26 ఏళ్లుగా మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్నా. నేటికీ కనీస వేతనానికి ఆమడ దూరంలో ఉన్నాం. ఇచ్చే వేతనం కూడా రెండు, మూడునెలలకు ఓసారి చెల్లిస్తుండటంతో పాటు రెండేళ్లుగా పీఎఫ్ చెల్లించడం లేదు. దీంతో దుర్భర జీవితాలు గడుపుతున్నాం. ఇటీవల సవరించిన జీఓ నంబర్ 6 ప్రకారం వేతనాలు అందించి న్యాయం చేయాలి.
– కె.రాజప్ప, మిషన్ భగీరథ కార్మికుడు,
పారేవుల హెడ్వర్క్స్
రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారు
జిల్లాలోని 280 గ్రామపంచాయతీల్లో సుమారు 800 మందికిపైగా కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వేతనాలు పెంచాలని పలుమార్లు ఉద్యమాలు చేసినా కేవలం రూ.9,500 మాత్రమే చెల్లిస్తున్నారు. జీఓనంబర్ 6 ప్రకారం స్కిల్డ్ వేతనాన్ని కార్మికులకు అందించాలి. దీంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా వర్తింపజేయాలి
– అరుణ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి, ప్రగతిశీల గ్రామపంచాయతీ కార్మిక సంఘం
●


