కౌంటింగ్ ప్రక్రియనుపరిశీలించిన ఎస్పీ..
కొత్తపల్లి/కోస్గి రూరల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ అన్నారు. శుక్రవారం ఆమె మద్దూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేల ఏర్పాటు, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమన్నారు. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, గెలిచిన అభ్యర్థులు సంయమనం పాటించాలని సూచించారు.
● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు
● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్
● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం
● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు


