కాలుష్యంతో ఇబ్బందులు..
రాష్ట్ర సరిహద్దు సమీపంలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం కావడం విచారకరం. ఈ ప్లాంట్తో మండల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. మేము నిత్యం కృష్ణానదిలోని నీటిని తాగేందుకు, పంటల సాగుకు ఉపయోగిస్తున్నాం. ఇక మీదట ఆ నీరు కలుషితమైతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
– గజ్జి శాంతమ్మ, సర్పంచ్, గుడెబల్లూర్
ప్రమాదం పొంచి ఉంది..
రాష్ట్ర సరిహద్దుకు 3–4 కి.మీ. దూరంలో ఏర్పాటుచేస్తున్న అణువిద్యుత్ కేంద్రంతో మన ప్రాంతానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అణువిద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కలుషిత వ్యర్థాల కారణంగా వాతావరణం, నదీ జలాలు కలుషితమవుతాయి. దీన్ని మొదట్లోనే వ్యతిరేకిస్తే కృష్ణానదికి సమీపంలో ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. – నర్సింహులు, ముడుమాల్
●
కాలుష్యంతో ఇబ్బందులు..


