువు చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలో వైఓసి క్లబ్ ను, మిడ్ఇయర్ షోకేస్ను నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన వివిధ కార్యకలాపాలను తిలకించారు. చక్కటి ప్రతిభను ప్రదర్శించగా కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు బృందం పాల్గొంది. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చిన్నతనం నుంచే అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్ అన్నారు. పట్టణంలోని రవితేజ స్కూల్ లో శుక్రవారం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచి చదువుతోపాటు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, ఉపాధ్యాయులు విద్యతో పాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. సైన్స్ పై అవగాహన కలిగి ఉండి కొత్త విషయాలను కనిపెట్టేందుకు ప్రోత్సహించాలన్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, సంస్కృతి అంశాలకు సమయానికి కేటాయించాలన్నారు. పిల్లల మానసికోన్నతికి యోగా, మెడిటేషన్ చేయించాలన్నారు. న్యాయ శాస్త్రంపై అవగాహన కలిగి ఉండాలని, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. 15100 టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీపతి గౌడ్, సురేష్, యాదయ్య శెట్టి, బాలస్వామి, రూపిక, శాలిని పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
10 వేల ఎకరాలు సాగైతే పరిశ్రమ..
జిల్లాలో 10 వేల ఎకరాలు సాగైతే జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇదిలాఉండగా, జిల్లాలోని మరికల్ మండలం కన్మనూర్లో నర్సరీని ఏర్పాటు చేసి జిల్లా రైతులకు సరిపడా ఆయిల్పాం మొక్కలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6700 ఎకరాలు సాగవుతోంది. ఇక ఆయిల్పాం సాగుకు ముందుకు వచ్చే రైతులకు మొక్కలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీపై, బీసీలకు 80 శాతం రాయితీపై డ్రిప్ను అందిస్తోంది. ఇక పంట కొనుగోలు కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ ముందుకు వచ్చింది. ఇందు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్దనున్న ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్దరించారు. పంట కోత మొదలైనప్పటి నుండి కొనుగోలు వరకు సంస్థనే రవాణ చార్జీలు చెల్లిస్తోంది. -
పాలనలో పారదర్శకత కోసమే స.హ.చట్టం
● ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహనపెంచుకోవాలి ● రాష్ట్ర సమాచార హ క్కు చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నారాయణపేట: ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, పారదర్శక పాలన అందించేలా, జవాబుదారీ తనాన్ని పెంచేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని.. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతోపాటు ఇతర కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మోసినా ఫర్విన్ హాజరయ్యారు. వీరికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు శ్రీను, సంచిత్ పూల మొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం వారు పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అవగాహన సదస్సులో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. పీఐఓలు, ఏపీఐవోలు సమాచార హక్కు చట్టాన్ని అర్థం చేసుకొని నిర్దిష్టంగా అమలు చేసి దేశంలోనే ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేలా చేయాలని సూచించారు. గత మూడున్నరేళ్లుగా సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడంతో చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని ఈ జిల్లాల పర్యటన ద్వారా అందరికీ అవగాహన కల్పించి, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్టీఐ ద్వారా సమాచారం పొందే వివిధ మార్గాల గురించి ఆయన క్లుప్తంగా వివరించారు. నిజానికి ఆర్టీఐ ద్వారా 90 శాతం సమాచారం ఇస్తున్నామని, 10 శాతం మాత్రమే అప్పీలుకు వస్తున్నాయని చెప్పారు. సమర్థవంతంగా చట్టం అమలు చేద్దాం.. సమాచార హక్కు చట్టం కమిషనర్ –1 పీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పథకాలను సక్రమంగా అమలు చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం పాత్ర కీలకమని తెలిపారు. జిల్లాలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేద్దామని ఆయన సూచించారు. కమిషనర్ – 2 మౌసినా ఫర్వీన్ మాట్లాడుతూ.. తాము జిల్లాల పర్యటన ద్వారా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ వస్తున్నామని, దరఖాస్తు వచ్చిన 5 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్నారు.ఈమేరకు ఆర్టీఐ యాక్ట్పై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలని, జిల్లాలో 104 కేసులు విచారణకు ఇచ్చామన్నారు. అనంతరం పెండింగ్లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చే శారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమా ర్, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ మహేష్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పిఐఓ లు, అప్పీలెట్ అధికారులు పాల్గొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. రాత్రిళ్లు దందా.. షరా‘మామూలు’ నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్, రవాణా, మైనింగ్ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందు తుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనవాళ్లు కోల్పోతున్నపాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా ఎర్రమట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు రాజకీయ నేతల అండతో యథేచ్ఛగా దందా రాయల్టీ ఎగవేతతో సర్కారు ఆదాయానికి గండి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖపై విమర్శలు -
రైతులు ముందుకు రావాలి
జిల్లాలో ఆయిల్పాం సాగుకు రైతులు ముందుకు రావాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు 10 సహకార సంఘాల సమన్వయంతో 150 ఎకరాలు సాగుతోపాటు ఈ ఏడాది 3500 ఎకరాలు సాగు లక్ష్యంగా ముందుకు వెలుతున్నాం. 10 వేల ఎకరాల సాగు లక్ష్యం చేపడితే జిల్లాలో ఆయిల్ఫెడ్ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు నాలుగు శాఖలు సమన్వయంతో ముందుకు వెళతాం. ఈ నెలాఖరు వరకు అన్ని పీఏసీఎస్లలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తాం. – వీవీ.సాయిబాబ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ● -
నిబంధనల మేరకు ఇసుక అనుమతులు
● టాస్క్ఫోర్స్ కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో గుర్తించిన ప్రాంతాల నుంచి ఇసుక తరలింపునకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీఎల్ఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగనూర్ మండలం గజరాన్దొడ్డి గ్రామానికి చెందిన రైతు తన పట్టా భూమిలో దాదాపు 7,743 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగింపునకు దరఖాస్తు చేసుకోగా.. సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భజలశాఖ, సర్వే ల్యాండ్, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా శాఖల అధికారుల నివేదికల ఆధారంగా ఇసుక అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇసుక తరలించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసి.. ఇసుక తరలింపు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఒక్క ఫోన్ తనకు వచ్చినా.. ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేస్తానని.. ఇకముందు ఎలాంటి అనుమతులు ఇవ్వనని కలెక్టర్ స్పష్టంచేశారు. అంతకుముందు కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంతమేర ఇసుక అవసరమనే వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, మైనింగ్ రాయల్టీ అధికారి ప్రతాప్ రెడ్డి, మైనింగ్ ఏడీ గోవిందరాజు ఉన్నారు. ● మండలాల వారీగా నిర్దేశించిన సీ్త్రనిధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలపై అప్పు నిలువ రూ. 74.5కోట్లు ఉండగా.. రూ. 9.76 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఈ నెలాఖరులోగా బకాయి మొత్తం వసూలు చేసి.. జిల్లా రికవరీని 90 శాతానికి పెంచాలని ఏపీఎం, సీసీలను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 40కోట్ల రుణాలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ. 22.68 కోట్లు అందించినట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్రెడ్డి డీఆర్డీఓ మొగులప్ప, సీ్త్రనిధి జోనల్ మేనేజర్ శ్రీనివాసులు, రీజినల్ మేనేజర్ తిరుపతయ్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి ఉన్నారు. జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. నారాయణపేట మండలం లింగంపల్లి సమీపంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్ ఉన్నారు. -
సరిహద్దులో పటిష్ట నిఘా: ఎస్పీ
కృష్ణా: కర్ణాటక నుంచి నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా ఏర్పాటుచేసినట్లు ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం రాత్రి 10 నుంచి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా చెక్పోస్టులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, 8మంది ఎస్ఐలు, 65మంది పోలీసులతో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా 367 వాహనాలను తనిఖీ చేయగా.. రెండు వరిధాన్యం బస్తాల లారీలు, ఒక ఇసుక లారీతో పాటు 200 లీటర్ల డీజిల్ను అక్రమంగా తరలిస్తున్న ట్యాంకర్ను పట్టుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘాతో పాటు నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వరిధాన్యం, ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వాహనాల తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐలు రాంలాల్, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచండి
● పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్/ఊట్కూర్: పట్టణంలో రూ. 48కోట్లతో చేపట్టిన 150 పడకల ఆస్పతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు అధునాతన సదుపాయాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో 150 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మక్తల్లో రూ. 3.70కోట్లతో మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి మక్తల్లోని శ్రీపడమటి ఆంజనేయస్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సంబంధిత అధికారులకు సూచించారు. డిసెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలోని పురాతన కోనేరును ఆధునీకికరించడం జరిగిందని.. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్కుమార్, విద్యుత్ ఏఈ రామకృష్ణ, ఆలయ ధర్మకర్త ప్రాణేశ్కుమార్, ఈఓ కవిత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ● ఊట్కూర్లో మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మినీ స్టేడియానికి మూడెకరాల స్థలం అవసరమని.. పోలీసు క్వార్టర్స్ వద్ద ఉన్న స్థలాన్ని సర్వే చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. మంత్రి వెంట ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కిషోర్, పీఆర్ ఏఈ అజయ్రెడ్డి, నాయకులు మణెమ్మ, బాల్రెడ్డి, ఎల్కోటి నారాయణరెడ్డి, భాస్కర్, అరవింద్ కుమార్, సూర్యప్రకాశ్రెడ్డి, యఘ్నేశ్వర్రెడ్డి, మహేశ్రెడ్డి ఉన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
నారాయణపేట టౌన్/ కోస్గి రూరల్: నిర్మల్ జిల్లా కోర్టులో న్యాయవాదిపై కానిస్టేబుల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విఽధులు బహిష్కరించారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది అశోక్పై దాడి చేసిన కానిస్టేబుల్ను కఠినంగా శిక్షించాలన్నారు. బార్ అసోషియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్షణ చట్టాన్ని అమలు చేయాలి న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోస్గి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓం ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మల్ న్యాయస్థానంలో పరిసరాల్లో న్యాయవాది అనిల్కుమార్ వాహనాన్ని పోలీస్ అధికారి ధ్వంసం చేయడాన్ని ఖండించారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో న్యామవాదులు విఎన్ గౌడ్ , రాజలింగం, సంతోష్, తాజ్ఖాన్, రాజురెడ్డి, మురళీ, మల్లేష్, భీమేష్ ఉన్నారు. -
నేడు సమాచారకమిషనర్ల రాక
నారాయణపేట: రాష్ట్ర సమాచార కమిషనర్లు శుక్రవారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు సమాచార హక్కు చట్టం–2005 పెండింగ్ అప్పీళ్లను స్టేట్ చీఫ్ సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మౌసినా పర్వీన్ పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే కమిషనర్ల ఎదుట హాజరై పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి మద్దూరు: మున్సిపాలిటీలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేసుకోవాలని పుర కమిషనర్ శ్రీకాంత్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం ము న్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల, రాళ్లబాయి గ్రా మాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దశల వారీగా బిల్లుల చెల్లింపు తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గేటువాల్వు మరమ్మతు పనులను పర్యవేక్షించారు. ప్రజలకు అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. వివరాల నమోదులో నిర్లక్ష్యం చేయొద్దు ధన్వాడ: కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గురువారం ధన్వాడ మండలం కిష్టాపూర్, మందిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం వల్ల 24 గంటల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. వివరాల నమోదులో ఆలస్యం చేస్తే రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. కాగా, ఆరబెట్టిన వరికుప్పల వద్దే తూకం వేసి లారీల్లో మిల్లులకు తరలించాలని పలువురు రైతులు అదనపు కలెక్టర్ను కోరగా.. రైతులు కేంద్రానికి ధాన్యం తీసుకురావాల్సిందేనని స్పష్టంచేశారు. అవసరమైతే రైతులకు అందుబాటులో మరో కేంద్రం ఏర్పాటు చేస్తామని.. వరికుప్పల వద్దకు లారీలను పంపించేందుకు వీలుపడదని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ సిందూజ తదితరులు ఉన్నారు. -
జలవనరుల లెక్క పక్కా
మద్దూరు: జిల్లాలోని చిన్న నీటివనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఐదేళ్లకోసారి జిల్లాల వారీగా గొట్టపుబావులు, ఓపెన్ బావులు, చెరువులు, చిన్నపాటి కుంటలు, 2వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే మినీ ప్రాజెక్టుల గణన చేపడుతున్నారు. వాటన్నింటి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందిస్తారు. ఈ గణన ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని నీటివనరులు ఉన్నాయనే వివరాలతో పాటు గ్రామాల్లో నీటి లభ్యత ఎలా ఉందనే అంశం వెలుగులోకి రానుంది. అధికారులు అందించిన ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్లో రాష్ట్ర నీటివనరుల రంగానికి వివిధ స్కీంల కింద ఆర్థిక సహకారం అందించనుంది. అయితే ఈ వారంలోనే నీటివనరుల గణన మొదలుకానుంది. మ్యానువల్ పద్ధతిలో నీటి వనరులను లెక్కపెట్టి.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయనున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్లో భాగంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి చిన్న నీటివనరులను లెక్కిస్తారు. చివరకు 2017–18లో నీటివనరుల గణన నిర్వహించారు. అప్పట్లో జిల్లావ్యాప్తంగా బావులు, బోరుబావులు, గొట్టపు బావులు 30,506, చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితరాలు 2,142 ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఐదేళ్ల తర్వాత చేపట్టనున్న నీటివనరుల గణను పకడ్బదీగా చేపట్టేందుకు సీపీఓ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో ఈ నెల 12న ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో నీటివనరుల గణన పక్కాగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందికి శిక్షణ.. జిల్లాలో చిన్న నీటివనరుల గణన కోసం కేటాయించిన సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. సీపీఓ కార్యాలయ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సైతం సర్వే ప్రక్రియను పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేశారు. కలెక్టర్ చైర్మన్గా, సీపీఓ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు చిన్న నీటివనరుల గణన చేపట్టనున్నారు. వీరికి సమన్వయంచేసే బాధ్యతలను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించే నీటివనరుల గణన వివరాలను రోజు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. కాంచనగుహకు భక్తులు కురుమూర్తిస్వామి జాతరకు భక్తులు భారీగా తరలిరావడంతో మైదానమంతా రద్దీగా మారింది. –8లో u -
బృహత్ లక్ష్యం.. నిర్లక్ష్యం
నర్వ: వృక్ష సంపదను పెంచేందుకు.. గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేసింది. కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలకు ఏ ప్రయోజనం ఉందా.. లేదనేది పక్కనబెడితే నిధులు మాత్రం రూ.లక్షలు ఖర్చయ్యాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటులో భాగంగా అధికారులు హడావుడిగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. మొక్కలు నాటారు. కొన్నిచోట్ల ఆదారబాదరగా స్థలాలను గుర్తించిన అధికారులు.. తూతూ మంత్రంగా మొక్కలు నాటి మమ అనిపించారు. ఒక్కో బృహత్ ప్రకృతివనంలో దాదాపు 31వేల మొక్కలు నాటినట్లు అక్కడ ఏర్పాటుచేసిన బోర్డుల్లో లెక్కలున్నాయి. వనాల్లో మాత్రం నామమాత్రంగానే మొక్కలు ఉన్నాయి. నాటిన మొక్కలను సంరక్షించేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రకృతివనాలు ఏర్పాటుచేసిన స్థలాలు చౌడు, గుట్ట నేలలు కావడంతో నాటిన మొక్కలు చాలా వరకు పెరగడం లేదు. మాగనూర్, నర్వ, ఊట్కూర్ తదితర మండలాల్లో నాటిన మొ క్కలు కనిపించకపోగా.. బోర్డులు, గేట్లను ఎత్తుకుపోయ్యారు. పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. జిల్లాలో కార్యక్రమం ఇలా.. జిల్లాలోని 11 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేశారు. ప్రారంభంలో ప్రతి మండలానికో బృహత్ వనాన్ని కేటాయించారు. తర్వాత వాటి సంఖ్యను 5కు పెంచారు. జిల్లాలో మొత్తం 55 బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటు కోసం అధికారులు స్థలాలను గుర్తించి మొక్కలు నాటారు. దాదాపు 2 నుంచి 5 ఎకరాల పరిధిలో వనాలు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా వనాలను ఏర్పాటు చేయడం.. కంచె ఏర్పాటు చేయకపోవడం వల్ల పశువులు, మేకలు మొక్కలను తినేస్తున్నాయి. కనిపించని మొక్కలు.. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నేరేడు, చింత, సీతాఫలం, మారేడు, తంగెడు, కానుగ, టేకోమా, నిమ్మ, గుల్మహార్, జామ, మామిడి, టేకు, వెదురు, పనస వంటి మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా ఎదిగే మొక్కలను నాటారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ జామ, ఇతర మొక్కలు తప్ప ఇతర మొక్కలు ఏవీ కనిపించడం లేదు. ఇలా చేస్తే మేలు.. గ్రామాలకు చేరువలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉంటే ఎవరైనా వెళ్తారు. సంరక్షిద్దామన్నా ఆలోచన కలుగుతుంది. సేకరించిన స్థలం చుట్టూ కందకం తవ్వాలి. అలా తవ్వితే పశువులు, మేకలు వెళ్లడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎక్కడో దూరంగా పనికిరాని భూమిలో మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రీడలతో పోటీతత్వం క్రీడలతో పోటీతత్వం పెరుగుతుందని, గెలు పోటములు సహజమని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. –8లో u -
ప్రతిభను వెలికి తీయవచ్చు..
ఖేలో ఇండియా అస్మిత లీగ్తో బాలికల్లో దాగి ఉన్న అథ్లెటిక్స్ ప్రతిభను వెలికితీయవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాలోని బాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటాలి. నారాయణపేట జిల్లాకేంద్రంలో ఈనెల 17వ తేదీన జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. – రమణ, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, నారాయణపేట రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే.. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 14వ తేదీన జిల్లాస్థాయిలో అండర్–14, 16 విభాగాల బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నాం. ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల బాలికలు ఆన్లైన్ దరఖాస్తు కాపీతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, పాఠశాల బోనఫైడ్తో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలి. – జి.శరత్చంద్ర, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి, మహబూబ్నగర్ ● -
బాలికల కోసం అథ్లెటిక్స్ పోటీలు
● జిల్లాస్థాయిలో అస్మిత ఖేలో ఇండియా లీగ్ ● అండర్–14, 16 విభాగాల్లో పోటీల నిర్వహణ మహబూబ్నగర్ క్రీడలు: బాలికల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ‘ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టారు. దేశంలోని 26 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఖేలో ఇండియా అస్మిత (అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్) లీగ్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 10 నుంచి ప్రారంభమైన పోటీలు 30వ తేదీ వరకు జరగనున్నాయి. అండర్–14, అండర్–16 విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు బాలికలకు సువర్ణ అవకాశంగా మారనుంది. ● అండర్–14 ఏళ్ల లోపు బాలికలు 21.12.2011 నుంచి 20.12.2013 ఽమధ్య పుట్టి ఉండాలి, అండర్–16 ఏళ్లలోపు బాలికలు 21.12.2009 నుంచి 20.12.2011 మధ్య పుట్టిన వారు పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ● నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 10వ తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా ఈనెల 14వ తేదీన మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో, 17వ తేదీన నారాయణపేట జిల్లాల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో బాలికల ప్రతిభను గుర్తించడానికి ఒక్కో జిల్లాకు ఇద్దరు పరిశీలకులు రానున్నారు. పోటీలు జరిగే విభాగాలు.. అండర్–14: ట్రయథ్లాన్ గ్రూప్–ఏలో 60 మీ. లాంగ్జంప్ (5 మీ.), హైజంప్ (సీజర్), గ్రూప్–బీ 60 మీ., లాంగ్జంప్ (5మీ), బ్యాక్ త్రో (1 కేజీ), గ్రూప్–సీ 60 మీ., లాంగ్జంప్ (5 మీ.), 600 మీ.పరుగు, జావెన్త్రో. అండర్–16: ట్రయథ్లాన్ 60 మీ., 600 మీ.పరుగు, హైజంప్ (సీజర్), లాంగ్జంప్ (5 మీ.), డిస్కస్తో, షాట్పుట్, జావెలిన్ త్రో అంశాల్లో పోటీలు జరగనున్నాయి. -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
కోస్గి: మాదకద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం–2025’పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాల్సిన కొందరు యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థిలోకం నడుం బిగించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐలు పురుషోత్తంరెడ్డి, అబ్దుల్ జబ్బార్, శ్రావణి పాల్గొన్నారు. న్యాయవాదులరక్షణ చట్టం తేవాలి నారాయణపేట రూరల్: న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు న్యాయవాదులు చేపట్టనున్న పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, ఉ పాధ్యక్షుడు నందు నామాజీ, ప్రధాన కార్య దర్శి చెన్నారెడ్డి, న్యాయవాదులు రఘువీర్ యాదవ్, సీతారామారావు, మల్లికార్జున్, బాల ప్ప, నారాయణ పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో నారాయణపేట రూరల్: తమకు విక్రయించిన ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని.. తమకు న్యాయం చేయాలంటూ మంగళవారం బాధితులు రోడ్డెక్కారు. మండలంలోని జాజాపూర్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయా యి. వివరాల్లోకి వెళ్తే... జాజాపూర్కు చెందిన కోట్ల వెంకట్రెడ్డి 2008లో 3.30 ఎకరాల భూమిని 82 ప్లాట్లు చేసి.. వివిధ వర్గాలకు చెందిన 40మందికి పైగా విక్రయించారు. ఆయన కుమారుడు రవీందర్ రెడ్డి ఆ భూమి తన పే రుపై ఉందని చెప్పడంతో.. ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి చేరుకొని రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రాముడు, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చ జెప్పారు. కాగా, ఈ విషయమై రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసు కోర్టులో ఉందని, కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు. -
అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి
నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారతరత్న అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ, పర్శియన్, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారని.. ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటీష్ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎంఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మాగనూర్/కృష్ణా: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మాగనూర్ మండలంలోని అమ్మపల్లి, వడ్వాట్, అడవిసత్యావార్, కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అడవిసత్యావారంలో ఒక కొనుగోలు కేంద్రంలో కొంత ఇబ్బందిగా ఉందని.. మరో సబ్ కేంద్రం ఏర్పాటు చేయించాలని కలెక్టర్ను కోరారు. అందుకు స్పందించిన కలెక్టర్.. ఐకేపీ ఆధ్వర్యంలో సబ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసే విధంగా చూస్తామన్నారు. వరికోతలు వేగంగా కొనసాగుతున్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు సిద్ధంగా ఉండాలన్నారు. ము ఖ్యంగా గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 45 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. కాగా, ధాన్యం డబ్బులతో పాటు బోనస్ కూడా అందించాలని పలువురు కోరగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే విధంగా హిందూపూర్కు చెందిన ఓ రైతు ధాన్యం విక్రయించి 18 రోజులైనా డబ్బులు అందలేదని.. సరైన సమయానికి లారీలు అందుబాటులో ఉండటం లేదని.. రైస్మిల్లర్లు ధాన్యాన్ని దించుకునేందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించాలి.. మక్తల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మక్తల్లోని బీసీ బాలుర గురుకులంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీను, సివి ల్ సప్లయ్ డీఎం సైదులు, తహసీల్దార్లు శ్రీనివాస్, సతీశ్కుమార్, సురేశ్, ఏఓ సుదర్శన్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏపీఎం బస్వరాజ్ ఉన్నారు. -
యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం
నారాయణపేట రూరల్: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని.. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొంతుందని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, 17, 19 విభాగాల బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా చేసేందుకు కొంత సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. యువత, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకొని మానసిక ఒత్తిడిని జయించాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారికి డీఈఓ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎం సురేశ్, పీడీలు సాయినాథ్, నర్సింహారెడ్డి, శ్రీధర్గౌడ్, రామకృష్ణారెడ్డి, యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు. ● విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రాండ్ ఉన్నత పాఠశాలలో టీ శాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీల విజేతలకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, డీఎస్ఓ భానుప్రకాశ్, సెక్టోరియల్ అధికారులు నాగార్జున్ రెడ్డి, యాదయ్యశెట్టి, ఎంఈఓలు నిజాముద్దీన్, ఆంజనేయులు, బాలాజీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా అథ్లెట్ల ఎంపికలు
మక్తల్: పట్టణంలోని క్రీడా మైదానంలో సోమవారం ఎస్జీఎఫ్ అండర్–14, 15, 16, 17 బాలబాలికల విభాగాల్లో జిల్లా అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో బాలబాలికలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ముందుగా డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపిక పోటీలను ప్రారంభించారు. అత్యంత ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈ నెల 12న నిర్వహించే ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాకేశ్ శర్మ, కొండయ్య, కోళ్ల వెంకటేశ్, గణేశ్కుమార్, లక్ష్మీనారాయణ, నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, కట్ట సురేశ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రి కోసం పోరాటం
నారాయణపేట రూరల్: పేదలకు వైద్యం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటానికి సిద్ధమైన ట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండ సత్యయాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిని 8 కి.మీ. దూరానికి తరలించి ఆరు నెలలు గడుస్తున్నా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నా రు. 65వేల జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో బీజేపీ నిరాహార దీక్ష, పట్టణ బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు రూ. 8కోట్లు విడుదలయ్యాయని, స్థానిక ఎమ్మెల్యే మరో రూ. కోటి అదనంగా కేటాయించారని, స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేయడంతో పాటు పాత బస్టాండ్ వద్దనున్న చిన్నపిల్లల ఆస్పత్రిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సమావేశంలో బీజేపీ నాయకులు నందు నామాజీ, సాయిబన్న, వెంకటయ్య ఉన్నారు. -
బేరసారాలు షురూ..
నారాయణపేట: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30న ముగియనుండగా.. 2025–27కు సంబంధించి కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. అయితే లక్కీడ్రాలో మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారులు బేరసారాలను మొదలుపెట్టారు. తమకు దుకాణం అప్పగిస్తే భారీగా నజరానా ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా.. లక్కీడ్రాలో అదృష్టం వరించిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తోంది. జిల్లావ్యాప్తంగా 33 మద్యం దుకాణాలు ఉండగా.. ప్రధానంగా కృష్ణా, ఊట్కూర్ వైన్స్లపై లిక్కర్ వ్యాపారుల కన్నుపడింది. దుకాణాలు తమకు ఇస్తారా అని అడగడమే ఆలస్యం.. మరి రూ.కోటి ఇస్తారా అంటూ టెండరుదారులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త దుకాణాల ఏర్పాటుకు సన్నద్ధం.. మద్యం టెండర్ల ప్రక్రియ ముగియడంతో మరో 20 రోజుల్లో కొత్త దుకాణాలను తెరిచేందుకు వ్యాపారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో మూడు గ్రూపులకు వేర్వేరుగా సిండికేటులో దుకాణాలు దక్కాయి. ఎవరికి వారే దుకాణాల నిర్వహణకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం దుకాణాలు కొనసాగిస్తున్న అడ్డాలపై కన్నేశారు. అయితే తమ అడ్డా ఇవ్వాలంటే భాగస్వామ్యం ఇవ్వాలంటూ కొందరు.. తమ దుకాణం ఇవ్వలేమంటూ మరికొందరు.. యజమానితో మాట్లాడుకోండి అంటూ ఇంకొందరు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దుకాణాలు దక్కిన వారు మరో చోట దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ● సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గౌడ సామాజిక వర్గాల వారికి కేటాయించిన రిజర్వేషన్ల ద్వారా తమ లక్కును పరీక్షించుకున్న వారి పంట పండనుంది. సిండికేటు వ్యాపారులు లిక్కర్ వ్యాపారాన్ని ఎలాగైనా మళ్లీ చేజిక్కించుకోవాలని తమ పరిచయస్తులు, స్నేహితులతో జనరల్, రిజర్వు మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. అయితే కొందరు తమకు భాగస్వామ్యం ఇవ్వాలని.. మరికొందరు తాము డబ్బులు ఇవ్వలేము.. ఆధార్కార్డు మాత్రమే ఇస్తామని మద్యం దుకాణాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒకటి, రెండు దరఖాస్తులకే దుకాణాలు దక్కడంతో వామ్మో తమ పేరుపై ఇంత బలముందా అంటూ అవాక్కయ్యారు. అయితే వైన్స్ నడిపేందుకు తమకు టీడీఎస్ ఇవ్వాలని.. లేదా ఇతరులకు అమ్మితే ప్రతినెలా కొంత మొత్తం, టీడీఎస్ ఇవ్వాల్సిందేనంటూ షరతులు పెడుతున్నారు. దీంతో అదృష్టమంటే వారిదేనంటూ వ్యాపారులు చర్చించుకుంటున్నారు. చిరుతల సంచారం మద్దూరు మండలంలో చిరుతల సంచా రం పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. –8లో uనిబంధనల మేరకు.. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఎక్కడ దుకాణం ఏర్పాటు చేస్తారు.. ఎవరి పేరిట దుకాణం పెడుతున్నారనే వివరాలను ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలి. నిబంధనల ప్రకారం దుకాణం ఏర్పాటు చేస్తున్నారా.. లేదా అనే విషయాలను అధికారులు పరిశీలించిన తర్వాతే లైసెన్స్ జారీ చేస్తారు. – అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ లెక్కల్లో వ్యాపారులు.. జిల్లాలోని ఏ మద్యం దుకాణం లెక్కలు చూసినా ఏడాదికి రూ. 10కోట్లకు తక్కువగా లేవంటూ వ్యాపారుల లెక్కల్లో తేలింది. దీంతో ప్రభుత్వానికి చెల్లించే రెంటల్కు పదింతలు అమ్మకాలకు మొదటగా 16 నుంచి 20శాతం మార్జిన్, ఆ తర్వాత విక్రయించే మద్యానికి 6 నుంచి 10 శాతం మార్జిన్ ఉండటంతో మద్యం దుకణాలను ఎలాగైనా దక్కించుకోవాలని సిండికేటు వ్యాపారులతో పాటు తమ దుకాణాలను తామే సొంతంగా నడుపుకుంటామంటూ కొత్త వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మండలాల్లో గ్రామాల వారీగా బెల్టుషాపులు, దాబాల నిర్వాహకులను కలిసి ఈ సారి వైన్స్ తమకే వచ్చిందని.. తమతోనే మద్యం తీసుకోవాలంటూ ముందుగానే చర్చలు మొదలుపెట్టారు. మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారుల మంతనాలు వైన్స్ తమకు అప్పజెప్పాలంటూ గాలం కృష్ణా, ఊట్కూర్ వైన్స్ల కోసం తీవ్ర పోటీ భారీగా నజరానాలు -
ప్రజావాణికి 27 అర్జీలు
నారాయణపేట టౌన్: వివిధ సమస్యలపై ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. మొత్తం 27 అర్జీలు అందగా.. పరిష్కారం నమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక లోక్అదాలత్ను వినియోగించుకోండి నారాయణపేట టౌన్: జిల్లాలోని న్యాయస్థానాల్లో ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డా.వినీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇరుపక్షాల సమ్మతితో కేసులను త్వరగా పరిష్కరించేందుకు చక్కటి వేదిక లోక్అదాలత్ అని.. రాజీ చేసుకునే అవకాశం ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, వైవాహిక, కుటుంబ సమస్యలు, డ్రంకెన్ డ్రైవ్, మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన, చెక్బౌన్స్, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ ప్రత్యేక అవకాశాన్ని ప్రతి కక్షదారు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో రాజీ పడదగిన కేసులను గుర్తించి.. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ కేసులను రాజీ చేసుకునే వారు సంబంధిత పోలీస్స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు ఊట్కూర్: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. సోమవారం ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషోర్ సమక్షంలో ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ 14వ విడత ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ. 4.37కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టినట్లు వివరించారు. చిన్నపొర్ల, పెద్దపొర్ల, మల్లేపల్లి, తిప్రాస్పల్లి, కొల్లూర్ తరతర గ్రామాల్లో ఉపాధి హామీ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీపై సమీక్షించినట్లు తెలిపారు. మిగతా గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీపై కూడా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారి వినయ్ కుమార్, ఎస్ఆర్పీ కుమార్, ఏపీఓ లక్ష్మారెడ్డి, సత్యప్రకాశ్ ఉన్నారు. -
రాయితీ పరికరాలు ఎప్పుడో?
వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఎదురుచూపులు ● జిల్లాకు 2,822 యూనిట్ల కేటాయింపు ● 435 మంది దరఖాస్తు మరికల్: ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి.. ఈ యాసంగి నుంచే రైతులకు అవసరమైన యంత్రాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం రైతులు వానాకాలం పంట కోతలు చేపడుతూ.. యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే యంత్ర పరికరాల జాడ మాత్రం లేకుండా పోయింది. రాయితీపై అందించే యంత్రాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2025–26 సంవత్సరానికి గాను జిల్లాకు వ్యవసాయశాఖ 2,822 యూనిట్లు కేటాయించింది. ఐదెకరాలలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్న, సన్నకారు రైతులకు 50శాతం రాయితీతో.. పెద్దకారు రైతులకు 40శాతం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నారు. ఈ పథకంతో కూలీల సమస్య తీరనుంది. జిల్లాలో ఇలా.. రాయితీ పరికరాలను అత్యధికంగా మక్తల్ మండలానికి కేటాయించారు. ఆ తర్వాత ఊట్కూరు, కృష్ణా, మాగనూర్ మండలాలకు కేటాయించగా.. అత్యల్పంగా కొత్తపల్లి మండలానికి 88 మాత్రమే కేటాయించారు. యంత్ర పరికరాల్లో బ్యాటరీ చేతి పంపులు, పవర్ స్ప్రెయర్స్, రోటవేటర్స్, బ్రస్ కటర్, కల్టీవేటర్, స్ట్రాబేలర్, తదితర పరికరాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 534 యూనిట్లు, మిగిలిన 2,088 యూనిట్లను జనరల్ కేటగిరీ కింద పంపిణీ చేయనున్నారు. ఆగస్టులో దరఖాస్తులు.. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులను గత ఆగస్టులో వ్యవసాయ విస్తరణాధికరులకు అందజేశారు. మొత్తం 2,822 యూనిట్లకు గాను 435 దరఖాస్తులు చేసుకున్నారు. అయితే యాసంగిలోనే రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందించాల్సి ఉంది. ఈ క్రమంలోనే దరఖాస్తుదారులు కొందరు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయలేదు. ప్రస్తుతం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. యంత్ర పరికరాలు అందించకుండా జాప్యం చేస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో రైతులకు యంత్ర పరికరాలను అందించాలని కోరుతున్నారు. త్వరలో అందజేస్తాం.. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అర్హులైన రైతులకుఅందజేస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పరికరాలతో వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు. దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
నిబంధనలకు విరుద్ధంగా..
అన్ని విద్యాసంస్థలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల భర్తీని ప్రభుత్వం చేపడుతుంది. అందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో పాటు యూనివర్సిటీలకు కూడా ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో స్కావెంజర్ పోస్టు నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు సిబ్బందిని నియమించాలంటే తప్పకుండా పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మెరిట్ మార్కులు, తదితర స్కిల్స్కు సంబంధించి సర్టిఫికెట్, రిజర్వేషన్ తదితర అంశాల ఆధారంగా రోస్టర్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి పాయింట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అనంతరం ఎంపిక చేసిన వారిని ఏజెన్సీలకు అప్పగించి ఆర్డర్స్ ఇస్తారు. కానీ, యూనివర్సిటీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు కేవలం ఏజెన్సీలు తీసుకువచ్చి చూపించిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం కొసమెరుపు. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ద్వారా కూడా సీనియార్టీ ఆధారంగా కూడా భర్తీ చేసే విధానం ఉంది. -
అడ్డగోలుగా నియామకాలు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో అధికారులు అడ్డగోలుగా సిబ్బంది నియామకం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్, పత్రికా ప్రకటన, రోస్టర్ విధానం వంటి ప్రక్రియలు చేపట్టకుండా నేరుగా సిబ్బందిని పైరవీల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గద్వాల పీజీ సెంటర్, కొల్లాపూర్ పీజీ సెంటర్, పీయూతో పాటు సుమారు 35 నుంచి 36 మంది వరకు సిబ్బందిని వివిధ ఏజెన్సీల ద్వారా నియమించినట్లు సమాచారం. ఇందులో కుక్, హెల్పర్, కేర్ టేకర్, వాచ్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. నేరుగా ఏజెన్సీల ద్వారా వీరిని నియమించడంతో ఏజెన్సీలకు పలువురు మధ్యవర్తులుగా ఉండి తమకు కావాల్సిన వారిని చేర్పించారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సిబ్బంది నుంచి డబ్బులు సైతం వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లిస్తూ.. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి వసతులు కల్పిస్తూ నియమించే ఉద్యోగాలకు బయటి వ్యక్తులు, ఏజెన్సీలు నియమించుకోవడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని నియమించిన తర్వాత ఆర్డర్లు సైతం ఇవ్వకుండా అధికారుల వద్దే పెట్టుకొని.. నేరుగా వేతనాలు ఇస్తున్నారు. ఉన్న వారికి జీతాలేవీ? పీయూలో పనిచేస్తున్న 42 మంది పార్ట్టైం లెక్చరర్లకు కొన్ని నెలలుగా పూర్తిస్థాయిలో వేతనాలు అందడం లేదు. పని ఒత్తిడి తగ్గించడంతో వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలల వేతనాలు ఇవ్వలేదు. దసరా, దీపావళి పండగలకు సైతం వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు సెక్యూరిటీ సిబ్బందికి సైతం రెండు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా 10 రోజుల క్రితం ఒకనెల వేతనం రూ.10 వేలు ఖాతాలో జమచేశారు. గతంలో రూ.11 వేలు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.వెయ్యి తగ్గించి ఇవ్వడాన్ని సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనం పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో పైరవీలకు పెద్దపీట ఇటీవల గద్వాల పీజీ సెంటర్లో 14, కొల్లాపూర్ సెంటర్లో 11 మంది నియామకం యూనివర్సిటీలోనూ 9 మంది వరకు అవకాశం.. ఎలాంటి ప్రకటనలు, రోస్టర్ విధానం లేకుండా చేపట్టడంపై విమర్శలు మధ్యవర్తులు చెప్పిన వారికే ఉద్యోగాలు? ఎక్కడెక్కడ ఎంత మంది.. మూడు నెలల క్రితం గద్వాల పీజీ సెంటర్లో బాలికలు, బాలుర హాస్టళ్లను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు హాస్టళ్లకు సంబంధించి ఇద్దరు కుక్, ఇద్దరు హెల్పర్, ఒక కేర్ టేకర్, 9 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. అలాగే కొల్లాపూర్ పీజీ సెంటర్లో 9 మంది సెక్యూరిటీ సిబ్బంది, కేర్టేకర్, కుక్, హెల్పర్ ఒక్కొక్కరిని నియమించారు. అయితే ఈ ప్రక్రియలో పలువురు మధ్యవర్తులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు పీయూలో కేర్టేకర్లు, కుక్లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. ఇందులో ఓ మహిళా అధికారి ప లువురు సిబ్బందిని నియమించేందుకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. పలువురు సిబ్బందితో డబ్బులు తీసుకోవడంతో పాటు భవిష్యత్లో నియమించే పోస్టులకు సైతం ముందస్తు ఒప్పందాలను సదరు మహి ళ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఏజెన్సీ లో పనిచేసే మరో వ్యక్తి సైతం సిబ్బంది ని యామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ వీసీ, రిజిస్ట్రార్లకు తెలిసినా వారికే మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. -
ఏజెన్సీలే భర్తీ చేస్తాయి..
అవసరాల మేరకు కొల్లాపూర్, గద్వాలతో పాటు పలువురు సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నాం. గురుకులాలు ఇతర సంస్థలలో నియామకాలు ఎలా చేపడుతున్నారో తెలియదు కానీ యూనివర్సిటీల్లో మాత్రం ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఏజెన్సీలే భర్తీ చేస్తాయి. అందుకు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ అర్హత లేని వారిని తీసుకుంటే తొలగిస్తాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ విచారణ చేపట్టాలి.. ఏ ప్రభుత్వ సంస్థల్లో చేపట్టని విధంగా పీయూలో నియామకాలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో నేరుగా భర్తీ చేపట్టిన ఏజెన్సీలను రద్దు చేయాలి. మధ్యవర్తులుగా వ్యవహరించి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నియామకాలపై కమిటీతో విచారణ చేపట్టాలి. – రాము, ఏఐఎస్ఎఫ్ నాయకులు● -
గుప్పుమంటున్న గంజాయి
నారాయణపేట: జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. యువతే లక్ష్యంగా వీరు అమ్మకాలు చేపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి జిల్లాకు రైళ్లలో గుట్టుగా గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గంజాయి తరలింపు, వినియోగాన్ని అరికట్టేందుకు ఇటు పోలీసులు, అటు ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి విక్రయదారులను పట్టుకుంటున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. దీంతో యువతతో పాటు మైనర్లు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. గంజాయి, డ్రగ్స్ను పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని ప్రభుత్వ సంకల్పంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ఇటీవల విస్తృత దాడులు చేశారు. పలువురిని పట్టుకోవడంతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని 14 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక టీంలతో సరిహద్దులో నిఘా జిల్లాకు సరిహద్దులో కర్ణాటక ఉండడంతో అటు నుంచే గంజాయి తరలిస్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ వినిత్ గంజాయి విక్రయాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ఓ ప్రత్యేక టీంను ఏర్పాటుచేశారు. జిల్లా పరిధిలోని మక్తల్లో కృష్ణా చెక్పోస్టు, నారాయణపేటలో జలాల్పూర్ చెక్పోస్టు, దామరగిద్దలో కానుకుర్తి చెక్పోస్టు, ఊట్కూర్లో సంస్థపూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. అయినా సరిహద్దులు దాటి తెలంగాణలోకి గంజాయి వస్తుండడంతో పోలీసులకు మరింత సవాల్గా మారింది. దామరగిద్ద మండలంలోని సజానాపూర్, మాగనూర్ మండలంలోని ఉజ్జెలి, కృష్ణా మండలంలోని చేగుంటా, కున్షి, హిందూపూర్, నారాయణపేట మండలంలోని ఎక్లాస్పూర్, ఊట్కూర్ సమీపంలోని ఇడ్లూర్, కొల్లూర్ గ్రామాలు సైతం కర్ణాటకకు సరిహద్దులో ఉన్నాయి. ఆ మార్గాల గుండా గంజాయిని తీసుకువస్తుండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇదిలాఉండగా, ధన్వాడకు అటు హైదరాబాద్లోని దూల్పేట నుంచి, ఇటు ముంబాయి నుంచి గంజాయి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మండలంలోని పలు తండాల నుంచి ముంబాయికి వలస వెళ్లే వారు తిరిగి తమ ప్రాంతాలకు వచ్చే సమయంలో అక్కడ గంజాయికి అలవాటు పడిన యువత తమ వెంట గంజాయి తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గంజాయి కేరాఫ్ యాద్గీర్, షోలాపూర్ కర్ణాటకలోని యాద్గీర్, మహారాష్ట్రలోని షోలాపూర్ గంజాయికు కేరాఫ్గా దందా కొనసాగుతున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో పది మంది పట్టుబడిన వారిలో షోలాపూర్, యాద్గీర్కు చెందిన వారు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉండే అశోక్నగర్లో ఉండే ఓ యువకుడు గత రెండేళ్లుగా గంజాయి వ్యాపారం చేసి ఇటీవల పట్టుబడడం.. తీగలాగితే డొంక కదలింది. గంజాయి రాకేట్లోని మరో తొమ్మిది మందిని పోలీసులు పట్టుకొని జిల్లా ఎస్పీతో శభాష్ అనిపించుకున్నారు. కర్ణాటకలోని యాద్గీర్, మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి గుట్టుగా తరలింపు ఎకై ్సజ్, పోలీస్శాఖ ప్రత్యేక నిఘా.. విస్తృత దాడులు పదుల సంఖ్యలో కేసులు నమోదు జిల్లాలో ఎకై ్సజ్శాఖ దాడుల్లో పలు గంజాయి కేసులు నమోదుఅయ్యాయి. కృష్ణా మండలంలోని కున్సిలో ఇద్దరిపై, మూరారిదొడ్డిలో ఒకరు, దామరగిద్ద మండలంలో ఒకరిపై కేసులు నమోదు అయ్యాయి. మాగనూర్ మండలంలోని కొత్తపల్లిలో ఒకరు, చందాపూర్లో మస్తీపూర్కు చెందిన వ్యక్తి, సింగారం చౌరస్తాలో గుర్మిట్కల్ తాలూకా గుంజనూర్కు చెందిన వ్యక్తి ఒకరు పట్టుబడ్డారు. అదే విధంగా పోలీసు శాఖ దాడుల్లో 8 కేసులు నమోదు అయ్యాయి. ఊట్కూర్ మండలంలోని ఎడవేళ్లిలో ఊట్కూర్ పీఎస్ పరిధిలో 400 గ్రాములు గంజాయి, గంజాయి మొక్కలు పట్టుబడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అలాగే, కృష్ణా మండలంలో 500 గ్రాముల గంజాయి ఒక ప్లాంట్ పట్టుబడడంతో ఒకరిపై, ధన్వాడ పీఎస్ పరిధిలో 50 గ్రాముల పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు చేశారు. మక్తల్ పీఎస్ పరిధిలో 500 గ్రాముల గంజాయి పట్టుబడడంతో ముగ్గురిని అరెస్టు, మద్దూర్ పీఎస్ పరిధిలో 1.3 కేజీ డ్రై గంజాయి, 89 ప్లాంట్స్ పట్టుబడడంతో ఒకరిపై కేసు నమోదు అయింది. గత ఆగస్టు 15న ఊట్కూర్ శివారులో గంజాయి విక్రయిస్తూ 125 గ్రాములతో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. నవంబర్ 2 కృష్ణా పీఎస్ సరిహద్దులో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 12.4 కిలోల గంజాయి పట్టబడడం గమనార్హం. -
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతుగణన–2026కు సిద్ధం
● జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగనున్న ప్రక్రియ ● ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం ● స్వచ్ఛంద సంస్థల వలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 22తో ముగియనున్న స్వీకరణ గడువు అచ్చంపేట: రాష్ట్రంలో పులుల సంఖ్య తెల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి.. రాష్ట్రస్థాయిలో అటవీశాఖ ప్రతి ఏటా జంతుగణన చేపడుతోంది. ఇందులో భాగంగా నల్లమలలో పులుల లెక్కింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఈసారి పులుల గణన–2026లో పాల్గొనేందుకు ఆసక్తి గల స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, జంతు ప్రేమికులు, ఔత్సాహిక యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18– 60 ఏళ్ల వయసు కలిగి.. రోజూ అడవి మార్గంలో 10– 15 కి.మీ., వరకు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం కావడంతో ఎలాంటి పారితోషికం ఇవ్వరు. అవసరమైన వసతి, రవాణా సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది. వచ్చే జనవరి 17 నుంచి 23వ తేదీ వరకు అమ్రాబాద్ (నల్లమల) అభయారణ్యంలోని 220 అటవీ బీట్లలో పులుల గణన చేపట్టనున్నారు. ఈసారి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వన్యప్రాణుల గణనను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పులులతోపాటు ఇతర శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రతి వలంటీర్ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో కాలినడకన నడుస్తూ.. పులుల జాడలు, పాదముద్రలు, మల విసర్జితాలు, ఇతర అవశేషాలను సేకరించి జంతువుల గణన చేపడతారు. ఈ లెక్కల ఆధారంగానే భవిష్యత్లో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గణన జరుగుతుంది. ప్రతి బీట్కు ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున లెక్కింపులో పాల్గొంటారు. అమ్రాబాద్ అభయారణ్యంలోని 11 రేంజ్ల పరిధిలో 220 బీట్లలో పులుల లెక్కింపునకు అటవీశాఖ సిబ్బంది 150 మందితోపాటు మరో 50 మంది వాచర్లు ఉన్నారు. వీరితోపాటు సుమారు 460 మంది వలంటీర్లు అవసరమవుతారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 700 పైగా వచ్చాయి. వీటిలో అర్హత మేరకు వలంటీర్లను తీసుకుంటారు. దేశంలోని 50 పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ 45వ స్థానంలో ఉండగా.. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఇక్కడ పులుల అభయారణ్యం 2,611.39 చదరపు కి.మీ., మేర విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చదరపు కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చదరపు కి.మీ.. బఫర్ జోన్. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అడవులను అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా పరిగణిస్తారు. అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట, అచ్చంపేట, లింగాల, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, కంబాలపల్లి, నాగార్జునసాగర్ రేంజ్లను 270కి పైగా బీట్లుగా విభజించి గణన చేపడుతున్నారు. కెమెరా ట్రాప్ ద్వారా సేకరించిన ప్లగ్ మార్కులు, గుర్తులను అక్కడికక్కడే ఎకనామికల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. పులుల మనుగడకు ఆవశ్యకతగా ఉండే శాఖాహార జంతువుల సంఖ్య పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనే వివరాల మేరకు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర కీలకం. ఒకప్పుడు కేవలం మూడు పులులకు నిలయంగా ఉన్న ఏటీఆర్లో ఇప్పుడు వాటి సంఖ్య 36కు పెరిగింది. 2017 వరకు కూడా పులుల సంఖ్య అరకొరగానే ఉండేది. అమ్రాబాద్ అభయారణ్యంలో కేవలం 10 పులులే ఉండేవి. అమ్రాబాద్ పులుల అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించి.. వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫలితంగా ఆరేళ్లలో అమ్రాబాద్లో పులుల సంఖ్య 36కు పెరిగింది. నల్లమల అటవీ ప్రాంతం పెద్ద పులులకు పుట్టినిల్లుగా మారుతోంది. 200పైగా పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) ఉంది. ఇక్కడ ఆరేళ్లుగా పులుల సంతతి పెరుగుతోంది. 2017 లెక్కల ప్రకారం 6 పులులు ఉండగా.. 2024– 25 జూలై వరకు 36కు పెరిగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని పులి కూనలతో కలిసి సంచరిస్తున్న ఫరాహా ఎఫ్–6 ఆడపులి, ఫరాహా ఎఫ్–6, తారా ఎఫ్–7, భౌరమ్మ ఎఫ్–18, ఎఫ్–26, ఎఫ్–53 ఆడపులులు వాటి సంతతి పెంచేందుకు తోడ్పడటంతోపాటు నల్లమలలో జీవవైవిధ్యానికి పాటుపడుతున్నాయి. ఈసారి పులులు, ఇతర జంతువుల గణన పకడ్బందీగా కొనసాగుతుంది. గతంలో అరకొర సిబ్బందితో చేపట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు అటవీ సిబ్బంది 150 మందితోపాటు సమర్థవంతంగా పనిచేసే 50 మంది వాచర్లు ఉన్నారు. అలాగే వలంటీర్ల కోసం ఆన్లైన్లో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ, పులులపై అవగాహన కలిగిన అర్హులు, పనితీరు మెరుగ్గా ఉన్న యువతను వలంటీర్లుగా తీసుకుంటాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్● -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
దామరగిద్ద: వరి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు విండో అధ్యక్షుడు ఈదప్ప సమక్షంలో ఆదివారం మండలంలోని పిడెంపల్లి, మల్రెడ్డిపల్లి, కాన్కుర్తి గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం సేకరించి సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బాల్రెడ్డి, ఈదప్ప, శ్రీనివాస్, ఖాజామియా, వెంకట్రామారెడ్డి, నీలిమాణిక్యప్ప, శ్రీనివాస్, టి రఘు, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
విస్తృతంగా వాహనాల తనిఖీలు
నారాయణపేట రూరల్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం గూడ్స్ వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పట్టవా..? అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షిశ్రీలో ఫొటో వార్త ప్రచురితమవగా.. పోలీసు శాఖ స్పందించింది. గూడ్స్ వాహనాల్లో సరుకు రవాణాను బదులు ప్రమాదకర పరిస్థితుల్లో జనాలను తీసుకు వెళ్లడం, ప్యాసింజర్ ఆటోల్లో సైతం పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం, బడిఈడు పిల్లలను పనులకు తీసుకుని వెళ్లడం వంటి వాటిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నారాయణపేట రూరల్ పోలీసులు ఎస్ఐ రాముడు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి 8 వాహనాలపై జరిమానా విధించారు. అదేవిధంగా పలువురు కూలీలు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, ప్రమాదాలకు కారణాలు తెలియచేశారు. సురక్షిత ప్రయాణానికి ప్రతిఒక్కరు సహకరించాలని, పునరావృతం అయితే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
బీటీ రహదారి నిర్మించాలి..
నందిమళ్ల క్యాంపుకాలనీ నుంచి రేవులపల్లి వరకు కొత్తగా బీటీ రహదారి ని ర్మించాలి. రహదారికి తా త్కాలిక మరమ్మతు చేస్తే చిన్నప ాటి వర్షాలకే మ రోమారు దెబ్బతినే అవకాశం ఉంది. అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తు పక్కాగా చేపట్టాలి. – వెంకటేష్, నందిమళ్ల రూ.30 లక్షలతో మరమ్మతు.. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ పరిధిలోని మొత్తం 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి మరమ్మతుకు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. వెంటనే టెండర్లు ఆహ్వానించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – ఖాజా జుబేర్ అహ్మద్, ఈఈ, గద్వాల -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కోస్గి: మండలంలోని సర్జఖాన్పేట సబ్ స్టేషన్లో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా సోమవారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోగాపూర్, పోతిరెడ్డిపల్లి, సర్జఖాన్పేట, హకీంపేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి మద్దూరు: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఎస్ఐ విజయ్కుమార్ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై, వాహన పత్రాలు, హెల్మెట్ వినియోగం, మధ్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని సూచిస్తూ అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ భద్రత మనందరి బాధ్యతగా ఆటో డ్రైవర్లు ఎల్లపూడూ జాగ్రత్తంగా వాహనాలు నడపాలని అదేశించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆటో డ్రైవర్లు, పోలీసులు పాల్గొన్నారు. ఘనంగా మాతా మాణికేశ్వరి వార్షికోత్సవం నారాయణపేట రూరల్: జిల్లా కేంద్ర సమీపంలోని పగడిమారి రోడ్డులోని సద్గురు రూపరహిత అహింసా యోగేశ్వరి వీరధర్మజ మాతా మాణికేశ్వరి ఏడో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణం, గోమాత పూజ, నాగ సింహాసన అభిషేకం, అమ్మవారి పాదుకల అభిషేక పూజలు, మహా గాయత్రి యజ్ఞము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మంగళహారతి, మహిళలచే ఓంకారం త్రిశూలాకార కార్తీక దీపాలంకరణోత్సవం, తీర్థ ప్రసాద, అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాత ఆశ్రమ కమిటీ సభ్యులు మందార, లత, శివరాంరెడ్డి, రాజేశ్వరి, వాల్వేకర్ నికేతన్, దశరథ్, విటల్ బిలాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జూరాల రహదారికి మోక్షం
●అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రహదారి మరమ్మతులకు పీజేపీ అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నందిమళ్ల క్యాంపు నుంచి ప్రాజెక్టు మీదుగా గద్వాల, రాయచూర్ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది తమ వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. వీటితోపాటు జూరాల ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు సైతం వస్తుంటారు. 4.50 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాజెక్టు ప్రధాన రహదారి గుంతలుపడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు రహదారిపై గద్వాలకు వెళ్తుండటంతో అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పీజేపీ అధికారులు.. నేటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులకు పూనుకోకపోవడంతో రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడం.. మరమ్మతుకు నోచుకోవడంతో రాకపోకల కష్టాలు తొలగిపోనున్నాయి. అడుగుకో గుంత.. పీజేపీ నందిమళ్ల క్యాంపు నుంచి రేవులపల్లి వరకు జూరాల జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. అడుగడుకో గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల చిన్న గుంతలు, మరికొన్ని చోట్ల రహదారి మధ్యలో భారీ గుంతలు ఏర్పడటంతో రాకపోకల సమయంలో వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని భారీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు ఎదురుగా వస్తున్న ద్విచక్ర, ఆటోలను తప్పించబోయి ప్రమాదాల బారినపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టు రూపురేఖలు మారుతాయని ఈ ప్రాంత ప్రజల ఆశలు నేటికీ పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతున్నాయి. ప్రస్తుతం రహదారి మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుకు రూ.30 లక్షలు మంజూరు బాగుపడనున్న 4.50 కిలోమీటర్ల రోడ్డు టెండర్ల ఆహ్వానానికి సిద్ధమవుతున్న అధికారులు తీరనున్న ప్రయాణికుల కష్టాలు కుడి, ఎడమ కాల్వల పరిధిలో.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రహదారి పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు సైతం వ్యయ ప్రయాసాలకోర్చి రాకపోకలు సాగించే దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎడమ కాల్వ వద్ద చేప వంటకాల విక్రయ కేంద్రాలు ఉండటంతో పర్యాటకులతో పాటు చేప వంటకాలు ఆరగించేందుకు ప్రజలు రోజు వేలాదిగా సొంత వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. వాహనాలన్నీ కాల్వ సమీపంలోని ప్రధాన రహదారిపై నిలుపుతుండటంతో వచ్చి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు
జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్సీలు, జిల్లా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, పోలీసులు, మహిళా సంఘాలు, కార్మికులు ఉండే ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన కూడలిలలో జిల్లా వైద్య శాఖ తరపున ఆరోగ్య కార్యకర్తలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా కృత్రిమ మానవ దేహంతో సీపీఆర్పై అవగాహన కల్పించారు. గుండెపోటు రాకుండా చేపట్టాల్సిన చర్యలతో పాటు గురైనప్పుడు తక్షణమే సీపీఆర్ ఎలా చేయాలనే అంశంపై వివరించారు. అదేవిధంగా నైపుణ్యం కలిగిన వైద్య బృందం మాన్ క్వీన్స్, వీడియో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. -
నిబంధనలు పట్టవా.. ?
బడిఈడు పిల్లలతో పని చేయించొద్దు.. వాహనాల్లో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.. అని ఎన్ని నిబంధనలు ఉన్నా కొందరికి అవేవి పట్టట్లేదు. నెల రోజులుగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో బాలలను పత్తి ఏరడానికి తీసుకొని వెళ్లడం పరిపాటిగా మారింది. తాజాగా రెండో శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పిల్లలను వ్యవసాయ పనులకు తీసుకెళ్లడం కనిపించింది. నారాయణపేట మండలం శ్యాసన్పల్లి నుంచి ఊట్కూరు మండలం తిప్రాస్పల్లికి వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ శనివారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. అలాగే, జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ను దాటుతూ మరో వాహనంలో ఇలా కూలీలను, పిల్లలను ప్రమాదకరంగా తీసుకువెళ్లడం కనిపించింది. ఇప్పటికై నా పోలీసులు గుర్తించి ప్రమాదకరంగా పిల్లలను తీసుకెళ్తున్న వారిపై, వారితో పనిచేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – నారాయణపేట రూరల్ -
వెలుగులోకి స్థానిక చరిత్ర..
మన ఊరు – మన చరిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఔత్సాహిక చరిత్ర పరిశోధకుల బృందం పలు పురాతన గ్రామాలను ఎంచుకుని క్షేత్రస్థాయిలో పరిశోధన చేపట్టింది. ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది.. గ్రామానికి ఉన్న చారిత్రక మూలాలేంటి, గ్రామ భౌగోళిక, నైసర్గిక స్వరూపం, పురాతన ఆలయాలు, కట్టడాలు, చెరువులు, కొండల వంటి వివరాలు తెలుసుకుని గ్రామ చరిత్రను తెలుసుకున్నారు. గ్రామంలోని పురాతన ఆలయాలు, గడీలు, నాటి చరిత్ర, ఆనాటి సామాజిక పరిస్థితులను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. -
ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
విద్యాశాఖ టీచర్లకు ఎన్నో రకాల కొత్త రకమైన బోధనకు తరచు శిక్షణలు ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆయుధం సీపీఆర్ పై ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామంలో తప్పకుండా పాఠశాల ఉంటుంది. అక్కడ టీచర్లు పనిచేస్తున్నారు. ఏ గ్రామంలోనైనా గుండెపోటు సంబంధిత ఇబ్బందులు వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. స్థానికంగా ఉండే టీచర్ల సహాయంతో సీపీఆర్ చేయగలిగితే కొంతవరకు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. – మోల్గన్ జనార్ధన్, ఉపాధ్యాయుడు, షేర్నపల్లి అందరూ నేర్చుకోవాలి ఆరోగ్య సమస్య వచ్చిన ప్రతి చోట వైద్యులు అందుబాటులో ఉండరు. ద గ్గరలోని ఆసుపత్రికి తీ సుకుని వెళ్లడానికి నిమిషాలు, గంటల సమ యం పడుతుంది. అంతలోపు ప్రథమ చికిత్స, సిపిఆర్ వంటి సేవలపై అవగాహన కలిగి ఉంటే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. యువత, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా శిక్షణ పొందాలి. – డాక్టర్ విరోజ, ఆరోగ్య ఉప కేంద్రం, చిన్నజట్రం ● -
నేడు మాణికేశ్వరి మాత ఆశ్రమంలో వేడుకలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్ర సమీపంలోని పగిడిమర్రి రోడ్డులో వీరధర్మజ మాణికేశ్వరి మాత ఆశ్రమం సప్తమ వార్షికోత్సవ వేడుకలను ఆశ్రమంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సప్తమ వార్షికోత్సవ పూజా కార్యక్రమం, ధ్వజారోహణం, గోమాత పూజ, నాగ సింహాసన అభిషేకం, అమ్మవారి పాదుకల అభిషేకం, మహా గాయత్రి యజ్ఞం, మహా మంగళ హారతి, కార్తీక దీపోత్సవం, తీర్థ ప్రసాద, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మహిళా చైతన్యంతోనే సమాజాభివృద్ధి నారాయణపేట రూరల్: మహిళలు చైతన్యవంతం కావడం వల్లనే సమాజం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని గుడిపల్లి మంజుల అన్నారు. సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సప్తశక్తి సంఘం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ శక్తి రూపమని, ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మహిళల భాగస్వామ్యం అవసరమన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో సైతం వీరనారుల పోరాటం వెలకట్టలేనిది అన్నారు. కుటుంబంలో మహిళ పాత్ర ఎంతో విలువైనదని, సమాజ అభివృద్ధికి వారి ప్రోత్సాహం ఎంతో అవసరమని సూచించారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని, అందుకు ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు. అదేవిధంగా విదేశీ వస్తువులను విడనాడి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. అనంతరం ప్రతిభా మూర్తులైన మహిళలు భారతమ్మ, డాక్టర్ దీపికా శెట్టి, దండు రాములమ్మను సన్మానించారు. అంతకుముందు చిన్నారులతో వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య గౌడ్, సీతారాములు, ఎల్లప్ప, సంగీత, శిరీష, ఉమా, పద్మజా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో ప్రతిభ చాటాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఎస్ఎంపీ స్కూల్లో శనివారం నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి సబ్ జూని యర్, జూనియర్ యోగాసన పోటీలకు ఉమ్మ డి జిల్లా క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను కురుమూర్తిగౌడ్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం కార్యదర్శి ఆర్.బాల్రాజు, భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధి జి.పాండురంగం, యోగ సంఘం సభ్యులు సూర్యప్రకాశ్, కిషన్దాస్, వెంకటేశ్, బాలమణి పాల్గొన్నారు. ● 8–10 ఏళ్ల విభాగంలో అరుణ్, అరవింద్సాయి, యుగంధర్, సంజయ్, ప్రశాంత్ ఆర్య, వైష్ణవి, శ్రీరాఘవి, అర్చన, ప్రియ, అద్వేత, 10–12 విభాగంలో సంపత్కుమార్, శ్రీప్రసాద్, గౌతమ్, హరికృష్ణ, ఉదయ్కుమార్, దీపిక, క్రిష్ణవేణి, మనస్విని, మోక్షిత, రూప, 12–14 విభాగంలో చరణ్, రంజిత్కుమార్, విఘ్నేష్, సృజన్ కుమార్, జయచంద్ర, ధనలక్ష్మి, స్వప్న, నవిత, నయనశ్రీ, వైష్ణవి, 14–16 విభాగంలో శివతేజ, బాలు, సుశీల్కుమార్, సాగర్, కార్తీక్, జె.వైష్ణవి, నందిని, ప్రవళిక, రూపలత, దీపిక, 16–18 విభాగంలో తిరుపతి, చైతన్య, వంశీ ఎంపికయ్యారు. ఆర్ఎన్ఆర్ ధర రూ.2,156 దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,156, కనిష్టంగా రూ.1,936గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,739గా ధరలు నమోదయ్యాయి. సీజన్ కావడంతో మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
చారిత్రక వైభవం..
గ్రామాల్లో పర్యటించి పరిశోధన ద్వారా తెలుసుకున్న చరిత్రకు భావితరాలకు అందించేందుకు పుస్తకాలు, రచనలు, డాక్యుమెంట్ల రూపంలో వెలుగులోకి తేవాల్సి ఉంది. అయితే రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. ఇది పూర్తిగా ప్రొఫెసర్లు, డిగ్రీ విద్యార్థులు, ఔత్సాహిక పరిశోధకులు స్వచ్ఛందంగా చేపట్టాల్సి రావడంతో చాలావరకు గ్రామాల పర్యటన, చరిత్ర పరిశోధన ఆశించినంత సాగడం లేదు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, భావితరాలకు అందించేలా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, నాగర్కర్నూల్: మీ గ్రామానికి ఆ పేరెలా వచ్చింది..? ఎన్ని ఏళ్ల కిందట గ్రామంగా ఏర్పడింది. అంతకు ముందు ఆ గ్రామం ఏ పేరుతో ఉండేది? ఇలాంటి విషయాలపై ఎప్పుడైనా ఆలోచించారా? పురాతన చారిత్రక ఆనవాళ్లు ఉన్న గ్రామాలు, వాటి నేపథ్యం, గ్రామాల చరిత్రలో నెలకొన్న ఆసక్తికరమైన అంశాలపై ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రయత్నాలను మొదలుపెట్టింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు – మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖమైన, పురాతన ఆనవాళ్లు ఉన్న గ్రామాలను ఎంచుకుని ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి, గతంలో ఎలాంటి చరిత్ర ఉండేది అన్న ఆధారంగా అధ్యయనం కొనసాగింది. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల చరిత్రలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా కొత్త విషయాలు తెలిశాయి.. మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా చాలా వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేపట్టాం. పలుగ్రామాల చరిత్ర పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో మనకు తెలియని కొత్త చరిత్ర బహిర్గతమవుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులు, వివక్ష తదితర అంశాలు తెలుస్తున్నాయి. – పెబ్బేటి మల్లికార్జున్, ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్) నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన కట్టడాలు మన ఊరు మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా వెలుగులోకి కొత్త చరిత్ర స్థానికంగా ఉన్న చరిత్ర బాహ్య ప్రపంచంలోకి.. గ్రామాల పేర్లు, కట్టడాలు, శాసనాల ఆధారంగా పరిశోధన అందరికీఅందుబాటులోకి తెస్తేనే.. -
ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం తగదు
మాగనూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని, మరోసారి ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. మాగనూర్ మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి 15వ సామాజిక తనిఖీ ప్రజావేదిక శనివారం(రెండవ రోజు) ఎంపీడీవో కార్యాలయం అవరణలో ఎంపీడీవో శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. మొదటి రోజు కార్యక్రమం రాత్రి సమయంలో నిర్వహిస్తున్నారనే విమర్శలు రావడంతో వాయిదా వేసి రెండవ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా డీఆర్డీవో అధికారి మొగులప్ప పాల్గొన్నారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు జరిగిన పనులకు రూ.2.90 కోట్లు ఖర్చు చేసిన దానిపై ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. అనంతరం డీఆర్డీవో మొగులప్ప మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పనుల సంబంధించి అన్ని శాఖల అధికారుల ఆలసత్వం కలిపిస్తుందని అన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులకు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు సీనియర్ మేటీలకు జరిమానా విధించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 పనులకు సంబంధించి మొత్తం రూ.లక్ష రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబ సభ్యులు, కూలీలు పనులు చేసినట్లు వారి అకౌంట్లో డబ్బులు వేయించి, ఎఫ్ఏలు, సీనియర్మేటీలు తీసుకున్నట్లు తెలిసిందని, వీటనింటిపై అధికారులు విచారణ చేయాలని ఆదేశించారు. ఇలా అవినితికి పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల కేంద్రంలోని పనుల్లో సీనియర్ మేటి పలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి రూ.65 వేలు రికవరీకి అదేశించారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగినప్పటికి అధికారులు రికార్డులు మెయింటెన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓబ్లాపూర్లో ఒకే కుటుంబంలో ఇద్దరు మైనర్లకు జాబ్కార్డు జారీ చేసి వారితో పని చేయించినట్లు తనిఖీ బృందం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ఓబ్లాపూర్లో ఎంపీడీవో సంతకం లేకుండానే నగదు కూలీల అకౌంట్లో జమ చేసినట్లు తేలింది. విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్ఆర్పీ రాజు, జిల్లా విజిలెన్స్ అధికారి గోపాల్యాదవ్, ఎపీఓ మన్యం తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్ చేద్దాం.. జీవం పొద్దాం
తక్షణం స్పందిస్తే ప్రాణం నిలబెట్టినట్లే ● జిల్లాలో పూర్తి అయిన వారోత్సవాలు ● ముమ్మరంగా అవగాహన సదస్సులు నారాయణపేట రూరల్: వయస్సుతో సంబంధం లేకుండా ఏటా గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ సీపీఆర్ (కార్డియో పల్మొనరి రిససిటేషన్) పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా సీపీఆర్ వారోత్సవాలను నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహించింది. ప్రయోజనాలు ఎన్నో.. వివిధ కారణాలతో గుండె ఆగిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, వైద్య సదుపాయం అందేలోపు సీపీఆర్ చేయడం ఎంతో అవసరం. తద్వారా మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ కలిగిన రక్తం తాత్కాలికంగా సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు దెబ్బతినకుండా ఉంటుంది. తక్షణమే సీపీఆర్ చేయడం వల్ల బాధితులను ప్రాణహాని నుంచి కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి అన్ని అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఆక్సిజన్ అందకపోతే మెదడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ తట్టుకోదు. ఈ లోపల సీపీఆర్ చేపడితే గుండె కొట్టుకునేలా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందించేందుకు మెదడు రక్తప్రసరణ ప్రక్రియను చేపడుతుంది. ఈ ప్రక్రియకు మొదటి నాలుగు నిమిషాలు ఎంతో కీలకం అవుతుంది. కొద్దిపాటి అవగాహన ఉంటే ఈ ప్రక్రియను ఎవరైనా చేయడానికి వీలు కలుగుతుంది. -
ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం అండర్–14 విభాగం బాల, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. విద్యార్థులకు 100 మీ., 200 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్త్రోలో ఎంపికలు జరిగా యి. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ పంపడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అండర్–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు జరగనున్నాయి. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, జగన్మోహన్గౌడ్, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి.. వాటిలో ఎన్ని బేస్మెంట్, రూఫ్, స్లాబ్ దశల్లో ఉన్నాయి.. ఇంతవరకు ఎన్ని పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనకబడిన నర్వ, మరికల్, మక్తల్ మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ వివరణ కోరారు. అయితే ఇసుక, మొర్రం కొరత, వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం కలిగిందని వారు తెలియజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. అత్యధికంగా వర్షాలు కురిసిన ఇతర జిల్లాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, మన జిల్లాలో ఇలాంటి కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయని చెప్పడం సరికాదన్నారు. వారం రోజుల్లో నిర్మాణాలను వేగిరం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అసలు నిర్మాణాలను మొదలుపెట్టని వారి ఇళ్లను 45 రోజుల కాలపరిమితి నిబంధన ప్రకారం రద్దు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. కాగా, ఇందిరా డెయిరీ షిప్ ఫామింగ్ పథకానికి మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాలతో పాటు మద్దూరు, కోస్గి మున్సిపాలిటీల నుంచి 631 దరఖాస్తులు అందాయని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ వివరించారు. వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీఓలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అదే విధంగా బాల్యవివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప ఉన్నారు. చదువుల పండుగతోవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం చదువుల పండుగతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి పెంపొందుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చదువుల పండుగలో భాగంగా రూపొందించిన ‘కలలు కనేద్దాం.. నేర్చుకుందాం.. సాధిద్దాం’ అనే ప్రత్యేక విద్యా కార్యక్రమాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యాలు పెంపొందించడానికి చదువుల పండుగ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు. -
పేదోడి ఇంటికి ని‘బంధనాలు’
మద్దూరు: ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో అప్పులు చేసి మరీ నిర్మాణాలు ప్రారంభించారు. కానీ బిల్లుల చెల్లింపులో అధికారులు సవాలక్ష సాకులు చూపుతున్నారు. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. అటు ఇంటి నిర్మాణం పూర్తిగాక.. ఇటు పెట్టుబడి పెట్టిన డబ్బులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. జిల్లాకు 6,182 ఇళ్లు మంజూరు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు.. సర్వే నిర్వహించి మరీ అర్హులను ఎంపిక చేశారు. మొదట ఇంటి స్థలం ఉన్న వారికే అవకాశం కల్పించారు. జిల్లాలోని 13 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో మొత్తం 6,182 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు 4,594 ఇళ్లకు మార్కింగ్ వేసి పనులను ప్రారంభించారు. అయితే కేవలం 5 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు బిల్లులను నిలిపివేశారు. దీంతో ఆయా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నిబంధల ప్రకారంనిర్మించుకోవాలి.. జిల్లాలో నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు వెంటనే వస్తున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి ప్రస్తుతం బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 600 అడుగుల చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. ఇవి కొడంగల్ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. – శంకర్నాయక్, హౌసింగ్ పీడీ బిల్లులు రాక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అవస్థలు గతంలోనే ఇల్లు మంజూరైందని.. సరైన పత్రాలు లేవంటూ సాకులు ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారుల బేజారు అసంపూర్తిగా నిలిచిపోతున్న పనులు జిల్లాలో కేవలం ఐదు నిర్మాణాలు మాత్రమే పూర్తి -
మార్కెట్కు పోటెత్తిన ధాన్యం
దేవరకద్ర: వానాకాలం పంటల దిగుబడి ప్రారంభం కావడంతో గురువారం దేవరకద్ర మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు కోతలు కోసిన వరి ధాన్యాన్ని అమ్మకానికి తేవడంతో మార్కెట్ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. కోయిల్సాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పూర్తిస్థాయిలో వరి పంట సాగు చేశారు. అలాగే బోరు బావులు, చెరువుల కింద వేసిన పంటలు కూడా ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్, అడ్డాకుల, మూసాపేట మండలాల నుంచి దేవరకద్ర మార్కెట్కు రైతులు ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. మార్కెట్కు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. మధ్యాహ్నం జరిగిన టెండర్లలో సోనామసూరి క్వింటాల్కు గరిష్టంగా రూ.2,109, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. అలాగే ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,169, కనిష్టంగా రూ.1,900, హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,720 చొప్పున వచ్చాయి. -
కాంక్రీట్ లైనింగ్ నిర్మించాలి..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన కాల్వలకు ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్ చేయలేదు. దీంతో నీటి ప్రవాహం ధాటికి మట్టి కొట్టుకుపోయి కాల్వలు తెగుతున్నాయి. డీ–29 పరిధిలో తరచుగా కాల్వలు తెగి రైతుల పొలాలు మునుగుతున్నాయి. తిమ్మరాసిపల్లి, కురిమిద్ద, వెంకటాపూర్ గ్రామాల వద్ద కాల్వ తెగి తీవ్రంగా నష్టపోతున్నాం. – పసుల గోవర్ధన్రెడ్డి, రైతు, కల్వకుర్తి కాల్వల పటిష్టానికి చర్యలు.. కేఎల్ఐ కింద కాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. కాల్వలకు గండి పడితే వెంటనే స్పందించి కట్టడి చేస్తున్నాం. అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తున్నాం. విడతల వారీగా కాల్వల పటిష్టానికి చర్యలు చేపడతాం. – విజయ్భాస్కర్రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ ●


