బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్లో ఉన్న తన ప్లాట్ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ప్రీతి జింటా 2025 నవంబర్లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్ విక్రయించడం విశేషం.
ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.
సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.
ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్' విలన్
నవంబర్లో విక్రయించిన ప్లాట్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.


