రుక్మిణి వసంత్కు కోపమొచ్చింది. చూడటానికి సాఫ్ట్గా ఉన్నా ఈ బ్యూటీలో కట్టలు తెంచుకునే ఆవేశం కూడా ఉందన్నది తేటతెల్లమైంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు పరిశ్రమను కన్నడ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాప్ హీరోల సరసన వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తుంది. ఇటీవల విడుదలైన ‘కాంతార-చాప్టర్ 1’ లోనూ యువరాణి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్న ఈమె రాంగ్ యాంగిల్ ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లపై ధ్వజం ఎత్తారు. సాధారణంగా షూటింగ్స్లోనే, ఇతర కార్యక్రమాలలోనో సెలబ్రిటీలు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు తన చేతి నైపుణ్యానికి పని చెబుతుంటారు. ఇక సినీ కథానాయికలను అయితే వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి తెగ ఉత్సాహపడతారు.
కొందరైతే సొగసులను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. ఇలాంటి చర్యలు తప్పుకాదు. అయితే హీరోయిన్లను రాంగ్ యాంగిల్లో ఫొటోలు తీసి రీల్స్ పేరుతో అన్ పాపులర్ చేసే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లతోనే సమస్య. ఇలాంటి విషయాలపైనే నటి రుక్మిణి వసంత్ మండిపడ్డారు. దీని గురించి ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫొటోగ్రాఫర్ల చర్యలు ఖండించదగ్గవి అన్నారు.
ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని, అదే విధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను రాంగ్ యాంగిల్ చిత్రీకరించే కొందరు ప్రైవేటు ఫొటోగ్రాఫర్ల చర్యలను తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నటీమణులను కించపరిచే వారిపై చర్యలకూ వెనుకాడబోమని నటి రుక్మిణి వసంత్ అన్నారు.


