ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా’. మార్చి 6న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ చిత్రానికి ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కథ, కథనం, మాటలను అందించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సక్సెస్ మీట్లో పాల్గొన్న టీం సభ్యులు మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. మార్చి 6 నుంచి అన్ని సెంటర్లలో వస్తున్న పాజిటివ్ టాక్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని తెలిపారు.


