పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– ఆంజనేయులు,
జిల్లా వ్యవసాయ అధికారి
●


