Narayanpet District Latest News
-
బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు
● కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలి ● పాలమూరు ఎంపీ డీకే అరుణ నారాయణపేట రూరల్: గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాబోవు ఎన్నికల్లో అదే గాలికి కొట్టుకుపోతారని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. జిల్లాస్థాయిలో రెండ్రోజులుగా కొనసాగుతున్న దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీనీ కోరుకుంటున్నారని.. రాబోవు ఎన్నికల్లో అధికారంలోకి రావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శిక్షణలో నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలని, మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రంలోనే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చామని.. తెలంగాణలో కొద్దిగా కష్టపడితే తప్పకుండా రాజ్యాధికారం దక్కుతుందని, విభేదాలు వీడి బూత్స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడి వరకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజల్లో పార్టీపై ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే.. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో మొదటినుంచి బీజేపీ బలంగా ఉన్నా.. ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోతున్నాని, ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకొని సరిదిద్దుకునేందుకు కృషి చేయాలని వివరించారు. మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఒరిగిందేమీ లేదు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండ్రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని.. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువత పూర్తిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరుగుతున్న అక్రమాలను వెలికితీయాలని, గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకొని అక్కడే ధర్నాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం చేద్దామన్నారు. అనంతరం సింగారం క్రాస్ రోడ్ దగ్గర మొక్కలు నాటి నీరు పోశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరున మొక్క నాటాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, పి.శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి, లక్ష్మి, కొండయ్య, బలరాంరెడ్డి, రఘురామయ్యగౌడ్, లక్ష్మీకాంత్రెడ్డి, కంచె శ్రీనివాస్, జ్యోతి సాయిబన్న, కిరణ్, శ్వేత, మంజుల, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు. -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. సీఎంకు కృతజ్ఞతలు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. జడ్చర్లలో బహిరంగసభకు హాజరైన మహిళలు పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. -
పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత
నారాయణపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి చట్టబద్ధమైన బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం, ప్లాస్టిక్ వినియోగం పెరగడం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా కరువులు, వరదలు, వాతావరణ అసమతుల్యత వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కోర్టు ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. అనంతరం సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సాయి మనోజ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, న్యాయాధికారి మురళీధర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి కమలోద్దీన్, పుర కమిషనర్ శంకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, సీనియర్ న్యాయవాదులు మొక్కలు నాటారు. 20న జాతీయ లోక్ అదాలత్ : ఎస్పీ నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట, కోస్గి, మక్తల్ కోర్టుల పరిధిలో 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని.. రాజీ పడదగిన కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన, కుటుంబ పోషణ, వైవాహిక, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, చిన్నపాటి దొంగతనాలు, డ్రంకెన్ డ్రైవ్, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ బకాయిలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయస్థానం కల్పించిన ఈ అవకాశాన్ని క్షక్షిదారులు వినియోగించుకుని తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని కోరారు. పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. -
అదనపు బాదుడు..!
నర్వ: ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని తెలిసి మండలంలోని పలువురు రైతులు మూడు రోజుల కిందట భూముల రిజిస్ట్రేషన్ కోసం మీ సేవా కేంద్రాల్లో స్లాట్లు బుక్ చేసుకున్నారు. మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇన్చార్జ్ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో నిలిచిపోయాయి. శుక్రవారం కార్యాలయానికి రావడంతో సుమారు 40 వరకు భూ రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రావడంతో గతంలో స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు అవుతాయని అధికారులు చెప్పడంతో రైతులు తెల్ల మొహం వేశారు. అదనపు చార్జీలు చెల్లించేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్తే సైట్ రావడం లేదని చెప్పడంతో అయోమయంలో పడ్డారు. దీనిపై ఇటు అధికారులు, అటు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు స్పష్టంగా చెప్పకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
అధికారుల తప్పిదంతోనే..
ఎకరా భూమి రిజిస్ట్రేషన్కు మూడు రోజుల కిందట స్లాట్ బుక్ చేసుకుంటే అధికారుల తప్పిదం కారణంగా అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సవరణకు ముందు స్లాట్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లించినందున వాటి ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయాలి. అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. అకస్మాత్తుగా భూ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి రైతులపై అదనపు భారం మోపడం సమంజసం కాదు. – హుస్సేన్సాబ్, రైతు, ఎల్లంపల్లి రైతులపై అదనపు భారం.. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో సామాన్య రైతు నడ్డి విరిచింది. చార్జీలు పెరగకముందు స్లాట్ బుక్ చేసుకున్నా అధికారులు అందుబాటులో లేక అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదివరకే స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు పాత రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలి. – బాబు, రైతు, పెద్దకడ్మూర్ సర్వర్ సమస్యతో ఆలస్యం.. సర్వర్ మొరాయిస్తుండటంతో రెండురోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. గురువారం ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు చేయలేదు. పెరిగిన భూ రిజిస్ట్రేషన్ల ధరలు శుక్రవారం నుంచి అమలులోకి రావడంతో పెండింగ్లో ఉన్న 30కి పైగా రిజిస్ట్రేషన్లు కొత్త చార్జీలతోనే చేశాం. రైతులు అదనపు చార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. – కాళప్ప, ఇన్చార్జ్ తహసీల్దార్, నర్వ ● -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దామరగిద్ద: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్, హాకా రైతు సేవాకేంద్రాలు, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల నిల్వలను విధిగా ఈ–పాస్ యంత్రంలో నమోదు చేసి విక్రయించాలన్నారు. లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. విత్తనాలు కొనే మందు కంపెనీ లేబుల్ పరిశీలించాలని, విధిగా రసీదు తీసుకోవాలన్నారు. వానాకాలం సాగుకు అవసరమైన, నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్ ఉన్నారు. చిరుధాన్యాల సాగు పెరగాలి కోస్గి రూరల్: రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి నేల ఆరోగ్యాన్ని పరీక్షించి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని ముక్తిపాడు, గుండుమాల్ రైతువేదికల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేతి బచావో అభియాన్లో భాగంగా ఎస్సీ రైతులకు జొన్న విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పాలమూరు శాస్త్రవేత్త అర్చన, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు, శ్రీవిద్య, మాలతి పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, నేల ఆరోగ్య పరిరక్షణ, శాసీ్త్రయ సాగు పద్ధతులు, విత్తనశుద్ధి, పురుగు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కోస్గి ప్రెస్క్లబ్లో పలువురు రైతులకు జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయ అధికారులు రేష్మారెడ్డి, రమేష్, ఏఈఓలు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
లక్ష ఎకరాలకు సాగునీరు
● రైతుల భవితను మార్చనున్న భారీ ప్రాజెక్టు ● మక్తల్ పర్యటనలో ముఖ్యమంత్రిరేవంత్రెడ్డి నారాయణపేట/మక్తల్: కృష్ణా, భీమానది జలాలను ఎత్తిపోసి జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మక్తల్–పేట–కొడంగల్ ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి గురువారం స్వయంగా పరిశీలించి సాగునీటిపారుదల అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఘన స్వాగతం పలికారు. ఏరియల్ సర్వే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెలికాప్టర్లో తిరుగుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రతిపాదిత బ్రిడ్జి–కం–బ్యారేజీల నిర్మాణ అవకాశాలపై అధికారులతో చర్చించారు. కొల్పూర్, ముడుమాల్, గుడెబల్లూరు ప్రాంతాల వద్ద బ్రిడ్జి–కం–బ్యారేజీల నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు వివరించారు. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాట్రేవుపల్లి వద్ద పనుల పరిశీలన.. ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్రెడ్డి మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో పరిశీలించారు. అత్యంత కీలకమైన ప్యాకేజ్–1 పనుల పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ వద్దకు చేరుకొని ఎంతశాతం పనులు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, సాంకేతిక అంశాలు, పనుల వేగం, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. ఎత్తిపోతల పథకంలో పంప్హౌస్ అత్యంత కీలక భాగమని.. భీమా, కృష్ణా నదుల నుంచి నీటిని ఎత్తిపోసి పైభాగంలోని రిజర్వాయర్లు, కాల్వల ద్వారా భూములకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించనుందని ఇరిగేషన్ అధికారులు వివరించారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో ఎగ్జిబిషన్.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనన్లో ప్రతిపాదిత బ్యారేజీలు, కాల్వలు, పంప్హౌస్లు, నీటి నిల్వ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, భూ సేకరణ, సాంకేతిక అంశాలు, భవిష్యత్ ప్రయోజనాలను డిజిటల్ పద్ధతిలో వివరించారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూనే నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటి పారుదలరంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. రెండు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో సమీక్ష.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రులు బోసు రాజు, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఇరిగేషన్శాఖకార్యదర్శి శశిధర్, చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్టీ శ్రీధర్ తదితర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై పూర్తిస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం : బీజేపీ
నారాయణపేట రూరల్: జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సింగారం చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన బీజేపీ నాయకుల శిక్షణ శిబిరానికి ఆయనతో పాటు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త పాటించాలని, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ రాబోవు సాధారణ ఎన్నికల్లో కమల వికాసమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. అంతకుముందు పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్ ఆవిష్కరించారు. నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, ప్రకాష్రెడ్డి, కిషోర్రెడ్డి, మురళీధర్, కొండయ్య, పూనంచంద్ లహోటి,లక్ష్మీ, కొండ శ్వేత, మంజుల, రఘువీర్ పాల్గొన్నారు. సంగీత స్వర నిఘంటువు బాలు నారాయణపేట: ఎస్పీ బాలసుబహ్మ్రణ్యం వ్యక్తి కాదు.. సంగీతానికి ప్రతిరూపం.. ఆయన పాడిన ప్రతి పాట ఒక పాఠం, ప్రతి స్వరం ఒక స్ఫూర్తి.. సంగీత స్వర నిఘంటువు అని ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి కొనియాడారు. పద్మ విభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని గురువారం జిల్లాకేంద్రంలోని బాలకేంద్రంలో ఎస్పీ బాలు ఫ్యాన్న్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమ్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరంతో భావోధ్వేగాలను పలికించిన మహా గాయకుడు, తన గానామృతంతో కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలు అన్నారు. ఐదు దశాబ్దాలకుపైగా సాగిన సంగీత ప్రస్థానంలో దేశభక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, సినీ పాటలు తదితర 50 వేలకుపైగా ఆలపించి ప్రపంచ రికార్డులు సృష్టించారని గుర్తుచేశారు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదని.. ఒక గురువు, మార్గదర్శి, సంగీత సేవకుడని కొనియాడారు. నేటి తరం కళాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకొని సంగీతంలో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో గాయకులు బాలాజీగౌడ్, సంగ నర్సింహులు, రామకృష్ణ, కళ్యాణి, వసంత్, జ్ఞానామృత తదితరులు పాల్గొని బాలు ఆలపించి సంగీత నివాళులు అర్పించారు. -
బీఆర్ఎస్లో దుమారం..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. గతంలో కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్పై విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్లోనే ఉంటారా.. కాంగ్రెస్లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు -
చిట్టెం రామ్మోహన్రెడ్డి హౌస్ అరెస్ట్
నారాయణపేట/మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని గురువారం పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మొహరించి బయటకు రాకుండా నిర్బంధించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహగౌడ్, బీఆర్ఎస్పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, ఈశ్వర్తో పాటు పలువురు పార్టీ నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో పైప్లైన్ ద్వారా కాకుండా గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించాలని డిమాండ్ చేస్తూ సీఎం పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. ముందస్తు హౌస్ అరెస్ట్లు, గృహ నిర్బంధాలతో ప్రజా సమస్యలను అణచివేయలేరని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని.. పైప్లైన్తో ఆశించిన ప్రయోజనం చేకూరదని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఊట్కూర్ తదితర ప్రాంతాలకు పరిమిత స్థాయిలో మాత్రమే సాగునీరు అందుతుందని, రాజకీయ కక్ష సాధింపుతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. తమ ఆందోళనలను అడ్డుకోవడానికి పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వడివడిగా..
పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదలశాఖ మంత్రి బోసురాజు తో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూ రు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనా ల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్త ల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధి లోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు జడ్చర్లలో బహిరంగ సభ.. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. పలువురి గృహనిర్బంధం.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పలు ప్రాంతాల్లో పోలీసులు తెల్లవారుజామునే బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పుంగనూరు గ్రామానికి చెందిన రాఘవేందర్తో పాటు పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు. గద్వాల జిల్లా అయిజలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతోపాటు బీజేపీ అనుబంధ ఏబీ వీపీ విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి సుధాకర్రావు తదితరులను గృహనిర్బంధం చేశారు. కాట్రేవుపల్లికి చెందిన పలువురు రైతులు కొడంగల్ ఎత్తిపోతల పథకంలో తాము భూములు కోల్పోయామని, తమకు భూపరిహారం ఇంకా అందలేదని ముఖ్యమంత్రితో విన్నవించుకునేందుకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరిగారు. కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం -
బీఆర్ఎస్ను శక్తివంతం చేద్దాం
● కార్యకర్తలే పార్టీకి బలం ● మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నారాయణపేట/మక్తల్: తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ చేసిన కృషిని ప్రజలు మరచిపోలేదు.. కార్యకర్తలే పార్టీకి బలం.. సభ్యత్వ నమోదులో నంబర్ వన్గా నిలిపి పార్టీని మరింత శక్తివంతం చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి నేతృత్వంలో నారాయణపేట నియోజకవర్గం, మక్తల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నేతృత్వంలో మక్తల్ నియోజకవర్గ శ్రేణులకు పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధినేత కేసీఆర్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడమే కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా బృందాలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని.. రైతు సంక్షేమం, సాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని.. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి, తర్వాత వీడిన నాయకులకు తిరిగి చేరే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. కష్టకాలంలోనూ జెండాను మోసిన కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని.. నియోజకవర్గంలో 270 బూత్లు ఉండగా.. ప్రతి బూత్ నుంచి పార్టీ కోసం పోరాడే కనీసం 150 మంది సభ్యులను చేర్చాలనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు. నారాయణపేటలో జరిగిన కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గ ఇన్చార్జ్్ మేడి రాజీవ్సాగర్, నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్పర్సన్ మొసటి జ్యోతి, పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, మక్తల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, దూదిమెట్ట బాలరాజు, జెట్టి శ్రీనివాసులు, నర్సింహగౌడ్, జుబేర్పాషా, మహిపాల్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, చిన్నహన్మంతు, రామలింగం తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగానే.. ఆకాంక్ష
నారాయణపేటకేఎల్ఐతో మహర్దశ పట్టినా నామమాత్రంగానే సాగు ● భారీ సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాల్వలు లేకపోవడమే కారణం ● వరప్రదాయినిగా నిలిచిన జూరాలలో పేరుకున్న పూడిక ● నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పనులు పెండింగ్లోనే.. ● పుష్కర తెలంగాణలో సాగు నీళ్ల కోసం తప్పని నిరీక్షణ ● నేడు, రేపు సీఎం రేవంత్, మంత్రుల ప్రాజెక్ట్ల సందర్శన .. ప్లాస్టిక్ నిషేధం పాలమూరు సమీపంలోని పర్వతాపూర్ మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026–8లో uఅడుగులు పడినా పూర్తికాని ‘పాలమూరు’ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఐదు (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పంప్ను ప్రారంభించారు. రిజర్వాయర్ల వారీగా.. నార్లాపూర్: కొల్లాపూర్ మండలంలో 8.61 టీఎంసీల సామర్థ్యం గల నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. పంప్ హౌస్ పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కెనాల్ నిర్మించాల్సి ఉండగా.. 400 మీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. పంప్హౌస్ కోసం 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్ కింద సబ్ కెనాళ్లు, బ్రాంచ్ కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్ చేయాల్సి ఉంది. పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం రెండు మోటార్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మూడింటిని ఏర్పాటు చేసింది. ఇంకా నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యూ -
నిర్మించినా.. నిరుపయోగమే!
ఊట్కూర్: గ్రామాల్లో పలు శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ అద్దె భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతుండగా.. సరైన వసతులు లేక సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఏర్గాట్పల్లిలో రెండేళ్ల క్రితం గ్రామపంచాయతీ భవనాన్ని సుమారు రూ.20 లక్షలతో నిర్మించారు. పనులు పూర్తిచేసి రంగులు వేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. బిల్లులు మంజూరు కాలేదని కాంట్రాక్టర్ నిర్మించిన భవనాన్ని అధికారులకు అప్పగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. పెద్దజట్రం గ్రామంలో 10 ఏళ్ల కిందట ఐకేపీ ఆధ్వర్యంలో సుమారు రూ. 5 లక్షల నిధులతో డ్వాక్రా భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణానికిగాను గ్రామానికి చెందిన నాయిని జయసింహారెడ్డి స్థలాన్ని దానం చేశారు. పనులు పూర్తిచేసి రంగులు వేసి ప్రారంభించకపోవడంతో వృథాగా మిగిలింది. స్థానికులు భవనంలో పశువులను కట్టివేస్తున్నారు. డ్వాక్రా భవనం లేక మహిళ సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దజట్రం గ్రామంలో రెండేళ్ల కిందట పశు వైద్యశాల భవనం నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. బండలు, కిటికీలు, తలుపులు బిగించి రంగులు వేయాల్సి ఉంది. స్థానిక గ్రామపంచాయతీ దగ్గర పశువులకు వైద్యం అందిస్తున్నారు. ● బిజ్వార్ నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పనులు 3 నెలలుగా అసంపూర్తిగా నిలిచిపోయా యి. కాంట్రాక్టర్ రోడ్డుపై కంకరవేసి వదలేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల పరిహారం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: సంగంబండ, భూత్పూర్, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల నష్ట పరిహా రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా బు ధవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ప్రజల దశ, దిశ మార్చేందుకు సీఎం పర్యటిస్తున్నారని.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాల మైదానానికి చేరుకొని మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులపై అధికారులతో సమీక్షిస్తారన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఇరురాష్ట్రాల మంత్రులు బోసురాజు, ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడామని.. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురు, శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ఏరియల్ సర్వే నిర్వహిస్తారని.. కృష్ణా, బీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ గుడ్డెబల్లూర్ నుంచి తండిగి మీదుగా బీమా నదిపై వంతెన నిర్మాణం చేపడితే రాకపోకలు పెరిగి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పెండింగ్లో ఉన్న భూత్పూ ర్, నేరెడుగాం ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. భూత్పూర్ రిజర్వాయర్లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్ రహీం పటేల్, వాకిటి హన్మంతు, మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్ పాల్గొన్నారు. -
ప్రారంభోత్సవం చేయాలి...
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పంచాయతీ భవనం నిర్మించి రెండేళ్లు గడిచినా ప్రారంభించడం లేదు. అంగన్వాడీ కేంద్రంలోని అదనపు గదిలో పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి వెంటనే భవనాన్ని ప్రారంభించాలి. – హన్మంతు, ఏర్గాట్పల్లి, ఊట్కూర్ ఏర్గాట్పల్లిలో గ్రామపంచాయతీ భవనం నిర్మించిన కాంట్రాక్టర్కు నిధులు లేక బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా. – అజయ్కుమార్రెడ్డి, ఏఈ ● -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండు హెలీప్యా డ్లు ఏర్పాటు చేసి రహదారి సిద్ధం చేయాలని అర్అండ్బీ అధికారులకు సూచించారు. అగిమాపకశాఖ అధికారులు రెండు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత అధికారులు ఆహార తనిఖీలు చేపట్టాలన్నారు. భోజనం, వసతి ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు సమకూర్చాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ వినీత్, అడిషనల్ ఎస్పీ వాసుదేవారెడ్డి, శ్యాం, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ తదితర అధికారులు ఉన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నారాయణపేట: తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, యువతులు ప్రదర్శించిన జానపద, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పేర్కొన్నారు. కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో యువత ముందుండాలని సూచించారు. విద్యార్థులను వారు అభినందించారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
–8లో uనారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కలెక్టరేట్లో మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు, తెలంగాణ సాధన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ప్రసంగించారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు అండగా.. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని.. అందుకే రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, మహిళాశక్తి క్యాంటీన్లు, శిల్పారామంలో 100 ఇందిరా మహిళశక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించామని.. ఇందులో ఇప్పటికే 150 బస్సులు అందజేసినట్లు తెలిపారు. ● జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా 2.73 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణంతో దాదాపు రూ.132 కోట్ల మేర లబ్ధి పొందారన్నారు. 70,120 మంది లబ్ధిదారులకు 1,83,969 సిలిండర్లు రాయితీ ద్వార ఇచ్చి రూ.4.66 కోట్లను ఖాతాలో జమ చేశామని చెప్పారు. రూ.421 కోట్ల రైతు భరోసా.. 2025లో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మంది రైతులకు రూ.421 కోట్ల రైతుభరోసా నిధులు మంజూరు చేశామని, 6,526 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 1,151 నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూ.60 లక్షలతో ధన్వాడ మండలం కిష్టాపూర్లో 50 మంది లబ్ధిదారులకు విద్యుత్, బోర్లు, మొదటి పంటకు సాయం అందించినట్లు వివరించారు. నైపుణ్య కేటగిరిలో 35 మంది దళిత మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణనిచ్చి రూ.7 లక్షల విలువగల కుట్టుమిషన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ● రాష్ట్రంలో మొట్టమొదట నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించామని.. విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2,438 సంఘాలకు రూ.237 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పారు. మక్తల్, నారాయణపేట, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో రూ.58.54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. వన మహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో 25.82 లక్షల మొక్కలు నాటామన్నారు. ● లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.4,725 కోట్ల అంచనాలతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తున్నామన్నారు. మక్తల్లో రూ.25 కోట్లతో 5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.32.50 కోట్లతో 11 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నాబార్డ్ సౌజన్యంతో 22,500 ఎంటీఎస్ సామర్థ్యంతో 5 గోదాములు నిర్మిస్తున్నామని, 2025– 26 సంవత్సరానికిగాను పెద్ద సైజు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలినట్లు చెప్పారు. ● పదోతరగతి వార్షిక పరీక్షల్లో 97.82 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 14వ స్థానం దక్కించుకుందన్నారు. సుమారు 30 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. యాసంగిలో 163 కొనుగోలు కేంద్రాల ద్వారా 17,460 మంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 1,27,531 మె. ట. వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు మంజూరుకాగా.. రూ.517 కోట్లతో పురోగతిలో ఉన్నాయన్నారు. ఎస్పీ, డీపీఓ కార్యాలయ భవన నిర్మాణానికి ఏడు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు రూ.38 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరూ పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్డీఓ రమేష్, ఎస్డీసీ రాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి.. చిత్రంలో కలెక్టర్ ప్రియాంక తదితరులు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం మహిళలు, పేదల సంక్షేమానికి పథకాల అమలు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టరేట్లో అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తోందని.. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
శాంతిభద్రతలే అభివృద్ధికి పునాది : ఎస్పీ
నారాయణపేట: రాష్ట్ర అభివృద్ధిలో శాంతిభద్రతల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేకమంది అమరుల త్యాగాలు, దీర్ఘకాల ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఉన్న సామాజిక, రాజకీయ పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రత్యేక రాష్ట్రం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థ మరింత ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు, డయల్ 100, 112 సేవలు ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాయని వివరించారు. పోలీసులు తమ విధులను కేవలం ఉద్యోగంగా కాకుండా వృత్తి ధర్మంగా భావించి ప నిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలే పోలీసుశాఖకు నిజమైన బలమని సేవాభావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. వేడుకల అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (డీఏఆర్) ఎండీ రియాజ్ హూల్హక్, డీఎస్పీలు ఎన్.లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఎస్సైలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సేవా పతకాలు పొందిన పోలీసులు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ సేవా పతకాలకు సైదులు (సీఐ, కోస్గి), ఏబీ సురేందర్బాబు ( ఏఎస్ఐ, కృష్ణా) ఎం.సాయిబాబా (ఏఎస్ఐ, ఊట్కూర్) ఎండీ ముస్తాక్ అలీ ( ఏఎస్ఐ, ధన్వాడ), డి.మురళీధర్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్), ఎం.వెంకటేశ్వర్లు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్), బాలరాజు (హెడ్ కానిస్టేబుల్, ఊట్కూర్) ఎండీ లయాక్ అహ్మద్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్) ఎంపికయ్యారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో మరిన్ని ఉత్తమ సేవలు అందుకొని జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
బస్టాండ్ పునర్నిర్మాణానికి చర్యలు : ఆర్టీసీ ఎండీ
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరులో ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోస్గి డిపో మేనేజర్ లావణ్యను ఆదేశించారు. మంగళవారం ఆయన కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో కలిసి బస్టాండ్, ఆవరణ, నిర్మాణానికి పరిస్థితులను పరిశీలించారు. అలాగే ఆక్రమణకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించాలని పుర చైర్పర్సన్ సరస్వతి జనార్దన్కు సూచించారు. బస్డాండ్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి భూమిపూజకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మద్దూరుకు రాత్రి 7 గంటలకు బస్సు బయలుదేరి నైట్హాల్ట్ మద్దూరులో ఉండేలా చూడాలని పట్టణవాసులు కోరగా పరిశీలించాలని డిపో మేనేజర్కు సూచించారు. ఆయన వెంట ఈడీ కుశ్రుఖాన్, ఆర్ఎం సంతోష్కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, పుర కౌన్సిలర్లు గోవిందు, కో–ఆప్షన్ సభ్యుడు హబీబా రియాజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జీడీ వెంకట్రాములు తదితరులు ఉన్నారు. -
ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి : కలెక్టర్
నారాయణపేట: ప్లాస్టిక్ వినియోగంతో భూగర్భ జలాలు, మట్టి నాణ్యత, పశుపకా్ష్దులు, అడవులు, పర్యాటక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని.. నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సింగిల్యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై రూపొందించిన అవగాహన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారిందని, జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్లాస్టిక్ రహిత అడవులు, పర్యాటక ప్రాంతాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కాగితం, వస్త్ర సంచులు వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఓ కమాలుద్దీన్, పద్మారావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
4 పోస్టులు మంజూరు
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నాలుగు పోస్టులు మంజూరయ్యాయి. గతంలో కార్యాలయం ప్రారంభించగా.. ఏంవీఐ, జూనియర్ అసిస్టెంట్ ఇతర జిల్లాల నుంచి డిప్యుటేషన్పై విధులు నిర్వర్తించేవారు. తాజాగా జరిగిన బదిలీల్లో నాలుగు పోస్టులను నారాయణపేటకు కేటాయించారు. హైదరాబాద్ జేటీసీ సెంట్రల్ జోన్ నుంచి సి.రామేశ్వర్రెడ్డి, ఎంవీఐ అధికారిగా ఇబ్రహీంపట్నం నుంచి ఎస్కే మున్నీని కేటాయించారు. అసిస్టెంట్ ఏంవీఐలుగా నాగర్కర్నూల్ నుంచి దీప్తి, సంగారెడ్డి నుంచి గౌతంరాజు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన మేఘగాంధీ వికారాబాద్ జిల్లాకు కేటాయించగా నారాయణపేటలో విధులు నిర్వహించారు. అయితే తాజా బదిలీల్లో వనపర్తి జిల్లా పెబ్బేరుకు కేటాయించారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నాగర్కర్నూల్ నుంచి డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట రూరల్: నారాయణపేటలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న మూడు పీజీసీఆర్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రత్యేక అధికారి శ్వేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమంలో గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్లం బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని.. ఈ నెల 6 వరకు పాఠశాలలో బయోడేటా, విద్యా అర్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు అందించాలని సూచించారు. మాగనూరులో.. స్థానిక కేజీబీవీపీ పాఠశాల, కళాశాలలో హిందీ (సీఆర్టీ), వృక్షశాస్త్రం, తెలు గు, ఆంగ్లం, రసాయన శాస్త్రం, భౌతిక శా సత్రం, జంతుశాస్త్రం, ఎంఎల్టీ (పీజీసీఆర్టీ) బోధించుటకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ రాధి క మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మహిళా అభ్యర్థులు అర్హులని.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఆరోతేదీ వరకు బయోడేటా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో దరఖాస్తులు స్వయంగా సమర్పించాలని పేర్కొన్నారు. మరికల్లో..స్థానిక కేజీబీవీలో 2026–27 విద్యా సంవత్సరం అతిథి అధ్యాపకుల నియా మకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక అధి కారి రాజ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలుగు, ఆంగ్లం, వృక్ష, రసాయన, భౌతిక శాస్త్రం, వ్యవసాయం బోధించుటకు ఆ యా సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ పూర్తిచేసిన అర్హుల ని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10 లో గా పాఠశాలలో అందజేయాలని సూచించారు. కృష్ణా.. కృష్ణా: మండలంలోని కస్తూర్బాలో ఖాళీగా ఉన్న తెలుగు (సీఆర్టీ), వృక్షశాస్త్రం (పీజీసీఆర్టీ), పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ షాలిని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులని, బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఆత్మ గౌరవం : బీఆర్ఎస్ నారాయణపేట: తెలంగాణ అంటే కేవలం రాష్ట్రం కాదని.. ఒక భావోధ్వేగం, ఆత్మగౌరవం, చరిత్ర, విజయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అనేక దశాబ్దాల పోరాటానికి నాయకత్వం వహించి కోట్లాది ప్రజల కలను సాకారం చేసిన మహానేత, తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, గురుకులాల విస్తరణ, కేసీఆర్ కిట్, దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అమరుల త్యాగాలు, సకలజనుల సమ్మె, కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మైలురాళ్లుగా నిలిచాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మొసటి జ్యోతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, కౌన్సిలర్లు భరత్, కాకర్ల నారాయణమ్మ, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. -
సర్వం సిద్ధం
● నేడు కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ● హాజరుకానున్న మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నా రు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రగతి, సంక్షేమ విజయాలను ప్రతిభింబించేలా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక దిశానిర్దేశంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల్లో భాగంగా ఉదయం 8 గంటలకు మంత్రి వాకిటి శ్రీహరిచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వంద నం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం, తెలంగాణ సాధన చరిత్రను ప్రతిభింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకల్లో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: అన్ని శాఖల అధికారు లు ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తూ 23 ఫిర్యాదులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ● జిల్లాకేంద్రంలో నిర్మాణాలు పూర్తయిన మూడు ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రా రంభించారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చ టించి.. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల విద్యాభ్యాసం, జీవన విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేతా సత్యయాదవ్, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, ము న్సిపల్ వైస్ చైర్పర్సన్ మంజుల,కౌన్సిలర్లు మహే శ్, గొల్ల రవితేజ యాదవ్,రాజేశ్ ఘట్, హౌసింగ్ ఏఈ గౌస్, వార్డు ఆఫీసర్ దేవరాజ్ పాల్గొన్నారు. -
4న మక్తల్కు సీఎం రేవంత్రెడ్డి
● ఏరియల్ సర్వేతో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం ఈ నెల 4న సీఎం రేవంత్రెడ్డి మక్తల్కు వస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సోమవారం మక్తల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియల్ సర్వే ద్వారా కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులతో పాటు కృష్ణా, భీమా నదులపై దాదాపు రూ.1,000 కోట్లతో నూతనంగా నిర్మించే బిడ్జికమ్ బ్యారేజ్ల స్థలాలను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి పరిశీలిస్తారని తెలిపారు. ఇరు రాష్ట్రాల సహకారంతో నూతనంగా నిర్మించే ప్రాజెక్టులతో 6–8 టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ముంపు గ్రామాలకు రూ. 100కోట్లతో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. నర్వ మండలం జంగంరెడ్డిపల్లి వద్ద కొత్త లిఫ్ట్లను సైతం త్వరలో ప్రారంభించనున్నట్లు వివరించారు. అదే విధంగా ముంపు గ్రామాలైన నేరడగోమ్, భూత్పుర్ను సీఎం పరిశీలిస్తారన్నారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, కట్ట సురేశ్, రవికుమార్, వైస్చైర్మన్ గణేశ్కుమార్ తదితరులు ఉన్నారు. -
పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం 12 ఏళ్లలో రెండింతలకు పైగా.. తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించగా.. ఆ ఏడాదిలో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్) సీజన్లో సుమారు 8.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. స్వరాష్ట్రం సిద్ధించిన 12 ఏళ్ల కాలంలో ఇదే సీజన్లో సాగు విస్తీర్ణం రెండింతలకు పైగా పెరిగింది. 2025–26 వానాకాలం సీజన్లో 22.54 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సుమారు 14 లక్షల ఎకరాల్లో సాగు పెరిగినట్లు తెలుస్తోంది. యాసంగిలోనూ గణనీయంగా.. ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా వరి.. ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. వరికి సంబంధించి 2023 ఖరీఫ్లో 7,76,311 ఎకరాలు, 2024లో 8,09,784 ఎకరాలు.. గత ఏడాదిలో 8.40 లక్షల ఎకరాల్లో సాగైంది. 2014 ఖరీఫ్లోనాలుగు లక్షల ఎకరాల వరకు వరి సాగు కాగా.. ప్రస్తుతం రెండింతలకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2019 నుంచి క్రమక్రమంగా రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదే దారిలో పత్తి.. ఉమ్మడి పాలమూరులో 2023 ఖరీఫ్లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో, గత ఏడాదిలో 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం సాగు చేశారు. 2014 వరకు రెండు లక్షల ఎకరాల్లోపు మాత్రమే పత్తి సాగయ్యేది. క్రమక్రమంగా పత్తి సాగు పెరుగుతూ వస్తోంది. అయితే 2023 నుంచి పత్తి సాగు చేసిన వారు సైతం వరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మొక్క జొన్న సాగు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కరువుతో అల్లాడిన ప్రాంతం.. ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు.. తాగు నీటి కోసం తండ్లాట తప్పని పల్లెలు, పట్టణాలు.. ఉపాధి దొరక్క తట్ట, బుట్ట సర్దుకుని పిల్లాజెల్లలతో సహా వలసలు.. కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై, హైదరాబాద్కు వెళ్లే బస్సులు.. విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు ...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం, దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం 2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే.. ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు యాసంగి సాగులోనూ మూడింతల వృద్ధి వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు జిల్లా పరిపాలనలో ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత పొందుతున్న భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులు, ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరితో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న భూ భారతి కా ర్యక్రమం ద్వారా భూ రికార్డుల శుద్ధీకరణ, యాజమాన్య హక్కుల స్పష్టతకు చర్యలు కొనసాగుతున్నా.. కొన్ని మండలాల్లో దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదన్నారు. పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి.. రైతులు, భూ యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదే విధంగా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాదాబైనామా భూముల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదుల పరిష్కారం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని.. భూ వివాదా లు, ఆదాయ ధృవపత్రాలు, పాస్బుక్లు, సర్వే లు, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఫిర్యాదును వారం రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో రాజకీ య పార్టీల భాగస్వామ్యం కీలకమన్నారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలనలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు. నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంత జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా సెక్షన్–30 పోలీస్ యాక్ట్ అమలుచేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వర కు నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు, సామాజిక మాధ్యమాల్లో రెచ్చ గొట్టే పోస్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, సంఘాలు నిర్వహించే ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాల కు ముందస్తుగా పోలీసు అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలను గుమికూడించడం, ట్రాఫిక్కు అంతరా యం కలిగించడం, శాంతిభద్రతలకు విఘా తం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలపై పోలీసుశాఖ ప్రత్యేక నిఘా ఉంచిందని తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలో మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు పలు ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ.. నీరును నిల్వ చేసేందుకు రిజర్వా య ర్లు లేవు. కొంత మేర మాత్రమే సాగు నీరందుతుండగా.. రైతులు ప్రధానంగా వర్షాధారం, బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. సాగు నీ టి వసతులు ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగింది. వి స్తారంగా వర్షాలు కురవడం.. భూగ ర్భ జలాలు పెరగడంతో సాగులో గణనీయ వృద్ధి సాధ్యమైందని రైతు లు, రైతు సంఘాలు నాయకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయాని కి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ, వరికి బోనస్ వంటి పథకాలు సైతం ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని చెబుతున్నారు. -
ప్రగతి పరుగులు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికీ 12 ఏళ్లు అయ్యింది. ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు 2016లో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. నారాయణపేటను సైతం జిల్లాగా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం మేరకు 2019 ఫిబ్రవరి 17న నారాయణపేట జిల్లాగా అవతరించింది. ప్రస్తుతం 13 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 280 గ్రామ పంచాయతీలతో కొనసాగుతోంది. జిల్లా ఏర్పాటు అనంతరం దినదినాభివృద్ధి చెందుతోంది. పెరిగిన భూగర్భజలాలు.. మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని సుమారు 800 చెరువులను పునరుద్ధరించారు. దశాబ్ధాలుగా పూడికతో పేరుకుపోయిన చెరువులను బాగు చేయడంతో భూగర్భజలాలు పెరిగాయి. వేలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో రైతులు సంతోషంగా పంటలు పండిస్తున్నారు. మరోవైపు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందుతోంది. ప్రతి గ్రామానికి తాగునీటి వసతి కల్పించడంలో గత ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు. రూ.కోట్లతో అభివృద్ధి.. జిల్లా ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, జిల్లా ఆస్పత్రి భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 155.65 కోట్లు మంజూరు చేసింది. కలెక్టరేట్ సముదాయానికి రూ. 55కోట్లు, జిల్లా ఆస్పత్రికి రూ. 56కోట్లు, పోలీసు కార్యాలయానికి రూ. 36కోట్లను కేటాయించారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రి ప్రారంభం కాగా.. కలెక్టరేట్ పనులు కొనసాగుతున్నాయి. పోలీసు కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. అదే విధంగా కొండారెడ్డిపల్లి చెరువును రూ. 4కోట్లతో మినీ ట్యాంక్బండ్గా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సీనియర్ సిటిజన్ పార్కు, సైన్స్ పార్కు, చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేశారు. రూ. 6కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలను ఏర్పాటుచేసి.. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేశారు. సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారింది. ప్రత్యేకంగా చిల్డ్రన్ ఆస్పత్రిని సైతం కరోనా సమయంలో ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లా అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీఓ 69 ద్వారా రూ. 5వేల కోట్లతో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని 2024 ఫిబ్రవరి 21న ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటుచేశారు. జిల్లా ఏర్పాటుతో మారిన రూపురేఖలు రూ.155.65కోట్లతో ప్రధాన కార్యాలయాల నిర్మాణం అధునాతన సౌకర్యాలతో జనరల్ ఆస్పత్రి అందుబాటులోకి.. పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో తీరనున్న సాగునీటి గోస జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లను విస్తరించడంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. గత ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చొరవతో రూ. 28 కోట్లతో సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి వీరాసావర్కార్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేశారు. -
డీఏఓగా సక్రియా నాయక్ బాధ్యతల స్వీకరణ
నారాయణపేట: నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా సక్రియా నాయక్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు గద్వాల జిల్లా అలంపూర్ వ్యవసాయ అభివృద్ధి అధికారి (ఏడీఏ)గా విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఇది వరకు నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన జాన్ సుధాకర్ పదోన్నతిపై జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సక్రియ నాయక్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అధికారిక విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లు లేదా రశీదు తీసుకోవాలని సూచించారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
భూత్పూర్/ కొల్లాపూర్ రూరల్: ఉమ్మడి పాలమూ రు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధి కారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. ● భూత్పూర్ మండలం కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
తొలకరికే.. తొందరొద్దు
వర్షాలకు ఎల్నినో ముప్పు ● రుతు పవనాలు గతి తప్పే అవకాశం ● ఆగష్టు, సెప్టెంబర్ మధ్యలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ● సాగు విధానంలో మార్పులు అవసరమంటున్న వ్యవసాయ అధికారులు –8లో uమరికల్: వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లాపై పడుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్నినోతో రుతు పవనాలు గతి తప్పే అవకాశం ఉండటంతో రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుంటే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. జిల్లాలో వానాకాలం సాగు అంచనా.. జిల్లావ్యాప్తంగా 1.92 లక్షల మంది రైతులు ఉండగా.. 2026 వానాకాలంలో 4.34 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 1.90 లక్షల ఎకరాలు, పత్తి 1.80 లక్షలు, కంది 60 వేలు, ఆముదం 2 వేలు, పెసర వెయ్యి, పచ్చజొన్న వెయ్యి, ఉద్యా న పంటలు 300 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనాలు రూపొందించారు. ఎల్నినో ప్రభావం.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో ఎల్నినో ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఓ మోస్తరు, జూన్ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ఇటీవల అవగాహన కల్పించింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు బృందాలుగా పర్యటించారు. ఎల్నినో పరిస్థితులను వివరించి పంటల ప్రణాళికపై దిశా నిర్ధేశం చేశారు. వానాకాలంలో తొలకరి జల్లులు కురవగానే విత్తనాలు వేయడం రైతులకు అలవాటు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు తొలివాన అనంతరం పెద్ద విరామం రావొచ్చు. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిస్తేనే విత్తనం వేయాలి. లేదంటే మొలకలు ఎండిపోయి పెట్టుబడులు వృథా అవుతాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండొచ్చు. ఈసారి వరి తదితరాల పంటల కంటే తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. సాగు పద్ధతులను మార్చుకుంటే ఎల్నినో వంటి సవా ళ్లు సైతం దిగుబడులను అడ్డుకోలేవు. ఈసారి రుతు పవనాలు క్రమం తప్పే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం తీసుకొచ్చి వర్షాభావ పరిస్థితులను వివరించాం. మూస ధోరణిలో కాకుండా వ్యవసాయ, వాతావరణ నిపుణుల సూచన మేరకు పంటలు సాగు చేస్తేనే రైతులు గట్టెక్కే అవకాశం ఉంది. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి -
కల్యాణ.. వైభోగమే
● మన్యంకొండలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గరుడగిరి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రోచ్ఛరణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య అపూర్వ మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గరుడగిరి వరకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాలు అలంకరణలో స్వామి దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజ్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శేష వాహనంపై విహరించిన స్వామివారు.. మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శేషవాహన సేవను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
ధరల భగభగ..!
నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఏం కొనాలో.. ఏం తినాలో అని ఆలోచిస్తున్నారు. రూ.వందలు వెచ్చించినా సంచి నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ● నారాయణపేట మార్కెట్లో ఏ కూరగాయ కొన్నా కిలో సుమారు రూ.50 చెల్లించాల్సిందే. ఆ లు, బెండ, వంకాయ, సొరకాయ మినహా మిగ తా అన్ని కూరగాయలు కిలోకు 50కి పైనే ఉన్నా యి. మరి ముఖ్యంగా బీర్నీస్ కిలోకు రూ.120, మునగ రూ.100, బీరకాయ, పర్చిమిర్చి, చిక్కుడు రూ.80 పలుకుతుండటంతో వాటిని కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రవాణా ఖర్చులు.. కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తరలించేందుకు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్, లోడింగ్, కార్మికుల వ్యయాలు పెరగడంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతు న్నారు. ఉదయం మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులు జిల్లాకు తీసుకొచ్చే సరికి మరింత ధర పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రభా వం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన కూరగాయలు వినియోగదారుడికి చేరేసరికి మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగి అమ్ముడవుతున్నాయి. చుక్కలు చూస్తున్న వినియోగదారులు.. రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నారు. గతంలో రూ.100తో రెండు, మూడు రోజుల కూరగాయల వచ్చేవి. ఇప్పుడు ఒక్కరోజుకే రూ.200 వరకు ఖర్చవుతోంది. టమాటా, మిర్చి లేకుండా వంట చేయలేం. కానీ ధరలు చూస్తే కొనలేని పరిస్థితి అని గృహిణులు వాపోతున్నారు. కొంతమంది వినియోగదారులు తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ధరలు తక్కువగా ఉన్న కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు. నారాయణపేట మార్కెట్లో కూరగాయాల ధరలు.. (కిలో రూ.లలో..) బీర్నీస్ 120, బీరకాయ 80 ,మునగ 100, క్యాప్సి కమ్ 80,చిక్కుడు 80, కాకరకాయ 80, మిర్చి 80, బీట్రూట్60, క్యారెట్ 60, టమాట 50, గోరు చిక్కుడు 50, బెండకాయ 40, వంకాయ 40, ఆలుగడ్డ 30, సొరకాయ 40.కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో మా లాంటి మధ్యతరగతి కు టుంబాలు కొనలేని పరిస్థి తి నెలకొంది. ఎండా కాలం కావడంతో పొలంలో నీరు లేక ఎలాంటి పంటలు పండించకుండా మార్కెట్లోని కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. కావున ధరలు నియంత్రణలోకి రావాలి. అదేవిధంగా గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించి భారం పడకుండా చూడాలి. – సావిత్రి, గృహిణి, బైరంకొండ పెరిగిన కూరగాయల ధరలు బీర్నీస్, క్యాప్సికం కిలో రూ.120కి పైనే.. వేసవి దెబ్బకు తగ్గిన సాగు.. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు -
సర్వీస్ తంటాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
మక్తల్లో ఇంధన కొరత
మక్తల్: పట్టణంలో డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కర్ని రోడ్లో ఉన్న పెట్రోల్బంకు వద్ద వాహనదారులు డబ్బాలను వరుసలో ఉంచి వేచి ఉండటం కనిపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్లో పెట్రోల్ రూ.150, డీజిల్ రూ.120 కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. కొందరు ఇదే అదనుగా భావించి కర్ణాటక నుంచి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. మోదీ సందేశం.. దేశ నిర్మాణానికి మార్గదర్శకం నారాయణపేట: అభివృద్ధి, బాధ్యత, దేశభక్తి, సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించడంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విశిష్ట పాత్ర పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ అన్నారు. ఆదివారం ఆయన తన ఇంట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. దేశ ప్రజలతో నేరుగా అనుసంధానించే వేదికగా గుర్తింపు పొందిన మన్ కీ బాత్ కార్యక్రమం మరోసారి ప్రజా చర్చకు కేంద్రబిందువైందని.. మోదీ సందేశాలు దేశ నిర్మాణానికి మార్గదర్శకం అవుతున్నాయని వివరించారు. రాజకీయ అంశాలకు దూరంగా ఉంటూ సమాజంలో స్ఫూర్తిదాయక మార్పులు తీసుకొచ్చిన సాధారణ వ్యక్తుల కథనాలను ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో సేవా భావాన్ని పెంపొందిస్తున్నారన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, మహిళా సంఘాలకు ‘మన్ కీ బాత్’ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని చెప్పారు. స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఫిట్ ఇండియా, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మోదీ ప్రసంగాలు ఉంటాయని, దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలన్నా రు. ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత కోసం అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కెంచె శ్రీనివాసులు, రామచంద్ర మిస్కిన్, గోపాల్, మిర్చి వెంకటయ్య, వెంకట్రాములు, ప్రభాకర్ కమలాపుర, బండారే సత్యకుమార్, శ్రీను, కిరణ్ పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త : ఎస్పీ
నారాయణపేట: డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదేస్థాయిలో సైబర్ నేరగాళ్ల మోసాలు విస్తరిస్తున్నాయని, క్షణాల్లో ఖాతాల్లోని డబ్బులు మాయం చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆనన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, సోషల్ మీడియా, ఫేక్ లింకులు, నకిలీ యాప్లు, కస్టమర్కేర్ కాల్స్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు, పోలీసు సిబ్బంది, కస్టమర్కేర్ ప్రతినిధుల పేరుతో ఫోన్చేసి ఓటీపీలు, ఏటీఎం పిన్నంబర్, ఖాతా వివరాలు అడిగి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలియని మెస్సేజ్లు, వాట్సాప్ లింకులు, ఈ–మెయిల్స్తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా పోలీస్శాఖ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. అప్రమత్తతే సైబర్ నేరాలకు అసలైన ఆయుధమని ఎస్పీ సూచించారు. ఎస్పీని కలిసిన మక్తల్ ఎస్ఐ.. దామరగిద్ద ఎస్సైగా పనిచేసిన పి.రాజు మక్తల్ పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు మక్తల్ ఎస్సైగా పనిచేసిన భాగ్యలక్ష్మిరెడ్డి ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా పి.రాజు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వినీత్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మక్తల్ వంటి కీలక ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టం అమలులో రాజీ పడకుండా పని చేయాలని సూచించారు. -
పోక్సో.. కాస్కో
మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులకు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. శిక్షలు పడిన పలు కేసులు ఇలా.. మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్ తాలిబ్, సయ్యద్ అల్తాప్లకు వాట్సాప్లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్ తాలిబ్, ఏ3 సయ్యద్ అల్తాప్కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 2020 నుంచి పోక్సో కేసులు ఇలా.. ఏడాది నమోదైన శిక్షపడిన కేసులు వారు 2020 63 2 2021 73 1 2022 56 2 2023 48 2 2024 91 3 2025 85 2 2026 23 0 మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు ఏడేళ్లలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్నగర్ -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
నారాయణపేట: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా వారోత్సవాల సందర్భంగా ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ పేరిట స్వయం సహాయక సంఘాలకు రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై జిల్లాలోని 174 యూనిట్లకు రూ.7.24 కోట్లకు పైగా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో కిస్తులు చెల్లిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తాము ఎంచుకున్న వ్యాపారాల్లో లాభాలు ఆర్జించి ఆదర్శంగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి జిల్లా అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని, మహిళలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఇంట్లో ఉన్న ఆడ పిల్లలను బాగా చదివించాలని, పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోయిందనే భావనను తల్లిదండ్రులు విడాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్, వాటి నివారణలో స్వయం సహాయక సంఘాల సభ్యుల పాత్ర కీలకమని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాల్య వివాహ నిరోధక చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కిశోర బాలికలకు అండగా నిలిచి, మహిళా సంఘాల్లో చేర్పించి ఆర్థిక స్వాతంత్య్రం సాధించేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, సెర్ప్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు.. అకాల వర్షాలకు తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శుక్రవారం తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షానికి తడిసిన వరి ధాన్యం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దామరగిద్ద మండలం గత్పలో లారీలు అందుబాటులో లేక పొలాల్లోనే వరి ధాన్యం ఉందని.. కేంద్రాలకు తరలించి కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో శుక్రవారం వరకు 17,986 మంది రైతుల నుంచి 1,35,511.980 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం విలువ సుమారు రూ.323.73 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 16,201 మంది రైతుల ఖాతాల్లో రూ.273.54 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఇది మొత్తం చెల్లింపుల్లో 84.50 శాతమని పేర్కొన్నారు. అకాల వర్షాలకు దామరగిద్ద మండలంలోని విఠలాపూర్, అన్నాసాగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసినట్లు తెలిపారు. వాటిని వెంటనే రైస్మిల్లులకు తరలించి నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 98 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందని, మిగిలిన ధాన్యాన్ని మరో రెండు రోజుల్లో కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. -
చదువుతోనే వలసల నివారణ సాధ్యం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట రూరల్: సంపూర్ణ అక్షరాస్యతతోనే వలసల నివారణ సాధ్యమవుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన భోజనంతో పాటు ఈ ఏడాది నుంచి అల్పాహారం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ స్కూల్ రంగులను చూసి మోసపోకుండా గ్రామంలోని సర్కార్ బడికి తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడంతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం లభిస్తాయని తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరిక మేరకు ఉద్యోగుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణస్థాయిలో కార్పొరేట్ విద్య.. గ్రామీణస్థాయి విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. విద్యాశాఖను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తుండటంతో తక్కువ కాలంలోనే విద్యారంగం మరింత అభివృద్ధి చెందిందని.. రాబోవు రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా, టీఎస్ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లాడుతూ.. విద్యారంగంలో ఏ ఫలితాలు చూసిన అమ్మాయిలే ముందు వరుసలో ఉంటున్నారని, ఇదే పరంపర ఉద్యోగ, ఉపాధిరంగాల్లో కొనసాగిస్తే తక్కువ కాలంలోనే వందశాతం మహిళా సాధికారికత సాధించడం ఖాయమని అన్నారు. రాబోవు రెండేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చూడబోతున్నామని.. ఇప్పటికే ఉన్నత విద్యలో కొత్త కోర్సులు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామన్నారు. రాబోవు విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేద్దామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవార్డులతో పాటు ప్రధానోపాధ్యాయులను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.జనార్దన్రెడ్డి, వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతి, వి.సంతోష్ కుమార్, డీఈఓ గోవిందరాజు, డీఐఈఓ సుదర్శన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కొండ శ్వేత, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఎండీ రషీద్, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బెల్టు దుకాణాలపై పోలీసుల దాడులు
● ఎనిమిది నెలల్లో 155 కేసులు నమోదు ● డయల్ యువర్ ఎస్పీలో సైతం ఫిర్యాదులు ● విక్రయాలు పడిపోవడంతో ఎకై ్సజ్ అధికారులపై ఒత్తిళ్లు నారాయణపేట: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీస్శాఖ ఉక్కుపాదం మోపుతుండగా.. ఎకై ్సజ్శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ దుకాణాలు, దాబాలు, గుట్టుగా నడుస్తున్న మద్యం అడ్డాలపై ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తూ ఎనిమిది నెలల్లో 155 కేసులు నమోదు చేయగా.. మద్యం అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్శాఖ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారిక మద్యం విక్రయాలు పడిపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఎకై ్సజ్ అధికారులకు ఒత్తిళ్లు పెరిగినట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. తగ్గిన విక్రయాలు.. పెరిగిన ఒత్తిళ్లు... జిల్లాలోని మద్యం దుకాణాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఎకై ్సజ్శాఖకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం విధించిన మద్యం విక్రయాల లక్ష్యం చేరకపోవడంతో జిల్లాస్థాయి అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి మద్యం విక్రయాలే ప్రధాన ఆదాయ వనరుగా ఎకై ్సజ్ అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది నెలల్లో సుమారు రూ.8 కోట్ల ఆదాయం పడిపోవడంతో ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు పడినట్లు తెలుస్తోంది. 8 నెలలు.. 155 కేసులు... ఎస్పీ డా. వినీత్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2026, మే వరకు జిల్లావ్యాప్తంగా 155 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. పోలీసుల దాడుల్లో భారీగా మద్యం బాటిళ్లు, అక్రమ నిల్వలు పట్టుబడుతున్నప్పటికీ.. మరుసటి రోజే అదే ప్రాంతాల్లో మళ్లీ విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా బెల్ట్ షాపులుఉన్నయానేది ఇటు పోలీస్, అటు ఎకై ్సజ్ అధికారుల లెక్కల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ స్పెషల్ ఫోకస్.. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్స్టేషన్ల వారీగా రాత్రిళ్లు ఆకస్మిక తనిఖీలు, దాబాలపై దాడులతో అక్రమ వ్యాపారులకు పోలీస్శాఖ చెక్ పెడుతూ వచ్చింది. మద్యం విక్రయాలు తగ్గుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. కాగా నెల రోజుల నుంచి దాబాలు, బెల్ట్ షాపులపై ఫిర్యాదులు అందినా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో దాబాల్లో మద్యం విక్రయాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దాబాలే అడ్డాలు.. జిల్లాలోని ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ఉన్న సుమారు 60 దాబాలు ఇప్పుడు మందుబాబుల అడ్డాలుగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో దాబాల్లో దర్జాగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు ప్రత్యేక గదులు ఏర్పాట్లు చేసి మినీ బార్లను తలపించేలా వ్యాపారం సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎంఆర్పీలకు అదనంగా డబ్బులు తీసుకొని మద్యం విక్రయాలు సాగిస్తూ భారీగా ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో కొన్ని దాబాల్లో భారీగా మద్యం నిల్వలు బయటపడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మరుసటి రోజే మళ్లీ అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్శాఖ మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో సైతం బెల్టు దుకాణాలపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. -
పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
నారాయణపేట: పొగాకు నెమ్మదిగా చంపే విషం.. దానికి దూరంగా ఉంటే ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యకర సమాజం సాధ్యమవుతుందని జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజాన్ని నిశ్శబ్ధంగా కబళిస్తున్న అతిపెద్ద ఆరోగ్య శత్రువు పొగాకేనని.. యువత వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి ఏటా లక్షలాది మంది పొగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని.. పొగాకు వినియోగంతో ఆ వ్యక్తి ఆరోగ్యమే కాదు కుటుంబాల భవిష్యత్ను చీకట్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా వంటి రూపాల్లో తీసుకునే పొగాకు నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేస్తూ క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకొని సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉందని, అవసరమైన వారు 15100 నంబర్కు కాల్ చేసి సేవలు పొందవచ్చని లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డా. లక్ష్మీకాంత్, డా. జాంరాజు, ఏఎస్ఐ ఆంజనేయులు, సీనియర్ అడ్వొకేట్ రఘువీర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేనెల పీయూలో జాతీయ సదస్సు
● పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100కోట్లు ● రెండు రోజుల కార్యక్రమానికి రానున్న సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జూన్ చివరి వారంలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీయూకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్’ థీమ్తో సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల వైస్ఛాన్స్లర్లు, అన్ని యూనివర్సిటీలు, కళాశాలల పీఎం ఉషా స్కీం కోఆర్డినేటర్స్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో పలు సెషన్స్లో వివిధ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇటువంటి కార్యక్రమం దక్షిణ భారత్లో నిర్వహించడం మొదటిసారని, గతంలో ఉత్తరభారత్లో ఒకసారి నిర్వహించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలను యూనివర్సిటీలతో కలిసిపోయే విధంగా కార్యక్రమం ఉంటుందని, స్టార్టప్లు, వివిధ కంపెనీలు, రీసెర్చ్ స్కాలర్స్తో కార్యక్రమలలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులతోపాటు అందరికీ వీటిపై అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సదస్సు కోఆర్డినేటర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీకి జాతీయస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమని, కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం రూ.35లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
● రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం ● తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం ● 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన ● రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. -
నిబంధనల మేరకే అనుమతి..
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే ఈ ఏడాది కళాశాలలకు అనుమతులు ఇస్తున్నాం. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అందిన వాటిలో అడిషనల్ సెక్షన్ విషయంలోనే పెండింగ్ ఉన్నాయి. ఏ ఒక్క కళాశాలకు అనుమతి రాలేదు. ఉన్నతాధికారులకు విన్నవించాం. నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అనుమతి వచ్చిన తర్వాత ప్రవేశాలు చేసుకోవాలి. – సుదర్శన్రావు, డీఐఈఓ, నారాయణపేట ప్రభుత్వ కళాశాలల్లో చేరాలి.. ప్రైవేట్కు దీటుగా కొనసాగుతున్న ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఆలోచించా లి. అనుమతి ఉందా.. లేదా అనే సందేహాలు ప్ర భుత్వ కళాశాలలకు ఉండవు. ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగానే స్టడీ అవర్స్, స్లిప్ టెస్టుల నిర్వహ ణ, సిలబస్ పూర్తి చేసి పరీక్షల్లో సైతం చక్కటి ఫ లితాలు సాధిస్తున్నాం. ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్ నాశనం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. – పటేల్ రాంరెడ్డి, అధ్యాపకుడు, దామరగిద్ద సరళతరం చేయాలి.. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ విద్యా సంవత్సరం జీఓనంబర్ 29 అమలు చేయడంతో మిక్స్డ్ అక్యుపెన్సీ కళాశాలల విషయంలో ఐదేళ్ల వెసులుబాటు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సింగిల్ అక్యుపెన్సీ కాలేజీలతో పాటు మిగిలిన కళాశాలలకు జీఓను సవరించి అనుమతులు ఇవ్వాలి. కఠినంగా ఉన్న నిబంధనలు సరళీకృతం చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అనుమతి ఇవ్వాలి. – దేవేందర్రెడ్డి, ప్రైవేట్ కళాశాలల ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, నారాయణపేట ● -
బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట: బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసి బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసిరావాలని, బాలికల విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం, స్నేహ సంఘాల సహకారంతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ డా. వినీత్తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో బాలికల్లో చైతన్యం పెంపొందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. బాలికల విద్యాభివృద్ధే బాల్య వివాహాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన వారు ముగ్గురు బాలికలే కావడం గర్వకారణమన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చే బాలికలు ఉద్యోగ అవకాశాల దశకు వచ్చే సరికి వెనుకబడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదోతరగతి తర్వాత ఆరేళ్లు బాలికల భవిష్యత్ను నిర్ణయించే కీలక సమయమని.. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మలుస్తాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు బాలికల చదువుకు ప్రాధాన్యతనిస్తూ వారి కలలకు అండగా నిలవాలని కోరారు. వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యులైన మహిళలకు విద్యనందిస్తున్న వీఓలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలికల విద్య, అక్షరాస్యత, చట్టాలపై అవగాహన పెంపు, కిశోర బాలికల సంఘాల బలోపేతం వంటి చర్యలు భవిష్యత్లో బాల్య వివాహాల నియంత్రణకు బలమైన పునాదిగా నిలవనున్నాయన్నారు. జిల్లాలో మహిళా అక్షరాస్యత శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. మిషన్ మోడ్లో పనిచేద్దాం.. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డా. వినీత్ సూచించారు. మహిళల విద్యతోనే కుటుంబాలు, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిరోధక చట్టంపై కిశోర బాలికలు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. చట్టంపై బాలికలు ప్రదర్శించిన అవగాహనను కలెక్టర్, ఎస్పీ ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సీసీలు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డీఈఓ గోవిందరాజు, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
1.31 లక్షల మె.ట.వరి ధాన్యం సేకరణ
నారాయణపేట: జిల్లా లో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని.. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వేగంగా కొనుగోళ్లు, చెల్లింపులు చేస్తోందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 17,148 మంది రైతుల నుంచి 1,31,986 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మొత్తం విలువ రూ.315.31 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 15,986 మంది రైతుల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇది మొత్తం చెల్లింపుల్లో 83 శాతమని పేర్కొన్నారు. మిగిలిన రైతుల చెల్లింపులు వచ్చే 48 గంటల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. ఇప్పటి వరకు జిల్లాలో 98 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని.. మిగిలిన ధాన్యా న్ని రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిందని.. అధికారులు వెంటనే స్పందించి ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లులకు తరలిస్తున్నారని వివరించారు. రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నేడు గర్భిణులు, బాలింతలకు అవగాహన నారాయణపేట: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో శుక్రవారం ఉదయం 9.40 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణులు, బాలింతలకు తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణ, సమతుల పోషకాహారం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఎదుగుదల, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారని.. మహిళలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజియన్ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు. ఆశావర్కర్ల సమస్యలపరిష్కారానికి కృషి కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొల్లాపూర్లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, జ్యోతి, గౌరమ్మ, మాధవి, శివలీల పాల్గొన్నారు. -
‘కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పనులు’
మక్తల్: కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులు కమీషన్ల కోసమే చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ వద్ద రెగ్యులేటరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో కొత్తగా రెగ్యులేటరీ నిర్మాణం అవసరం లేదని.. అసవసరంగా కమీషన్ల కోసం నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఒక టీఎంసీ సామర్థ్యం ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్కు ఏ విధంగా ఏడు టీఎంసీల నీటిని తరలిస్తారని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పనులు చేపడుతున్నారని.. ఇలాగే కొనసాగితే హీమా ప్రాజెక్టు కింద ఉన్న సంగంబండ, భీమా ప్రాజెక్టుకు నీళ్లు చేరవన్నారు. భీమా ప్రాజెక్టు కింద 5 మండలాల భూములుకు పూర్తిగా సాగునీరు అందక ఎడారిగా మారుతాయని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి కొడంగల్కు నీళ్లు సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఈశ్వర్ తదితరులు ఉన్నారు. -
మినీ జూరాల నిర్మాణానికి కృషి
మక్తల్: కృష్ణా మండలం కోల్పూర్ వద్ద కృష్ణానదిపై మినీ జూరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చర్చలు జరిపి బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణానికి య త్నిస్తున్నారని చెప్పారు. గురువారం నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, ఊట్కూర్ మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మొదట మండలంలోని గొల్లపల్లి–మంతన్గోడ్ బీటీ రోడ్డు, చిట్యాల–గజరందొడ్డి మధ్య వాగుపై వంతెన పనులను పరిశీలించి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పదవులు శాశ్వతం కాదని.. చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలుస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మక్తల్లో 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరుకు ప్రయత్నిస్తున్నామని.. త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతే ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. జూరాల బ్యాక్వాటర్ కింద ముంపునకు గురైన అంకెన్పల్లి భూ సేకరణకు జీఓ విడుదలైందని తెలిపారు. మంత్రి వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాగనూర్ మండల అధ్యక్షుడు ఆనంద్గౌడ్, చిట్య్లా సర్పంచ్ రహమత్పాషా, కౌ న్సిలర్ రహీం పటేల్, మహేష్, శంషోద్దీన్, అమరేందర్రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● 2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ● ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారినపడి కుంగుబాటు ● అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ● ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు ● పిల్లల నూరేళ్ల జీవితాన్నీ చేజేతులా కాలరాస్తున్న వైనం అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. మధ్య తరగతి ప్రాణాలతో చెలగాటమాడుతున్న అప్పులు 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● 2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోన్, బెట్టింగ్ యాప్ల బారినపడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2025 ఆగస్ట్ 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. – డా. అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, పాలమూరు జనరల్ ఆస్పత్రి -
మహిళల చేతుల్లో ఇంధనం
ఆదర్శం.. నారాయణపేట మహిళా పెట్రోల్బంక్ మహిళల ఆర్థిక స్వావలంబనకు.. అప్పటి కలెక్టర్ కోయ శ్రీహర్ష మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని నిర్వాహకులు తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న 6 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడమే కాకుండా భారత్ పెట్రోలియం కంపెనీ ద్వారా రూ.1.10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సమాఖ్య తరఫున రూ.35 లక్షల పెట్టుబడి సమకూర్చి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వివరించారు. అయితే మధ్యలో కలెక్టర్ బదిలీ కావడంతో ప్రాజెక్టు నిలిచిపోతుందనే ఆందోళన నెలకొందని.. తర్వాత వచ్చిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలిసి ప్రాజెక్టు వివరాలు తెలిపామన్నారు. ఆమె సానుకూలంగా స్పందించి అన్ని శాఖల నుంచి అనుమతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. అధికారుల సహకారంతో పనులు పూర్తికాగా 2025, ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారన్నారు. నారాయణపేట: ఒకప్పుడు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన మహిళలు.. నేడు రూ.కోట్ల లావాదేవీలతో పెట్రోల్బంక్ను విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాకేంద్రంలో డీఆర్డీఓ, జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పెట్రోల్బంక్ ప్రస్తుతం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది. మహిళల ఆత్మవిశ్వాసం, అధికారుల సహకారం, సమష్టి కృషితో ముందుకు సాగుతున్న బంక్ను గురువారం శిక్షణ కలెక్టర్లు శ్రీకాంత్రెడ్డి, సచిన్, సురేష్, పారస్ సందర్శించారు. మహిళా సమాఖ్య సభ్యులు, నిర్వాహకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎంత పెట్టుబడి పెట్టారు? బ్యాంకులు, కంపెనీల సహకారం ఎలా లభించింది? ప్రస్తుతం ఆదాయం, లాభాలు ఎలా ఉన్నాయి? ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల ప్రోత్సాహం.. మహిళల పట్టుదల ఉపాధి మార్గం.. లాభాల బాట శిక్షణ కలెక్టర్లను ఆకట్టుకున్న మహిళా సమాఖ్య విజయగాథ -
మత్తు.. చిత్తు!
విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం ● ఈ ఏడాది నుంచి పకడ్బందీగా ప్రహరీ క్లబ్ల నిర్వహణ ● ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ ● 30వ తేదీలోపు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిందే –8లో uనారాయణపేట (నారాయణపేట రూరల్): చదువుకొనే చోట మాదక ద్రవ్యాల మహమ్మారిని మొగ్గలోనే తుంచి వేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం నషా ముక్త్ విద్యాలయ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ప్రహరీ క్లబ్లు పటిష్ట పరుస్తామని ప్రధానోపాధ్యాయులు, కళాశాలల యజమాన్యాలు ఇకపై ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. రాబోవు విద్యా సంవత్సరానికి శత శాతం అమలు జరపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రహరీ క్లబ్ అంటే.. చెడు వ్యసనాలకు గురవుతున్న విద్యార్థులను గుర్తించేందుకు పిల్లలతోనే ఏర్పాటు చేసిన సమూహాన్ని ప్రహరీ క్లబ్ అంటారు. ముఖ్యంగా ఈ విద్యార్థులు వారి తరగతిలోని ఇతర విద్యార్థులను గమనిస్తూ వారు ఏదేని చెడు అలవాట్లకు బానిస అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. తద్వారా వారిని కౌన్సెలింగ్ ద్వారా మార్చే ప్రయ త్నం చేస్తారు. అప్పటికి మార్పు రాకపోతే తల్లిదండ్రులు, పోలీసుల సహకారంతో సన్మార్గంలో నడి పేందుకు కృషి చేస్తారు. అదేవిధంగా కమిటీ సభ్యు లు వారి వారి గ్రామాల్లో మత్తు పదార్థాలకు సంబంధించిన వివరాలు, అమ్మకాలకు సంబంధించి సమాచారం సేకరించి గోప్యంగా కమిటీ కన్వీనర్కు అందిస్తారు. పోలీసుల సహకారంతో వాటి నిర్మూలనకు కృషి చేస్తారు. పాఠశాలలో, చుట్టు పక్కల డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు పనిచేస్తారు. క్లబ్ నిర్మాణం.. ప్రతి విద్యాలయంలో ఒక క్లబ్ ఏర్పాటు చేయగా కన్వీనర్గా ప్రధానోపాధ్యాయుడు, కో–కన్వీనర్లుగా పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడు, పోలీస్ అధికారి, తల్లిదండ్రుల్లో ఒకరు, ప్రతి తరగతి నుంచి ఒక బాలుడు, మరో ఇద్దరు బాలికతో కలిపి సు మారు 14 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను గతేడాది జిల్లా నుంచి ఒక సైన్స్ ఉపా ధ్యాయుడిని ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని ప్రతి పాఠశాలలోని కమిటీ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. కార్యాచరణ.. బాధ్యతలు పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఐఎస్ఎంఎస్ పోర్టల్లో స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వీసెస్ నుంచి డ్రగ్ ఫ్రీ డిక్లరైజేషన్ పత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా నిరోధించాలి. వాటి జాడలేని పాఠశాల వాతావరణాన్ని రూపొందించాలి. మత్తు అనర్థాలపై పిల్లలకు అవగాహన కల్పి ంచాలి. ఇవన్నీ పాటిస్తూ ధ్రువపత్రాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తన సంతకంతో తిరిగి అప్లోడ్ చేయాలి. కమిటీ ఏర్పాటుచేసి డిక్లరేషన్ సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు విధించారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రహరీ క్లబ్లు ఏర్పాటైనట్లు తెలుస్తుంది. కానీ పది శాతం కూడా యాక్టివ్గా లేక తూతూమంత్రంగా కమిటీని కాగితంపై ఉంచినట్లు గుర్తించారు. సమయం లేనందున మిగతా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు, కళాశాలలు వెంటనే కచ్చితమైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. లాగిన్ సౌకర్యం రాలేదు.. అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేసి సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణను సమర్పించాలని ఇప్పటికే డీఈఓ కార్యాలయం సంబంధిత విద్యాసంస్థలకు సమాచారం అందించింది. కానీ నషా ముక్త్ విద్యాలయాకు సంబంధించిన వెబ్సైట్లో జిల్లా విద్యాశాఖకు ప్రస్తుతం లాగిన్ సదుపాయం లేదు. క్లబ్ ఏర్పాటు చేయని బడుల వివరాలు అందుబాటులో లేవు. వెంటనే లాగిన్ అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. కళాశాలల్లోనూ క్లబ్లు ఏర్పాటు చేయించాలని డీఐఈఓ సైతం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సూచించారు. అయితే పాఠశాలలో ప్రిన్సిపాల్ ఇవ్వాల్సి ఉండగా, కళాశాలలో ప్రతి విద్యార్థి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేసే విద్యాసంస్థలు ఉన్నత పాఠశాలలు 88జూనియర్ కళాశాలలు 19 డిగ్రీ, బీఏడ్ కళాశాలలు 9 మెడికల్ కళాశాల 1గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ తదితర అన్ని విద్యాసంస్థల్లో మత్తు నిర్మూలనకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు రాగా.. పలుచోట్ల నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ఈసారి అలా జరగకుండా అన్ని విద్యా లయాల్లో పకడ్బందీగా కమిటీలను ఏర్పాటు చేయాలని, క్లబ్ల బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రధానోపాధ్యాయులు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించింది. అంతకుముందు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించింది. -
వరి ధాన్యం.. వర్షార్పణం
కోస్గి మండలం చెన్నారం గ్రామంలో బంగినపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కేంద్రం జలమయమైంది. కేంద్రంలోని 700 బస్తాల ధాన్యంతో పాటు రెండు ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని 5 ట్రాక్టర్లలో మిల్లుకు తరలించారు. కోస్గి–పల్లెర్ల ప్రధాన రహదారి బీటీని పొక్లెయిన్తో తవ్వి వర్షపు నీటిని బయటకు తరలించారు. నిర్వాహకులు సకాలంలో టార్పాలిన్లు ఇవ్వకపోవడం, ధాన్యం తరలింపులో నిర్లక్ష్యంతోనే నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కోస్గి రూరల్ పాలమూరే ప్రధానాస్త్రం! ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పోరు వచ్చే నెలలో పాదయాత్ర, బహిరంగ సభకు సన్నాహాలు ఇదే అంశంతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట 2027 డిసెంబర్లోపు పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ 2 రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు సీఎం సమాయత్తం పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు -
పటిష్టంగా అమలు చేయాలి..
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావడంతో జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఈ బూచి వ్యాప్తి చెందకుండా ఆదిలోనే అంతం చేయాల్సి ఉంది. గతంలో ప్రారంభించిన ప్రహరీ క్లబ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయుల సహకారం పూర్తిగా ఉంటుంది. – యశ్వంత్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎల్టీఏ ●నషా ముక్త్ విద్యాల యా నినాదంతో ఏర్పా టు చేస్తున్న ప్రహరీ క్లబ్లను ఈ ఏడాది పకడ్బందీగా నిర్వ హించనున్నాం. ఇప్పటికే విద్యాలయాలకు సమాచారం అందించాం. కమిటీ వివరాలతో పాటు డిక్లరేషన్ను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో సమర్పించాలని సూ చించాం. ఈ నెల 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఎంఈఓల ద్వారా వేగవంతం చేయిస్తున్నాం. – రాజేంద్రకుమార్, సీఎంఓ -
పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందాం
కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండలంలోని ప్రతి గ్రామం, పురపాలికను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి కోరారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులు, పుర చైర్మన్, కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పేయే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 14వ వార్డు కౌన్సిలర్ దినేష్ కోరగా పురపాలికకు వస్తున్న నిధులను ప్రణాళిక ప్రకారం కేటాయించి వినియోగించుకోవాలని కమిషనర్ శ్రీకాంత్ను ఆదేశించారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రతను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బుక్ కీపర్లు ప్రభుత్వ పథకాలను నీరుగార్చేలా పని చేస్తున్నారని పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు తెలుపగా.. పనిచేయని బుక్ కీపర్లపై చర్యలు తీసుకోవాలని, వినని పక్షంలో తొలగించాలని ఏపీఎం కృష్ణవేణిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామన్న, పుర చైర్పర్సన్ దిల్లీకర్ సరస్వతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీఎల్ఏలను నియమించుకోవాలి
నారాయణపేట: రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏలు)ను నియమించుకొని ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సహకరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బూత్స్థాయి ఏజెంట్లు రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతను పర్యవేక్షించడంతో పాటు ఇంటింటి సర్వే సమయంలో బూత్స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల వివరాల సేకరణలో సహకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, నకిలీ నమోదులు, ఇంకా నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. అలాగే ఓటరు నమోదు, పేరు తొలగింపు, మార్పుల కోసం దరఖాస్తు ఫారాలను ఎలా పూరించాలో ఓటర్లకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఎల్ఏలు బూత్స్థాయి అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో సమన్వయంగా పని చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, సమీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఇప్పటికీ బీఎల్ఏలను నియమించని రాజకీయ పార్టీలు వెంటనే నియామకాలు పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, సి–సెక్షన్ అధికారి జయసుధ, రాజకీయ పార్టీల నాయకులు సలీం, సాగర్, అబ్దుల్ ఖదీర్, వెంకట్రామారెడ్డి, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
8 నిమిషాల్లో పూర్తి
ఎస్బీఐ ఏటీఎం దొంగతనం చేయడానికి వచ్చిన ఈ ముఠా కేవలం 8 నిమిషాల్లో పని చేసుకొని అక్కడి నుంచి పరార్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు కూడా గుర్తించలేకపోయారు. ఏటీఎం దొంగతనం చేసిన దృశ్యాలు మొత్తం ఎదురుగా ఉన్న గురురాఘవేంద్ర సూపర్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు పుటేజీని పరిశీలించారు. అలాగే తెలంగాణ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, సింధు హోట ల్ ఏరియాలో ఉన్న లాడ్జిలలో దొంగలు బస చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. -
నాలా.. మాయ?
భారత్మాల భూ సేకరణలో అధికారుల చేతివాటం? –8లో uనారాయణపేట: జిల్లాలో భారత్మాల రహదారి భూ సేకరణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రహదారి విస్తరణ, అభివృద్ధి పేరుతో చేపట్టిన భూ సేకరణలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు.. కొందరు మధ్యవర్తులతో కుమ్మకై ్క పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్మాల రహదారి జిల్లాలోని మరికల్ మండలం పెద్దచింతకుంట నుంచి కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికిగాను అధికారులు సర్వే చేసి 553.35 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు గాను సుమారు రూ.214.49 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.175.70, కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా రూ. 38.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూ సేకరణలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు 1,463 మంది ఉండగా.. వ్యవసాయేతర భూములు కోల్పో యే వారి సంఖ్య 1,564 ఉన్నట్లు అధికారులు లెక్క లు చూపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ● మరికల్, తీలేర్ గేట్ సమీపంలో వ్యవసాయ భూమి లెక్కన ఎకరాకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. నాలా చేయడంతో పరిహారం డబ్బులు అధికంగా చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జక్లేర్, మక్తల్ టౌన్ శివారులోని భూముల్లో సైతం అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు విమర్శలు వస్తున్నాయి. గుడెబల్లూర్లో రెండు, మూడు సర్వేనంబర్లకు నాలా లేకున్నా.. సృష్టించి గజాల లెక్కన చెల్లించినట్లు విమర్శలున్నాయి. ● నాలా భూ పరిహారంలో పది నుంచి 20 శాతం వరకు బాధిత రైతుల నుంచి వసూలు చేసి అధికారులు తల కొంత పర్సేంటీజీ లెక్కన పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏదేమైనా భూ సేకరణలో రాజకీయ నేతల అండదండలు, అధికారుల చేతివాటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు తెలుస్తోంది. మౌనం ఎందుకు..? భూ సేకరణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. రెవెన్యూ, భూ సేకరణశాఖ అధికారులు మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిహారం లెక్కలపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి పెరుగుతోంది. అధికారుల అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అవకతవకలు సాధ్యమా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. 553.35 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేత భూమి సేకరణ వ్యవసాయ భూములను నాలాగా మార్చారని ఆరోపణలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు భూ సేకరణ సమయంలో భూ రికార్డుల్లో మార్పు లు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు భూములను వేరే కేటగిరీలో చూపించడం, కొందరికి ఎక్కువ పరిహారం, మరికొందరికి తక్కువ చెల్లింపులు జరగడం వెనుక ఆంతర్యం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. భూ సేకరణలో జరిగిన ప్రతి లావాదేవీపై విజిలెన్స్ లేదా న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్మాల రహదారి నిర్మాణంలో వ్యవసాయేత భూములు కోల్పోతున్న రైతులు 1,564 మంది ఉన్నట్లు సర్వేలో అధికారుల బృందం గుర్తించింది. సర్వే సమయంలోనే అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో పరిహారం అధికంగా ఇప్పించేందుకు అధికారులు వ్యవసాయ భూములకు పాత తేదీలు వేయించి పంచాయతీల్లో నామ్కే వస్తే తీర్మానాలు సైతం చేయించి వ్యవసాయేతర భూములుగా మార్చాలన్న ఆరోపణలు ఉన్నాయి. లేఅవుట్ సైతం రూపొందించి గజాల లెక్కన పరిహారం చెల్లించినట్లు పలువురు రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. భారత్మాల భూ సేకరణలో ఐదు బృందాలు పాల్గొని మూడు నెలల్లో ముగించాయి. ఒక్కో బృందంలో సర్వేయర్, గిర్దావర్, వీఆర్ఏతో కలిసి లాల్కోట చౌరస్తా నుంచి గుడెబల్లూర్ కృష్ణా వంతెన వరకు చేపట్టారు. పూర్తి నివేదికను అప్పటి కలెక్టర్ కోయ శ్రీహర్షకు అందజేశారు. తర్వాత పరిహారం డబ్బుల అవార్డును అప్పటి ఆర్డీఓ, భూ సేకరణ అధికారి జారీ చేశారు. వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.2.25 లక్షలు ప్రభుత్వ ధర ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించినా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు దాటదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలా చేసిన భూములకు గజానికి రూ.300 నుంచి రూ.500 ఉంది. అయితే మార్కెట్ విలువ ప్రకారం మూడు రేట్లు అయితే గజానికి రూ.1,500 నుంచి రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా గజానికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పోలీసు సేవలు మరింత చేరువ
నారాయణపేట: జిల్లా ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని బాధితులు, ఫిర్యాదుదారులు నేరుగా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి తమ సమస్యలను వివరించారు. మొత్తం 18 మంది ఫోన్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎక్కువ మంది తమ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అధికంగా నడుస్తున్నాయని, ఆరుబయట మద్యం తాగుతున్నారని, రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచాలని, డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న ఘటనపై ఫిర్యాదు చేశారు. సమస్యలను ఎస్పీ స్వయంగా నమోదు చేసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదు ను పూర్తిస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ.. నారాయణపేటలోని ఎరగ్రుట్ట చెక్పోస్టు, దామరగిద్ద మండలం కానుకుర్తి సరిహద్దు చెక్పోస్టును సోమవారం అర్ధరాత్రి ఎస్పీ డా. వినీత్ ఆకస్మికంగా సందర్శించారు. వాహన తనిఖీలు, రాత్రిళ్లు భద్రతా చర్యలు, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలనతో పాటు పాయింట్ బుక్ నమోదును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లాలోని 7 చెక్పోస్టుల వద్ద పోలీసులు, వెటర్నరీ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా జిల్లా పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అక్రమ మద్యం, గంజాయి, పశువుల అక్రమ రవాణా, పేలుడు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. -
చదువుతోనే భవిష్యత్కు భద్రత
నారాయణపేట (దామరగిద్ద): బాల్య వివాహాలు కుటుంబానికే కాదు.. సమాజ భవిష్యత్కే ప్రమాదకరమని, ప్రతి బాలిక తన జీవిత లక్ష్యాన్ని సాధించే వరకు చదువు కొనసాగించేలా సమాజం బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం దామరగిద్ద మండలం కంసానన్పల్లిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ‘బాల్య వివాహ రహిత తెలంగాణ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను గ్రామస్తులకు తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమాజంలో పేదరికం, మూఢ నమ్మకాలు, సామాజిక ఒత్తిళ్లు, భద్రతపై అపోహలు వంటి కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న వయసులో గర్భధారణతో బాలికల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని.. రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, ప్రసవ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006, పోక్సో, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా బాల్య వివాహాలకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రతి బాలికకు తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తల్లిదండ్రులు కూడా కుమార్తెలను భారం అనుకునే దృక్పథాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు, మహిళలు, విద్యార్థులతో బాల్య వివాహాలను అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, సర్పంచ్ సుశీలమ్మ, తహసీల్దార్ తిరుపతయ్య, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఉదయ్శంకర్, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, డీసీపీయూ, చైల్డ్లైన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
కోస్గి రూరల్/కొత్తపల్లి(మద్దూరు): కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించడంతో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిర్వాహకులపై అదనపు కలెక్టర్ శ్రీను మండిపడ్డారు. మంగళవారం కోస్గి, మండలంలోని మీర్జాపూర్, గుండుమాల్, మద్దూరు మండలం దమ్గాన్పూర్, పల్లెర్లలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి సరిపడా లారీలు వచ్చినా తరలింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఎవరి అనుమతి తీసుకొని ఇచ్చారని ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1లోగా కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. అలాగే ఆయా కేంద్రాల్లోని స్టాక్ రిజిస్లర్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని తరలించాలని సూచించారు. ధాన్యం సేరకణ ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తిచేసి డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరగా జమయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రా న్ని మండల అధికారులు పర్యవేక్షించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే మద్దూరు మండలంలోని జాదరావుపల్లి రైస్మిల్లులో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించి మిల్లు యజమానితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల నుంచి వచ్చిన లారీల్లోని ధాన్యం త్వరగా దించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్, ఏఓ ప్రవీణ్కుమార్, మహిళా సమైఖ్య అధ్యక్షురాలు మహేశ్వరి, జీహెచ్ఎం జనార్దన్, ఆయా గ్రామాల బుక్కీపర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్పీ’
నారాయణపేట: జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు, ఫిర్యాదుదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు తెలియజేయడానికి ఎస్పీ కార్యాలయ ఫోన్ నంబర్ 0850–6281182 కు కాల్ చేయొచ్చని సూచించారు. ఎస్పీ స్వయంగా ప్రజలతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను విని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ముఖ్యంగా శాంతిభద్రతలు, భూ వివాదాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకురావాలని సిబ్బంది కోరారు. ‘ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం’ నారాయణపేట: జిల్లా మహిళా సమాఖ్యను సీఎం రేవంత్రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా గాంధీ సీ్త్ర శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేట జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి వీసీలో సీఎంతో మాట్లాడారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లాభాల్లో కొనసాగుతోందని తెలిపారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలకు లభించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగుతామని అరుంధతి తెలిపారు. ‘ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరించాలి’ వనపర్తి: అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రణాళికబద్ధంగా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందుల లేకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ సంచాలకులు శ్యాంప్రసాద్లాల్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా సివిల్ సప్లై అధికారులు, డీఎంలు, కోఆపరేటివ్ అధికారులు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే ప్రభుత్వానికే ఇబ్బందని, వాటిని సేకరించాల్సిందే అని అధికారులకు సూచించారు. పూర్తిస్థాయిలో వర్షాలు పడకముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, అన్లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులను వడ్లు నిల్వ చేసుకోడానికి ఉపయోగించుకోవాలన్నారు. సీఎమ్మార్ ప్రక్రియను సైతం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, మహబూబ్నగర్ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, డీఎం ఆంజనేయులు, ట్రాన్స్ఫోర్ట్ అధికారి మానస, కోఆపరేటివ్ అధికారి బి.రాణి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల పౌర సరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి మయూరి పార్క్లో ప్లాస్టిక్ నిషేధం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, పార్క్ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని, మయూరి పార్క్లో జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్లోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు తీసుకురావడం అనుమతించమని స్పష్టం చేశారు. సందర్శకులు పర్యావరణహిత వస్తువులు మాత్రమే ఉపయోగించాలని కోరారు. వన్యప్రాణులు, పక్షులు, పార్క్లోని సహజ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్భయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని, సందర్శకులు, పర్యాటకులు ఈ నియమాలను పాటించి అటవీ శాఖకు సహకరించాలని విన్నవించారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ ఒక్కటే అడ్డంకి..
‘సూపర్’ సేవలకు ‘ఫోరం’ విఘాతం 2016లో అడుగులు.. 2023లో పనులు.. మహబూబ్నగర్లోని ఎదిరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ బస్స్టాండ్ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో 1,000 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2016లో మొత్తం రూ.450 కోట్లతో గత బీఆర్ఎస్ హయాంలో అడుగులు పడ్డాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.270 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కలెక్టరేట్లోని సామగ్రిని కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోకి మార్చేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. 2023లో ఆస్పత్రి భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. 4 బ్లాక్లు పూర్తి.. ఈ–బ్లాక్ పనులు షురూ.. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్లుగా విభజించి బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం ప్రారంభించారు. తొలి నాలుగు బ్లాక్ల (ఏ, బీ, సీ, డీ) నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఈ–బ్లాక్ నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎంల గోదాం ఉండగా.. ఈ అంశం కోర్టులో పెండింగ్లో పడింది. మూడు నెలల కిత్రం కోర్టు ఆదేశాలతో ఈవీఎంలను కొత్త కలెక్టరేట్కు తరలించడంతో సమస్య పరిష్కారం కాగా.. ఈ–బ్లాక్ పనులు ప్రారంభమయ్యాయి. చివరి దశలో పరికరాల బిగింపు.. మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి తరహాలో అధునాతన హాస్పిటల్ థియేటర్లు(ఎంఓటీ) ఐదు, ఆక్సిజన్ పైప్లైన్ వర్క్స్, ఫైర్ ఫైటింగ్ ట్యాంక్లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, పవర్, పవర్ బ్యాక్ అప్ సిస్టం, నాలుగు బ్లాక్లలో డొమెస్టిక్ పంప్లు, అంబులెన్స్ గ్యారేజీతో పాటు మెడికల్ గ్యాస్ పైప్లైన్లు, భారీ సామర్థ్యం గల రెండు వాటర్ ట్యాంక్లు, తొమ్మిది లిఫ్ట్లు, తొమ్మిది కౌంటర్లు, కేథల్యాబ్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్కు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ పనులు సైతం పూర్తయ్యాయి. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్టీ వంటి మొత్తం 35 వైద్య విభాగాలకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వైద్యసేవలందించేలా వైద్య పరికరాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ–బ్లాక్ అయితేనే వైద్య పరికరాల బిగింపు.. ఈవీఎంల సమస్య తీరడంతో ఆలస్యంగా ప్రారంభించిన ఈ–బ్లాక్లో మొత్తం ఐదు స్లాబ్లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు అంతస్తుల స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయింది. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే అధునాతన వైద్య పరికరాలను అన్ని బ్లాక్లలో అమర్చనున్నారు. ఆక్సిజన్, ఫైర్ ఫైటింగ్ వంటివి అనుసంధానంగా ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆయా పనులను ఒకేసారి చేయాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరులో పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మహబూబ్నగర్లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్నా.. వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల పార్కింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘అధికార’ యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళిక లేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కొనసాగుతున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఈ–బ్లాక్ నిర్మాణ పనులుజిల్లాకేంద్రంలోని 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 165 మంది వైద్యులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయినా.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువ శాతం మంది రోగులు మహబూబ్నగర్లోని జీజీహెచ్కే వస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటోంది. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జీజీహెచ్పై భారం తగ్గనుండగా.. వైద్యుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు పేదరోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి. వినియోగదారుల కేంద్రంపై వీడని అనిశ్చితే కారణం స్పందిస్తే త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈవీఎంల గోదాం తరలింపుతో చురుగ్గా సాగుతున్న ఈ–బ్లాక్ పనులు అత్యాధునిక వైద్యం కోసం నాలుగేళ్లుగా పేద రోగుల ఎదురుచూపులు ఈవీఎంల అడ్డంకి తొలగినా.. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలంలో ఉన్న వినియోగదారుల ఫోరం కేంద్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీన్ని న్యూటౌన్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలను సైతం పరిశీలించారు. కానీ.. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం.. వినియోగదారుల ఫోరం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతుండడంతో ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైన్ల ఏర్పాటు పూర్తయినా.. వాహనాల పార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. దీన్ని తరలిస్తే ఒక వైపు ఈ బ్లాక్.. మరోవైపు చివరి దశలో ఉన్న వైద్య పరికరాల బిగింపుతో పాటు వాహనాల పార్కింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆస్పత్రిని పలు పర్యాయాలు పరిశీలించారు. ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ లోపు పనుల పూర్తి గగనమేనని తెలుస్తోంది. -
రైతన్నా.. యాదుంచుకో
పొరుగు రాష్ట్రాల నుంచి యథేచ్చగా వస్తున్న నకిలీ విత్తనాలు–8లో uమరికల్: జిల్లాలో ఏటా వందలాది మంది రైతులు నకిలీ విత్తనాల బారినపడి నష్టపోతున్నారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తున్నాయని ఏజెంట్ల మాయమాటలు నమ్మి, సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. అక్రమార్కులు రూట్లు మార్చి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, పప్పు దినుసుల పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి, వరి సాగవుతుంది. నకిలీ విత్తనాల ముఠాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకొని, వారికి కమీషన్లు ఇస్తామని చెప్పి అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమవుతున్నారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాలు జనవరిలో వంద క్వింటాళ్ల నకిలీ విత్తనాలను (రూ.కోటి విలువ గల) జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరికల్ మండలంలోని ఎక్లాస్పూర్కు చెందిన కొందరు వ్యక్తులు దాదాపు 90 క్విటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు వాహనంలో తరలిస్తుండగా దేవరకద్రలో పట్టుబడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దిగుమతి చేసుకున్న విత్తనాలను గతేడాది సాగు చేసిన వారికే ఫోన్ చేసి రైతుల పొలాల దగ్గరకు చేరవేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా విత్తనాలు వచ్చిన వారం రోజుల్లో పోలీసులకు అనుమానం రాకుండా నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లాలోని మద్దూర్, కోస్గి, మరికల్, ధన్వాడ, నర్వ, మక్తల్, ఊట్కూర్ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిలో విత్తనాలను రూ.1,400 చొప్పున ఒక్కొక్క రైతు 5 నుంచి 50 కేజీల వరకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన విత్తనాలను రహస్య స్థలంలో భద్రపర్చినట్లు సమాచారం ఉంది. టాస్క్ఫోర్స్ పోలీసులు పకడ్బందీగా నిఘా పెడితే తప్ప వీరిని పట్టుకోలేరు. పట్టుబడని సూత్రధారులు ఈ దందాలో కిందస్థాయి ఏజెంట్లు లేదా స్థానిక రైతులు మాత్రమే పట్టుబడుతున్నారు. అసలు దందా నడిపేవారు ఇంతవరకు ఒక్కరూ చిక్కలేదు. మూలాలను కనిపెట్టి దందా అంతం చేయాల్సిన అధికారులు ప్రతిసారి విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏడాది అమాయకపు రైతులు నకిలీ విత్తనాలతో పట్టుబడి కేసులను నెత్తిన వేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలను అసలైన వాటిలా ఆకర్షించే ప్యా కింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. విత్తనాల కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వరు. నకిలీ నిషేధిత విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన రైతులు తమ మీద ఎక్కడ కేసులవుతాయోనని ఫిర్యాదుకు జంకుతున్నారు. రూట్లు మార్చి అక్రమ దందా చేస్తున్న దళారులు రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు నాటేందుకు అనువు ఇప్పటికే రైతుల వద్దకు చేరిన విత్తనాలు నకిలీ, నిషేధిత విత్తనాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి జిల్లాకు చేరుకుంటున్నాయి. అక్రమార్కు లు సీజన్ కంటే ముందే విత్తనాలను వస్తువుల మాటున గమ్యస్థానాలకు చేర్చుకుంటున్నారు. కొందరు నకిలీ బిల్లులతో ట్రాన్స్పోర్టుల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. నకిలీ విత్తనాలను నివారించేందుకు జిల్లావ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం నిఘా ఉంచాయి. రైతులు ఎవరూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయించే వారు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అక్రమార్కులు పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయ అధికారి వ్యవసాయ శాఖ గుర్తించిన డీలరు వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్యాకింగ్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ప్యాకింగ్ సరిగ్గా లేని వాటిని కొనుగోలు చేయరాదు. విత్తనాలు కొన్నప్పుడు విధిగా రశీదు తీసుకోవాలి. బిల్లుపై విత్తన రకం, లాట్ నంబర్, డీలరు సంతకం ఉండేలా చూసుకోవాలి. విత్తన ప్యాకెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు సరి చూసుకోవాలి. నాణ్యమైన విత్తనాల పరిమాణం, రంగు, ఆకారం ఒకే రూపంలో ఉంటాయి. చెత్త, బూజు, కీటకాలు ఉంటే నకిలీ లేదా కాలం చెల్లినవిగా గుర్తించాలి. ముడతలు పడినట్లు, రంగు మారినట్లు, బరు వు తక్కువగా (తేలికగా) ఉన్న వాటిని గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వీటిని పొలంలో విత్తి నష్టపోకూడదు. -
అంకేన్పల్లిలో భూసేకరణకు జీఓ విడుదల
మక్తల్: జూరాల బ్యాక్వాటర్లో ముంపునకు గురైన అంకేన్పల్లిలో భూ సేకరణకు ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వు లు జారీ చేయడంతో స్థాని కులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే జూరాల బ్యాక్ వాటర్లో అంకేన్పల్లి ముంపునకు గురైంది. కానీ స్థానికులకు పరిహారం అందలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో భూ సేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మే, 2026 జీఓను విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అంకేన్పల్లిలో 67.19 ఎకరాల భూ సేకరణ చేసేందుకు జీఓను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ సమస్యను పరిష్కరించాలని ఏళ్లుగా అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని వాపోయారు. గతంలో కొందరికి పరిహారం అందలేదని, మంత్రి వాకిటి చొరువతో అందరికీ న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అంకేన్పల్లి గ్రామం -
‘బడిబాట’ను ప్రజా ఉద్యమంలా చేపట్టాలి
నారాయణపేట: జిల్లాలోని ప్రతి ఒక్క చిన్నారికి విద్య అందించాలనే లక్ష్యంతో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన జిల్లా స్థా యి సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బడి మానేసిన పిల్లలు, ఇప్పటి వరకు ఏ పాఠశాలలో నూ నమోదు కాని బాలబాలికలు, వలస కుటుంబాల చిన్నారులను ప్రత్యేక సర్వేల ద్వారా గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రా మాలు, తండాలు, కాలనీల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి బడి బయటి పిల్లలను గుర్తించాలన్నారు. ప్రత్యేక కార్యాచరణ మూడేళ్లుగా విద్యార్థుల నమోదు గణాంకాలను విశ్లేషించి ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి పాఠశాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల నమోదు పెంపులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విస్తృత ప్రచారం ప్రభుత్వం పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిట ల్ తరగతులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాలు, క్రీడా సదుపాయాలు, లైబ్రరీలు, కెరీర్ గైడెన్స్ వంటి అంశాల గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దశల వారీగా.. తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమి టీలతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని.. మే 28 న యువత, గ్రామ నాయకులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. జూన్ 3న గ్రామసభలు, జూన్ 4 నుంచి 10 వరకు ఇంటింటి సర్వేలు, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్ 12 నుంచి 19 వరకు పాఠశాల స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, సీఎంఓ రాజేంద్రకుమార్, ఏఎంఓ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇంధరాఘాతం
మహబూబ్నగర్ రూరల్: ఒకపక్క నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. చమురు సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచడంతో ప్రజలపై అదనపు భారం పడింది. కొద్ది రోజులుగా నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.108.68 నుంచి రూ.113.60 చేరగా.. డీజిల్ ధర రూ.101.90 పైసలుగా ఉంది. ధరల పెరుగుదలతో వినియోగదారులతోపాటు రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. వ్యవసాయ రంగంపైనా దాని ప్రభావం పడుతోంది. డీజిల్ వినియోగం ఎక్కువ.. జిల్లాలో 60 కిలోమీటర్ల మేర ఎన్హెచ్–44 విస్తరించి ఉండడంతో హైదరాబాద్, కర్నూలుకు రాకపోకలు సాగించే వాహనాలు ఇక్కడి బంకులపైనే ఆధారపడతాయి. అందుకే డీజిల్ వినియోగం ఎ క్కువగా ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పెరిగిన ధరలు రైతులకు మరింత భారంగా మారనున్నాయని ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అన్ని నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతుందని, తద్వారా ఆ భారం సామాన్యులపై తీవ్రంగా ఉంటుందని సగటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరలు.. మరోవైపు అక్రమాలు ఒకవైపు పెరిగిన పెట్రో ధరలతో వినియోగదారులు తంటాలు పడుతుంటే.. మరోవైపు పెట్రోల్ బంకుల్లో అక్రమాల తంతు కొనసాగుతున్నది. వాహనదారు లు మీటర్ రీడింగ్ చూస్తుండగానే పెట్రోల్ పోస్తున్నప్పటికీ ఇందులో తేడాలు ఉన్నట్లు గతంలో పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. మీటర్ రీడింగ్లో మాయ చేస్తున్నారని తెలుస్తుంది. అధికారులు రోజు వారి విధుల్లో భాగంగా పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేస్తూ బంకుల యజమానుల అక్రమాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బడి.. బలోపేతం!
విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లోకి ప్రభుత్వ పాఠశాలలు అనుచిత పోస్టులు వద్దు : ఎస్పీ ● బడ్జెట్, అభివృద్ధి పనుల బాధ్యత వారిదే.. ● ఎస్ఎంసీ కమిటీ, ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్ పవర్ నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎన్నికల విధానంలో ఏ ర్పాటు చేసే ఎస్ఎంసీ కమి టీ ఎంతో బలోపేతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉపాధ్యాయులకు చెడ్డపేరు రాకుండా చెక్ పవర్లో పేరెంట్కు అవకాశం ఉండటంతో పారదర్శకత ఉంటుంది. పాఠశాలకు సంబంధించిన నిర్ణయాధికారంలో భాగస్వాములు అవుతాం. ఊరి బడిని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. – కృష్ణ, పేరెంట్, ముడుమాల్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కంటే ఎస్ఎంసీ కమిటీలు బలోపేతంగా ఉంటాయి. కమిటీలో చెక్పవర్ పేరెంట్కు సైతం ఉండటంతో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఉపాధ్యాయులకు ఒత్తిడి తగ్గుతుంది. కమిటీలు బాధ్యతగా వ్యవహరిస్తూ సమావేశాలకు పేరెంట్స్ను తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి. – రెడ్డప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీపీటీఎఫ్ ప్రస్తుతానికి ఎస్ఎంసీ కమిటీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది కొత్త విధానం ఏం కాదు. గతంలో ఉన్న దానిని తొలగించి రెండేళ్లుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి నామినేటెడ్ పద్ధతిలో జరిగాయి. కానీ ఎస్ఎంసీ కమిటీలు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఏర్పడుతాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా జిల్లాలో మార్పులు చేపడుతాం. – గోవిందరాజు, జిల్లా విద్యాధికారి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇకపై పాఠశాలల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కలిసి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనుంది. కమిటీలో 75 శాతం తల్లిదండ్రులు, 25 శాతం ఇతరులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో 50 శాతం మహిళలే ఉంటారు. జాతీయ విద్యా విధానం–2020 ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు సమాచారం. ● ప్రస్తుతం పాఠశాలలకు ఇస్తున్న సమగ్ర శిక్ష నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తున్నాయి. ఇక పీఎంశ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తోంది. రెండేళ్లుగా ఎస్ఎంసీ కమిటీలు లేకపోవడంతో వాటి స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎస్ఎంసీ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండేది. ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీలు నామినేట్ కావడంతో వారికి చెక్ పవర్ ఇవ్వలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాల నిర్వహణ, బడ్జెట్ ఖర్చులో పేరెంట్స్ కమిటీలే పవర్ఫుల్గా మారబోతున్నాయి. కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్పవర్ ఇవ్వనున్నారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా వాడేందుకు వీలుండదు. పాఠశాలల్లో రూ.30 లక్షల్లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్టమెంట్ అనుమతి లేకుండానే ఎస్ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు అనుమతి కల్పిస్తారు. 75 శాతం తల్లిదండ్రులే.. ఎస్ఎంసీ కమిటీలో 75 శాతం తల్లిదండ్రులు.. 25 శాతం ఉపాధ్యాయులు, పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు తదితరులు ఉంటారు. మొత్తం కమిటీలో 50 శాతం మహిళలు ఉండాలనే నిబంధన ఉంది. ఈ కమిటీ పదవీకాలం రెండేళ్లు కాగా.. నెలకు ఒకసారి కమిటీ విధిగా సమావేశం అవ్వాలి. ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి స్టేషన్ మహబూబ్నగర్: ముస్లింలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా అబుతాలిబ్ కోరారు. ఆల్ పార్టీ ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాత్రి ‘హమారీ ఆవాజ్’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మౌలానా అబుతాలిబ్ మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలను వీడి అభివృద్ధి వైపు దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, నెల్లంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, జూలకంటి రాంరెడ్డి మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్తోపాటు పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లిం డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని విన్నవించారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్నివర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, సచార్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. అలాగే సభలో టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, ప్రొఫెసర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్, ప్రముఖ సామాజికవేత్త జిలకరి శ్రీనివాసులు తదితరులు ప్రసంగిస్తూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అవసరం ఉందన్నారు. సభలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, హజ్రత్ మర్దాన్అలీషా దర్గా పీఠాధిపతి అబ్దుల్రజాక్షా ఖాద్రీ, జేఏసీ కమిటీ ప్రతినిధులు ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్పాష, హనీఫ్ అహ్మద్, ఎస్ఎం ఖలీల్, జాకీర్ అడ్వకేట్, మోసీన్ఖాన్, మౌలానా నాసిర్ మజహరి, ఇస్మాయిల్, మహ్మద్ అహ్మద్ అలీ సనా, హాఫిజ్ ఇద్రీస్, షేక్ సిరాజుద్దీన్, మౌలానా ఖవి, సాధిక్ హుస్సేన్, తయ్యబ్ బాష్వార్, అబ్దుల్లా సున్నీ తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట: సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, విధ్వేషాలు రెచ్చ గొట్టేలా, మత, కుల భావోద్వేగాలను దెబ్బతీసేలా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని ఎస్పీ డా. వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో హె చ్చరించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగాం, వాట్స ప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గాన్ని కించపరిచేలా లేదా ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించేలా పోస్టులు చేసిన వారితో పాటు వాటిని ఫార్వర్డ్ చేసి న వారిపైనా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నా రు. అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు తమ గ్రూపుల్లో జరిగే కార్యకలాపాలపై బాధ్యత వహించా ల్సి ఉంటుందని.. తెలియని వీడియోలు, పాత ఘటనలకు సంబంధించిన ఫొటోలు లేదా అసత్య సమాచారాన్ని నిర్ధారించకుండా షేర్ చేయవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాలను మంచి పనులు, సమాచార మార్పిడికే వినియోగించాలని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తే ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, అనుమానాస్పద పోస్టులు లేదా సందేశాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల ని ఎస్పీ ప్రజలను కోరారు. సామాజిక బాధ్యతతో సోషల్ మీడియాను వినియోగించి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వ ఆడిట్తో పాటు వార్షిక సోషల్ ఆడి ట్ తప్పనిసరి చేస్తున్నారు. బడులకు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి.జీరో టాలరెన్స్ వి ధానాన్ని పాటిస్తూ ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్యశాఖతో కలిసి చర్యలు తీసుకునే అధికారం ఎస్ఎంసీలకు కల్పిస్తున్నారు. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
మక్తల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగార భవిష్యత్ ఉంటుందని నేరెడు గోం పీఠాధిపతి సిద్ధలింగేశ్వర మహాస్వా మి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ మినీ ఫంక్షన్హాల్ లో బీటీఎం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాలకు చెందిన సుమారు 200 మంది పది, ఇంటర్ టాపర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు, గురువులు, గ్రామం, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని.. క్రీడాలు, చదువులో రాణించాలన్నారు. విద్యార్థులు చెడుకు బానిస కాకుండా క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఫౌండేషన్ అన్నివిధాలుగా అండగా ఉండటంతో పలువురు అభినందించారు. అనంతరం డాక్టరేట్ పొందిన తిమ్మయ్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిమ్మయ్య, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు గరిడి నరేందర్, పులిరాజు, రాఘవేందర్రావు, అయ్యప్ప, టి.నాగ రాజు, మాజీ సర్పంచ్ అశోక్గౌడ్, సత్యనారాయణ, కృష్ణయ్య, వెంకట్, సోఫీ, రవి, నింగప్ప, చంద్రశేఖర్, శ్యాం, హన్మంతు తదితరులు పాల్గొన్నారు. ‘పది’ టాపర్లకు సన్మానం.. పదోతరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, మక్తల్శాఖ అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో సోమవారం మండల విద్యాధికారి ఖాజా అమీరోద్దీన్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్సింహ, రవీందర్, నాగార్జున, భీంరెడ్డి, వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి శివశంకర్, రామాంజనేయులు, నరేందర్రెడ్డి, వెంకటేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
జలాశయంలో కష్టసాధ్యంగా పూడికతీత వ్యవహారం
గద్వాల:కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రా ష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మ డి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూ రాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపో యింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామ ర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్క లు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకు పోయినట్లు,ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరి పడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తు న్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. రాళ్లతో కూడినది కావడంతో.. సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమా రు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ జూరాల జలాశయంలో సుమారు 2 టీఎంసీలకుపైగా పేరుకుపోయిన బురదను ప్రభుత్వమే సొంతంగా తీయాలంటే పదేళ్లలో సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం అవుతున్నట్లు సర్వే చేసిన ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో బురదను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం వైపు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించిన అనంతరం వచ్చే ఇసుక క్వాంటిటీని సైతం లెక్కకట్టారు. 2 టీఎంసీల బురదను తొలగిస్తే జలాశయంలో మొత్తంగా 7.4 శాతం (సుమారు 76 లక్షల క్యూబిక్ మీటర్ల) ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులు లెక్కతేల్చారు. ఇది కూడా పదేళ్ల కాలపరిమితితో తొలగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జలాశయంలో లభ్యమైన ఇసుకను విక్రయించగా వచ్చే డబ్బుల్లో ప్రభుత్వానికి రూ.312 కోట్లు చెల్లించాలని అధికారులు నివేదిక రూపొందించి.. మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. -
గాలీవాన బీభత్సం
కోస్గి రూరల్/కొత్తపల్లి/మాగనూరు: జిల్లాలో ని గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గుండుమాల్ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. చెరువు కట్టపై 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. 4వ వార్డులోని గొల్ల కిష్టయ్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ● కొత్తపల్లి మండలం నిడ్జింత శివారు, గ్రామ ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. శివారు పొలాల్లో నిర్మించుకున్న కోళ్లఫారం షెడ్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ● మాగనూర్ మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, భారీవృక్షాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఆదివారం సాయంత్రం ఆరు వరకు విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నారాయణపేట: అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడి యో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. సమావేశంలో ధా న్యం కొనుగోళ్లతో పాటు సోమవారం నుంచి చేపట్టనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యా రు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని.. యుద్ధప్రాతిపదికన పది రోజుల్లోగా కొనుగోళ్లు పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదా ముల కొరత, లారీలు, హమాలీల సమస్యలు ఎక్క డ ఉన్నా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ట్యాబ్ ఎంట్రీలు, డేటా అప్డేషన్ను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాల ని హెచ్చరించారు. తాలు, తరుగు పేరుతో రైతుల ను మోసం చేసే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పొలాల్లో పంట అవశేషాలను కాల్చడంతో వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం దెబ్బతింటుందని.. రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ డా. వినీత్, పౌరసరఫరాల సంస్థ డీఎం సైదులు, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జూన్ 20న జాతీయ లోక్ అదాలత్
నారాయణపేట: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. శనివారం కోర్టులో నిర్వహించిన జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీస్ అధికారులతో కలిసి లోక్ అదాలత్ ఏర్పాట్లు, పెండింగ్ కేసుల పరిష్కారంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న కేసులను ముందస్తుగా గుర్తించి రాజీమార్గంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రమాదాలు, గొడవలు, చీటింగ్ కేసులు, వివాహ సంబంధిత వివాదాలు, చిన్నచిన్న దొంగతనం కేసులు, డ్రంకెన్ డ్రైవ్, కరోనా కాలం నాటి పెండింగ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు. అలాగే ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, సైబర్క్రైం కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్బీడబ్ల్యూ కేసులు, పెండింగ్ చార్జ్షీట్లను త్వరగా పూర్తిచేసి అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం ఉందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీమార్గంలో 80 నుంచి 95 శాతం వరకు కేసులను పరిష్కరించే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కోసం శనివారం సాయంత్రం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నాకాబంది నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 211 మంది వాహనదారులకు రూ.1,35,755 జరిమానా విధించినట్లు ఎస్పీ డా. వినీత్ వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీలు, అక్రమ రవాణా, మత్తు పదార్థాల తరలింపును అరికట్టేందుకు నాకాబంది నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్శాఖ ప్రధాన బాధ్యతని.. వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రజలు పోలీస్శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్స్టేషనన్లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. నాకాబందీలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి.. బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. టీమ్ బక్రీద్ నారాయణపేట ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘పరిశుభ్రత పాటించండి.. రోడ్లపై చెత్త వేయవద్దు అనే సందేశంతో రూపొందించిన అవగాహన బ్యానర్లను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో బాధ్యతాయుత భావన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీమ్ బక్రీద్ సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు అబ్దుల్ సలీం, అమీర్ుద్దీన్, మహ్మద్ తఖీచాంద్, సర్ఫరాజ్ హుస్సేన్ అన్సారీ, టీమ్ బక్రీద్ సభ్యులు, కన్వీనర్లు ఫారూఖ్ అహ్మద్, అనీస్ గద్వాల్, హఫిజ్ మహ్మద్ తఖీ, నజీర్ షాపూరి తదితరులు పాల్గొన్నారు. -
హిందూ బంధువుల ఐక్యతే లక్ష్యం
దేవరకద్ర: హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యపరిచి మనదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్స్వామిజీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి దేవరకద్రలో శ్రీనివాసగార్డెన్లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ.. యువత భారతీయ సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. హిందూ సమాజంలో ఐక్యత సేవాభావం పెంపొందిచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ధర్మరక్షణకు ముందుకు రావాలి సమాజంలో సనాతన ధర్మ విలువలను పరిరక్షించాల్సి అవసరం ఉందని, మహిళలు, యువత సామాజిక చైతన్యంతో ముందుకొచ్చి భారతీయ సంస్కృతిని భావితరాలకు అందిచాలని హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆమె ముక్యవక్తగా ప్రసంగించారు. సంస్కార భారతి ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆంజనేయులు, కల్వ నరేష్, భాస్కర్ పాల్గొన్నారు. పోరాటాల ఫలితంగానే వేతనాలు పెంపు జడ్చర్ల టౌన్: పోరాటాల ఫలితంగానే కార్మికుల వేతనాలు పెంచటం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ అన్నారు. శనివారం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిద్ద సెక్యూరిటి, పేషెంట్ కేర్ విభాగాల కాంట్రాక్టు కార్మికుల సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2012 నుంచి కనీస వేతనాల జీఓల సవరణకు నోచుకోక కార్మికులు ఆర్థిక నష్టంతోపాటు శ్రమ దోపిడీకి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన కనీస వేతనాలపెంపు శాసీ్త్రయంగా లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలకు పెంచాలన్నారు. సీఎం స్పందించి కనీస వేతనం పెంచుతూ జీఓ సవరించాలన్నారు. అలాగే జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటి పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాల చెల్లింపులో ఏజెన్సీ కాంట్రాక్టర్, అధికారుల అలసత్వం, అవినీతి అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని కోరారు. కార్మికులకు దాదాపు మూడునెలలుగా వేతనాల చెల్లింపు ఆపేశారని, దీనివల్ల కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఆస్పత్రి యూనియన్ నాయకులు నర్సింహ, నవీన్ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపాలి
నారాయణపేట: రైతులు వరి, పత్తి సాగుకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయం, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్పాం తోటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. శనివారం మక్తల్ మండలం జక్లేర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్న్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో గ్రామభారతి.. సత్య దర్శనం సహకారంతో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తి మాత్రమే కాకుండా భూ సారాన్ని కాపాడటంలో ప్రకృతి వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులకు అన్నివిధాల సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్లో మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, బ్లాక్, బ్రౌన్ రైస్ వంటి సేంద్రియ ఉత్పత్తులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), మహిళా సంఘాలు (ఎస్హెచ్జీలు) మార్కెటింగ్ లింక్గా పనిచేయాలని సూచించారు. ఆర్గానిక్ ట్యాగ్తో ఉత్పత్తులను విక్రయించాలంటే పెద్ద మార్కెట్లతో అనుసంధానం అవసరమని.. ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఫౌండేషన్ సభ్యులు చేసిన విజ్ఞప్తులకు సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, ఉద్యాన అధికారి సాయిబాబా, ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందజేత.. మహబూబ్నగర్లో ఈ నెల 1న నిర్వహించిన మెగా జాబ్మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై న జిల్లా అభ్యర్థులకు కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోందన్నారు. అర్హత, నైపుణ్యం కలిగిన స్థానిక యువతకు రానున్న రోజుల్లో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న భావన లేకుండా ఇష్టపడి పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని యువతకు ప్రేరణనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్ శెట్టి, డీపీఆర్వో రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఊట్కూర్: పట్టణ శివారులో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 5.30కే పనులకు రావాలని, ఎండ తీవ్రత పెరిగేలోగా ఇంటికి చేరాలని సూచించారు. కూలీలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని ఏపీఓను ఆదేశించారు. గ్రామపంచాయతీ పెద్దదని.. కనీసం 150 మంది కూలీలైనా ఉండాలని సూచించారు. మండలంలోని వల్లంపల్లి, బిజ్వార్, నాగిరెడ్డిపల్లిలో కూలీల సంఖ్య చాలా తక్కువగా ఉందని.. పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. సర్పంచ్ రేణుక కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఆమె వెంట ఏపీఓ లక్ష్మారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ రమేష్, రవి, పీఏ శివ తదితరులు ఉన్నారు. -
పాలిసెట్లో ఇద్దరికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
● పునరావాస కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు ● రెండేళ్లుగా చీకట్లోనే గడుపుతున్న పలు కాలనీల ప్రజలు ● పాఠశాల నిర్మాణం సైతం అసంపూర్తిగానే.. ● సమస్యలు పట్టని పాలకులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మొది ర్యాంక్ వచ్చింది. మహబూబ్నగర్లోని షాషాబ్గుట్టకు చెందిన కోట్ల మురళీధర్, శ్రీలతల కుమార్తె కోట్ల అపూర్వ ఎంపీసీ, ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటిర్యాంక్ సాధించింది. అలాగే నాగర్కర్నూల్కు చెందిన వాన్మయ్రెడ్డి సైతం రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించండం విశేషం. ‘రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంక్ సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తాను డాక్టర్ కావడమే లక్ష్యమని, అందుకోసం కష్టపడి చదువుతాను.’అని అపూర్వ పేర్కొన్నారు. సమస్యలతో సహవాసం! గట్టు: చిన్నోనిపల్లె నిర్వాసితులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రెండేళ్ల క్రితం గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మారిన నిర్వాసితులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 101వ ప్యాకేజీలో భాగంగా చిన్నోనిపల్లె వద్ద 2006లో రిజర్వాయర్ నిర్మా ణం చేపట్టి పూర్తిచేశారు. 2024 నుంచి నీటి నిల్వ చేస్తున్నారు. రిజర్వాయర్ బ్యాక్వాటర్ గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు ఇళ్లను ఖాళీచేసి.. యర్రగట్టు వద్ద ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోకి మారారు. నాటి నుంచి రెండేళ్లుగా సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కొన్ని ఇళ్లకే తాగునీరు.. మిషన్ భగీరథ పథకంతో కొన్ని ఇళ్లకు మాత్రమే తాగునీరు అందుతోంది. చాలా కుటుంబాలు తాగునీటి సౌకర్యానికి నోచుకోవడం లేదు. బోరుమోటా ర్ల ద్వారా అక్కడక్కడ ఏర్పాటుచేసిన నీటి నిల్వ తొట్ల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని నిర్వా సితులు ఆవేదన చెందుతున్నారు. తామే చందాలు వేసుకొని ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. పునరావాస కేంద్రంలో శ్మశానవాటిక కూడా సమస్యగా ఉందని.. ఇంకా 20 కుటుంబాలకు షిఫ్టింగ్ చార్జీలను చెల్లించలేదని వాపోతున్నారు. తడికెల మధ్యే తరగతులు.. పునరావాస కేంద్రంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఫిల్లర్లతో రెండంతస్తుల భవనాన్ని ని ర్మించి గదులను నిర్మించకుండా వదిలేశారు. దీంతో తడికెలను అడ్డుగా పెట్టుకుని తరగతి గదులను ఏ ర్పాటుచేశారు. పునరావాస కేంద్రంలో దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాథమిక పాఠశాల నిర్మాణాన్ని నేటికీ పూర్తి చేయడం లేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల కాలంలో చిన్న ఇటుకను కూడా పేర్చలేదని పేర్కొంటున్నారు. చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం చిన్నోనిపల్లెలో జనాభా : 1096 ఓటర్లు : 760 నివాసగృహాలు : 360 (పాత ఊరిలో 257)పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మనాన్నల ప్రోత్సాహం, మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించాను.పదో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సేకరించి ఇంటి వద్దనే ప్రిపరేషన్ కొనసాగించా. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని నా కోరిక. – వాన్మయ్రెడ్డి, నాగర్కర్నూల్ చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో అంతర్గత రో డ్లు అధ్వానంగా తయారయ్యాయి.ప్రధాన రోడ్డు ను సీసీగా మార్చేందుకు నిధులు వచ్చినా నిర్మా ణం చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. దీనికి తోడు గ్రామంలో ఎప్పుడో ఏర్పాటుచేసిన డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు ముందుకు పారకుండా నిలిచిపోతుండటంతో కిందిగేరి కాలనీ దుర్గందభరితంగా మారుతోంది. అదే విధంగా వడ్డే వీధి, కుర్వ వీధుల్లో విద్యుత్ సర ఫరా లేకపోవడంతో చీకట్లోనే కాలనీవాసులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి చిన్నోనిపల్లి పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు..
మాకు పునరావాస కేంద్రంలో ఒకే ప్లాటు ఇచ్చారు. నా కు ఇద్దరు కొడుకులు ఉన్నా రు. వారికి పెళ్లిళ్లు అయ్యా యి. పిల్లలు ఉన్నారు. ఒకే ఇంట్లో మూడు కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఇద్దరు కుమారులకు ప్లాట్టు ఇవ్వాలని పాత ఊరిలో ఉన్నప్పుడే అడిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పి చెప్పి విసుగొచ్చింది. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. – లక్ష్మి, చిన్నోనిపల్లె చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేదు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. పునరావాస సమస్యలపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక దృష్టిసారించి పరిష్కరించాలి. – యు.దేవేందర్, సర్పంచ్, చిన్నోనిపల్లె చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇదివరకే పునరావాస కేంద్రంలో చేపట్టిన వివిధ పనులు పురోగతిలో ఉన్నాయి. 360 కుటుంబాలకు షిఫ్టింగ్ చార్జీలను చెల్లించడం జ రిగింది. ఇంకా ఎవరైనా ఉంటే, వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల అఽ దికారులను సమన్వయం చేసుకుని పునరావాస కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తాం. – శ్రీనివాసరావు, ఆర్డీఓ, గద్వాల ● -
‘చేయూత’ ఎందరికో..!
కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం దృష్టి ● జిల్లాలో ప్రస్తుతం 72,734 మంది లబ్ధిదారులు ● ఏళ్లుగా దరఖాస్తుదారుల ఎదురుచూపులు.. నెరవేరనున్న ఆశలు మరికల్: చేయూత పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు నెరవేరనున్నాయి. అర్హులైనా లబ్ధి పొందక ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వివిధ కారణాలతో కొత్త పింఛన్ల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పంపిణీ చేయాలని నిర్ణయించడం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తే. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించడం విశేషం. జూన్ 2 నుంచి.. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాల వారీగా అర్హులైనా వారి జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా కొత్తవి మంజూరు చేయకపోవడంతో ఎంతోమంది అర్హులైన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వర కు కేవలం మృతిచెందిన వారి స్థానాల్లో వారి భార్యలకు మాత్రమే వితంతు పింఛన్లు మంజూరవుతున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వందల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారు. కొత్త వారికి అవకాశం.. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ ద్వారా అనర్హుల లెక్క తేలనుండటంతో వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023, డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలనలో అర్జీలు స్వీకరించారు. ఇందులో చేయూత పింఛన్ల కు జిల్లా వ్యాప్తంగా 50 వేలకు పైగా దరఖాస్తులు రా వడం గమనార్హం. ఇవేగాక ప్రజావాణిలో వేలాది మంది అ ర్జీ చేసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారికి పింఛన్ అందే అవకాశం ఉంది. యాప్లో నమోదు ఇలా.. చేయూత పింఛన్దారుల వివరాలు ముఖ గుర్తింపు యాప్లో నమోదు చేస్తున్నారు. మృతిచెందిన, వలస వెళ్లిన వారితో పాటు జీవించి ఉన్న లబ్ధిదారుల వివరాలతో జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జాబితాల రూపకల్పన అనంతరం గ్రామసభలు నిర్వహించి మృతిచెందిన వారి పేర్లను సభ ఆమోదంతో తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. ఇది వరకు వచ్చిన అర్జీలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో అర్హులైన వారుంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాల్లో అర్హులైన వారి నుంచి అర్జీలు తీసుకునే పనిలో కార్యదర్శులు నిమగ్నమయ్యారు. కొన్ని మండలాల్లో గతంలోనే అర్హులైన వారు దరఖాస్తులు సైతం సమర్పించారు. కొత్తగా పింఛన్ల కోసం దర ఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి ప్రభు త్వ నిబంధనల మేరకు ఎంపిక చేస్తాం. మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే మండల అధికారులు పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్త వారు కూడా చేసుకోవచ్చు. – జయన్న, డీపీఎం, నారాయణపేట వృద్ధాప్య పింఛన్కు రాష్ట్ర నివాసిగా ఉంటూ 57 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఆధార్, ఓటరు ఐడీ, రేషన్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం కలిగి ఉండాలి. వితంతు పింఛన్కు కనీసం 18 ఏళ్లు నిండి భర్త మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలి. దివ్యాంగులకు వయోపరిమితి లేదు. కనీసం 40 శాతానికిపైగా వైకల్యం ఉంటే సరిపోతుంది. సదరం ధ్రువీకరణ పత్రం, యూడీఐడీ కార్డు, ఆదాయ ధ్రువీకణ పత్రం ఉండాలి. చేనేత, కల్లుగీత కార్మికుల పింఛన్కు కనీసం 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. సంబంధిత సొసైటీ గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. బీడీ కార్మికుల పింఛనుకు 50 ఏళ్లలోపు ఉండి గుర్తింపు పత్రం తప్పనిసరిగా దరఖాస్తుకు జత చేయాలి. -
బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి..
ప్రభుత్వం కేవలం ఆయిల్ పాం సాగును మాత్రమే ప్రోత్సహించకుండా మిగిలి న ఉద్యాన పంటల సాగుకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు గతంలో మాదిరి గా ఎలాంటి కోత విధించకుండా డ్రిప్ పరికరా లను రాయితీపై అందించేందుకు చర్యలు చేప ట్టాలి. సాంప్రదాయ పంటలు కాకుండా ఉద్యా న సాగు చేసుకునేటట్లు పరికరాలను సబ్సిడీపై అందించాలి. – ఎం.రాములు, రైతు, పెద్దకడ్మూర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇప్పటికే రైతులకు రాయితీపై మొక్కలు, పరికరాలు అందిస్తున్నాం. డ్రిప్, స్ప్రింక్లర్లకుగాను రైతులకు అందించే రాయితీలో పది శాతం కోతను ప్రభుత్వం విధించింది. ఇతర ఉద్యాన రైతుల వినతులను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – సాయిబాబు, జిల్లా ఉద్యాన అధికారి -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నారాయణపేట: జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాటపై ‘జోరుగా జూదం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన కోస్గి ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి పట్టణ సమీపంలోని చెన్నారం రోడ్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో దాడి చేశారు. 9 మంది పట్టుబడ్డారని వారినుంచి 5 సెల్ఫోన్లు, పేక ముక్కలు, రూ.29,180 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ఆ సమయంలో పేకాట ఆడుతూ పట్టుబడింది 12 మంది కాగా.. అందులో ముగ్గురిని తప్పించినట్లు తెలుస్తోంది. డబ్బులు తీసుకొని వదిలేశారంటూ చర్చ జరుగుతోంది. పట్టుబడిన వారిలో ఓ రైస్మిల్లు యజమాని, ఓ బడా వ్యాపారి, మరో వ్యక్తి ఉండగా.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిని తప్పించడంలో ఎస్పీ కార్యాలయానికి చెందిన ఓ కానిస్టేబుల్, అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ప్రచారం సాగుతోంది. దాడిలో రూ.29,180 మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతుండగా.. సుమారు రూ.లక్షకు పైగా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్ఫోన్లు సైతం 14 దొరికితే కేవలం 5 మాత్రమే స్వాధీనం చేసుకొని కేసులో పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టుబడ్డది 12 మంది.. కేసులు 9 మంది పైనే..? డబ్బులు తీసుకొని తప్పించారని బాధితుల ఆవేదన 5 సెల్ఫోన్లు, నగదు స్వాధీనం నగదు, మొబైల్స్ లెక్కలపై అనుమానాలు -
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
నారాయణపేట: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాను మరో కోనసీమగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రూ.5 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి వలసల బాధను శాశ్వతంగా తొలగిస్తామన్నారు. కాట్రేవ్పల్లి నుంచి కానుకుర్తి వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని.. గతంలో వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను వలసలు వచ్చే జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మొదట ప్రజలకు నమ్మకం లేకపోయినా.. ప్రస్తుతం గ్రామగ్రామాన గృహ ప్రవేశాల పండుగలు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా గ్రామాలు, పురపాలికల అభి వృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన సన్నరకం వరికి బోనస్తో పాటు గిట్టుబాటు ధర అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేష న్ షాపుల ద్వారా అందిస్తున్నామని.. ప్రతి గ్రామానికి ఓ రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారుల పాత్ర కీల కమని.. పెండింగ్ దస్త్రాల పరిష్కారం, అభివృద్ధి ప నులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించా రు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలను అధికారు లు గౌరవంగా స్వీకరించి పరిష్కారానికి కృషి చేయా లని కోరారు. ఉచిత బస్సు ప్రయాణంతో మ హిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రో ల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ కొనసాగుతుండటం మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ప్రజల చేరువకే గ్రామ, వార్డుసభలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గ్రామ, వార్డుసభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మార్చి 6న ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగుతుందని.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, రైతు, మహిళా సాధికారత, యువత, పర్యావరణం తదితర 10 థీమ్స్ ఆధారంగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్డీఓ రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మున్సిపల్ చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. – నారాయణపేటను మరో కోనసీమగా తీర్చిదిద్దుతాం – రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రాయితీలో కోత..!
బిందు, తుంపర సేద్యం పరికరాల సబ్సిడీలో 10 శాతం కోత ● అన్నదాతలపై అదనపు భారం ● ఉద్యానానికి ఊతమేది..? నర్వ: రైతులు నీటి కొరతను అధిగమించేందుకు ఆరుతడి పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలు, పొద్దుతిరుగుడు, పండ్ల తోటల్లో సూక్ష్మ సేద్యం పరికరాలను అన్నదాతలు అత్యధికంగా వినియోగస్తున్నారు. ఆయిల్పాం సా గును ఇటీవల సర్కారు ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం పరికరాలకు డి మాండ్ పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం ఇ టీవల రాయితీలో కోత విధించింది. పది శాతం మే ర తగ్గించడంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది. ఆయిల్పాంకు తొలి ప్రాధాన్యం.. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యాన అధికారులు ఆయిల్పాం సాగుకు తొలి ప్రాధాన్యమిచ్చి జిల్లాలో 8 వేల ఎకరాల లక్ష్యం విధించారు. దాని తర్వాతే పండ్ల తోటలు, చివరి దశలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలున్నాయి. దీంతో ఉద్యాన పంటలకు రాయితీ అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నీటి ఆదాకు మార్గం.. బిందు, తుంపర పరికరాల వినియోగంతో 43 శా తం నీరు, 33 శాతం విద్యుత్ ఆదా అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక దిగుబడి సైతం 52 శాతం అదనంగా వస్తుందని పలు సంస్థలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సర్వేల ద్వా రా తెలిసింది. ప్రభుత్వం రాయితీలో కోత విధించడంతో సాగునీటి వృథాతో పాటు, విద్యుత్ వినియోగం కూడా పెరగనుందని రైతులంటున్నారు. సన్న, చిన్నకారు రైతులే అధికం.. జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు అత్యధికంగా ఉన్నారు. అర ఎకరా మొదలు రెండెకరాల వరకు కూరగాయాలు, పప్పుదినుసులు, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకునేవారు ఎక్కువగా బిందు సేద్యం పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం తగ్గించిన 10 శాతం రాయితీని రైతులే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని మొదట్లో చెల్లిస్తేనే పరికరాలు అమర్చుతామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నాయి. 4.20 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో ఏటా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను మూస ధోరణిలో పండిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 4.20 లక్షలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 58 వేల ఎకరాల్లో పత్తి, 1.90 లక్షల ఎకరాల్లో వరి, 1.80 లక్షల ఎకరాల్లో కంది, 5 వేల ఎకరాల్లో పెసర సాగు కానుంది. చాలామంది రైతులు ఆరుతడి పంటల సాగుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 7,416.93 హెక్టార్లలో 2,326 డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీలకు ఉచితంగా, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించేది. ఇకనుంచి ఎస్సీ, ఎస్టీలకు పది శాతం కోత విధించి 90 శాతం, 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న బీసీ, ఓసీ రైతులకు 90 శాతం ఉండగా.. 80 శాతానికి తగ్గించనుంది. 5 ఎకరాలకు పైగా భూములున్న వారికి 80 శాతం రాయితీ ఇస్తుండగా 70 శాతానికి పరిమితం చేశారు. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు బిందు, తుంపర సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారంతా సొంతంగా ఏర్పాటు చేసుకోవటమా లేక సాగును పక్కనబెట్టి ఇతర పంటల వైపు దృష్టి సారించడమా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ప్రైవేట్గా అమర్చుకుంటే జిల్లాలోని రైతులకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్స్) పరికరాలపై భారం రూ.కోట్లల్లో పడనుంది. -
జీల్దార్తిప్పలు తప్పేనా..?
● కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అందని సాగునీరు ● నీటి తరలింపునకు రెండుసార్లు శంకుస్థాపన ● ఏళ్లతరబడిగా మొదలుకాని పనులు కృష్ణా నీటికి నోచుకోని మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల రైతులు కొల్లాపూర్: కృష్ణానది నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలించే పనులు జరుగుతాయో.. లేదో అనే సందిగ్ధం నెలకొంది. కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు కూతవేటు దూరంలోనే ఉన్న జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానదీ నీటిని తరలించే ప్రక్రియ ఏళ్ల తరబడి ప్రకటనలు, శిలాఫలకాలకే పరిమితమవుతోంది. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం గ్రామాలు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు సమీపంలోనే ఉంటాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పక్కనే ఉన్నా ఆ గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. ఇందుకోసం నిధులు మంజూ రుచేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కృష్ణానది నీటిని మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్లతో కృష్ణా బ్యాక్వాటర్పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామ పొలాలకు సాగునీరు మళ్లించాలనే అంశం తెరపైకి వచ్చింది. 2019లో కేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించగా.. అదే సంవత్సరం మార్చిలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే సాకుతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్లతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జీల్దార్తిప్పకు వెళ్లే మార్గంలో పెద్దవాగు, ఉడుములు వాగు, చిన్నవాగులు ప్రవహిస్తుంటాయి. వీటిమీదుగా కాల్వల నిర్మాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాల్వల కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఇక్కడి రైతులు పైప్లైన్ ద్వారా నీటిని తరలించాలని కోరుతున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా పైప్లైన్ నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తరలించవచ్చని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో జీల్దార్తిప్ప చెరువు అంశంపై కూడా చర్చించారు. కాల్వల తవ్వకాలకు ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు మంత్రికి వివరించారు. కేఎల్ఐ ప్రాజెక్టులోని డీ–5 కాల్వకు అనుసంధానంగా కాల్వలు తవ్వాలని గతంలో అధికారులు నిర్ణయించారు. డీ–5 కాల్వ పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్లో మునిగిపోతోంది. దీంతో ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్కు అనుసంధానంగానే నీటి తరలింపు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాల్వలు తవ్వేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాల్వలకు బదులుగా ప్రెజర్మెయిన్స్ ఏర్పాటు చేసి.. పైప్లైన్లతో నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై నివేదిక అందజేసిన అధికారులు తర్వాత ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ–5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో స్లూయిస్ ఏర్పాటు చేశారు. అక్కడే 318 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో పైప్లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములుకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. – వెంకట్రెడ్డి, నిర్వాహకుడు, గ్రామాభ్యుదయ సేవా సంస్థ, ఎల్లూరు -
ఉన్నతాధికారుల పరిశీలనలో..
జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించడం జరిగింది. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వారి ఆదేశాల తర్వాతనే పనులు ప్రారంభం అవుతాయి. – అమర్సింగ్, డీఈ , నీటిపారుదలశాఖ మా గ్రామాలకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పినా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మొదట్లో కాల్వల ద్వారా నీటిని తరలిస్తామని, ఇప్పుడు పైప్లైన్ల ద్వారా అంటున్నారు. త్వరగా పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలి. – గోవిందు, రైతు, మొలచింతలపల్లి గ్రామం ● -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకు ముందడుగు మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. 3 లక్షలకుపైగా ఖాతాదారులు డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియోగి స్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్ను అధిగమించడం బ్యాంక్ ప్రగతికి నిదర్శనంగా భావిస్తున్నారు. సహకార రంగంలో విశ్వసనీయ సేవలతోపాటు ఆధునిక సాంకేతిక సేవలను అందిస్తూ డీసీసీబీ ముందుకు సాగుతుండటంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన బ్యాంక్తో స్మార్ట్ బ్యాంకింగ్ను ఆస్వాదించండి’ అనే నినాదంతో యూపీఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంక్ యాజమాన్యం ఖాతాదారులను కోరుతుంది. -
పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాలి
జడ్చర్ల: శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిల్లలమర్రి మ్యూజియం సహాయ సంచాలకులు నాగలక్ష్మి పేర్కొన్నారు. ఆల్వాన్పల్లి గ్రామశివారులో గొల్లత్తగుడి ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లత్తగుడి వైభవాన్ని ఈ సందర్భంగా అక్కడి వారికి వివరించారు. క్రీ.శ. 7–8వ శతాబ్దానికి సంబంధించి జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. జైన దేవాలయ అవశేషాలు, ఇటుకలతో నిర్మాణశైలి, తవ్వకాలలో లభించిన జైన శిల్పాలు చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ, పురాతన కట్టడాలను పరిరక్షించకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలోసర్పంచ్ దాసుయాదవ్ పాల్గొన్నారు. -
భానుడి భగభగ
గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాల వారీగా ఇలా.. మహబూబ్నగర్ (బాలానగర్) 43.6 గద్వాల (ఉండవెల్లి) 43.3 పాలమూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేడి గాలులు అధికంగా వీస్తుండడంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరులో అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లపల్లిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట (దామరగిద్ద) -
జిల్లాస్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమంలో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆమె కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి కోస్గి రూరల్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. కోస్గి రాంలీలా మైదానంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. తరుగు, తాలు పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్ నర్సింహులు, సాయిలు, జనార్దన్, నీలప్ప, హుస్సేనప్ప, బిచ్చప్ప, మధుసూదన్రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు. ఉద్యమకారులకు అన్యాయం చేయొద్దు మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను క్షేత్రస్థాయిలో గుర్తించి.. సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. గురువారం మక్తల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కేశవరావు నేతృత్వంలో కమిటీ వేయడం హర్షణీయమన్నారు. అయితే ఉన్నతస్థాయి నాయకులను కాకుండా.. అట్టడుగున ఉన్న ఉద్యమకారుల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయొద్దని కోరారు. కాగా, వచ్చేనెల 21న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్మించే తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం కార్యక్రమానికి మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల నుంచి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎండీ రహీం, బోర్ర సురేశ్, బోరెల్లి సురేశ్, మహేశ్, శ్రీనివాస్, కృష్ణ, గాయత్రి ఉన్నారు. -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
● 19 బీటీరోడ్ల నిర్మాణానికి రూ.68కోట్లు మంజూరు ● త్వరలోనే 150 పకడల ఆస్పత్రి అందుబాటులోకి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్, ఫయాజ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్, మందుల నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేశ్, ఓబులేషు, వెంకటేశ్, లక్ష్మణ్, శ్యామ్, రవి పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
దామరగిద్ద: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని వ్యవసాయ శాస్త్రవేత్త శైలజ అన్నారు. గురువారం మండలంలోని లోకూర్తి రైతు వేదికలో సర్పంచ్ రాజు సమక్షంలో జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ, విత్తనాలు, ఎరువులు కలుపు మందులు, నీటి యాజమాన్యం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి యాజమాణ్యం పద్ధతులపై రైతులు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్ట పశువుల పేడ వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. డ్రోన్లు ఇతర యాంత్రీక పరికాలను ఉపయోగించి వ్యవసాయం చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్ మాట్లాడుతు మేలైన విత్తనాలు ఎంచుకోవాలని పంట మార్పిడితో నేల సారాన్ని పెంచుకోవడంతో పాటు పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. ప్రతి రైతు విధిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఏఓ బాలాజీ ప్రసాద్, అపేడ్ అసిస్టెంట్ మేనేజన్ సుఖేష్, ఏఈఓ అజయ్కుమార్, రైతులు భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
జోరుగా జూదం!
జిల్లాలో గుట్టుగా సాగుతున్న పేకాట ● పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నా మారని తీరు ● నాలుగేళ్లలో 79 కేసులు నమోదు ● రూ. 11,37,539 నగదు స్వాధీనం –8లో uనారాయణపేట: సరదాగా మొదలయ్యే జూదం.. కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే వ్యసనంగా మారుతోంది. ‘‘ఒక్క రాత్రిలో రూ.లక్షలు సంపాదిస్తాం’’ అనే ఆశతో పేకాట ఆడుతూ.. చివరకు రూ.లక్షల్లో అప్పులపాలవుతున్నారు. కొందరు యువత ఉద్యోగాలను వదిలి పేకాటకు బానిస కావడం కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాలు, ఫాంహౌస్లు, వ్యవసాయ పొలాల్లో పేకాటరాయుళ్లు రహస్య స్థావరాలను ఏర్పాటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు తమ ఇళ్లను పేకాట క్లబ్లుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడినా మారని తీరు.. జిల్లాలో పేకాటరాయుళ్లు పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైనా తీరు మారడం లేదు. పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు చేపట్టి.. పేకాటరాయుళ్లపై కేసులు నమోదు చేస్తున్నా పేకాట జోరు మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల కాలంలో 79 కేసులు నమోదుచేసి.. రూ.11,37,539 నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు 407 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 219 మొబైల్స్, 148 ద్విచక్ర వాహనాలు, 2 ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ రహస్య ప్రాంతాల్లో మళ్లీ పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువత భవిష్యత్పై ప్రభావం.. ఆన్లైన్ గేమింగ్ పేరుతో పేకాట తరహా బెట్టింగ్ పెరుగుతోంది. చిన్న వయసులోనే డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ వలలో పడుతున్నారని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేసి.. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్నా, రహస్య ప్రాంతాల్లో మళ్లీ ఆటలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మార్చి 23న నర్వ పోలీస్స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు, నర్వ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,22,900 నగదు, 9 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 9న నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బొమ్మన్పాడులో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి.. ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 4,330 నగదు, 4 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 11న కోస్గి బస్టాండ్ సమీపంలోని ఎన్.రాకేశ్ అనే వ్యక్తి నివాసంలో టాస్క్ఫోర్స్, కోస్గి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి.. పేకాట ఆడుతున్న 9మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,89,800 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న నర్వ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి.. రూ. 1,13,200 నగదు, 52 పేకాట కార్డులు, 15 మోటార్ సైకిళ్లు, 18 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 16 మందిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కొత్తపల్లి(మద్దూరు): రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. గురువారం మద్దూరు మండలంలోని అప్పిరెడ్డిపల్లి, చెన్వార్, దోరేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు వివరాలను తెలుసుకోవడంతో పాటు రైతుల సమస్యలపై ఆరా తీశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. డీఏఓ వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్, ఏఓ ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
కోస్గి రూరల్: ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కోస్గిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులు, సిబ్బంది కేటాయింపు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుపుకొని పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందించేలా వ్యవహరించాలని, డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, హాట్స్పాట్లను గుర్తించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. చోరీల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఉంచాలని, రాత్రిళ్లు గస్తీ నిర్వహించాలన్నారు. బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కో రారు. అనంతరం సిబ్బంది మురళీమోహన్, విజయమ్మ, యూనుస్, ఆఖిల్, తసూజ్కు రివార్డులు అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ మహేష్, సీఐ సైదులు, ఎస్ఐ బాలరాజు ఉన్నారు. -
అక్రమ రవాణాపై నిఘా
జిల్లాలో ఏడు చెక్పోస్టుల ఏర్పాటు ● పశువుల తరలింపు నియంత్రణకే.. ● ఇప్పటి వరకు ఒక కేసు నమోదు ● బక్రీద్ నేపథ్యంలో పకడ్బందీ తనిఖీలు –8లో uపశువులను తరలించే ప్రతి వాహనానికి నిర్ధారిత ప్రామాణిక పత్రాలు అవసరమని అధికారులు ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఇదే నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీ సమయంలో ఏదైనా వాహనం పశువులతో ఉన్నట్లు గుర్తిస్తే అన్ని పత్రాలు తనిఖీ చేయాలని, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నారాయణపేట రూరల్: గోవులు, గో సంతతి అక్ర మ రవాణా, గోవధను అరికట్టేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ తదితర సంఘాల నుంచి ఉన్నతాధికారులకు వచ్చిన వినతుల ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలు, పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదులతో పకడ్బందీగా వ్యవహరించేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ.. జిల్లా సరిహద్దుగా కర్ణాటక ఉండటంతో పశు అక్ర మ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క ఇతర జిల్లాలు, మరోపక్క రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు ప్రధాన మార్గాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ము ఖ్యంగా ఆరు సరిహద్దు, ఒక అంతర్ జిల్లా చెక్పోస్టు ప్రారంభించి పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టారు. అక్రమంగా గోవులు, దూడలను తరలించకుండా అడ్డుకోవాలని సిబ్బందికి అధికారులు సూచించారు. ఒకవేళ ఎవరైనా గోవులను వధించేందుకు తరలిస్తే సంబంధిత వాహనాన్ని జప్తు చేస్తారు. తరలించిన వ్యక్తి సంబంధిత వాహన యజమానిపై గోవధ నిషేధ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఒక కేసు నమోదు.. చెక్పోస్టుల వద్ద సిబ్బంది వారం రోజులుగా పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి మూడు ఎద్దులు, ఒక గేదె, ఒక బర్రె పోతుతో నారాయణపేట వైపు వస్తున్న కర్ణాటక వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో వాహనాన్ని సీజ్చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి వాహనంలోని పశువులను దగ్గరలోని గోశాలలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వసతి కేంద్రంలో ఉంచారు. పశువుల రవాణా విషయంలో నిబంధనలు విధిగా పాటించాలి. అక్రమంగా తరలిస్తే వాహనాలు స్వాధీనం చేసుకోవడమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బక్రీద్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మతసామరస్యానికి భంగం వాటిల్లే సందేశాలు పంపిన, ప్రచారం చేసిన కఠిన చర్యలు ఉంటాయి. – డా. వినీత్, ఎస్పీ, నారాయణపేట జిల్లాలోని జలాల్పూర్, కాన్కుర్తి, సమస్తాపూర్, చేగుంట, కృష్ణా వంతెన, ఉజ్జెలి, లాల్కోట ప్రాంతాల్లో చెక్పోస్టులు ఉంటాయి. ఆయా చెక్ పోస్టులను ఎస్పీ డా. వినీత్, అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్హుక్, డీఎస్పీ లింగయ్యతో పాటు సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. -
ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం
ఊట్కూర్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో జిల్లా సస్యశ్యామలం కానుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని బాపూర్ శివారు లో కొనసాగుతున్న ఎత్తిపోతల పనులను బుధవారం ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నాయని, ఏడాదిలోపు ఒక రూపం వస్తుందని తెలిపారు. ఏళ్లుగా ఎంతోమంది నాయకులు ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు. రూ.5 వేల కోట్లు మంజూరు చేశారని.. 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఈ ప్రాంత రైతులు విలువైన భూములను త్యాగం చేయడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం వారి ఖాతా లో జమ అవుతుందని వివరించారు. భవిష్యత్లో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడనుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎస్ఈ శ్రీధర్, ఈఈ మహ్మద్ అబ్దు ల్ రహీం, ఆర్ఐ కృష్ణారెడ్డి, విజయలక్ష్మి, నర్సింహ, నాయకులు యజ్ఞేశ్వర్రెడ్డి, జనార్దన్రెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి, కోరం మహేష్రెడ్డి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లలో పురోగతి సాధించాలి
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నారాయణపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రగతిపై జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ సుధాకర్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇంది రమ్మ పథకం కింద రూ.5 లక్షలు మంజూరు చేస్తోందని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల వారీగా మంజూరైన ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు మంజూరైన ఇళ్లు, గృహ ప్రవేశాలకు సిద్ధమైన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ లక్ష్యంలో ధన్వాడ 55 శాతం ఉండగా.. నారాయణపేట పట్టణం 34 శాతంలో ఉందని, పట్టణంలో ఇంత తక్కువ శాతం ఉండటానికి గల కారణాలపై వివరణ కోరారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. జూన్ 2 వరకు వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలన్నారు. ఎంపీడీఓలు, పుర కమిషనర్, ఎంపీఓలు, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో.. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి జూన్ 2 వరకు పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశాలకు ఇళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం, పట్టణం చివరి స్థానంలో ఉందని, కొత్తపల్లి మండలంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఇళ్ల వారీగా తనకు నివేదిక అందజేయాలని ఎంపీడీఓను ఆదేశించారు.అలాగే కోస్గి మున్సిపాలిటీలోని 3, 4, 11, 16 వార్డుల్లో ఇళ్ల నిర్మాణాలు 40 శాతమే పూర్తి చేశారని, వేగం పెంచాలని పుర కమిషనర్ నాగరాజును ఆదేశించారు. గుండుమాల్ మండలంలో మాత్రం లక్ష్యం 78 శాతానికి చేరిందని 100 శాతానికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘అన్నదాత’.. గుండె‘కోత’
తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ పది మంది రైతులం కలిసి ఽ742 బస్తాల ధాన్యంను అధికారులు పంపించిన లారీలో మరికల్లోని ఓ మిల్లుకు తీసుకొచ్చాం. ధాన్యం పరిశీలించిన యాజమాని తాలు ఉండటంతో తూకం రాదని, బస్తాకు 2 కిలోలు తరుగు తీస్తాను.. ఇస్తామంటే ధాన్యం ఆన్లోడు చేయిస్తాను. లేదంటే మీ ఇష్టామన్నాడు. రైతులందరం ప్రాధేయపడినా చివరకు కిలోన్నర తరుగు తీసి ధాన్యం బస్తాలను మిల్లులో దించుకున్నాడు. కొనుగోలు కేంద్రం దగ్గర బస్తాకు కిలోన్నర, మిల్లు దగ్గర కిలోన్నర మొత్తం.. ఒక బస్తాకు మూడు కిలోల తరుగుగా పోతుంది. మిల్లర్లు మా రెక్కల కష్టం దోచుకుంటున్నారు. – భీమ్లానాయక్, రైతు, మందిపల్లి కొత్తతండా, మరికల్ 13 ఎకరాలను కౌలుకు తీసుకొని అష్టకష్టాలు పడి పంట పండిచాను. కోత వేసిన పంటను ఐకేపీ కేంద్రానికి తరలించి మూడు రోజుల పాటు ధాన్యం ఆరపెట్టాను. గన్నీబ్యాగుల కోసం వారం రోజులు తిరిగితే 13 ఎకరాలకు లెక్క కట్టి వెయ్యి బస్తాలను చేతికిచ్చారు. అందుల్లో 400 బస్తాలు చినిగిపోయినవే ఉన్నాయి. వాటికి కుట్లు వేసి కూలీలతో 15 రోజుల తర్వాత ధాన్యం బస్తాలకు నింపాను. మా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో మూడు రోజుల నుంచి నింపిన బస్తాలను తరలిచేందుకు లారీలు రాలేదు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితే ఈ రోజు, రేపు అంటూ మాట దాటవేస్తున్నారు. – దండురాములు, రైతు, పెద్దచింతకుంట, మరికల్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. లారీకి 30 బస్తాల చొప్పున హాంఫట్.. ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడు స్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మె.ట.లలో..) క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు లారీ డ్రైవర్ల పేరు చెబుతూ పొంతన లేని సమాధానాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా నత్తనడకనే క్రయవిక్రయాలు తూతూమంత్రపు పరిశీలనలకే అధికారుల పరిమితం ఈ ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్ షీట్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్లో భీమయ్యయాదవ్తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మక్కుతో దందా.. సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
గుంతలు పూడ్చాలి..
జక్లేర్ నుంచి నారాయణపేటకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. అధికారులు రోజూ అదే రహదారిపై తిరిగినా పట్టించుకోవడం లేదు. వెంటనే గుంతలు పూడ్చి రాకపోకలకు మార్గం సుగమం చేయాలి. – మహేష్గౌడ్, జక్లేర్ త్వరలోనే టెండర్ ప్రక్రియ.. మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తాం. గ్రామీణ రహదారుల నిర్మాణాలకు తగిన చర్యలు తీసుకుంటాం. – అభిలాష్రెడ్డి, ఏఈఈ, ఆర్అండ్బీ ● -
జిల్లాస్థాయి ప్రజాపాలనకు సిద్ధం చేయండి
నారాయణపేట: జిల్లాకేంద్రంలో ఈ నెల 22న నిర్వహించే జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు, ఆయా పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితా, ఆయా పథకాలకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని.. శాఖల వారీగా అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. స్క్రీన్, సౌండ్ సిస్టంను తహసీల్దార్తో సమన్వయం చేసుకొని ఏర్పాటు చేయాలని డీపీఆర్వో రషీద్ను ఆదేశించారు. అలాగే స్నాక్స్, భోజన ఏర్పాట్లను చూసుకోవాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. జూన్ 2 వేడుకలకు ఏర్పాట్లు.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. వీసీ హాల్లో సంబంధిత అధికారులతో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా అట్టహాసంగా నిర్వహించాలని.. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని, గార్డ్ ఆఫ్ హానర్ పోలీసుశాఖ, స్టేజ్, మైక్, సౌండ్ సిస్టం, జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని సీపీఓను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్డీఓ రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చెక్పోస్ట్ల వద్ద అప్రమత్తత అవసరం : డీఎస్పీ
నారాయణపేట: చెక్పోస్ట్ల వద్ద సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జ్ డీఎస్పీ మహేశ్ ఆదేశించారు. జిల్లాకేంద్రం సమీపంలోని ఎర్రగుట్ట వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందితో పాటు పశువైద్యులు కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి మూడు షిఫ్టులుగా విధులు కేటాయించాలని సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లుకు సూచించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు పంపించాలని, ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెల్టర్ను పరిశీలించారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. -
పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జాగ్రత్తగా చేపట్టాలి
కోస్గి రూరల్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 2026–27 పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జాగ్రత్తగా చేపట్టాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అర్హత సాధించిన వి ద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లింపులను ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, సర్టిఫికెట్ వె రిఫికేషన్ 29వ తేదీ నుంచి జూన్ 1 వరకు, వెబ్ ఆప్షన్లను 29వ తేదీ నుంచి జూన్ 3 వరకు, సీట్ల కేటాయింపు జూన్ 6న జరుగుతుందన్నా రు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ జూన్ 8, 9 తేదీల్లో జరుగుతాయని వివరించారు. జీలుగ సాగుతో భూ సారం మెరుగు కోస్గి రూరల్/కొత్తపల్లి: వ్యవసాయ భూముల్లో కర్భన శాతాన్ని పెంచి నేల సారాన్ని మెరుగుపర్చడానికి జీలుగ ఎంతో దోహదం చేస్తుందని ఏడీఏ రామకృష్ణ అన్నారు. మద్దూర్ మండలం పల్లెర్ల రైతువేదికలో మంగళవారం రైతులకు జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. జీలుగను పచ్చిరొట్ట ఎరువుగా సాగు చేయడంతో నేలలో నత్రజని స్థిరీకరణ జరిగి భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జీలుగ విత్తనాలు క్వింటా రూ.16,350 కాగా.. రాయితీపై రూ.8,175 అందిస్తున్నట్లు తెలిపారు. కోస్గిలోని ఆగ్రోస్–1, ఆగ్రోస్–2, మద్దూర్లోని ఆగ్రోస్ రైతుకేంద్రంలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్లస్టర్ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి వారి అనుమతితో విత్తనాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో మద్దూర్ మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు దామరగిద్ద: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ హెచ్చరించారు. మంగళవారం మండలకేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలు, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించి.. ఈ–పాస్ యంత్రంలో నమోదు చేసి విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. వానాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లులు అందించాలని ఆదేశించారు. నకిలీ వి త్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి బాలాజీప్రసాద్ తదితరులు ఉన్నారు. బంగారు దుకాణాల బంద్ ప్రశాంతం నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలని నారాయణపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినారాయణ భట్టడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సరాఫ్బజార్లో నారాయణపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు వ్యాపారంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, బంగారం, వెండి ధరలు పెరగడంతో సామాన్యులు, పేద కుటుంబాల పెళ్లిళ్లు భారంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం విధిస్తున్న అధిక సుంకాలతో సరఫరా వ్యవస్థలో అనిశ్ఛితి నెలకొందని.. దీని ప్రభావం పెద్ద వ్యాపారులకే కాకుండా చిన్న, మధ్యతరగతి బంగారు దుకాణాలు, ఆభరణాల తయారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్రంగా ఉందని తెలిపారు. జ్యువెలరీ రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తూ పారదర్శకతతో కూడిన సులభ వ్యాపార వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్ల వినతిపత్రాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకకు అందజేశారు. కార్యక్రమంలో సరాఫ్ నాగరాజు, శ్రీకాంత్ చామకూర, వెంకటయ్య, షఫీచాంద్, దస్తగిరి చాంద్, పవన్కుమార్ వైకుంఠ్, వామన్గేరి కార్తీక్, సాకేత్ భట్టడ్, సంగంనాథ్ హీరేమఠ్ తదితరులతో పాటు మరికల్, మక్తల్, మద్దూరు మండలాల నుంచి బులియన్ వ్యాపారులు పాల్గొన్నారు. -
నేడు మెడికల్ షాపులు బంద్
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూతబడనున్న 2,100 దుకాణాలు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఔషధ నియంత్రణ శాఖ పాలమూరు: ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా డ్రగ్గిస్ట్, కెమిస్ట్ పిలుపుమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం 2,100 మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి. మెడిసిన్ విక్రయాల్లో కొన్ని కార్పొరేట్ సంస్థలు వినియోగదారులకు ఇస్తున్న భారీ రాయితీలు నిలిపివేయాలని, ఈ–ఫార్మసీ చట్టం రూపుదాల్చకపోవడంతో కరోనా సమయంలో డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో మహబూబ్నగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సమ్మె నిర్వహణపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతోపాటు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్లకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాంమోహన్, కోశాధికారి రాఘవేందర్, కన్వీనర్ నాగభూషణం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ ఒక ప్రటకనలో తెలిపారు. ప్రజలకు అత్యవసర మెడిసిన్ కోసం నగరంలో క్లాక్టవర్, న్యూటౌన్, ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మెడికల్ దుకాణాలు తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే ప్రతి ఫార్మసీలోనూ మెడిసిన్ యథావిధిగా అందుబాటులో ఉంటుందన్నారు. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉండే రెడ్క్రాస్ జీవనధార సైతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి పట్టణంలో మెడ్ప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ దుకాణాలతోపాటు మరో మూడు దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎక్కడైనా మెడిసిన్ అందుబాటులో లేకపోతే మహబూబ్నగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సెల్ నం.83338 18147, జడ్చర్ల సెల్ నం.83339 25839లను సంప్రదించాలని సూచించారు. -
వరి ధాన్యం.. వర్షార్పణం
వర్షానికి కొట్టుకుపోయిన వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాంలాలీ మైదానంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యానికి ధాన్యం తడిసిందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన లారీలను ఇతర ప్రాంతాలకు పంపించడం, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతోనే తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. – కోస్గి రూరల్ -
నిప్పుల కుంపటి
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది. జోగుళాంబ గద్వాలలో అత్యధికం.. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ము ప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయ ట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వే యకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకో వాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు -
దొంగ దొరికేశాడు..
నారాయణపేట: మక్తల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఓ దొంగ అదే ఊరిలో అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవాడని తెలిసి స్థానికులు షాక్కు గురయ్యారు. కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి, సూర్య సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ ఉదయం వేళ పట్టణంలో తిరుగుతూ రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతుండేవాడు. ఒకే తరహా లో వరుస చోరీలు జరగడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినా నిందితు డిని గుర్తించలేకపోయాయి. పట్టణంలోని రెండు, మరికల్లో ఒక బంగారు దుకాణం, మక్తల్లో మూడు మద్యం దుకాణాలు, ఓ ఇల్లు, ద్విచక్ర వాహనాల షోరూం, మొబైల్, కిరాణ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ జరిగిన ప్రతిచోటా ఒకే తరహా ఆనవాళ్లు కనిపించడంతో ఇది ఒకే ముఠా పనని పోలీసులు అనుమానించారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. మక్తల్ ఎస్ఐ వై.భాగ్యలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు నారాయణపేట క్రాస్రోడ్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి బైక్ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ, సిబ్బంది వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి పేరు కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి, సూర్య అని.. అంబేడ్కర్నగర్ కాలనీ, మక్తల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా మంకీ క్యాప్, దొంగతనాలకు వినియోగించే సామగ్రి, చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి. మక్తల్, మరికల్ పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి.. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన నిందితుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సరదాగా ప్రారంభమైన ఆనన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారి డబ్బులు నష్టపోయి చివరకు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను తిరిగి బెట్టింగ్లకే వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఏడాది కాలంగా పగటి వేళలో రెక్కీ నిర్వహించి మక్తల్ ప్రాంతంలోని దుకాణాలు, తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కటింగ్ ప్లేయర్స్, స్క్రూడ్రైవర్లు తదితర సామగ్రితో షట్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి చోరీ చేసేవాడని పోలీసులు వివరించారు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్స్టేషన్ పరిధిలో కాగా.. ఒక కేసు మరికల్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైంది. మక్తల్, మరికల్లో10 చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి.. -
‘ఉపాధి’ కమిటీలు
పనుల్లో అవినీతికి అడ్డుకట్ట ● సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ● ప్రతి గ్రామంలో ఆరుగురు సభ్యులతో.. –8లో uమరికల్: ఉపాధిహామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్ మానిటరింగ్) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధిహామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లోని 272 గ్రామాల్లో 1,07,593 జాబ్కార్డులు ఉండగా.. 97,708 మంది కూలీలు నమోదయ్యారు. ఏటా చేపట్టే ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యను గుర్తించిన కేంద్రం పనుల్లో మార్గదర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో ఆరుగురు సభ్యులతో నిఘా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యవేక్షణ ఇలా.. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తగిన ప్రాతినిథ్యం ఉండగా సభ్యుల్లో సగం మంది మహిళలు ఉంటారు. ఉపాధ్యాయుడు, అంగన్వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులు, సోషల్ ఆడిట్ వనరుల వ్యక్తులు, యువజన సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థల నుంచి సభ్యులను ఎంపిక చేయాలి. గ్రామసభ ద్వారా కనీసం 6 నెలల కాలానికి కమిటీని ఎన్నుకోవాలి. ఉపాధి పనులు జరిగిన వారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తాయి. పనుల మంజూరు, నాణ్యతను అంచనా వేయడం, కూలీల హాజరు, వేతన చెల్లింపులు పారదర్శకంగా జరిగాయా లేదా తదితర వివరాలను నమోదు చేస్తారు. సామాజిక తనిఖీ సమయంలో గ్రామసభకు సమర్పించాలి. ఈ నివేదికలు ప్రజాపత్రాలుగా పరిగణించాలని, అవసరమైతే గ్రామపంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధం
నారాయణపేట/కృష్ణా: భవిష్యత్లో సంభవించే ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు స్పందన దళం ఆదేశాల మేరకు జిల్లాలోని కృష్ణా మండలం వాసూనగర్లో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు. మాక్డ్రిల్లో ముంపునకు గురై చిక్కుకున్న ప్రజలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సురక్షితంగా రక్షించే చర్యలను ప్రదర్శించారు. బోట్, లైఫ్ జాకెట్ల సాయంతో ప్రజలను రక్షించి, ప్రథమ చికిత్స అందజేసి అంబులెన్స్లో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు సంసిద్ధత కోసం మాక్డ్రిల్ ముఖ్యమైన ప్రక్రియని తెలిపారు. వరదలు వచ్చి అత్యవసర పరిస్థితులు తలెత్తే ఏడు ప్రదేశాలను జిల్లాలో గుర్తించినట్లు వివరించారు. అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, నీటిపారుదల తదితర ముఖ్యమైన శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలను ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఎఫ్ఓ సురేష్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి మేఘాగాంధీ, పీఆర్ ఈఈ అశోక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, డీపీఆర్వో రషీద్, కృష్ణా తహసీల్దార్ శ్రీనివాస్, వాసూనగర్ సర్పంచ్ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా నిలువురాళ్లు.. ముడుమల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. సోమవారం కృష్ణా మండలం ముడుమల్ నిలువురాళ్లను ఆమె సందర్శించారు. నిలువురాళ్ల ప్రాముఖ్యతను ఆర్కియాలజీ శాఖకు చెందిన అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు యువజన క్రీడ, పర్యాటక వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర పర్యాటకశాఖకు సంబంధించిన వారోత్సవాల టూరిస్ట్ గైడ్ పోస్టర్తో పాటు మూడుమల్ నిలువురాళ్ల విశిష్టతను తెలిపే ప్రచార పత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఆమె వెంట డీపీఆర్వో రషీద్, డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, పురావస్తుశాఖ అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా
గద్వాలన్యూటౌన్: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్ సరిత అన్నారు. ఇటీవల టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి వద్ద కాంగ్రేస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మార్గమధ్యలో జమ్మిచేడు వద్ద జములమ్మ అమ్మవారిని సరిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలిసి పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా.. ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సరిత మాట్లాడారు. గద్వాల ప్రజలు చూపిస్తున్న అభిమానం తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి, బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్రెడ్డికి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మర‘మత్తు’లోనే..!
గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దో హబ్గా పిలువబడే కృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో పారుతున్నప్పటికీ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంతో పంట పొలాలకు సాగునీరు పారడం గగనంగా మారుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు పారి కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. తుగభద్ర నది పరిధిలోని రాజోళిబండ డైవర్షన్ పథకం కింద రెండేళ్లుగా యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్హాలిడే ప్రకటించారు. అదే విధంగా కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయానికి పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో ఆయకట్టుకు యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదే విధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోగా.. మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరమ్మతులను పూర్తిచేయడంలో పాలకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వానాకాలంలోనే పూర్తిస్థాయిలో.. కృష్ణానది పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1,09,296 ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1,42,000 ఎకరాలు, తుంగభద్ర నది పరిధిలో ఆర్డీఎస్ కింద 83,998 ఎకరాలతో కలిపి మొత్తం 3,35,294 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఏటా వానాకాలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు పారుతోంది. యాసంగిలో మాత్రం కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పరిమితమవుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదీ పరిస్థితి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉండగా.. అందులో 12 గేట్లకు సంబంధించి ఇనుప రోపులు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఈ ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు జూరాల ప్రాజెక్టును సందర్శించి.. అంతా బాగుందంటూ ప్రకటనలు చేసి వెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఫలితంగా యాసంగిలో కేవలం 26వేల ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. ● నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి.. నాలుగేళ్లుగా ఏటా వానాకాలం పంటకే నీరందిస్తున్నారు. ● రాజోళిబండ డైవర్షన్ పథకం హెడ్వర్క్స్, గేట్లు, ప్రధాన కాల్వల మరమ్మతు 2007లో మొదలుపెట్టగా.. నేటికీ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఆర్డీఎస్ కింద యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడలు వానాకాలం ముంచుకొస్తున్నా జూరాల గేట్లకు పూర్తికాని మరమ్మతు యాసంగిలో 26 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ర్యాలంపాడు జలాశయం 2 టీఎంసీలకే పరిమితం నత్తనడకన ఆర్డీఎస్ పనులు -
వివరాలు వెల్లడించిన ఎస్పీ..
మక్తల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ డా. వినీత్ వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. రూ.9,28,00 నగదు, 2 తులాల బంగారం, 3 కిలోల వెండి, రూ.7,200 విలువజేసే రెండు మద్యం సీసాలు, రూ.35 వేల విలువైన సిగరెట్లు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. కాగా రూ.5.04 లక్షల నగదు, 13 గ్రాముల బంగారం, 60 తులాల వెండి, 3 సెల్ఫోన్లు, రూ.35 వేల విలువైన సిగరెట్లు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ మహేష్, మక్తల్ సీఐ కె.రాంలాల్, ఎస్ఐలు వై.భాగ్యలక్ష్మిరెడ్డి, పురుషోత్తం, విజయభాస్కర్, సీసీ టాస్క్ఫోర్స్ బృందాలు, మక్తల్ క్రైంస్టాఫ్ శంకరయ్య, అశోక్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఇలా..
జాబ్కార్డులు 1,07,593కూలీల సంఖ్య 97,708ప్రస్తుతం పనులకు వస్తున్న కూలీలు 20,182ప్రస్తుతం పనులకు వస్తున్న వారి జాబ్కార్డుల సంఖ్య 59,951●ఉత్తర్వులు రావాలి.. గ్రామపంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుపై ఇటీవల సీఈఓలతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రత్యేక సమావేశం జరిగింది. త్వరలోనే నిఘా కమిటీల ఏర్పాటు విషయమై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. – ఎన్.వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట -
వేతన వెతలు!
నారాయణపేట రూరల్: విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి.. కొత్త పద్ధతుల అమలు కొనసాగుతోంది.. కాని పర్యవేక్షణకు నియమించిన సీఆర్పీల అవస్థలు మాత్రం తీరడం లేదు. సమాన పనికి సమాన వేతనం అమలు మాత్రం అందని ద్రాక్షగా మారింది. వ్యవస్థ ప్రారంభమైన సమయంలో నియామక ప్రక్రియ చేపట్టగా.. మధ్యలో మానేసిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో అదనపు భారంతో సతమతమవుతున్నారు. 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేటి సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రకటనతో తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఆశగా ఎదరుచూస్తున్నారు. రెండేల్ల కిందట డిమాండ్ల సాధనకు సీఆర్పీలు హైదరాబాద్లో ధర్నా సైతం చేపట్టారు. నియామకం ఇలా.. ఉపాధ్యాయులు, అధికారులకు మధ్య వారధులుగా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్ ఇన్చార్జ్లు, ఎంఈఓలకు అనుసంధానంగా పని చేయడానికి సీఆర్పీలను నియమించారు. ఎనిమిదేళ్లకు కిందట ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాతపరీక్ష నిర్వహించి ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఎమ్మార్పీలను ఎంపిక చేసి వారి ద్వారా ఎమ్మార్సీ కార్యాలయ పనులు, పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు చేయించేవారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాలలు వదిలి కార్యాలయానికి రావడంతో విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో పాటు విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లను అత్యవసర పరిస్థితులు, జనాభా లెక్కలు, ఎన్నికల విధులకు మాత్రమే వినియోగించాల్సి ఉండటంతో ఈ వ్యవస్థను రద్దు చేసి తిరిగి పాఠశాలలకు పంపించారు. 2011లో కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులను 2012లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సర్వశిక్ష అభియాన్ కింద కాంట్రాక్టు విధానాంలో కార్యాలయ పనులకు ఒక్కో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్లను, మండలంలోని పాఠశాలలను విభజించి క్లస్టర్లుగా మార్చి ఒక్కో క్లస్టర్కు ఒక్కో సీఆర్పీని నియమించారు. సీఆర్పీలు 28విద్యార్థులు 1.06 లక్షలు విధుల నిర్వహణ.. సీఆర్పీలు తరుచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెచ్ఎంకు సహకరిస్తూ యూడైస్, చైల్డ్ ఇన్ఫో పూర్తి చేయాలి. ప్రతి నెలకు సంబంధించిన డైరీ రాస్తూ ఎస్టీపీఎస్ టీచర్లు లీవ్ పెడితే స్కూల్కు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించాలి. ఇక ప్రతి నెల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలి. దీనికితోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం లేని స్కూల్ గుర్తించాలి, మధ్యాహ్న భోజనం పరిశీలనతో పాటు క్లస్టర్ పరిధిలోని పాఠశాలలల్లో నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు హాజరుకావాలి. వారి నుంచి వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి పాఠశాలను నెలలో రెండుసార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. ఏటా ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించాలి. వివిధ రకాల మేళాలు, పోటీలు నిర్వహించాలి.. కేజీబీవీలను సైతం సందర్శించాలి. ఉమ్మడి రాష్ట్రంలో సీఆర్పీల వ్యవస్థ ప్రారంభమైంది. అప్పట్లో అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తించగా.. క్రమంగా రూ.15 వేలకు చేరింది. మూడేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,500కు పెంచింది. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వీరితో పాటు విధుల్లో చేరిన సీఆర్పీలకు రూ.28,500 అక్కడి ప్రభుత్వం చెల్లిస్తుంది. విధులు, బాధ్యతలు సమానంగా ఉన్నా.. వేతనంలో చాలా వ్యత్యాసం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. జిల్లాలో ఇలా.. మండలాలు 13 పాఠశాలలు 640క్లస్టర్లు 33 చాలీచాలని జీతాలతో సీఆర్పీల అవస్థలు భర్తీకాని ఖాళీలు.. అదనపు పనిభారంతో సతమతం ప్రభుత్వాలు మారినా నెరవేరని హామీ సమాన పనికి.. సమాన వేతనం అందని ద్రాక్షేనా? -
వేతనం పెంచాలి..
పదేళ్లుకు పైగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాం. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా రాష్ట్రంలోనూ పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సీఆర్పీల పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. – ఆరీఫ్ అహ్మద్, సీఆర్పీ, నారాయణపేట సీఆర్పీలను క్రమబద్ధీకరించాలి.. ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తూ వారిని క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా అలాగే కొనసాగించడం సరికాదు. సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పనికి తగిన వేతనం చెల్లించాలి. – శేర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి, తపస్, నారాయణపేట ● -
కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక దామరగిద్ద: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల్లో కేటాయించిన రైస్మిల్లులకు తరలించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. ఆదివారం మండలంలోని బాపన్పల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సన్నరకం ధాన్యం ఎప్పడికప్పుడు తరలిస్తున్నారని.. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో నిల్వ చేసినట్లు వివరించారు. కేంద్రంలో ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని ఆరా తీశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని కేటాయించిన రైస్మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ● ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు ● ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు సరఫరా ● పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. మిగతా విత్తనాలు పూర్తి ధరకే.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. విత్తనాలు సిద్ధం.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్నగర్ -
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం బాలకేంద్రంలో నిర్వహించిన కళా వైభవం ఆర్ట్ కల్చరల్ డే కార్యమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కృషి, పట్టుదల, ఓర్పు, లక్ష్యంతో దేనినైనా సాధించవచ్చని, కష్టంగా కాకుండా ఇష్టంతో అనుకున్న పనిని సులభంగా పూర్తి చేయవచ్చని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సంస్కృతి, సాంప్రదాయ కళలు దోహదపడతాయని, చిన్నారులు వేసవి సెలవులు వృథా చేయకుండా బాలకేంద్రంలో తమకు నచ్చిన కళలు నేర్చుకోవాలని కోరారు. అంతకుముందు నృత్యం, పాటలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, విద్యాసాగర్, నాగార్జున్రెడ్డి, యాదయ్యశెట్టి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, సిబ్బంది వసంత్కుమార్, సంగ నర్సింహులు, జ్ఞానమృత, శ్రీకాంత్, సాయినాథ్ పాల్గొన్నారు. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● అంతర్జాతీయ ప్రమాణాలతో టీపీఎస్ల నిర్మాణానికి చర్యలు ● ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య ● వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్కు మంచి స్పందన వచ్చింది. ఒక్కో టీపీఎస్కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాల ల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కా నున్నాయి. ఒక్కో టీపీ ఎస్కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రా నుంది. ప్రైవేటు స్కూళ్ల కు ఽధీటుగా డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్ లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లి దండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వా సం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
నారాయణపేట: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో పనుల పురోగతిపై సమీక్షించారు. వైద్య కళాశాల, ఎంసీహెచ్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల వద్ద ఒక్క బోరు పడకపోవడంతో సమీపంలోని ఒక రైతు పొలానికి చెందిన ప్రైవేట్ బోర్ నుంచి నీటిని క్యూరింగ్కు వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ భవన నిర్మాణాలు ఎక్కడ జరిగినా తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. మండలాల్లోని కస్తూర్బాల్లో మరమ్మతులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో సైనన్స్ ల్యాబ్స్ నిర్మాణాలు పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలన్నారు. మక్తల్లోని వంద పడకల ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని.. అకాడమిక్ బ్లాక్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా పనుల్లో వేగం పెంచాలని కోరారు. మక్తల్లోని జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం, మద్దూరు ఎస్సీ బాలుర వసతిగృహ మరమ్మతు పనుల గుర్తించి ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా మరమ్మతులుంటే వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రం సమీపంలో సమీకృత చేనేత భవన నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా.. జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని మూడు ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణాలు ఆగస్టు వరకు పూర్తి చేయాలని సూచించారు. మక్తల్లో సంగంబండ రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ పథకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈలు శ్రీనివాసరావు, రంగారావు తెలిపారు. మన్యంకొండ నుంచి జిల్లాకు రోజుకు ఎన్ని లీటర్ల నీటి సరఫరా జరుగుతుందో నివేదిక ఇవ్వాలని కోరారు. ఆర్అండ్బీ పరిధిలో కొనసాగుతున్న రోడ్లు, కలెక్టరేట్ భవన నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులతో చర్చించారు. జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని, గుండుమాల్, కొత్తపల్లి మండలాల సమీకృత భవన సముదాయాల నిర్మాణాలు, కడా నిధులతో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశానికి ఎన్ని పనులు పూర్తి చేశారో? ఎన్ని పర్యటనలు చేశారో నివేదికలతో రావాలని ఏఈలను ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో విధిగా ప్రొటోకాల్ పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో టీజీఎంఐడీసీ ఈఈ వేణుగోపాల్, పీఆర్ ఈఈ అశోక్, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యతో ఉజ్వల భవిష్యత్.. నారాయణపేట రూరల్: విద్య భవిష్యత్ను తీర్చిదిద్దే మహత్తర శక్తి అని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా విజయోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచే చదువుపై ఏకాగ్రత పెంచుకొని అన్నిరకాల పోటీ పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుట్టిన ఊరికి మంచి పేరు వస్తుందని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తే మంచిదన్నారు. పది విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని.. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషి అభినందనీయమన్నారు. అనంతరం 560 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ మంజుల, డీఈవో గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్, శశికుమార్ పాల్గొన్నారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కుటుంబసమేతంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్నగర్ – వివరాలు 8లో.. -
‘స్నేహ’ సంఘాలు..
15 నుంచి 18 ఏళ్లలోపు కిశోర బాలికలతో ఏర్పాటు –8లో uప్రభుత్వం కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. అందుకు అనుగుణంగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో స్నేహ సంఘాలతో పాటు కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా సంఘాల సభ్యులకు వేసవి శిబిరాలు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మొత్తం 13 సెషన్లకుగాను ప్రస్తుతం 5 సెషన్లు పూర్తయ్యాయి. జూన్ 10 వరకు శిబిరాలు కొనసాగుతాయి. – ఎన్.వెంకట్రాములు, డీఆర్డీఓ -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలోని 19 రహదారుల నిర్మాణానికి రూ.68 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆత్మకూర్–గద్వాల హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరంచారు. కొల్పూర్ కుర్తికొండ దగ్గర మినీ జూరాల బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణానికి రూ.800 కోట్ల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపూర్ దగ్గర ఽథర్మల్ పవర్స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్సిగ్నల్ రానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ అనంతపురంలో ఉండేదని.. సీఎం చొరవతో మక్తల్కు మంజూరు చేయించినట్లు వివరించారు. అలాగే మక్తల్కు డిగ్రీ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పట్టణానికి 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ తీసుకొస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హయంలోనే 150 పడకలు ఆస్పత్రి నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, కో–ఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్, సురేష్, రవికుమార్, సాగర్, రాజప్పగౌడ్, యజ్ఞేశ్వర్రెడ్డి, పరమేష తదితరులు పాల్గొన్నారు. ● స్థానిక పుర కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చైర్పర్సన్ వాకిటి మానస అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ముందుగా 6వ వార్డు కౌన్సిలర్ చందాపూర్ సత్యమ్మతో కమిషనర్ రాజయ్య ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో పురపాలికలోని 1, 2, 4, 6 వార్డుల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి కౌన్సిలర్లు విన్నవించారు. అండర్గ్రౌండ్, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. పుర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫణింద్రారెడ్డి, వైస్ చైర్మన్ శైవి రెడ్డి, ఏఈఈ నాగశివ, కౌన్సిలర్లు ఆల్కూరి పావని, మహేష్, శ్రీవిద్య, సరిత, అనిత, రహీం పటేల్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్రెడ్డి, పీకే నర్సింహ, కృష్ణ, సత్యమ్మ పాల్గొన్నారు. -
సాగు.. సతమతం
రైతులకు భారంగా మారుతున్న వ్యవసాయం పెరుగుతున్న పెట్టుబడులు.. కూలీలు, పొలం దున్నేందుకు వినియోగించే యంత్రాల అద్దెలు, నాలుగేళ్లుగా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. వరి, పత్తికి ఎరువుల వినియోగం అధికంగా ఉండటంతో వాటిని అసరా చేసుకొని కంపెనీలు ధరలను పెంచుతుండటంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. కేంద్రం ఎరువుల ధరలను నియంత్రించకపోవడంతో ఆ భారమంతా రైతులపై పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం 2026–27 వానాకాలంలో 14 పంటల కనీస మద్దతు ధరలను పెంచి రైతులకు శుభవార్త వినిపించింది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారస్ మేరకు కేంద్రం ఏటా కనీస మద్దతు ధరలను పెంచుతూనే వస్తోంది. దీంతో ఓ వైపు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరోవైపు పెరుగుతున్న ఎరువుల ధరలతో ఆందోళన చెందుతున్నారు. తగ్గుతున్న దిగుబడులు.. జిల్లాలో ఏటా పత్తి సాగు పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది సైతం 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. అతివృష్టి, అనావృష్టి కారణంగా మూడేళ్లుగా 5 నుంచి 8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎరువుల ధరలు సైతం ఏటా పెరుగుతుండటం రైతులకు మరింత భారంగా మారిందని చెప్పవచ్చు. సకాలంలో తెరుచుకోని కేంద్రాలు.. ఏటా వరి మినహా మిగిలిన కంది, పెసర, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కోతల ఆరంభంలో కాకుండా సీజన్ ముగుస్తున్న సమయంలో ప్రారంభిస్తూ చేతులు దులుపుకొంటోంది. వరి, పత్తి కేంద్రాలు ఏటా.. కంది, పెసర, మొక్కజొన్న కేంద్రాలు అడపా దడపా ప్రారంభిస్తుండగా, మిగతా 9 పంటల కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ● ఈ నెలఖరున రోహిణి కార్తెప్రారంభం కానుండటంతో వానాకాలం సాగు పనులు ఊపందుకోనున్నాయి. పంటలకు వివిధ పోషకాలు అందించేందుకు రైతులు యూరియా, డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తుంటారు. అయితే భారీగా పెరిగిన ఎరువుల ధరలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరా సాగుకు అదనంగా రూ.8 వేల వరకు అదనపు భారం పడనుందని రైతులు చెబుతున్నారు. గతేడాది నుంచి బస్తాకు రూ.50 నుంచి రూ.300 వరకు పెరగడంతో లబోదిబోమంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు (రూ.లలో..) ఎరువు 2023 2024 2025 2026 డీఏపీ 1,250 1,300 1,350 1,350 ఎంఓపీ 1,400 1,535 1,800 1950 యూరియా 242 242 266.50 266.50 20–20–0–13 1,175 1,270 1,450 1,800 12–36–16 1,350 1,470 1,720 1800 14–35–14 1,450 1,700 1,850 2,350 16–16–16 1,250 1,470 1,600 1700 10–26–26 1,375 1,470 1,900 2,350 28–28–0 1650 1700 1,800 2,350 15–15–15 1450 1500 1,600 1,950 ఏటా పెరుగుతున్న పెట్టుబడులు వరి మినహా సకాలంలో ప్రారంభం కాని ఇతర పంటల కొనుగోలు కేంద్రాలు పత్తి విస్తీర్ణం పెరుగుతున్నా.. తగ్గుతున్న దిగుబడులు ఆందోళనలో అన్నదాతలు -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
నారాయణపేట/పాలమూరు: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం మహబూబ్నగర్లో పెట్రోల్ లీటర్ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్ రూ.3.39, డీజిల్ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్, 70 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వాహనదారుల జేబుకు చిల్లు పాలమూరులో పెట్రోల్పై రూ.3.39, డీజిల్పై 3.26 పెంపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం -
ఇసుక రవాణాకు ఆన్లైన్ అనుమతులు
నారాయణపేట: జిల్లాలో ఇసుక లభ్యత గల పది రీచ్ల నుంచి మన ఇసుక.. మన వాహనం ద్వారా ఆన్లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జరిగిన డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ లెవెల్ సాండ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోటూరు, సమస్తాపూర్, నాగిరెడ్డిపల్లి, ఓబులాపురం 1, 2, దాసర్దొడ్డి, వడ్వాట్, అడవి సత్యారం, అమ్మపల్లి రీచ్ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలన్నారు. రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. బుకింగ్ అయిన వెంటనే త్వరగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా గత వారం కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జల వనరులు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, భూగర్భజల విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇసుక ఉన్న ప్రాంతాలను తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మైనింగ్ ఏడీ గోవిందరాజు, రాయల్టీ ఇన్స్పెక్టర్ ప్రతాప్రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం మూడోరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు గణితం–ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సుదర్శన్ రావు తెలిపారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,838 మంది విద్యార్ధులకుగాను 1,767 మంది హాజరుకాగా 71 మంది గైర్హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 500 మంది విద్యార్థులకుగాను 475 మంది హాజరుకాగా 25 మంది విద్యార్ధులు రాయలేదని చెప్పారు. నేడు జాబ్ మేళా నారాయణపేట రూరల్: పట్టణంలోని సీఎన్ఆర్ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో పుస్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు క్యాంపస్ ఇంటర్వ్యూ, ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మెర్సీ వసంత, ప్రోగ్రాం ఇన్చార్జ్ షేక్ సుజత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొ త్తం 60 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్, డిగ్రీ చదివి మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్న వారు హాజరుకావాలని కోరారు. మక్తల్, అయిజ, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని.. నెలకు రూ.15 వేల వేతనంతో పాటు టీఏ, డీఏ చెల్లిస్తారని, పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. -
మద్దతు ధర పెంచాలి..
పెరిగిన పెట్రోల్, డీజిల్, విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు కలిగేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచాలి. పెట్టుబడులు పెరుగుతున్న రీతిలో మద్దతు ధరలు పెరగకపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. ప్రభుత్వ చెల్లించే మద్దతు ధరలతో రైతులకు ఆశించిన లాభాలు అందడం లేదు. – మోనపురం మహేశ్, రైతు, కాన్కుర్తి ఎరువుల ధరలు నియంత్రించాలి రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను కంపెనీలు ఏటా పెంచుతూనే ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులపై దృష్టి సారించాలి. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నా.. మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగా పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకోంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిపై బోనస్ ఇవ్వడం లేదు. – అంజిలయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం, నారాయణపేట వచ్చే సీజన్కు మద్దతు ధరలు.. కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరలు వచ్చే వానాకాలం పంటలకు వర్తిస్తాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఎంతో లాభసాటిగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి● -
వేసవి శిబిరానికి క్రీడాసామగ్రి అందజేత
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న ఉచిత వేసవి క్రికెట్ శిబిరానికి హైదరాబాద్, మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్లు సంయుక్తంగా రూ.లక్ష విలువైన క్రీడాసామగ్రిని శుక్రవారం అందించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ రియాజ్ ఉల్హక్ నిర్వాహకులకు సామగ్రి అందజేసి మాట్లాడారు. క్రీడాకారుల కోసం జంబో కిట్, నెట్స్, బాల్స్, ఫిట్నెస్కు సంబంధించిన వస్తువులు అందించామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవి శిబిరంలో మెళకువలు నేర్చుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్, ఇన్చార్జ్ రమణ, కోచ్ అజయ్, ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేయడమే..
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే. ముందే పెంచితే బీజేపీకి ప్రజలు వ్యతిరేకమవుతారని తర్వాత ధరలు పెంచింది. ఎన్నికల ముందు ఒకటి.. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం బీజేపీకి అలవాటే. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. – పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ పన్ను తగ్గించాలి.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై పెనుభారం పడుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రజల ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను ఈ సమయంలో తగ్గించాలి. ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ వెంటనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై విధించే వ్యాట్ను రూ.మూడు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది. – ఎస్.రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు, రెవెన్యూ, పశు వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లావ్యాప్తంగా అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, చెక్పోస్టుల వద్ద తనిఖీలు, పశువుల అక్రమ రవాణాపై నిఘా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్ను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని సరిహద్దు చెక్పోస్టుల్లో పోలీసు సిబ్బందితో పాటు వెటర్నరీ డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండి తనిఖీలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మక్తల్, మద్దూర్, కోస్గి సంతలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. పశువుల రవాణా సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పత్రాలు, ఫిట్ ఫర్ ట్రానన్స్పోర్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అక్రమ రవాణాలో పట్టుబడిన ఆవులు, లేగ దూడలను తాత్కాలిక గోశాలల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సామాజిక మాధ్యమల్లో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్స్టేషన్లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, ఆర్డీఓ రమేష్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, సైదులు, రాంలాల్, భగవంత్రెడ్డి పాల్గొన్నారు. -
ధరల పెంపు పెను భారం..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతాయి. రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పడుతుంది. మన్మోహన్సింగ్ ప్రభుత్వ హయంలో ఒక్క రూపాయి పెంచితే బీజేపీ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టేది. ఏకంగా ఒకేసారి రూ.3 పెంచడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించకపోతే నిరసన సెగలు తప్పవు. – కె.ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట ఆర్థిక ఒత్తిడి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే పె ట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది ప్రజల్లో ఎన్నికలయ్యే వరకు ధరలు ని యంత్రించి తర్వాత భారాన్ని మోపుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, వ్యవసాయ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది. – జి.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్, నారాయణపేట -
పాలమూరు కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్కుమార్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి తొలి దశలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
నెరవేరని లక్ష్యం..!
గ్రామాల్లో అందని టీ–ఫైబర్ సేవలు ● పరికరాలు అందినా.. ఫలితం శూన్యం ● పైలెట్ ప్రాజెక్టు మద్దూర్లోనూ అందని సేవలు ● నిరుపయోగంగా కంప్యూటర్లు, సామగ్రి నర్వ: గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు విస్తరించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా నేటికీ వినియోగంలోకి రాలేదు. నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో చాలాచోట్ల ఇప్పటికే అందించిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. పైపులు వేసినా.. గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలందించేందుకు గత ప్రభుత్వం టీ–ఫైబర్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక రూటర్, ఏసీలు, ఆన్లైన్ యూపీఎస్, బ్యాటరీలతో డిస్ట్రిబ్యూషన్ సర్వర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి గ్రామాలకు నెట్ అందించాలని నిర్ణయించింది. మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్న సమయంలో తాగునీటి పైపులైన్తో పాటు నెట్ కేబుల్ పైప్లు కూడా వేశారు. కానీ సేవలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగిత రహిత పాలనకు.. టీ–ఫైబర్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కనెక్షన్తో ఇంట్లో ఫోన్, టీవీలకు ఇంటర్నెట్ అందుతుంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినొచ్చు. ఆన్లైన్కి సంబంధించి చాలా పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఆదాయ, వ్యయాలను ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. మొత్తంగా కాగిత రహిత, పారదర్శక పాలన అందుతుంది. కాగా ప్రస్తుతం రైతువేదికలు, పాఠశాలల్లో మాత్రం టీ–ఫైబర్ సేవలు అందుతున్నాయి. విద్యార్థుల అవస్థలు.. పైలెట్ మండలం మద్దూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీ–ఫైబర్ లైన్తో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ యంత్రాలు అమర్చడం వద్ద రేడియషన్తో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన యంత్రాల శబ్ధంతో శబ్ధ కాలుష్యం ఏర్పడిందని ఆరోపించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందకపోవడంతో ప్రైవేట్ ఇంటర్నెట్తో పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టీ–ఫైబర్ సేవలు జిల్లా అంతటా విస్తరించేందుకు తగిన చర్యలు చేపడతాం. హైస్పీడ్ ఇంటర్నెట్ను గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అందించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటుపై కలెక్టర్కు నివేదించాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – రవిశంకర్, జిల్లా మేనేజర్, టీ–ఫైబర్ గతేడాది రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్ మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండలంలోని 49 గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలందించాలని చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో పనులు పూర్తిచేసి గ్రామపంచాయతీలు, ప్రభుత్వ బడుల్లో టీ–ఫైబర్ సేవల కోసం విద్యుత్ పరికరాలు, ఇంటర్నెట్ యంత్రాలను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరికరాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినప్పటికీ అందుబాటులోకి తీసుకరాకపోవడంతో మండల కేంద్రంలో కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రారంభంలో మండల కేంద్రంలోని ఇళ్లకు సిటీ కేబుల్ నెట్వర్క్కు అనుసంధానం చేయడంతో కొన్నిరోజులు ఉచితంగా అందించారు. అనంతరం రూ.300 రుసుం వసూలు చేశారు. అయినప్పటికీ అంతరాయంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి
● కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభాలకు ఎంపీని ఆహ్వానించరా? ● రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో ఉండాల్సిందే.. ● జింకల సమస్యను పరిష్కరించండి ● ‘దిశ’ సమావేశంలో ఎంపీ డీకే అరుణనారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ కోరారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మూడో సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. 45 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. ప్రొటోకాల్ పాటించరా..? కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తారా.. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా ఎంపీగా ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు.. ప్రొటోకాల్ పాటించకపోవడంలో ఆంతర్యామేమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ శాఖకు నిధులు మంజూరైనా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నా కచ్చితంగా తన సమయం తీసుకొని చేయా లని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందు లుంటే తనకు చెప్పాలంటూ చురకలంటించారు. ● ధన్వాడలో డిగ్రీ కళాశాల భూమిపూజ ఎవరిని అడిగి చేశారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. కళాశాల నిర్మించాల్సిన స్థలం ఆక్రమణకు గురైందని.. తక్కువ స్థలంలో నిర్మించాలని చూస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఒకరిద్దరి సంతోషం కోసం కళాశాల నిర్మించడం తప్పని హితవు పలికారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి.. మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందా లేదా? వేసవిలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈని ఎంపీ ఆదేశించారు. కేంద్రం ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నా.. రేషన్ దుకాణాల్లో మాత్రం కేవలం సీఎం రేవంత్రెడ్డి ఫొటో మాత్రమే పెడుతున్నారని.. ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని నిలదీశారు. ఇకపై ప్రతి దుకాణంలో సీఎంతో పాటు పీఎం ఫొటో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉజ్వల పథకం కింద దరఖాస్తు చేసు కున్న వారికి సిలీండర్లు ఇవ్వాలని సూచించారు. రూ.300 రాయితీ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఊట్కూర్, మక్తల్ ప్రాంతాల్లో ని పంట పొలాల్లో జింకల సంచారం అధికంగా ఉందని.. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎంపీ ప్రశ్నించగా.. ఓటరు జాబితా తయారు చేస్తున్నామని, త్వరలోనే నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చేనేత, జౌళిశాఖ అధికారి బాబు తెలిపారు. పథకాలన్నీ ప్రజలకు చేరాల్సిందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ● గత సమావేశంలోని అంశాలు.. ఆయా శాఖ లు తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు. తొ లుత డీపీఓ సుధాకర్రెడ్డి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 272 గ్రామపంచాయతీలకుగాను 201 జీపీలకు సొంత భవనాలున్నాయని తెలిపా రు. స్పందించిన ఎంపీ ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడం ఏమిటన్నారు. గతంలో చాలామంది సర్పంచులు చేసిన పనులకు నేటికీ బిల్లు లు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ● డీఎంఅండ్హెచ్ఓ డా. జయచంద్రమోహన్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ కింద జిల్లాలో 2,533 మంది రూ.10 లక్షలలోపు లబ్ధి పొందారన్నారు. పీహెచ్సీల్లో వైద్యులు ఉన్నారా లేదా అని ఎంపీ ఆరా తీశారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలను డీఏఓ జాన్ సుధాకర్ వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పారదర్శకంగా జరగాలని ఎంపీ సూచించారు. పీఎం సూర్యఘర్ కింద 134 దరఖాస్తులు వచ్చినట్టు విద్యుత్శాఖ ఎస్ఈ నవీన్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్రం వాటా ఉంటుందని.. పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని హౌసింగ్ పీడీ శంకర్నాయక్ను ఎంపీ ఆదేశించారు. జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూళ్లు ఉన్నాయని డీఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో ఎన్ని అంగన్వాడీ టీచ ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ను ఎంపీ ప్రశ్నించగా 33 టీచర్, 203 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కోటకొండ–కోయిలకొండ మధ్యలో రహదారి పను లు ఎందుకు నిలిచిపోయాయని, ఎన్హెచ్ విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. బ్యాంకర్లు రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, మిగతా లక్షా్యాలను పూర్తి చేయాలని ఎల్డీఎంకు ఆమె సూచించారు. ●జిల్లాకేంద్ర మున్సిపాలిటీలో రూ. 27.66 కోట్లతో చేపట్టిన వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఎంపీ అరుణ ప్రజా ఆరోగ్యశాఖ అధికారిని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని ఎర్రగుట్ట, టీవీటవర్ వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు పెద్ద ట్యాంకుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, అలాగే 5 లక్షల లీటర్ల ట్యాంకు నిర్మాణం ప్రారంభం అవుతోందని అధికారి వివరించారు. ● చివరగా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లా డుతూ.. దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని, అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు చేపట్టే పనులు ప్రారంభించినప్పుడు ప్రొటోకాల్ తప్పక పాటించాలని ఆదేశించారు. స మావేశంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎస్ఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
18 నెలల్లో పూర్తి...
జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. మెస్సర్స్ అనూషా ప్రాజెక్టు వారు పనులు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. కొత్తపల్లి వైపు పిల్లర్ల నిర్మాణం -
‘హైలెవల్’.. ముమ్మరం
రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం ● జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు ● తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు ● గద్వాల, ఆత్మకూర్ మధ్య తగ్గనున్న దూరం కొనసాగుతున్న పిల్లర్ల పనులు గద్వాల జిల్లా పరిధిలోని కొత్త పల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ, వనపర్తి ఆనందంగా ఉంది.. గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. –మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల మంత్రి కృషి ఫలితంతోనే.. ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు అ డ్డంకులు సృష్టించినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. –పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వ త్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల,ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం త గ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నా యి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నా యి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. వివాదాలు.. అడ్డంకులు... హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్ర తలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేప ట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్శా ఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అ భివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు వి మర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్అండ్బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. తగ్గనున్న దూరం.. -
ధాన్యం నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు
కోస్గి రూరల్/కొత్తపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. గురువారం ఆయన మద్దూర్, దమ్గాన్పూర్ కోస్గి, చెన్నారం, గుండుమాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను, జాదరావుపల్లిలోని రైస్మిల్, కోస్గిలోని వెంకటసాయి రైస్మిల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దామరగిద్ద, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గిలో ఏర్పాటుచేసిన కోనుగోలు కేంద్రాల నుంచి రోజు 15 వేల బస్తాల ధాన్యం రైస్మిల్లులకు వస్తుందని.. అవసరమైన స్థలం, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 100 మంది హమాలీలు ఉండగా.. కేవలం 15 లారీలను మాత్రమే దించుకుంటున్నారని చెప్పారు. వారం రోజుల్లో ధాన్యం అధికంగా వస్తుందని.. తరలింపులో జాప్యం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను పిలిపించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి రామకృష్ణ తదితరులు ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ నారాయణపేట: రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా ఎల్.రమేష్ గురువారం స్థానిక ఆర్డీ ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆర్డీవోకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం నారాయణపేట రూరల్: మంచి ఆహారం తీసు కున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ అన్నారు. గురువారం మండలంలోని కోటకొండలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామభారతి, సత్యదర్శనం ఫౌండేషన్ సహకారంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రకృతి వ్యవసాయంతో నేల, నీరు కలుషితం కాకుండా కాపాడవచ్చని, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించారు. ఈ పథకంలో సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న 125 మంది రైతులను గుర్తించి శిక్షణ ఇచ్చామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అందిస్తుందని, మార్కెట్లో ఆయా పంటలకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, వరి, జొన్న, కంది, పెసర తదితర వాటిని సేంద్రియ విధానంలో పండించాలని కోరారు. సర్పంచ్ వెంకట్రాములుగౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, మండల వ్యవసాయ అధికారి దినకర్, ఏఈఓ అనిల్, ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, సఖి, సువర్ణ, జ్యోతి, రైతులు ప్రభంజన్రావు, రామకృష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2026–27 విద్యాసంవత్సరం 1వ తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న బాల బాలికలకు హైదరాబాద్లోని రామంత పూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదన్నారు. 1.6.2019 నుంచి 31.5. 2020లోపు జన్మించిన వారు అర్హులని, జిల్లాకు ఒక సీటు మాత్రమే కేటాయించినట్లు పేర్కొన్నారు. జూన్ ఒకటిన కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా ఒకరికి అడ్మిషన్ కల్పిస్తామని చెప్పారు. దరఖాస్తు గడువు ఈ నెల 28తో ముగుస్తుందని.. మీ–సేవ ద్వారా పొందిన జనన, కుల, ఆదాయం, స్థానిక తదితర ధ్రువపత్రాలను దరఖాస్తుకు జత పర్చాలని తెలిపారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నారాయణపేట రూరల్: ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తుండటంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యా హ్న భోజనంతో పాటు అన్నిరకాల క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానానికి కంప్యూటర్ బోధన అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవడం మానుకోవా లని సూచించారు. అంతకుముందు గ్రామ వీధుల్లో బడిబాట ర్యాలీ నిర్వహించారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో స ర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, యాదయ్య శెట్టి, డీఎస్ఓ భానుప్రకాష్, జీహెచ్ఎం భారతి, తపస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ఏఏసీ చైర్మన్ మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పది తప్పిన వారికి తర్ఫీదు
–8లో uనారాయణపేట రూరల్: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగుపడింది. అధికారుల ప్రత్యేక దృష్టి కారణంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇదే ఉత్సాహంతో ఫెయి ల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సమయసారణి విడుదచేసింది. అందుకు అనుగు ణంగా ఈ నెల 12 నుంచి జూన్ 3 వరకు రోజు సబ్జె క్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా 8,319 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 8,138 మంది ఉత్తీర్ణులయ్యారు. 181 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరిలో చాలామంది ఒక్కో సబ్జెక్టులోనే తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సైన్స్లో 84 మంది, అదేవిధంగా ఇంగ్లిష్లో 69 మంది, తెలుగులో 62 మంది, గణితంలో 61 మంది, సాంఘికశాస్త్రంలో 20 మంది, హిందీలో 15 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాలేకపోయారు. ● సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ స్కూల్, మరికల్, మక్తల్, గుండుమల్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. ఫెయిల్ ఆయన విద్యార్థులు సమీపంలోని కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. రోజు ఉదయం 8 వరకు కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా ఉందని దూర ప్రాంత విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు.. ప్రత్యేక తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. అవసరమైన స్టేషనరీ, అల్పాహారం, రవాణాతో పాటు ఇతర ఖర్చులకు ప్రతి విద్యార్థికి రూ.1,100 చొప్పున వినియోగించాలని సూచించింది. ఈ ప్రకారం జిల్లాకు 181 మంది విద్యార్థులకుగాను రూ.99,100 రానున్నాయి. చెల్లింపులు నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ఫెయిలైన విద్యార్థులు.. మక్తల్ 37, మరికల్37, మద్దూరు, 35, కోస్గి 29, నారాయణపేట18, ధన్వాడ 9, ఉట్కూరు 5, దామరగిద్ద 5, మాగనూర్ 3, కృష్ణా 2.పదోతరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు, ఫెయిల్ అయిన విద్యార్థులు జవాబు పత్నాల పునః పరిశీలనకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. మార్కుల లెక్కింపుతో పాటు సమాధాన పత్రాలు పొందడానికి గురువారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500 చెల్లిస్తే రీ కౌంటింగ్.. రూ.వెయ్యి చెల్లిస్తే రీ వెరిఫికేషన్ చేస్తారు. వీటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు, జవాబు పత్రాలు విద్యార్థి సెల్ఫోన్కు పంపిస్తారు. ఫెయిలైనవిద్యార్థులపై ప్రత్యేక దృష్టి జూన్ 3 వరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో.. పర్యవేక్షిస్తున్న అధికారులు -
బడిబయట పిల్లలు ఉండొద్దు
● గ్రామస్థాయిలో సర్పంచుల పాత్ర కీలకం ● వందశాతం సాధిస్తే సన్మానం ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: బడిబయట (డ్రాఫ్ అవుట్) పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజాపాలన.. ప్రగతిప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లకు విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి యత్నించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో బడిఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలని, డ్రాప్ అవుట్ జీరో చేయాలని, అందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు తమ గ్రామానికి ఏం అవసరమో ఇప్పటి వరకే తెలిసి ఉంటుందని.. ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏయే పథకాలు అమలవుతున్నాయి, అందులో తమ పాత్ర ఏమిటనేది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్పంచ్లలో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఓ మహిళగా తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. వందశాతం సాధిస్తే సన్మానం.. ప్రస్తుతం జిల్లాలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారు? ఇంకా ఎంత మంది పాఠశాలకు వెళ్లకుండా ఉన్నారనే వివరాల నివేదికను విద్యాశాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఏ గ్రామంలో అయితే వందశాతం పిల్లలు బడికి వెళ్తున్నారో గుర్తించి ఆయా గ్రామాల సర్పంచులకు ప్రభుత్వం ద్వారా సన్మానం చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేగాకుండా సర్పంచులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రతి వారం సందర్శించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, అలా చేస్తే వంట ఏజెన్సీ నిర్వాహకులకు భయం ఉంటుందని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పారు. అంగన్వాడీలు, పాఠశాలల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, మద్దూరు పుర చైర్పర్సన్ సరస్వతి, ఆయా మండలాల ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులు రాజేందర్కుమార్, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్, డీపీఆర్వో రషీద్, తపస్ నాయకులు షేర్ కృష్ణారెడ్డి, నర్సింహ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఓటరు మ్యాపింగ్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. బు ధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ లో ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ఉన్న ఓటర్లకు, ఇప్పుడున్న ఓటర్లతో లింక్ చేయడమే మ్యాపింగ్ ప్రక్రియని.. జిల్లాలోని మండలాలతో పోలిస్తే నారాయణపేటలో ప్రక్రియ చాలా వెనుకబడి ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధు లు తమ బీఎల్ఏల ద్వారా బీఎల్వోలకు సహ కారం అందిస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 82 శాతం మ్యాపింగ్ పూర్తయిందని.. కనీసం 95 శాతం కావాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, బీఆర్ఎస్ నా యకుడు సుదర్శన్రెడ్డి, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, సి–సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమంగా తవ్వితే చర్యలు
మాగనూర్: ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధనపు కలెక్టర్ శ్రీను హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని వర్కూర్, మాగనూర్, దాసర్పల్లి ఇసుక రీచ్లను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసు కుంటామన్నారు. అనుమతి పొందిన పరిధిలోనే మాన్యువల్గా తవ్వకాలు జరిగేలా మైనింగ్ అధి కారులతో పాటు పోలీసు, రెవెన్యూ, సాండ్ కమి టీ, ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరిగినట్లు గుర్తిస్తే పోలీసులు కేసునమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాగనూర్ ఇన్చార్జ్ తహసీల్దార్ పుష్పలతరెడ్డి, ఆర్ఐ బాలరాజు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
పాలిసెట్కు 92.08 శాతం హాజరు
నారాయణపేటఎడ్యుకేషన్/కోస్గి రూరల్:జిల్లాలో బు ధవారం జరిగిన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు తెలిపారు. నా రాయణపేటలో 3, కోస్గిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశామని..మొత్తం 1,330 మంది విద్యార్థులకుగా ను 1, 225 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా, 105 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మొత్తంగా 92.08 శాతం హాజరు నమోదైందని చెప్పారు. కోస్గిలోని ప్ర భుత్వ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 300 మంది విద్యార్థులకుగాను 285 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 173 మందికిగాను 159 మంది హాజరయ్యారని చెప్పారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికిగాను 223 మంది, బ్రిలియంట్ స్కూల్ కేంద్రంలో 217 మందికిగాను 199 మంది, చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 400 మందికిగా ను 374 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వివరించారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్వ:జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగ వంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నీ బ్యాగులు ఇవ్వ డం లేదని, మొక్కజొన్న కొనుగోళ్లలో లారీలు రాక పోవడంతో పాటు గోదాములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతతో మంత్రి ఫోన్లో మాట్లాడి కొనుగోళ్ల ప్ర క్రియ వేగవంతం చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు లారీలను సమకూర్చాలన్నారు. అనంతరం కేంద్రానికి వచ్చిన మంత్రిని పీఏసీఎస్ చైర్మన్ రాయికోడ్ శ్రీనివాస్రెడ్డి, సీఈఓ ఉదయ్కుమార్ శాలువాలతో సన్మానించారు. మంత్రి వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి.కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్రెడ్డి, కల్వల్ సర్పంచ్ చెన్నప్ప, జనార్ధన్రెడ్డి, రామకృష్ణ, సద్దల ఆంజనేయరెడ్డి ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ప్రారంభం మక్తల్:మండలంలోని జక్లేర్ స్టేజీ సమీపంలో విద్యు త్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్వ, ఊట్కూర్ మండలాల ట్రా న్స్ ఫార్మర్ల మరమ్మతుకు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఎస్ఈ నవీన్కుమార్, ఏడీఏలు విజయభాస్కర్, గంగాధర్, ఏఈలు రామకృష్ణ, అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాధవరావు, నర్సింహ, భరత్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
ఎర్ర కంది క్వింటా రూ.7,290
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఎర్ర కంది క్వింటా సరాసరిగా రూ.7,290 ధర పలికింది. వరి హంసరకం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,500, వరి సోనారకం గరిష్టంగా రూ.2,496, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్ధులు 574 మందికిగాను 541 మంది పరీక్షకు హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 532 మందికిగాను 503 మంది, ఒకేషనల్ విభాగంలో 42 మందికిగాను 38 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 111 మంది విద్యార్థులకుగాను 101 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 104 మంది విద్యార్ధులకుగాను 96 మంది, ఒకేషనల్ విభాగంలో ఏడుగురికిగాను ఐదుగురు పరీక్షలు రా సినట్లు డీఐఈఓ సుదర్శన్రావు వివరించారు. డీఈసీ స్క్వాడ్ బృందం కోస్గి, మక్తల్, నారాయణపేట, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ధన్వాడ, నారాయణపేట, సిట్టింగ్ స్క్వాడ్ బృందం మద్దూర్, ధన్వాడ కేంద్రాలను తనిఖీ చేసింది. ‘బండి భగీరథ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలి’ నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన కేసులో అధికారులు నిజాల్ని నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, మీడియా ఇన్చార్జ్ కిరణ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకొని ఆయనను బద్నాం చేయడానికే కేసు కుట్ర పన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కేసును మసిపూసి మారెడుకాయ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించడం దయన నిజాయితీకి నిదర్శనమని తెలిపారు. ఇలా చెప్పే ధైర్యం విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదని, పోలీసులు కేంద్రం పరిఽధిలో లేరని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని వివరించారు. బడి మనదే.. బాధ్యత మనదే : డీఈఓ మక్తల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే పునాదిలాంటివారని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచులు, కౌన్సిలర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుడి ఎంత పవిత్రమైందో.. బడి కూడా అంతే పవిత్రమైందన్నారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు మాత్రమే కాదని, ఆ ఊరి పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే సంరక్షకుడని తెలిపారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, పాఠశాలకు అన్నివిధాలుగా సహకరిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు నిజామొద్దీన్, ఖాజా అమృద్దీన్, గణేష్సింగ్, జనార్దన్రెడ్డి, రాఘవేందర్, మాధవి, రాంరెడ్డి, శివవంకర్, అశోక్, వీరేష్, శేఖర్, శివరాజ్, అమీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలకడగా ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వైనం ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కారుఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్నగర్ ●సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ వలలో చిక్కి రెడ్హ్యాండెడ్గా పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటివరకు ఐదుగురు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ శాఖల్లో అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి మార్చి 20న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఇసుక ట్రాక్టర్కు మైనింగ్ అధికారులు రూ.60 వేలు ఫైన్ వేశారు. ట్రాక్టర్ను స్టేషన్ నుంచి విడిపించేందుకు ఎస్ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు దాడి చేయగా ఎస్ఐ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అవినీతి అధికారి ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు రోడ్డుపై టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. -
నాసిరకంగా ఎత్తిపోతల పనులు : బీఆర్ఎస్
మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత లేదని.. కాంట్రాక్టర్లు సక్రమంగా చేయడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం పుర కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొందరు భూ నిర్వాసితులకు డబ్బులు రాలేదని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగాలేక 80 శాతం మంది రైతులు బయటి మార్కెట్లో విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలసందలు క్వింటా రూ.4,500
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ఆలసందలు క్వింటా సరాసరిగా రూ.4,500 ధర పలికాయి. అదేవిధంగా వరి హంసరకం రూ.1,650, వరి సోనారకం గరిష్టంగా రూ.2,462, కనిష్టంగా రూ.1,555 ధరలు లభించాయి. ఆయిల్పాం సాగుతో అధిక ప్రయోజనం దామరగిద్ద: ఆయిల్పాం సాగుతో అధిక ప్రయోజనం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి సాయిబాబా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్పాం సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దీర్ఘకాలిక లాభదాయకమైన పంట అని.. ప్రభుత్వ ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడితో సాగు చేయవచ్చని సూచించారు. సాంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్పాం సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను కోస్గి ఉద్యాన అధికారి హర్షవర్ధన్రెడ్డి వివరించారు. తెలంగాణ ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్ మార్కెట్ సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ వినోద్కుమార్, సర్పంచ్ కన్కిరెడ్డి, శరణ్నాయక్, సంగారెడ్డి, ఎఫ్ఓ ప్రియ, వివిధ గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్ల మెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగా ఒక నిమిషం నిబంధన లేకపోవడం, పరీక్ష సమయానికి ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. జిల్లాలో 3,671 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 3,408 జనరల్, 263 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం జనరల్లో 2,318 మంది, ఒకేషనల్లో 195 మంది.. అదేవిధంగా సెకండ్ ఇయర్లో జనరల్ 1,090 మంది, ఒకేషనల్లో 68 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. సిబ్బంది కేటాయింపు ఇలా.. జిల్లావ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నారాయణపేటలో 3, మక్తల్లో 2, కోస్గి 2. ధన్వాడ, మద్దూర్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 9 మంది సీఎస్లు, 9 మంది డీఓలు, ముగ్గురు అడిషన ల్ సూపరింటెండెంట్లు, ఒక కస్టోడియన్, ఒక ఫ్లయింగ్, ఒక సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20 మందికి ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లు నియమించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించారు. తగిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి వైద్యసిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. -
ఇళ్ల గణన షురూ..!
–8లో uనారాయణపేట: జనగణన–2027లో కీలకమైన గృహ జాబితా సేకరణ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కొనసాగుతోంది. జనగణన రెండు దశల్లో జరగనుండగా.. తొలివిడత ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపడతారు. రెండోవిడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కిస్తారు. ఇందుకోసం 1,054 మంది ఎన్యూమరేటర్లు, 178 మంది సూపర్వైజర్లు, ఛార్జ్ అధికారులకు నాలుగు విడతల్లో శిక్షణనిచ్చారు. ఈ ఏడాది స్వీయగణనకు అవకాశం ఇవ్వగా.. జిల్లావ్యాప్తంగా 11,244 మంది గృహ యజమానులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసుకోగా, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పవచ్చు. ● జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 250 గ్రామపంచాయతీలు, నాలుగు పురపాలికల్లోని 1,09,902 ఇళ్లకు గణకులు వెళ్లి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. 2027 నాటికి 1,26,052 గృహాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తూ ఆ దిశగా గణన చేపట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5,62,148 మంది ఉండగా.. 2027లో 6,64,350 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గడప గడపకు నంబర్ల కేటాయింపు.. తొలిసారిగా మొబైల్ యాప్లో జనగణన వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు సుమారు 200 ఇళ్లు కేటాయించారు. మొదటి మూడురోజులు వీరు ఇళ్లను మ్యాపింగ్ చేయడంతో పాటు నంబర్లను కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటి గోడ లేదా తలుపునకు సీఎన్, ఇంటి నంబరు, బ్లాక్ సంఖ్య రాస్తున్నారు. దీంతో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబ సభ్యులు, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు తదితర 33 రకాల వివరాలను హెచ్ఎల్ఓ యాప్లో నమోదు చేస్తారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలనూ పొందుపరుస్తారు. స్వీయగణనకు ఈ నెల 10 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. జిల్లాలో కేవలం 11,244 మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా అధికారులు స్వీయగణనపై నెలరోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించినా.. ఆశించిన స్పందన రాకపోవడం కొసమెరుపు. రెండు దశల్లో.. జనగణన ప్రక్రియను రెండు ప్రధాన దశలుగా విభజించారు. మొదటి దశలో ప్రతి భవనం, ఇంటిని గుర్తిస్తారు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, అద్దె ఇళ్లు, చివరకు గుడిసెలను వదలకుండా లెక్కిస్తారు. ఎన్యూమరేటర్లు జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి భవనానికి మార్కింగ్ చేస్తారు. 2027, ఫిబ్రవరిలో రెండోదశ ప్రారంభమవుతుంది. ఈ దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, డిజిటల్ డేటా సేకరణ ద్వారా భవిష్యత్లో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మండలం జీపీలు/ గృహాలు హెచ్ఎల్బీలు 2011 2025–26 వార్డులు జనాభా జనాభా అంచనా.. మక్తల్ 39 9988 87 52,590 62,706 దామరగిద్ద 27 10,400 101 55,151 66,571 ఊట్కూర్ 27 10,452 94 54,533 64,412 నారాయణపేట 26 11,333 113 58,881 69,375 మాగనూర్ 20 4753 45 24,192 29,574 నర్వ 20 6221 54 31,536 33,536 మద్దూర్ 17 6275 70 31,482 38,168 కోస్గి 16 4142 41 19,559 22,648 కృష్ణా 14 4629 43 23,765 26,520 మరికల్ 14 7506 64 37,650 43,764 కొత్తపల్లి 11 3620 38 19176 23,249 గుండుమాల్ 10 3980 47 19932 23,080 ధన్వాడ 9 7417 79 37,770 47,775 నారాయణపేట 24 7,914 73 41,752 49,193 మక్తల్ 16 4276 43 19,438 22,595 కోస్గి 16 4366 37 21,215 24,565 మద్దూర్ 16 2630 25 13,526 16,399 జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని విస్తృతంగా గ్రామాలు, నగరాల్లో తిప్పుతున్నారు. ఈ రథాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కలెక్టరేట్లో ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన–2027ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. సర్వేలో మొదటి మూ డురోజులు సంబంధిత ప్రాంతం మ్యాప్, ప్ర ధాన ల్యాండ్మార్క్ (గుర్తు చిహ్నాలు), డిజిట ల్ ఎంట్రీ భవనాల గణన, గృహాలసంఖ్యను యాప్లో నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్ల లాగిన్ నుంచి సూపర్వైజర్ లాగిన్కు వస్తా యి. తర్వాత జనగణన పోర్టల్కు వస్తాయి. వాటిని కలెక్టర్ లాగిన్ చేసుకొని జనగణన పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. – ఖఘువాహన్, సీపీఓ, నారాయణపేట ఇంటింటికి నంబర్ల కేటాయింపు జూన్ 9 వరకు వివరాల సేకరణ స్వీయగణనకు స్పందన అంతంతే.. జిల్లాలో నివాస గృహాలు 1,09,902.. హౌజ్ లిస్టింగ్ బ్లాక్లు 1,054 ఎన్యూమరేటర్లు 1,054.. సూపర్వైజర్లు 178 మంది -
ఓటరు మ్యాపింగ్కు సహకరించండి
నారాయణపేట: పట్టణంలో 90 శాతానికి పైగా ఓటరు మ్యాపింగ్ పూర్తయ్యేలా బూత్ లెవెల్ అధికారులకు కౌన్సిలర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్చార్జ్ ఆర్డీఓ రాజేందర్గౌడ్ కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పుర పరిధిలోని కౌన్సిలర్లు, బీఎల్వోలు, సూపర్వైజర్లతో ఓటరు నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి సమావేశమయ్యారు. త్వరలో నిర్వహించనున్న ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. పట్టణ పరిధిలోని 40 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు మ్యాపింగ్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. బీఎల్వోలు వేగవంతంగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు.


