ప్రత్యేక కేంద్రం ఏర్పాటు..
సర్వేలో బడిబయటి పిల్లలను గుర్తించి కేజీబీవీ, ఆయా గ్రామాల పాఠశాలల్లో చేర్పించాం. మండలంలోని పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో బడి బయటి పిల్లల కోసం 45 రోజుల పాటు శిక్షణ అందించాం. 15 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఓపెన్ ఇంటర్, డిగ్రీ చదివేందుకు అవగాహన కల్పిస్తాం.
– నర్సింహులు, సీఆర్పీ, నర్వ
పాఠశాలల్లో చేర్పించాం..
జిల్లాలోని 13 మండలాల్లో జనవరిలో ప్రత్యేక సర్వే నిర్వహించి 217 మంది బడిబయటి చిన్నారులను గుర్తించాం. ఆ వివరాలను ప్రబంద్ యాప్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించాం. ఆయా పిల్లలను సీఆర్పీలు దగ్గరుండి బడిలో చేర్పించాలని సూచించాం. ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులను చేర్పించారు. బడిఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండేలా తగిన చర్యలు తీసుకుంటాం.
– విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట
●
ప్రత్యేక కేంద్రం ఏర్పాటు..


