iran israel war
-
చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు. దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం. ఇది అమెరికాకంటే ఇరాన్కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్ చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం. పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్గా వాన్స్ బృందం పాక్లో కాలుమోపాయి.లెబనాన్పై ఆగని దాడులు బీరూట్: లెబనాన్తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్లో 2,055 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు. -
తక్కువ ధరకే లభించే వంట గ్యాస్ ఏది?.. ఎల్పీజీనా, ఎలక్ట్రిక్నా, హైడ్రోజన్నా?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ దేశాలకు దిగుమతయ్యే సింహభాగం గ్యాస్ సరఫరా దెబ్బతింది. ఇతర సహజ వనరులు కూడా ప్రభావితమయ్యాయి.ఫలితంగా వంటింట్లో విరివిగా వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్లు, హైడ్రోజన్ స్టవ్లను వినియోగించడం ప్రారంభించారు. అదే సమయంలో తక్కువ ధరలో లభించే వంట గ్యాస్ను ఎంచుకుంటూ, తమ బడ్జెట్కు అనుగుణంగా వినియోగంలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో లభించే వంట గ్యాస్ ధరలు, అనుకూల,ప్రతి కూలతలు గురించి ఆరా తీస్తున్నారు.ఎల్పీజీ వంట గ్యాస్ఎల్పీజీ కోట్లాది మంది భారతీయ కుటుంబాలకు ప్రధాన వంట గ్యాస్గా కొనసాగుతోంది. ఇది విస్తృతంగా లభిస్తుంది. విద్యుత్ అవసరం లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడినా వంట చేసుకోవచ్చు. అయితే, ధరలు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. చాలా నగరాల్లో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.900–రూ.1100 మధ్య ఉంటుంది. ఒక సిలిండర్ సాధారణంగా 25–30 రోజుల వరకు వస్తుంది. అంచనా నెలవారీ ఖర్చు: రూ.900 నుంచి రూ.1,200ప్రయోజనాలు:దేశంలో సులభంగా అందుబాటులో ఉంటుందివిద్యుత్ అవసరం లేదుఅందరికీ తెలిసిన గ్యాస్, వినియోగం సులభంప్రతికూలతలు:ధరలు మారుతూ ఉంటాయితరచుగా రీఫిల్ చేయాలిజాగ్రత్తగా వాడకపోతే భద్రతా సమస్యలుఎలక్ట్రిక్ వంట గ్యాస్నగరాల్లో ఎలక్ట్రిక్ వంట, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ల వినియోగం పెరుగుతోంది. ఇది శుభ్రంగా ఉంటుంది. నిర్వహణ సులభం, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అవసరం ఉండదు. ఇండక్షన్ స్టవ్లలో శక్తి సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే అవి నేరుగా పాత్రలను వేడెక్కిస్తాయి.అయితే మొత్తం ఖర్చు రాష్ట్రాల వారీగా మారే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది.అంచనా నెలవారీ ఖర్చు: రూ.700–రూ.1100ప్రయోజనాలు:కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కంటే చవకగా ఉంటుందిరీఫిల్ అవసరం లేదుగ్యాస్ లీక్ సమస్యలు లేక భద్రత ఎక్కువప్రతికూలతలు:విద్యుత్ సరఫరాపై ఆధారపడుతుందిపవర్ కట్ సమయంలో ఉపయోగించలేముప్రత్యేక పాత్రలు అవసరంహైడ్రోజన్ వంట గ్యాస్ హైడ్రోజన్ స్టవ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. గృహ వినియోగానికి విస్తృతంగా అందుబాటులో లేవు. హైడ్రోజన్ గ్యాస్ నీటి నుంచి తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు, శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఆధారిత వంట గ్యాస్ సిస్టమ్లను పరీక్షిస్తున్నారు. ఇవి ఇంకా విస్తృత వినియోగానికి సిద్ధంగా లేవు.అంచనా నెలవారీ ఖర్చు: ఇంకా అందుబాటులో లేదుప్రయోజనాలు శుభ్రమైనది, పర్యావరణానికి అనుకూలంఫాసిల్ ఫ్యూయల్స్పై ఆధారాన్ని తగ్గిస్తుందిప్రతికూలతలు:వాణిజ్యపరంగా అందుబాటులో లేదుఎక్కువ ఖర్చు, మౌలిక వసతుల అవసరంఖర్చు ఇంకా స్పష్టంగా లేదుప్రస్తుత ధోరణులువిద్యుత్ సరఫరా స్థిరంగా, చవకగా ఉన్న నగరాల్లో ఎలక్ట్రిక్ వంట ఎల్పీజీ కంటే కొంత చవకగా ఉంటుంది.విద్యుత్ అస్థిరంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ అత్యంత ప్రాక్టికల్, నమ్మదగిన ఎంపిక.హైడ్రోజన్ ఇంకా రోజువారీ వినియోగానికి సరైన సమయం కాదు.వినియోగదారుల నిర్ణయంనగరాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా ఉంటే, ఎలక్ట్రిక్ వంట ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచుగా పవర్ కట్లు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ భద్రతా పరంగా వినియోగంలో ఉంది. హైడ్రోజన్ భవిష్యత్తులో ఆశాజనకమైనది. కానీ ప్రస్తుతానికి వినియోగం సులభం కాదు. ఎల్పీజీ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్.. హైడ్రోజన్ వంట ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరుగుతోంది. చాలా కుటుంబాలకు ఎల్పీజీ ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినదే. కానీ ఎలక్ట్రిక్ వంట వైపు మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. భవిష్యత్తు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. -
రెండేళ్ల పాప: యుద్ధంలోనే పుట్టి.. యుద్ధంలోనే మృతి..
టైర్ (లెబనాన్): ఆ పాప వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. యుద్ధంలోనే పుట్టింది.. యుద్ధంలోనే కన్నుమూసింది. తనచుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ పాపను యుద్ధమే బలితీసుకుంది.ఇజ్రాయెల్ దాడుల్లో ఆ పాప తండ్రి మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడిలో ఆ రెండేళ్ల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన దక్షిణ లెబనాన్లో చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక పేరు టలీన్ సయీద్. ఇజ్రాయెల్ దాడిలో ఆ పసిపాప అక్క అలైన్ సయీద్ (7) బయటపడింది. గత వారం దక్షిణ లెబనాన్లో తన ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడి నుంచి కూడా అలైన్ సయీద్ ప్రాణాలతో బయటపడింది. స్రిఫా గ్రామంలో సయీద్ ఇంటిపై బుధవారం దాడి జరిగింది. అదే రోజు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇది తమ దేశానికి కూడా వర్తిస్తుందని లెబనాన్లో చాలామంది భావించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సయీద్ కుటుంబానికి చెందిన మరో నలుగురు బంధువులు కూడా మృతి చెందారు.“కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దీంతో మేము గ్రామానికి వెళ్లాం. శవపేటిక వద్ద ప్రార్థనలు చదివి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా ఒక తుపాను మాపై పడుతున్నట్టుగా అనిపించింది” అని నాసర్ సయీద్ (64) అనే వ్యక్తి తమపై జరిగిన బాంబు దాడుల గురించి తెలిపాడు. అతను కూడా ఈ దాడి నుంచి బయటపడ్డాడు.ఆదివారం, అతను ఇతర బంధువులతో కలిసి దక్షిణ పోర్ట్ నగరం టైర్కు వెళ్లి పచ్చని గుడ్డలతో కప్పిన మృతదేహాలను తీసుకున్నాడు. వాటిలో ఒక మృతదేహం చాలా చిన్నగా ఉంది. అది అతని మనవరాలు టలీన్ సయీద్ మృతదేహం. అలైన్ సయీద్ చెల్లెలే టలీన్ సయీద్.పసిపాప టలీన్ తలపై, కుడి చేతిపై బ్యాండేజ్లు, ముఖంపై గీతలు ఉన్నాయి. అది చూసిన వారికి కన్నీరు ఆగలేదు. లెబనాన్లో తాజా యుద్ధం మార్చి 2న ప్రారంభమైంది. లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు పెంచింది. వీటిలో 2,000 మందికి పైగా మృతి చెందారు. అందులో 165 మంది పిల్లలు, దాదాపు 250 మహిళలు ఉన్నారు.బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్-అమెరికాతో జరిపిన చర్చల్లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు. లెబనాన్ అధికారులతో వేరే మార్గంలో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ చూస్తోంది. -
లైట్ బ్రో.. చర్చల వేళ ట్రంప్ ఆటవిడుపు
పాకిస్థాన్ ఇస్లామాబాద్లో నిన్న (శనివారం) అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం అంతా ఈ భేటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే ఉద్విగ్న సమయాలలో యుద్ధానికి కారణమైన ట్రంప్ మాత్రం ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరించాడట.. తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆ సమయంలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు వెళ్లారట.ఇరాన్- అమెరికా మధ్య నిన్న జరిగిన శాంతి చర్చలు ఏలాంటి పురోగతి లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్ తలొగ్గకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అయితే చర్చల ఫలితం ఏముంటుందా అని ప్రపంచ దేశాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే అంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎంతో కూల్గా ఉన్నారట. అతనికి ఏమి పట్టనట్లు ఒక క్రీడా కార్యక్రమానికి వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.మాయామిలోని ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు ట్రంప్తో తన కుటుంబంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో, భారత్లోని అమెరికా రాయభారి సెర్గియో గోర్, ఇతర అధికారులతో కలిసి గంటల సమయం గడిపారు. అధికారులు చర్చల వివరాలు తెలియజేయడానికి వచ్చినప్పటికీ ట్రంప్ పెద్దగా పట్టించుకోకుండా గేమ్ ఎంజాయ్ చేశారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్కు ఫోన్ చూపిస్తూ ఏదో చెప్పినప్పటికీ ఆయన ముఖంలో ఏలాంటి భావాలు లేవని తెలిపారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విజేతలను అభినందించారని వారితో కలిసి గడిపారని కథనాలు పేర్కొన్నాయి.. అయితే గతంలోనూ ఈ చర్చలు గురించి తాను పట్టించుకోనని ఇరాన్ సైనికంగా ఎప్పుడో ఓడిపోయిందని అన్నారు. కాగా అమెరికాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చర్చలు జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వీటి వల్లే చర్చలు విఫలం.. ఇకపై ఏం జరుగుతుంది?
పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్ మధ్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్ చెప్పినట్లే చేస్తారా?డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణంఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదన్న హామీ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది.ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరింది.అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసంఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది. అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్లో అమెరికా చేసిన ఆపరేషన్లు గుర్తుకు వస్తున్నాయి. అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను కుప్పకూల్చుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది. -
ఇరాన్కు కొత్త టెన్షన్..
వాషింగ్టన్ : అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్) ఇప్పుడు ఇరాన్కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది. -
ఇరాన్ యుద్ధం.. నెతన్యాహు కీలక ప్రకటన
జెరూసలేం: ఇరాన్తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యలు ఇంకా పూర్తికాలేదని బాంబు పేల్చారు. కాగా, ఇరాన్పై ఇప్పటికే విజయం సాధించినట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్తో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే నాటికి ఇరాన్ అణ్వస్త్రాలకు అత్యంత సమీపంలో ఉంది. రోజుకు వందల క్షిపణులు తయారు చేసే సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు అస్తిత్వ ముప్పులను ఎదుర్కోవడమే మా లక్ష్యమని అన్నారు. అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని భూగర్భంలో అణు, క్షిపణి కార్యక్రమాలను దాచిపెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేకపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణం ఇరాన్ విధానాలేనని ఆరోపించారు.ఇరాన్ బలహీనమే.. ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల సమృద్ధ యురేనియం విషయంలో కూడా నెతన్యాహు స్పందించారు. దానిని దౌత్యపరంగా లేదా అవసరమైతే బలప్రయోగంతో తొలగిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా మ్యాప్ చూపిస్తూ వాళ్లు మమ్మల్ని అణగదొక్కాలని చూశారని, ఇప్పుడు తామే వారిని బలహీనపరుస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ బలహీనపడిందని, కాల్పుల విరమణ కోరుతున్నదని నెతన్యాహు అన్నారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. మమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించినవాళ్లు ఇప్పుడు తమకే బతుకుబండిపై పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.శాంతి కోసం సిద్ధం..లెబనాన్తో శాశ్వత శాంతి కోసం సిద్ధమని, అయితే ఈ ఒప్పందం తరాల పాటు నిలిచేలా ఉండాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు హాని కలిగించే శక్తులపై చర్యలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లెబనాన్ గత నెలలో పలుమార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, లెబనాన్తో వచ్చే వారం నుంచే అధికారిక చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ రెండు ప్రధాన షరతులు విధించింది. మొదటిగా, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రెండోది, భద్రతకు హామీ ఇచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఉండాలి. -
ఇరానియన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలంగా నివాసముంటున్న ఇరాన్ ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల సంబంధీకుల గ్రీన్కార్డులను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా, లాస్ఏంజెలెస్కు చెందిన సైకాలజీ ఉపాధ్యాయుడు సయ్యద్ ఈసా హషేమీ, ఆయన భార్య, కుమారుడి గ్రీన్కార్డులను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.అయితే, వీరంతా ఇరాన్లో జన్మించి, అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వారని వివరించింది. వీరిని నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు త్వరలోనే స్వదేశానికి పంపనున్నారని తెలిపింది. 1979లో టెహ్రాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేసిన వారికి ప్రతినిధిగా వ్యవహరించిన మసౌమె ఎబ్తెకర్ కుమారుడే హషేమీ. అనంతరం మసౌమె ఇరాన్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలయ్యారు.కాగా, 2020లో బాగ్దాద్పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాజీ చీఫ్ కసెమ్ సొలెమానీ కుటుంబీకుల గ్రీన్ కార్డులను గత వారం విదేశాంగ శాఖ రద్దు చేయడం తెల్సిందే. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. చైనా ఇరాన్కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.అయితే, ఇరాన్కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్ప్యాడ్ ఆయుధాలను ఇరాన్కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.#WATCH | On reports of China shipping weapons to Iran, US President Donald Trump says, "If China does that, China is going to have big problems." (Source: US Network Pool Via Reuters) pic.twitter.com/YiSlLe3TI6— ANI (@ANI) April 12, 2026నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్కు చైనా పంపిందని తెలుస్తోంది.మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది. -
ఇరాన్తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి జేడీవాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. అందుకే ఇరాన్తో డీల్ లేదు. ఇస్లామాబాద్ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్దపడట్లేదు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్కు కచ్చితంగా బ్యాడ్ న్యూస్’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, "...The simple fact is that we need to see an affirmative commitment that they (Iran) will not seek a nuclear weapon and they will not seek the tools that would enable them to quickly achieve a… pic.twitter.com/elS9Q0xPz4— ANI (@ANI) April 12, 2026ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టం కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్ నుంచి జేడీ వాన్స్ బృందం.. అమెరికాకు బయలుదేరింది. అయితే, హార్మూజ్ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్ను తొలగించాలని ఇరాన్ కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. -
ఇరాన్కు ట్రంప్ హెచ్చరికలు.. అల్టిమేటం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ముగిశాయి.. -
ఇరాన్కు చైనా ఆయుధాలు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాన్ని పంపిన ఇరాన్ మరోవైపు ఆయుధాల సమీకరణలో బిజీగా మారిందన్న వార్త చర్చనీయాంశమైంది. మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్ప్యాడ్ ఆయుధాలను ఇరాన్కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్ప్యాడ్ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్–సీకింగ్’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్–15ఇ యుద్ధ విమానం, బ్లాక్హాక్ హెలికాప్టర్లను ఇరాన్ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి. నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. ఇ చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్క్లోరేట్తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్కు చైనా పంపిందని తెలుస్తోంది. -
సానుకూలంగా చర్చలు షురూ!
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. 1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్బేస్లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ డిమాండ్లు → హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు. → గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. → ఇరాన్పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. → స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి. అమెరికా డిమాండ్లు → ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. → యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. → హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు. చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
హర్మూజ్ జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: ఇస్లామాబాద్లో జరుగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఈ చర్యను ‘ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నం’గా ఆయన అభివర్ణించారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నౌకలు తూర్పు నుండి పశ్చిమ దిశగా గల్ఫ్లోకి ప్రవేశించి, తిరిగి అరేబియన్ సముద్రానికి చేరుకున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో మాట్లాడుతూ.. మేము హర్మూజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తున్న ఉపకారం. వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదు” అని ఎద్దేశించారు.అదే సమయంలో ఆయన ఇరాన్కి పెద్దగా సైనిక శక్తి లేకపోయినా, సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతుందని సూచించారు. అంటే, ఇరాన్కి ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, కానీ మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాలుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మార్గాన్ని తిరిగి తెరవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఇస్లామాబాద్లో కొనసాగుతున్నాయి. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ చర్చలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి. -
ఇరాన్ చిత్తుగా ఓడిపోతుంది: చర్చల వేళ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ చిత్తుగా ఓడిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరాన్ గెలుస్తోందని చెప్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది. కానీ, వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసని తెలిపారు.“వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారికి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ లేదు, రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు, వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి. ముఖ్యంగా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇక లేరు’ అని తెలిపారు.సముద్రంలో ఇరాన్ మైన్లు వేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని బాగు చేస్తోందని, ప్రపంచ దేశాలకు సాయంగా ఈ పని చేస్తున్నామని అన్నారు.మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్లో జరుగుతున్న చర్చలు కొన్ని భేదాలు, ముందస్తు షరతుల వల్ల ఆలస్యమయ్యాయయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, చర్చలు 5 గంటలకుపైగా ఆలస్యమయ్యాయని, ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్ యుద్ధం వేళ ఎరువుల ధరలను నిశితంగా గమనిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మార్కెట్ను నియంత్రిస్తూ ధరలను అధికంగా పెంచడాన్ని అమెరికా అంగీకరించదని చెప్పారు. కాగా, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు.చర్చలలో అమెరికాకు ఇరాన్ ప్రతిపాదనలు ఇవే..ఇరాన్పై దురాక్రమణ చేయొద్దుహార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడానికి అంగీకరించడంఅన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడంఅన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడంఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంIAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడంఇరాన్కు నష్టపరిహారం చెల్లించడంఈ ప్రాంతం నుంచి అమెరికా సైనికదళాలను ఉపసంహరించుకోవడంలెబనాన్పై దాడులు విరమించుకోవడం -
అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
-
చర్చలు విఫలమైతే మళ్లీ యుద్ధం మొదలవుతుందా?
-
విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు.. ఇరాన్ ఎమోషనల్ పోస్ట్!
-
అమెరికా సంచలన ప్రకటన..ఇరాన్ షరతులకు నో...
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతకర పరిణామం చోటు చేసుకుంది. చర్చలకు ముందు అమెరికా రెండు కండీషన్స్ అంగీకరించిందని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై వైట్హౌస్ స్పందించింది. టెహ్రాన్ పెట్టిన షరతులను అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాయిటర్స్ కథనం ప్రచురించింది.అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్కు సంబంధించి ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయడం పై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ నెలకొంది. కాగా అంతకుముందు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. లెబనాన్ సీజ్ఫైర్, ఖతార్ ఇతర విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ప్రకటన విడుదల చేసింది. కాగా తాజాగా అమెరికా ఈ ప్రకటనను ఖండించింది.అయితే ప్రస్తుతం ఇస్లామాబాద్లో ఇరాన్- అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్ ప్రధాని ఇరు దేశాలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపిన అనంతరం రెండు దేశాల ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన ఆందోళన రేపుతుంది. -
జేడీవాన్స్ విమానానికి స్పెషల్ ఎస్కార్ట్.. వీడియో వైరల్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. హైలెవల్ డెలిగేషన్ కావడంతో చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం మెుత్తం ఆ దేశ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు కీలక భద్రత కలిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్లో జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం జరగనుందా అనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చర్చలలో పాల్గొనడానికి వచ్చే ప్రతినిధులకు సైతం పాక్ ప్రత్యేక భద్రత కల్పించింది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ప్రయాణించిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ బోయింగ్ సీ-32ఏ విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందన ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్గా ప్రత్యేక భద్రత కల్పించాయి. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రకమైన భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఇరాన్ ప్రతినిధులకు సైతం పాక్ అత్యంత పటిష్టమైన ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ ఫైటర్ జెట్లను ఇరాన్ పంపి ఐరన్ ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది.కాగా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఇరాన్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ప్రతినిధులతో భేటీ అవనున్నట్లు సమాచారం. రెండు దేశాలతో పరోక్ష చర్చలు ముగిసిన అనంతరం ప్రధాన చర్చలు ప్రారంభం అవనున్నట్లు తెలుస్తోంది.🇺🇸🇮🇷🇵🇰 Footage of Pakistani fighter jets escorting JD Vance to Islamabad.Iran sent 3 planes when their negotiating team flew in, 2 of which were decoys, in case Netanyahu got any ideas about trying to assassinate them.pic.twitter.com/Sr9oJFLgff https://t.co/bsB5dbcuMU— Mario Nawfal (@MarioNawfal) April 11, 2026 -
పాక్ ప్రధాని ముందు ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకున్న US
-
పాక్లో చర్చలు.. ప్రధానంగా అడ్డొచ్చే అంశాలివే..
టెహ్రాన్: చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ను అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మొదట విడివిడిగా కలుస్తున్నారు. ఇరాన్ ప్రతినిధులతో షెహబాజ్ షరీఫ్ సమావేశం ముగిసింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. జేడీ వాన్స్తో ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతికి దారి తీస్తాయని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.పాక్లో చర్చలు ఎంతకాలం కొనసాగుతాయి?చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో అనుబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి. శనివారం సాయంత్రం వరకే జరిగే అవకాశం ఉంది.ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ప్రధానంగా మూడు అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సేకరించిన యురేనియం, హార్మూజ్ జలసంధి, లెబనాన్ వంటి అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. హార్మూజ్ జలసంధిపై పట్టును నిలపుకోవాలని ఇరాన్ భావిస్తోంది. లెబనాన్లో కొనసాగుతున్న దాడులు ఆపాల్సిందేనని మొదటి నుంచి చెబుతోంది. ఇక యురేనియం నిల్వలపై ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారు? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రత్యేక సలహాదారు జారెడ్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో కలిసి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్నారు. ఇదే సమయంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల కోసం పాక్ చేరుకున్నారు.పాకిస్థాన్ పాత్ర ఏంటి?రెండు పక్షాలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతించారు. యుద్ధం వేళ కాల్పుల విరమణకు పాక్ కీలకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాక్ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మొదట ఇరు పక్షాల డిమాండ్లను షెహబాజ్ షరీఫ్ వింటున్నారు. ఆ తర్వాత ఆయన సమక్షంలో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు చర్చించుకుంటారు. -
ఇరాన్తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది... అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఈ యుద్ధ విరమణ నిజంగా శాంతి కోసమా? లేక తన దౌత్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న ముందస్తు వ్యూహమా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలకు సిద్ధమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికాలోని మేధావి వర్గం ఈ చర్చల ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం క్షిపణుల మోతతో ముగిసిపోయేది కాదు, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ క్లిష్ట సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్హోవర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి: "ప్రజలు శాంతిని ఎంతగా కోరుకుంటారంటే, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని వారికి ఆ శాంతిని అందజేయక తప్పదు” అని. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వాలు శాంతిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయే తప్ప, నిబద్ధతతో పనిచేయడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారనుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అమెరికా దౌత్య నీతికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయాలని చూడటం లేదా నౌకాయానాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావించినా, ఆచరణలో వారిని ఆపే శక్తి ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. గతాన్ని పరిశీలిస్తే, జాన్ ఎఫ్. కెన్నెడీ క్యూబన్ మిస్సైల్ సంక్షోభం సమయంలో ప్రదర్శించిన సంయమనం, వ్యూహాత్మక ఓర్పు నేటి నాయకత్వంలో లోపించినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరి ఈ చర్చల భవితవ్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. లెబనాన్పై దాడులను ఆపే ఉద్దేశం ఇజ్రాయెల్కు లేదని స్పష్టమవుతున్న తరుణంలో, అమెరికా చేసే చర్చలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి? ఒకవైపు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్కు కత్తిమీద సాము లాంటిదే. రిచర్డ్ నిక్సన్ చైనా వైపు అడుగులు వేసినప్పుడు ప్రదర్శించిన రియల్పాలిటిక్ వ్యూహాన్ని ట్రంప్ ఇప్పుడు అమలు చేయగలరా? లేక కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే దెబ్బతిందని అనుకుంటే పొరపాటే. అమెరికా తన ఖజానా నుండి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లను ఈ యుద్ధం కోసం తగలేసింది. ఈ భారీ సొమ్మును అమెరికా ప్రజల సంక్షేమం కోసం, విద్య, వైద్య రంగాల కోసం ఖర్చు చేసి ఉంటే అగ్రరాజ్యం మరింత శక్తివంతంగా తయారయ్యేది.అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఇప్పుడు రక్షణ స్థితిలో పడిపోయింది. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన జేసీపోఏ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్ను ఒక క్రమపద్ధతిలో నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు వారిని నియంత్రించడం అంటే వారికి కొన్ని భారీ మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి. నమ్మకం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో పునాది వంటిది, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. చర్చల మధ్యలో దాడులు చేయడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాను తీవ్రమైన అనుమానంతోనే చూస్తోంది.చివరగా చెప్పాలంటే, ఈ వారాంతపు చర్చలు కేవలం ఒక రాజకీయ ప్రహసనం కాకూడదు. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ఎరువుల కొరత వల్ల ఆఫ్రికా వంటి దేశాల్లో పేదరికం, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అబ్రహం లింకన్ అన్నట్లుగా, "మన శత్రువును మిత్రుడిగా మార్చుకున్నప్పుడు, ఆ శత్రువును నాశనం చేసినట్లే అవుతుంది” అని. ట్రంప్ ఈ సూత్రాన్ని పాటిస్తారా లేక పాత కక్షలతోనే ముందుకు సాగుతారా? చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. కేవలం ఆధిపత్య పోరు పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో అడుగులు వేసినప్పుడే ఈ చర్చలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది.::: కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
మోజ్తాబా ఆరోగ్యంపై కీలక అప్డేట్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇరాన్ సుప్రీంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆయన పెద్దగా బయట కనిపించింది లేదు. కాగా తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితులపై కీలక సమాచారం ప్రచురితమయ్యింది..మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదివరకే చాలా సార్లు పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అమెరికా జరిపిన దాడిలో ఆయన కోమాలోకి వెళ్లారని తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన అసలు బ్రతికి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా మోజ్తాబా ఎప్పుడు బయిటకి రాలేదు. కేవలం వ్రాతపూర్వక కీలక సమయాల్లో కేవలం వ్రాతపూర్వక సందేశాలు మాత్రమే అందించారు.అయితే ప్రస్తుతం మోజ్తాబా వేగంగా కోలుకుంటున్నారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. మోజ్తాబా భౌతికంగా బయిటకి రానప్పటికీ యుద్ధానికి సంబంధించిన కీలక సమావేశాల్లో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాల్గొంటున్నారని తెలిపింది. వాషింగ్టన్తో చర్చలు వంటి కీలక విషయాలలో వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించింది.ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటిపై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఆ దాడిలోనే మోజ్తాబాకు తీవ్ర గాయాలయ్యాయని ఆయన ముఖం తీవ్రంగా దెబ్బతిందని కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ రోజు నుంచి నేటి వరకూ మెజ్తాబా ఎన్నడూ మీడియా ముందుకు రాలేదు. అప్పటి నుంచి భిన్న రీతిలో ఆయనపై వార్తలు వచ్చాయి. -
హర్మూజ్ విషయంలో ఇరాన్ భింకం ఇందుకే?
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో హాట్ టాఫిక్గా నిలిచిన అంశాలలో ప్రధానమైంది హర్మూజ్ జలసంధి. దీనిని తెరవాలని అమెరికా పట్టుబట్టడం ఇరాన్ ససేమిరా అనడంతో చాలా కాలం పాటు ఉద్రిక్తతలు నడిచాయి. అయితే ఇరాన్ ఈ జలసంధిని తెరవలేక పోవడానికి అందులో అమర్చిన మైన్స్ సైతం ఓ కారణంగా తెలుస్తోంది.ప్రపంచ రవాణాకు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాణిజ్య రవాణాలో దాదాపు 20 శాతంకు పైగా దీనిగుండానే ప్రయాణం అవుతాయి. గల్ఫ్ దేశాలకు చెందిన చమురుతో పాటు ఇతరత్రా కీలకమైన వస్తువులు దీని గుండానే సరఫరా జరుగుతుంది. అయితే యుద్ధం కారణంతో ఇరాన్ను దీనిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభ పరిస్థిలకు ట్రంప్ యుద్ధ నిర్ణయమే కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హర్మూజ్ తెరవాలని ట్రంప్ పలుమార్లు హెచ్చరించినా ఇరాన్ మాత్రం ససేమిరా అంది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినా వెనక్కి తగ్గలేదు. ఇరాన్ ఇంత మెుండిగా వ్యవహరించడానికి ఇతర కారణాలు ఉన్నాయని విశ్లేశకులు భావిస్తున్నారు.అయితే తొలి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం తలెత్తి అవకాశం ఉందని భావించిన ఇరాన్ హర్మూజ్ని మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆ జలసంధికి చెందిన చాలా ప్రదేశాల్లో ల్యాండ్ మైన్స్ (మందుపాతరలు) పెట్టింది. అయితే అలల తాకిడికి చాలా మైన్స్ కొట్టుకపోయి ఉండవచ్చని అవి ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతం ఇరాన్కు సైతం గుర్తించ లేకుండా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పూర్తి సురక్షిత ప్రయాణానికి జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇవ్వడం.. ఒక వేళ అనుమతి ఇచ్చాక ఏదైనా ప్రమాదంతో షిప్లు పేలిపోతే యుద్దం తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఇరాన్ కొంత ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.దానితో పాటు ల్యాండ్ మైన్లను అమర్చడం కంటే తొలగించడం మరింత కష్టమని ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వాటిని తొలగించే సాంకేతికత గానీ సమయం గానీ ఇరాన్ వద్ద లేవని పేర్కొన్నాయి. ఒకవేళ ట్రంప్ మాటలను నమ్మి వాటిని తొలగిస్తే ఆయన ప్లేటు పిరాయిస్తే పరిస్థితులు ఏంటని అక్కడి నాయకులు ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ తెరవడానికి సందిగ్ధిత కొనసాగుతుందని తెలిపాయి. అయితే ట్రంప్ ఈ జలసంధి అంశంపై తాజాగా స్పందించారు ఇరాన్ హర్మూజ్ను తెరిచినా.. తెరవకపోయినా త్వరలోనే దానిని మేము ఓపెన్ చేస్తాము అని అన్నారు. ఈ విషయంలో వేరే దేశాలు సైతం మాకు సహాయం చేస్తామని ప్రకటించాయి అని అన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు. -
ట్రంప్ ఒకటి తలిస్తే.. జరిగింది మరోకటి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్లో పాలన మార్పు కోసం తహతహలాడారు. ఇందుకోసం ఆ దేశంపై యుద్ధమే ప్రకటించి సుప్రీం లీడర్ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఖమేనీ అంతం తర్వాత టెహ్రాన్ను పాలిస్తున్న కొత్త నాయకత్వం మునుపటి కంటే మరింత కఠినమైన మత భావజాలం కలదని తెలుస్తోంది. దీంతో యుఎస్ఏ, ఇజ్రాయెల్ పరిస్థితి అయోమయంగా మారింది.ఇరాన్లో పాలన మార్పు కోసం ఆ దేశంలోని ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లెక్కారు. మతఛాందస వాదుల చేతిలో పాలన ఉందని వారు గద్దెదిగాలని నిరసనలు చేపట్టారు. దీంతో ఆ తిరుగుబాటుని అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇదే అవకాశంగా భావిస్తు వచ్చిన ట్రంప్ మెుదట నుంచి ఇరాన్ను హెచ్చరిస్తూ వచ్చారు. అణ్వయుధాలు తయారు నెపంతో పాటు అక్కడి ప్రజలు సైతం పాలన మార్పు కోరుకుంటున్నారని యుద్ధం ప్రారంభించారు. యుద్ధంలో తొలిరోజే ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమెుందించారు. అయితే ఖమేనీ మరణంతో ఆయన కుమారుడు పగ్గాలు చేపట్టారు.. ఇది అంతా తెలిసిన విషయమే అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న వారు గత ఖమేనీ కంటే ఇంకా ప్రమాదకరమైన వ్యక్తులని ఇజ్రాయెల్ రహస్య నివేదికలు ఇచ్చినట్లు కథనాలు వచ్చాయి.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ పాలిస్తున్న నాయకులు అధికశాతం ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నుంచే వచ్చారని కథనాలు పేర్కొన్నాయి. . వీరికి గత పాలకులతో పోలిస్తే మతఛాందస సిద్ధాంతాలు మరింత అధికంగా ఉంటాయని కఠిన వైఖరి అవలంభిస్తారని తెలిపాయి. ఈ వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రహస్యంగా నివేదించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే ట్రంప్, నెతన్యాహూ సైతం పలుమార్లు ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్లో పాలన మార్పుకు ఇది సరైన సమయమని దీన్ని అవకాశంగా తీసుకొని రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టాలని తెలిపారు.అయితే అక్కడి ప్రజలు దాన్ని తిరస్కరించి. మానవహారాలుగా ఏర్పడి అక్కడి మౌళిక సదుపాయాలకు రక్షణగా నిలిచారు. అయితే ట్రంప్, నెతన్యాహు ఒకటి తలిస్తే ఆ దైవం మరోటితలచిందన్న చెందాన ప్రస్తుత పరిస్థితి ఉందని కథనాలు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తు ఏంటో ఈ రోజు తేలే అవకాశాలున్నాయి. -
చర్చలపై ప్రతిష్టంభన!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడమే ధ్యేయంగా శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. మొత్తానికి శాంతి చర్చలకు ఇరాన్ హాజరవుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది. శుక్రవారం రాత్రి వరకూ ఎటూ తేల్చుకోకపోవడం గమనార్హం. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధమవుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఇస్లామాబాద్కు బయలుదేరారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల పట్ల ఇరానియన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్నేహహస్తం అందిస్తామని తెలిపారు. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తదుపరి పరిణామాలు మరోలా ఉంటాయని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. చర్చల విషయంలో ట్రంప్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్ వెల్లడించారు. రెండు అంశాలు పరిష్కారమైతేనే... ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని టెహ్రాన్ హెచ్చరించినట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘలిబాఫ్ శుక్రవారం విమర్శించారు. లెబనాన్లో కాల్పుల విరమణ పాటించడం లేదని, ఇరాన్కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇప్పటికీ విడుదల చేయలేదని తప్పుపట్టారు. శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఈ రెండు అంశాలు అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇరాన్ నుంచి పది మందితో కూడిన ప్రతినిధి బృందం చర్చలకు రాబోతోందని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ మొఘదామ్ గురువారం నిర్ధారించారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకను ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, వారి కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్ను ఏర్పాటు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దాడులు జరుగుతుండగానే చర్చలా? లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని అంటూ తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్లో చర్చలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇరుపక్షాలను స్వాగతించడానికి పాక్ సర్కార్ సిద్ధమయ్యింది. చర్చల కోసం వచ్చే ప్రతినిధులకు, విలేకరులకు ‘వీసా ఆన్ అరైవల్’కింద వీసాలు ఇవ్వనున్నట్లు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ శుక్రవారం తెలిపారు. పాక్ మంత్రికి మునీర్ మందలింపు మానవాళికి శాపం ఇజ్రాయెల్, అదొక దయ్యం, క్యాన్సర్ అంటూ దూషించిన పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించారు. ఆయనపై పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలిసింది. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటని మండిపడినట్లు సమాచారం. ఇజ్రాయె ల్ను దూషిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టును ఖవాజా అసిఫ్ తర్వాత తొలగించారు. -
మాతో గేమ్స్ ఆడొద్దు.. ఇరాన్కు జేడీవాన్స్ హెచ్చరిక
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్కు భారీ హెచ్చరిక చేశారు. చర్చల పేరుతో అమెరికాతో ఆటలాడవద్దన్నారు. తమకు యుద్ధాన్ని ముగించే లక్ష్యం ఉందని దాన్నిసాకుగా చూపి అమెరికాను తక్కువ అంచనా వేయద్దన్నారు. ఇస్లామాబాద్ చర్చలకు బయిలుదేరే ముందు జేడీవాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 40 రోజుల పాటు మారణ హోమం సృష్టించిన యుద్ధానికి సంబంధించిన చర్చలు ఇస్లామాబాద్లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల నిమిత్తం జేడీవాన్స్ పాకిస్థాన్ బయిలు దేరారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీవాన్స్ మాట్లాడుతూ "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు.కాగా వ్యక్తిగతంగా కూడా జేడీ వాన్స్కు ఈ చర్చలు ఒక అగ్నిపరీక్ష వంటివి 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నందున, ఈ చర్చల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందని, విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరుతుండగా ఆ దాడులకు ఈ ఒప్పందానికి సంబంధం లేదని ట్రంప్ మరియు నెతన్యాహు వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మూసివేసిన హర్ముాజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆయిల్ ట్యాంకర్లను అనుమతించకపోవడం ఒప్పంద ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
ఆకాశంలో హైఅలర్ట్.. ఐరన్ ఎస్కార్ట్తో ఇరాన్ ప్రతినిధులు
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్పైనే ఉంది. అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్ జోన్గా మారింది. ఈ నేపథ్యంలో పాక్ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో "ఐరన్ ఎస్కార్ట్" ఏర్పాటు చేస్తోంది.మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు (శనివారం) అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు. ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్ డెలిగేషన్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందంలో లెబనాన్పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. -
హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్
-
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మినాబ్ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్ అంచనా వేస్తోంది.బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. (చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..) -
అమెరికా నిఘా డ్రోన్ అదృశ్యం
-
అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?
-
గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడుతున్న ఇరాన్
-
US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల్లో దూరడం ఎందుకంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ మరో ఆటగాడు నసీం షా విషయంలో వ్యవహరించినట్లే షాహిన్ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.పాక్ చేసిన పని వల్ల గందరగోళంఅసలేం జరిగిందంటే.. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇప్పటికే పరస్పర దాడుల వల్ల మూడు దేశాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇరాన్ అగ్ర నాయత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టామని అమెరికా చెబుతోంది.అయితే, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ తెరమీదకు వచ్చింది.కానీ ఇక్కడా పాక్ చేసిన పని వల్ల గందరగోళం నెలకొంది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి పాకిస్తాన్ ‘లెబనాన్’అనే పేరును తొలగించి.. అమెరికా, ఇజ్రాయెల్లకు చేరవేసిందని ఆరోపణలు వస్తున్నాయి.విమర్శల వర్షంలెబనాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిగా పాక్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ద్వంద్వ వైఖరిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అయితే ఏకంగా మధ్యవర్తిత్వం విషయంలో పాక్ ఎంతమాత్రం నమ్మదగిన దేశం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.ప్రపంచ శాంతికి కృషి.. పాకిస్తానీగా గర్విస్తున్నాఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. ‘‘ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. మా ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు శాంతి చర్చలకు ఊతమిచ్చారు.సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. ఇందుకు పాకిస్తాన్ గొప్ప ముందడుగు వేసింది. శాంతి కోసం కృషి చేస్తోంది. పాకిస్తానీగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ షాహిన్ ఓవరాక్షన్ చేశాడు.ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యంఓవైపు.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ షాహిన్ ఆఫ్రిది ఇలా సొంతడబ్బా కొట్టుకున్నట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? అని మండిపడుతున్నారు.కాగా ఇటీవల పాక్ పేసర్ నసీం షా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను రాణిలా ట్రీట్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇతర అంశాల్లో జోక్యం చేసుకున్నందున పీసీబీ అతడికి రూ. 2 కోట్ల (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. మరి ఇప్పుడు షాహిన్ కూడా పీసీబీ ఇలాగే శిక్షిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఇటీవల షాహిన్ కెప్టెన్సీలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ పర్యటనలో దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయింది.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్దే!
మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్లకు పాకిస్తాన్ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్ వాదన. దీంతో పాకిస్తాన్ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్ పాక్పై ఆగ్రహంగా ఉంది. పాక్ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం. ‘‘లెబనాన్తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్చేశారు. ట్వీట్చేసిన కొద్దిసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్ఫైర్లో లెబనాన్ ఉందని ఇరాన్ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు. ట్వీట్ సైతం అమెరికా నుంచే.. షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్ సైతం సొంతంగా టైప్ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్ ‘ఎక్స్’లో పోస్ట్చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్హౌస్ అనుమతితోనే షరీఫ్ ఆ సందేశాన్ని పోస్ట్చేశారని న్యూయార్క్టైమ్స్ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్ విఫలమైందని, అందుకే లెబనాన్ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. -
అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనికులు రెడీ: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి 24 గంటలైనా గడవకముందే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మళ్లీ హార్మూజ్ను మూసివేయడంతో దీనిపై శ్వేతసౌధం స్పందించింది. ఇరాన్ తీరు అమోదయోగ్యం కాదని చెప్పింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ సోషల్లో స్పందించారు.‘అన్ని అమెరికా నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది, అదనపు గుండు సామగ్రి, ఆయుధ సామగ్రి అన్నీ ఇరాన్ దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నాయి. శత్రువు ఇప్పటికే బలహీనంగా ఉప్పటికీ పూర్తిగా నాశనం చేసేందుకు వీలుగా వాటన్నింటినీ అక్కడే సిద్ధంగా ఉంచాం. ఒప్పందం పూర్తిగా అమలు అయ్యే వరకు అక్కడే ఉంటాయి. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోయినా, అసాధ్యం అయినా, కాల్పులు ప్రారంభం అవుతాయి. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నాం. ఎవరైనా వేరేలా చెప్పినా అవి తప్పుడు మాటలు. అణ్వాయుధాలను అనుమతించబోం. హార్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉండేలా చేస్తాం. మా సైన్యం సిద్ధమవుతూ, విశ్రాంతి తీసుకుంటోంది. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది. అమెరికా ఈజ్ బ్యాక్’ అని ట్రంప్ తెలిపారు. -
నాటో నుంచి అమెరికా ఔట్? ఏం జరిగిందంటే..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) నుంచి వైదొలిగే అంశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆలోచన చేస్తుండడానికి ప్రధాన కారణం ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు సహకరించకపోవడమే. ఇప్పటికే నాటోపై పలుసార్లు ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల భద్రతకు ప్రధాన ఆధారంగా ఉంది నాటో. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని నాటోకి ఓ పరీక్షగా అభివర్ణించారు. ఇందులో ఆ కూటమి విఫలమైందన్నారు. ట్రంప్ ఒత్తిడి చేసినప్పటికీ నాటో మిత్రదేశాలు యుద్ధానికి సైనిక బలగాలను పంపడానికి నిరాకరించాయి. లెవిట్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వైట్ హౌస్లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేను కలవడానికి ముందు వెలువడ్డాయి.“నాటో గురించి ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. నాటోను పరీక్షించామన్నారు. ఈ పరీక్షలో నాటో విఫలమైందని చెప్పారు” అని లెవిట్ తెలిపారు. గత ఆరు వారాలుగా నాటో అమెరికా ప్రజలను విస్మరించడం బాధాకరమని అన్నారు. నాటో రక్షణ ఖర్చులను అమెరికా ప్రజలే భరిస్తున్నారని ఆమె చేర్చారు. రుట్టేతో ట్రంప్ సూటిగా, స్పష్టంగా మాట్లాడతారని ఆమె తెలిపారు.ట్రంప్ నాటో నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారా అని మీడియా అడిగింది. లెవిట్ స్పందిస్తూ.. రుట్టేతో సమావేశం తర్వాత దీనిపై ట్రంప్ మాట్లాడవచ్చని చెప్పారు. ట్రంప్, రుట్టే మధ్య సన్నిహిత సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన తర్వాత రుట్టే పలుసార్లు వైట్ హౌస్ను సందర్శించారు. గత ఏడాది మార్చి, జూలై, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కూడా వచ్చారు.గతంలో రుట్టే అమెరికా మద్దతు లేకుండా నాటో పనిచేయదు అని హెచ్చరించారు. ట్రంప్తో సమావేశంలో పాల్గొన్న తర్వాత రుట్టే మాట్లాడుతూ.. ట్రంప్కు తన మద్దతును పునరుద్ఘాటించారు. అయితే, నాటో మిత్రదేశాలు లాజిస్టిక్స్, బేస్ల వినియోగం ద్వారా అమెరికాకు సాయం అందించాయని చెప్పారు.నాటో నుంచి బయటకు వెళ్లేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని రుట్టేను మీడియా అడిగింది. రుట్టే స్పందిస్తూ.. “ట్రంప్లో నిరాశ ఉందనేది స్పష్టమే. అదే సమయంలో నా వాదనలు ఆయన జాగ్రత్తగా విన్నారు” అని రుట్టే సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించారు.సైన్యాన్ని వెనక్కి.. ఇరాన్తో జరిగిన యుద్ధానికి మద్దతు ఇవ్వలేదని ట్రంప్ భావించిన దేశాల్లోని అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించి, ఆ ఘర్షణలో సహాయకంగా ఉన్న దేశాలకు సైన్యాన్ని తరలించడం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నాటో సభ్య దేశాల్లో కొన్నింటిపై చర్యలు తీసుకోవాలని వైట్ హౌస్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిసార్లు ట్రంప్ నాటోకు మద్దతును ఉపసంహరించుకుంటామని బెదిరింపులు చేశారు. మరికొన్నిసార్లు మిత్రదేశాలకు మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. గత ఏడాది ట్రంప్ డెన్మార్క్ స్వయం పాలిత ప్రాంతం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక శక్తి వినియోగిస్తామని బెదిరించడం అమెరికా, యూరప్ మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. ట్రంప్ గ్రీన్లాండ్ను జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్నారు. అనంతరం అమెరికా కొంత వెనక్కు వెళ్లింది. అయితే గ్రీన్లాండ్పై అమెరికా అధికారం అవసరమని ట్రంప్ మళ్లీ అన్నారు. -
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
ముంబై: ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్ఫైర్తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. భారీ లాభాలతో షురూ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆర్బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. అంతర్జాతీయ మార్కెట్లు రయ్... పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్ 5.11%, తైవాన్ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్కాంగ్ 3%, చైనా 2.62%, సింగపూర్ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్ ఫ్రాన్స్ 5%, సీఏసీ 4.47%, ఎఫ్టీఎస్ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీలు నాస్డాక్ 2.63%, డోజోన్స్ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్యూ బ్యాంక్స్ 5.79%, బ్యాంకెక్స్ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్ ఇండెక్స్ 5.62%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48%, సర్వీసెస్ 5.22%, కన్జూమర్ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్అండ్టీ 7.64%, బజాజ్ ఫైనాన్స్ 7.03%, ఎంఅండ్ఎం 6.79% యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్–5 షేర్లుగా నిలిచాయి. టెక్ మహీంద్రా (–1.53%), సన్ఫార్మా(–0.29%), పవర్గ్రిడ్ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. → గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.62%, అదానీ టోటల్ గ్యాస్ 7.60% ర్యాలీ చేశాయి. → ఎన్డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్ 6.28%, అదానీ పోర్ట్స్ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది. → సీజ్ఫైర్ ఎఫెక్ట్తో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఏవియేషన్ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్ జెట్ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది. -
లెబనాన్పై భీకర దాడులు
బీరూట్/దుబాయ్/టెల్ అవీవ్: తాజా కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించబోదన్న ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసింది. బుధవారం మధ్యాహ్నం ఆ దేశంపై భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే రాజధాని బీరూట్పై కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 100కు పైగా లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. అత్యంత జనసమ్మర్ధంతో కూడిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంది! దాంతో పలు పౌర, వాణిజ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నివాస స్థలాలు, అపార్ట్మెంట్లు కుప్పకూలాయి. ఈ దాడులకు ఏకంగా 112 మందికి పైగా బలైనట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 700 మందికి పైగా గాయపడ్డట్టు వెల్లడించింది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం భారీగా పెరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అల్ మజారా ప్రాంతంలో దగ్ధమైన వాహనాల్లో కాలి బుగ్గిగా మారిన మృతదేహాలను వెలికితీసినట్టు ఏపీ వార్తా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటినుంచీ లెబనాన్పై ఇదే అతి భారీ దాడి అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది! దక్షిణ లెబనాన్తో పాటు తూర్పున బెక్కా లోయపైనా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులపై మీడియా ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టుగా బదులిచ్చారు. ‘‘ఇజ్రాయెల్–లెబనాన్ ఘర్షణకు ఇరాన్తో సంబంధం లేదు. కనుక కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించబోదు’’అని మరోసారి స్పష్టం చేశారు. దాడులను అనాగరిక చర్యగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ అభివరి్ణంచారు. తాము కేవలం క్షిపణి లాంచర్లు, కమాండ్ కేంద్రాలు, నిఘా వ్యవస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పులకు తెర దించేందుకు ఇజ్రాయెల్తో చర్చలకు సిద్ధమని లెబనాన్ ప్రకటించింది. గత 40 రోజుల దాడుల్లో లెబనాన్లో 1,530 మందికి పైగా మరణించారు. 10 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్పై కూడా దాడులు జరిగాయి. పేలుళ్లతో రాజధాని టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. లావాన్ దీవిలోని చమురు క్షేత్రంపైనా ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. భారీ సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్తో పాటు యూఏఈ, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలు వెల్లడించాయి. హార్మూజ్కు మళ్లీ మూత! లెబనాన్పై దాడులతో ఇరాన్ నిర్ణయంటెహ్రాన్: అంతర్జాతీయంగా చమురు సరఫరాలకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుందన్న ఆనందనం కొద్ది గంటల ముచ్చటగానే ముగిసింది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో 40 రోజుల ప్రతిష్టంభన అనంతరం బుధవారం ఉదయమే హార్మూజ్ను ఇరాన్ తెరిచిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొన్ని నౌకలు దాని గుండా వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దాంతో హార్మూజ్ను మళ్లీ మూసేస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది! లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలోనే జలసంధిని మూసేసినట్టు ఫార్స్ న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. -
ఎట్టకేలకు శాంతి!
టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి ఎట్టకేలకు తాత్కాలికంగా తెర పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. కనీవిని ఎరగని దాడులతో ఇరాన్ను సర్వనాశనం చేసేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగిసేందుకు కేవలం 90 నిమిషాల ముందు ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. దాంతో తాత్కాలికంగానైనా పెను ముప్పు తప్పిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ తన ట్రూత్సోషల్ మాధ్యంలో పోస్టు చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇందుకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్లో పోస్టు చేశారు. ఈ రెండు వారాల్లోగా యుద్ధానికి పూర్తిగా తెర దించేందుకు కృషి చేయాలని అమెరికా, ఇరాన్ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శుక్ర, లేదా శనివారాల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సమావేశం కానున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్కు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సారథ్యం వహిస్తారని సమాచారం. ఇరు బృందాలూ గురువారమే ఇస్లామాబాద్ చేరుకోనున్నట్టు చెబుతున్నారు. ఇరాన్ బృందం రాకను అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ధ్రువీకరించినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఇరు వర్గాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాల్పుల విరమణకు సంబంధించి తీవ్ర అయోమయం నెలకొంది. కాల్పుల విరమణ లెబనాన్కు కూడా వర్తిస్తుందని ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని ప్రకటించగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగబోవని కుండబద్దలు కొట్టారు. అనంతరం ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. హెజ్బొల్లా కారణంగా కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించబోదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగైతే విరమణ ఒప్పందం నుంచి బయటికి రావడమే గాక చర్చల నుంచే తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది! మరోవైపు, అసలు విరమణ ఒప్పందమే చాలా ‘బలహీనంగా’ఉందంటూ వాన్స్ పెదవి విరిచారు! ఇంకోవైపు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ నిరి్నరోధంగా దాడులను కొనసాగించింది. దాంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై భారీగా దాడులకు దిగింది! ఈ నేపథ్యంలో రెండు వారాల కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది సందేహాస్పదంగా మారింది. దీనికి తోడు, ఇరాన్తో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి సంబంధించి ఇప్పటిదాకా తుది ప్రణాళిక అంటూ ఏమీ ఖరారు కాలేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కోరోలినా లెవిట్ మీడియాకు స్పష్టం చేశారు! ఇరాన్ షరతులపై ట్రంప్ అసంతృప్తి హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలన్న షరతుపైనే కాల్పుల విరమణకు తాను అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ 10 షరతులను తమ ముందుంచిందన్నారు. వాటిలో కొన్ని ఆచరణయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. ఇరాన్ షరతులు మోసపూరితంగా ఉన్నాయని ఆక్షేపించారు. అంతేగాక ఇరాన్ ఇకముందెప్పుడూ యురేనియం శుద్ధికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఆ దేశం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. గతేడాది మా దాడుల్లో భూ స్థాపితమైన ఆ యురేనియం నిల్వలను ఇరాన్ సహకారంతోనే వెలికి తీసి తరలిస్తాం’’అని చెప్పుకొచ్చారు. యురేనియం నిల్వలను తమకు అప్పగించని పక్షంలో ఇరాన్పై మళ్లీ దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు! కానీ ఇందుకు ఆ దేశం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది. యురేనియం నిల్వల అప్పగింతపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించలేదు. ఇరాన్ను చర్చలకు ఒప్పంచడంలో తెర వెనక చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు తమకు కూడా సమాచారం ఉందని వెల్లడించారు.విజయం మాదంటే మాదేఅమెరికా, ఇరాన్ ప్రకటనలు ఇరానే దేబిరించింది: హెగ్సెత్ షరతులకు ఒప్పకున్నారు: ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో, నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేశాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియా సాక్షిగా ప్రకటించారు! ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పలు పోస్టులు చేశారు.ప్రపంచ శాంతికి కీలకమైన రోజు! ఇరాన్ తమపై దాడులను ఆపాలని కోరింది. కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ నాకు చేరవేశారు. ఈ రాత్రికి ఇరాన్పై తలపెట్టిన అతి పెద్ద దాడిని నిలిపేయాలని విన్నవించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిచే షరతుపై ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు నేను అంగీకరించా. ఆ దేశంపై దాడుల ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నింటిని ఇప్పటికే సాధించేశాం. ఇరాన్ మాకు 10 పాయింట్లతో ప్రతిపాదన పంపింది. దానిపై ఈ రెండు వారాల్లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగేందుకు అమెరికా సాయపడుతుంది. ఇరాన్ తన దేశ పునరి్నర్మాణ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. అమెరికాలో మాదిరిగానే పశ్చిమాసియాలో కూడా త్వరలో స్వర్ణయుగాన్ని ఆస్వాదించాలి. ఇది ప్రపంచ శాంతికే అతి కీలకమైన రోజు! – ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఇరాన్కు ఆయుధాలిస్తే 50 % టారిఫ్ విధిస్తా ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వబోనని శాంతివచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మిత్రదేశాలపై టారిఫ్ల యుద్ధం ప్రకటించారు. ఇరాన్కు ఆయుధాలను సరఫరాచేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ‘‘ఇరాన్కు మిలటరీ ఆయుధాలు అందించే ప్రతి దేశంపై 50 శాతం టారిఫ్లు విధిస్తా. అటు ఇరాన్కు ఆయుధాలు పంపుతూ ఇటు అమెరికాకు వస్తూత్పత్తులను ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం టారిఫ్లను మోపుతా. టారిఫ్ల విధింపు విషయంలో ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఉండబోవు. ఇకపై ఆయుధాలు పంపిన తక్షణం అదనపు టారిఫ్లు అమల్లోకి వస్తాయి’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఒక పోస్ట్పెట్టారు. ట్రంప్ హెచ్చరికతో అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త అవరోధాలు తలెత్తే ముప్పు ఉంది. ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, ఉత్తరకొరియా దేశాలపై అమెరికా అదనపు టారిఫ్ల భారం మోపే ఆస్కారముంది. రష్యా, చైనా, ఉ.కొరియాలు ఆయుధాలతోపాటు సైనిక సాంకేతికతనూ ఇరాన్కు చేరవేసినట్లు గతంలోనే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరగా దేశం వీడండిఇరాన్లోని భారతీయ పౌరులకు కేంద్రం సూచన దుబాయ్: అనూహ్యంగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరాన్ నుంచి బయటపడాలని అక్కడి భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతరాయబార కార్యాలయం బుధవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘‘ఇరాన్ను వీడాలనుకునే భారతీయులు తొలుత అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రతించండి. వాళ్ల సూచన మేరకు నడుచుకోండి. ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోకండి. రాయబార కార్యాలయం సూచించిన మార్గాల్లోనే దేశం వీడండి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్చేసి సంప్రతించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి. cons. tehran@mea.gov.in ఈమెయిల్కు మెయిల్చేసి సలహాలు పొందొచ్చు. -
యుద్ధంపై ట్రంప్ అంతరంగికం ఇదే.. జేడీ వాన్స్
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య 14రోజుల సీజ్ఫైర్ నడుస్తోంది. రెండు వారాల తర్వాత ఇరు దేశాలు యుద్ధం ముగింపుకు అంగీకరిస్తాయా? లేదా అన్న సంగతి తెలియదు. అయితే ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ అంతరంగికం గురించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.ప్రస్తుతం హంగేరి పర్యటనలో ఉన్న జేడీవాన్స్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చలు జరపడానికి తమ బృందానికి పలు కీలక విషయాలు ట్రంప్ వెల్లడించారన్నారు ఇరాన్తో చర్చలు జరిపేటప్పుడు పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో వ్యవహరించాలని చర్చలు జరిపే బృందానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. అయితే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ చాలా అసహనంగా ఉన్నారని త్వరగా ఫలితాలు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.అయితే ఇరాన్ పాలకవర్గంలో కొన్ని విభాగాలు చర్చలకు సహకరిస్తున్నప్పటికీ, మరికొన్ని విభాగాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే ఖచ్చితంగా ఒక ఒప్పందానికి రావచ్చని అదంతా ఇరాన్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు.గత ఆరు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నిన్న ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం అని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అనంతరం కొద్ది సేపటికే 14 రోజుల సీజ్ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు ఈ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. -
వైమానిక దాడులు చేస్తాం..ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ఫైర్ ఒప్పందంతో ఇరాన్ శాంతించినా.. ఇజ్రాయెల్ మాత్రం తన తీరు మార్చుకున్నట్లు లేదు. తాజాగా దక్షిణ లెబనాన్ ప్రాంతంలో క్షిపణులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, టెల్ అవీవ్కు భారీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ విషయమై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. "కొన్ని గంటల్లో దక్షిణ లెబనాన్పై బాంబుల దాడిని ఆపకుంటే ఇరాన్ వైమానికి దళం టెల్ అవీవ్పై దాడులు కొనసాగిస్తుంది" అని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు "ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరాన్తో నేరుగా జరిగే యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్లోని హిజ్బుల్లాపై పోరాటం ఆగదని" తేల్చి చెప్పారు. లెబనాన్ నుండి హిజ్బుల్లా దాడులు చేస్తున్నంత కాలం ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మరో వైపేమో ఇరాన్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాల్పుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా అని ఆందోళన వ్యక్తమవుతోంది. -
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
-
వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?
-
5 వారాల యుద్ధం ఎప్పుడు ఏం జరిగింది.. పిన్ టు పిన్
-
సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత!
అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గ్లోబల్ మార్కెట్లను భారీ ఊరట నిచ్చాయి. పెట్టుబడుదారుల సెంటిమెంట్ బలపడటంతో దాదాపు అన్ని మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేలవంగా ఉన్న పాకిస్తాన్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 8న ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పాకిస్తాన్ బెంచ్మార్క్ స్టాక్ సూచీ 12,000 పాయింట్లకు పైగా పెరిగి, ఒకే రోజులో అత్యధిక ర్యాలీని నమోదు చేసింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని అస్థిరత కాలం తర్వాత ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. స్థానిక దినపత్రిక డాన్ ప్రకారం, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ KSE-100 సూచీ 8.15 శాతం పెరిగి 164,035.83 పాయింట్లకు చేరుకుంది. KSE-100 సూచీ చరిత్రలో ఒకే రోజులో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. దీంతో ఏరంగా ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అనుగుణంగా ట్రేడింగ్ను నిలిపివేయడం విశేషం. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన తర్వాత ఈ లాభాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోని కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరిస్తే, దానికి బదులుగా వాషింగ్టన్ సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించింది. రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్ అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు.ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఒక "నిర్ణయాత్మక ఒప్పందం" కుదుర్చుకోవడమే ఈ చర్చల లక్ష్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఈ చర్చలు ఇస్లామాబాద్లో జరగవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధికాగా ఫిబ్రవరి 28న మొదలైన ఇరన్పై యుద్ధం ప్రారంభంలో కూడా ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో,మార్చి 2న KSE-100 సూచీ 16,089 పాయింట్లు లేదా 9.57 శాతం మేర పడిపోయి, ఒక్కరోజులో అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
సీజ్ఫైర్ ఒప్పందంలో 'కీ రోల్' ఈ నాయకుడిదే?
ప్రస్తుతం పశ్చిమాసియాను శాంతి మేఘాలు అలుముకున్నాయి. ఇరు దేశాలు సీజ్ఫైర్ ఒప్పందం పాటించడంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచాన్నే ఊలిక్కి పడేలా చేశాయి. నాగరికతను అంతం చేస్తా అని ట్రంప్ హెచ్చరించడంతో ఏం జరగనుందా అని అంతా ఆందోళన పడ్డారు. అంతలోనే సీజ్ ఫైర్ ఒప్పందంఅయితే ఇదంతా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి వ్యూహంలో భాగమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా గుడ్ కాప్- బాడ్ కాప్ వ్యూహాన్ని అమలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వైపేమో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలతో ఇరాన్ను భయ భ్రాంతులకు గురి చేయగా ..మరో వైపేమో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెరవెనుక ప్రశాంతంగా రాయబారం నడిపి ఇరాన్ని దారికి తెచ్చేలా వ్యవహరించారని రాయిటర్స్ కథనం పేర్కొంది.మెుదటి నుంచి జేడీవాన్స్ యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ సన్నిహితులైన కుష్నర్ లేదా విట్కాఫ్ వంటి వారి మాటలను పెద్దగా పట్టించుకోని ఇరాన్..జేడీవాన్స్ మాటలకు మాత్రం గౌరవం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ వాన్స్తో ఒప్పందం కుదరకపోతే ఇక దేనికీ ఆస్కారం ఉండదు అని భావించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో వాన్స్ సైతం యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గత నెలలో కాల్పుల విరమణకు ఏమాత్రం అవకాశం లేని సమయంలో యూఏఈ ,సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాల నాయకులతో పాటు, ఇజ్రాయెల్ అధ్యక్షుడితో వరుస చర్చలు జరిపినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.మెుత్తానికి జేడీవాన్స్ ఇరాన్ని చర్చల ద్వారా సీజ్ఫైర్ ఒప్పందం చేయించడంలో సఫలీకృతం అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అమెరికా వనరులు వృధా అవుతాయని, అది దేశానికి భారీ ఆర్థిక భారమని నమ్మేవారు. ఇదే విషయమై ట్రంప్ని కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది. -
ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ! కోమా లో కొత్త సుప్రీం లీడర్...
-
ఇరాన్ కూడా ఇదే కోరుకుంటోంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ దీనిపై స్పందించారు. ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. “ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు. ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటోంది. ఇక యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. అలాగే, అందరికీ కూడా ఇలాగే అనిపిస్తోంది. హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పెరుగుదల విషయంలో అమెరికా సాయం చేస్తుంది. పాజిటివ్ చర్యలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదన జరుగుతుంది. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సరఫరాలతో లోడ్ అవుతాము. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండబోతున్నాం. అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అమెరికాలో మేము అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణ యుగం కావచ్చు” అని అన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా విషయంలో అనుసరిస్తున్న విధానం, ఇరాన్పై సైనిక చర్యకు దిగాలని తీసుకున్న నిర్ణయం సరికాదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాదారుగా పనిచేసిన బెన్ రోడ్స్ అన్నారు. ట్రంప్ నిర్ణయాలు అత్యుత్తమ పరిస్థితుల్లో కూడా విపత్తుకర పరిస్థితులకు దారితీశాయని చెప్పారు. ఇరాన్పై యుద్ధం చేయాలన్న నిర్ణయంతో తర్వాత ఏం జరిగినా అమెరికా చరిత్రలో తీవ్రంగా సిగ్గుపడే ఘటనగా మిగిలిపోతుందని అన్నారు. ట్రంప్ చర్యల వల్ల ప్రపంచ వేదికపై అమెరికా హోదా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. అంతేగాక, ప్రపంచంలో ఆర్థిక ప్రతికూల ప్రభావాలు వస్తాయని ఆయన అంచనా వేశారు. అలాగే ట్రంప్ నిర్ణయాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మరింత శక్తిమంతుడిని, సంపన్నుడిని చేశాయని అన్నారు. -
మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్
టెహ్రాన్: కాల్పుల విరమణ వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఇది యుద్ధానికి ముగింపు కాదని, తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్పైనే ఉన్నాయని హెచ్చరించారు. సీజ్ఫైర్లో భాగంగా తక్షణమే కాల్పులు ఆపాలని చెప్పారు. శత్రుదేశాలు దురాక్రమణకు పాల్పడితే దీటుగా సమాధానం చెబుతామని అన్నారు. హార్మూజ్ను తెరిచేందుకు అంగీకరించామని చెప్పారు.ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఖమేనీ ఈ ప్రకటన చేశారు. "ఇది యుద్ధానికి ముగింపు కాకపోయినప్పటికీ, అన్ని సైనిక విభాగాలు సుప్రీం లీడర్ ఆదేశాలను పాటించి కాల్పులు నిలిపివేయాలి" అని ఆ ప్రకటనలో ఉంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ఏ విధమైన చర్యలకు పాల్పడినా తక్షణ ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రువు చిన్న తప్పు చేసినా పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తామని చెప్పింది. అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణ రెండు వారాల పరిమిత కాలానికి మాత్రమే. ట్రంప్ దీన్ని "డబుల్ సైడెడ్ (ద్వైపాక్షిక) యుద్ధ విరమణ"గా వివరించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ కాల్పుల విరమణను.. "యుద్ధం ముగిసిందన్న సూచనకాదు" అని స్పష్టం చేసింది. చర్చలు జరగేందుకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా వచ్చిన వ్యూహాత్మక విరామం అని తెలిపింది. -
ఇది మా చారిత్రక విజయం.. మా లక్ష్యాలు ఇవే..: ఇరాన్
టెహ్రాన్: యుద్ధ లక్ష్యాల్లో తాము దాదాపు అన్నీ సాధించామని, తమది చారిత్రక విజయమని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. ఇరాన్కు మరో రెండు వారాల గడువు ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది."అమెరికాను మా 10 పాయింట్ల ప్రతిపాదనలను అంగీకరించేలా చేసి మేము చారిత్రక విజయం సాధించాం. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, ఎన్రిచ్మెంట్ హక్కులు, అన్ని ఆంక్షల తొలగింపునకు అంగీకరించింది. దాడులు నిలిపివేయడం, నష్టపరిహారం చెల్లించడం, పశ్చిమాసియా నుంచి బలగాలను వెనక్కి తీసుకెళ్లడం వంటివి అంగీకరించింది" అని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.నెల రోజులకుగా పైగా కాల్పుల విరమణకు అమెరికా ఒత్తిడి తెచ్చిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే, ఇరాన్ పలు సార్లు గడువులను తిరస్కరించిందని, దేశ లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపింది."ప్రారంభం నుంచే లక్ష్యాలు సాధించే వరకు యుద్ధం కొనసాగాలని నిర్ణయించాం. శత్రువు పశ్చాత్తాపపడేలా చేయడం, దేశానికి ఉన్న దీర్ఘకాల ముప్పును తొలగించేలా చేసుకోవడం కూడా ఇందులో ఉన్నాయి. అందువల్ల యుద్ధం ఇప్పటి వరకు 40వ రోజు వరకు కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన గడువులను ఇరాన్ పలుసార్లు తిరస్కరించింది. శత్రువు పెట్టే గడువులకు ప్రాధాన్యం ఇవ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రజలకు శుభవార్త చెబుతున్నాం, యుద్ధ లక్ష్యాల్లో దాదాపు అన్నీ సాధించాం. శత్రువును శాశ్వత ఓటమి వైపు నెట్టాం" అని కౌన్సిల్ తెలిపింది.కాగా, ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో ట్రంప్ స్పందిస్తూ.. శాశ్వత ఒప్పందం చర్చలకు 10 పాయింట్ల ప్రతిపాదన పునాది అవుతుందని, సైనిక లక్ష్యాల్లో ఎక్కువ భాగం సాధించామని తెలిపారు. 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు జరుపుతామని చెప్పారు.ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన ఇదే..పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా సమావేశం ఉండాలిఇరాన్పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలిహార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండాలిఇరాన్పై అన్ని ఆంక్షలను ఎత్తివేయాలిఇరాన్కు యుద్ధ నష్టపరిహారం చెల్లించాలిఅమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలిలెబనాన్సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం ఆపాలియుద్ధాన్ని పూర్తిగా నిలివేయాలిహార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ, భద్రత ఉండేలా ప్రోటోకాల్, షరతులు పెట్టడంఇరాన్ నిధులు, ఫ్రీజ్ చేసిన ఆస్తులు విడుదల చేయడం -
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం
మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. అప్పటితో మీకిచ్చిన గడువు ముగుస్తుంది. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవాలి. లేదంటే ఇరాన్ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవట్లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!. ఇదే చివరి డెడ్లైన్ – ఇరాన్ను ఉద్దేశించి ట్రంప్ వాషింగ్టన్/దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కనీవిని ఎరగని స్థాయికి చేరాయి. తక్షణం దారికి రాని పక్షంలో ఇరాన్ను భస్మీపటలం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మీకిచ్చిన గడువు ముగియనుంది. మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవడం వంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇరాన్ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒకే ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. కనీసం జీవం తాలూకు ఆనవాళ్లు కూడా మిగలకుండా వారి నాగరికతనే నాశనం చేస్తాం’’ అంటూ మంగళవారం ఉదయం అల్టిమేటం జారీ చేశారు.‘‘ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!’’ అన్నారు. ఇరాన్కు విధించిన డెడ్లైన్లను ట్రంప్ ఇప్పటికే నాలుగుసార్లు పొడిగించడం తెలిసిందే. ‘‘ఈసారి మాత్రం అలాంటిదేమీ ఉండబోదు. ఇదే చివరి డెడ్లైన్’’ అని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్టులు పెట్టారు. కాసేపటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే సంప్రదింపులకు రాకపోతే యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను ఇరాన్పై ప్రయోగిస్తామని పేర్కొన్నారు! అయితే అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.ప్రాణాలొడ్డి పోరాడేందుకు తనతో పాటు ఏకంగా 1.4 కోట్ల మంది ఇరానీలు సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. వారితో పాటు తాను కూడా యుద్ధరంగంలోకి దిగుతానని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా దుస్సాహసానికి దిగితే గల్ఫ్ అంతటా మారణహోమం సృష్టిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం హెచ్చరించింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు కొన్నేళ్లపాటు గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ అందకుండా చేస్తామని పేర్కొంది. విద్యుత్కేంద్రాలు, బ్రిడ్జిలను పేల్చేస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో కీలక మౌలిక వనరులను దాడుల బారినుంచి కాపాడుకునేందుకు వాటి చుట్టూ మానవహారాలుగా ఏర్పడాల్సిందిగా ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.యువత, అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులతో సహా అందరూ ముందుకు రావాలని కోరుతూ ప్రభుత్వ ఉన్నతాధికారి అలీరెజా రహీమీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అంతేగాక బాలల చేతికి కూడా ఆయుధాలిచ్చి యుద్ధ రంగంలోకి పంపేందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి! చెక్పాయింట్ల వద్ద పహారాకు ప్రతి ఇంటి నుంచీ పిల్లల్ని పంపాల్సిందిగా ఐఆర్జీసీ పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇరానీలు భారీగా వలస బాట పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధం అత్యంత భీకర రూపు దాల్చవచ్చన్న సంకేతాల నడుమ, ఏం జరగనుందోనని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టింది!నలిపేస్తున్నాం: నెతన్యాహుటెహ్రాన్, కరాజ్, తబ్రిజ్, కషన్, కోమ్ తదితర నగరాల్లో కనీసం 8కి పైగా బ్రిడ్జిలను తమ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ‘‘ఐఆర్జీసీ వాటిని ఆయుధాల సరఫరాకు వాడుకుంటోంది. అందుకే వాటిని పేల్చేయాలని ఆదేశించా’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ను అన్నవిధాలా నలిపేస్తున్నామని చెప్పుకొచ్చారు.భారీగా ఇరాన్ ప్రతి దాడులుఇజ్రాయెల్పై ఇరాన్ భారీగా ప్రతి దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక నగరం జుబెయిల్పై డ్రోన్ల వర్షం కురిపించింది. ఆ ప్రాంతమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. దాడుల తీవ్ర దృష్ట్యా సౌదీని బహ్రెయిన్తో కలిపే కీలకమైన కింగ్ ఫహాద్ వంతెనను తాత్కాలికంగా మూసేశారు. పౌర సదుపాయాలపై దాడులా?ఇరాన్లో పౌర సదుపాయాలు, ఇంధన వ్యవస్థలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు, యుద్ధ నియమాలకు విరుద్ధమని ఐరాసతో పాటు ఫ్రాన్స్ తదితర దేశాలు దుయ్యబట్టాయి.ఇరాన్లో 18 మంది మృతిఇరాన్పై మంగళవారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులకు దిగాయి. చమురు రవాణాకు ఆయువుపట్టైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. కనీసం 50కి సైనిక లక్ష్యాలను వైమానిక దాడుల్లో నేలమట్టం చేసినట్టు వెల్లడించింది. అయితే అక్కడి చమురు నిల్వలు, క్షేత్రాల జోలికి మాత్రం వెళ్లలేదని స్పష్టం చేసింది. రైళ్లు, రైల్వేస్టేషన్లకు దూరంగా ఉండాల్సిందిగా ఇరానీలను తొలుత ఇజ్రాయెల్ హెచ్చరించింది. తర్వాత కాసేపటికే దేశవ్యాప్తంగా బ్రిడ్జిలు, రైల్ నెట్వర్కులే లక్ష్యంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది.ఒక రైల్వే బ్రిడ్జి, హైవే బ్రిడ్జితో పాటు పలు రైల్వేస్టేషన్లకు భారీ నష్టం వాటిల్లినట్టు ఇరాన్ వెల్లడించింది. టెహ్రాన్లో ఎటు చూసినా పేలుళ్ల శబ్దాలే విన్పించాయి. నగరంలోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దాడుల ధాటికి అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. పశ్చిమ ఇరాన్లోని ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా వైమానిక దాడులు జరిగాయి. అల్బోర్జ్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో 18 మంది మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. 24 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. షిరాజ్లోని పెట్రో కెమికల్ ప్లాంట్పై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇజ్రాయెల్ కాన్సులేట్పై దాడిఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్పై మంగళవారం ముగ్గురు సాయుధులు దాడికి దిగా రు. కాన్సులేట్ భవనం బయట కాల్పులకు పాల్ప డ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. గాయపడ్డ మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అణుదాడికి సంకేతమా?⇒ ట్రంప్, వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా భయాందోళనలు ⇒ ఖండించిన వైట్హౌస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ను సమూలంగా భస్మీపటలం చేస్తామని ట్రంప్, పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను బయటికి తీస్తామని వాన్స్ పేర్కొనడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు బహుశా ఇరాన్పై అణుదాడికి సంకేతాలే కావచ్చంటున్నారు. గార్డియన్ వంటి వార్తా సంస్థలతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా భారీగా పోస్టులు పెడుతున్నారు. దాంతో ఈ అంశంపై వైట్హౌస్ స్పందించింది. అణు దాడి వార్తలను ఖండించింది. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారంతా ‘బఫూన్లు’ అంటూ మండిపడింది.విద్యుత్కేంద్రాలకు దూరంగా ఉండండిఇరాన్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అక్కడి భారతీ యులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘‘రెండు రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి. ముఖ్యంగా విద్యుత్కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్మెంట్ల పై అంతస్తులకు దూరంగా ఉండండి. హైవేలపై ప్రయాణించాల్సి వస్తే భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోండి’’ అని సూచించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.హార్మూజ్పై తీర్మానం వీటో చేసిన రష్యా, చైనాఐక్యరాజ్యసమితి: హార్మూజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలంటూ మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేశాయి. బహ్రెయిన్ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 11, వ్యతిరేకంగా 2 ఓట్లు రాగా రెండు దేశాలు గైర్హాజరయ్యాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. ‘‘నిత్యావసరాల ధరలు, ఇంధన వ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముడి పదార్థాలు, వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యావసర వస్తువులకు అధిక ధరలు చెల్లిస్తున్నారు. హార్మూజ్ను తెరిచేందుకు అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అంటూ ఓటింగ్కు ముందు ఐరాసలోని యూఏఈ ప్రతినిధి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఇరాన్ రాజధానిలో వైమానిక దాడులు
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అమెరికా-ఇజ్రాయెల్లు వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ప్రధాన రవాణా మార్గాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ దాడులు హెమ్మత్ హైవే ప్రాంతంలో ఉత్తర రన్వే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో పలు వంతెనలు, రహదారులు లక్ష్యంగా మారాయి. తబ్రీజ్–టెహ్రాన్ ఫ్రీవే, జంజాన్–టెహ్రాన్ ఫ్రీవే, కోమ్లోని రవాణా మార్గాలు కూడా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి 238 మంది విద్యార్థులు, 49 మంది ఉపాధ్యాయులు, 7 మంది టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. 178 మంది విద్యార్థులు, 24 మంది ఉపాధ్యాయులు గాయపడినట్లు తెలిపింది. నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు 764 పాఠశాలలు లక్ష్యంగా అమెరికా దాడులు జరిపినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం టెహ్రాన్, కెర్మాన్షా ప్రావిన్సులలో ఉన్నాయి. పౌర ప్రాంతాలపై జరిగిన ఈ దాడులు అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. పాఠశాలలు, వంతెనలు, రహదారులు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పౌరులపై దాడులు యుద్ధ నేరాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెహ్రాన్–కరాజ్ ఫ్రీవేపై జరిగిన తాజా వైమానిక దాడులు ఇరాన్లోని పౌర జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం, పాఠశాలలు ధ్వంసం కావడం దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కొనసాగితే ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలు నాశనమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘యుద్ధం కొత్త దశలోకి .. రెండింతలు దాడులు’
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత తరువాత మరింత ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను రెట్టింపు చేస్తూ 'కొత్త దశ యుద్ధం' ప్రారంభమైందని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.'రెట్టింపు దాడులు' - ఇరాన్ హెచ్చరికమరోవైపు ఇప్పటికే ద్వంద్వ ప్రయోగ క్షిపణి (Dual-launch) వ్యూహాన్ని ఇరాన్ వివరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘యుద్ధం కొత్త దశ ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. ఇరాన్, ఖైబర్ షెకాన్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పాటు ఫతా( (Fattah)-110, ఫతే-313 ,ఫతా వంటి కొత్త హైపర్సోనిక్ వేరియంట్లతో సహా ఫతా శ్రేణికి చెందిన వ్యవస్థలను ఉపయోగించి, గత దాడులన్నీ రెండింతలు ఎక్కువవుతాయని హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంపై జరిగిన దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాలకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో, ద్వంద్వ ప్రయోగ క్షిపణి వ్యూహాన్ని ఐఆర్జీసీ కమాండర్ వివరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోంది అంటూ ఒక ఐఆర్జీసీ కమాండర్ నుండి వచ్చిన మొదటి అధికారిక ప్రకటన ఇది కావడం గమనార్హం. 🇮🇷 Commander of Iran’s IRGC Aerospace Force, Brig. Gen. Seyed Majid Mousavi, posted a video stating:“New phase of the war begins. With newly deployed dual-launch Fateh and Kheibar Shekan missile systems, all previous strikes are multiplied by two.” pic.twitter.com/RpTTkDZqd4— Malcolm X (@malcolmx653459) April 7, 2026దీంతో పాటు, మంచి పొరుగు సంబంధాలు, ఆత్మసంయమనం ముగిశాయి అంటూ పర్షియన్ గల్ఫ్లోని దేశాలకు ఐఆర్జిసి మరో హెచ్చరిక జారీ చేసింది. ఫతే శ్రేణిలో సాధారణంగా 200 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్లకు పైగా పరిధి గల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు ఉంటాయి. ఫతా వంటి హైపర్సోనిక్ రకాలు మాక్ 15 వరకు వేగాన్ని అందుకోగలవని ఇరాన్ పేర్కొంది.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేకపోతే వంతెనలు, ఇంధన కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాలపై దాడులు ఎదుర్కోవలసి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఈ దాడులకు ప్లాన్ జరిగినట్లు సమాచారం. ఇటీవలి రోజుల్లో, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన షరతులు ఇంకా పరిష్కారం కాలేదని ఇరాన్ అధికారులు, ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన గడువు (మంగళవారం రాత్రి 8 గంటలే) ముగియకముందే సంచలన హెచ్చరికలు చేశారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు (హోర్ముజ్ జలసంధిని తెరవాలని) ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు, ఇరాన్ వద్ద ఉన్న ఫతా వంటి హైపర్ సోనిక్ క్షిపణులు మ్యాక్ 15 (Mach 15) వేగంతో ప్రయాణించగలవని, వీటిని అడ్డుకోవడం ప్రస్తుత రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది. మొత్తానికి, ట్రంప్ వ్యూహం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమా లేక సైనిక చర్యకు పునాది వేయడమా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి 8 గంటల గడువు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.ఇదీ చదవండి: దుబాయ్లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్ బిలియనీర్ స్టోరీ -
‘ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం’.. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుంది. అది జరగొద్దని అనుకుంటున్నా. కానీ జరుగుతోంది. ఆ నాగరికతను తిరిగి వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఇరాన్లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుంది’అని వ్యాఖ్యానించారు. ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, అమెరికా భారీ దాడులు చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో ఇరాన్లోని ఓ నాగరికత అంతం’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే ప్రాంతం బయట కూడా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా సంవత్సరాల పాటు చమురు,ఇతర సహజ వనరులు అందకుండా చేస్తామని తెలిపింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, ట్రంప్ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా పూర్తి విధ్వంసం జరగబోతుందని స్పష్టంచేశారు.ఇరాన్ ఇప్పటికే అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతుండగా..‘నాగరికత నశనం’అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియా యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
అన్నంత పని చేసిన ట్రంప్.. మళ్లీ యుద్ధ మేఘాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్ డెడ్లైన్ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది. -
దేశ వ్యాప్తంగా లాక్డౌన్.. రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి
ఇస్లామాబాద్: ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాత్రి 8గంటలకే మార్కెట్లు మూసివేయాలని ప్రధాని షహ్బాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, బజార్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఈ ఆదేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి. బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్తో పాటు కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగవచ్చు. ఇళ్లలో జరిగే వ్యక్తిగత వేడుకలు కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పాకిస్థాన్లో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో బజార్లు రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ చర్యను జాతీయ అవసరంగా పేర్కొంది. “దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి” అని షహ్బాజ్ షరీఫ్ అన్నారు. అయితే వ్యాపార సంఘాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ వ్యాపారాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద పాక్ ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వ్యాపారులు ప్రజలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. -
ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా ఇరాన్ ప్రజలంతా ప్రాణ త్యాగం చేస్తామన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు డెడ్లైన్ విధించారు. ఆ గడువు సమీపిస్తున్న వేళ పెజేష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేదంటే పవర్ స్టేషన్లు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని సూచించారు. ఈ నేపథ్యంలో పెజెష్కియన్ మాట్లాడుతూ.. “14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశం కోసం నేనూ ఎప్పుడూ, ఎప్పటికీ ప్రాణ త్యాగం చేస్తా’నని పునరుద్ఘాటించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో మొత్తం జనాభా సుమారు 90 మిలియన్లు. గతంలో జరిగిన ప్రభుత్వ దమనకాండలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో 14 మిలియన్ల సంఖ్యను ప్రకటించడం, అమెరికా దాడులను అడ్డుకోవడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా, సందేశాల ద్వారా ప్రజలను స్వచ్ఛందంగా త్యాగానికి సిద్ధమవ్వమని పిలుపునిస్తోంది.ఈ ప్రకటన ఇరాన్లోని అంతర్గత అసంతృప్తిని తగ్గించడమే కాకుండా, అమెరికా దాడులను నిరోధించడానికి ఒక ప్రచార మార్గంగా కనిపిస్తోంది. ప్రజలలో నిజమైన మద్దతు ఎంత ఉందో అనేది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దేశ రక్షణ కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నిస్తోంది.ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన, అమెరికా హెచ్చరికలు, ప్రజల అసంతృప్తి అన్నీ కలిపి పశ్చిమాయాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. -
విద్యుత్ ప్లాంట్ల చుట్టూ ఇరాన్ యువత మానవ హారాలు!
టెహ్రాన్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో యూఎస్ భీకర దాడులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ కూడా హెచ్చరించడంతో ఇరాన్ పలు ప్రణాళికలు వేసుకుంది. ఇరాన్ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ హారాలుగా ఏర్పాటు చేయనుంది.ఇరాన్లోని కీలక విద్యుత్ కేంద్రాల వద్దకు యువత చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు సహా యువత అంతా మంగళవారం విద్యుత్ మౌలిక వసతుల వద్దకు చేరాలని ఇరాన్ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ చెప్పింది. ఉద్రిక్తతల సమయంలో ప్రజల ఐక్యతను చూపించడమే లక్ష్యమని అధికారులు చెప్పారు.ఇది ఇరాన్ యువత సూచనే..ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహిమీ తెలిపారు. “యువతే ఈ సూచన చేసింది. కొంతమంది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయం లేదా మానవ హారంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు” అని చెప్పారు. దేశ మౌలిక వసతులను రక్షించడంలో యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా ఈ నిర్ణయం నిలుస్తుందని ఆశిస్తున్నామని రహిమీ అన్నారు.హార్మూజ్ జలసంధిని తెరవడానికి ట్రంప్ మంగళవారం రాత్రి వరకు గడువు ఇచ్చారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే కఠిన సైనిక చర్యలు తీసుకుంటామని, ముఖ్య మౌలిక వసతులపై దాడులు జరగవచ్చని ట్రంప్ హెచ్చరించారు. ఆ గడువు దాటాక ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా విరుచుకుపడతాయని తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 12 గంటల పాటు రైళ్లు వినియోగించవద్దని చెప్పింది. దీంతో డెడ్లైన్ ముగియగానే ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ విరుచుకుపడతాయన్న భయం మరింత పెరిగింది. -
బెదిరింపులతో మా దాడులు ఆగవు.. ట్రంప్కు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ ప్రతిగా కౌంటరిస్తోంది. ట్రంప్ బెదిరింపులకు అసలు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీంతో, యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.అయితే, హార్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. తాజాగా ఇరాన్ సైనిక కమాండ్ మాట్లాడుతూ..‘ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు ఇరాన్పై ఎలాంటి ప్రభావం చూపవు. ట్రంప్ బెదిరింపులు వారి సైనిక వైఫల్యాల ఫలితం. అవి మా దాడులను ఆపలేవు. పశ్చిమాసియాలో అమెరికా ఎదుర్కొన్న అవమానాన్ని కూడా చెరపలేవు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం ఇజ్రాయెల్కు చెందిన కంటైనర్ నౌకపై క్షిపణి దాడి చేసింది. దీంతో అది ధ్వంసమై భారీ అగ్నిప్రమాదం సంభవించింది.అలాగే టెల్ అవీవ్, హైఫా, బీర్ షెవా వంటి ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అమెరికా కూడా చెందిన నౌక ఎల్హెచ్ఏ-7 కూడా దాడులకు గురై, మహాసముద్రంలోనే వెనుదిగాల్సి వచ్చింది. కువైట్లోని అమెరికా స్థావరాలు, బాగ్దాద్లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని సైనిక కమాండ్ ప్రతినిధి హెచ్చరించారు. అంతకుముందు కూడా ఇరాన్.. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. మద్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరించింది. యుద్ధం ఆపాలంటూ అమెరికాకు పది షరతులు విధించింది.మరోవైపు.. డెడ్లైన్ తర్వాత ఇరాన్కు గడువు పొడిగింపు అసంభవమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్..‘మంగళవారం ఇరాన్ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటాం. ఇరాన్ మొత్తం తుడిచిపెట్టకుపోవచ్చు. ఇరాన్ను ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలం. ఇరాన్లో మా వెపన్ సెక్షన్ ఆఫీసర్ను కాపాడుకున్నాం, పైలట్ను రక్షించాం, ఎఫ్-15 యుద్ధ విమానం నుంచి పైలట్ను రక్షించాం. శత్రు ప్రాంతాల్లోకి ఎఫ్-15 యుద్ధ విమానం చొచ్చుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పైలట్ను కాపాడగలిగాం’ అని అన్నారు. -
ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చిన ఇరాన్
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో దాడుల తీవ్రత మరింత పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. -
మార్కెట్లు, మాల్స్ అన్నీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకే క్లోజ్
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం తీవ్రం కావడంతో మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ నేటి నుంచి (ఏప్రిల్ 7) రాత్రి 8 గంటలకే మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.యుద్ధం వల్ల పెరుగుతున్న ప్రపంచ ఇంధన ఖర్చులకు ప్రతిస్పందనగా పొదుపు చర్యల్లో భాగంగా పాక్ నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్కు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని పీఎంవో ప్రకటన విడుదల చేసింది.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్, ఇస్లామాబాద్, పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్లు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేస్తారు. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వాలో డివిజనల్ హెడ్క్వార్టర్స్ ప్రాంతాల్లో మార్కెట్లు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు.అలాగే.. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్ దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తిగత నివాసాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు కూడా రాత్రి 10 గంటలలోపే ముగించాలి. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది.పశ్చిమాసియా ఘర్షణల వల్ల సరఫరా గొలుసులు దెబ్బతినడంతో పెరుగుతున్న ప్రపంచ చమురు, ఎనర్జీ ధరలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. -
ట్రంప్పై మీమ్ల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్తో ట్రంప్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్’ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇప్పుడీ మీమ్స్ తెగ షేర్ అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్. అంతా తగలబడినా మీరే గెలిచారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ కొద్దిసేపు పోస్ట్లుపెట్టకపోతే ‘‘సార్. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్ చేయండి. లేదంటే మాకు మహా బోర్ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్తో నవ్వించింది. -
కాల్పుల విరమణకు ఇరాన్ నో!..హెచ్చరించిన ట్రంప్
దుబాయ్/జెరూసలేం/వాషింగ్టన్: నెలన్నర రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కాల్పులకు 45 రోజుల పాటు విరామం ఇచ్చేలా అమెరికా, ఇరాన్లను ఒప్పించేందుకు ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్ సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పులకు విరామంతో పాటు హార్మూజ్ జలసంధిని తెరవడం తదితరాలతో కూడిన ప్రతిపాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్కు ఆయా దేశాల ప్రతినిధులు అందజేశారు. కానీ ఈ ప్రతిపాదనను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. ‘‘తాత్కాలిక కాల్పుల విరమణ కోసం హార్మూజ్ను తెరవడం ఇరాన్కు ఏ మాత్రమూ అంగీకారం కాదు. ఈ విషయాలన్నింటినీ పాక్ ద్వారా ఇప్పటికే అమెరికాకు తెలియజేశాం’’ అని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. యుద్ధానికి శాశ్వతంగా తెర దించడం మినహా మరేదీ తమకు అంగీకారయోగ్యం కాదని కైరోలోని ఇరాన్ దౌత్య బృందం సారథి మొజ్తబా ఫిర్దౌసీ పోర్ కుండబద్దలు కొట్టారు! అంతేగాక యుద్ధానికి తెర దించే విషయమై ఇరాన్ తాజాగా అమెరికాకు 10 షరతులు కూడా విధించింది! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. హార్మూజ్ను తెరవడంపై కూడా అంతకుముందే ఇరాన్కు ఆయన మరిన్ని హెచ్చరికలు చేశారు. ‘‘మీకు మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటల వరకే గడువు. ఆలోపు దిగిరాకుంటే కనీవినీ ఎరగని దాడులతో సర్వనాశనం చేసేస్తాం’’ అంటూ హెచ్చరించారు. ఇరాన్పైకి అమెరికా ఇప్పటికే అత్యాధునిక లాంగ్ రేంజ్ జేఏఎస్ఎస్ఎం–ఈఆర్ క్షిపణులను భారీ సంఖ్యలో ఎక్కుపెట్టినట్టు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి! సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడులుఇజ్రాయెల్, అమెరికా సోమవారం ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇరాన్కు అత్యంత కీలకమైన సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై కూడా ఇజ్రాయెల్ భారీగా దాడులకు దిగింది. దాంతో అక్కడి పెట్రో కెమికల్ ప్లాంటుకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. టెహ్రాన్పై యుద్ధ విమానాలు గంటల తరబడి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) నిఘా విభాగం అధిపతి మజీద్ ఖదేమీ మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేగాక ఐఆర్జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ కీలక నేత అస్ఘర్ బకేరీని కూడా అంతం చేసినట్టు పేర్కొంది. రాజకీయ, సైనిక ప్రముఖులందరినీ ఒక్కొక్కరుగా అంతం చేసి తీరతామని స్పష్టం చేసింది. మజీద్ మృతిని ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులెవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎస్లాంషార్ నగరంపై దాడుల్లో 15 మంది దాకా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కోమ్ నగరంలో పౌర ఆవాసాలపై దాడుల్లో ఐదుగురు, ఇతరచోట్ల మరో ఆరుగురి దాకా మృతి చెందారన్నారు. టెహ్రాన్లో ఓ ఇంటిపై జరిగిన దాడికి మరో ముగ్గురు బలయ్యారు. లెబనాన్లో కూడా దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. ఐన్ సాదే నగరంలో లెబనాన్ సైనికాధికారి ఒకరు దాడుల్లో మరణించారు.ఒక్క రాత్రిలోనే నాశనం చేసేస్తాంఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరికలు ఇరాన్ అంతటినీ ఒకే ఒక్క రాత్రిలో సర్వనాశనం చేసేయగల సత్తా అమెరికా సొంతమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘అది బహుశా మంగళవారం రాత్రే కావచ్చు’’ అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు. ఇరాన్ భూభాగం నుంచి ఎఫ్–15ఇ యుద్ధ విమానం తాలూకు ఎయిర్మ్యాన్ను కాపాడేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. అందుకోసం ఏకంగా 155 యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్టు చెప్పుకొచ్చారు! దీని గురించి తొలుత రిపోర్ట్ చేసిన అమెరికా జర్నలిస్టు ఓ అత్యంత పనికిమాలిన వ్యక్తి అంటూ అధ్యక్షుడు మండిపడ్డారు. ‘‘అతను చేసిన పని వల్ల రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇరాన్కు తెలిసిపోయింది. దాంతో అందులో పాల్గొన్న సైనికులందరి ప్రాణాలూ ముప్పులో పడ్డాయి’’ అంటూ దుయ్య బట్టారు. సదరు కథనానికి సోర్స్ ఏమిటో బయట పెట్టకుంటే ఆ జర్నలిస్టును జైల్లో పెడతామని హెచ్చరించారు. ఇరాన్ షరతులివే! → పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ ఏకపక్షంగా మొదలుపెట్టిన యుద్ధానికి తక్షణం తెర దించాలి → ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింకెప్పటికీ దండెత్తరాదు. ఈ మేరకు ఇరు దేశాలూ స్పష్టమైన హామీలివ్వాలి → ఇరాన్పై ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి → ఇరాన్ పునర్నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలి → హార్మూజ్ను పూర్తిస్థాయిలో తెరవాలంటే మేం రూపొందించే ప్రొటోకాల్స్కు కట్టుబడాలి -
ఇరాన్ మాస్టర్ మైండ్.. పశ్చిమాసియా యుద్ధంలోకి భారత్?
వాష్టింగన్: హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్ బెదరింపుల్ని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్ ట్వీట్లు వేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్లలో దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ట్రంప్:హర్మూజ్ జలసంధిని తెరవండి అని ఇరాన్ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్లలో హైలెట్ చేశాయి. భారత్: హర్మూజ్ జలసంధిని మూసేశారా?పాకిస్థాన్: హర్మూజ్ జలసంధిని మూసేసింది. రష్యా: విచిత్రంగా ఉంది…దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్ జలసంధి తెరిచే ఉందిఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదేచైనా: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్లలో పేర్కొంది. బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్ను ఎగతాళి చేసింది జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్ ట్వీట్లలో భారత్, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Trump: "Open the Strait of Hormuz!"India: "Is it closed?"Pakistan: "Closed?"Russia: "Strange…"South Africa: "but it's Open, of course"France: "Doesn't look like it…"China: "Open… we just passed through! 🚢😏"Trump: 🙁 https://t.co/vnNc1EQy54— Iran Embassy SA (@IraninSA) April 5, 2026 -
నన్ను బాధ పెట్టారు.. ఇక మూల్యం తప్పదు: ట్రంప్
హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్కు అమెరికా డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును ఇరాన్ బేఖాతరు చేసింది. బెదిరింపులతో చర్చలు జరగవని తేల్చిచెప్పింది. అయితే తాజాగా ఇరాన్ రియాక్షన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ వైపేమై ట్రంప్ దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్లో ఉన్న విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే వాటిని ఇరాన్ పట్టించుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు తలొగ్గేది లేదని తేల్చి చెబుతుంది. తాజాగా సీజ్ఫైర్ ఒప్పందాన్ని సైతం తిరస్కరించింది. దీంతో ట్రంప్ తీవ్ర ఆవేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ మాట్లాడుతూ" ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తిరస్కరించడం నన్ను తీవ్రకలతకు గురి చేసింది. దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఇరాన్ అనుకుంటే ఈ పరిస్థితి ముగిసిపోయేది. అది వారికి తెలుసు క్రితం వారితో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వివేకవంతులు" అని ట్రంప్ అన్నారు.ఇటీవల ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు ఫైలట్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతో ట్రంప్ డిమాండ్స్కు ఇరాన్ తలొగ్గకపోవడంతో ఇప్పుడు అమెరికా పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
ట్రంప్ డెడ్లైన్.. కేర్ చేయని ఇరాన్..!
ట్రంప్ 48 గంటల అల్టిమేటం వేళ ఇరాన్ భారీ ఝలక్ ఇచ్చింది. తమ దేశం ఎట్టి పరిస్తితుల్లో వెనుకంజ వేయదని తేల్చిచెప్పింది. బెదిరింపులతో చర్చలు జరగవని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్ కుండ బద్ధలు కొట్టారు. తమ దేశాన్ని పూర్తి స్థాయిలో రక్షించుకుంటామన్నారు.డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే టెహ్రాన్ని నాశనం చేస్తామన్నారు. ఈ మేరకు చర్చల చేసుకోవాలని డెడ్లైన్ సైతం విధించారు. బెదిరింపులను ఇరాన్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్ ఘాటుగా బదులిచ్చారు.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎంత మాత్రం గౌరవించడం లేదని ఇస్మాయిల్ బగేయ్ అన్నారు. ఆ దేశాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని వాటికి హద్దులే లేవని దుయ్యబట్టారు.వాషింగ్టన్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను బగేయ్ తిరస్కరించారు."ఇరాన్ తన న్యాయబద్ధమైన డిమాండ్లను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏమాత్రం వెనుకాడదు.ఇలా చేయడాన్ని రాజీ పడటంగా భావించకూడదు, బదులుగా తన వాదనలను రక్షించుకోవడంలో ఇరాన్కు ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబంగా దీనిని చూడాలి" అని బఘాయ్ అన్నారు.ఒకవేళ ఒప్పందం అంటూ జరిగితే అది దేశభద్రతా, ప్రయోజనాల ఆధారంగానే ఉండాలి తప్ప బెదిరింపులకు లొంగి చర్చల్లో పాల్గొనేది లేదనిస్పష్టం చేశారు. ప్రస్తుతం మా దృష్టంతా దేశాన్ని రక్షించడంపైనే అని తెలిపారు. అదే విధంగా తమ దేశ ప్రయోజనాల ఆధారంగా తమ డిమాండ్లను వివరిస్తూ, మధ్యవర్తులకు అందించాల్సిన లిఖితపూర్వక ప్రతిస్పందనను సిద్ధం చేశామని ఈ విషయాన్ని అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తామని బఘాయీ పేర్కొన్నారు. అదేవిధంగా తమ దేశంపై జరిగే దాడులకు అదే రీతిన తగిన బధులిస్తామని హెచ్చరించారు. కాగా అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ దృక్పథం తెలియజేశారు. బ్రిడ్జిలు కూలిపోతే మళ్లీ నిర్మించవచ్చు, కానీ అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం మళ్ళీ రాదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ రుద్దిన యుద్ధానికి శాశ్వత ముగింపు టెహ్రాన్ కోరుకుంటోందని తెలిపారు. -
ఇజ్రాయెల్పై భీకర దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్
జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యర్థులు శత్రు స్థావరాలపై దాడులు జరపడం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి జనావాసాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది.సోమవారం ఇరాన్ భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్తో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ నివేదించింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. రోజంతా పదేపదే సైరన్లు మోగుతుండగా, రాబోయే మరిన్ని దాడుల గురించి అధికారులు హెచ్చరిస్తూ, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. -
ఇరాన్ కు మరో బిగ్ షాక్..IRGC ఇంటలిజెన్స్ చీఫ్ ఖదేమీ మృతి
-
ఇరాన్కు లాస్ట్ ఛాన్స్.. డెడ్లైన్ గడువు పొడిగింపు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. 48 గంటల్లోగా హర్మూజ్ను తెరవకపోతే విధ్వంసకర రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాజాగా ఇరాన్ డెడ్లైన్ గడువును మరో రోజు పొడిగించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు మరింత భీకరంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసి ఇరాన్ చమురు సంక్షోభానికి కారణమయ్యింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో హర్మూజ్ని తెరవాలని లేకపోతే వినాశనమేనని ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.ఏప్రిల్ 5 నిన్న (ఆదివారం) 48 గంటల్లో హర్మూజ్ తెరవాలని లేకపోతే దాడులతో విరుచుకపడతామన్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో రోజు గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ కొత్త డెడ్లైన్ ప్రకారం GMT బుధవారం ఉదయం 12 గంటల వరకూ డెడ్లైన్ పొడిగించినట్లు సమాచారం. దీంతో ఇరాన్కు హర్మూజ్ జలసంధిని తెలవడానికి మరో రోజు గడువు లభించినట్లయింది..అయితే ట్రంప్ ఈ విషయమై వాల్స్ట్రీట్ జర్నల్తో మాట్లాడినట్లు సమాచారం. ఒకవేళ డెడ్లైన్ ముగిసేలోపు వారు హర్మూజ్ను తెరవకపోతే వారి దేశంలో విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు ఏమి ఉండవని హెచ్చరించారు. ఒకవేళ వారు గనుక ఈ సమయంలో చర్చలు జరపకపోతే వారి దేశంలోని మౌళిక సదుపాయాలను ధ్వంసం చేసి చమురును స్వాధీనం చేసుకుంటామన్నారు.కాగా ట్రంప్ ఆంక్షలను ఇరాన్ బేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. డెడ్లైన్ గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ టెహ్రాన్ తరపునుంచి ఏటువంటి ప్రకటనలు వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది. -
ఇరాన్కు మరో షాక్.. మజీద్ ఖదేమీ మృతి
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు బిగ్షాక్ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ ఐఆర్జీసీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఖదేమీ మృతి చెందినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా మజీద్ మరణాన్ని ధృవీకరించింది. ఐఆర్జీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ పలు కథనాలు ప్రసారం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ మరణించారని ఐఆర్జీసీ ప్రకటించింది. మజీద్ గత ఐదేళ్లుగా ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా పనిచేశారు. ఈ కాలంలో విదేశీ శక్తుల చొరబాటును అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఐఆర్జీసీ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ టీవీ కథనాలు కూడా ప్రస్తావించాయి. -
యుద్ధం వేళ భారీ ట్విస్ట్.. రంగంలోకి పాక్, తుర్కియే..
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వేళ ఇరాన్ సైతం కౌంటరిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం జరిగింది. 45 రోజులపాటు కాల్పుల విరమణకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు వంటి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. ట్రంప్ డెడ్లైన్ వేళ ఈ మేరకు ఓ ప్రముఖ అమెరికా పత్రిక తన కథనంలో పేర్కొంది.అమెరికా పత్రిక తన కథనం మేరకు.. ఇరాన్కు ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేపథ్యంలో యుద్ధం తీవ్రతరం కాకుండా నిరోధించడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే వంటి మధ్యవర్తిత్వ దేశాలకు చెందిన ప్రతినిధులు, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య సాధారణ(Text)మెసేజ్ల ద్వారా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మధ్యవర్తులు రెండు దశల కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నారని అందులో స్పష్టం చేసింది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం చర్చలు జరుపుతారని చెప్పింది.అలాగే, రెండో దశలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం ఉంటుందని తెలిపింది. ఈ తుది ఒప్పందం సమయంలో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను తొలగించడం వంటివి ఉంటాయని వివరించింది. కేవలం 45 రోజుల కాల్పుల విరమణ కోసం హార్మూజ్ను తెరవడం, యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించదని పేర్కొంది.మరోవైపు.. ఇరాన్కు ట్రంప్ విధించిన డెడ్లైన్ సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గడువును మరో 20 గంటలు (మంగళవారం రాత్రి) వరకు పొడిగించారు. అప్పటికీ ఒప్పందానికి రాకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఇరాన్కు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరామానికి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతుండటం గమనార్హం. -
ట్రంప్ నేర్పిన పాఠం.. అణ్వాయుధాల పోటీలో ఆరు దేశాలు!
ఇరాన్పై అమెరికా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే సామెత అమెరికా విషయంలో నిజమైందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ను దెబ్బకొట్టాలనే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం దాదాపుగా బెడిసికొట్టింది. ఇరాన్ ప్రతిదాడులకు అమెరికాకు భారీ నష్టాలే ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ నుంచి తన గల్ఫ్ మిత్రదేశాలకు రక్షణ కల్పించడంలో అమెరికా వైఫల్యం చెందింది. దీంతో, భవిష్యత్ కాలంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలను లేదా అణు రక్షణ కవచాన్ని (N-shield) పొందడంపై పలు దేశాలు ఫోకస్ పెట్టినట్టు సమాచారం.ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు అణ్వాయుధాలను ఒక సైనిక ఆస్తిగా, బీమా పాలసీగా చూస్తున్నాయి. ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్లో రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో అమెరికా భద్రత బలహీనపడటం కారణంగా సౌదీ అరేబియా, టర్కీ, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ మరియు పోలాండ్ దేశాలు అణ్వాయుధాలు లేదా అణ్వాయుధాల రక్షణను పొందాలని చూస్తున్నాయని చర్చ జరుగుతోంది. తమ సైనిక శక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయనే కథనాలు బయటకు వచ్చాయి. ఇందుకు రష్యా, చైనా తమ అణ్వాయుధాలను పెంచుకోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. దీంతో, అణ్వాయుధాల కోసం ప్రపంచ దేశాల మధ్య కొత్త పోటీ నెలకొంది.అయితే, ఇప్పటికే పలు దేశాలు అణ్వస్త్ర శక్తులుగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఒకప్పుడు దీనికి వ్యతిరేక దిశలో పయనించిన దేశాలు కూడా ఉన్నాయి. చరిత్రలో అనేక దేశాలు తమ అణ్వాయుధాలను వదులుకున్నాయి. అణ్వాయుధాల భూతం సీసాలోంచి బయటపడ్డాయి. ఇజ్రాయెల్కు అణ్వాయుధాలు పొందడంలో సహాయపడిన దక్షిణాఫ్రికా, ఆరు అణు బాంబులను వదులుకుని, తన అణు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఒకప్పుడు ఉక్రెయిన్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద అణ్వాయుధాల నిల్వను మరియు 179 ఐసీబీఎంలను కలిగి ఉండేది. అది వాటన్నింటినీ వదులుకుంది.ఉక్రెయిన్ వంటి దేశాలు తమ సొంత ఆయుధాలను నిర్మూలించాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత వారసత్వంగా పొందిన నిల్వలను తిరిగి ఇచ్చాయి. ఉక్రెయిన్ లాగే, బెలారస్ మరియు కజకిస్తాన్ కూడా భద్రతా హామీలు, ప్రపంచ చట్టబద్ధత మరియు ఆర్థిక మద్దతుకు బదులుగా సోవియట్-యుగం వార్హెడ్లను అప్పగించాయి.ఇరాన్ యుద్ధం అణు పోటీని ప్రేరేపించిందా?శక్తివంతమైన శత్రువులను అణ్వాయుధాలు మాత్రమే నిరోధించగలవనే నమ్మకాన్ని ఇరాన్ యుద్ధం బలపరిచింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్న అణ్వాయుధాలు లేని దేశాలు, ఉత్తర కొరియా వంటి అణ్వాయుధాలు కలిగిన దేశాలు తమ శత్రువులను ఎలా నిరోధిస్తున్నాయో చూశాయి. అణ్వాయుధాలు లేని దేశాలు ప్రమాదంలోనే ఉన్నాయనే విషయాన్ని గుర్తించాయి. దీంతో, తమ దేశాలు కూడా అణ్వాస్త్ర శక్తులను పెంచుకోవాలనే భావన ఏర్పడింది.అంతేకాకుండా.. అమెరికాతో టెహ్రాన్ ఘర్షణ, దాని సౌకర్యాలపై పదేపదే జరుగుతున్న దాడులు, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుండి వైదొలుగుతామనే బెదిరింపులు, మనుగడ కోసం ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను వదులుకోకపోవచ్చనే ఆందోళనలను పెంచాయి. ఇరాన్ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే, ఇరాన్ తనకు అణుబాంబు కావాలని గానీ, తన వద్ద బాంబు ఉందని గానీ స్వయంగా ప్రకటించలేదు. దాని యురేనియం శుద్ధి కార్యక్రమం, క్షిపణి సామర్థ్యం, ఇజ్రాయెల్ మరియు అమెరికా నుండి పదేపదే వస్తున్న బెదిరింపులు అణు ప్రశ్నను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఒకవేళ ఇరాన్ అణుబాంబును పొందితే.. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యప్రాచ్యంలోని దాని ప్రత్యర్థులు కూడా తమ వైఖరిని పునరాలోచించుకోవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యొక్క ప్రధాన అణు కేంద్రాలలో నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్, అరాక్ మరియు బుషెహర్ ఉన్నాయి.ఉక్రెయిన్ ఎంతో కీలకం.. అణ్వాయుధ చర్చలో ఉక్రెయిన్ ఉదంతం కీలకమైనది. రష్యాతో ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధం నేపథ్యంలో, సోవియట్ కాలం నాటి తమ ఆయుధాగారాన్ని వదులుకోవడం ఒక చారిత్రక తప్పిదమని చాలామంది ఉక్రేనియన్లు నమ్ముతున్నారు. 1991లో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు, దానిలోని అనేక భాగాలలో ఒకటైన ఉక్రెయిన్, ప్రపంచంలోని మూడవ అతిపెద్ద అణ్వాయుధాలను కలిగి ఉంది. దాని భూభాగంలో సుమారు 1,900 వ్యూహాత్మక వార్హెడ్లు, వేలాది వ్యూహాత్మక అణ్వాయుధాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మరియు వ్యూహాత్మక బాంబర్లు మోహరించి ఉన్నాయి.ఈ ఆయుధాలపై ఉక్రెయిన్కు పూర్తి కార్యాచరణ నియంత్రణ లేదు. ఎందుకంటే ప్రయోగ వ్యవస్థలు సోవియట్ యూనియన్, ప్రస్తుత రష్యా రాజధాని అయిన మాస్కోతో ముడిపడి ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్నది. కీవ్ పాశ్చాత్య దేశాల గుర్తింపు, సహాయం, భద్రతా హామీలను కోరుకుంది. అది 1994 బుడాపెస్ట్ ఒప్పంద పత్రానికి దారితీసింది. ఈ ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్ తన వార్హెడ్లను రష్యాకు బదిలీ చేయడానికి మరియు అణ్వాయుధ రహిత దేశంగా NPTలో చేరడానికి అంగీకరించింది. ప్రతిగా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను గౌరవిస్తామని వాగ్దానం చేశాయి. నేడు, ఉక్రెయిన్లో చాలా మంది 1994 ఒప్పందాన్ని ఒక పెద్ద పొరపాటుగా భావిస్తున్నారు. రష్యా మొదట క్రిమియాను స్వాధీనం చేసుకోవడం ద్వారా, ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించడం ద్వారా ఆ కట్టుబాట్లను ఉల్లంఘించింది.అణు ఆయుధాలు పొందాలని భావిస్తున్న దేశాలుసౌదీ అరేబియాటర్కీదక్షిణ కొరియాజపాన్జర్మనీపోలాండ్అణు ఆయుధాలను వదిలేసిన దేశాలుఉక్రెయిన్: సోవియట్ యూనియన్ కూలిన తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద అణు శక్తి. 1994 బుడాపెస్ట్ ఒప్పందం కింద ఆయుధాలను రష్యాకు అప్పగించింది.బెలారస్, కజకస్తాన్: సోవియట్ కాలం వారసత్వంగా వచ్చిన అణు ఆయుధాలను రష్యాకు అప్పగించి, NPTలో చేరాయి.దక్షిణాఫ్రికా: స్వతంత్రంగా ఆరు అణు బాంబులు తయారు చేసి, 1990లలో స్వచ్ఛందంగా వాటిని పూర్తిగా తొలగించింది.👉గతంలో కొన్ని దేశాలు భద్రతా హామీలు, ఆర్థిక సహాయం, అంతర్జాతీయ గుర్తింపు కోసం అణు ఆయుధాలను వదిలాయి. కానీ, ఇప్పుడు యుద్ధాలు, భద్రతా సంక్షోభాలు, అమెరికా బలహీనత కారణంగా అణు ఆయుధాలను సైనిక శక్తిగా భావిస్తున్నాయి. ప్రతీ కొత్త యుద్ధం అణు ఆయుధాల అవసరాన్ని మరింత బలపరుస్తోంది. చివరగా.. అణు ఆయుధాల వల్ల మానవాళికి తక్షణ, దీర్ఘకాలంలో తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇవి మానవ ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, సమాజ నిర్మాణం అన్నింటినీ దెబ్బతీస్తాయి. -
ఇరాన్పై అమెరికా భీకర దాడులు
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. హార్మూజ్ జలసంధి తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా రోజుల నుంచి ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం బెదరడం లేదు. -
అమెరికా-ఇరాన్: అటు క్షిపణులతో యుద్ధం.. ఇటు మాటల యుద్ధం
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (ఏప్రిల్ 5న) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్లోని పవర్ ప్లాంట్లతో పాటు బ్రిడ్జ్లపై దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇక ఇరాన్కు నరకమేనని అన్నారు. దీంతో ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అంతే దీటుగా స్పందించింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన దేశాన్ని నరకంలోకి లాగుతున్నారని, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని మరింత ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరించింది. "ట్రంప్ నిర్లక్ష్య చర్యలు ప్రతి కుటుంబాన్ని నరకంలోకి నెట్టుతున్నాయి. నెతన్యాహు ఆదేశాలను పాటించే విషయంలో ట్రంప్ పట్టుబడుతుండడంతో మా పశ్చిమాసియా మొత్తం దహనమవుతుంది. తప్పుగా అనుకోకు.. యుద్ధ నేరాల ద్వారా నీకు ఏ లాభం రాదు" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ ట్వీట్ చేశారు. ట్రూత్ సోషల్లో ట్రంప్ చేసిన అవమానకర కామెంట్లపై థాయ్లాండ్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా వ్యంగ్యంగా స్పందించింది. "పోటస్ ఒక టీనేజర్ లాగా తిట్టడం చూస్తే.. అమెరికా ఊహించిన దానికంటే త్వరగా రాతియుగానికి చేరినట్లు అనిపిస్తుంది" అని అన్నారు.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి స్పందిస్తూ ట్రంప్ సైకాలజీని "నేరపూరిత మానసిక స్థితి"గా పేర్కొన్నారు. మౌలిక వసతులు, ఎనర్జీ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం మొత్తం జనాభాను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. అలాంటి చర్యలు యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా పరిగణించొచ్చని అన్నారు.ట్రంప్ ఏమన్నారు?ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హార్మూజ్ తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్లో పోస్ట్ చేశారు.‘ఇరాన్కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల తర్వాత అన్నీ విధ్వంసం అవుతాయి’ అని డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 5న ట్రూత్లో పేర్కొన్నారు. -
అమెరికాకు షాకిచ్చిన ఇరాన్.. ట్రంప్ బూతు పురాణం!
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఇప్పటిదాకా ఏకంగా 19 యుద్ధ విమానాలను కోల్పోయినట్టు ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టీ) నివేదిక పేర్కొంది. పలు హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా ఇరాన్ కూల్చేసినట్టు వెల్లడించింది. ఈ జాబితాలో రూ.3,300 కోట్ల విలువైన నాలుగు ఎఫ్–15ఇ ఫైటర్ జెజట్లు, రూ.174 కోట్ల విలువైన ఏ–10 థండర్బోల్ట్2 విమానం, రూ.740 కోట్లకు పైగా విలువ చేసే 2 కేసీ–135 ఇంధన ట్యాంకర్ విమానాలు, మరో 11 విమానాలున్నాయి. రూ.6,500 కోట్ల విలువైన బోయింగ్ ఇ3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాన్ని సైతం ఇరాన్ సర్వనాశనం చేసింది. రూ.4,700 కోట్ల విలువైన 17 ఎంక్యూ–9 రకం రీపర్ డ్రోన్లను కూడా కూల్చేసింది.హార్మూజ్ను తెరవండ్రా! ఇరాన్పై ట్రంప్ బూతు పురాణం హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఆ క్రమంలో బూతుపురాణానికి దిగారు. ‘‘హార్మూజ్ను తెరవండ్రా పిచ్చి బాస్టర్డ్స్! ఇందుకు సోమవారమే డెడ్లైన్. ఆలోపు తెరవలేదంటే నరకానికి పంపిస్తా. చూస్తూ ఉండండి. అల్లాను ప్రార్థించండి. మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జి డే. అవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇరాన్ విద్యుత్కేంద్రాలను, వంతెనలను సర్వనాశనం చేస్తాం’’ అంటూ ఆదివారం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. హార్మూజ్ తెరిచే విషయంలో ఎంత దూరమైన వెళ్తానని చెప్పారు. ‘‘సోమవారం నాటికి ఇరాన్తో చర్చల్లో పురోగతి సాధ్యం కావొచ్చు. మాతో ఒప్పందానికి రాకపోతే మాత్రం ఇరాన్ను అగ్నికి ఆహుతి చేస్తాం. అక్కడి చమురును కూడా స్వాదీనం చేసుకుంటాం’’ అంటూ హెచ్చరించారు. -
ఒక్కడి కోసం సమస్త సైన్యం
న్యూయార్క్: ఎఫ్–15ఇ యుద్ధ విమానం నేలకూలడంతో ఇరాన్లో చిక్కుకున్న ఆయుధ స్పెషలిస్టును కాపాడేందుకు అమెరికా భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఇది ఆద్యంతం సూపర్హిట్ హాలీవుడ్ సినిమా ‘బిహైండ్ ఎనిమీ లైన్స్’ను తలపించేలా సాగింది. ఎట్టకేలకు నేవీ సీల్ కమెండో బృందం ఆదివారం తమ ఎయిర్మ్యాన్ను కాపాడి వెంటతీసుకెళ్లింది. అతని జాడ కనిపెట్టి ఎలాగైనా నిర్బంధించేందుకు ఇరాన్ బలగాలు ఆ ప్రాంతమంతటినీ జల్లెడపడుతుంటే, వాళ్లను నిలువరించేందుకు అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ప్రతీకారంగా ఆపరేషన్లో పాల్గొన్న అమెరికా యుద్ద విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లపైకి ఇరాన్ బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దాంతో రెండు యుద్ధ విమానాలు, బ్లాక్హాక్ హెలికాప్టర్లు నేలకూలాయి. ఈ హై వోల్టేజీ యాక్షన్ ఎపిసోడ్లో చివరికి అమెరికాదే పైచేయి అయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సేనల సాహసాన్ని వేనోళ్ల పొగిడారు. గాయపడి, కేవలం పిస్టల్తో... శుక్రవారం ఇరాన్ గగనతలంలో ఎఫ్–15ఇ కుప్పకూలడం తెలిసిందే. దాంట్లోంచి దూకేసిన ఎయిర్మ్యాన్ ఇరాన్లోని దట్టమైన పర్వతప్రాంతంలో పడ్డాడు. గాయాలతో రక్తమోడుతున్నా నడవగలిగే స్థితిలోనే ఉన్నాడు. దాంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి ఎత్తయిన కొండను ఎక్కడం మొదలెట్టాడు. దాదాపు 7,000 అడుగులు ఎక్కేశాడు. అతని వెంట ఒక పిస్టల్, రహస్య సంకేతాలిచ్చే పరికరం, జాడ తెలిపే జీపీఎస్ ట్రాకర్, రహస్య సందేశాలు పంపే కమ్యూనికేషన్ సాధనం మాత్రమే ఉన్నాయి. కానీ అతన్ని ట్రాక్ చేయడం అమెరికాకు సాధ్యపడలేదు. ఎయిర్మ్యాన్ సజీవంగానే ఉన్నట్టు తేలడంతో అతని కోసం ఇరాన్ బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. అతని జాడ చెబితే 60,000 డాలర్లు ఇస్తామని స్థానికులకు నజరానా ప్రకటించాయి. అయితే అతను పడ్డ ప్రాంతం ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అ«దీనంలో ఉన్నట్లు సమాచారం. దాంతో అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రంగంలోకి దిగింది. వారికి ఇజ్రాయెల్ కచ్చితమైన నిఘా సమాచారంతో సాయపడింది. అలా ఎట్టకేలకు ఎయిర్మ్యాన్ జాడను కనిపెట్టేశారు. తనను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. ఇరాన్ సేనలు ఎదురు పడితే పోరాడేందుకు వందల మంది సైనికులతో రవాణా విమానాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపింది. హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇలా సైనిక దండు మొత్తం కదిలొచ్చింది! ఎయిర్మ్యాన్ సమీపానికి చేరిన ఇరాన్ సైనిక వాహనాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులతో దాడి చేసి తరిమేశాయి. ఇరాన్ బలగాల ప్రతి దాడిలో అమెరికా హెలికాప్టర్లలోని సైనికులు గాయపడ్డారు. దాంతో హెలికాప్టర్ను అక్కడే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాడులు, ప్రతిదాడుల్లో అమెరికా ఏ–10 వార్థాగ్ యుద్ధ విమానం నేలకూలింది. అలాగే సైనికులను వెంటతీసుకొచ్చిన రెండు రవాణా విమానాలూ మొరాయించడంతో వాటిని అక్కడే ల్యాండ్చేశారు. తిరిగి టేకాఫ్ చేయడం సాధ్యపడకపోవడంతో వాటిలోని కీలకమైన ఆయుధాలను బయటకు తీశారు. అనంతరం ఆ రెండు విమానాలను అమెరికా సేనలు పేల్చేశాయి. వీరందరినీ వెనక్కి తీసుకెళ్లేందుకు మరో మూడు విమానాలు చేరుకున్నాయి. అదే సమయంలో ఓ కొండ రాయి కింద దాక్కున్న ఎయిర్మ్యాన్ను నేవీ సీల్ బృందం శనివారం రాత్రి చిమ్మచీకట్లో కనిపెట్టి కాపాడింది. అతడిని వెంటనే కువైట్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మేం అతడిని కాపాడేశాం ఎయిర్మ్యాన్ను కాపాడిన విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సైనిక సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాం. ఆయుధ నిపుణుడైన కల్నల్ను కాపాడాం. శత్రు భూతలంపై ఏకాకిగా మిగిలిపోయిన ఎయిర్మ్యాన్ను ఇరాన్ బలగాలు డేగకళ్లతో గాలిస్తున్న వేళ అతడికి మా కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, యుద్ధనిపుణులు అనుక్షణం ట్రాకింగ్ చేస్తూ శత్రువుల కంటపడకుండా కాపాడుకున్నాం. నిన్న పైలట్ను, నేడు ఎయిర్మ్యాన్ను కాపాడేశాం. అమెరికా తమ యుద్ధవీరుల్లో ఒక్కరిని కూడా రణక్షేత్రంలో నిర్లక్ష్యంగా వదిలేయబోదని నిరూపించాం’’ అని ట్రంప్ అన్నారు. -
అగ్రరాజ్యానికి మరో ఎదురుదెబ్బ
టెహ్రాన్/దుబాయ్: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నష్టపోయిన అగ్ర రాజ్యం తాజాగా మరో రెండు ఎంసీ–130జే రవాణా విమానాలను కోల్పోయింది! శుక్రవారం ఇరాన్లో నేలకూలిన ఎఫ్–15ఇ ఫైటర్ జెట్ తాలూకు ఎయిర్మ్యాన్ను కాపాడుకునేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఆపరేషన్ అనంతరం ఇరాన్ నుంచి వెనక్కు మళ్లే క్రమంలో రెండు ఎంసీ–130 జే విమానాలు మొరాయించినట్టు సమాచారం. దాంతో ఇరాన్కు చిక్కొద్దనే ఉద్దేశంతో అమెరికా దళాలే వాటిని పేల్చేసినట్టు అమెరికా సైనికాధికారి ఒకరు తెలిపారు. శత్రు భూభాగంలో రహస్యంగా ప్రవేశించడానికి, అక్కడ చిక్కిన తమవారిని కాపాడేందుకు ఈ రవాణా విమానాలను అమెరికా ఉపయోగిస్తుంటుంది. మంటల్లో కాలి నేలకూలిన అమెరికా రవాణా విమానాల అవశేషాలను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘అమెరికా గనుక ఇలాంటి మరో మూడు విజయాలు సాధిస్తే అది పూర్తిగా నాశనమవుతుంది’ అని ఎద్దేవా చేశారు. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా పలు అమెరికా విమానాలను నేలకూల్చినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. దక్షిణ ఇస్పహాన్లో మరో సీ–130 రవాణా విమానంతో పాటు రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పోలీసు కమాండ్ ప్రకటించింది. సైనికాధికారులు హతం: ట్రంప్ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఆదివారం భీకర స్థాయిలో దాడులకు దిగినట్టు ట్రంప్ వెల్లడించారు. వాటిలో పలువురు అగ్రశ్రేణి సైనికాధికారులు హతమయ్యారన్నారు. భారీ పేలుళ్లు కనిపిస్తున్న ఒక వీడియోను ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడంలో గానీ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంలో గానీ ఇరాన్ విఫలమైతే భయంకరమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ తేల్చిచెప్పారు. గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం పశ్చిమాసియా యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు నిరి్నరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఆదివారం గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులకు దిగింది. కువైట్, యూఏఈ, బహ్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. దాడుల్లో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కేపీసీ)కు చెందిన పలు యూనిట్లు దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పడానికి అత్యవసర బృందాలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇరాన్ చమురు, కేపీసీ ప్రధాన కార్యాలయాలున్న షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్పైనా క్షిపణి దాడులు జరిగాయి. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని కువైట్ మీడియా పేర్కొంది. గల్ఫ్లో విద్యుత్ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలను సైతం ఇరాన్ టార్గెట్గా మార్చుకుంది. కువైట్లో రెండు పవర్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. అబూదాబీలోనూ ఇరాన్ దాడులు కొనసాగాయి. క్షిపణుల శకలాలు నేలకూలడంతో పెట్రో కెమికల్ కేంద్రాలు మంటల్లో చిక్కుకున్నాయి. అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. బహ్రెయిన్పైనా ఇరాన్ నిప్పుల వర్షం కురిపించింది. గల్ఫ్ అంతా బుగ్గే: ఇరాన్ ట్రంప్ బూతు పురాణంపై ఇరాన్ మండిపడింది. ‘‘ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సంక్షోభాన్ని ట్రంప్ మరింత పెంచుతున్నారు. గల్ఫ్ అంతా భస్మీపటలమయ్యే పరిస్థితులను కల్పిస్తున్నారు’’ అని దుయ్యబట్టింది. ట్రంప్ పిల్ల చేష్టలు, వ్యాఖ్యలతో అమెరికాను ఊహించిన దానికంటే వేగంగా రాతియుగంలోకి తీసుకెళ్లారంటూ ఎద్దేవా చేసింది. ఇరాన్ను ఓడించామన్న భ్రమే ఓ బురదగుంటగా మారి అందులో అమెరికా కూరుకుపోవడం ఖాయమని ఇరాన్ సెంట్రల్ మిలటరీ కమాండ్ జనరల్ అలీయాబాదీ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇస్లాంను కించపరిచేలా ఉన్నాయని అమెరికాలోని కౌన్సిల్ ఆన్ అమెరికన్–ఇస్లామిక్ రిలేషన్స్ ఆక్షేపించింది. -
ఫైలట్ పంపిన సందేశంతో.. ఆశ్చర్యపోయిన ట్రంప్
ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా ఫైలట్ను ఆ దేశ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా రక్షించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న తర్వాత ఆయన పంపిన తొలి సందేశం అమెరికా అధికారులను ఆశ్చర్యానికి గురి చేసిందని డొనాల్డ్ ట్రంప్ మీడియాతో తెలిపారు. ఈ అంశమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. "ఆ అధికారి పంపిన సందేశం వినడానికి ఒక ముస్లిం వ్యక్తి చెప్పినట్లుగా ఉంది. అందుకే మొదట అది ఇరాన్ పన్నిన కుట్ర ఏమో అని అనుమానించాను. కానీ తర్వాత ఆ అధికారి చాలా దైవచింతన గల వ్యక్తి అని తెలియడంతో ఆ సందేశం నిజమేనని నిర్ధారించుకున్నాను" అని అన్నారు.ఆ సందేశం ఏంటంటే? ఇరాన్ పర్వతాల్లో చిక్కుకున్న ఆ అధికారి తన వద్ద ఉన్న రేడియో ద్వారా పంపిన మొదటి సందేశం 'Power be to God,'" మహిమంతా దేవుడిదే అనే సందేశం తన వద్ద ఉన్న ఒక హ్యాండ్గన్ ద్వారా పంపారు. అనంతరం ట్రాకింగ్ బీకాన్ మరియు కమ్యూనికేషన్ పరికరంతో ఇరాన్ దళాలకు దొరక్కుండా పర్వతాల్లో దాక్కున్నారు. ఒక దశలో శత్రువుల నుండి తప్పించుకోవడానికి 7,000 అడుగుల ఎత్తున్న పర్వత శ్రేణిని కూడా ఆయన ఎక్కినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆపరేషన్ ప్రపంచ రక్షణ వ్యవస్థలో అమెరికాకున్న ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.అమెరికా నిఘా సంస్థ CIA, తనకున్న ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన దాక్కున్న ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించింది. దాదాపు 48 గంటల పాటు ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శనివారం రాత్రి అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగి, శత్రువుల మధ్య ఉన్న ఆ అధికారిని సురక్షితంగా రక్షించి వెనక్కి తీసుకువచ్చారు. -
యుద్ధం టెన్షన్.. ఇరాన్, గల్ఫ్తో భారత్ చర్చలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్ దేశాలలో దౌత్య చర్చలు జరిపారు.ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
రికార్డు సృష్టించిన ఇరాన్.. 37 రోజులుగా ఆ సేవలు బంద్
ఇరాన్ ప్రస్తుతం యుద్ధంతో అట్టుడుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో విరుచుకపడడంతో ఆ దేశంలోని మౌళిక సదుపాయాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం ఇంటర్నెట్ నిలిపివేసిన దేశంగా రికార్డు సాధించింది.ఇరాన్ దేశవ్యాప్తంగా విధిస్తున్న ఇంటర్నెట్ షట్డౌన్ ఇప్పుడు 37వ రోజుకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత సుదీర్ఘమైన జాతీయ స్థాయి ఇంటర్నెట్ బ్లాకౌట్గా నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైన రోజు ఫిబ్రవరి 28నుండి ప్రారంభమైన ఇంటర్నెట్ షట్డౌన్ ఇప్పటికి 864 గంటలకు పైగా కొనసాగుతోంది.అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్షన్ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే 'వైట్లిస్ట్' విధానం ద్వారా యాక్సెస్ ఇస్తున్నట్లు సమాచారంఅయితే దీనివల్ల యుద్ధ సమయంలో ప్రజలు తమ ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకోలేకపోతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొన్ని సంస్థలు చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాాగా ఇప్పటి వరకూ మయన్మార్, సుడాన్, ఉక్రెయిన్, గాజా వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తగ్గించారు గాని ఇంత పెద్ద మెుత్తంలో ప్రభుత్వమే దానిపై బ్యాన్ విధించలేదు. -
ఉద్యోగులందరికీ వారానికి 2 రోజుల చొప్పున సెలవులు
కాఠ్మాండు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతుండడంతో పలు దేశాల్లో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం నేపాల్పై బాగా పడుతోంది. సాధారణంగా ఆదివారం సెలవు ఉంటుంది. అయితే, చమురు సంక్షోభం వల్ల నేపాల్ వారానికి రెండు రోజులు సెలవులను అమలు చేయాలని నేపాల్ ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్ 5) నిర్ణయించింది.ఈ నిర్ణయాన్ని కాఠ్మాండులో ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్ 6 నుంచి కొత్త వీకెండ్ షెడ్యూల్ను పాటించనున్నాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.పోఖరేల్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలియం సరఫరా అంతరాయాల కారణంగా ఆదివారాల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన రూపకల్పనను సిద్ధం చేయాలని కూడా నేపాల్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇంధన సరఫరా అనిశ్చితి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోఖరేల్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చడం ద్వారా ఇంధన కొరతను ఎదుర్కోవచ్చని, పర్యావరణహిత రవాణా దిశగా మార్పునకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇరాన్, ఇజ్రాయెల్అ-మెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ పెట్రోలియం సరఫరాను దెబ్బతీసింది. దీని వల్ల నేపాల్లో కొరతతో పాటు ధరలు భారీగా పెరిగాయి.నేపాల్లో పెట్రోలియం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రాష్ట్ర సంస్థ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తాజా సవరణ ప్రకారం.. కాఠ్మాండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు ఎన్పీఆర్ 202కి చేరింది. డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు ఎన్పీఆర్ ఎన్పీఆర్182కి పెరిగింది.గత వారం సంస్థ బోర్డు సమావేశంలో లీటరుకు ఎన్పీఆర్ 15 పెంపునకు ఆమోదించారు. 18 రోజుల్లో మూడోసారి ధరలు పెంచారు. మార్చి 15, మార్చి 25న కూడా ధరలను పెంచారు. -
ముగియనున్న 48 గంటల డెడ్లైన్.. ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్స్ట్కు ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. లేదంటే అన్నింటిని పేల్చేస్తాం. ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంతేకాదు.. హర్మూజ్ జలసంధించిన తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష ప్రసాదించినట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే, కీలక ఆస్తులను ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాము ఇరాన్ నిరసనకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆయుధాలు పంపించాం. ఆ ఆయుధాలు నిజంగా నిరసనకారుల చేతికి చేరలేదని, మధ్యలో కుర్దిష్ మార్గాల ద్వారా వెళ్లి.. కుర్దిష్ సమూహాల దగ్గరే ఉండిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ తోసిపుచ్చింది . ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ జనరల్ అలీయాబాది, ట్రంప్ బెదిరింపును నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివితక్కువ చర్య అని అన్నారు.ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. శత్రుత్వం పెరిగితే ఇరాన్లో మీకు నరకం కనబడుతోంది. ఇరాన్ను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి మీరు అందులో కూరుకుపోతారు’అని రెచ్చగొట్టారు. మరి రేపటితో ముగియనున్న డెడ్ లైన్ అనంతరం, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. కాగా, హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అందుకే అమెరికా దీనిని ప్రపంచ ఆర్థిక భద్రతకు ముప్పుగా చూస్తోంది. -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు."ఈ విషయంలో పాక్కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు."ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు."దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు. -
ఇక వస్తున్నాం.. నరకం చూపిస్తాం..: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో తన ట్రూత్ సోషల్ మీడియా ట్రూత్లో ఓ ప్రకటన చేశారు.‘ఇరాన్లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి. అలాంటి డే మరొకటి ఉండదు.. ఆ స్ట్రైట్ (హార్మూజ్ జలసంధి) తెరవండి, పిచ్చి దుర్మార్గుల్లారా.. లేకపోతే మీరు నరకంలో జీవిస్తారు.. చూడండి..’ అని అన్నారు. హార్మూజ్ జలసంధి తెరవాలని ట్రంప్ చాలా రోజుల నుంచి ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏ మాత్రం బెదరడం లేదు. హార్మూజ్ జలసంధి తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. హార్మూజ్ జలసంధిపై రాకపోకలు సులభతరం చేయడం కోసం ఒమన్, ఇరాన్ ఇవాళ (ఏప్రిల్ 5) చర్చలు నిర్వహించాయని ఒమన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది."ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు సమావేశం నిర్వహించాయి, ఇరుపక్షాల నిపుణులు హాజరయ్యారు. హార్మూజ్ ద్వారా సజావుగా రాకపోకలు జరిగేలా అవకాశాలను సృష్టించడంపై చర్చించారు" అని ఆ వార్తా సంస్థ ఎక్స్లో పేర్కొంది. ఇరుపక్షాల నిపుణులు దీనిపై అనేక ప్రతిపాదనలు ముందుకు తెచ్చారని పేర్కొంది. -
ఇరాన్ యుద్ధం.. అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీ దాడులో ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. -
ఇరాన్పై అసహనం.. మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, అంతర్జాతీయంగా ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్పై విజయం సాధించాం. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా సైన్యం భారీ దాడిలో హతమయ్యారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన పోస్టుతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి. అయితే, వీడియో విషయంలో స్పష్టత లేకపోవడం, ఎక్కడ దాడి జరిగిందనే విషయాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. దాడి ఎలా జరిగింది? లక్ష్యాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో, ఆ వీడియో నిజంగా ఇరాన్పై దాడికి సంబంధించదేనా? అనే విషయంపై అధికారిక ధ్రువీకరణ ఇంకా లేదు.ఏం జరగనుంది?మరోవైపు.. ఇరాన్పై ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇరాన్కు 48 గంటల గడువు ఇస్తూ, ఈలోగా ఒప్పందం చేసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిర్ణయం తీసుకోకపోతే భయంకర పరిణామాలు ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. Donald J. Trump Truth Social 04:04.26 04:37 PM ESTMany of Iran’s Military Leaders, who have led them poorly and unwisely, are terminated, along with much else, with this massive strike in Tehran! President DONALD J. TRUMP pic.twitter.com/kn2fwYTjjG— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 4, 2026కాగా, గతంలో కూడా ట్రంప్ ఇరాన్కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇంధన ప్లాంట్లపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా చెప్పారు. అయితే తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. చర్చలు సాగుతున్నాయన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా కఠిన హెచ్చరికల దిశగా అమెరికా మళ్లింది.ఇరాన్ కౌంటర్.. ఇదిలా ఉండగా.. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. ఈ క్రమంలో ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ తరఫున జనరల్ అలీ అబ్దొల్లాహి అలియాబాదీ స్పందిస్తూ.. ట్రంప్ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తోందన్నారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్ ఆత్రుతతో వ్యాఖ్యలు చేశారని కౌంటరిచ్చారు. కాగా, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశం రెండు దేశాల మధ్య ప్రధాన వివాదంగా మారింది. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో దీనిపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. -
ట్రంప్ అల్టిమేటం.. ఆయుధాలు సిద్దం చేస్తున్న ఇజ్రాయెల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది. -
హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్కు ఏడేళ్ల తర్వాత గుజరాత్లోని వడినార్కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్తో భారత్కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
దిగిరాకుంటే నరకమే!
దుబాయ్: హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే కనీవినీ ఎరగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు! టెహ్రాన్పై బాంబుల వర్షం ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషెహర్లోని అణు విద్యుత్కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంటుపై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ‘‘దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాకపోతే రేడియేషన్ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరట’’అని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్ అణుకేంద్రాలపై జరిగిన నాలుగో దాడి. టెహ్రాన్లో ఒక పెట్రో కెమికల్ ప్లాంట్పైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. రాజధాని టెహ్రాన్ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా ప్రతి దాడులకు దిగింది. దుబాయ్లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్గా మారింది. తమపైకి ఇరాన్ ప్రయోగించిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్ దాడులు జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది.పైలట్ కోసం వేట! శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్ను కూడా అమెరికా కోల్పోయిట్టు తెలుస్తోంది. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు’’అని అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే కూల్చేయడం తెలిసిందే. అందులోని పైలట్తో పాటు గన్నర్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. మరొకరి కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇరాన్ కూడా అతన్ని ఎలాగైనా నిర్బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా రెండు అమెరికా హెచ్హెచ్–60డబ్లు్య జాలీ గ్రీన్–2 బ్లాక్హాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు సమాచారం. అవి కష్టమ్మీద ఇరాన్ భూభాగాన్ని దాటి సురక్షిత స్థానానికి చేరినా వాటి పైలట్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారమే మరో కె–10 యుద్ధ విమానం కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొనడం విశేషం. ‘‘ఒక ఇంజన్ విఫలమైంది. దాంతో అది సింగిల్ ఇంజన్తోనే అతి కష్టమ్మీద గల్ఫ్లోని వైమానిక స్థావరానికి చేరుకుంది’’అని వెల్లడించాయి! అయితే ఈ ఉదంతం చర్చల ప్రక్రియను ప్రభావితం చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా యుద్ధవిమానాలను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! అగ్ర రాజ్యం చివరిసారిగా 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఏ–10 థండర్బోల్ట్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.మీ కుమారులకు ట్రంప్తోనే ముప్పు హాని తలపెట్టొద్దన్న పైలట్ తల్లి విజ్ఞప్తికి ఇరాన్ కౌంటర్ టెహ్రాన్: శత్రు దేశ పైలట్ అనే ప్రతీకారేచ్ఛతో తన కుమారుడికి హాని తలపెట్టొద్దని అమెరికా పైలట్ తల్లి చేసిన విజ్ఞప్తికి ఇరాన్ తనదైన రీతిలో బదులిచ్చింది. దాడి కోసం వచ్చి తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్ శుక్రవారం నేలకూల్చడం తెల్సిందే. దీంతో పైలట్లు బయటకు దూకేయగా ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు రక్షించి వెంటతీసుకెళ్లాయి. మరో పైలట్జాడ తెలీడం లేదు. అతడిని ఇరాన్ బంధించిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒక పైలట్ తల్లి విజ్ఞప్తిచేశారు. ‘‘ఎఫ్–15 ఫైటర్జెట్ పైలట్లకు హాని తలపెట్టకండి. వారిలో ఒకతను నా కుమారుడు’’అని ఆమె వేడుకున్నారు. దీంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు దీటుగా స్పందించాయి. ‘‘ఇరాన్ కస్టడీకంటే మీ కుమారులకు డొనాల్డ్ జూనియర్ ట్రంప్తోనే ముప్పు ఉంది. అమెరికా రెస్క్యూ టీమ్లకు దొరక్కుండా మా కస్టడీలోనే వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకోండి. అమెరికాకు దొరికితే ఏమేం రహస్యాలు వెల్లడించారని చెప్పి చిత్రవధ చేస్తారు. ముస్లింలుగా, నాగరికత తెల్సిన ఇరానియన్లుగా మాకు మీ వాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. మర్యాదతో, గౌరవప్రదంగా చూసుకుంటాం. అమానవీయ యూదనీతుల కంటే యుద్ధనీతులు మాకు బాగా తెలుసు. యుద్ధఖైదీలను పద్ధతిగా చూసుకుంటాం. మేం ఆలోచనల్లో అమెరికా మాదిరి రాతియుగంలో బతకట్లేము’’అని ఎంబసీలు బదులిచ్చాయి. బోర్ కొడుతోంది, ఏమన్నా మాట్లాడండి! ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ ఎద్దేవా ట్రంప్ తాజా హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసిపడేసింది. అమెరికాతో చర్చలకు తామే దిగొచ్చామన్న ట్రంప్ వ్యాఖ్యలను మరోసారి ఖండించింది. అధ్యక్షుని మాటలకు ఇప్పుడెవరూ పెద్దగా విలువ ఇవ్వడం లేదనే అర్థం వచ్చేలా జింబాబ్వేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం శనివారం ఎక్స్లో పోస్టు పెట్టింది! ‘‘మాకు బాగా బోర్ కొడుతోంది. ఏదో ఒకటి మాట్లాడండి’’అంటూ ట్రంప్ మాటతీరును ఎద్దేవా చేసింది. చర్చలకు ఇరాన్ సుముఖత! అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇరాన్ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చర్చల నిమిత్తం పాక్ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం స్పష్టం చేశారు. -
"నాకుమారుడిని రక్షించండి".. ట్రంప్ కంటే మేమే బెటర్: ఇరాన్
ఇరాన్ నిన్న ( శుక్రవారం) అమెరికా ఫైటర్ జెట్ను కూల్చివేయడంతో దాని ఫైలట్ ఇరాన్ భూభాగంలో దూకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫైలట్ తల్లి ఎక్స్ వేదికగా తన గోడు వెల్లగక్కింది. దీనిపై పాకిస్థాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.నిన్న (శుక్రవారం) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వీరిలో ఒక పైలట్ ఆచూకీ లభించగా, మరో పైలట్ గల్లంతయ్యారు. అయితే తన కుమారుడు కూడా ఫైటర్ పైలట్ అని, అతని గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదని ఆందోళన చెందుతూ ఒక అమెరికన్ మహిళ X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. "నా కుమారుడి కోసం, ఇతర పైలట్ల కోసం ప్రార్థించండి" అని ఆవేదన వెల్లగక్కింది.దీనిపై పాక్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. పాక్లోని కార్యాలయం "డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉండటం కంటే, ఇరాన్ కస్టడీలో ఉండటమే మీ కుమారునికి సురక్షితం. అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ఇరాన్ అతన్ని బందీగా పట్టుకోవాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానియన్లుగా మేము యుద్ధ ఖైదీలను గౌరవంగా చూస్తాము," అని పేర్కొంది.దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ: "అమెరికా లేదా వారి మిత్రదేశాల వలె మేము అనాగరికంగా ప్రవర్తించము. మాకు గొప్ప నాగరికత ఉంది, యుద్ధ ఖైదీల హక్కుల గురించి మాకు బాగా తెలుసు," అని విమర్శించింది. అయితే యుద్ధం మెుదలై నెలరోజులు దాటినా ఇంకా పరిస్థితులు ఉదృతంగానే కొనసాగుతున్నాయి. -
ప్రళయానికి సమయం ఆసన్నమవుతోంది: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల సమయమే మిగిలి ఉందని చెప్పారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హార్మూజ్ తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్లో పోస్ట్ చేశారు. ప్రళయానికి మరో 48 గంటలే మిగిలి ఉందని ట్రంప్ చెప్పారు. ‘ఇరాన్కు నేను 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒప్పందం చేసుకోవాలి లేదా హార్మూజ్ జలసంధిని తెరవాలి. సమయం ముగియనుంది. ఇంకా 48 గంటల తర్వాత అన్నీ విధ్వంసం అవుతాయి’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పేర్కొన్నారు.కాగా, అమెరికా సైనిక విమానాలకు జరిగిన నష్టం ఇష్యూ ఇరాన్తో దౌత్య చర్చలపై ప్రభావం చూపదని ఇవాళ ఉదయం ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విమానాల కూల్చివేత ఘటన చర్చలను దెబ్బతీస్తుందనే వాదనలను ట్రంప్ తిరస్కరించారు.మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం స్పందిస్తూ.. ఇరాన్ రాజధానిలో కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. తమ వైమానిక దళం టెహ్రాన్లో బాలిస్టిక్, వైమానిక రక్షణ క్షిపణి నిల్వ కేంద్రాలపై దాడి చేసిందని చెప్పింది. అదే దాడుల్లో ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక పరిశోధన అభివృద్ధి సదుపాయాలు కూడా ఉన్నాయి అని తెలిపింది. -
ఇరాన్ దాడిలో ఎఫ్-35 ఫైటర్ తుస్సు? అసలేంటీ దీని సామర్థ్యం?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధంలో ఇరాన్ ఇప్పటివరకు ఎఫ్-35 రెండు యుద్ధ విమానాలను కూల్చివేయడం సంచలనం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన జెట్గా ప్రచారంలో ఉన్న ఎఫ్-35, ఇరాన్లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలో విఫలమైందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎఫ్-35 ప్రత్యేకత దాని స్టెల్త్ టెక్నాలజీ. ఇరాన్తో అమెరికా యుద్ధంలో ఇది రెండుసార్లు ఫెయిల్ కావడంతో ఆ టెక్నాలజీపైనే ప్రశ్నలు తలెత్తాయి. ఇంతటి అత్యాధునిక విమానాలను ఎలా కూల్చగలిగింది? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరాన్ ప్రతి దాడుల్లో ఎఫ్-35 ఫైటర్ తుస్సు మందా? అసలేంటీ దీని కథ?ఇరాన్పై యుద్ధంలో ఎఫ్-35 ఫైటర్ ప్రతిష్టకు దెబ్బశుక్రవారం ఇరాన్ చేసిన ప్రకటనల ప్రకారం, రెండో ఎఫ్-35ను కూల్చివేశాయి.(అంతకుముందు, మార్చి 19న). దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను కోల్పోవడం లేదా దెబ్బతినడం అనేది డబ్బు పరంగా, ప్రతిష్ట పరంగా కూడా ఒక పెద్ద దెబ్బ. ఎఫ్-35 లైట్నింగ్ అనేది ఐదవ తరం స్టెల్త్ జెట్. ఇది శత్రు రాడార్లకు దాదాపు కనిపించకుండా, సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తూ, ఇతర విమానాలు, భూతల దళాలతో ప్రత్యక్ష సమాచారాన్ని పంచుకునేలా తయారుచేశారు. కానీ స్టెల్త్ జెట్ సామర్థ్యాలపై, ఇరాన్తో యుద్ధంలో అమెరికా అతివిశ్వాసంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది .ఇరాన్తో అమెరికా సంఘర్షణలో, అమెరికా అతివిశ్వాసమే అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.కెనడా పునరాలోచనప్రధాన సంస్థలైన లాక్హీడ్ మార్టిన్ , నార్త్రోప్ గ్రుమ్మన్, ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందిన ఎఫ్-35 జెట్ను నిర్మించాయి, కానీ దాని ప్రతిష్ట ఎంతగా దెబ్బతిందంటే, అమెరికన్ ఎఫ్-35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే తన ప్రణాళికను కెనడా సమీక్షిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్లు, విడిభాగాల లభ్యత వంటి అంశాల వల్ల కెనడా ఆందోళన చెందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఇరాన్లో జెట్లు, అత్యాధునిక రాడార్లు విఫలమైన తర్వాత, అమెరికన్ రక్షణ పరికరాలపై ఆధారపడటం గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. యుద్ధం కొనసాగు తున్నందున, జెట్లు ఎలా దెబ్బతిన్నాయనే దానిపై విచారణ కొనసాగుతోంది. కానీ ప్రస్తుతానికి, యుద్ధభూమిలో కొన్ని ఊహించని దెబ్బల నేపథ్యంలో F-35 కేవలం కాగితాలమీదే టాపర్గా భావించాల్సి వస్తోంది.ఘఇదీ చదవండి : 20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్ ఎఫ్-35 ఫీచర్స్F-35 అనేది ఒకే సీటు, ఒకే ఇంజిన్ కలిగిన యుద్ధ విమానం. దీని ప్రాట్ & విట్నీ ఇంజిన్ సుమారు 43,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గంటకు 1,200 మైళ్ల వేగమైన మాక్ 1.6ను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని రెక్కల విస్తీర్ణం సుమారు 35 అడుగులు . ఇది కేవలం అంతర్గత ఇంధనంతోనే 1,350 మైళ్లకు పైగా ప్రయాణించగలదు. గాలిలోనే ఇంధనం నింపుకోవడంతో, దీని పరిధి దాదాపు అపరిమితం .దీని టెక్నాలజీ కారణంగా శత్రువులు దీన్ని గుర్తించడం, లాక్ చేయడం కష్టమని భావించారు, కానీ ఇరాన్ దీన్ని పటాలపంచలు చేసింది.ఎఫ్-35లో శక్తివంతమైన సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి రాడార్, ఇన్ఫ్రారెడ్ , ఇతర వ్యవస్థల నుండి డేటాను మిళితం చేసి, పైలట్కు యుద్ధభూమి స్పష్టమైన 360-డిగ్రీల చిత్రాన్ని అందిస్తాయి. స్టెల్త్ రూపాన్ని స్పష్టంగా ఉంచడానికి ఈ జెట్ బాడీ లోపల ఆయుధాలను మోయగలదు. చెప్పాలంటే ఎఫ్-35 రహస్యంగా చొరబడి, కచ్చితంగా దాడి చేసి, సురక్షితంగా బయటపడగలదు. విధానాన్ని బట్టి,ఈ ఎఫ్-35 విమానాల ఖరీదు 82 నుండి 110 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది.ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?మరి ఈ టాప్ జెట్ను ఇరాన్ ఎలా కూల్చింది?రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైనవి కానప్పటికీ ఇరాన్, అధిక ఎత్తులకు చేరుకోగల , రాడార్ లేదా ఇన్ఫ్రారెడ్ ఉపయోగించి లక్ష్యాలను ట్రాక్ చేసే, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. ముఖ్యంగా 'మజిద్' ఇన్ఫ్రారెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదా భుజంపై ఉంచుకుని ప్రయోగించే క్షిపణులను వాడుతోంది ప్రధానంగా ఇవి రాడార్లకు చిక్కవు. అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు వీటి ద్వారా లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చు. గత మార్చి 19న శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్-35ను దెబ్బతీసింది కూడా ఈ మజిద్ వ్యవస్థేనని భావిస్తున్నారు. F-35లకు సరిసమానమైన యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద లేకపోయినా, అది ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలదు. టెహ్రాన్ పని అయిపోయింది, ఇరాన్ గగనతలం మాదే అన్న మార్చి 24న ట్రంప్ అతివిశ్వాస ప్రకటన అమెరికాకే ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. -
ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నేలమట్టం! ఇరాన్ షాకింగ్ ప్రకటన
-
20 ఏళ్లలో తొలిసారి : ఇరాన్ దెబ్బ , ట్రంప్నకు భారీ షాక్
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై తొలిసారిగా దాడులు చేసిన ఐదు వారాల తర్వాత ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గత 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయగా, మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ దాడి చేసింది. గత 20 ఏళ్లకు పైగా కాలంలో అమెరికాకు జరగని అత్యంత అరుదైన దాడిగా నిలిచింది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే టెహ్రాన్ సామర్థ్యం గణనీయంగా తగ్గి పోయిందని, ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన వెంటనే జరిగిన ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2003 తర్వాత శత్రువుల కాల్పులకు అమెరికా జెట్లు కూలిపోవడం ప్రస్తుతం యుద్ధంపై మరింత ఉత్కంఠను పెంచింది. ఇరాన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలను శత్రువులు కూల్చివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. గత 20 ఏళ్లలో అమెరికా యుద్ధ విమానం శత్రువుల దాడిలో కూలిపోవడం ఇదే మొదటిసారి.20 ఏళ్ల తర్వాత తొలిసారి: ఇరాన్ చేతిలో కూలిన అమెరికా యుద్ధ విమానాలుశుక్రవారం ఇరాన్ ఒక F15-E స్ట్రైక్ ఈగిల్ (Strike Eagle) యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇందులో ఉన్న ఒక సైనికుడిని రక్షించగా, రెండో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, ఇరాన్ రక్షణ దళాల దాడిలో అమెరికాకు చెందిన A-10 అటాక్ ఎయిర్క్రాఫ్ట్ కూడా కూలిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. చివరిసారిగా 2003లో ఇరాక్ దండయాత్ర సమయంలో అమెరికాకు చెందిన A-10 థండర్బోల్ట్ II విమానం శత్రువుల దాడిలో కూలిపోయింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం, అదీ ట్రంప్ హయాంలో జరగడం గమనార్హం. ఎందుకంటే అమెరికా ప్రజలు సాధారణంగా తమ సైన్యానికి ఎటువంటి ప్రాణనష్టం జరగని యుద్ధాలకే అలవాటు పడ్డారు. ఇప్పుడు యుద్ధ విమానాలు కూలిపోవడం, సైనికుల ఆచూకీ తెలియకపోవడం వంటి ఘటనలు అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. ఇదీ చదవండి: షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?చావో రేవో- ఇరాన్ వ్యూహంప్రస్తుతం ఇరాన్ తన ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత ప్రమాదకరంగా పోరాడుతోందని, చావో రేవో అన్న రీతిలో ఎదురు దాడులకు దిగుతోందని చెబుతున్నారు. ఫిబ్రవరి 28 మొదలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు గత ఐదు వారాలుగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు దెబ్బతిన్నాయని ట్రంప్ ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందీ అనడానికి ఈ దాడులే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.ఇరాన్పై అమెరికా సాగిస్తున్న వైమానిక యుద్ధం ఇప్పటివరకు భారీ విజయం అన్నారు రిటైర్డ్ మెరైన్ కల్నల్, సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సీనియర్ రక్షణ సలహాదారు మార్క్ కాన్సియన్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాల నష్టాల రేటు ఒకానొక దశలో 3 శాతంగా ఉండేదని, ఇది ఇరాన్పై అమెరికా సాగిస్తున్న యుద్ధంలో సుమారు 350 యుద్ధ విమానాలకు సమానమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!అమెరికా విమానాలను కూల్చడానికి రాడార్లకు కూడ ఆ చిక్కని భుజంపై నుండి ప్రయోగించే (Shoulder-fired) క్షిపణులను వాడి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అలాగే అమెరికా విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులు చేస్తున్నాయి. ఇదే ఇరాన్కు వరంగా మారిందని ఇరాన్ ప్రోగ్రామ్ సీనియర్ డైరెక్టర్ బెహ్నామ్ బెన్ తలేబ్లు అన్నారు. కాగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా దళాలు ఇప్పటివరకు 13,000 కంటే ఎక్కువ మిషన్లు నిర్వహించాయి. 12,300 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. -
ఇరాన్లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి
టెహ్రాన్: ఇరాన్లో శనివారం (ఏప్రిల్ 4న) ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిధి సమీపంలో ఒక క్షిపణి పడింది. దీంతో అక్కడి ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్ తెలిపింది. ఈ ఘటనలో అణు విద్యుత్ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు. కానీ, సహాయక భవనం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం పడలేదు.బుషెహర్ దక్షిణ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఆ దేశపు మొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఇరాన్ మౌలిక వసతులు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘అమెరికా సైన్యం ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు" అని అన్నారు. ఇంతలోనే ఇవాళ ఈ దాడి జరగడం గమనార్హం."మా సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది, ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు. తర్వాత వంతెనలు, ఆపై విద్యుత్ కేంద్రాలు నాశనం చేస్తాం. ఇరాన్లోని కొత్త పాలకులకు చేయాల్సిన పనుల గురించి తెలుసు, వెంటనే చేయాలి’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అవసరమైతే ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్లేలా బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇవాళ ఉదయం ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం.. అమెరికా, పశ్చిమాసియాలోని దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఖాతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి ఇబ్రాహీం జోల్ఫఘారి ఓ ప్రకటన విడుదల చేసి.. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని దేశాలపై యుద్ధం చేస్తూనే సొంత దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షిస్తోంది ఇరాన్. ఇరాన్ నిషేధిత ప్రతిపక్ష గగ్రూప్ పీపుల్స్ మొజాహెదిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ (పీఎంఓఐ/ఎంఈకే) సభ్యులుగా తేలిన ఇద్దరు పురుషులను ఉరి తీసింది. ఈ వివయాలను ఇరాన్ న్యాయవ్యవస్థ వెబ్సైట్ మిజాన్ ఆన్లైన్లో తెలిపింది. -
అమెరికా ఆయువుపట్టు మీద కొట్టిన ఇరాన్...
-
అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే !
ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే పుష్కరాల తరువాత ఏడాది కాలం పాటు ఈ ప్రాంత వాసులు వివాహాది శుభకార్యాలు జరుపుకోరు. అందుకే ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లిళ్లు జరుపుకోవాలని ఆతృత పడుతున్నారు. అయితే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరిగిన వంట నూనెలు, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెళ్లివారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేద్దామా అంటే.. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయి. దాంతో పెళ్లిళ్లు చేసుకునేవారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. ఇదీ చదవండి: ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!శుభకార్యాలు జరపరెందుకంటే.. గోదావరి జిల్లాల వాసులు చనిపోయిన తమ పితృ దేవతలకు పుష్కరాల సమయంలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు. అందువల్ల పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు శుభకార్యాలు జరపకూడదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వారితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన చాలా మంది ఈ సమయంలో శుభకార్యాలను జరుపుకోరు. ఈ ప్రాంతాల వారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇది శాస్త్ర విరుద్ధమని భావించేవారు పుష్కరాల తరువాత ఏడాదిపాటు శుభ కార్యాలకు దూరంగానే ఉంటారు. భారంగా మారిన ధరలు ప్రస్తుతం పెరిగిన ధరలు పెళ్లిళ్లు జరుపుకునే వారికి పెను భారంగా మారాయి. డెకరేషన్కు వినియోగించే పచ్చిపూలతో పాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు ఇలా..: సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.954కాగా, బ్లాక్లో రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.1,930 కాగా, బ్లాక్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికితే రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. భారీగా వివాహాలు ప్రస్తుత ముహూర్తాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న సన్నిధి పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. బలమైన ముహూర్తాల్లో ఇక్కడ వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈనెల 11, 12, 29 తేదీల్లో పెళ్లిళ్లు అతి భారీగా జరనున్న నేపథ్యంలో ఇప్పటికే కొండపైన, కొండ కింద కల్యాణ మండపాలు, గదులు దాదాపుగా అన్నీ ముందే బుక్ అయిపోయాయి. కేటరింగ్, వాయిద్యకారులు, డెకరేషన్ వ్యాపారులు, పురోహితులు బిజీబిజీగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు! -
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..
ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఏమిటీ వివాదం?ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది.అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలుపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.తగ్గుతున్న రాయితీలుమరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
ఇరాన్ ఎఫెక్ట్.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్?
ఇరాన్ యుద్ధం కాస్తా కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా, పెట్రోల్ అంశాల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయాలతో సీనియర్ లీడర్లు విభేదించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని విభేదిస్తూ మోదీ ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అనంతర పరిస్థితులపై మోదీ ప్రభుత్వ దౌత్య వైఖరిని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదేపదే విమర్శించారు. మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం రాజీ పడుతోందని ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమనీ మృతి విషయంలో కూడా భారత వైఖరిని రాహుల్ తప్పు పట్టారు. ఖమేనీ హత్యను ఖండించాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. అలాగే, గ్యాస్, పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని బహిరంగంగానే రాహుల్ మాట్లాడారు.అయితే, రాహుల్ వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు పరోక్షంగా తప్పు పడుతున్నారు. రాహుల్కు మద్దతు ఇవ్వకుండా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ విషయంలో భారత విదేశాంగ శాఖ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి పట్ల ప్రభుత్వ విధానాన్ని పదేపదే ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్నాథ్, ఆనంద్ శర్మ, శశిథరూర్, మనీష్ తివారీ వంటి నేతులు బీజేపీ సర్కార్కు మద్దతుగా మాట్లాడారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రభుత్వ విధానాన్ని బాధ్యతాయుతమైన రాజనీతి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ప్రభుత్వం సరైన పనే చేస్తున్నట్లుందని అని అన్నారు. మరోనేత ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఐక్యతకు పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని భారతదేశం దౌత్యపరంగా నిర్వహించిన తీరును ఆయన... పరిణతి చెందినది మరియు నైపుణ్యంతో కూడినది అని ప్రశంసించారు. కమల్నాథ్ స్పందిస్తూ.. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏమీ లేదన్నారు. కొరత ఉందన్న వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈ అంతర్గత కలహాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందించారు. ఈ సందర్బంగా.. "రాహుల్ గాంధీ ఒక అవకాశవాది.. దేశద్రోహి అని కాంగ్రెస్ నాయకులకు తెలుసు!" అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కేంద్రం చర్యలను రాహుల్ గాంధీ తప్పుపడితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం కేంద్రాన్ని ప్రశంసించారు. నాడు శశిథరూర్ పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
ట్రంప్ పాచిక పారేనా?
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.ఆర్థిక సంక్షోభంఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణవిమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.ట్రంప్ ఏం చేయబోతున్నారు?ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు -
యుద్ధంలో ట్విస్ట్.. ట్రంప్నకు ఇరాన్ మరో ఝలక్!
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. మధ్యవర్తి దేశం పాకిస్థాన్ ద్వారా ఈ ప్రతిపాదన పంపినప్పటికీ, టెహ్రాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ ఆ ఆఫర్ను అంగీకరించలేదు. దీంతో, యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాగా.. ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుబట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన A-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, మరో అమెరికా యుద్ధ విమానం కూలిపోయినట్లు వార్తలు రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అలాగే, ఒక F-15E స్ట్రైక్ ఈగుల్ విమానం కూలిన ఘటనలో ఒక సిబ్బందిని రక్షించగా, మరో వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. మొత్తంగా, ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది.మరోవైపు.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థపై(IAEA) ఇరాన్ అణు శక్తి సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అణు కేంద్రాలపై జరిగిన దాడులను ఐఏఈఏ ఖండించకపోవడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అణు శక్తి కేంద్రాలు శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నవని, వాటిపై దాడులను ఖండించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఐఏఈఏ మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, దాడులు చేసిన దేశాలకు మద్దతు ఇచ్చినట్టే అని ఘాటు విమర్శలు చేసింది. ముఖ్యంగా IAEA పర్యవేక్షణలో ఉన్న కేంద్రాలపైనే దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.కాగా, మార్చి 27న ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధ్రువీకరించింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ పనిచేయలేని స్థితిలో ఉందని వెల్లడించింది. ఇదే రోజు ఆర్దకాన్ ప్రాంతంలోని యెల్లోకేక్ ఉత్పత్తి కేంద్రం కూడా దాడికి గురైంది. ఈ తరహా దాడులు రేడియోధార్మిక లీకేజీకి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు కేంద్రాలపై దాడులు కొనసాగితే, ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, మానవీయ విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి. -
అమెరికా ఎయిర్క్రాఫ్ట్స్ కూల్చివేత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్-అమెరికా భీకర దాడులు చేస్తోంది.. -
రెండు అమెరికా ఫైటర్ జెట్లు ధ్వంసం.. ట్రంప్ రియాక్షన్ ఇదే..!
అమెరికా యుద్ధ విమానాలపై ఇరాన్ విరుచుకపడుతోంది. ఒక రోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెందిన రెండు కీలక ఫైటర్ జెట్లను టెహ్రాన్ కూల్చివేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.అమెరికా ఫైటర్ జెట్లు టార్గెట్గా ఇరాన్ దాడులు జరుపుతోంది. 24 గంటల వ్యవధిలో ఆ దేశానికి చెందిన ఎఫ్ 15, ఎఫ్ 10 జెట్లను కూల్చివేయడంతో పాటు ఎఫ్ 35 హెలికాప్టర్పై దాడి జరిపింది. F-15 జెట్లో ఫైలట్ సైతం ఇరాన్ భూభాగంలో పడిపోగా ప్రస్తుతం ఫైలట్ కోసం ఇరు దేశాలు తీవ్ర స్థాయిలో గాలింపులు చేపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు.డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "మనం యుద్ధంలో ఉన్నాం విమానం కూలిపోయినంత మాత్రాన ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలు ఆగిపోవు. యుద్ధంలో ఇలాంటివి సహజం" అని ఆయన అన్నారు. అదే సమయంలో ఇరాన్ భూభాగంలో చిక్కుకపోయిన ఫైలట్ గాలింపు విషయమై స్పందించడానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపడానికి ఇరాన్ నిరాకరించింది. ఈ మేరకు తమ అధికారులను ఎట్టిపరిస్థితుల్లో ఇస్లామాబాద్ పంపేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో చర్చల ప్రయత్నానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దాడులు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. -
కువైట్లో ప్రధాన చమురు కేంద్రంపై... ఇరాన్ డ్రోన్ దాడులు
ఇజ్రాయెల్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీగా దాడులు కొనసాగించింది. కువైట్లో మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లో ఒక నీటి శుద్ధి కేంద్రంపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. దానికి భారీ నష్టమే వాటిల్లినట్టు సమాచారం. బహ్రెయిన్లోనూ నిర్విరామంగా సైరన్లు మోతలు విన్పించాయి. పలు డ్రోన్లను అడ్డుకుని నేలకూల్చినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. యూఏఈలో కూడా ఒక చమురు క్షేత్రానికి మంటలు అంటుకున్నాయి. దాంతో దాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధ నౌకపైనా దాడులు! అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహంలింకన్ యుద్ధ నౌకపైనా భారీగా దాడులు చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. సౌదీలోని పాటు అలీ అల్ సలేం డ్రోన్ స్థావరంపై కూడా బాంబుల వర్షం కురిపించినట్టు పేర్కొంది. అమెరికా తమ విద్యుత్కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే యూఏఈలో అమెరికాకు చెందిన కీలకమైన స్టార్గేట్ ఏఐ సెంటర్ను నేలమట్టం చేసేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్లో అమెజాన్, ఒరాకిల్ వంటి పలు టెక్ దిగ్గజ కంపెనీల కార్యాలయాలపై ఇరాన్ ఇప్పటికే దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లో రాపిడ్ సెంట్రీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. -
రెండు ఫైటర్ జెట్ల కూల్చివేత
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఒక్క రోజే రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోయింది. ఇరాక్లో ఒక బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయినట్టు సమాచారం! అత్యాధునిక ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను తమ గగనతలంపై కూల్చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఎఫ్–35 పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేనట్టేనని పేర్కొంది. ఎఫ్–15ఇ పైలట్తో పాటు గన్నర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. వారు ఇరాన్ భూభాగంపై సురక్షితంగా దిగినట్టు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. దాంతో వారిని కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కమాండో దళాలు, బంధించేందుకు ఇరాన్ సైన్యాలు ముమ్మరంగా గాలింపు చర్యలకు దిగాయి. వారిలో ఒకరిని అమెరికా దళాలు సురక్షితంగా కాపాడి ఇరాన్ బయటికి తరలించినట్టు ఇజ్రాయెల్కు చెందిన చానల్ 12 పేర్కొంది. రెండో వ్యక్తి విషయమై గందరగోళం నెలకొంది. అతను ఇప్పటికే ఐఆర్జీసీకి చిక్కినట్టు ఇరాన్కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది. అదేమీ లేదని, అతన్ని కూడా కాపాడేందుకు అమెరికా ప్రత్యేక దళాలు ఇంకా ప్రయత్నిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ తదితర వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఐబీ కూడా సదరు ‘అమెరికా సైనికుడు’కనిపించిన వెంటనే కాల్చేయాల్సిందిగా స్థానిక ప్రజలకు పిలుపునిచ్చింది. కాసేపటికే, ‘‘అతన్ని ప్రాణాలతో పోలీసులకు పట్టించండి. అందుకు భారీ బహుమానం కూడా ఉంటుంది’’అంటూ ప్రకటించింది! రెస్క్యూ ఆపరేషన్లో బాగంగా ఘటనా స్థలిపై అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అమెరికా యుద్ధ విమానం తాలూకు శకలాలను ఇరాన్ సైన్యం ట్రక్కుల్లో తరలిస్తున్న దృశ్యాలు ఇరాన్ వార్తా చానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. మరోవైపు అమెరికాకు చెందిన యూహెచ్–60 బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా ఇరాక్లో నేలకూల్చినట్టు ఇరాన్ పేర్కొంది. ఇరాక్ వర్గాలను ఉటంకిస్తూ టాస్నిం వార్తా సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. ఎఫ్–15ఇ యుద్ధ విమానం కూల్చివేత గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నివేదించినట్టు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు. ఎఫ్–35, బ్లాక్హాక్ హెలికాప్టర్ను కూడా కోల్పోయామన్న వార్తలపై మాత్రం అమెరికా అధికారికంగా స్పందించలేదు. ఒక్కో విమానం రూ. 940 కోట్లు! ఎఫ్–35, ఎఫ్–15ఇ యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు సైనికంగానే గాక ఆర్థికంగా కూడా ఎదురు దెబ్బే. ఇవి ఐదో తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కదాని ఖరీదు 10 కోట్ల డాలర్ల (రూ.940 కోట్ల) దాకా ఉంటుంది! ఎఫ్–35 యుద్ధ విమానాన్ని శుక్రవారం ఉదయమే సెంట్రల్ ఇరాన్లో కూల్చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్ సిస్టం దన్నుతో అత్యంత కచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్హీత్ స్క్వాడ్రన్కు చెందినదని కూడా తెలిపింది. ‘‘మా దాడిలో విమానం పూర్తిగా దెబ్బ తిని కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయట పడే అవకాశం లేనట్టే’’అని చెప్పుకొచ్చింది. మార్చి 19న కూడా ఒక అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం తెలిసిందే. దాంతో ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే రెండు ఎఫ్–35లను నష్టపోయింది. ఇక ఎఫ్–15ఇ యుద్ధ విమానం దక్షిణ ఇరాన్లోని పర్వతమయ కోహ్కిలోయే, బోయర్–అహ్మద్ ప్రాంతంలో నేలకూలినట్టు సమాచారం. ఇది రాజదాని టెహ్రాన్కు 500 కి.మీ. దూరంలో ఉంటుంది. పొరుగునున్న చహర్మహల్, భక్తియారీ ప్రావిన్స్లో కూడా శత్రు పైలట్ కోసం వెదకాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. యుద్ధంలోకి ఇరానీ బాలలు బాలలను కూడా ఇరాన్ యుద్ధ రంగంలోకి పంపుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘12 ఏళ్ల పసివాళ్లకు కూడా రివల్యూషనరీ గార్డ్, బసిజ్ ఫోర్స్ తదితర విభాగాల్లో చేర్చుకుంది. వారి చేతికి ఆయుధాన్నిచ్చి కీలక ప్రాంతాల్లో పహారా విధుల్లో నియమించింది’’ అని పేర్కొంది.మొసాద్ భవనం ధ్వంసంఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం నాటి దాడుల్లో నేలమట్టం చేసినట్టు ఇరాన్ పేర్కొంది. టెల్ అవీవ్లో మంటల్లో కాలిపోతున్న భవనం తాలూకు ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ విడుదల చేసింది. దానిపై ఇరాన్ సైన్యం అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడి జరిపినట్టు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలను ధ్రువీకరించలేదు.జోర్డాన్లోనూ అమెరికా యుద్ధ విమానాలపై దాడిజోర్డాన్లోని అల్ అజ్రాక్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా యుద్ధ విమానాలపై భారీగా దాడులు జరిపినట్టు ఇరాన్ ప్రకటించింది. గురువారం రాత్రి వాటిపై డ్రోన్లతో విరుచుకుపడ్డట్టు పేర్కొంది. ఈ దాడిలో విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందీ వెల్లడించలేదు. అమెరికా నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. యూఎస్ రాడార్ ధ్వంసం! ఇరాన్ దాడుల్లో అత్యంత ఖరీదైన ఏఎన్/టీపీవై–2 రాడార్ను అమెరికా నష్టపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఇ–3 విమానం, మరో రీ ఫ్యూయలింగ్ విమానంతో పాటు ఈ రాడార్ కూడా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ రాడార్ అభివృద్ధికి అమెరికా 13 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,200 కోట్లు) వెచ్చించింది. భారతీయులకు గాయాలు అబుదాబిలోని అజ్బాన్ ప్రాంతంలో సహజవాయు క్షేత్రంపై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు దిగింది. వాటి శకలాలు తగిలి ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాలీలు స్వల్పంగా గాయపడ్డారు. మరో నేపాలీ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అబుదాబి మీడియా ఎక్స్ పోస్టులో వెల్లడించింది. రంగంలోకి జెరాల్డ్ ఫోర్డ్ అమెరికా విమానవాహక యుద్ధ నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ యుద్ధ విధుల్లో చేరినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మార్చిలో జరిగిన అగ్నిప్రమాదంలో నౌక పాక్షికంగా దెబ్బ తినడం తెలిసిందే. దాంతో మరమ్మతుల నిమిత్తం దాన్ని గ్రీస్కు తరలించారు. హార్మూజ్ దాటిన ఫ్రెంచి నౌక ఫ్రాన్స్కు చెందిన ఒక కంటైనర్ నౌక శుక్రవారం హార్మూజ్ జలసంధిని దాటింది! యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ జలసంధిని దాటిన తొలి యూరప్ నౌకగా ఇది నిలిచింది. ఇరాన్లో బ్రిడ్జి పేల్చివేత ఉత్తర ఇరాన్లో అల్బోర్జ్ ప్రావిన్స్లోని కరాజ్లో నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్ రెండు దఫాలుగా దాడులు జరిపాయి. దాంతో బ్రిడ్జి తీవ్రంగా దెబ్బ తింది. ఎనిమిది మంది మరణించారు. ఇందుకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని కీలక బ్రిడ్జిలను నేలమట్టం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే 8 బ్రిడ్జిలను హిట్లిస్ట్లో చేర్చినట్టు ప్రకటించింది. వీటిలో షేక్ జబార్ అల్ అహ్మద్ సీ బ్రిడ్జి (కువైట్), కింగ్ ఫాద్ కాజ్వే (సౌదీ–బహ్రెయిన్ లింక్), షేక్ జాయేద్ బ్రిడ్జ్, షేక్ ఖలీఫా, బ్రిడ్జి (యూఏఈ); కింగ్ హుసేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్ (జోర్డాన్) ఉన్నాయి. బ్రిడ్జిపై దాడి తాలూకు వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. ‘‘సమయం మించిపోకముందే తమతో ఒప్పందానికి రండి. లేదంటే ఇలాంటి భారీ దాడులను మరింతగా చవిచూడాల్సి ఉంటుంది’’ అంటూ ఇరాన్ను హెచ్చరించారు. -
పాక్కు షాక్.. ఇస్లామాబాద్ వచ్చేది లేదు: ఇరాన్
ఇరాన్ యుద్ధం ముగింపు కోసం పాకిస్థాన్ చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అమెరికా పెట్టిన డిమాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ఇరాన్ తేల్చిచెప్పింది. దీంతో ఇస్లామాబాద్లో జరిగే చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపేప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది.పశ్చిమాసియా యుద్దం మెుదలై నెలరోజులు గడుస్తోన్నా పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు కదా మరింత దురుతున్నాయి. ఇంతకాలం పాటు చర్చలు జరుగుతన్నాయని ప్రచారం జరిగినా వాటిపైనా ఎవరికీ పెద్దగా నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. యుద్ధ విరమణకు ట్రంప్ పెట్టిన నిబంధనలు ఏ మాత్రం అంగీకారం లేవని ఇరాన్ పేర్కొన్నట్లు తెలిపింది. దీంతో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం ఇస్లామాబాద్లో నిర్వహిస్తున్న చర్చలకు ఎట్టిపరిస్థితుల్లో తమ దేశ ప్రతినిధులను పంపేది లేదని తెలిపింది. ఈ ప్రకటనతో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.కాగా ఇరాన్ తన ఆధీనంలోని హార్ముాజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే యుద్ధ విరమణకు అంగీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. .. "హార్ముాజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛగా తెరిచే వరకు ఇరాన్ను రాతి యుగం నాటి పరిస్థితికి వెళ్లేలా బాంబులతో ధ్వంసం చేస్తూనే ఉంటాం" అని సోషల్ మీడియాలో ఇరాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైతం వెనక్కి తగ్గట్లేదుకాగా పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలం కావడంతో, ఇప్పుడు టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు ఈ చర్చల కోసం మరో వేదికల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
F-15 జెట్ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్?
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఆందోళనకరంగా మారింది.నైరుతి ఇరాన్ ప్రాంతంలో (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్టాఫిక్గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.అమెరికా వాదన ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం తెలిపినట్లు వైట్హౌస్ కథనాలు పేర్కొన్నాయి.ఇరాన్ వాదన అయితే జెట్ కూల్చివేతతో ఇరాన్లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
‘4 గంటలకే అన్నీ ఆఫీసులు మూసేయండి’
ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. -
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరడం భారత్లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.ప్యాకేజింగ్ భారంనీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.ధరల పెంపుమార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.సామాన్యుడిపై నీటి భారంభారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.కర్మాగారాల మూసివేతపెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇరాన్ మీడియా సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్ పైలెట్లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్ (IRGC) ప్రకటించింది. అమెరికా వెంటనే సెర్చ్ పార్టీలను పంపి పైలెట్లను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటనపై అమెరికా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు, కానీ ఇరాన్ మీడియా ప్రచారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.అదే సమయంలో, ఇరాన్ గగనతలంపై అమెరికా అపాచీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ వర్గాలు ఈ హెలికాప్టర్లను టార్గెట్ చేశామని పేర్కొంటున్నాయి. మరోవైపు, అమెరికా రీ-ఫ్యూయెలింగ్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి.ఈ సంఘటనలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత పొందలేదు. స్వతంత్ర ధృవీకరణ లేకపోవడంతో, ఇరాన్ ప్రకటనలు ప్రచార యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ వార్తలు పశ్చిమాసియా భద్రతా పరిస్థితులను కుదిపేస్తూ, అమెరికా-ఇరాన్ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. -
లీటర్ పెట్రోల్ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర రూ. 458ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.మన పరిస్థితి మెరుగ్గా ఉందిఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్ ఆఫ్రిది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలిఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్కు శుభవార్త -
అఖండ ఇజ్రాయెల్ భావన ప్రమాదకరం
ప్రస్తుత యుద్ధరంగంలో లెబనాన్, పాలస్తీనా, ఇరాన్ ప్రతిఘటనల్ని అణచివేసి ‘అఖండ ఇజ్రాయెల్’ స్థాపనకు ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానంలో అతని సంతానానికి నైలునది–యూప్రటీసుల మధ్యగల భూభాగం చెందు తుందని పురాణం చెబుతున్నట్లంటుంది. దీని ప్రకారం ఇరాన్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నింటినీ లేదా వాటిల్లో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ ‘అఖండ ఇజ్రాయెల్’ కింద పరిగణిస్తోంది.ఆటోమన్ సామ్రాజ్యంపై విజయం సాధించిన బ్రిటిష్ సామ్రాజ్యం... అరబ్బులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి దానిపై పరిపాలనాధికారాన్ని 1948 వరకు తన దగ్గరే ఉంచుకొంది. 1917లో యుద్ధ సమయంలో యూదు నాయకుడు తియోడర్ హెర్షల్కు, బ్రిటిష్ వాళ్లకు మధ్య జరిగిన బల్ఫోర్స్ రహస్య ఒప్పందం ఫలితంగా... పాలస్తీనా భూభాగంలో యూదులకు తలదాచుకోవటానికి వాగ్దానం చేశారు.1948లో వారి అనుకూల ఐక్యరాజ్య సమితిలో 118వ తీర్మానంతో ఇజ్రాయెల్, పాలస్తీనాలుగా భూభాగాన్ని విభజించారు. కానీ 1948 యుద్ధంలో ఇజ్రాయెల్... గాజా, వెస్ట్బ్యాంక్లు మినహా బ్రిటిష్ మాండేటరీ పాలస్తీనా మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకొంది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో వెస్ట్బ్యాంక్, గాజాలతో పాటుగా ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంతోపాటు సిరియాలోని గోలెన్ హైట్స్ను ఆక్రమించి, 1982లో సినాయ్ను ఈజిప్టుకు తిరిగి ఇచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ అదుపుకలిగి ఉండటం గమనార్హం.ఇరాన్ యుద్ధాన్ని అదునుగా చేసుకొని దక్షిణ లెబనాన్లో, రాజధాని బీరూట్, మధ్య జిల్లాలతోపాటు బెకాలోయపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు చేస్తున్నది. నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 15 లక్షల మందికి పైగా, దేశంలో దాదాపు 20 శాతం ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసలకు వెళ్లిపో వాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఐరాస ప్రకటించింది. హెజ్బొల్లాను నిరాయుధులుగా చేసేవరకు లెబనాన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రజలను భయభ్రాంతుల్ని చేయటం ద్వారా హెజ్బొల్లాకు వ్యతిరేకంగా వారిని మార్చాలనే వ్యూహంలో ఇజ్రాయెల్ ఉంది.ప్రస్తుతం అమెరికా మద్దతుగా ఉన్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అలాషర్తో ఇజ్రాయెల్ మరింత బలపడుతోంది. సిరియా ద్వారా లెబనాన్ సరిహద్దులను, కదలికలను గమనిస్తూ లెబనాన్కు సహాయం అందకుండా చేస్తోంది. లెబనాన్ తూర్పు సరిహద్దును మూసివేయించింది. దేశంలో ఇప్పటికే అనేక వంతెనలను కూల్చింది. లెబనాన్ ఆక్రమణ దిశగా సాగుతోంది.చదవండి: అమెరికా.. తన ఆటలో తనే పాయిందా?కానీ డెమోరా అణుకేంద్రంపై ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్కు వణుకుపుట్టించింది. ఈ ఘటనతో షాక్కు గురైన అమెరికా అధ్య క్షుడు ట్రంప్ ఏకంగా కొన్ని రోజులపాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడిచేయబోమని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ‘అఖండ ఇజ్రాయెల్’ సాకారమవ్వడం అసాధ్యం. ఒక వేళ ఈ యుద్ధంలో ఇజ్రా యెల్– అమెరికా నెగ్గితే మొత్తం పశ్చిమాసియాను ఆక్రమించి దీనికి ‘నూతన పురాణ అఖండ ఇజ్రాయెల్’గా మరొక పురాణగాథ చెప్ప టానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర వాటి ఆటలు సాగడం లేదు. ‘రెండు దేశాల’ సిద్ధాంతానికి ఇజ్రాయెల్ కట్టుబడిన నాడే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది. అంతవరకూ పశ్చిమాసియా కాష్ఠం రగులుతూనే ఉంటుంది.– బుడ్డిగ జమిందార్ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను, పశ్చిమ నగరమైన కరాజ్తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
భారత్కు రష్యా గుడ్ న్యూస్
ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్ర తరం చేసింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
అమెరికాలో సంచలనం.. ఆర్మీ సైన్యాధిపతి తొలగింపు!
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. దీంతో, అమెరికాలో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామం జరగడం గమనార్హం.వివరాల మేరకు.. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ ర్యాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు మీడియాలో కథనాలు తెలిపాయి. తక్షణమే పదవీవిరమణ చేయాలని హెగ్సెత్ ర్యాండీకి తెలిపినట్టు వెల్లడించాయి. కాగా, ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే, అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గతేడాది యద్ధశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొన్నప్పటినుంచి.. డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్ను, అడ్మిరల్స్ను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న జార్జ్ను తాజాగా తొలగించారు. ఇక, పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, అఫ్గానిస్థాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. నాడు జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాఫ్ ఛైర్మన్గా ఉన్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్పై ట్రంప్ వేటు వేశారు. అప్పటినుంచి ఉన్నతస్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీవిరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా.. తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ను కోరారు. -
పాకిస్తానీలకు సర్కార్ ఝలక్.. పెట్రోల్ ధర భారీగా పెంపు
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. కాగా, నెల రోజుల వ్యవధిలో పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది రెండోసారి.తాజాగా పెరిగిన ధరల ప్రకారం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458.40 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అలాగే, డీజిల్ ధర లీటరుకు 520.35 పాకిస్తానీ రూపాయలకు వెళ్లింది. ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో డీజిల్పై 54.9%, పెట్రోల్పై 42.7% పెంపు విధించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఈ ధరలు పాకిస్తాన్ చరిత్రలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ..‘అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమని అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పడంతో ధరలు పెంచడం తప్పనిసరి అయ్యింది’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరలను కారణంగా చూపుతూ గత నెలలోనే పాకిస్తాన్.. డీజిల్, పెట్రోల్ ధరలను సుమారు 20% పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, దేశంలోని పేద ప్రజలపై మరింత భారం మోపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈల నుండి హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పెరిగిన ధరల కారణంగా పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. దీనిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #BREAKING : WAR CRISIS ARRIVE IN PAKISTAN:Pakistan announces near 50% spike in fuel prices; long queues at pumps.42.7% increase in petrol54.9% increase in dieselPetrol up $0.49Diesel $0.66#IranWar #Iran #Dubai #ısrael #usa #Saudi #iraq #TelAvivBlast #middleeastunrest… pic.twitter.com/Z80zYCFSWd— The Globe & News (@TheGlobeNewt) April 2, 2026 -
ఇస్ఫహాన్, కరాజ్, టెహ్రాన్లపై క్షిపణుల వాన
దుబాయ్/టెహ్రాన్/ఇస్లామాబాద్: ఇరాన్ అణ్వాయుధ తయారీ ప్రయత్నాల అంతమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆరంభించిన పశ్చిమాసియా యుద్ధం హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో కొత్త మలుపు తీసుకుని ఇప్పుడు అతి క్షిపణుల ప్రయోగాలతో మరింత ఉధృతమైంది. దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో సమాధానం చెబుతోంది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై గురువారం సైతం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అగ్రనాయకత్వాన్ని అంతమొందించినా ఇరాన్ తన శక్తిసామర్థ్యాలతో హార్మూజ్ను ఇంకా గుప్పిటపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. దీంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘గతంలో ఎన్నడూలేనంత భీకరంగా దాడి చేసి హార్మూజ్ను మేం హస్తగతం చేసుకోగలం.కానీ అమెరికా ఒంటరిగా అలా చేయాలని అనుకోవట్లేదు. హార్మూజ్పై ఆధారపడిన దేశాలన్నీ ఇప్పటికైనా ధైర్యం కూడదీసుకుని,కలసికట్టుగా రణరంగంలోకి దూకండి. హార్మూజ్ను చేజిక్కించుకోండి’’అని పిలుపునిచ్చారు. అపార ఆయుధ సంపత్తి మా సొంతంఇస్ఫహాన్ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులుచేసింది. నిల్వకేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాలపాట ఆగకుండా నిల్వకేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కరాజ్, టెహ్రాన్ నగరాలపైనా అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ(81) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను ఉధృతంచేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చేపనిలో పడ్డామని ఇజ్రాయెల్ తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ దాడులుచేసింది. యూఏఈపై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 26 డ్రోన్లను నేలమట్టంచేశామని యూఏఈ తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ దీటుగా స్పందించింది. ‘‘అపార ఆయుధ సంపత్తి మా సొంతం. మీరు ఇప్పటిదాకా దాడిచేసినవి మా అసలైన స్థావరాలు కావు. అవి ఎక్కడున్నాయో మీ నిఘా వర్గాలకు కనీసం అవగాహన కూడా లేదు. మాపై ఎంతగా బాంబుల వర్షం కురిపించి నష్టం చేకూర్చినా ఇంకా ఎంతో మందుగుండు, ఆయుధ నిల్వలున్నాయి’’అని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘరీ అన్నారు. 70 లక్షల మంది సిద్ధం... అమెరికా భూతల దాడులకు దిగితే వారిని మా గడ్డ మీదనే అంతంచేసేందుకు 70 లక్షల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలీబాహ్ హెచ్చరించారు. ఇరాన్ జనాభా 9 కోట్లు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని ఇరాన్ ప్రభుత్వం విస్తృతస్తాయిలో ప్రచారంచేస్తోందని వార్తలొచ్చాయి. -
త్వరలోనే ఖేల్ ఖతం
వాషింగ్టన్: ఇరాన్లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్–టైమ్ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. హార్మూజ్ను స్వాధీనం చేసుకోండి ‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి. ఈ యుద్ధం.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోంది. ఇరాన్పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు. అమెరికన్లకు అంత ఓపిక ఉందా? ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. బుధవారం వైట్హౌస్లో ఈస్టర్ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు. నాటో ఒకకాగితం పులి హార్మూజ్ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్ విందులో ట్రంప్ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!
-
ఒకేసారి డ్రోన్ల దాడి యుద్ధంలో రూట్ మార్చిన అమెరికా..
-
ప్రపంచానికి ట్రంప్ భరోసా
-
రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్మొదలు పెట్టిన యుద్ధం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. మరోసారి అణుదాడి ముప్పు ఉండబోతోందా అన్న ఆందోళన ప్రపంచాన్ని పటిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఆయన జీవితం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం.రెండు విధ్వంసాలనుంచి (1916–2010) మృత్యువును జయించిన ధీశాలి సుటోము యమగుచి (Tsutomu Yamaguchi). ఈయన కథ నిజంగా అద్భుతం. జపాన్కు చెందిన ఒక ఇంజనీర్, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి (1945) లో జరిగిన రెండు అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు. ఆగస్టు 6న హిరోషిమాలో బాంబు పేలుడుకు గురై గాయపడిన ఆయన, స్వస్థలమైన నాగసాకికి వెళ్లిపోవాలని ఆరాటపడ్డాడు. కానీ మళ్లీ మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. సుటోము యమగుచి జీవితం ఒక రకంగా అత్యంత దురదృష్టకరమైనది. మరో విధంగా గొప్ప అదృష్టం. రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో, అమెరికా జపాన్పై ఆగస్టు 6, 1945న అణుబాండుదాడులు చేసింది. ఆగస్టు 6న మిత్సుబిషి కంపెనీ ఇంజనీర్గా యమగుచి తన విధినిర్వహణలో భాగంగా హిరోషిమాలో ఉన్నారు. సరిగ్గా ఆయన తిరిగి వెళ్ళే సమయానికి అమెరికా (హిరోషిమా)'లిటిల్ బాయ్' బాంబును ప్రయోగించింది. పేలుడు కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చర్మం కాలిపోయింది, వినికిడి శక్తి దెబ్బతింది. వణుకుతూ, ఒక వైమానిక దాడి ఆశ్రయంలో ఆ భయంకర మైన రాత్రి గడిపాడు. అయినా ప్రాణాలతో బయటపడి, మరుసటి రోజే తన స్వస్థలమైన నాగసాకికి చేరుకున్నారు.ఆగస్టు 9న నాగసాకిలో తన కార్యాలయంలో కూర్చుని, హిరోషిమాలో జరిగిన విధ్వంసం గురించి తన పైఅధికారికి వివరిస్తున్నారు.అతని బాస్ అతణ్ని నమ్మలేదు. అతిగా స్పందిస్తున్నాడని యమగుచిని నిందించాడు. ఒక్క బాంబు నగరాన్ని ఎలా నాశనం చేస్తుంది? అని ఆ అధికారి అడుగు తూండగానే, రెండో బాంబు 'ఫ్యాట్ మ్యాన్' నాగసాకిపై పడింది.రెండోసారి కూడా యమగుచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం విశేషం. ఈ రెండు అణుదాడుల్లో నుంచి ప్రాణాలతో బయటపడినట్లు అధికారికంగా గుర్తించబడిన ఏకైక వ్యక్తి ఆయనే. 2009లో జపాన్ ప్రభుత్వం ఆయనను అధికారికంగా 'ద్విగుణ బాంబు బాధితుడిగా' (Double Hibakusha) గుర్తించింది. యుద్ధం తర్వాత ఆయన, జ్వరాలు, వాంతులు, రేడియేషన్ ప్రభా, అనారోగ్యంతో చాలా కాలం బాధపడ్డారు. కుడి చేయి శాశ్వతంగా దెబ్బతింది. అతను ఒక చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. కానీ ఆయన మనోధైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. కానీ బతికినంత కాలంలో రేడియేషన్ ప్రభావంతో బాధపడినప్పటికీ, ఆయన 93 ఏళ్లు జీవించారు. 2010లో, 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు.జీవితంలో ఎక్కువ కాలం ఈ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి ఇష్టపడని ఆయన, తన చివరి దశలో ప్రపంచానికి అణు ఆయుధాల ప్రమాదాన్ని వివరించాలని నిర్ణయించుకున్నారు. అణు ఆయుధాల ప్రభావానికి సజీవ సాక్ష్యం తాను అంటూ ప్రపంచ మానవాళిని హెచ్చరించారు. "నా కథను ప్రపంచానికి చెప్పడానికే నేను బతికున్నాను" అని ఆయన తరచూ అనేవారు. కాగా రెండు అత్యంత విధ్వంసకరమైన బాధల్ని అనుభవించి, దాన్నుంచి అంతే సాహసంగా బయటపడి, భవిష్యత్తుకోసం బలాన్ని కూడగట్టుకున్న ఒక సాధారణ ఇంజనీర్ కథ. యుద్ధం తెచ్చే విధ్వంసం అందులోనూ అణ్వాయుధాల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో యమగుచి జీవితం కళ్లముందుంచింది. -
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ఆసక్తికర సందేశం విడుదల
టెహ్రాన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై సంచలన కామెంట్స్ చేశారు. ఇరాన్లో విధ్వంసం జరిగిందని, ఇరాన్ ముఖ్య నేతలను అంతం చేసినట్టు చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక సందేశం విడుదల చేశారు. అలాగే, ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ ఆసక్తికరంగా మారింది. దీంతో, యుద్దం వేళ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, ఇరాన్ జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి తాజాగా మొజ్తాబా ఖమేని సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రజల ముందున్న లక్ష్యం ఒక్కటే. ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలి. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదే సమయంలో ఇరాన్లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అన్నారు. యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మరోవైపు.. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ మసూద్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టంచేశారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ.. తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. తమపై చేస్తోన్న దాడులను దృఢంగా, ధైర్యంగా తిప్పికొడుతున్నామన్నారు. అలాగే, ప్రస్తుత ట్రంప్ పాలనలో ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
‘ఇవే మా లక్ష్యాలు.. పవర్ఫుల్ స్పీచ్లో ట్రంప్ చెప్పారు’
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తమ దేశ లక్ష్యాలను స్పష్టంగా తెలిపిందని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఆ లక్ష్యాలు.. ‘ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాలను నాశనం చేయడం, వారి నౌకాదళాన్ని నాశనం చేయడం, వారి వైమానిక దళాన్ని నాశనం చేయడం, ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోకుండా అవకాశాలను నాశనం చేయడం’ అని అన్నారు.“మా అధ్యక్షుడి నాయకత్వం ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతోంది. అదే.. అమెరికా తన ప్రజలను, తన ప్రయోజనాలను రక్షించుకుంటుంది. అమెరికా తన శక్తి ద్వారా శాంతి కొనసాగేలా చేస్తుంది” అని రుబియో పేర్కొన్నారు.కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్తో చేసుకున్న ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేదని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారని తెలిపారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉందని, ఆ దేశాన్ని అణ్వాయుధ దేశంగా మారనివ్వనని అన్నారు. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇచ్చిన స్పీచ్ను స్వయంగా వినడానికి పలువురు ప్రముఖులు రావడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ తో పాటు విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు వచ్చారు. ట్రంప్ స్పీచ్ను ప్రపంచం ఆసక్తికరంగా విన్నది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు-మూడు వారాలు దాడులు కొనసాగుతాయని చెప్పారు. -
అక్కడ శవాల దిబ్బలే మిగిలాయి: ట్రంప్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం మరో 2-3 వారాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. -
బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ నేతలను అంతం చేశామని అన్నారు. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయని చెప్పారు. ఇరాన్ ఆయుధ కర్మాగారాలను ముక్కలు ముక్కలు చేశామని తెలిపారు. ఇరాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాద ఇరాన్పై తాము యుద్ధాన్ని ప్రకటించామని అన్నారు. వెనెజువెలాలో కూడా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ‘ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. యుద్ధం వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ 45 వేల మంది నిరసకారులను చంపేసింది. అమెరికా భద్రత కోసమే ఎపిక్ ప్యూరీ. ఇరాన్లో శవాల దిబ్బలే మిగిలాయి. బీ2 బాంబర్స్ ఇరాన్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ నేవీ, ఎయిర్ఫోర్స్లను దెబ్బతీశాం’ అని అన్నారు. ఒబామా చేయలేనిది చేశాను..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇరాన్లో చేయలేనిది తాను చేశానని ట్రంప్ అన్నారు. ‘ఇరాన్తో ఒబామా ఒప్పందం అమలులో ఉంటే ఇజ్రాయెల్ నామరూపాలు లేకుండాపోయేది. 1.7 బిలియన్ డాలర్లను గత అధ్యక్షుడు ఒబామా ఇరాన్కు ఇచ్చారు. ఇరాన్ వద్ద ఇంకా అణ్వాయుధ సంపద ఉంది. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారనివ్వను. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా లక్ష్యం. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ను నమ్మలేం. అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రక్షణ కవచం కుప్పకూలింది. ఇరాన్ క్షిపణులు చాలా వరకు ధ్వంసమయ్యాయి. మాతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం. ఇరాన్ను రాతియుగానికి తీసుకెళ్తాం. ఇరాన్ అణ్వాయుధ సంపదను తుడిచిపెట్టడమే నా టార్గెట్.అమెరికా సైనికులు 13 మంది మరణించారు. యుద్ధాలు వద్దన్నాను.. కానీ, అమెరికా భద్రత కోసం చేయకతప్పలేదు. ఆపరేషన్ ఎపిక్ప్యూరీ సక్సెస్ అవుతోంది. ఇరాన్లో పాలన మార్చడం మా లక్ష్యం కాదు. హార్మూజ్ జలసంధి మాకు అవసరం లేదు. రెండు-మూడు వారాల్లో భీకరదాడులు చేస్తాం. కీలక లక్ష్యాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ మిసైళ్లు అమెరికాను తాకలేవు. నా పాలనలో ఎన్నో విజయాలు సాధించాం. మేము అమెరికాను శక్తిమంతమైన దేశంగా మార్చుతున్నాం’ చెప్పారు. -
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు. -
ఒప్పందం చేసుకోండి.. ట్రంప్ అసహానానికి గురవుతున్నారు: జేడీవాన్స్
ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. -
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
యుద్ధం ఉద్రిక్తం.. అమెజాన్ సెంటర్పై ఇరాన్ దాడి?
ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్లోని అమెజాన్ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. ఇరాన్లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.కాగా మరోవైపు, ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది -
యుద్ధంలోకి నేరుగా గల్ఫ్ దేశం?
మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడంతో పాటు అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. టెహ్రాన్ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి దిగుతుందని ప్రచారం జరుగుతుంది. -
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లు పాల్గొన్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్ సమావేశం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఎల్పీజీ ధరలు కూడా పెంచలేదు.ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్పుట్స్లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్లో ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్పై అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై నేరుగా పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తోంది. -
గోల్డ్ లవర్స్ కు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు
-
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్
-
25 రోజుల నరకం, బాంబుల మోత : ఎవరీ కేతన్ మెహతా
అకారణంగా ఇరాన్ జైల్లో 50 రోజులు బందీగా ఉన్నాడు. సరిగ్గా విడుదలైన సమయానికి యుద్ధం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. జైలు గోడల మధ్యనుంచి విడుదలైనా కూడా ఆయనకు విముక్తి లభించలేదు. దీంతో అతని సంతోషం అంతా ఆవిరై పోయింది. భయంకరమైన అనుభవంతో ఎలాగోలా ప్రాణాలు ఇండియాకు చేరుకున్నాడు. ఇంతకీ ఎవరతను? తీవ్ర ఉద్రికత్తతల మధ్య అడ్డంకులను దాటుకొని సొంతగడ్డపై ఎలా అడుగు పెట్టాడు?ఎన్డీటీవీ కథనం ప్రకారం ఇరాన్లో 50 రోజుల జైలు జీవితం తర్వాత, విడుదలైన భారత్కు చెందిన కేతన్ మెహతా ఫిబ్రవరి 27న ఒక హోటల్కు చేరాడు. మరుసటి రోజు (ఫిబ్రవరి 28) ఆయన భారత్కు తిరిగి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఆ సమయానికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించాయి. దీనితో విమానాశ్రయాలు మూతపడ్డాయి. భారత రాయబార కార్యాలయం (Indian Embassy)ని సంప్రదిస్తే హోటల్ నుంచి బయటకు రావద్దని సూచించారు.యుద్ధం తీవ్రం, ఉద్రిక్తతలుకేతన్ ఉన్న హోటల్, ఇరాన్ నావిదికాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ రేవు పట్టణానికి కేవలం 600-700 మీటర్ల దూరంలోనే ఉంది. రోజురోజుకు యుద్ధ పరిస్థితి తీవ్రమవుతోంది. ప్రతిరోజూ 100 నుండి 200 బాంబులు పడుతుండటం, కిటికీల నుండి క్షిపణులు వర్షంలా కురవడం చూశానంటూ తన అనుభవాన్నివివరించారు. అయితే ఇండియన్ ఎంబసీ తనతో నిరంతరం సంప్రదిస్తూ తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. యుద్ధం కారణంగా విమానాలు లేకపోవడంతో, 20 రోజుల తరువాత ఆయన బస్సు ద్వారా ఇరాన్ నుండి ఆర్మేనియా సరిహద్దు వరకు సుమారు 1,800 కిలోమీటర్లు ప్రయాణించారు.ఈ 18-19 గంటల ప్రయాణంలో కొండల మధ్య బాంబు పేలుళ్ల శబ్దాలు వినపడేవని, పేలుళ్ల ధాటికి బస్సు కూడా ఊగిపోయేదని ఆయన చెప్పారు. చివరకు, ఆర్మేనియా చేరుకున్న తర్వాత అక్కడి నుండి విమానంలో కేతన్ మెహతా సురక్షితంగా ఢిల్లీ సమీపంలోని తన నివాసానికి చేరుకున్నారు. జైలు కష్టాల కంటే, యుద్ధం మధ్య గడిపిన ఆ 25 రోజులు తన జీవితంలో అత్యంత భయానకమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుజైలుకెందుకెళ్లారు?డిసెంబర్ 8న MT వేలియంట్ రోర్ (MT Valiant Roar) అనే చమురు ట్యాంకర్ను ఇరాన్ అధికారులు పట్టుకున్నారు. ఈ నౌక అక్రమ డీజిల్ను రవాణా చేస్తోందని ఆరోపించారు. నౌకలోని 10 మంది భారతీయ సిబ్బందిని అరెస్టు చేసి ఇరాన్లోని బందర్ అబ్బాస్ జైలుకు తరలించారు. అందులో కేతన్ మెహతా ఒకరు. అయితే దీనిని దుబాయ్కు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ LLCసంస్థ తిరస్కరించింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన
-
‘నాటో’కు ట్రంప్ బిగ్షాక్!
వాషింగ్టన్: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోలు మస్త్ ఉంది, డోంట్ వర్రీ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి. దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) 100 శాతం సహజ వాయువు సరఫరాకు ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు. ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులుకాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు -
అమెరికాలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
-
యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ
-
ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ చెప్పినా వినలేదు...
-
తగ్గేదేలే అంటున్న రెండు దేశాలు.. ప్రమాదంలో ప్రపంచం
-
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్ ధరలు పెంపు..!
-
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.ప్రీమియం ఇంధనాలకు ధరల సెగలగ్జరీ కార్లు, సూపర్ బైక్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధరవ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.ఏటీఎఫ్ రూ.2 లక్షలువిమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఊరటప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిణామాలు కేవలం పెట్రోల్ ధరలనో, స్టాక్ మార్కెట్లనో ప్రభావితం చేస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరు ఇప్పుడు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా దేశంలోని కండోమ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ రబ్బరు పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం, కండోమ్ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది.ఏమిటీ సమస్య?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీదారులలో ఒకటి. అయితే, ఈ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. కండోమ్ తయారీలో వాడే సింథటిక్ రబ్బరు, ఇతర పెట్రోకెమికల్ అనుబంధ పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఎందుకు ఈ అంతరాయం?కండోమ్ల తయారీలో వాడే పాలిమర్లు, సింథటిక్ రబ్బరు, లూబ్రికెంట్లు ముడి చమురు ఉప ఉత్పత్తులు. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర పెరగడంతో వీటి తయారీ వ్యయం 30% నుంచి 40% వరకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే రసాయనాలు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి కేంద్రాల్లో ముడి పదార్థాల కొరత ఏర్పడింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో అస్థిరత వల్ల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల ఫ్రైట్ ఛార్జీలు పెరగడంతోపాటు డెలివరీ సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది.ఎవరు ప్రభావితమవుతున్నారు?దేశంలోని దిగ్గజ కండోమ్ తయారీ సంస్థలు పెరిగిన ఖర్చులను భరించలేక ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్ ఎగుమతులు మందగించాయి. ఇది దేశీయ విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ భారం పెరగనుంది.ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?భారతదేశంలో రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సింథటిక్ రబ్బరు కోసం మనం సుమారు 48% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.ఎంత మేర నష్టం?గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల రబ్బరు రసాయనాల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం, పెరిగిన లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు రెట్టింపు అయ్యింది.ముందున్న సవాళ్లుయుద్ధం మరికొంత కాలం కొనసాగితే కేవలం కండోమ్లే కాకుండా గ్లౌజులు, క్యాథెటర్లు వంటి వైద్య పరికరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ ఎంతటి సున్నితమైనదో ఈ పరిస్థితి అర్థం చేస్తోంది. ఇంధన భద్రతతో పాటు రసాయన ముడి పదార్థాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత -
ఇరాన్ ఎఫెక్ట్.. ట్రంప్ కోసం స్పెషల్ బంకర్!
వాషింగ్టన్: ఇరాన్పై భీకర యుద్ధంలో తలమునకలై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత భద్రతను పటిష్టం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ట్రంప్ కోసం ప్రైవేట్ నిధులతో నిర్మిస్తున్న బాల్రూమ్ కింద అత్యంత పటిష్టమైన బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.ఆదివారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. బాల్రూమ్ కింద భూగర్భంలో ఒక భారీ సముదాయం నిర్మాణ దశలో ఉందని తెలియజేశారు. సాక్షాత్తూ అమెరికా సైన్యమే దీన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త బాల్రూమ్లో బుల్లెట్ప్రూఫ్ గ్లాస్, డ్రోన్ నిరోధక డిజైన్ వంటి అనేక ఆధునిక భద్రతా సదుపాయాలు ఉంటాయని ట్రంప్ చెప్పారు. ఈ గది అంతర్జాతీయ ప్రముఖులకు, నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతోపాటు ప్రధాన కార్యక్రమాలకు ఆతిథ్యం ఇస్తుంది. వైట్హౌస్ అండర్గ్రౌండ్లో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్(పీఈఓసీ) ఉండేది. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే నిర్మించారు. తరచుగా ఆధునీకరించారు. వైట్హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత సమయంలో ఈ సెంటర్ను తొలగించారని, నూతన, ఆధునిక సదుపాయాలతో మరో సముదాయం నిర్మాణంలో ఉందని ఈ ఏడాది జనవరిలో ఓ వార్తా సంస్థ తెలియజేసింది. THE WHITE HOUSE IS BUILDING A MASSIVE BUNKER UNDER THE NEW BALL ROOM 🚨THIS IS NOT INSURANCEIT IS A WARNINGSOMETHING SERIOUS IS COMING pic.twitter.com/J2UCRFpwav— Matt Wallace (@MattWallace888) March 30, 2026ఎన్సీపీసీ నుంచి అనుమతి లేకుండానే.. ట్రంప్ కొత్త బంకర్ గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టలేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు. అయితే, సైన్యం వైట్హౌస్లో కొన్ని ఆధునీకరణ పనులు చేపడుతోందని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తన అభిరుచులకు అనుగుణంగా బాల్రూమ్ను కట్టించుకుంటున్నారు. దీనికి ప్రైవేట్ సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై అమెరికా కాంగ్రెస్ పర్యవేక్షణ గానీ, ప్రజా పరిశీలన గానీ లేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్(ఎన్సీపీసీ) నుంచి అనుమతి లేకుండానే బాల్రూమ్ బంకర్ను నిర్మిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టోరిక్ ప్రజర్వేషన్’ఇటీవల కోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో విచారణ జరుగనుంది. BREAKING US military building 'massive complex' beneath White House ballroom project, says Trump pic.twitter.com/reIDNg8qmZ— AFP News Agency (@AFP) March 30, 2026 -
యుద్ధంపై ఇరాన్ రెడ్క్రిసెంట్ సంస్థ రిపోర్ట్.. నష్టం ఎంతంటే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు జరుపుతోంది.


