సమకూరనున్న నిధులు
యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై ఢిల్లీలోని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట కలెక్టర్తో వీసీ నిర్వహించి నర్వ గురించి చర్చించి 12 ప్రతిపాదనలతోపాటు మరో 2 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో శ్రీపునరుత్పాదక పర్యావరణ అనుకూల ఆహారం (నర్వ కేజీబీవీలో సౌరశక్తితో పనిచేసే వంటగది) కోసం రూ.1.2 కోట్లు మంజూరు చేశారు. అలాగే స్పార్క్ స్కూల్ ప్రోగ్రాం ఫర్ ఏఐ రెడినెస్ నాలెడ్జ్ (ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల స్థాపన)కు ఆమోదం తెలిపారు.
● మండలంలో 6 అంగన్వాడీ భవనాలు, డైనింగ్హాల్ కోసం రూ.1.5 కోట్లు, మండలంలోని 3 కేంద్రాలలో ఫేర్ ప్రైస్ షాప్స్ (సూపర్ మార్కెట్ మోడల్) ఏర్పాటు కోసం రూ.3.73 లక్షలు, ఫ్రంట్లైన్ వర్కర్స్ బెస్ట్ ప్రాక్టీస్ అప్రిసియేషన్ అవార్డు కోసం రూ.2 లక్షలు, మండలంలోని 22 పాఠశాలల్లో ఏఐ డిజిటల్ ల్యాబ్తోపాటు సోలార్ కిచెన్ కోసం రూ.1.2 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.15 లక్షల నిధులు మంజూరు కానున్నాయి.


