సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి | Sikkim Tunnel Collapse Kerala Geologist Missing Death Toll Rises to 8 | Sakshi
Sakshi News home page

సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

Jul 21 2026 11:46 AM | Updated on Jul 22 2026 12:32 AM

Sikkim Tunnel Collapse Kerala Geologist Missing Death Toll Rises to 8

నామ్చి: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సమర్దుంగ్ ప్రాంతంలోని సొరంగంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సొరంగంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన అనీష్ మోహన్‌ను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
 

సహాయక చర్యలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌హెచ్‌పిసి అధికారులు సంయుక్తంగా ముమ్మరం చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement