breaking news
Nalgonda District Latest News
-
చిరునామా ఆధారం
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లోని ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 9న ముగిసింది. వార్డుల వారీగా రాజకీయ పార్టీలు, స్థానిక ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలిన ప్రారంభించారు. పరిశీలన పూర్తిచేసి చిరునామా ఆధారంగా తుది ఓటరు జాబితాను తయారు చేయనున్నారు. ఫిర్యాదులను క్రోడీకరించి.. వార్డుల్లో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్రోడీకరించి వార్డుల హద్దులు, కాలనీల్లో ఉన్న ఓటర్లు, ఓటరు కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తి చేసి ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రదర్శిస్తారు. దాంతో పాటు టీ పోల్ యాప్లో జాబితాను అప్లోడ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 16న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. నీలగిరిలో అధికారిక ఆదేశాలు అందితేనే.. నీలగిరి కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ కోసం కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించిన అధికారులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. నీలగిరి కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 12 లేదా 13న గవర్నర్ నుంచి గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ జాప్యం జరిగితే సంక్రాంతి తరువాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మున్సిపల్ ఉన్నతాధికారులు తుది ఓటరు జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారమే ఓటరు జాబితా రూపొందించే పనులను అధికారులు చేస్తున్నారు. ఫ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా రూపకల్పన ఫ ముగిసిన అభ్యంతరాల స్వీకరణ ఫ 16న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. ఎన్నికల నిబంధనల ప్రకరమే ఓటరు జాబితాను ప్రచురిస్తున్నాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ -
వాహనదారులు హెల్మెట్ ధరించాలి
మిర్యాలగూడ అర్బన్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) చేపట్టిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసులు చేపట్టిన నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతమైందన్నారు. హెల్మెట్లను ఇళ్లలో గోడలకు, స్కూటీ డిక్కీల్లో పెట్టకుండా తలకు ధరించి వాహనం నడపాలన్నారు. సబ్కలెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఏ పని తలపెట్టినా పూర్తి అంకితభావంతో చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బీఎల్ఆర్ మాట్లాడుతూ మానవ ప్రయత్నంగా ప్రస్తుతం 500 మందికి హెల్మెట్లు పంచినట్లు చెప్పారు. శివరాత్రి వరకు పట్టణంలో అందరికీ హెల్మెట్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖరరాజు, సీఐలు ప్రసాద్, నాగభూషణం, సోమనర్సయ్య, ఎన్ఐలు నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, గాయం ఉపేందర్రెడ్డి, పొదిల శ్రీనివాస్, కొమ్మన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్స్లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు పోటీ పరీక్షలో అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష హాల్ టికెట్లు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని.. పోటీ పరీక్ష ఫిబ్రవరి 8న ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతుందని తెలిపారు. అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 20 నుంచి జూలై 19, 2026 శిక్షణలో కొనసాగుతారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 84650 35932, 96031 67257 ఫోన్ నంబర్లఅను సంప్రదించాలని సూచించారు. పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీనే ప్రామాణికంరామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ అన్నారు. మండలంలోని మేళ్ల దుప్పలపల్లిలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ తరహాలో ప్రభుత్వం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రశాంతంగా టీసీసీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో నిర్వహించిన వివిధ టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఉదయం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్, టైలరింగ్ లోయర్ అండ్ హైయర్ పరీక్షలకు 1,378 మందికి గాను 1,049 మంది హాజరయ్యారని, 329 మంది గైర్వాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 1,047 మంది అభ్యర్థులు హాజరు కాగా, 331 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. ఏసీబీ దాడులపై ముందే సమాచారం!నల్లగొండ : అవినీతికి పాల్పడిన వారిని అరికట్టాల్సిన ఏసీబీ వారే ముందస్తు దాడులు జరుగుతున్నాయనే సమాచారం ఇచ్చి వారినుంచి డబ్బులు వసూలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ఏసీబీలో పనిచేస్తున్న ఒక సీఐ, ఒక హోంగార్డు ఈ తతంగానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాంపల్లి, మఠంపల్లి, గరిడేపల్లిలో గతంలో పనిచేసిన ఎస్ఐలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దానిపై ముందే వారికి మీపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయంటూ సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. మఠంపల్లి ఎస్ఐకి ఏసీబీ ట్రాప్ సమాచారం ముందే ఇచ్చి రూ.10 లక్షలకు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులే ముందే సమాచారం లీక్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం విస్మయం గొల్పుతోంది. -
నిరాటోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవికి నిరాటోత్సవాలను అర్చకులు ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ నీరాటోత్సవాల్లో శ్రీస్వామి వారి నిత్య కల్యాణ సేవతో పాటు గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాఢ వీధుల్లో అమ్మవారి సేవతో పాటు శ్రీస్వామి వారి గజవాహన సేవను ఊరేగించారు.మధ్యాహ్నం ఉత్సవ మండపంలో అమ్మవారికి కట్టెపొంగళిని ఆరగింపుగా పెట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14 రాత్రి ఆలయంలో గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవం, 15 ఉదయం 11.45గంటలకు వడి బియ్యం సమర్పించే వేడుకలను నిర్వహిస్తున్నామని అర్చకులు వెల్లడించారు. -
సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, జిల్లాకార్యదర్శి అద్దంకి రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న, ఉమ్మడి జిల్లా కన్వీనర్ అప్పల మధు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జోగు అంజన్న, షేక్ చాంద్పాషా, చింత స్వామి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ కలెక్టరేట్ ఎదుట ఉద్యమకారుల దీక్ష -
భారీగానే.. గౌరవం!
సాక్షి ప్రతినిది, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ అయ్యే రూ.65 వేల గౌరవ వేతనం అందనుంది. నీలగిరి మున్సిపాలిటీ.. కార్పొరేషన్ కావడంతో ఆ మేరకు ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రయోజనాలు లభించనున్నాయి. కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్కు, కార్పొరేటర్లకు కూడా గౌరవ వేతనాలు భారీగా లభించనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 2 వేల మంది ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెద్ద మొత్తంలో పెరగనుంది. భారీగా ఆర్థిక ప్రయోజనం మేయర్ అయ్యే వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్న వారికి నెలకు రూ.19,500 గౌరవ వేతనం ఉంది. ఇప్పుడు కార్పొషన్లో మేయర్ అయ్యే వారికి నెలకు రూ.65 వేల వేతనం లభించనుంది. ఇక మున్సిపల్ వైస్ చైర్మన్కు నెలకు రూ.9,750 గౌరవ వేతనం ఉండగా.. డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యే వారికి నెలకు రూ.32,500 గౌరవ వేతనం లభించనుంది. కార్పొరేటర్లకు రూ.7,800 వేతనం ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేసిన వారికి నెలకు రూ.4,550 గౌరవ వేతనం ఉండేది. నల్లగొండ కార్పొరేషన్ కావడంతో కౌన్సిలర్ స్థానం కార్పొరేటర్గా మారనుంది. దీంతో కార్పొరేటర్గా గెలిచే వారికి ప్రతి నెలా గౌరవ వేతనం రూ.7500 లభించనుంది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపొందే 48 మంది కార్పొరేటర్లకు ఇది వర్తించనుంది. కార్పొరేషన్ పరిధిలో రూ.2 లక్షలకుపైగా జనాభా ఉంటే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రస్తుతం నల్లగొండ 2,43,615 జనాభాతో కార్పొరేషన్గా అవతరించబోతోంది. దీంతో కార్పొరేషన్ పరిధిలో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరగనుంది. ప్రధానంగా కలెక్టరేట్ పరిధిలో 500 మంది వరకు ఉద్యోగులు ఉండగా, జిల్లా వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల, వ్యవసాయ, సంక్షేమ, విద్య, పోలీసు ఇతరత్రా అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం 50 వేలకు పైగా జనాభా కలిగిన మున్సిపాలిటీలో వారికి 13 శాతం హెచ్ఆర్ఏ వస్తోంది. ఇక కార్పొరేషన్ కానుండడంతో ఇక్కడ 17 శాతం హెచ్ఆర్ఏ లభించనుంది. దీంతో ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఫ నీలగిరి కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులకు పెరగనున్న గౌరవ వేతనాలు ఫ ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా 17 శాతానికి పెరుగుదల ఫ రెండు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం -
రైతు భరోసా రాదాయే..
యాసంగి సీజన్ రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీపై అప్పు చేయాల్సి వచ్చింది. వెంటనే భరోసా సాయాన్ని అందించాలి. – పనస కాశయ్యగౌడ్, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం నల్లగొండ అగ్రికల్చర్ : రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గత యాసంగి సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాసంగి సీజన్ గత నవంబర్లో ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు యాసంగి సీజన్ రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. 6,57,229 ఎకరాల్లో సాగు యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా చేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగువుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా వరినాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. పెట్టుబడుల కోసం అప్పులు యాసంగి సీజన్లో రైతు భరోసా అందకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకర్లు కూడా పంట రుణాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు అధిక వడ్డీపై అప్పులను తీసుకొచ్చి యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. 5,65,803 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.738 కోట్ల 67 లక్షల 60 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఎ లాంటి ప్రకటనా చేయకపోవడంతో రైతులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతుల భరోసాను వెంటనే జమ చేయాలని కోరుతున్నారు. ఫ యాసంగి సీజన్ ముగుస్తున్నా అందని సాయం ఫ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు -
చెర్వుగట్టులో దుకాణాల నిర్వహణకు టెండర్లు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆలయంలో దుకాణాలతో పాటు వివిధ పనుల నిర్వహణ హక్కుల కోసం శనివారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈఓ కార్యాలయంలో వీటిని నిర్వహించారు. కొండపైన టోల్గేట్ నిర్వహణ, కొబ్బరిచిప్పల సేకరణ, టాయిటెట్ బ్లాక్ నిర్వహణ, కొండకింద కూల్డ్రింక్స్ షాపు, హోటల్, అమ్మవారి వస్త్రాల సేకరణ, క్యారీ బ్యాగుల విక్రయం, నందిసర్కిల్ వద్ద షాప్ నంబర్– 2, షాప్ నంబర్– 4, షాప్ నంబర్– 5, షాప్ నంబర్– 6, ఆవులకు పచ్చిగడ్డి అమ్ముకునే హక్కు కోసం వేలం నిర్వహించారు. టెండర్ల నిర్వహణ ద్వారా ఆలయానికి రూ.1,87,34,528 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రూ.1,21,36,777 రాగా ప్రస్తుతం వేసిన టెండర్లకు రూ. 65,97,751 అధికంగా వచ్చిందని ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, దేవాలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరఽశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఆలయానికి రూ.1.87 కోట్ల ఆదాయం -
వీ బీ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామసభలు
● డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నల్లగొండ : కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీ బీ జీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామసభలు నిర్వహించి.. ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాలు చేయాలని నిర్ణయించామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ తెలిపారు. శనివారం నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి పేదలకు మరణ శాసనం రాసిందని ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీరామ్జీ చట్టంలో పని దినాలు పెరిగినా కూలీలకు ప్రయోజనం లేదన్నారు. పనులు దొరక్క ప్రజలు.. పట్టణాలకు పోతే గ్రామాల్లో ఉన్న ఆస్తులను కార్పొరేట్లకు అప్పచెప్పాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత ఉపాధి హామి చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్తగా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఫిబ్రవరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీను, ఎండీ.ముంతాజ్ అలీ, కన్నారావు, వెంకటయ్య, గౌతమ్, శివ, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలి
తిప్పర్తి : పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తిప్పర్తి పీహెచ్సీని ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, వైద్యులు మమత, నవనీత, షాబుద్దిన్ పాల్గొన్నారు. జీజీహెచ్లో హెల్ప్ డెస్క్నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఇటీవల బాధ్యతలను స్వీకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వైద్యం పొందడంలో ఆలస్యం కాకుండా సకాలంలో రోగులకు వైద్యం అందాలనే లక్ష్యంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అత్యవసర విభాగం, అవుట్ పేషంట్ రోగుల విభాగాల్లో శుక్రవారం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయించారు. హెల్ప్ డెస్క్లలో సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఇక ఎంసీహెచ్ వద్ద పాదరక్షలు విడిచేందుకు ప్రత్యేకంగా స్టాండ్లను ఏర్పాటు చేయించి.. అక్కడ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. అత్యవసర విభాగం గేటు వద్ద ప్రత్యేకంగా సీసీ కెమరాలను ఏర్పాటు చేయించారు. రోగులకు అందించే డైట్ వివరాలను ప్రతి వార్డులో డిస్ప్లే చేయాలని, రోగులకు స్కానింగ్, ఇతర పరీక్షల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. నార్కట్పల్లి ఎస్ఐ ఎస్పీ ఆఫీస్కు అటాచ్నార్కట్పల్లి : నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ను ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో ఆయనను వీఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో చిట్యాల ఎస్ఐ రవికుమార్కు.. నార్కట్పల్లి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
అంతర్గత దారులు అస్తవ్యస్తం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని సాయినగర్ కాలనీ, వీబీ నగర్ కాలనీ, శాంతినగర్, గంగారెడ్డినగర్, అనుముల వారిగూడెం ప్రాంతాల్లో సీసీ రోడ్లు లేక ఆయా కాలనీలో నేటికి మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితేచాలు.. మట్టి రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా నడవలేని స్ధితికి చేరుతుండడంతో ప్రజలకు బాధలు తప్పడం లేదు. వర్షాకాలంలో వర్షపునీరంతా మట్టి రోడ్డు గుంతల్లోకి చేరడం వల్ల రోడ్లన్నీ చిత్తడిచిత్తడిగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చండూరు : మున్సిపాలిటీలో రోడ్లు మురుగుకాల్వలను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇళ్లలోని నీరు వీధుల్లో పారుతోంది. దీంతో అంతర్గత రహదారులన్నీ కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో మెత్తం 15 కిలో మీటర్ల మేర అంతర్గత రోడ్లు ఉండగా అందులో 8 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. 7 కిలోమీటర్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఈ మట్టి రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది అప్పుడప్పుడు తవ్వి వదిలేయడంతో ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారింది. మెయిన్ రోడ్డు పనులు త్వరగా చేయకపోవడం, పాత డ్రెయినేజీ మూసి వేయడంతో మురుగు అంతా రోడ్లపై ప్రవహిస్తోంది. మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. ప్రధానంగా తాళ్లగడ్డలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గుంతలను సరిగా పూడ్చకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో సరిగా సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలకు రోడ్లు బురద మయంగా మారుతున్నాయి. సీతారాంపురం–బంగారుగడ్డకు వెళ్లేందుకు బిడ్జి నిర్మాణం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు వేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
క్రీడలతో ఓర్పు
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : క్రీడలు శారీరక, మానసిక దృఢత్వంతో పాటు ఓర్పును ఇస్తాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో ఐదు రోజులపాటు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్–2025 ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు.. ఒక ఉద్యోగం కాదని, బాధ్యత అని చెప్పారు. దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొని విధులు నిర్వహించే పోలీసులకు స్పోర్ట్స్ మీట్ నూతన ఉత్తేజాన్ని కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి ఆంగ్ల ప్రతిభా పోటీలు
రామగిరి(నల్లగొండ): పట్టణంలోని డైట్ కళాశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆంగ్ల ప్రతిభ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భాషా నైపుణ్యాలు అభివృద్ధి పరిచే కార్యక్రమంగా ఒలంపియాడ్, ఎడ్యుటాక్ అంశాలతో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ, ఎల్టా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ.అబ్బాస్, ప్రధాన కార్యదర్శి కె.బాలరాజు, ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎం.అనిల్కుమార్, కోశాధికారి ఏ.రాధాకిషన్, ఎన్.విష్ణు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో సౌకర్యాలు కల్పించాలి
నార్కట్పల్లి : చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం దేవాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్యం, నీరు, బారికేడ్లు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎక్కువ శాతం సిబ్బందిని కేటాయించాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు గట్టు పైకి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయానికి రూ.వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని, వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు కొనసాగించాలని తెలిపారు. హయత్నగర్ నుంచి నేరుగా చెర్వుగట్టుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఈఓ మోహన్బాబు, సర్పంచ్ నేతగాని కృష్ణ, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
సంక్రాంతికి వస్తున్నాయ్
రైతుల చెంతకు యాంత్రీకరణ పరికరాలు నల్లగొండ అగ్రికల్చర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన(2018)లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంత్రీకరణ పథకం అమలు చేసి రైతులకు సబ్సిడీపై పరికరాలను అందించాలని నిర్ణయించింది. 2024 సంవత్సరానికి గాను జిల్లాకు 1.81 కోట్ల నిధులను కేటాయించింది. 2025 మార్చి 31లోగా పరకరాలను పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరికరాల పంపిణీకి మోక్షం లభించలేదు. తిరిగి 2025 సంవత్సరానికి గాను పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం వాటా ఉంటుంది. గతంలోనే కొందరిని ఎంపిక చేయగా.. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్ ఇచ్చేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. సబ్సిడీ ఇలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు ఇచ్చే సబ్సిడీలో ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు పరికరం ధరలో 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రైతు ఎంపిక చేసుకున్న కంపెనీ ధరలో సబ్సిడీ పోను మిగతా వాటా డబ్బులను రైతు డీడీ రూపంలో దరఖాస్తుతో అందించాల్సి ఉంటుంది. పరికరాలు ఇవే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యాంత్రీకరణ పరికరాలను పెద్ద సంఖ్యలో కేటాయించింది. పవర్ టిల్లర్లు 50, బ్రష్కట్టర్స్ 83, పవర్టిల్లర్లు 58, మేజ్సెల్లర్స్ 20, స్ట్రాబెల్లర్స్ 90, చేతిపంపులు 8,289, పవర్ స్ప్రేయర్స్ 1,047, రోటోవేటర్స్ 463, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు 107, ట్రాక్టర్ పనిముట్లు 475, బండ్ ఫార్మర్స్ 45 జిల్లాకు కేటాయించింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆయా నియోజకవర్గ, మండలాల వారీగా పరికరాలను కేటాయించి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పండుగ తరువాత పంపిణీ చేసేలా.. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను జిల్లాలో సంక్రాంతి పండుగ తరువాత పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల లబ్ధిదారుల ఎంపిక చేసింది. అయితే దాదాపు 10 వేల వరకు పరికరాలు ఉండగా.. ఐదు వేలలోపే దరఖాస్తులు రావడంతో.. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరణ చేపట్టారు. పండుగలోపు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికను తయారు చేసింది. శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పరికరాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పండుగ తరువాత జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పరికరాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది.సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రైతులు తమ పరిధిలోని వ్యవసాయాధికారులను సంప్రదించి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ ఫ జిల్లాకు రూ.8 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ఫ పండుగ తర్వాత పంపిణీకి సన్నాహాలు -
రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరుగురు మిల్లర్లు రూ.114 కోట్ల విలువైన 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేశారు. తమవద్ద ధాన్యం ఉందని, అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదని బుకాయించిన మిల్లర్ల బండారం బయట పడింది. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేలిపోయింది. వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా మిల్లర్లకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లపై చర్యలు చేపట్టేందుకు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2016 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లను గుర్తించడం, వారు ఎగ్గొట్టిన ధాన్యం పరిమాణం, దాని విలువ తేల్చడంతోపాటు వెంటనే ఆయా మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్ఫోర్స్ విభాగం చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్ డీఎస్ఓ వెంకటేశ్వర్లును స్పెషల్ ఆఫీసర్గా, రిటైర్డ్ తహసీల్దార్ ఎస్.ప్రభాకర్, డీపీఓ ఎస్.రాజ్కుమార్, ఇన్స్పెక్టర్ సైదులుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లులకు సంబంధించిన వ్యవహారాలను, చేపట్టాల్సిన తదుపరి చర్యలను పర్యవేక్షించనున్నారు. నల్లగొండలో 57 వేల మెట్రిక్ టన్నులు పక్కదారి ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఇవ్వాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం కాకినాడ పోర్టుకు తరలించారని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు జిల్లాలోని ఆరు మిల్లులపై విచారణకు ఆదేశించారు. దీనిపై ఏర్పాటు చేసిన అధికారులు కమిటీ రంగంలోకి దిగింది. 2022–23 యాసంగి సీజనన్కు సంబంధించి చిట్యాలలోని వరలక్ష్మి మిల్ 59,538 క్వింటాళ్లు, నల్లగొండలోని రామ్లక్ష్మణ్ 78,110 క్వింటాళ్లు, మునుగోడులోని మురళీమనోహర్ ఆగ్రోఫుడ్ 4500 క్వింటాళ్లు, నల్లగొండ ఆర్జాలబావి సమీపంలోని సుమాంజలి 67,662 క్వింటాళ్లు, గౌతమి ఇండస్ట్రీస్ 1,59,803 క్వింటాళ్లు, నల్లగొండలోని కనకమహాలకి్ష్మ్ పార్బాయిల్డ్ మిల్లు 80,260 క్వింటాళ్లు మొత్తంగా 44,987 మెట్రిక్ టన్నుల వేలం ధాన్యం లేనట్లు తేలింది. దానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం కూడా లేవని తేలింది. పైగా అది ప్రభుత్వం వేలం వేసిన ధాన్యం. ఆ ధాన్యం లేకపోగా, కనీసం బియ్యం కూడా మిల్లుల్లో లేదని కమిటీ తేల్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు నివేదించింది. మరోవైపు మరికొన్ని మిల్లుల్లోనూ మరో 12 వేల మెట్రిక్ టన్నులు, మొత్తంగా 57 వేల మెట్రిక్ ధాన్యం లేదని దీంతో తదుపరి చర్యలపై యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ధాన్యం మాయం చేసిన మిల్లర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై త్వరలోనే పౌర సరఫరాల శాఖ సబ్ కమటీ భేటీ కానుంది. ఈ నెలాఖరులో నిర్వహించే ఆ సమావేశంలో ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లనుంచి రికవరీ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో జిల్లాలోనూ అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు చేపడతారు. ఫ అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదంటూ వాదనఫ కానీ.. ఆరు మిల్లుల్లో ధాన్యం లేదని తేల్చిన అధికారుల కమిటీఫ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారిపై చర్యలకు సన్నద్ధం ఫ ఆయా మిల్లర్ల ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేత ఫ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్న పౌరసరఫరాల శాఖ ఫ సబ్కమిటీ భేటీ అనంతరం మిల్లర్లపై చర్యలకు సిఫారసు -
ప్రమాదకరంగా ఓపెన్ డ్రెయినేజీలు
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులో ఓపెన్ డ్రెయినేజీలపై పైకప్పులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. వ్యవసాయ మార్కెట్ ప్రహరీకి అనుకుని భువనగిరి రోడ్డు నుంచి హైవే వరకు ఇటీవల పైకప్పు లేకుండా వెడల్పుగా ఓపెన్ డ్రెయినేజీని నిర్మించారు. ఈ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కాలంలో 10వ వార్డులో ఎల్లమ్మగుడి సమీపం, వేణుగోపాల స్వామి వెంచర్లోని ఓపెన్ డ్రెయినేజీల్లో ప్రమాదవశాత్తు పడి ఎండి.జావీద్, మేకల భిక్షం మృతిచెందారు. ఓపెన్ డ్రెయినేజీలపై స్లాబ్ వేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
మేయర్.. ఏ కేటగిరీకి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్లో మేయర్ రిజర్వేషన్పై ఉత్కంఠ నెలకొంది. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది.. ఎవరు మేయర్ అవుతారనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణాయక విధానాలపై రాజకీయ పార్టీల్లోనూ సర్వత్రా చర్చ జరుగుతోంది. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా అవతరించిన నేపథ్యంలో తొలి మేయర్గా ఎవరు కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారనే చర్చ జరుగుతుంది. ఈలోగా వారం పది రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. దీంతో రిజర్వేషన్లు మారుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో నల్లగొండ కార్పొరేషన్కు తొలి మేయర్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గతంలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా.. నల్లగొండ మున్సిపాలిటీకి 1995లో చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వు కావడంతో బీజేపీ నుంచి బోయినపల్లి కృష్ణారెడ్డి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత 2000లో బీసీ జనరల్ అయింది. అప్పుడు పుల్లెంల వెంకట్నారాయణగౌడ్ కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 32 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2005లో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ తిరిగి జనరల్ అయింది. అప్పుడు కూడా పుల్లెంల వెంకట నారాయణ గౌడ్కే చైర్మన్ పదవి దక్కింది. ఆ సమయంలో 36 వార్డులు ఉండేవి. ఆ తర్వాత 2014లో రిజర్వేషన్ జనరల్ మహిళకు అయింది. అయితే బీసీ మహిళ అయిన బొడ్డుపల్లి లక్ష్మి కాంగ్రెస్ నుంచి చైర్మన్ అయ్యారు. అప్పట్లో 40 వార్డులు ఉండేవి. ఆ తరువాత 2020లో ఓసీ జనరల్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మందడి సైదిరెడ్డి చైర్మన్ అయ్యారు. అప్పుడు 48 వార్డులు అయ్యాయి. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్రెడ్డి చైర్మన్ అయ్యారు. రాజకీయ పార్టీల్లో చర్చ మొదటిసారి కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. రిజర్వేషన్ల మార్పు తప్పనిసరి అనే సంకేతాలు రావడంతో మొదట ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చ సాగుతోంది. మొన్నటి వరకు పాత రిజర్వేషన్లు ఉంటాయని అంతా భావించారు. తాజాగా రిజర్వేషన్లు మారుతాయనే అంశం స్పష్టం కావడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మొదటిసారి మేయర్ రిజర్వేషన్ ఎవర్ని వరించనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. నల్లగొండ కార్పొరేషన్ రిజర్వేషన్పై ఉత్కంఠ ఫ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే విధానంపైనే సర్వత్రా చర్చ ఫ రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేయనున్న సర్కారు ఫ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఆసక్తి ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీ కాాకుండా 9 కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనే కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. డివిజన్లు, వార్డులు మాత్రం కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పరిధిలోనే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది. దీంతో రాష్ట్ర యూనిట్ రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో ఈ రిజర్వేషన్ మారనుంది. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయంపైనే నల్లగొండ మేయర్ రిజర్వేషన్ జరగనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. మేయర్గా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నందున మొదట జనరల్కు అవకాశం ఇస్తారా.. లేక బీసీలకా, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది. -
ఎనిమిది వార్డుల్లోనే డ్రెయినేజీలు
దేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు అంతర్గత రోడ్లపై పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా కేవలం 8 వార్డుల్లోనే అంతర్గత డ్రెయినేజీ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నచోట వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదనీటితో రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రస్తుతం పట్టణంలోని పలు చోట్ల నూతనంగా చేపట్టిన డ్రెయినేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. -
మురుగుమయం.. దోమలకు నిలయం
హాలియా : హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో ఓపెన్ డ్రెయినేజీలు నిండిపోయి వరదంతా కాలనీలను ముంచెత్తుతోంది. పట్టణంలోని పలు వార్డులో డ్రెయియినేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది 15 రోజలకోసారి తొలగిస్తుండడంతో దుర్గంధంగా మారి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శాంతినగర్లో డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే పారుతోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. -
నీలగిరిని స్మార్ట్ సిటీగా మారుస్తా..
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని కాంగ్రెస్ కై వసం చేసుకునేలా అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్–2 పథకం కింద రూ.1.45కోట్లతో నిర్మించిన తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అనంతరం రూ.3.14కోట్లతో చేపట్టిన వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, లెప్రసీ కాలనీలో రూ.3కోట్లతో సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. లతీఫ్సాబ్గుట్ట వద్ద రూ.50లక్షలతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ–2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి నల్లగొండ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య, నారగోని నవీన్కుమార్గౌడ్, కమిషన్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం రామగిరి(నల్లగొండ): రైతులకు నాణ్యమైన విద్యు త్ అందించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం దోనకల్లులో నిర్మించిన 33 కేవీ సబ్స్టేషన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కోమటిరెడ్డి పృథ్వీధర్రెడ్డి, దోనకల్, పాతూరు సర్పంచ్లు కొత్తపల్లి సునితమధు, దోటి పద్మపరమేశ్ పాల్గొన్నారు. ఫ తొలి మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
వేధిస్తున్న సిబ్బంది కొరత
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణంలో మొత్తం 20 వార్డుల్లో మెయిన్ రోడ్డులో బాబాసాహెబ్గూడెం నుంచి పటేల్నగర్ వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినీజీ నిర్మించారు. మిగతా అన్ని వార్డుల్లో ఓపెన్ డ్రెయినేజీలే ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది 71 మంది ఉన్నారు. జనాభా పరంగా మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బంది కొరతతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని వార్డుల్లో డ్రెయినేజీల్లో ముగురు పేరుకుపోయి దుర్వాసనమయంగా మారాయి. -
మ్యాన్హోల్ నిర్మాణం అస్తవ్యస్తం
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలోని కాలనీలు డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట వేసిన డ్రెయినేజీ పైపులు.. ఇళ్ల నుంచి వచ్చే మురుగు పైపుల కంటే మ్యాన్హోల్స్ ఎత్తులో నిర్మించారు. దీంతో మురుగునీరు వాటిలోకి పోలేని పరిస్థితి. మూడున్నరేళ్ల క్రితం హిల్కాలనీ, పైలాన్ కాలనీలో 70శాతం సీసీ రోడ్లు వేయడంతో చాలా వరకు డ్రెయినేజీలు పూడిపోయినా వాటిని పునరుద్ధరించలేదు. సాగర్ డ్యాం కాలనీలు ఎత్తులో ఉండడంతో డ్రెయినేజీల నిర్మాణం సాధ్యపడడం లేదు. దీంతో ఆయా కాలనీల్లోని వీధుల్లో మురుగు ప్రవహిస్తోంది. -
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం
నల్లగొండ : రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఏ.సురేంద్రమోహన్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనన్నారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో యాసంగి పంటలకు యూరియా కొరత లేదని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా అందరికీ అందుతుందన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, డీసీఓ పత్య నాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, హార్టికల్చర్ అధికారి సుభాషిని తదితరులు పాల్గొన్నారు. పారదర్శకతకోసమే యూరియా బుకింగ్ యాప్ నకిరేకల్ : రైతులకు యూరియా సరఫరాలో పారదర్శకత కోసమే యూరియా బుకింగ్ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ చెప్పారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టాకాని రైతులు కూడా యూరియా పొందవచ్చన్నారు. రెండు దఫాలుగా ఇచ్చే విధంగా చూడాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ -
పేరుకుపోతున్న మురుగు
చండూరు : చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో 7వ వార్డులోని ఒకేఒక్క కాలనీ తప్ప అంతటా 8.29 కిలోమీటర్ల ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్ధ ఉంది. డ్రెయినేజీలు శ్రుభం చేసేందుకు వార్డుకు ఇద్దరు చొప్పున 20 మందిని నియమించారు. వీరికితోడు ఐదుగురు వాహన డ్రైవర్లు ఉన్నారు. అయితే సరిపడా సిబ్బంది లేక వారానికోసారి మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. అంతటా ఓపెన్ డ్రెయినేజీలు కావడంతో అందులో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాఽలు పడేస్తున్నారు. వర్షాకాలంలో డ్రెయినేజీలు నిండి మురుగునీరు రోడ్లు, వీధుల్లో పారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను సుమారు 500పైగా ఉన్న ఓపెన్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయి. బంగారుగడ్డ, హనుమాన్పేటలో ప్రధాన నాలాలు కొన్నిచోట్ల ఆక్రమణకు గురై రెండు ఫీట్ల మేరకే ఉన్నాయి. బంగారుగడ్డ నుంచి వచ్చే ప్రధాన నాలాలోకి సమీప గృహాల వారు మరుగుదొడ్ల పైపులు వదిలివేయడంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాలాలు చాలాచోట్ల ధ్వంసం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలు లేక ప్రమాదకరంగా మారాయి. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. -
మొదలైన సంక్రాంతి రద్దీ
కోదాడరూరల్ : సంక్రాంతికి వారం రోజులు ముందు నుంచే ఏపీ వైపు వాహనాల రద్దీ మొదలైంది. గురువారం హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కోదాడ మండలం కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్రోడ్ వరకు క్రాసింగ్ల వద్ద పోలీసులు ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాసింగ్ను మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న కొమరబండ వైజంక్షన్, రామాపురం క్రాస్రోడ్ వద్ద ట్రాఫిక్జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
నత్తనడకన అండర్పాస్ల నిర్మాణం
ఫ తూప్రాన్పేట నుంచి రెడ్డిబావి వరకు అన్ని జంక్షన్లను పోలీసులు నియంత్రణలోకి తీసుకుని ఇష్టానుసారంగా వాహనాలు హైవే పైకి వెళ్లకుండా చేస్తే వాహనాల రద్దీని నియంత్రించవచ్చు. ఫ సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు ఉన్న గ్రామాల్లో జంక్షన్లను మూసివేయాలి. ఫ చౌటుప్పల్లోని తహసీల్దార్ కార్యాలయం ముందున్న దర్గా వద్ద రాంగ్రూట్లో వాహనాల రాకపోకలు ఆపేయాలి. ఫ స్థానికులు ఫుట్ఓవర్ బ్రిడ్జిల మీదుగా హైవే దాటేలా చూడాలి. ఫ హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన బారికేడ్లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి వాహనాలు బారులుదీరుతాయి. ప్రస్తుతం ఈ హైవేపై చౌటుప్పల్, చిట్యాల పట్టణ కేంద్రాల్లో చేపట్టిన అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది సమస్య మరింత జఠిలంగా మారే అవకాశాలు ఉన్నాయి. చౌటుప్పల్, చిట్యాల : హైవేపై చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గతేడాది జూలైలో అండర్పాస్ బ్రిడ్జి పనులు చేపట్టారు. వాహనాలను మళ్లించేందుకు నవోదయ టాకీస్ నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఏడాదిన్నర అవుతున్నా 40శాతం కూడా పనులు పూర్తవ్వలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించే అవకాశాలు ఉండగా.. ఇప్పటికే సర్వీస్ రోడ్లు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదే రోడ్ల మీదుగా వాహనాలను పంపిస్తే మాత్రం ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరంగా రోడ్డు అంచులు సర్వీస్ రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైవేకు, సర్వీస్ రోడ్డుకు మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్ను తొలగించారు. సర్వీస్ రోడ్డుతో పోలిస్తే హైవే ఒకటి నుంచి రెండు ఫీట్ల ఎత్తులో ఉంది. వాహనదారులు ఏమాత్రం రోడ్డు చివరకు వెళ్లినా సర్వీస్ రోడ్డులోకి వాహనం బోల్తా పడే అవకాశం ఉంది. చిట్యాలలోనూ నెమ్మదిగా.. చిట్యాల పట్టణంలోనూ పాల శీతలీకరణ కేంద్రం నుంచి ఎస్బీఐ వరకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదేవిధంగా పెద్దకాపర్తి వద్ద కూడా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వెళ్లే వాహనాదారులకు ఇబ్బందులు ఏర్పడి ట్రాఫిక్ జాం అవుతోంది. చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు పంపిస్తున్నారు. దీంతో దుమ్ము, ధూళితో సర్వీస్ రోడ్డులోని దుకాణాదారులతో పాటు దిచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ● చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్పాస్ వద్ద రోడ్డు దెబ్బతినటంతో పాటు నీరు ఉబికి వస్తుంది. ● చిట్యాల నుంచి ఆటోనగర్, ఉరుమడ్ల రోడ్డు నుంచి బస్టాండ్కు వచ్చేందుకు స్థానికులు రాంగ్రూట్లో రాకపోకలు కొనసాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● చిట్యాల మండల పరిధిలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పలు చోట్ల ధ్వంసమైంది. ● హైవేకి ఇరువైపులా హోటల్స్, దాబాలు, టిఫిన్ సెంటర్లు టీ పాయింట్లు ఉండగా.. అక్కడ ఆగిన వాహనదారులు ఒక్కసారిగా హైవే మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ● హైవేపై ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండడంతో అజాగ్రత్తగా వచ్చే వాహనదారులు వాటిని ఢీకొంటున్నారు. ● ప్రమాదాల నివారణకు, పండుగ రద్దీని నియంత్రించేందుకు చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. చిట్యాల : సర్వీస్ రోడ్డులో ఎదురెదురుగా వెళ్తున్న వాహనాలుచౌటుప్పల్ : బస్టాండ్ ఎదుట ప్రమాదకరంగా హైదరాబాద్–విజయవాడ హైవే అంచుచౌటుప్పల్ : వ్యవసాయ మార్కెట్ వద్ద అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు ఫ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాంతో వాహనాల బారులు ఫ సంక్రాంతికి వెళ్లే నగరవాసులకు తప్పని తిప్పలు -
భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం సవాల్తో కూడినది
రామగిరి(నల్లగొండ): భారత ఆర్థిక వ్యవస్థను 40 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం సవాల్తో కూడినదని హైదరాబాద్లోని ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధాకర్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆర్సీ, పీఎం ఉషా ఆర్థిక సహకారంతో ‘వికసిత్ భారత్–2047 స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనా వ్యాసాలు సమర్పించారు. అనంతరం సావనీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ప్రొఫెసర్ సీహెచ్. కృష్ణారెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ అడిషనల్ సీఓఈ కె. కృష్ణారెడ్డి, మునుస్వామి. మల్లేశం, బట్టు కిరీటం, నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, జ్యోత్స్న, హబీబ్, దినేష్, అంకుష్, నాగరాజు, హస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికమోత్కూరు : మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సీహెచ్. శ్రవణ్కుమార్, మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మనోజ్ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు షూటింగ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య గురువారం పేర్కొన్నారు. -
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న తుమ్మడం సర్పంచ్
నిడమనూరు : మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న మహిళా స్నేహపూర్వక పంచాయతీల జాతీయ సదస్సులో గురువారం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు విశేషాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. గ్రామ పంచాయతీల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలపై 2024–25 సంవత్సరానికి గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తుమ్మడం గ్రామ పంచాయతీ ఎన్నికై ందని, దీంతో కొత్తగా సర్పంచ్గా ఎన్నికై న తనకు పుణేలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుగురు సర్పంచులు, నలుగురు ఎంపీడీఓలు, స్థానిక సంస్థల స్పెషల్ సెక్రటరీ జాన్ వెస్లీ ఈ సదస్సుకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
సూక్ష్మపోషకాల లోపాన్ని నివారిస్తే అధిక దిగుబడులు
త్రిపురారం : పంటల పెరుగుదలకు సూక్ష్మపోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సూక్ష్మపోషకాల లోపం వలన నేలలు చౌడుగా మారి పంటల దిగుబడులపై ప్రభావం చూపుతుంది. రైతులు సాధ్యమైనంత మేర ఎరువులు వేసుకొని పంటలపై సూక్ష్మపోషకాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. సరైన సమయంలో చర్యలు చేపడితే సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఫ జింకు లోపం : జింకు లోపం ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అపరాల్లో అధికంగా కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం భాస్వరం ఎక్కువగా వేసిన పొలాలు, చౌడు నేలలు, మాగకుండా సేంద్రీయ పదార్థాలు అధికంగా వినియోగించిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం వలన వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్కపై నుంచి 3 లేదా 4 ఆకుల నడుమ ఈను తెల్లగా పాలిపోతుంది. ఆ తర్తా ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిపార్లు ఏవిధమైన లోపాలు కనిపించకున్నా.. నత్రజని, భాస్వరం, తగినంత మోతాదులో వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల నడుమ ఈనెకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. పప్పుధాన్యాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. లేత ఆకుపచ్చ మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కనువులు దగ్గరగా ఉండి మొక్కల పెరుగుదల ఆలస్యంగా పెరుగుతుంది. ఫ నివారణ చర్యలు సాధారణ నేల్లో మూడు పంటలకు ఒకసారి.. కొత్తగా ఆయకట్టు కింద సాగుచేసే నేలల్లో, చౌడు, ఉప్ప నేలల్లో రెండు పంటలకు ఒకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి. పంటలో జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ను కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని 2 నుంచి 3 సార్లు ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి పంటకు ముందు వేస్తే జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఫ ఇనుము లోపం : ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో లేదా సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో కనిపిస్తుంది. ఇనుము లోపం వరిలో మెట్ట నారు మడుల్లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతాయి. లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. నివారణ చర్యలు పంటల్లో ఇనుము లోపం గుర్తించినప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల అన్నబేదిని ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిసేలా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఫ బోరాన్ లోపం : వరిలో బోరాన్ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలల్లో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. బోరాన్ లోప స్థాయి లేదా విషమ స్థాయి మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటలకు బోరాన్ను అందించాలి. పత్తి పండించే నేలల్లో కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వ సాధారణంగా ఉంటుంది. ఫ నివారణ చర్యలుబోరాన్ లోపం నివారణకు ఎకరాకు రెండు కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు రెండుసార్లు 0.15 శాతం బోరాక్స్ను 60 లేదా 90 రోజులకు పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడు పూవ్వులల్లో మధ్యభాగం గింజ కట్టదు. వేరుశనగలో గింజ మధ్యభాగం తోడుకోదు. ఈ లోపాన్ని నివారించడానికి 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని ఒక లీటరు నీటికి కలిపి పంట వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువుల వినియోగించడం పెంచడం వల్ల భూమిలో సూక్ష్మపోషకాల లోపాన్ని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. నేలలోనే కాకుండా పంటపై కూడా లోపాలను సరిచేసుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి ఉపఝెగించడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని రైతులు గమనించాలి. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
మద్యం షాపు ఎదుట విద్యార్థుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్యం షాపు ఎదుట ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే మరో చోటుకు తరలించాలన్నారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఫ పాఠశాల సమీపంలో నుంచి తొలగించాలని డిమాండ్ -
హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు : మంత్రి
చిట్యాల: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న ఫ్లైఓవర్ పనులను గురువారం కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, హైవే పీడీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో హైవేపై జరుగుతున్న పనులను నిలిపివేసి, జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్హెచ్–65ను 8 లైన్లుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చిలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ప్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్ట్ హైవే రహదారిని నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట డీటీసీ వాణి, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను పాలకులుగా నిలబెడతాం
యాదగిరిగుట్ట: బీసీల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో బీసీలను పాలకులుగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మన ఆలోచన సాధన సమితి(మాస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభా ధామాషా ప్రకారం బీసీలకు వాటా దక్కించుకోవడం, రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా శిబిరాలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా మాస్ ముందుకు కదులుతుందన్నారు. మెజార్టీ ప్రజలకు రావాల్సిన రాజ్యాధికారం అందకుండా పోతుందని, పాలకులుగా కావాల్సిన వారు పాలితులుగానే ఉంటున్నారన్నారు. బీసీలంతా సైనికులుగా తయారై రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్నారు. రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ ఉద్యమం తీవ్రమైతుందని అన్నారు. దానిని ఆపటం ఎవరితరం కాదని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా నడిపించేందుకు బీసీలందరూ ఒక్కతాటి పైకి తీసుకురావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్కు బీసీలపై ప్రేమ ఉంటే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు బీసీలంటే చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు గడ్డం నర్సింహగౌడ్, పూస నర్సింహా బెస్త, సలహా మండలి సభ్యుడు తడక యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల ఆంజనేయులుగౌడ్, పంతంగి విట్టలయ్యగౌడ్, అధికార ప్రతినిధులు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, ఆవుల వెంకట్యాదవ్, సంగెం రమేశ్వర్ నేత, కోరంగి దుర్గారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బచ్చనబోయిన శ్రీనివాసులు, గోద మల్లికార్జున్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పెద్దవురా బ్రహ్మయ్య రజక, కొంపోజు నరహరిచారి, జక్కుల బాలరాజు యాదవ్, శ్రీకాంత్ గంగపుత్ర, నక్క కాాశినాథ్, చుక్కల సత్యనారాయణ, పవన్కుమార్, మరోజు రాజుచారి, నిమ్మల సత్యం, పెండం లక్ష్మణ్, వడ్డేపల్లి దశరథ సాగర్, కై రంకొండ నర్సింగ్, తిప్పరి లింబాద్రి, మురళీచారి, దశరథ్ రజక, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన ధరావత్ చాంప్లా(50) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. బుధవారం సాయంత్రం కొత్త వ్యవసాయ మార్కెట్లో చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతుడి కుమారుడు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి మృతిపెన్పహాడ్ : చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండల కేంద్రానికి చెందిన దాసరి కోటయ్య(50) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెట్టు కొమ్మలను మిషన్తో తొలగిస్తుండగా.. ప్రమాదశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాదాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతిభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలం పడమటిసోమారం మంలోని లింగ బసవేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ నెల 6న గుర్తుతెలియని మహిళ నవజాత ఆడ శివువును వదిలి వెళ్లగా.. గ్రామస్తులు గుర్తించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శిశువు మృతి చెందింది. శిశువు చలిలో ఉండటం వల్ల హార్ట్బీట్ తగ్గిందని, సీపీఆర్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హాకీ పోటీలకు ఎంపికై న రామన్నపేట విద్యార్థిరామన్నపేట : తమిళనాడులో ఈనెల 12 నుంచి జరిగే విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి హాకీ పోటీల్లో రామన్నపేట డిగ్రీ కళాశాల విద్యార్థి నోముల సాయికుమార్ పాల్గొననున్నాడు. గురువారం ఎంపిక ప్రక్రియలో సాయికుమార్ పాల్గొని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. ఆ జట్టు తరఫున ఆడనున్నాడు. -
మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి
ఫ మాజీ మంత్రి కేటీఆర్ చిట్యాల : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగే కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో చిట్యాలలో ఆయన కాసేపు ఆగారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కారులోంచి పార్టీ నాయకులకు అభివాదం చేస్తూ పార్టీ గెలుపుకోసం కష్టించి పనిచేయాలని సూచించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ను గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, పార్టీ మండల ప్రధానకార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మెండె సైదులు, కూరెళ్ల లింగస్వామి, కొలను వెంకటేష్, బొబ్బల శివశంకర్రెడ్డి, కందాటి రమేష్రెడ్డి, కొలను సతీష్, బోయపల్లి శ్రీను, అర్రూరి శ్రీశైలం, రాచకొండ క్రిష్టయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, బొంతల రామక్రిష్ణారెడ్డి, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కేరళ రాష్ట్రంలో ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరానికి –2026 ఎన్ఎస్ఎస్ వలంటీర్లను గురువారం ఎంపిక చేయనున్నట్లు ఎంజీ యూనివర్సిటీ జాతీయ సమన్వయకర్త మారం వెంకటరమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో వలంటీర్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లిష్, హిందీ, నాయకత్వ లక్షణాలు, కల్చరల్ అంశాల్లో ప్రతిభ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి రేబెల్లి రోహిత్పాటు మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్దార్ధ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, పద్మశెట్టి కోటేశ్వర్రావు, పిన్నబోయిన శ్రీనివాస్యదవ్, లింగంపల్లి చిరంజీవి, ఎండీ.షోయబ్, పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, సత్యనారాయణ, నాగభూషణం, దినేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. అలరించిన త్యాగరాజ కీర్తనలు రామగిరి(నల్లగొండ): త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను నల్లగొండ పట్టణంలోని రామాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు ఆలపించిన త్యాగరాజ స్వామి కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. పి.రవిశంకర్, ఎన్సి.పద్మ, జానకిరామనాథన్, గోవర్ధనం మానస, ఎన్వి.జానకి, గరిమెళ్ల శ్వేత కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎం.జనార్దనాచార్య, ఎంపీ.ఆచార్యచారి, చకిలం వేణుగోపాల్రావు, ముడుంబ లక్ష్మినాథ్, అనంతాచార్యులు, అక్కినేపల్లి శ్రీనివాసరావు, ప్రసాదరావు, రమాదేవి, జానకి పాల్గొన్నారు. -
చెత్త రీసైక్లింగ్ మొదలు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో చెత్త పడేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే మున్సిపల్ వాహనాలకు ఇస్తున్నారు. రోడ్ల వెంట వేసిన చెత్తను పందులు చిందర వందర చేస్తుండడంతో దుర్వాసన వస్తోంది. 48 వార్డుల నుంచి రోజుకు 100 మెట్రిక్ టన్నుల చెత్తను శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డులో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డంపింగ్ యార్డ్లో చెత్త కుప్పలను రీసైక్లింగ్ మిషన్ను ఇటీవల బిగించారు. ఇప్పటికే చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ పనులు మొదలు పెట్టారు. చెత్త రీసైక్లింగ్కు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే ఇక్కడ సమస్య తీరనుంది. -
చెత్తకుండీలుగా ఓపెన్ ప్లాట్లు..
దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని పలు కాలనీల్లోని ఓపెన్ ప్లాట్లు చెత్తకుండీలుగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ రోజూ 16 టన్నుల చెత్తను ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించి పట్టణ శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీలో 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాల్సి ఉండగా.. కేవలం 64 మంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో చెత్త సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో చెత్త రిసైక్లింగ్ యూనిట్ ఇంకా ప్రారంభం కాలేదు. -
చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ఇటీవల వివిధ రకాల చోరీలకు పాల్పడిన దుండగులను బుధవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. నేరస్తుల కదలికపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నేరస్తులు ప్రవర్తన మార్చుకోకపోతే.. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, రౌడీషీట్, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్ట్, రిమాండ్ వంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
పట్టణాలు అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణ అస్తవ్యస్తం చండూరు : చండూరు మున్సిపాలిటీలో చెత్త నిర్వాహణ వ్యవస్థ సరిగాలేదు. చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 2 ఆటోలు ఉన్నాయి. మెత్తం 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రోజు విడిచి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. చెత్తను శిర్ధేపల్లి రోడ్డులోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసేందుకు, కంపోస్ట్ ఎరువు తయారీకి షెడ్లు నిర్మించారు. కానీ వాటిని నిరుపయోగంగా వదిలేశారు. ఫ అంతటా రోజువిడిచి రోజు చెత్త సేకరణ ఫ అయినా చాలా చోట్ల వీధుల్లో దర్శనమిస్తున్న చెత్తాచెదారం ఫ నల్లగొండ డంపింగ్ యార్డులోనే రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం ఫ మిగతా చోట్ల చెత్తకు నిప్పు పెడుతున్న సిబ్బంది ఫ పొగ, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ 20 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల్లో రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ట్రాలీ ఆటోలు వినియోగిస్తున్నారు. సిబ్బంది 71 మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజూ టన్ను పైనే చెత్తను డంపింగ్ యార్డు తరిస్తున్నారు. నెల్లిబండ–నోముల శివారులోని డంపింగ్ యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. డంపింగ్ యార్డులో పారబోసి నిప్పుపెడుతుండటంతో పొగ, దూమ్ముతో పంట పొలాలు దెబ్బతినండంతో పాటు, పశువు గ్రాసం కూడా కాలిపోతోందని రైతులు వాపోతున్నారు. హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులకు గానే ఆరు ఆటోలు, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 7 టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. 51 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు విడిచి రోజు చెత్త సేకరణ సేకరిస్తుండడంతో వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. డంపింగ్ యార్డు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం ఉండటమే చెత్త సేకరణకు ప్రధాన సమస్యగా మారింది. చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో రోజుకు 10 టన్నులకు పైగానే చెత్తను సేకరించి శివనేనిగూడెం రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్యార్డు 1వ వార్డుకు సమీపంలో ఉండటంతో పొగతో, దుర్వాసనతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామం వెంకటాపురం(ఆరవ వార్డు)లో చెత్తను సేకరించి ఆ వార్డు శివారులోని గుంతలో పారబోస్తున్నారు. ప్రస్తుతం డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం సమస్య వేధిస్తుంది. -
రోడ్డు వెంట చెత్త కుప్పలు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనం ఇస్తోంది. కొంత మంది వ్యాపారులు చెత్త సేకరణ చేసే ఆటోలు, ట్రాక్టర్లలో వేయకుండా రోడ్లపైనే పడవేస్తున్నారు. ఇక ఈదులగూడెం, రామచంద్రగూడెం, విద్యానగర్లో రోడ్లపైనే పశువులను కట్టేయడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. మొత్తం 278 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ 50 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో ఇటీవల రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
నల్లగొండ : రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కారం చూపాలన్నారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా.. ధ్రువీకరణ పత్రాలు అందజేయాలన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటివరకు 61 శాతం పూర్తయిందని.. దీన్ని 75 శాతానికి తీసుకెళ్లేందుకు నిత్యం బీఎల్ఓలతో సమీక్షించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ఓటరు జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేవంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, అదికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
అక్రమ పట్టా రద్దు చేయాలి..
నాకు నలుగురు కుమార్తెలు. నా పేరున ఉన్న 7 ఎకరాల 18 కుంటల భూమిని నాకు తెలియకుండానే పెద్ద కూతురు మోదుగు విజయ 3.32 ఎకరాలు, 4వ కూతురు యాట జయలక్ష్మి 3.22 ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నారు. ఆ పట్టాను రద్దు చేయాలని గతంలో ఆర్డీఓకు విన్నవించాం. ఏడు నెలలు గడిచింది. అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. మీరే న్యాయం చేయాలని కలెక్టర్ను కోరింది. స్పందించిన కలెక్టర్ ఆ పట్టాను బ్లాక్లో పెట్టి ఫైల్ పుటప్ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. – సుశీలమ్మ, పెర్కకొండారం, శాలిగౌరారం మండలం నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త రాజశేఖర్ ఇటీవల చనిపోయాడు. ఆయన పేరున, మా అత్తగారి పేరున భూమి ఉంది. నా భర్త చనిపోవడంతో మా అత్త, ఆడపడుచులు నన్ను వారింటికి రావద్దని వెళ్లగొట్టారు. ముగ్గురు ఆడ పిల్లల్లో ఓ పాపకు 7 నెలలు. భూమి ఇవ్వకుండా.. ఇంటిని రానివ్వకపోతే నేను ఎలా బతకాలి. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి. – గాదరి శృతి, బాలింత, బొడంగిపర్తి, చండూరు మండలం -
ఓటరు జాబితాపై నివేదిక ఇవ్వాలి
నల్లగొండ : మున్సిపాలిటీల్లో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై సంబంధిత మున్సిపల్, మండలాల ప్రత్యేక అధికారులు సమీక్షించి తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్దేశించిన ప్రొఫార్మలో నివేదిక సమర్పించాలని సూచించారు. నూతన సర్పంచ్లకు శిక్షణ ఇచ్చేందుకు నల్లగొండలో రెండు వేదికలను గుర్తించామని తెలిపారు. ఇకనుంచి నెలకోసారి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వేర్వేరుగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓలు పాఠశాలలను తనిఖీ చేయాలి నల్లగొండ : ఎంఈఓలు వారి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను నెలకోసారి తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అమలు చేస్తున్న పీఎం శ్రీ పాఠశాలలు, టాయిలెట్స్ అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు అనుమతి లేకుండా ఉపాధ్యాయులు, ఎంఈఓలు సెలవుపై వెళ్లవద్దన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడంలో భాగంగా హెడ్మాస్టర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలకు మంజూరు చేసిన నిధులన్నీ సద్వినియోగమయ్యాలా చూడాలన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి పాఠశాలలో వాల్ను ఏర్పాటు చేసి వారికి నచ్చిన విధంగా బొమ్మలు వేసేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలను అర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఎంఈఓలు అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
గోడు వినండి.. గోస తీర్చండి
నల్లగొండ : మా గోడు విని.. మా సమస్యలు పరిష్కరించాలని పలువురు బాధితులు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ వినతులు స్వీకరించారు. భూములు అక్రమంగా పట్టా చేయించుకున్నారని, పింఛన్లు రావడం లేదని తదితర సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. సమస్యలను విన్న కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫ గ్రీవెన్స్కు తరలి వచ్చిన బాధితులు ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు
నల్లగొండ : జిల్లాలోని మైనర్, మేజర్ కల్వర్టుల నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్అండ్బీ శాఖకు సంబందించి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి నుంచి నల్లగొండకు వచ్చే ఆర్అండ్బీ రోడ్డులో 14/912 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.10 కోట్లు అదే రోడ్డులోని 22/727 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ. 4.90 కోట్లు, 23/8–10 కిలోమీటర్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.5.20 కోట్లు, 24/477 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.85 కోట్లు, 27/273 కి.మీ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.95 కోట్లును ప్రభుత్వం విడుదల చేసింది. వాటిని పనులను వెంటనే ప్రారంభించాలని చీఫ్ ఇంజనీర్కు ఆదేశాలు అందాయి. నేడు ఫుడ్ లైసెన్స్ మేళానల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన నల్లగొండలో ఫుడ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫుడ్సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపార సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. హోటల్స్, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, బేకరీలు, కిరణాదుకాణాలు, మాంసం, చేపలు విక్రయ కేంద్రాలు, పాల, పాల ఉత్పత్తుల వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, వీధి ఆహార విక్రేతలు, క్యాటరింగ్ చేసే వ్యాపారులు తప్పకుండా ఈ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈనెల 6న నల్లగొండలోని బీటీఎస్ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మేళా ఉంటుందని తెలిపారు. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల రద్దుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్, జాతీయ విత్తనం, విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ నకిరేకల్లోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాాల సమావేశాల్లో అప్రజాస్వామికమైన ఐదు చట్టాలను చేసి రైతులకు, కార్మికులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందాల ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు, చింతపల్లి బయ్యన్న, జిట్టి నగేష్, పెంజర్ల సైదులు, రాచకొండ వెంకన్న, వంటెపాక వెంకటేశ్వర్లు, బొమ్మకంటి కొమరయ్య, సిలివేరు ప్రభాకర్, అంబటి చిరంజీవి, మల్లం మహేష్, కాశీరాం, బొల్లికొండ లింగయ్య, జిట్ల సరోజ, చింతపల్లి లూర్దు, కోట లింగయ్య, సాకుంట్ల నర్సింహ, వంటెపాక కృష్ణ పాల్గొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపించిన అర్చకులు, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణాన్ని నేత్రపర్వంగా చేపట్టారు. వీటితో పాటు బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర పూజలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఓట్లు అక్కడ!
మేము ఇక్కడ.. మున్సిపాలిటీల్లో ఎందుకిలా? ఫ తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా ఫ ఒక వార్డులో నివాసం ఉంటే.. మరో వార్డులో ఓట్లు ఫ ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి.. ఫ సరిచేయాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులుతప్పుల తడకగా మున్సిపల్ ఓటర్ల జాబితా రూపొందించారంటూ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల నేతలతో ముసాయిదా ఓటరు జాబితాపై సోమవారం మున్సిపల్ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఒక వార్డులో ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయని వాటిని సరి చేయాలంటూ కమిషనర్ల దృష్టికి తీసుకురాగా వార్డు హద్దుల ప్రకారం ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది. ఒక వార్డులో నివాసం ఉంటే మరో వార్డులోకి ఓట్లు మారిపోయాయి. ఒకే ఇంట్లోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయాయి. పలుచోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటిని సరి చేయాలంటూ కమిషనర్లకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. 18 మున్సిపాలిటీలు.. 1556 ఫిర్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఇంకా ముగియలేదు. దీంతో నికిరేకల్ మినహా.. మిగతా 18 మున్సిపాలిటీల్లో ఈ నెల 1వ తేదీన వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రచురించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. దీంతో ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఒక వార్డులో ఓటర్లను, మరో వార్డులో చూపించడంతో కొందరి పేర్లు తప్పుగా దొర్లడం, మరికొందరి ఓట్లే కనిపించకుండా పోవడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందజేశారు. సోమవారం సాయంత్రం వరకు 1,556 ఫిర్యాదులు మున్సిపల్ కమిషనర్లకు అందాయి. చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికం ఉమ్మడి జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా అభ్యంతరాలు వచ్చాయి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులపై 258 ఫిర్యాదులు అందాయి. ఆ తరువాత అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 238 ఫిర్యాదులు వచ్చాయి. వాటితోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ తమ వార్డులు మారిపోయాయని, తాము ఒక చోట ఉంటే మరొక వార్డులో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఇక తక్కువగా అభ్యంతరాలు మోత్కూర్ మున్సిపాలిటీలో (రెండే) వచ్చాయి. పలు చోట్ల ఓట్లు గల్లంతైనా వాటిపై అధికారులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఓటర్లు వాపోయారు. -
లోకల్ లారీలకు లోడింగ్ ఇవ్వాలి
చిట్యాల : స్థానికంగా ఉన్న లారీలకు లోడింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని ఎంపీఎల్ లాజిస్టిక్ ఎదుట లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిట్యాల లారీ అసోసియేషన్ పరిధిలో చాలా మంది జీవనోపాధి పొందుతున్నారని.. ఇలాంటి సమయంలో ఎంపీఎల్ పరిశ్రమ యాజమాన్యం తమ లారీలకు అవకాశం కల్పించకపోవటంతో జీవనోపాధి కష్టమవుతుందని, లారీల నెలవారి ఈఎంఐలు కట్టె పరిస్థితి కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లారీలకు రవాణా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీఎల్ లాజిస్టిక్ డైరెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ వస్తువుల రవాణాకు అనుమతులున్నాయని ఆ మేరకు సోమవారం గోదుమల లోడుతో వచ్చిన రైల్వే వ్యాగన్ల నుంచి పరిశ్రమకు చెందిన టిప్పర్లలో రవాణా చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక లారీలకు రవాణా కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పరిశ్రమ ఎదుట భీష్మించారు. దీంతో చిట్యాల ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకుని భద్రతను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి పరిశ్రమ యాజమాన్యంతో.. లారీ యజమానులకు ఒప్పందం కుదిరింది. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, అధ్యక్షుడు పాటి దివాకర్రెడ్డి, ప్రధానకార్యదర్శి అక్కెనపల్లి గణేష్, కోశాధికారి గురిజ జంగయ్య, కంచర్ల యాదయ్య, వెంకన్న, బొడ్డు యాదయ్య, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీఎల్ పరిశ్రమ ఎదుట లారీ ఓనర్లు, డ్రైవర్ల ధర్నా యాజమాన్యంతో చర్చలు సఫలం -
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
నల్లగొండ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని పోప్పాల్ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని పాటిస్తే భవిష్యత్లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ వినియోగించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, రిటైర్డ్ సీఐ అంజయ్య, ప్రిన్సిపాల్ రవి, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు. -
అమ్మ భాష మెరిసేలా..
పిల్లల్లో తెలుగు పఠనాసక్తిని పెంచేందుకు ఆచార్యులగూడెం జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. - 8లోఈ ఫొటోలోని వ్యక్తి కొలిశెట్టి శ్రీకాంత్. సూర్యాపేట మున్సిపాలిటీలోని 16వ వార్డు శ్రీరామ్నగర్లో నివాసం ఉంటారు. ఇంట్లో ఐదుగురు ఉంటారు. గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 16వ వార్డులోనే ఓట్లు వేశారు. ఇప్పుడు కుటుంబంలోని ఐదుగురి ఓట్లు 32వ వార్డులోకి మారాయి. తమ ఓట్లను మరో వార్డులోకి ఎలా మార్చుతారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఫిర్యాదుల సంఖ్య నల్లగొండ 139 నేరేడుచర్ల 98 హాలియా 105 దేవరకొండ 64 చండూరు 26 మిర్యాలగూడ 106 తిరుమలగిరి 17 మోత్కూర్ 02 హుజూర్నగర్ 197 ఆలేరు 23 భువనగిరి 45 పోచంపల్లి 21 కోదాడ 131 సూర్యాపేట 238 నందికొండ 18 చిట్యాల 258 చౌటుప్పల్ 12 యాదగిరిగుట్ట 56మున్సిపాలిటీల వారీగా వచ్చిన ఫిర్యాదులు ఇలా -
వెల్నెస్.. మందులు లెస్!
నాలుగు నెలల నుంచి పూర్తిగా మందులు ఇవ్వడం లేదు. బీపీ, షుగర్ మందులు కూడా లేవు. డాక్టర్ రాసిన మందుల్లో సగం కూడా ఇవ్వలేదు. రెండు గంటలు కూర్చున్నా రెండు మూడు ట్యాబ్లెట్లు ఇచ్చి మిగతావి లేవని చెపుతున్నారు. మిగతా వాటిని బయట కొనాల్సివస్తోంది. – అనంతరెడ్డి, పెద్దసూరారంనల్లగొండ టౌన్ : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీరడం లేదు. నాలుగు నెలులుగా పూర్తిస్థాయిలో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ డాక్టర్ సూచించిన ప్రిస్కిప్షన్లోని సగం మందులు కూడా ఇవ్వడం లేదు. కనీసం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, జ్వ రం, జలుబు తదితర రోగాలకు సంబంధించిన మందులు కూడా లేవు. వెల్నెస్ సెంటర్ నిర్వహణను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చేపట్టగా.. కొన్ని నెలలుగా డీఎంఈ పరిధిలోకి వచ్చింది. అప్పటినుంచి మందులు పూర్తిస్థాయిలో రావడం లేదని తెలుస్తోంది. ప్రైవేట్ దుకాణాల్లో కొనాల్సిందే.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన హెల్త్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు నల్లగొండలోని వెల్నెస్ సెంటర్కు రోజూ వందల మంది వస్తుంటారు. ఇక్కడ కేవలం జనరల్ మెడిసిన్, డెంటల్ వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. ఇతర వ్యాధులకు సంబంధించిన బయట వైద్యులు పరీక్షించి రాసిన మందులను కూడా అందజేస్తారు. కానీ గత నాలుగు నెలలుగా వెల్నెస్ సెంటర్లో మందులు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల హెల్త్కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి తప్పని నిరీక్షణ వెల్నెస్ సెంటర్కు వచ్చే కార్డుదారులలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లోని మందులను తీసుకోవడానికి రెండు నుంచి మూడు గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. ఫార్మసీలో ముగ్గురు సిబ్బందికిగాను ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తోంది. ఆమెఒక్కో కార్డుదారుకు మందులు ఇవ్వాలంటే పది నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. దీంతో మందుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయినా కేవలం సగం మందులే ఇస్తుండడంతో వాటిని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఫ వెల్నెస్ సెంటర్లో నాలుగు నెలలుగా మందుల కొరత ఫ దీర్ఘకాలిక రోగులకు తప్పని అవస్థలు -
కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
నల్లగొండ టౌన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆశ వర్కర్లు డ్యూటీలకే పరిమితం కాకుండా ప్రభుత్వం నిర్వహించే అనేక రకాల పథకాలను ప్రజల దగ్గరికి చేర్చే పనిలో కూడా ఉన్నారన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరి, వెంకటమ్మ, ఏర్పుల యాదయ్య, అవుట రవీందర్, అనురాధ, కవిత, సైదమ్మ, స్వర్ణ, శైలు, ధనమ్మ, సుజాత, పద్మ, మంజుల, సౌజన్య, వెంకటమ్మ, విమల, పుష్పలత పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు -
నా భూమిని ఆక్రమించారు
గ్రామంలో సర్వే నెంబర్ 257లో 10 గుంటల భూమి ఉంది. గ్రామానికి చెందిన మెగావత్ రాయమల్లు నా భూమిని ఆక్రమించుకుని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు పక్షవాతం వచ్చి నడవలేకపోతున్నాను. గతంలో అధికారులను కలిసినా నాకు న్యాయం జరగలేదు. నా భూమి నాకు ఇప్పించాలి. – ఖాజా, పంగవానికుంట, అనుముల మండలం నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేస్తున్నాం. మాకు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదు. ఈ విషయమై అడిగితే కళాశాల ప్రిన్సిపాల్ను మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఏజెన్సీ వారు రేపు, మాపు అంటూ ఏడు నెలలుగా జరుపుతున్నారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉంది. జీతాలు ఇప్పించాలి. – శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్ కళాశాల, నల్లగొండ -
పనిచేసే నాయకులు ప్రజల హృదయాల్లో నిలుస్తారు
గరిడేపల్లి: ప్రజల కోసం పనిచేసే నాయకులు చనిపోయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారని సీపీఐ జాతీయ నాయకుడు, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో సీపీఐ నాయకుడు పోటు ప్రసాద్ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కమ్యూనిజం లేకుండా చేస్తామని మోదీ, అమిత్షా అంటున్నారని, కమ్యూనిజాన్ని అంతమొందించడం అంత సులువు కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వెనుజులా దేశంపై అమెరికా చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, హేమంతరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, దండి సురేష్, రాజేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, పోటు రంగారావు, గన్న చంద్రశేఖర్, ధనుంజయనాయుడు, రాములు, నారాయణరెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, సృజన, కంబాల శ్రీనివాస్, నంద్యాల రామ్రెడ్డి, సాయిబెల్లి, కళావతి, బాబు, కడియాల అప్పయ్య, సర్పంచ్లు కట్ట కళ్యాణి, పద్మ, పూర్ణచంద్రరావు, పున్నయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
వలిగొండ : లారీ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వలిగొండ మండలం నర్సాపురం గ్రామం పరిధిలోని బోడబండగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్ (19), దాచారం గ్రామానికి చెందిన బోల్ల దీక్షిత్ (21) స్నేహితులు. ఇద్దరు కలిసి బైక్పై భువనగిరికి వెళ్తుండగా నర్సాపురం గ్రామంలోని బోడబండగూడెం వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు లారీ టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ తెలిపారు. దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు మోత్కూరు : నర్సాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల స్వగ్రామాలైన మోత్కూరు మండలం దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరు ఇరు కుటుంబాల్లో ఏకై క కుమారులు కావడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. నాడు పిడుగుపాటుతో తండ్రి.. నేడు రోడ్డు ప్రమాదంలో కుమారుడు.. దాచారం గ్రామానికి చెందిన బోళ్ల సంపత్– విజయ దంపతులకు కుమారుడు దీక్షిత్ (21), కుమార్తె జస్విక ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం స్వగ్రామంలో చింత చెట్టు కింద ఉన్న సంపత్ పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ కింద నైట్ వాచ్మెన్గా పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. దీక్షిత్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నాడు భర్త సంపత్ పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో ఆ బాధ నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కుమారుడు దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఏకై క కుమారుడిని కోల్పోవడంతో.. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుమారుడు సాయికిరణ్ డిగ్రీ వరకు చదివాడు. కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేశాడు. కుటుంబానికి అండగా నిలబడతాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి అక్కాచెల్లెళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో ఒక్కగానొక్క కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు ప్రజలను కలిచివేశాయి. -
ప్రతిఒక్కరి కంటి సమస్యను తీరుస్తా
మునుగోడు: నియోజకవర్గంలోని ప్రతిఒక్కరి కంటి సమస్యను పరిష్కరిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 11వ విడుత ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లోని అనేక మంది నిరుపేదలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకొలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వారందరికీ తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన 10 శిబిరాల్లో 7,806 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1490 మందికి ఆపరేషన్లు చేయించినట్లు చెప్పారు. అవసరమైతే మునుగోడులో అన్ని సౌకర్యాలతో ప్రత్యేక కంటి ఆస్పత్రి నిర్మాణం చేపట్టి నల్లగొండ జిల్లాలోని పేద ప్రజలందరికీ వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నారబోయిన రవి, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారయణ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పాల్వాయి జితేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి -
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
చిట్యాల: చిట్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి (ముప్ప నర్సింహా రెడ్డి) (84) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, జియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు భూదాన్పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య భారతి, కుమార్తె అర్పిత, అల్లుడు గోపాల్రెడ్డి(మద్యప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరి) ఉన్నారు. ఎంఎన్ రెడ్డి మనవడితో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తెతో వివాహమైంది. ఎంఎన్.రెడ్డి మృతదేహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాళులర్పించారు. చిట్యాల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎంఎన్.రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. పలువురి సంతాపంభూదాన్పోచంపల్లి: మండలంలోని జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి మృతి పట్ల ఆదివారం సంస్థ చైర్మన్ కిషోర్రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, వైఎస్ చక్రవర్తిస్వామి, అధ్యాపకులు సంతాపం తెలిపారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంచిట్యాల: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డులను ఆదివారం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిన మొత్తాన్ని, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో సుమారుగా రూ.30కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామం, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాజ్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీంధర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, జిట్ట బొందయ్య, కందాటి రమేష్రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, అమరోజు నవీన్కుమార్, విఠల్రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గురుకులం పిలుస్తోంది!
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 11, 2025 దరఖాస్తులకు గడువు : జనవరి 21, 2026 ప్రవేశ పరీక్ష : ఫిబ్రవరి 22, 2026 పూర్తి వివరాలు: టీజీసెట్.సీజీజీ.జీవోవీ.ఇన్ ఐదో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ 21వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం పెద్దవూర: తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్డబ్ల్యూఆర్ఈ ఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 11వ తేదీన ప్రారంభంకాగా.. ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష రుసుం రూ.100లు ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు సూచనలు ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతుండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి గాను వరుసగా ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదువుతుండాలి. ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఓసీ, బీసీ, బీసీ మైనారిటీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వరుసగా ఓసీ, బీసీ, బీసీ మైనారిటీలకు 10 నుంచి 15 ఏళ్ల మద్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణం ప్రాంతం వారికి రూ.1,50,000లు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలకు మించకూడదు. ప్రవేశ పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులలో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నంటాయి. విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్నట్లుగా, ఆరో తరగతిలో 5వ తరగతి, 7వ తరగతిలో 6, 8వ తరగతికి 7వ, 9వ తరగతికి 8వ తరగతి చదువుతున్నట్లు సంబంధిత పాఠశాల నుంచి బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్ను దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఎంపికకు ఉమ్మడి జిల్లాను యూనిట్గా పరిగణిస్తారు. ఇతర సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 1800 42545678ను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతో బోధన చేసి విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రత్యేకించి విద్యార్థులలో క్రమశిక్షణ, ఆటలపై ఆసక్తి, ధ్యానం ఇతర అన్ని విధాలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహకాన్ని అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – మంగ్తా భూక్యా, ప్రిన్సిపాల్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, పెద్దవూర -
39 ఏళ్ల తరువాత ఒక్కచోటుకు..
పెద్దవూర: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 1986–87లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒకే వేదికపైకి చేరారు. 39 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పెద్దవూర సర్పంచ్ ఐతగోని వెంకటయ్య, కూర్నాల శ్రీనివాస్, పీఎల్ఎన్ శర్మ, శ్రీనవాస్శర్మ, సంజీవ, వెంకటయ్య, రవీందర్రెడ్డి, దేవదాసు, సంజీవ్కుమార్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీదేవి, నీలమ్మ, జయమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తా
● ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువులోని కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగింపజేస్తామని, మున్సిపల్ సుందరీకరణకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. రూ.13 కోట్లతో డీపీఆర్ రూపొందిస్తున్నారని, పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలో రూ.2.50 కోట్లతో అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురంల అభివృద్ధితో పాటు శివారు గ్రామాలైన ఆరెగూడెం, రాజన్నగూడెం, ధర్మాపురం, కొండాపురం, జామచెట్లబావి అభివృద్ధి కోసం పాటు పడతానన్నారు. మోత్కూరు మినీ ట్యాంక్బండ్ చెరువు కట్ట రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు, వంగాల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనెముంతల విమల, అవిశెట్టి అవిలుమల్లు, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, చింతల విజయభాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి నిరాకరించాడని..
చందంపేట : రెండు సంవత్సరాలుగా ప్రేమించి, తీరా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం నేరెడుగొమ్ము మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన పులికంటి శ్రీను, అదే గ్రామానికి చెందిన నిరసనమెట్ల మంజుల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనుకు కొన్ని నెలల క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. యువతి డిగ్రీ చదువుతోంది. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ కొలువు వచ్చిన నాటి నుంచి తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో మంజుల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామంలో పెద్దమనుషుల మధ్య మాట్లాడేందుకు శ్రీను రాకపోవడంతో గత నెల 24వ తేదీన అతడి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్తో బైఠాయించింది. అంతకుముందే విషయం తెలుసుకున్న శ్రీను, అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. యువతి కుటుంబసభ్యులు, బంధువులు అక్కడకు వెళ్లగా వీరి మధ్య వాగ్వాదం నెలకొంది. తాజాగా శనివారం మాట్లాడేందుకు శ్రీను, మంజుల తరపున కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. వీరి మధ్య మాటామాటా పెరగడం, శ్రీను వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో యువతి తన వెంట తెచ్చుకున్న డెటాల్ను తాగింది. గమనించిన సీఐ బీసన్న చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని ఆదివారం హైదరాబాద్కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి తరపు బంధువులు కోరుతున్నారు.● యువతి ఆత్మహత్యాయత్నం ● నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఘటన -
అధ్యయనోత్సవాలు పరిసమాప్తం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజుల పాటు కొనసాగిన అధ్యయనోత్సవాలు ఆదివారం పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా ముగిశాయి. చివరి రోజు శ్రీస్వామిని శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో శ్రీస్వామిని అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణీకులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు అలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించి, పారాయణీకులచే ప్రబంధ పారాయణం జరిపించారు. శ్రీస్వామి వారి ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవం చేపట్టారు. అధ్యనోత్సవాలు ముగిసిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. చివరి రోజు శ్రీలక్ష్మీనరసింహుడిగా అలంకరణ నేటి నుంచి నిత్య, శాశ్వత కల్యాణం, సుదర్శన హోమం ప్రారంభం -
తెలంగాణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని నాగార్జునసాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఆదివారం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా సుంకిరెడ్డి రమ్య, ప్రధాన కార్యదర్శిగా ముచ్చపోతుల కిరణ్కుమార్, ఉపాధ్యక్షులుగా రొయ్య వెంకట్రామయ్య, సహాయ కార్యదర్శిగా గుగులోతు కల్పన, కోశాధికారిగా రాజ్యలక్ష్మి, సాంస్కృతిక ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎర్రెడ్డి అంజిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా చంద నరేందర్రెడ్డి, షేక్ ఖాసీం, మీర్ ఆసీఫ్అలీఖాన్, కలం ధర్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులు మేక నితీష్రెడ్డి, మేడికొండ బాబ్జి, గౌరవ సలహాదారులు రొక్కం మాధవరెడ్డి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు రమ్య ప్రధాన కార్యదర్శి కిరణ్ -
మైనార్టీ యోజనకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.i n వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు సమర్పించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు చిన్న వ్యాపారాలకు ఒక్కోరికి రూ.50 వేల ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొన్నారు. రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియే పథకానికి ఫఖీర్, దుదేకుల వర్గాలకు చెందిన అర్హులకు మోపెడ్ వాహనాలు మంజూరు చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఎంఏ.ఫహీం, ఫీల్డ్ అసిస్టెంట్, 79811 96060 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలిహాలియా : మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి ఆదేశించారు. ఆదివారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయన పరిశీలించారు. ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా చూడాలని, ఒకే పోలింగ్ స్టేషల్లో గరిష్టంగా 800మంది ఓటర్లు మాత్రమే ఉండేలా పునర్విభజన చేయాలని సూచించారు. 10న తేదీన మున్సిపాలిటీలో తుది జాబితా ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శననల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి కాలేజీలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చిగురు కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, నాటకాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘చిగురు’ దోహదం చేస్తుందన్నారు. తాను కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. విద్యార్థులు చిన్నతనంలోనే ఓ లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 700 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, వెంకట్జీ, అరవింద్జీ, నాగేందర్, భరద్వాజ్, సైదులు, స్వామి, మహేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
10 రోజులు.. 1,02,685 బస్తాలు
నల్లగొండ అగ్రికల్చర్ : యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ యాప్ను గత డిసెంబర్ 20 నుంచి అమలులోకి తెచ్చింది. 22వ తేదీ నుంచి రైతులు యాప్లో యూరియా బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ వరినాట్లు, వేరుశనగ ఇతర పంటల సాగు ఊపందుకోవడంతో.. ఇప్పటి వరకు 34,926 మంది రైతులు యాప్లో 1,15,524 బస్తాల యూరియా కోసం బుక్ చేసుకున్నారు. వారిలో 1,02,685 బస్తాలను ఆయా దుకాణాలు, పీఏసీఎస్ల నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఎకరాకు మూడు బస్తాలే.. గతంలో రైతులు ఇష్టానుసారంగా యూరియా పరిమితి లేకుండా కొనుగోలు చేసేవారు. గత వానాకాలంలో యూరియాను అధికంగా వాడడంతో పాటు రైతులు ముందస్తుంగా నిల్వ ఉంచుకున్న కారణంగా సకాలంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడిన విషయం విధితమే. దీనికి దృష్టిలో పెట్టుకుని యాసంగిలో రైతులు యూరియాకు ఇబ్బందులు పడోద్దన్న సంకల్పంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో యూరియాను బుక్ చేసుకుంటే ఎకరానికి మూడు బస్తాల చొప్పున మాత్రమే ఇవ్వనున్నారు. ఒకటి నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులకు ఒక దఫాలో, రెండు నుంచి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు రెండు నుంచి మూడు దఫాల్లో యూరియాను అందించున్నారు. దీంతో యూరియా అధిక వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు రైతులకు అవసరం మేరకు యూరియాను అందించే వెసులుబాటు కలుగుతోంది. యాసంగి సీజన్లో ఎరువుల అంచనా ఇలా.. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 6,57,229 ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో వరి 5,64,678 ఎకరాల్లో సాగుకానున్నట్లు అంచనాలు వేసింది. దానికి గాను యూరియా 74,955 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,583 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,600, కాంప్లెక్స్ ఎరువులు 46,628, ఎస్ఎస్పీ 7435 మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించింది.ఫ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు యూరియా సరఫరా ఫ ఇప్పటి వరకు యూరియా బుక్ చేసుకున్న 34,926 మంది రైతులు ఫ యాప్లో బుకింగ్తో తీరనున్న యూరియా కష్టాలు -
ప్రశాంతంగా టెట్
నల్లగొండ టూటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ స్కూల్లో నిర్వహించిన టెట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద తమ అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్లు పరిశీలించుకొని లోపలికి వెళ్లారు. ఉదయం పేపర్–1కు 185 మంది అభ్యర్థులకుగాను 166 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్–2 పరీక్షకు 185 మంది అభ్యర్థులకు గాను 172 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. -
పన్ను చెల్లించాలా.. వద్దా!
ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ ఎఫెక్ట్ నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ ఎఫెక్ట్ పడుతోంది. ఆస్తి పన్ను వసూలుకు ఆయా మున్సిపాలిటీ యంత్రాంగాలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ వారం రోజుల క్రితం జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మున్సిపాలిటీల్లోనూ వడ్డీ మాఫీ ఉంటుందా లేదా అనే మీమాంసలో అధికారులతో పాటు పట్టణాల్లోని ప్రజలు ఉన్నారు. గతేడాది మూడు రోజుల ముందు ప్రకటన మున్సిపాలిటీల్లో రానున్న మూడు నెలలు ఆస్తి పన్ను వసూలు చేసుకోవడానికి ఎంతో కీలకం. గత ఏడాది కూడా ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీని మార్చి 31కి మూడు రోజుల ముందు ప్రకటించారు. ఇలాంటి అస్పష్టమైన నిర్ణయం వల్ల ఆస్తి పన్ను చెల్లించే వారు కూడా ముందుగా చెల్లించకుండా వడ్డీ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక అధికారులు, సిబ్బంది మాటలు నమ్మి బకాయిలతో సహా ఆస్తి పన్ను ముందుగా చెల్లించడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని పలువురు భవన యాజమానులు చెబుతున్నారు. ఆస్తి పన్ను చెల్లించడానికి విముఖత... ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపాలిటీల్లో పని చేసే అధికారులు, సిబ్బందిపి ఆస్తి పన్ను వసూలు కోసం గల్లీగల్లీ తిప్పుతారు. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టినా మార్చి చివరి నాటికి 70 శాతం నుంచి 95 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడం అంత సులభం కాదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేస్తే వసూల్పై ఎలాంటి ప్రభావం చూపదు. జీహెచ్ఎంసీలో మాత్రమే 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించడంపై పట్టణాల్లోని ప్రజలు గుర్రుగా ఉన్నారు. మహానగరంలో ఉన్న వాళ్లు పేదలు, మున్సిపల్ పట్టణాల్లో ఉండే వారు శ్రీమంతులా అనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ మున్సిపల్ పట్టణాల్లోనూ ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తేనే ఆస్తి పన్ను సక్రమంగా వసూలు అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ఫ బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించిన జీహెచ్ఎంసీ ఫ మున్సిపాలిటీల్లోనూ మాఫీ వస్తుందనే ఆశతో పన్ను చెల్లించని యజమానులు ఫ వడ్డీ మాఫీ ప్రకటన రాకపోతే పన్ను వసూలు కష్టమే ఇప్పటికే ఆస్తి పన్ను వసూలు కోసం వార్డుల్లో తిరుగుతున్న సిబ్బందికి మార్చి చివరిలోనే ఆస్తి పన్ను చెల్లిస్తామని ఖరాఖండిగా చెబుతుండడంతో వారు చేసేది ఏమీ లేక మిన్నకుండిపోతున్నారు. త్వరలోనే మున్సి పల్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందా లేదా అనేది ఈ నెలలో తెలిసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
మూసీలో గుర్రపు డెక్క
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్లో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. ఈ ఏడాది వరదతోపాటు పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గుర్రపుడెక్క కూడా రిజర్వాయర్లోకి కొట్టుకొచ్చింది. వరద తగ్గాక అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసి వేయడంతో గుర్రపుడెక్క బైటకు వెళ్లే మార్గం లేక ప్రాజెక్టు గేట్ల వద్ద, రిజర్వాయర్ మట్టి కట్టల వెంట పేరుకుపోయింది. ఈ గుర్రపుడెక్కను తొలగించకుంటే ఆకులు కుళ్ళిపోయి నీరు కలుషితమై.. చేపలు, పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గుర్రపుడెక్క పూర్తిగా విస్తరించక ముందే అధికారులు స్పందించి డ్యాంను శుభ్రపరచాలని మత్య్సకారులు, ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
యూరియా అందుబాటులో ఉంది
జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉంది. యూరియా కోసం ఆందోళన అవసరం లేదు. యాప్లో బుక్ చేసుకున్న రైతులకు వెంటనే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఎకరానికి మూడు బస్తాలు ఇస్తున్నారు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ నాకు ఎకరం 34 గుంటల భూమి ఉంది. వరి సాగు చేస్తున్నారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకుంటే గొల్లగూడ సహకార సంఘంలో మూడు బస్తాల యూరియా ఇచ్చారు. యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 15 రోజుల తరువాత మళ్లీ బుక్ చేసుకుంటే ఇస్తామన్నారు. – కుంచం ఎల్లయ్య రైతు, గొల్లగూడ -
జీజీహెచ్లో పారిశుద్ధ్యంపై ఫోకస్
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో పరిసరాల పరిశుభ్రతపై నూతన సూపరింటెండెంట్ నర్సింహారావు నేత ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతానికి భిన్నంగా ఇటీవల జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలను చేపట్టిన సూపరింటెండెంట్ వైద్య సేవలను పర్యవేక్షించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. వార్డులే కాదు ఆస్పత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారన్నది ఆయన భావన. రోగం వచ్చిన తరువాత ఆస్పత్రికి పోవడం సరికాదు.. రోగం రాకుంగా ముందు చూసుకోవడం ముఖ్యమని ఆస్పత్రి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నారు. గతంలో వార్డుల్లోనే.. గతంలో పనిచేసిన అధికారులు కేవలం వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం చొరవ చూపే వారు. జీజీహెచ్ ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి, ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, తినుబండాలను వేయడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఆస్పత్రి వచ్చే వాహనదారులతో పాటు డాక్టర్లు, సిబ్బంది కూడా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేవారు. ఎక్కడా చెత్త లేకుండా.. నూతన సూపరింటెండెంట్ నర్సింహారావు నేత ప్రతి వార్డును రోజూ సందర్శిస్తూ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వెల్నెస్ సెంటర్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగం పరిసరాల్లో పిచ్చిమొక్కలను తొలగించి అక్కడ ఎర్రమట్టిని పోయించి డోజర్తో చదును చేయిస్తున్నారు. ఆవరణలో ఎక్కడా చెత్తలేకుండా రోజూ రెండు సార్లు శుభ్రం చేయిస్తున్నారు. మంచినీటి ట్యాంకు, క్యాంటిన్, రోగుల సహాయకులు ఉండే షెడ్ల వద్ద శుభ్రం చేయించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బంది, ప్రజలు ప్రత్యేక స్థలాలో మాత్రమే పార్కింగ్ చేసే విదంగా ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్న సూపరింటెండెంట్ను ప్రజలతో పాటు రోగులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వార్డులు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. ఆస్పత్రి ఆవరణతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే రోగులతో పాటు వారి సహాయకులు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలి. – డాక్టర్ గుర్రం నర్సింహారావునేత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫ ఆస్పత్రి వార్డులతోపాటు పరిసరాలపై దృష్టి పెట్టిన సూపరింటెండెంట్ ఫ పారిశుద్ధ్య కార్మికులను పరుగులు పెట్టిస్తున్న నూతన అధికారి -
ప్రజాస్వామ్యం మేడిపండు చందం
చండూరు : దేశంలో ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా ఉందని, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ సంస్మరణ సభ చండూరు మండలం పుల్లెంలలో ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను ఆపాలని, బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాయన్నారు. మావోయిస్టులు చర్చలు జరుపుతామని అన్నా అవకాశం ఇవ్వకుండా.. అడవుల్లో ఉన్న ఖనిజ సంపద దోచేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నిరంకుశంగా చంపుతునాన్నరని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం లేకుండా చేస్తే, ఆర్థిక అసమానతలు లేని సమాజం వస్తే మావోయిస్టులు ఉండరని చెప్పారు. పాక హనుమంతు డిగ్రీ చదివే రోజుల్లో ఏబీవీపీ అరాచకాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, 45 ఏళ్ల పాటు పీడిత ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన మరణ వార్త మునుగోడును విషాదంలో ముంచిందన్నారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ పాక హనుమంతును చంపి రాజ్యం గెలిచిందని విర్రవీగుతోందని, కానీ ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు పెట్టినా ఆయన అంతిమయాత్రకు 20 వేల మంది ప్రజలు హజరయ్యారంటేనే ప్రజలు గెలిచారని అర్థమవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మావోయిస్టులను చంపేందుకు ఓ దిక్కు అమిత్షా, మరోపక్క చంద్రబాబు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజకీయాలు ఎంత కిరాతకంగా చేస్తున్నారో ఈ ఎన్కౌంటర్లను చూస్తే అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, విరసం కార్యదర్శి రివేరా, భరద్వాజ, భవాని, అనురాధ, దీప, మాభూమి సంధ్య, డాక్టర్ టి.నరసింహాచారి, పందుల సైదులు, బాబన్న, భవనం శ్రీనివాస్రెడ్డి, దాడి శ్రీనివాస్రెడ్డి, కావలి యాదగిరి, పిట్టల శంకర్, బుచ్చన్న, జంగయ్య, యాదగిరి, లింగయ్య, సర్పంచ్ ముక్కాముల వెంకన్న, వెంకట్రెడ్డి, రమేష్, వెంకట్రెడ్డి, లోకేష్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఫ పుల్లెంలలో పాక హనుమంతు సంస్మరణ సభ -
ఆ.. 14 నెలల కాలం మరువలేనిది
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన 14 నెలల కాలం మర్చిపోలేనిదని నిజామాబాద్ కలెక్టర్గా బదిలీపై వెళ్లిన ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని జ్ఞాపికలు, శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు. ఫ నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో శ్రీనో హెల్మెట్ – నో పెట్రోల్శ్రీ అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ పోయాలని బంక్ యజమానులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య, ఎస్బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వీధుల్లో చెత్త ఎందుకు వేస్తున్నారు..
నల్లగొండ టూటౌన్ : కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కొత్త కలెక్టర్ రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బందికి చలిలో చెమటలు పట్టాయి. అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే కొత్త కలెక్టర్ చంద్రశేఖర్ నీలగిరి పట్టణంలోని 28వ వార్డులో శనివారం ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రత్యక్షమయ్యారు. వార్డులోని శ్రీకృష్ణానగర్లో కలియదిరుగుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. చెత్త ట్రాక్టర్ సమయం ప్రకారం వస్తుందా.. వస్తుంటే మీరెందుకు వీధుల్లో చెత్త వేస్తున్నారని కలెక్టర్ అక్కడి మహిళలను ప్రశ్నించారు. ఇక నుంచి చెత్తను వీధుల్లో.. రోడ్ల వెంట వేస్తే భారీగా జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంట్లోని చెత్తా చెదారాన్ని మున్సిపల్ వాహనంలోని సిబ్బందికి అందించాలని మహిళలకు సూచించారు. తాగునీరు ఎంత సేపు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో ఎక్కడా లోపాలు రావద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండాలని, వార్డు ఆఫీసర్లకు రోజు వారి టార్గెట్ విధించి వంద శాతం పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు. అదే కాలనీలో ఉన్న మోతి కుంటను కలెక్టర్ పరిశీలించారు. కట్ట, కుంటలో నీటికి సంబంధించి అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, ప్రదీప్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ చెత్త ట్రాక్టర్ రోజూ రావడం లేదా ఫ కాలనీ వాసులను ప్రశ్నించిన కలెక్టర్ ఫ నీలగిరి 28వ వార్డులో ఉదయం 7 గంటలకే కొత్త పర్యటన ఫ తాగునీరు, శానిటేషన్పై ఆరా ఫ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా వేయాలని అధికారులకు ఆదేశం -
జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్ నగేష్
పెద్దవూర : జిల్లా మలేరియా అధికారిగా మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్కు పదోన్నతి లభించింది. ఈయన పెద్దవూర మండల వైద్యాధికారిగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు సైతం పొందారు. డాక్టర్ రమేష్కు జిల్లా మలేరియా అధికారిగా పదోన్నతి లభించడంపై వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణరామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ హైదరాబాద్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు ఉద్యోగుల సమస్యలను చీఫ్ జస్టిస్కు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి.సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి వివి.రమణారావు, రాష్ట్ర నాయకులు కోటిరెడ్డి, నరేష్, రాకేష్ పాల్గొన్నారు. అభ్యంతరాలకు నేడు ఆఖరునల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఈనెల 4వ తేదీతో గడువు ముగియనున్నది. మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్లు దాటిపోయి తమ ఓట్లు ఇతర వార్డుల్లో చేరాయని, వాటన్నింటిని తమ వార్డుల్లోకి చేర్చాలని కోరుతూ పలువురు రాజకీయ నాయకులు, ఓటర్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాగా వార్డుల వారీగా ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆదివారంలోగా మున్సిపల్ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ నల్లగొండ : పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శశికళ అన్నారు. శనివారం నల్లగొండలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్లో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్ వైఖరి దారుణందేవరకొండ : అసెంబ్లీలో స్పీకర్ వైఖరి దారుణమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేసి గొంతునొక్కడం సరికానద్నారు. అసెంబ్లీ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. స్పీకర్ ఏకపక్ష దోరణి, ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బహిష్కరించిందన్నారు. కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదని.. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో టీవీఎన్ రెడ్డి, బిల్యానాయక్, గాజుల ఆంజనేయులు, చింతపల్లి సుభాష్, వల్లపురెడ్డి, నీల రవి, ఖాదర్ బాబా, జానీబాబా, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు ఉన్నారు. -
విజ్ఞానమివ్వని వైజ్ఞాన ప్రదర్శన!
నల్లగొండ టూటౌన్ : ప్రపంచం ఒక వైపు నైపుణ్యతలో దూసుకుపోతుంటే జిల్లా విద్యాశాఖ మాత్రం పాత ప్రాజెక్టులతో వైజ్ఞానిక ప్రదర్శన పెట్టి మమ అనిపించిందనే విమర్శలు వెలువెత్తాయి. ప్రచార ఆర్భాటమే తప్ప విద్యార్థులతో కొత్త ప్రాజెక్టులు చేయించడంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా అధికారులు ఊదాసీనత వ్యవహరించడంతో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల చేత కొత్త పాజెక్టులను తయారీ చేయించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ఫేర్ విద్యార్థులకు విజ్ఞానమివ్వని వైజ్ఞానిక ప్రదర్శనగా మిగిలిందనే ఆరోపణలు వచ్చాయి. 280 ప్రాజెక్టులు అని డంబాచారంగా చెప్పుకున్న అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రదర్శనలో పాత ప్రాజెక్టులే అధికంగా ఉన్నట్లు అక్కడికి వచ్చిన ఉపాధ్యాయులే పెదవి విరుస్తున్నారంటే సంబంధిత అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పడం కోసం ఒకే రకమైన ప్రాజెక్టులే ఏర్పాటు చేశారు. ఎంతో సీరియస్గా తీసుకొని విద్యార్థుల చేత కొత్త ప్రాజెక్టులును తయారు చేయించాల్సి వారు ఏ మాత్రం ఉపయోగం లేని పాత ప్రాజెక్టులతో సైన్స్ ఫేర్ను మమ అనిపించినట్లు తెలుస్తోంది. ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఏదీ..! జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన మొత్తం పేలవంగా సాగింది. ప్రాజెక్టులను చూసేందుకు వివిధ పాఠశాలల నుంచి తీసుకువచ్చిన విద్యార్థులకు ఆ ప్రాజెక్టుల గురించి అర నిమిషం కూడా వివరించకుండా తీసుకువెళ్లడం చూస్తే వైజ్ఞానిక ప్రదర్శనపై సంబంధిత అధికారులకు ఎంత నిబద్దత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. లక్షల రూపాయల ఖర్చు చేసి.. కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా ప్రారంభించిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ఎంత మంది విద్యార్థులకు ఉపయోగపడిందనే విషయం సంబంధిత అధికారులే చెప్పాలి. వైజ్ఞానిక ప్రదర్శన అని ఆర్భాటం చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ఏఏ ప్రాజెక్టులు తయారు చేయించారన్న కనీసం సమాచారం కూడా అధికారులు తెలుసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా.. స్పందించలేదు.ఫ పాత ప్రాజెక్టులతో మమ అనిపించిన అధికారులు ఫ ఆర్భాటం తప్ప.. ఆచరణలో లేని కొత్త ప్రాజెక్టులు ఫ ఉన్న ప్రాజెక్టుల పనితీరు వివరించడంలోనూ లోపం ఫ నల్లగొండలో ముగిసిన జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శనలో పెట్టిన వాటిలో ఎక్కువ ప్రాజెక్టులు చిన్న, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినవే ఉన్నాయి. అవి కూడా గత పదేళ్ల కిందటనే రూపొందించిన ప్రాజెక్టులు కావడం విస్మయానికి గురి చేస్తుంది. పాతదో కొత్తదో.. కనీసం పెట్టిన ప్రాజెక్టుల గురించి అక్కడికి వచ్చిన విద్యార్థులకు వాటి పరితీరును పూర్తిస్థాయిలో వివరించిన పాపాన కూడా పోలేదు. విద్యార్థులంతా క్యూలైన్లో వెళ్లి చూపి క్షణాల్లోనే బయటికి రావడంతో.. అవి ఏంటో కూడా ఏ విద్యార్థికి అర్థం కాకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. రావడం, పోవడం వ్యయ ప్రయాసాలు తప్ప వైజ్ఞానిక ప్రదర్శన వల్ల ఒనగూరిందేమీ లేదనే ఆరోపణలు వచ్చాయి. పది ప్రాజెక్టులు పెట్టినా వాటిలో నాలుగు ప్రయోజనకరంగా ఉంటే విద్యార్థులతో పాటు దేశానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్లోనైనా కచ్చితత్వంతో కూడిన వైజ్ఞానిక ప్రదర్శనలో దేశానికి, ప్రజలకు ఉపయోగ పడే ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విద్యాశాఖ గ్రహించాల్సిన అవసరం ఉంది. -
సిండికేట్ ఆడించినట్లే..
మధ్యం వ్యాపారుల గుప్పిట్లో ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సమయ పాలన లేని వైన్ షాపుల కారణంగా మందుబాబులు బెల్ట్ షాపులనే బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి వైన్ షాపుల యజమానులే క్వార్టర్కు బ్రాండ్ను బట్టి ఎమ్మార్పీపై అదనంగా రూ.20 నుంచి రూ.25 వసూలు వసూలు చేస్తున్నారు. దీంతో బెల్ట్ షాపుల్లో ఒక్కో ఫుల్ బాటిల్పై బ్రాండ్ను బట్టి రూ.160 నుంచి రూ.200 వరకు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపుల వారు మందుబాబుల నుంచి ఒక్కో క్వార్టర్కు రూ.40 నుంచి రూ.50 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది.. మద్యం వ్యాపారుల సిండికేట్ చేతుల్లో కీలు బొమ్మల్లా మారిపోయారు. మామూళ్ల దందాకు అలవాటు పడిన ఆ అధికారుల తీరుతో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. వ్యాపారులు బెల్ట్ షాపులకు అదనపు ధరలకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోకుండా వారికే వంతపాడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు సిండికేట్ దందాలో మద్యం కల్తీ జోరుగా సాగుతున్నా నోరు విప్పడం లేదని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సిండికేట్ నుంచి వచ్చే పెద్దమొత్తానికి అలవాటు పడి.. స్టాక్ మిస్ మ్యాచింగ్ పేరుతో నోటీసులు ఇస్తూ ఇతర వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘బెల్ట్’కు అండదండలు జిల్లాలో బెల్ట్ షాపుల వ్యాపారం మూడుపూలు ఆరుకాయలు అన్నచందంగా సాగుతోంది. ఏ గ్రామంలోకి వెళ్లినా రెండు మూడింటికి తగ్గకుండా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్, స్థానిక పోలీసుల నుంచి వైన్స్ యజమానులకు పూర్తిస్థాయిలో అండదండలు లభిస్తుండడంతో.. వైన్స్ యజమానులు బెల్ట్ షాపులు నిర్వహించే వారికి అదనపు రేట్లకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలా వచ్చిన మొత్తం నుంచే ఎకై ్సజ్, పోలీసు అధికారులకు, సిబ్బందికి ముడుపులు ముట్టజెప్పుతారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఉన్నా మండలాల్లో రాత్రి 8 గంటల వరకు వైన్స్లను మూసేస్తారని.. బెల్ట్ షాపులకు బేరం పెంచడం కోసమే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా మట్టుజెప్పాల్సిందే.. నల్లగొండ జిల్లాలో 154, సూర్యాపేట జిల్లాలో 93, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలను నుంచి స్థానిక ఎకై ్సజ్ అధికారులకు ప్రతి నెల కనీసం రూ.15 వేలు, వ్యాపారం అఽధికంగా సాగే ప్రాంతమైతే రూ.25 వేలు, స్థానిక పోలీసులకు కూడా నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆ మొత్తాన్ని ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తారని, మద్యం షాపుల వద్ద చిన్నపాటి సమస్య వచ్చినా న్యూసెన్స్ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేస్తారని తెలుస్తోంది. ప్రతి నెలా ముడుపులు ఇస్తే మాత్రం మద్యం షాపులకు, బెల్ట్ షాపులకు మద్దతు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెల్ట్షాపులపై కేసులు పెట్టకుండా, వైన్స్, పర్మిట్ రూంల నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులపాలు చేయకుండా ఉండేందుకు ముడుపులు చెల్లించక తప్పదని ఓ వైన్స్ యజమానే పేర్కొన్నారు. ఫ ఎక్కువ రేట్లకు విక్రయాలు, మద్యం కల్తీపై నోరుమెదపని వైనం ఫ బెల్టుషాపుల్లో విచ్చలవిడిగాసాగుతున్న మద్యం అమ్మకాలు ఫ కేసుల పేరుతో చిన్న వ్యాపారులకు బెదిరింపులు ఫ అధికారుల తీరుతో ప్రజల జేబుకు చిల్లు -
అభివృద్ధి పథంలో నడిపించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో భాగస్వాములై జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలన్నారు. పథకాల అమలులో అందరికీ న్యాయం జరిగితేనే జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, జిల్లా రవాణా కమిషనర్ వాణి, తదితరులు ఉన్నారు. ఓటరు జాబితాలను పునః పరిశీలన చేయాలి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో పారదర్శకంగా ఉండాలన్నారు. వార్డుల వారీగా రూపొందించిన జాబితాలో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్ల ప్రకారం ఉన్నాయో లేదో చూడాలన్నారు. ఒక కుటుంబ సభ్యులు ఒకే వార్డులో ఉండేలా చూడాలన్నారు. ఓటరు జాబితా పై ఈనెల 5వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఓటరు జాబితాలపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ నల్లగొండ : రోడ్డు రవాణ శాఖ అధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సల వాల్పోస్టర్ను కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీసీ వాణి, ఎంవీఐలు లావణ్య, స్వప్న, సత్తయ్య, గోపీనాథ్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక విజ్ఞానం పెంపొందాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్నో కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో భారతదేశం ముందంజలో ఉందని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆయన ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో చక్రం, విద్యుత్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ వంటివి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్లే ఆవిర్భవించాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోందని, దానికి అనుగుణంగా విద్యార్థులు మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. ఒక అంశంపై పరిశీలన చేయడం ద్వారా అవగాహన ఏర్పడుతుందని, మన సమస్యలకు అక్కడే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు చేపడుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలో 284 ఎగ్జిబిట్స్ పెట్టడం గొప్ప విషయమన్నారు. ఇక్కడి నుంచి 10 నుంచి 15 ఎగ్జిబిట్స్ జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాక్షించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ తరగతి గదిలో విన్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను పరిశీలించి వారితో మాట్లాడారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ కమిషనర్ వాణి, డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఫ పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకోవాలి ఫ జిల్లాస్థాయి సైన్స్ఫేర్లో కలెక్టర్ చంద్రశేఖర్ -
సమస్యల పరిష్కారంలో చురుకుగా ఉండాలి
నల్లగొండ : రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం ఉండాలన్నారు. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, పిర్యాదుదారుకు రశీదు ఇవ్వాలని, ఫిర్యాదుల రిజిస్టర్లు, అన్ని వివరాలు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా తహసీల్దార్ల సమావేశం నిర్వహిస్తామనిన్నారు. అనంతరం భూ భారతి, పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు. సమాఏశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
లెప్రసీ అనుమానితులు 80 మంది
నల్లగొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా 80 లెప్రసీ అనుమానిత కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెపుతున్నాయి. గతనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) సర్వేను నిర్వహించింది. ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి శరీరంపై ఉన్న నల్ల, తెల్ల, గోధుమరంగు మచ్చలు, స్పర్శలేని మచ్చలను పరిశీలించారు. అందులో 80 మందికి లెప్రసీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ పూర్తి స్థాయిలో లెప్రసీ పరీక్షలను నిర్వహించి ఎంతమందికి లెప్రసీ ఉందో త్వరలో తేల్చనున్నారు. బాధితులకు చికిత్స ఇలా.. జిల్లాలో ఉన్నటువంటి కుష్టువ్యాధి బాఽధితులకు బహుళ ఔషధ పద్ధతిన (మల్టీ డ్రగ్ థెరఫీ–ఎండీటీ) చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 102 మంది వరకు కుష్టువ్యాధిన పడిన బాధితులకు జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న కుష్టువ్యాధి విభాగంలో ఎండీటీ పద్ధతిన చికిత్స అందిస్తున్నారు. కుష్టువ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుంచి ఎల్సీడీసీ సర్వే ద్వారా కుష్టువ్యాధి లక్షణాలను ఉన్నవారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి మల్టీడ్రగ్ థెరఫీ చికిత్స చేయిస్తోంది. దీంలో జిల్లాలో అప్పటి నుంచి కుష్టు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. రానున్న రోజుల్లో జిల్లాను కుష్టు రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ ముందుకు సాగుతోంది. కుష్టు లక్షణాలు.. కుష్టు వ్యాధి అనేది మైక్రోబ్యాక్టీరియం లెప్రో అనే బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా ఏ వయస్సు వారికై నా సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నరాలు, చర్మం, ముక్కు ద్వారా ఎగువ శ్వాసనాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమరంగు (పాలిపోయిన, స్పర్శలేని మచ్చలు) ఉంటే కుష్టువ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.శరీరంపై ఎర్రని, తెల్లని, స్పర్శలేని గోధుమరంగు మచ్చలు ఉంటే వైద్యారోగ్య శాఖ సిబ్బందికి చూపించాలి. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే జిల్లా కేంద్రంలోని లెప్రసీ కేంద్రానికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న ఉచితంగా చికిత్స చేయించుకోవాలి. క్రమంతప్పకుండా మందులను వాడాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫ ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన వైద్యారోగ్య శాఖ ఫ పూర్తిస్థాయి పరీక్షల అనంతరం తేలనున్న కేసులు ఫ జిల్లాలో ఇప్పటికే 102 మంది కుష్టువ్యాధి బాధితులు -
మంచుతో పొంచిఉన్న ముప్పు
నల్లగొండ : చలికాలం నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ఏర్పడే పొగమంచుతో ప్రమాదాలు పొంచి ఉంటాయని.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పొగమంచు వల్ల రోడ్డుపై వాహనాలు, పాదాచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా కనిపించవని.. డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. వాహనదారులకు ఎస్పీ సూచనలు ఇలా.. ● పొగమంచు కారణంగా గమ్యస్థానానికి వెళ్లడం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున.. ముందుగానే బయలుదేరితే తొందరపాటు డ్రైవింగ్ నివారించవచ్చు. ● అతివేగం, ఓవర్ టేకింగ్కు దూరంగా ఉండాలి. ● లో బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి. ● ముందు వెళ్లే వాహనానికి తగిన దూరాన్ని పాటించాలి. ● నిర్దేశిత లేన్లోనే వాహనం నడపాలి . ● వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించాలి. ● ముందు, వెనుక అద్దాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ● ఇండికేటర్లను ముందుగానే ఉపయోగించాలి . ● సడన్ బ్రేకింగ్కు దూరంగా ఉండాలి . ● రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఎకై ్సజ్.. గుడ్విల్
ఒక్కోషాపు నుంచి రూ. 3 లక్షల వరకు వసూలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎకై ్సజ్ అధికారుల వసూళ్ల దందా అడ్డగోలుగా సాతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో ప్రారంభమైన మద్యం దుకాణదారుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మొదట గుడ్ విల్ కింద వన్ టైమ్ అమౌంట్ వసూలు చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది.. నెలవారీ మామూళ్లు వేరుగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా షాపులను దక్కించుకున్న వారి నుంచి ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దుకాణాల కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యాపారులు.. ఇప్పుడు ఈ వసూళ్ల దందాతో ఇబ్బంది పడుతున్నారు. డిసెంబర్ 1న దుకాణాలు ప్రారంభం 2025 అక్టోబర్లో నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులను ప్రారంభించారు. ఆ షాపులనుంచి గుడ్ విల్ కింద ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికాల మౌఖిక ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సిబ్బంది ఈ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో ఎక్కువ మొత్తం జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. అందులో సగానికిపైగా మద్యం దుకాణాలు పట్టాణాల్లో ఉన్నాయి. అలాంటి షాపుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల నుంచి కనీసం రూ.2 లక్షలకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు షాపుల నిర్వాహకులే గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా వ్యాపారం కొనసాగే, దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా సేల్స్ ఉండే ప్రాంతాల్లోనూ గుడ్ విల్ కింద రూ.3 లక్షలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నట్లు సమాచారం. మొదటిసారిగా షాపులు వచ్చిన వారిని టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. రూ.50 లక్షలు పెట్టి షాపు దక్కించుకున్న మీరు రూ.3 లక్షలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇస్తే అన్నీ మేమే చూసుకుంటాం అని చెబుతూ వసూళ్లకు దిగుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఎవ్వకపోతే కేసులు తప్పవని కూడా బెదిరిస్తున్నట్లు తెలిసింది. లొకేషన్ సరిగ్గా లేదని, ప్రార్థన మందిరాలకు పక్కనే ఉన్నాయని, నిబంధనలు పాటించడం లేదనే సాకులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇక, గతంలో వైన్స్ నడిపించి, ఈసారి కూడా లాటరీలో షాపులను దక్కించుకున్న వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారన్న తెలుస్తోంది. కొత్త షాపుల వారే ఇస్తుండగా, మీరు ఇవ్వకపోవడం ఏంటి? అన్నీ మీకు తెలుసుకదా.. ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని ఓ వైన్స్ షాపు యజమాని పేర్కొన్నారు. ఫ మొదట గుడ్విల్ కింద.. ఆ తర్వాత నెలవారీ మామూళ్లు ఇవ్వాలని ఒత్తిడి ఫ టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయిస్తున్న ఎక్సైజ్శాఖ అధికారులు ఫ ఇబ్బందులు పడుతున్న మద్యం వ్యాపారులు -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండాలని, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ముసాబ్ అహ్మద్, మల్లేశం, శ్రీనివాస్, రామదుర్గారెడ్డి, సుదర్శన్, దండు శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి -
30న ఎన్జీ కాలేజీలో గాంధీ విగ్రహాల ప్రదర్శన
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో ఈ నెల 30వ తేదీన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చీఫ్ అడ్వైజర్ ఎంవీ.గోనారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ కె.కరుణాకర్రెడ్డి, పాముల అశోక్, బొమ్మపాల గిరిబాబు, కె.నాగమణి, జ్యోతి, టి.చిరంజీవులు, మరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ, శ్రీనివాస్గౌడ్, ఎండీ.అజీజ్, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రిని కలిసిన కలెక్టర్
నల్లగొండ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ బి.చంద్రశేఖర్ గురువారం రాత్రి హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్గా అశోక్రెడ్డినల్లగొండ : స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్గా నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్చార్జిగా ఉన్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఉండగా.. ఆయన బదిలీ కావడం.. ఆ తరువాత బదిలీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలినల్లగొండ టౌన్ : నల్లగొండను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చెస్ట్ ఎక్స్రే పరికరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎక్స్రే క్యాంపు నెల రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఏఆర్టీ మందులను వాడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహ నేత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్కు సేవా పతకంనల్లగొండ : నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ పాయల రాజు తెలంగాణ సేవా పతకానికి ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో పోలీస్శాఖలో చేరిన ఆయన 25 ఏళ్లుగా క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ఆదర్శ పోలీస్గా గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా స్పెషల్ పార్టీలో 8 సంవత్సరాలు పనిచేసి కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. అనేక క్లిష్టమైన కేసుల డిటెక్షన్లో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసు చేధనలో పాల్గొన్నారు. 2022లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. ఈయనకు ఈ నెల 26న ఎస్పీ చేతుల మీదుగా పతకం అందుకోనున్నారు. సేవా పతకానికి ఎంపికై న రాజును టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు శుక్రవారం సన్మానించారు. 8న ఎంకేఆర్ కళాశాలలో సాధన ఫెస్ట్ దేవరకొండ : దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8న సాధన ఫెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ–2026 నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమావత్ రవి తెలిపారు. కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, నారాయణరెడ్డి, లకుమారపు మల్లయ్య, రాజేశ్, పీజే శ్యాంసన్, చంద్రమౌళి పాల్గొన్నారు. -
రేణుకా ఎల్లమ్మకు పుష్పాలంకరణ
కనగల్ : దర్వేశిపురం శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించిన అర్చకులు కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి, ఆలయ సిబ్బంది చంద్రయ్య, అర్చకులు పాల్గొన్నారు. ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయంనల్లగొండ : నూతన సంవత్సరంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేయనుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా గురువారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డీఎస్పీలతో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు. గడిచిన ఏడాదిలో జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగామన్నారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశాల్లో ప్రజల సహకారం ప్రశంసనీయమన్నారు. నేరాల నివారణకు ముందస్తు చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు బందోబస్తు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీఐ శత వసంతాల సభను జయప్రదం చేయాలిచండూరు : సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యరద్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. గురువారం చండూరులోని మాదగోని నర్సింహ భవన్లో జరిగిన మునుగోడు నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐకి వందేళ్ల పోరాట చరిత్ర ఉందని పేర్కొన్నారు. పార్టీ నూతన సభ్యత్వాలు చేర్పించాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, అంజాచారి, తీర్పారి వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, బొల్గూరి నరసింహ, మండల కార్యదర్శులు నలపరాజు సతీష్, చాపల శ్రీను, సూదనబోయిన రమేష్, శేఖర్, లాలు, సురిగి చలపతి, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగెల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్ట ఈఓ రాజీనామాపై సర్వత్రా చర్చ
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాత రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఫ ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు వెల్లడించిన వెంకట్రావ్ ఫ రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్న స్థానికులు ఫ నూతన సంస్కరణలు, సమీక్షలతో భక్తులకు దగ్గరైన ఈఓయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వెంకట్రావ్ (రిటైర్డ్ ఐఏఎస్) తన విధులకు రాజీనామా చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రాజీనామా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వం నూతన ఈఓగా ఎవరిని నియమిస్తుందనే చర్చ సైతం ఆలయ ఉద్యోగులు, స్థానిక ప్రజల్లో నెలకొంది. ఏప్రిల్ 27న ఈఓగా నియామకం యాదగిరీశుడి ఆలయానికి ఐఏఎస్ హోదాలో మొదటి ఈఓగా వెంకట్రావ్ గతేడాది ఏప్రిల్ 27న నియామకమై 30న బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 31న వెంకట్రావ్ పదవీ విరమణ పొందాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందుగా ఆగస్టు 30న యాదగిరి ఆలయానికి ఈఓగా కొనసాగించడంతోపాటు అదనంగా శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఆలయ ఈఓగా అనేక కార్యక్రమాలు చేపట్టిన భక్తుల మన్ననలు పొందారు. గరుడ ట్రస్టు.. ఉచిత ప్రసాద వితరణ తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చెందుతున్న యాదగిరీశుడి ఆలయంలో నూతన సేవలను తీసుకొస్తే బాగుంటుందని వెంకట్రావ్ భావించి, వైదిక కమిటీ సమీక్షలు నిర్వహించారు. ప్రధానంగా గరుడ ట్రస్టు, యాదగిరి మాస పత్రిక, ఈ ఆఫీస్, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొనే భక్తులకు దేవుడి ప్రతిమ, చెల్లా, కనుమ, శ్రీస్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. ధర్మ ప్రచారంలో భాగంగా ప్రచార రథానికి మరమ్మతులు చేయించి, గ్రామాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రసాద కౌంటర్లు, ఆలయ పరిసరాల్లో వద్ద క్రియోస్క్ మిషన్లు పెట్టించి, ఆన్లైన్ సేవలను విస్తరించారు. -
మంత్రి, మండలి చైర్మన్ను కలిసిన కలెక్టర్
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన కలెక్టర్ చంద్రశేఖర్ సుఖేందర్రెడ్డితో కలెక్టర్ నల్లగొండ : జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ గురువారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం హైదరాబాద్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, మండలి చైర్మన్కు పూలబొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
క్యాలెండర్ రూపకల్పన అభినందనీయం
రామగిరి(నల్లగొండ) : కోర్టు పని దినాలు, సెలవులతోపాటు న్యాయవాదులకు అవసరమయ్యే విలువైన సమాచారంతో ఐలు నూతన సంవత్సరం ప్యాకెట్ క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలు) ఆధ్వర్యంలో రూపొందించిన ప్యాకెట్ క్యాలెండర్ను గురువారం నల్లగొండ కోర్టులో జిల్లా జడ్జి ఎం.నాగరాజు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనంతుల శంకరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్, న్యాయమూర్తులు శిరీష, సాయిగీత, న్యాయవాదులు ఎస్ఆర్. ఠాగూర్, ఎం.నాగిరెడ్డి, కీసర శ్రీనివాసరెడ్డి, పి.బ్రహ్మచారి, పేరుమాళ్ల శేఖర్, జెనిగల రాములు పాల్గొన్నారు. -
మహిళా ఓటర్లే అధికం
18 మున్సిపాలిటీల్లో తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి జిల్లా పరిధిలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 6,65,585 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 3,42,873 మంది ఉన్నారు. పురుషులు 3,22,617 మంది, ట్రాన్స్జెండర్లు 95 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు జరగబోయే 18 మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా (20,256) ఉన్నారు. అందులోనూ నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 4,806 మంది ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత సూర్యాపేట మున్సిపాలిటీలో పురుషుల కంటే ఎక్కువ మంది (4,473) మహిళలు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కమిషనర్లు డిసెంబర్ 30 నుంచే కసరత్తు ప్రారంభించారు. వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు రూపొందించి గురువారం ప్రకటించారు. కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం రాత్రి వరకు ఆయా జాబితాలను ప్రకటించారు. ఆయా మున్సిపాలిటీల్లో మొత్తంగా 6,65,585 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు కసరత్తు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నకిరేకల్ మున్సిపాలిటీకి గతంలో ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో దాని పాలకవర్గం కాల పరిమితి ఇంకా పూర్తికాలేదు. దీంతో మిగతా 18 మున్సిపాలిటీలకే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించనుంది. ఆయా మున్సిపాలిటీల్లో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాలను మున్సిపల్ కమిషనర్లు ప్రకటించారు. నాలుగేళ్లలో పెరిగింది తక్కువే.. 2020 జనవరిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల కోసం 2019 చివరలో ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ప్రస్తుతం నిర్వహించబోయే ఎన్నికల కోసం 2023 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాల ఆధారంగా ప్రస్తుతం ముసాయిదా జాబితా రూపొందించారు. 2020లో ఉమ్మడి జిల్లాలోని నకిరేకల్ మినహా మిగితా 18 మున్సిపాలిటీల్లో 6,33,683 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ ఓటర్ల సంఖ్య 6,65,585కు పెరిగింది. అంటే 31,902 మంది ఓటర్లు పెరిగారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది పెరిగారు. ఈ నాలుగేళ్లలో పురుష ఓటర్లు 13,107 పెరిగారు. మహిళా ఓటర్లు 18,722 మంది పెరిగారు. ట్రాన్స్జెండర్లు 73 మంది పెరిగారు.ఫ పురుషుల కంటే 20,256 మంది మహిళలు ఎక్కువ ఫ ముసాయిదా ఓటరు జాబితాల ప్రకటన ఫ నాలుగేళ్లలో పెరిగింది 31,902 మంది ఓటర్లే.. ఫ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 6,65,585 మంది ఫ 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ మున్సిపాలిటీల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల్లోని వివరాలు.. మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్జెండర్ మొత్తంఓటర్లు నల్లగొండ 67,235 72,041 25 1,39,301 చిట్యాల 5,929 6,188 01 12,118 చండూరు 5,652 5,717 01 11,370 హాలియా 6,270 6,529 02 12,801 నందికొండ 6,441 7,079 01 13,521 దేవరకొండ 11,702 12,258 01 23,961 మిర్యాలగూడ 45,128 47,878 14 93,020 సూర్యాపేట 52,205 56,679 13 1,08,897 హుజూర్నగర్ 14,257 15,731 08 29,996 కోదాడ 28,560 30,031 10 58,601 నేరేడుచర్ల 6,629 7,116 01 13,746 పోచంపల్లి 7,808 8,031 – 15,839 చౌటుప్పల్ 13,553 13,663 – 27,216 తిరుమలగిరి 7,638 7,817 – 15,455 యాదగిరిగుట్ట 6,762 7,039 16 13,817 ఆలేరు 6,691 6,978 01 13,670 భువనగిరి 23,040 24,799 01 47,840 మోత్కూరు 7,117 7,299 – 14,416 మొత్తం 3,22,617 3,42,873 95 6,65,585రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పకనకు 2023 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. వాటి ఆధారంగానే ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను తయారు చేసి వార్డుల వారీగా ప్రకటించారు. ఈ ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. పేర్లు, వార్డుల మార్పు, పేర్లలో తప్పులు దొర్లినా కూడా వాటిని సరిచేసుకునేందుకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. ఆయా జాబితాలపై రాజకీయ పార్టీల నేతలతో 5వ తేదీన మున్సిపాలిటీ స్థాయిలో, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. ఈనెల 10న మున్సిపాలిటీ వారీగా తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. -
జీరో యాక్సిడెంట్ దిశగా ముందుకుసాగాలి
రామగిరి(నల్లగొండ): ఆర్టీసీ డ్రైవర్లు జాగ్రత్తగా బస్సులు నడుపుతూ జీరో యాక్సిడెంట్ దిశగా ముందుకు సాగాలని రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి అన్నారు. నల్లగొండ ఆర్టీసీ బస్ డిపోలో గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ వరకు మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 0.04 శాతం యాక్సిడెంట్ రేట్ ఉందని, ఈ సంవత్సరం జీరోకు చేరేలా డ్రైవర్ల అందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్పై అవగాహన కల్పిస్తామన్నారు. డ్రైవర్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఏకాగ్రతతో బస్సులను నడిపి ప్రయాణికులను భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ డాక్టర్ ఎన్.వాణి మాట్లాడుతూ డైవర్లు సరిపడా నిద్ర, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసి ప్రమాదాలను నివారించాలని సూచించారు. జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమం డిపో మేనేజర్, సూపర్వైజర్లు, జేబీఎం సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నల్లగొండ : రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కమిషనర్ ఎన్.వాణి మాట్లాడారు. వివిధ వాహనాల డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు, వేగ పరిమితి, ప్రయాణకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ లావణ్య, వి.చంద్రశేఖర్, సి.స్వప్న, వి.సోని, సతీష్, రవాణా శాఖ సిబ్బంది, వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు. -
చలికి జాగ్రత్తలు తప్పనిసరి
నల్లగొండ టౌన్ : రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చలికాలం సీజన్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జాగ్రత్తలపై సాక్షి బుధవారం డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు చలి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆయన మాటల్లోనే.. ప్రశ్న : చలి తీవ్రత వల్ల మా గ్రామంలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించాలి. –అంజాన్హాన్, ఇబ్రహీంపట్నం డీఎంహెచ్ఓ : హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు తగిన దేశాలను ఇస్తున్నాం. వెంటనే గ్రామానికి పంపించి జ్వర పీడితులకు రక్త పరీక్షలను చేయించి మందులు కూడా అందించేలా చూస్తాం. ప్రశ్న : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉంది. వెంటనే కొత్త భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి. –వెంకటేశ్వర్లు, చండూరు, శంకర్, చండూరు, డీఎంహెచ్ఓ : ఇప్పటికే కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ప్రశ్న : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలి. –పి.రవీందర్, చందంపేట డీఎంహెచ్ఓ : సమయపాలన పాటించని వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రశ్న : డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దోమల బెడద ఎక్కువైంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. – రమేష్, మాజి కౌన్సిలర్, నందికొండ, ఆవుల కృష్ణ, తిప్పర్తి. డీఎంహెచ్ఓ : వెంటనే వైద్య సిబ్బందికి ఆదేశాలను జారీ చేసి డ్రెయినేజీల్లో మందుల నివారణకు మందు చల్లించడానికి చర్యలు తీసుకుంటాం. ఎవరైనా జ్వరాల బారిన పడితే సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్యసేవలు అందిస్తాం. ఫ చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఫ అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి ఫ ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ప్రశ్న : చలి తీవ్రంగా ఉంది. చిన్నారులు, వృద్ధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – సత్యనారాయణ, నల్లగొండ, శ్రీశైలం యాదవ్, చందంపేట, లింగయ్య, మునుగోడు. డీఎంహెచ్ఓ : చిన్నపిల్లలు, వృద్ధులు చలిలో తిరగకుండా చూడాలి. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, మంకీ క్యాప్లను పెట్టుకునేలా చూడాలి. చలిలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. చల్లని పానీయాలు తాగకుండా వేడి చేసిన నీటిని తాగాలి. పాలుతాగే చిన్నపిల్లలను తల్లిపొత్తిల్లలో పడుకోబెట్టాలి. ఉదయం కొద్ది సేపు ఎండలో తిప్పాలి. పిల్లలకు అవసరమైన టీకాలు వేయించాలి. దీర్ఘకాలిక రోగులు తగిన జగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి వేళల్లో చలిరాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచి వేడిన ఇచ్చే హైవోల్టేజి బల్బులను వేసుకోవాలి. ఏసీలు, కూలర్లను వాడవద్దు. ఏమైన ఆరోగ్య సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. -
యూరియా కష్టాలు తీర్చేందుకే కొత్త యాప్
రామగిరి(నల్లగొండ), చిట్యాల : వ్యవసాయ సీజన్లలో రైతులు పడుతున్న యూరియా కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కొత్త యాప్ను ప్రవేశపెట్టిందని, రైతులు నేరుగా యూరియాను బుకింగ్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ (ఏఏడీ) నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ పట్టణంలో గ్రోమోర్ సెంటర్, వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపుతోపాటు చిట్యాల పట్టణంలో గ్రోమోర్ సెంటర్, పీఏసీఎస్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యాప్ ద్వారా యూరియా కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడిన ఆయన యాప్ పనితీరు గురించి తెలుసుకోగా ఓటీపీ విషయంలో సమస్యలు ఉన్నట్లు కౌలు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఏఓ శ్రవణ్కుమార్, నకిరేకల్ ఏడీఏ జానీమియా, ఏఓలు, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు ఉన్నారు. -
కొత్త పంచాయతీల్లో నూతన అకౌంట్లు
నల్లగొండ : రెండేళ్ల కాలం ప్రత్యేకాధికారుల పాలన అనంతరం ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు పాత పంచాయతీల్లోనూ కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే కొత్త పంచాయతీల్లో కొత్తగా అకౌంట్లు తెరవడంతో పాటు పాత పంచాయతీల్లో కూడా అకౌంట్ల పేర్లు మార్పు చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ జారీచేశాం. దీంతో కొత్త పంచాయతీల్లో నూతనంగా అకౌంట్లు తెరవడం, పాతవాటిల్లో పేర్లు మార్పు చేసే కార్యక్రమంలో అధికార యంత్రంగం నిమగ్నమైంది. 25 పంచాయతీల్లో కొత్తగా అకౌంట్లు.. జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే కొత్తగా మరో 25 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. ఇటీవల మూడు పంచాయతీలు మినహా 866 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 25 కొత్త పంచాయతీల్లో కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్తోపాటు గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు. ఫ పాత పంచాయతీల్లోనూ అకౌంట్ల పేర్లు మార్పు ఫ ప్రత్యేకాధికారులు ఇచ్చిన చెక్కులు పాస్ చేయొద్దు ఫ బిల్లుల చెల్లింపు సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకంతోనే జరగాలి ఫ ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీరాజ్ కమిషనర్ -
మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు
నల్లగొండ : నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజలకు బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్.. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు డీసీసీ అద్యక్షుడు పున్న కై లాష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సుఖసంతోషాలు నింపాలి ఫ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందించాలని ఆకాంక్షించారు. బుద్ధవనం సందర్శించిన వియత్నాం బౌద్ధ భిక్షువులునాగార్జునసాగర్: వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువులు బుధవారం సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ముందుగా నాగార్జునకొండ మహాస్థూపం, మ్యూజియంలో శిల్పాలను తిలకించారు. మహాస్థూపం సమావేశ మందిరంలో లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం సందర్శన తమకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. వీరి వెంట బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఉన్నారు. -
రిజర్వేషన్లు పాతవేనా!
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సందిగ్ధత ఫ అధికారులు, ముఖ్యనేతల వద్ద ఆరా తీస్తున్న ఆశావహులు ఫ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం ఫ నేడు నోటీసు బోర్డుల్లో ముసాయిదా ఓటరు జాబితాల ప్రకటన ఫ అభ్యంతరాలను స్వీకరించనున్న అధికారులు ఫ 5, 6 తేదీల్లో మున్సిపల్, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై సందిగ్ధత నెలకొంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లను కొత్తగా మారుస్తారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఒకపక్క ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు పోలింగ్ బూతుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించనున్నారు. వాటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించి పదో తేదీన తుది ఓటరు జాబితా విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలకు ఒకే రిజర్వేషన్ విధానం ఉండేలా నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పక్కన పెడుతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ వంద శాతం ఎస్టీ గ్రామాలను మినహాయించి మిగితా వాటిల్లో రొటేషన్ పద్ధతిని అవలంబించింది. దీంతో బీసీ రిజర్వేషన్లు జనరల్కు, జనరల్ బీసీకి, ఎస్సీ స్థానాలు బీసీ, బీసీగా మారినవి చాలా ఉన్నాయి. అయితే అదే పద్ధతిని మున్సిపల్ ఎన్నికల్లో అవలంబిస్తుందా లేక 2020 ఎన్నికల సమయంలో అమలు చేసిన రిజర్వేషన్లనే కొనసాగిస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఆశావహుల్లో ఆసక్తి మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం, ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో ఆశావహుల్లో ఆసక్తి మొదలైంది. సంవత్సర కాలంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్న వారంతా ప్రస్తుతం పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, ముఖ్య నేతల వద్ద రిజర్వేషన్లు మారుతాయా, లేక పాత వాటినే కొనసాగిస్తారా అనే దానిపై ఆశావహులు ఆరా తీస్తున్నారు. వార్డుల వారీగా తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వార్డుల్లో బుధవారం రాత్రి ఓటరు జాబితాను వార్డుల వారీగా ముసాయిదా జాబితా సిద్ధం చేశారు. వాటిని పునఃపరిశీలన చేస్తున్నారు. గురువారం ఉదయం జాబితాలను నోటీసు బోర్డులపై ఉంచనున్నారు. అభ్యంతరాల స్వీకరణ మున్సిపాలిటీల్లో గురువారం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ జాబితాల్లో మార్పులు, చేర్పులపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పేర్ల మార్పు, వార్డుల మార్పు తదితర అంశాలకు సంబంధించి కూడా అభ్యంతరాలను అధికారులు స్వీకరించి వాటన్నింటినీ సరిచేస్తారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 5వ తేదీన మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో 6వ తేదీన ఆయా పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారు సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్ నల్లగొండ ఓసీ జనరల్ చిట్యాల జనరల్ హాలియా జనరల్ దేవరకొండ జనరల్ చండూరు బీసీ మహిళ నందికొండ జనరల్ మహిళ మిర్యాలగూడ జనరల్ సూర్యాపేట జనరల్ హుజూర్నగర్ జనరల్ మహిళ కోదాడ జనరల్ మహిళ నేరేడుచర్ల ఎస్సీ జనరల్ తిరుమలగిరి ఎస్సీ మహిళ భువనగిరి బీసీ జనరల్ ఆలేరు బీసీ జనరల్ భూదాన్పోచంపల్లి బీసీ మహిళ చౌటుప్పల్ బీసీ జనరల్ మోత్కూరు జనరల్ మహిళ యాదగిరిగుట్ట బీసీ మహిళ -
నూతన కలెక్టర్గా చంద్రశేఖర్
నల్లగొండ: జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ రానున్నారు. ఈయన సంగారెడ్డిలో లోకల్బాడీ అదనపు కలెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నల్లగొండ కలెక్టర్గా వస్తున్నారు. నల్లగొండ కలెక్టర్గా ప్రస్తుతం పని చేస్తున్న ఇలా త్రిపాఠి నిజామాబాద్కు బదిలీ అయ్యారు. ఇలా త్రిపాఠి 2024 అక్టోబరు 28న నల్లగొండ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 14 నెలల పాటు ఆమె జిల్లాలో పని చేశారు. ఈ కాలంలో ఆమె విద్యా, వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లను నిరంతం తనిఖీలు చేసి.. వాటి బాగుకోసం కృషి చేశారు. పలుమార్లు విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ప్రోత్సహించారు. కేజీబీవీలో పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థినులను విమానం ఎక్కించి ఆ ఖర్చులు భరించారు. జిల్లాలోని ఆస్పత్రులను నిరంతరం తనిఖీలు చేశారు. సౌకర్యాల కల్పనకు, వైద్య సేవలు మెరుగు పడేందుకు కృషి చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాల నిర్మాణానికి పాటుపడ్డారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అయిటిపాములలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. ఈసీఐఎల్ కంపెనీ సహకారంతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు అందించారు. మహిళ అయినప్పటికీ కలెక్టరేట్కు పరిమితం కాకుండా జిల్లా అంతా పర్యటిస్తూ జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ను నారాయణ్పేట జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించినట్లు ఈనెల 25న వెలువడిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ ఆగిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నారాయణపేటకు బదిలీ చేసింది. నారాయణ్ అమిత్ బదిలీ ప్రక్రియ రద్దు చేయడంతో మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా ఆయన యథావిధిగా కొనసాగనున్నారు. ఫ ఇలా త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ -
పుర పోరుకు అడుగులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ కేంద్రాల ఖరారుకు నోటిపికేషన్ విడుదల చేసింది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. గురువారం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. 11 నెలల కిందటే ముగిసిన పాలక వర్గాల గడువు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిల్లో నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు అదే నెల 25వ తేదీన వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ ఏడాది జనవరి 27వ తేదీతోనే పాలకవర్గాల కాలపరిమితి ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 11 నెలల తరువాత ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుంది. 2023 అక్టోబరు1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మున్సిపల్ కమిషనర్లు మంగళవారం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజించారు. బుధవారం పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇక జనవరి 1వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణను ఆ రోజు నుంచి 4వ తేదీ వరకు చేపట్టనున్నారు. 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపాలిటీల్లో, 6వ తేదీన జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు.10వ తేదీన తుది ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు. ఆ ఓటర్ల జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేస్తారని రాజకీయ పార్టీల నేతలు భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. 18 మున్సిపాలిటీలకే ఎన్నికలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉంటే 18 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2011 ఆగస్టు 24వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నకిరేకల్ను ఆరు గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విలీన గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ నుంచి తమ గ్రామాలను తొలగించాలని కోర్టుకు వెళ్లారు. 2013 సెప్టెంబర్ నెలలో విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించడమే కాకుండా, ఆ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగింది. 2015లో గ్రామ పంచాయతీకి ఎన్నికలు కూడా నిర్వహించింది. అయితే ఆ తర్వాత 2020 డిసెంబరు 16వ తేదీన మళ్లీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2021 ఏప్రిల్ 30వ తేదీన మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం మే 7న కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఆ పాలక వర్గమే 2026 మే 6వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల పరిధిలోని 407 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పోటీ చేయాలనుకున్న వారంతా ఎన్నికల కోసం సిద్దమవుతుండటంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. మున్సిపాలిటీ వార్డులు మిర్యాలగూడ 48 హాలియా 12 దేవరకొండ 20 భూదాన్పోచంపల్లి 13 చిట్యాల 12 నల్లగొండ 48 సూర్యాపేట 48 మోత్కూర్ 12 భువనగిరి 35 ఆలేరు 12 చండూరు 10 నేరేడుచర్ల 15 హుజూర్నగర్ 28 తిరుమలగిరి 15 కోదాడ 35 నందికొండ 12 యాదగిరిగుట్ట 12 చౌటుప్పల్ 20 ఫ 18 మున్సిపాలిటీలు.. 407 వార్డులకు ఎన్నికలు ఫ అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాతోనే.. ఫ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని ఖరారు చేసిన మున్సిపల్ కమిషనర్లు ఫ రేపు ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకటన -
డీపీఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వెంకయ్య మంగళవారం బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో నల్లగొండ డీపీఓగా బదిలీపై వచ్చిన ఆయనను ములుగు జిల్లా డీపీఓగా బదిలీ చేశారు. యువజన కాంగ్రెస్ను పటిష్టం చేయాలినల్లగొండ : యువజన కాంగ్రెస్ను పటిష్టం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం జిల్లా యువజన కాంగ్రెస్ విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. సర్పంచ్గా గెలిచిన యువజన నాయకులు అభివృద్ధికి పాటు పడాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జి కెఆర్.భవ్య, నాయకులు పొన్నం తరుణ్గౌడ్, దుబ్బాక చంద్రిక, పాలడుగు నాగార్జున, మౌనిక, గౌతమి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నట్టల నివారణ మందు పంపిణీ పరిశీలనచిట్యాల : జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అనిల్కుమార్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ జీవీ.రమేష్ మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో మంగళవారం పరిశీలించారు. నిర్ణిత సమయంలో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, పశువైద్యుడు అమరేందర్, జేవీఓ సైదులు, బొడ్డు శ్రీను, సాగర్ల మహేష్, జీవాల పెంపకందారులు పాల్గొన్నారు. రైతులు ఎఫ్పీఓ ఏర్పాటు చేసుకోవాలి చిట్యాల : గ్రామాల్లోని రైతులంతా కలిసి పంటలను ఉత్పత్తి చేసి, నిల్వచేసి అమ్ముకుని ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వీలుగా ఎఫ్పీఓ (ఫార్మార్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి సుభాషిణి సూచించారు. రైతు కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం తాళ్లవెల్లెంల గ్రామంలోని రైతులతో సమావేశమై మాట్లాడారు. కూరగాయల సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలను, బింధు సేద్యం విధానం, కూరగాయాల మార్కెటింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పంటల సాగుకు ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఆమె రైతులకు వివరించారు. ఆనంతరం గ్రామంలోని పజ్జూరి అజయ్కుమార్రెడ్డి అరటితోటను సందర్శించారు. కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి శ్వేత, సర్పంచ్ జోగు సురేష్, రైతులు గోపగోని వెంకన్న, స్వామి పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగొద్దు
నల్లగొండ : యాసంగి సీజన్కి సంబంధించి యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. యూరియా సరఫరా, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్పై మంగళవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. ఈ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వానాకాలం ధాన్యం సేకరణపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, దేవరకొండ ఆర్డీఓ రమణా రెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, జ్యోతి పాల్గొన్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్ పూర్తి చేయాలి ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా కచ్చితమైన డేటాతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, మండల పట్టణ స్థాయిలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఫీల్డ్ లెవల్లో గుర్తించిన వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 22, 2026న నిర్వహించనున్న ఉమ్మడి గురుకుల ప్రవేశపరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. టీజీ సెట్– 2026 పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రవేశపరీక్షకు జనవరి 21 లోగా tgcet.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ హొక్షపతి, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, సంక్షేమ అధికారులు చత్రునాయక్, శశికళ పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మాడుగులపల్లి : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని ధర్మాపురంలో మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ, దీప్తి ఇన్స్టిట్యూట్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఎస్పీ శరత్చంద్రపవార్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్నేతతో కలిసి ఎంపీ రఘువీర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ శరత్చంద్రపవార్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బారిన పడకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. గ్రామంలోని 300 మందికి ఉచితంగా వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్త దశరథ, వైద్యులు కొండేటి సౌమ్యశ్రీ, డాక్టర్ ప్రమోద్కుమార్, నితీష, ఇమానియేల్, రోహిత్, నాయకులు అంకతి సత్యం, చింతరెడ్డి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిత్రం వేసి.. భక్తిని చాటి..
దేవరకొండ : దేవరకొండ పట్టణానికి నిడమనూరి మళ్లీశ్వరి వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి తనకు స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంది. మళ్లీశ్వరికి బొమ్మలు వేయడం అలవాటు కావడంతో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవరకొండలోని గరుడాద్రి వేంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో స్వామి వారి నిలువెత్తు చిత్రాన్ని వేసింది. సోమవారం రాత్రి స్వామివారి చిత్రాన్ని వేసేందుకు ఆమె సంకల్పించింది. వివిధ రంగులు, పుష్పాలు ఉపయోగించి సోమవారం రాత్రి 10గంటలకు ప్రారంభించి మంగళవారం ఉదయం 4 గంటలకు పూర్తి చేసింది. దేవాలయానికి వచ్చిన భక్తులు స్వామివారి చిత్రాన్ని చూసి సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. -
కాలచక్రంలో మరో ఏడాది గడిచిపోయింది. 2025లో ఎన్నో ఘటనలు జరిగాయి. మరెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని తీపి జ్ఞాపకాలుగా.. మరికొన్ని చేదు గుర్తులుగా మిగిలిపోయాయి. సంవత్సరం మొత్తంలో జరిగిన ఘటనల్లో కొన్ని...
జనవరి ● 5న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీబీనగర్లోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్ను సందర్శించారు. ● 10న చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురు మృతిచెందగా 19 మందికి గాయాలయ్యాయి. ● 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు మహాధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫిబ్రవరి ● 16న చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రారంభమై 20న ముగిసింది. ● 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్లో సొరంగం లోపల పైకప్పు కుప్పకూలి ఎనిమిది కార్మికులు మృతిచెందారు. ● 23న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ● 27న ఉపాధాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. మార్చి ● 10న దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఆరున్నరేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుగా తేల్చి.. ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ● 18న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ● 30న హుజూర్నగర్కు సీఎం రేవంత్రెడ్డి వచ్చారు. ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి ఉత్తమ్తో కలిసి ప్రారంభించారు. ఏప్రిల్ ● 2న భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామ పరిధిలో చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బీటెక్ విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. ● 9న చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్ద ఎస్బీఐ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులో ఉన్న రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ● 11న ముద్ర లోన్ పొంది వస్త్ర వ్యాపారాన్ని విస్తరించిన హుజూర్నగర్కు చెందిన సృజన.. ఢిల్లీలో ప్రధాని చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ● 20న పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే సభ విజయవంతానికి సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ● 21న నకిరేకల్లో టెన్త్ పరీక్ష కేంద్రంలో తెలుగు ప్రశ్నపత్రం లీకయ్యింది. ● 29న మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మే : ● 12న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు నాగార్జునసాగర్ను, 15న భూదాన్పోచంపల్లిలో చేనేత వస్త్ర తయారీని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. జూన్ ● 6న తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగిన ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. ● 9న సూర్యాపేట ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ● 12న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ భూదాన్పోచంపల్లిని సందర్శించి చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు. ● 26న కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్, కారు డ్రైవర్కు గాయాలయ్యాయి. జూలై ● 14న సీఎం రేవంత్రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రేషన్కార్డులు పంపిణీ చేశారు. ● 18న నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించి విద్యుదుత్పత్తిపై అధికారులతో సమీక్షించారు. ● 21న సూర్యాపేట పట్టణంలోని శ్రీసాయి సంతోషి జ్యువెల్లరీ షాపులో ఎనిమిది కిలోల బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ● 26న చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు.ఆగస్టు ● 1న యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్లో రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. సెప్టెంబర్ ● 5న పెన్పహాడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు మారం పవిత్ర రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్నారు. ● 15న మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అక్టోబర్ ● 1న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. 4న అంత్యక్రియలను తుంగతుర్తిలో నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, లక్ష్మణ్కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ● 12న తుంగతుర్తిలో నిర్వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ● 24న కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గుండాల మండలం వస్తాకొండూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూషారెడ్డి సజీవ దహనమైంది. ● 30న భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లిలోని సప్తవర్ణి గోశాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. నవంబర్ ● 22న మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించింది. ● 26న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్ ● 6న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ● 10న పంచాయతీ ఎన్నికల సందర్భంగా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడి హత్య జరిగింది. ఇది తీవ్ర కలకలం రేపింది. ● 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకున్నారు. ● 18న నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ● 23న బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు నల్లగొండలో జరిగిన సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ● 29న యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్యాదవ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. – సాక్షి నెట్వర్క్ -
అతిథి గృహాలన్నీ ఫుల్
నాగార్జునసాగర్: నూతన సంవత్సరం వేడుకల కోసం నాగార్జునసాగర్లోని అతిథి గృహాలన్నింటిని ఔత్సాహికులు బుక్ చేసుకున్నారు. గత 15రోజులక్రితమే విజయవిహార్లోని గదులన్నీ ఆన్లైన్లో బుక్ అయ్యాయి. స్థానిక సిద్దార్థ హోటల్ గదులతోపాటు ప్రైవేట్ హోటల్స్, సాగర్ డ్యాం అవతలి వైపు నూతనంగా 40గదులతో నిర్మించిన మాతా సరోవర్ రిసార్ట్స్ బుధవారం పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి. ఇతరులకు ఇబ్బంది కలగనీయొద్దు ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సాగర్ ిసీఐ శ్రీనునాయక్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ద్విచక్రవాహనాలపై త్రిబుల్ డ్రైవింగ్ చేసినా వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ టీమ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతిలేని హోటల్స్లో వినియోగదారులకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సాగర్లో డీజేకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ● నూతన సంవత్సరం నేపథ్యంలో గదులన్నీ బుకింగ్ చేసుకున్న ఔత్సాహికులు -
సత్య సాయి ప్రేమ వాహిని రథయాత్ర
రామగిరి(నల్లగొండ): పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి నల్లగొండ పట్టణంలో సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్రను ఘనంగా వైభవంగా నిర్వహించారు. పుట్టపర్తి నుంచి అలంకరించిన వాహనంలో సాయిబాబా చిత్రపటాన్ని వివిధ జిల్లాలు పర్యటిస్తూ మంగళవారం ఉదయం నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో రథయాత్రకు ఘన స్వాగతం పలికి సాయిబాబా ఆలయానికి తీసుకువచ్చారు. రాత్రి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కోలాటాలు భజనలు కీర్తనలతో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ విశ్వేశ్వర్, తుకారం, మురళీధర్, మదన్మోహన్, మల్లికార్జున్రెడ్డి, కవిత, దేవి, లకుమారపు శ్రీనివాస్, గోవింద బాలరాజ్, సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
నల్లగొండ : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన, నిరాధరణకు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలను గుర్తించి వారి భవిష్యత్ను కాపాడే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే నెల 1 నుంచి 31 వరకు పని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్ల పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురవుతున్నట్లు, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 1098, డయల్ 100 కు సమాచారం అందించాలని కోసారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు అరుణ, హరిత, భిక్షపతి, రంగారెడ్డి, గణేష్ పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓతో నేడు ఫోన్ ఇన్
కోళ్లకు టీకాలు వేయించాలి కోళ్ల పెంపకందారులు వ్యాధినిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు కోరారు.- 8లోచలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓతేదీ. 31.12.2025 బుధవారం సమయం: ఉదయం 11–00 నుంచి మధ్యాహ్నం 12–00 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 99082 73355 -
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు
మునగాల: వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా విద్యాధికారి(డీఐఈఓ) భానునాయక్ పేరొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకేషనల్ విద్యార్థులు మంగళవారం మునగాల మండలం ఇందిరానగర్ వద్ద గల సోలార్ పవర్ప్లాంటును తిలకించారు. డీఐఈఓ మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న విషయాలకంటే క్షేత్రస్థాయిలో నేర్చుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులకు ఆన్జాబ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, ప్లాంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని..
నార్కట్పల్లి: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గడ్డం సత్తిరెడ్డి (55) సోమవారం రాత్రి కడుపులో ఆయాసంగా ఉందని కామినేని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చాడు. సుమారు 10 గంటల సమయంలో డాక్టర్లు ఆయనకు ఈసీజీ తీయించి నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్లో జాయిన్ చేశారు. అదేరోజు రాత్రి 2గంటల సమయంలో మృతిచెందాడు. దీంతో సత్తిరెడ్డిని జాయిన్ చేసిన బ్లాక్లో ఆక్సిజన్ లేదని, అరగంట అయినా వైద్యులు రాకపోవడంతోనే మృతిచెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యులపై కేసు నమోదు చేసినట్లు తెలపడంతో ధర్నా విరమించారు. సత్తిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబసభ్యులు, బంధువుల ధర్నా -
పెరటి కోళ్లకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
కోదాడరూరల్ : పెరటి కోళ్ల పెంపకందారులు క్రమం తప్పకుండా వ్యాధినిరోధక టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెరటి కోళ్లకు వ్యాధి నిరోధక టీకా వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కోదాడలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకుకు హైదరాబాద్కు చెందిన చప్పిడి జయకాంతమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కుమారుడు డాక్టర్ చప్పిడి సుధాకర్ పెరటి కోళ్ల టీకాల కోసం రూ.20వేల విలువైన మందులు అందజేయడం అభినందనీయమన్నారు. స్థానిక పశువైద్యశాలలో ప్రతి మంగళవారం కోళ్లకు ఈ ఉచిత టీకాలు వేయనున్నట్లు తెలిపారు. టీకాలు వేయించడం ద్వారా సీజనల్ వ్యాధుల నుంచి కోళ్లను కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వీఎస్శర్మ, ఖమ్మం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల రూపకుమార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సిరిపురపు సురేంద్ర, డాక్టర్ మమత, డాక్టర్ సుమతి, సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, హరికృష్ణ ఉన్నారు. -
డీఎంహెచ్ఓతో రేపు ఫోన్ ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓతేదీ. 31.12.2025 బుధవారం సమయం: ఉదయం 11–00 నుంచి మధ్యాహ్నం 12–00 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 99082 73355 -
పనులుకాలే!
నిధులొచ్చినా.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టినా.. అనుకోకుండా ప్రమాదం జరిగి ఫిబ్రవరి 22వ తేదీన పనులు ఆగిపోయాయి. సొరంగం కూలిన ప్రాంతానికి సమాంతరంగా 100 మీటర్లు జరిపి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వాలని భావించారు. ఇందుకోసం మిలిటరీలో వినియోగించే హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వేను చేయించారు. ఈ సర్వే నివేదిక కూడా ఇటీవల ప్రభుత్వానికి చేరింది. అయితే సొరంగంలో భారీ నీటి ప్రవాహం ఉందని, రాళ్ల నుంచి నీరు, బురద వస్తున్నట్లుగా నివేదించినట్లు తెలిసింది. మరోవైపు ఔట్లెట్ నుంచి తవ్వేందుకు అమెరికా నుంచి బేరింగ్ తెప్పించినా ఆదీ ఆగిపోయింది. మొత్తానికి ఈ సంవత్సరంలో సొరంగం పనులు ముందుకు సాగలేదు. వచ్చే ఏడాదైనా పనులు ప్రారంభం అవుతాయా? లేదా? వేచి చూడాల్సిందే. సింగరాజుపల్లి రిజర్వాయర్ఫ జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు ఫ ఈ ఏడాది డిండి ఎత్తిపోతలకు రూ.1800 కోట్లు.. ఫ ఏఎమ్మార్పీ కాల్వల ఆధునీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ అనుకోని ప్రమాదంతో నిలిచిన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఫ 2025లో అభివృద్ధి, సంక్షేమం మాత్రం కాస్త మెరుగు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు 2025 సంవత్సరంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే చందంగానే మారాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ఏనాడో ప్రారంభమైనా పూర్తి కాలేదు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించినా కుడి, ఎడమ కాల్వల పనులు ముందుకు సాగలేదు. డిండి ఎత్తిపోతల పథకం పనులు అనేక అవాంతరాల నడుమ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఈ పనులకు ప్రభుత్వం రూ.1800 కోట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)కాలువల లైనింగ్ పనులకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే కొత్త సంవత్సరంలోనైనా వీటి పనులు ముందుకు సాగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. జిల్లాలో 40 ఏళ్ల కిందట తవ్విన ఏఎమ్మార్పీ కాల్వలు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు, అక్కడినుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ సముద్రానికి నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మరో 36 కిలోమీటర్ల వరకు కాలువ ఉంది. ఈ కాల్వల లైనింగ్, ఆధునుకీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాదైనా ఈ పనులు ప్రారంభమవుతాయా? లేదా? చూడాల్సిందే. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు పూర్తయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో ప్రారంభించారు. అయితే డిస్ట్రిబ్యూటరీల పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కుడి, ఎడమ కాల్వలకు సంబందించి 2,888 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. 1,200 ఎకరాలు సేకరించారు. వచ్చే ఏడాదైనా ఎంతమేరకు జరుగుతుందో చూడాలి. జిల్లాలో ఈ ఏడాది సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల గృహ ప్రవేశాలు చేశారు. జిల్లాలో రెండు విడతల్లో 19,697 ఇళ్లను కేటాయించగా, అందులో 17,246 ఇళ్లు ఇప్పటికే మంజూరు చేశారు. వాటిల్లో 13,494 ఇళ్లు గ్రౌండ్ లెవల్ పనులు సాగుతుండగా, 1,868 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 650 ఇళ్లు రూప్లెవెల్లో ఉన్నాయి. మండలానికి 5 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజక వర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాలు నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్ నుంచే ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా అనేక రంగాల్లో ప్రోత్సాహం ఇస్తోంది. పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిలను విడుదల చేసింది. పెట్రోలు బంక్ల ఏర్పాటుకు మహిళ సంఘాలు ముందుకు రావడంతో వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నల్లగొండలోని పానగల్ ఫ్లై వోవర్ నుంచి ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజీ వరకు రూ.500 కోట్లతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణ పనులను ఈ ఏడాది ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాంగా డిండి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏడు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, నాగర్కర్నూల్ జిల్లాలో రెండు, నల్లగొండ జిల్లాలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే వాటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కాలువల పనులు పెండింగ్లోనే ఉన్నాయి. డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పెండింగ్లో ఉన్న రిజర్వాయర్ల పనులను పూర్తి చేసేందుకు, కాలువలు తవ్వేందుకు ఇటీవల రూ.1800 కోట్లను కూడా మంజూరు చేసింది. టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమతున్నారు. అయితే ఆ పనులు 2026 సంవత్సరంలో ఎంత మేరకు సాగుతాయో వేచి చూడాల్సిందే. -
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు
ఫ వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తు వేగవంతం కానుంది. వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి 10న ప్రకటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 30న మున్సిపాలిటీల వారీగా వివరాలు సరిచూసుకోవాలని, 31వ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. జనవరి 1న పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల ముసాయిదా ప్రకటించాలని స్పష్టం చేసింది. 5వ తేదీన మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని వివరించింది. 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రకటించాలని వెల్లడించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా 2011 ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను కూడా జారీచేసింది.డీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగాబాధ్యతల స్వీకరణనల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సీఈఓ శంకర్రావు, అధికారులు నర్మద, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, పశుసంవర్థక అధికారి డాక్టర్ రమేష్, సంపత్రెడ్డి, శ్రీనివాస్, మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు డీసీసీబీ అభ్యున్నతికి కృషి చేశాం తన రెండేళ్ల పదవీ కాలంలో బ్యాంకు అభ్యున్నతికి తమ పాలకవర్గం కృషి చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే నాటికి రూ.900 కోట్ల టర్నోవర్లో ఉన్న బ్యాంకును రూ.3680 కోట్ల టర్నోటర్కు తెచ్చి రూ.60 కోట్ల లాభాల దిశగా నడిపించామన్నారు. రైతులు, విద్యార్థులకు, ఇతర రుణాలను అందించడంలో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ముందున్నామన్నారు. రాష్ట్రంలోనే బ్యాంకును రెండో స్థానంలో నిలిపిన ఘనత తమ పాలక వర్గానికి దక్కిందన్నారు. బ్యాంకు అభ్యున్నతికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మాజీ డైరెక్టర్ సంపత్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం
ఫ కపాస్ కిసాన్ యాప్లో పత్తి క్వింటాళ్ల నమోదులో తేడాలు ఫ యాప్లో చూపించకపోతే కొనుగోలు చేయలేమన్న సీసీఐ కేంద్రం నిర్వాహకులు ఫ చిట్యాలలో ఆందోళనకు దిగిన రైతులు చిట్యాల : కష్టపడి పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి పంటను సాఫ్ట్వేర్ లోపం కారణంగా క్వింటాళ్ల నమోదులో తేడాలు వచ్చాయి. దీంతో కొనుగోలు చేయలేమని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో చేసేది లేక పత్తి రైతులు చిట్యాలలో సోమవారం ఆందోళనకు దిగారు. పత్తి రైతులంతా కలిసి చిట్యాల–ఉరుమడ్ల రహదారి వెంట ఉన్న పత్తి మిల్లు ఎదుట ధర్నా చేశారు. యాప్ నమోదులో తేడాలు.. నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నల్లగొండ మండలాలకు చెందిన వందాలాది రైతులు తాము పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో చిట్యాలలోని కృష్ణా కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రానికి కేటాయించారు. దీంతో సోమవారం సుమారు 175 మందికి పైగా పత్తి రైతులు పత్తిని మిల్లుకు తీసుకొచ్చారు. స్లాట్బుక్ చేసే సమయంలో ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా పత్తిని అమ్ముకునేందుకు స్లాట్బుక్ అయ్యింది. సోమవారం సీసీఐ కేంద్రంలో విక్రయానికి వచ్చే సమయానికి ఎకరాకు 4 క్వింటాళ్ల పత్తిని విక్రయించేందుకుగాను యాప్లో చూపిస్తోంది. యాప్లో చూపించిన మేరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో కపాస్ కిసాన్ యాప్లో తాము మొదటగా స్లాట్బుక్ నమోదు చేసుకున్నప్పుడు నమోదైన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు అందోళనకు దిగారు. చిట్యాల–ఉరుమడ్ల రోడ్డులో కాటన్ మిల్లు ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఐదు రోజుల్లో రెండుసార్లు.. యాప్లో ఏర్పడిన సాఫ్ట్వేర్ లోపంతో ఐదు రోజుల్లో రెండుమార్లు రైతులు ఇబ్బందులు పడ్డా.. సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి పత్తిని తీసుకొచ్చి తిరిగి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు.. అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్.. సీసీఐ ఏరియా మేనేజర్ మున్షికి ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అయితే యాప్లో వచ్చిన దానికి అదనంగా ఐదు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. చిట్యాలలో కిసాన్ యాప్లో తమకు నమోదైన పత్రాలను చూపుతున్న రైతులుచిట్యాలలో కాటన్ మిల్లు ఎదుట ధర్నా చేస్తున్న పత్తి రైతులుగుజ్జ గ్రామంలో నాకున్న నాలుగెకరాల్లో పండిన పత్తి పంటను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే 43 క్వింటాళ్ల పత్తిని అమ్ముకునేందుకుగాను బుక్ అయ్యింది. విక్రయానికి కాటన్ మిల్లు వద్దకు రాగానే యాప్లో 14 క్వింటాళ్లు మాత్రమే నమోదైందని.. అంతే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. స్లాట్ బుక్ చేసిన సమయంలో నమోదైన పత్తిని కొనుగోలు చేసేందుకుగాను అధికారులు సహకరించాలి. – దోడ క్రిష్ణారెడ్డి, పత్తి రైతు, గుజ్జ గ్రామం రైతులు పత్తి విక్రయానికి తీసుకువచ్చినప్పుడు కిసాన్యాప్లో నమోదైన క్వింటాళ్ల మేరకు పత్తిని కొనుగోలు చేస్తాం. సాఫ్ట్వేర్ లోపంతో జరిగిన తప్పిదాలకు తాము ఏమీ చేయలేం. ఆందోళన చేసిన రైతుల సమస్యనుపై అధికారులకు తెలియజేసి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. – కోటేశ్వరరావు, సీసీఐ కేంద్రం సీపీఓ, చిట్యాల -
పత్తి మిల్లు వద్ద రైతుల ఆందోళన
చండూరు : స్లాట్ బుక్ చేసుకున్నా.. పత్తిని కొనుగోలు చేయడం లేదని చండూరు మండలంలోని బంగారిగడ్డ మంజీత్ పత్తి మిల్లు వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. స్లాట్బుక్ చేసుకున్న దానికి, ట్రాక్టర్లో తెచ్చిన పత్తికి వ్యత్యాసం ఉండటంతో కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్లాట్ బుకింగ్ ఉండి పత్తి ఎక్కువ తెచ్చినా కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు సీసీఐ కేంద్రం నిర్వాహకులు దళారులతో కుమ్మకై ్క రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు సీసీఐ కేంద్రం అధికారి బాలచందర్ నింజేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను ఉంచి ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్లను మిల్లులోకి పంపారు. కానీ కొనుగోలుపై సీసీఐ అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. -
ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ చూపాలి
చిట్యాల, నార్కట్పల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్శాఖ శ్రద్ధ చూపాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, చిట్యాల పట్టణంలో హైవేపై నిర్మిస్తున్న ఫ్రై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను, రైల్వే అండర్ బ్రిడ్జి కింద గల హైవే రోడ్డును, నార్కట్పల్లి వద్ద నల్లగొండ బైపాస్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. రోడ్డుపై అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో హైవే రోడ్డుపై లైటింగ్, ప్రమాదకర హెచ్చరిక బోర్డులను, రిప్లెక్టివ్ సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ కె.శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐలు రవికుమార్, క్రాంతికుమార్, చిట్యాల మున్సిపల్ కమిషన్ శ్రీను, హైవే అధికారులు ఉన్నారు. గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 42 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్రెడ్డి, వెంకటేశం
నల్లగొండ టూటౌన్ : జనగామలో జరిగిన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముదిరెడ్డి రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పెరుమాళ్ల వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని, రాష్ట్ర కమిటీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని తెలిపారు. ముదిరెడ్డి రాజశేఖర్రెడ్డి పెరుమాళ్ల వెంకటేశం -
బ్యాటరీ వాహనం ఇప్పించండమ్మా..
నల్లగొండ : ‘చేత్తో తిప్పే రిక్షా, ట్రై సైకిల్తో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు బ్యాటరీ వాహనం ఇప్పించి ఆదుకోండి’ అంటూ పలువురు దివ్యాంగులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నించారు. ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్న మాకు బ్యాటరీ వాహనం ఇప్పిస్తే.. ఏదో ఒక పని చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరో విడత వచ్చే వాహనాల్లో ప్రాధాన్యం ఇస్తామని వారితో చెప్పారు. పథకాలపై అవగాహన కల్పించాలి సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వివిధ బ్యాంకుల్లో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహించని బ్యాంకు అకౌంట్లలో సుమారు రూ.66 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.20 కోట్లు ఉండగా మిగతావి ప్రజలకు సంబంధించినవని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యూరియా పంపిణీలో వివాదాలు రాకుండా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసిన యాప్లో సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లాకు త్వరలో రవాణ శాఖ కమిషనర్ వస్తారని.. చిట్యాల అండర్ పాస్, రోడ్డు ప్రమాదాలపై సమీక్షిస్తారని తెలిపారు. దేవరకొండ, పెద్దవూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీఐఎల్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా సౌండ్ మిషన్లు, దివ్యాంగులకు పంపిణీ చేసిన ట్రైసైకిళ్లు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఫ గ్రీవెన్స్లో కలెక్టర్కు దివ్యాంగుల వినతి -
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. క్రిస్మస్తో పాటు వారాంతపు సెలవులు ముగియడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు రాజధానికి తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అదనంగా రెండు లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాలు భారీ సంఖ్యలో వస్తుండటంతో టోల్ప్లాజా దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
విలపించిన పుల్లెంల
గట్టుప్పల్,చండూరు : పుల్లెంల కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ హనుమంతు ఎటుపోయిండని బోరున విలపించింది. ఒడిశా రాష్టంలో ఈనెల 25న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు ఆలియాస్ గణేష్ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన పుల్లెంలకు చేరుకుంది. ఆయన కడసారి చూపు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామాన్ని ముందుగానే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నా.. ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉదయం నుంచే గ్రామంలో ఎదురు చూశారు. అంబులెన్స్లో ఆయన పార్థివదేహం వచ్చాక ప్రజలు ఎర్ర జెండాలు చేతబూని అంబులెన్స్పై పూలు చల్లుతూ ర్యాలీగా హనుమంతు ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా హనుమంతు ఇంటి దగ్గరకు పరుగులు పెట్టారు. ఆయన పార్థివదేహాన్ని చూపిన జనం బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ఆయనకు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ‘జోహార్ హనుమంతు’ నినాదాలతో ఆయన అంతిమయాత్ర గ్రామంలో మూడు గంటలపాటు సాగింది. ఫ అశ్రునయనాలతో మావోయిస్టు నేత హనుమంతుకు అంతిమ వీడ్కోలు -
మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి
నకిరేకల్ : తెలంగాణ గర్వించదగ్గ మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన గింజల నర్సింహారెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా బాలాచారి మాట్లాడుతూ గింజల నర్సింహారెడ్డి సాహిత్యంలోని గాఢత, అభివృద్ధికి, అలంకారీక సౌందర్యం నేటి తరం కవులు అలవర్చుకోవాలన్నారు. కవి, చరిత్రకారులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచేపోయే కవిత్వాలను గింజల నర్సింహారెడ్డి రాశారని గుర్తు చేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ముసుగు కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, కందాల పాపిరెడ్డి, కవులు జిలకర జమదగ్ని, బరిగల శ్రవణ్, షీలా అవిలేను, మెంతబోయిన సైదులు, మామిడి లింగస్వామి, సంగభట్ల నర్సయ్య, ఎం.జానకిరాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, కోల్లోజు కనకాచారి, చిక్కు చంద్రమౌళి, కందుల సోమయ్య, కుకడాల గోవర్ధన్, సాగర్ల సత్తయ్య, సారంగి వెంకన్న, తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ సభను కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్జీకాలేజీ నుంచి శివాజినగర్, రామగిరి, బస్టాండ్, ప్రకాశంబజార్ మీదుగా గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. నల్లగొండ జిల్లాను, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నల్లగొండలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రాజెక్టులు కట్టి, సీలింగ్ విధానం తెచ్చి పేదలకు భూములు పంచారని తెలిపారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలే.. తనకు పేరు వస్తుందని పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలం సొరంగంలో ఒక్క పనీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించామని, సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ సహకారంతో రెండేళ్లలో సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో కాలు అడ్డం పెడితే ప్రతి ఎకరాకు నీరందే విధంగా చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం కోమటిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి నాయకత్వంలో నల్లగొండ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 45 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, సంపత్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, అనూప్రెడ్డి, ఇంతియాజ్ అలీ, నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఫ ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తా ఫ రెండేళ్లలో శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేస్తా ఫ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి -
నల్లగొండ మున్సిపల్ కమిషనర్కు పదోన్నతి
నల్లగొండ టుటౌన్ : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్కు గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేడ్–2 కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ముసాబ్ అహ్మద్ గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్గా అవకాశం దక్కింది. పదోన్నతి పొందిన ఆయనకు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అబినందనలు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం మిర్యాలగూడ అర్బన్ : రైలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాకూర్ అన్నారు. మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన రైల్వే రక్షణ దళ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. రైల్వే ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆధునిక రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాసింజర్ల సామగ్రి భద్రతతో పాటు ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. దక్షణమద్య రైల్వే పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాశ్వత ఐడీలను సేకరిస్తున్నామని, భద్రతా బృందాలను పెంచి సెల్ఫోన్, చైన్ స్నాచింగ్ అరికట్టే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయ రైల్వేలో భద్రతను పటిష్టం చేసేందుకు సురఖా సమ్మేళన్, మేరీ సహేళి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం నల్లగొండ : ఉపాధిహామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగింపు దుర్మార్గపు చర్య అని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఆదివారం నల్లగొండలో శివాజీనగర్ నుంచి రామగిరిలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ చిత్రపటాలతో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రపంచంలో నేడు భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి గాంధీ, నెహ్రూ దూరదృష్టి కారణమన్నారు. కార్యక్రమంలో కన్నారావు, ఎండీ.ముంతాజ్ అలీ, బోడ స్వామి, నూనె కోటి, జిల్లా పరమేష్, సుధాకర్, పుట్ట వెంకన్న, రాంబాబునాయుడు, రవితేజ, బాలకృష్ణ, రఫీ, శివ, బ్రహ్మచారి, టి.యాదగిరి, మహేష్, కోటేష్, సంతోష్, సాయితేజ, దశరథ, శరత్, సాయి, లక్ష్మణ్, ఉమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. డిండి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదలడిండి: డిండి ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం 14.53లక్షల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ రాజారాం మాట్లాడారు. ప్రభుత్వం చెరువులో ఉచితంగా వదిలే చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మత్స్యకారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్లగంతుల రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ సొసైటీ చెర్మన్ మేకల కాశన్న, ఎఫ్డీఓ మారయ్య, వెంకటేష్, బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీస్శాఖ ముందంజ
నల్లగొండ: పోలీసు శాఖ తీసుకున్న చర్యల వల్ల 2024తో పోల్చితే 2025లో నేరాలు తగ్గాయి. మహిళల భద్రత, పిల్లల రక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతతోపాటు యువత సాధికారత వంటి రంగాల్లో పోలీస్శాఖ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మహిళలపై నేరాలు కాస్త పెరిగాయి. సైబర్ కేసులు పెరిగినప్పటికీ వారు కోల్పోయిన సొత్తును రికవరీ చేయడంలో మెరుగ్గా ఉంది. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. చాలా కేసుల విషయంలో సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను న్యాయస్థానం ముందు ఉంచి శిక్షలు పడేలా పోలీస్ శాఖ కృషి చేసింది. జిల్లా పోలీస్ శాఖ జిల్లాలో వివిధ కేసుల్లో నేరస్తులకు నేర నిరూపన చేయడంలో పోరెన్సిక్ మద్దతు, డిజిటల్ ఆధారాలతో పాటు, అభియోగ అధికారులతో సమన్వయం, సాక్షులకు రక్షణ కల్పించడం, వాంగ్మూలం నమోదు వంటి చర్యలు తీసుకుంది. దీంతో నిందితులకు జీవిత ఖైదు, మరణ శిక్షలు పడేలా కృషి చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 130 మంది నేరస్తులకు శిక్షపడేలా సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాలు పెరిగాయి. గత సంవత్సరం 235 కేసులు నమోదు కాగా దానిలో బాధితులు రూ.16,31,08,000 కోల్పోగా.. రూ.1,25,50,279 రికవరీ చేశారు. ఈ సంవత్సరం 255 కేసులు నమోదు చేయగా కేవలం రూ.4,62,03,509 కోట్లు నష్టపోయారు. దానిలో రూ.1,48,20,918 రికవరీ చేశారు. అంటే కేసులు అధికంగా నమోదు అయినా రికవరీలో ఈ సంవత్సరం పోలీస్ శాఖ మెరుగు పడింది. గత సంవత్సరంతో పోలిస్తే పోలీస్ శాఖ తీసుకున్న వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గత సంవత్సరం 41 బ్లాక్ స్పాట్లు ఉంటే ఈ సంవత్సరం అవి 30కి తగ్గాయి. గత సంవత్సరం మొత్తం 907 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 1,197 మంది బాధితులు ఉన్నారు. ఈ సంవత్సరం 897 ప్రమాదాల్లో.. 1075 మంది బాధితులు ఉన్నారు. జిల్లాలో 2024లో దోపిడీ కేసులు నాలుగు నమోదయ్యాయి. కానీ, ఈ సంవత్సరం ఒక్కటి కూడా నమోదు కాలేదు. చోరీ కేసులు గత సంవత్సరం 10 నమోదుకాగా.. ఈ ఏడాది 6కు తగ్గాయి. గత సంవత్సరం 700 ఆస్తి నేరాల కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం 600కే పరిమితం అయ్యాయి. గత సంవత్సరం 35 మర్డర్ కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 24కు తగ్గాయి. నేరపూరిత హత్యలు మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5 పెరిగాయి. రేప్ కేసులు గత సంవత్సరం 101 నమోదు కాగా ఈ సంవత్సరం 87కు తగ్గాయి. వివిధ సంఘటనల్లో గాయపడిన, మోసాలు తదితర కేసులు కూడా తగ్గాయి. ఈ కేసుల్లో ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మత్తు పదార్థాలను అరికట్టే విషయంలో కేసులు నమోదు చేయడంతో పోలీస్ శాఖ ముందంజలో ఉంది. గత సంవత్సరం 36 కేసులు నమోదు చేసి 139 మందిని అరెస్టు చేయగా, ఈ సంవత్సరం 53 కేసులు నమోదు చేసి 251 మందిని అరెస్టు చేసింది. ఫ సైబర్ కేసులు పెరిగినా.. సొత్తు రికవరీలో మెరుగు ఫ దోపిడీ, చోరీ కేసుల్లోనూ తగ్గుదల ఫ అవగాహన కార్యక్రమాలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు ఫ ఈ ఏడాది జిల్లాలో తగ్గిన క్రైం రేటు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళలపై నేరాలు స్వల్పంగా పెరిగాయి. 2024లో 684 కేసులు నమోదైతే, ఈ సంవత్సరం 703 కేసులు నమోదయ్యాయి. వరకట్నం కేసులు గత సంవత్సరం ఒక్క కేసు నమోదు.. ఇప్పుడు రెండు నమోదయ్యాయి. మహిళల వేధింపు కేసులు గత సంవత్సరం 313 నమోదైతే.. ఈ సంవత్సరం 346కు పెరిగాయి. మహిళ హత్యలు 9 నుంచి 11కు పెరిగాయి. అత్యాచారం కేసులు గత సంవత్సరం 101 నమోదుకాగా.. ఈ సంవత్సరం 87కు తగ్గాయి. కిడ్నాప్ కేసులు గత సంవత్సరం 26 నమోదు కాగా, ఈ సంవత్సరం 27 నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులు గత సంవత్సరం 216 నమోదు కాగా ఈ సంవత్సరం 196కు తగ్గాయి. బహుభార్యత్వం కేసులు తగ్గాయి. పోక్సో చట్టం కింద చిన్నపిల్లల నేరాలకు సంబంధించిన కేసులు గత సంవత్సరం 201 నమోదు కాగా అవి 117కు తగ్గాయి. ఈ విషయంలో పోలీస్శాఖ కొంత మెరుగు పడిందనే చెప్పాలి. -
మంచి పనులే చరిత్రలో నిలుస్తాయి
మిర్యాలగూడ : గొప్ప వ్యక్తులు చేసిన మంచి పనులే చరిత్రలో నిలుస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నభీమోజు మదనాచారి పుస్తకావిష్కరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. మదనాచారి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారని అన్నారు. తన తోటి కాంగ్రెస్ మిత్రుడు రాంరెడ్డిని హత్య చేసేందుకు వచ్చిన ప్రత్యర్ధులను నిలువరించే క్రమంలో ఆయన హత్యకు గురయ్యారని గుర్తుచేశారు. ధైర్యం, ప్రేమగుణం మదనాచారి నైజమని.. అది భావితరాలకు మార్గదర్శకమన్నారు. తక్కువ కాలమే జీవించినప్పటికీ ఇతరులకు ఆదర్శంగా మదనాచారి బతికారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారని, ఆనాటి పోరాట యోధులకు ఆయుధాలు తయారుచేసి అందించిన ఘనత ఇక్కడి విశ్వకర్మలదేనన్నారు. పోలీసుల దాడులు చిత్రహింసలకు సైతం విశ్వకర్మలు బలి అయ్యారని.. నాటి విశ్వకర్మల నుంచి నేటి మావోయిస్ట్ మల్లోజు వీరన్న, శ్రీకాంతాచారి, కొత్తపల్లి జయశంకర్ అనేక మంది త్యాగాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మదనాచారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన విగ్రహ ప్రతిష్ఠించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు సిడి రవికుమార్, చిరుమర్రి కృష్ణయ్య, సిద్దార్ధ, బంటు సైదులు, సాధినేని శ్రీనివాస్, గౌరు శంకర్, అన్నభీమోజు నాగార్జునచారి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, మదనాచారి, వేణుగోపాల్రెడ్డి, పుస్తక రచయిత తాటికొండ సురేష్, చిట్టిబాబునాయక్, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఇలియాస్ తదితరులు ఉన్నారు. ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి -
సరికొత్తగా సెలబ్రేషన్స్
మూడు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లోని యువకులు గ్రూపులుగా ఏర్పడి విందు, మందు, వినోదం ఉండేలా వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 31వ తేదీ రాత్రి కేక్ కట్ చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఫ ఇయర్ ఎండ్ వేడుకలకు సిద్ధమవుతున్న యువత ఫ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ ఫ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసేందుకు కొందరి ఆసక్తి ఫ ఫామ్హౌస్లలో విందు, వినోదాలకు ప్రణాళిక ఫ ‘మ్యూజికల్ నైట్స్’ నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు సూర్యాపేట టౌన్, రామగిరి(నల్లగొండ), భువనగిరిటౌన్ : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికే సమయం దగ్గర పడింది. ఆట పాటలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపేందుకు యువత ప్రణాళికలు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే యోచనలో ఉన్నారు. కొందరు యువకులు గోవా, వైజాగ్, అరకుతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్ శివారులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, పబ్లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు, వ్యాపారులు తమ కుటుంబంతో కలిసి రిసార్ట్స్లో వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 31న ఉదయమే హైదరాబాద్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువకులు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాలు, గ్రామాల సమీపంలోని తోటల్లో న్యూఇయర్ వేడుకలకు జరుపుకునేందుకు యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ట్రెండ్ మార్చుకుని స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వంటకాలు చేసుకుని పల్లె పదాలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాటి కల్లు తీసుకుని.. కుండ చికెన్, వివిధ మాసాంహార వంటలు, రొట్టెలు స్వయంగా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏడాది 31 రోజు వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు పెడుతుంటారు. హోటళ్ల ఎదుట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుంటే కిలో కేక్.. కిలో కేక్ తీసుకుంటే లీటరు కూల్ డ్రింక్ ఇలా ఆఫర్లు పెడుతూ బేకరీలు, హోటళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. యువత అభిరుచికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నారు. 31వ తేదీన నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక, నల్లగొండ పట్టణం సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో న్యూ ఇయర్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేశారు. పార్టీకి హాజరయ్యే సింగిల్, జంటలకు ఎంట్రీ ఫీజు వసూలు చేయనున్నారు. -
ఒడిదుడుకుల సాగు
నల్లగొండ అగ్రికల్చర్ : 2025 వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి 5,56,826 ఎకరాల్లో, వరి 5,48,134 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే వర్షాలకు పంటలు దెబ్బతిని ఓవైపు, పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఎదురైన సమస్యలతో మరోవైపు ఇబ్బందులు తప్పలేదు. ఇక యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పీఏసీఎస్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముంచిన అత్యధిక వర్షం.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా అధిక వర్షం కురిసింది. అప్పటికే పత్తి కాయ పగులే దశలో ఉండటంతో కాయలు రాలడంతో పాటు పగిలిన పత్తి కారిపోయింది. 25,919 ఎకరాల్లో 30 శాతానికి పైగా పంట దెబ్బతిందని యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. వర్షంతో ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 35,487 ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. వర్షాల వల్ల వరి చేలు నీటిలో మునిగి ధాన్యం మొలకెత్తింది. దీని కారణంగా వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అమ్ముకోవడానికి అష్టకష్టాలు.. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో పండించిన పత్తి, ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి పోతే తేమ శాతం ఎక్కువగా ఉందని నెల వరకు కొనుగోలు చేయలేదు. పత్తి అమ్మకానికి కపాస్ కిసాన్ యాప్లో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉండగా దానిపై అవగాహన లేక నేటికీ ఇంకా పత్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం తెచ్చి రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలు లేని కారణంగా పచ్చి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తెచ్చారు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడంతో దాన్యాన్ని రోజుల తరబడి కేంద్రాల వద్ద ఆరబెట్టుకుని అమ్ముకోవాల్సి వచ్చింది. యూరియా కోసం పడిగాపులు.. వానాకాలం సీజన్లో ఒకేసారి పత్తి, వరి చేలకు యూరియా వేసే సమయం రావడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. డిమాండ్కు తగినట్లుగా ప్రభుత్వం యూరియాను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు చెప్పులను, పాస్బుక్లను లైన్లో పెట్టి రాత్రిళ్లు కూడా ఆయా కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. యాంత్రికరణ పథకం వాయిదా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం తప్ప అడుగు ముందుకు పడలేదు. పథకం అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుందే తప్ప.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు 2025 సంవత్సరంలో వ్యవసాయం కలిసి రాలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వానాకాలంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులకు అతివృష్టి, అనావృష్టి కన్నీరు మిగిల్చింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు అప్పుల పాలయ్యారు. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సీజన్ ఆరంభమైనందున విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, వరి నాట్ల కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు, పొలాలు, దున్నకాల కోసం రైతులు పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు చెల్లిస్తుందో అన్న ఎదురు చూపుల్లో రైతులు ఉన్నారు. ఫ వానాకాలంలో భారీ వర్షాలతో రైతులు ఆగం ఫ సగానికి పడిపోయిన దిగుబడులు ఫ పంటలు అమ్ముకునేందుకు తిప్పలు ఫ యూరియా కోసం తప్పని పడిగాపులు ఫ రైతు భరోసాకు తప్పని ఎదురుచూపులు ఫ రైతులకు కలిసిరాని 2025 సంవత్సరం -
న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి
నల్లగొండ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటారని తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలు ఇలా.. ఫ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దు. ఫ ఫామ్ హౌస్, క్లబ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దు. ఫ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దు. ఫ మైనర్లకు బైకులు ఇవ్వొద్దు. వాహననడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తాం. ఫ త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తాం. ఫ గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ప్రజలతో మమేకం కావాలి
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నకిరేకల్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికై న వారు రాజకీయాలకతీతంగా ప్రజలతో మమేకమై గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నకిరేకల్లో శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గతంతో పోలిస్తే గ్రామ రాజకీయాలు పూర్తి మారిపోయాయన్నారు. సామాన్య కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజలతో మమేకమైతే ఎప్పుడూ ఆశ్వీరదిస్తారని, తన రాజకీయ జీవితమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో సర్పంచ్ పదవి కీలకమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులుగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, పూజర్ల శంభయ్య, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితా, చామల శ్రీనివాస్, గాజుల సుకన్య, నకిరెకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, పన్నాల రాఘవరెడ్డి, యాసా కరుణాకర్రెడ్డి, గాదగోని కొండయ్య, నరేందర్ పాల్గొన్నారు.కృష్ణపట్టెలో మొసళ్ల భయం కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. - 8లోఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు గాను ఆలయ ఆవరణలో కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్బాబు సమక్షంలో శనివారం వేలం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేఎం హెయిర్స్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు రూ.2.50 కోట్లకు తలనీలాల సేకరణ హక్కును దక్కించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు బీజేపీ నేతల పంచాయితీనల్లగొండ టూటౌన్ : నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, పార్టీ నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజుయాదవ్ వర్గాల మధ్య జరిగిన వివాదం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వద్దకు చేరింది. ఈ ఘటనపై ఇద్దరు నాయకులతో మాట్లాడిన రాంచందర్రావు జనవరి 2వ తేదీ వరకు దీనిపై ఎవరూ మాట్లాడవద్దని తనదైన శైలిలో చెప్పినట్లు తెలిసింది. జనవరి 2వ తేదీన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే జిల్లా నాయకుల వ్యవహారశైలి, నాయకుల మధ్య వర్గపోరు, పార్టీ బలోపేతం చేయకుండా కొట్టుకుంటున్న వ్యవహారంపై చర్చించనున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. తాను మాట్లాడే వరకు ఏ సమావేశంలో కూడా ఈ ఘటనపై గప్చుప్గా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా.. శనివారం పిల్లి రామరాజు యాదవ్.. రాంచందర్రావును కలిసి జరిగిన ఘటనపై వివరించారు. హనుమంతు కుటుంబానికి పరామర్శచండూరు : ఒడిశాలో ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి శనివారం చండూరు మండలం పుల్లెంలలో పరామర్శించారు. హనుమంతు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్న ఆయన బావ మల్లిక్తో మాట్లాడారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. హనుమంతును లొంగిపొమ్మని చెప్పేందుకు తాను ప్రయత్నించానని, అందులో భాగంగానే ఒడిశా వెళ్లి 10 రోజులు ఉన్నా.. హనుమంతును కలవడం కుదరలేదని మల్లిక్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నలపరాజు రామలింగయ్య, నలపరాజు సతీష్, పుల్లెంల మాజీ సర్పంచ్లు పాలకూరి సత్తయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, సర్పంచ్ ముక్కాముల వెంకన్న, తిప్పర్తి రాములు, అంజాచారి, కరీం, వెంకట్రెడ్డి, శివర్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ సభను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ యూరియా విషయంలో కొత్తగా తీసుకొచ్చిన యాప్పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీపీఐ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్లను సన్మానించారు. సమావేశంలో బుచ్చిరెడ్డి, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రావణ్ కుమార్, ఉజ్జని యాదగిరిరావు, వీరస్వామి, నర్సింహ, రామచంద్రం, వెంకటేశ్వర్లు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మున్సిపోల్స్కు రెడీ..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది. పదవీ కాలం ముగిసి 11 నెలలు.. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పునర్విభజన లేకపోతే జనవరిలోనే షెడ్యూలు ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది. ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ఫ ముందుగా మున్సిపాలిటీ.. ఆ తరువాతే పరిషత్ ఎన్నికలు! ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తంచండూరు 5,653 5,717 1 11,370 చిట్యాల 5,519 5,450 0 10,969 దేవరకొండ 11,712 12,270 1 23,983 హాలియా 6,132 6,439 0 12,571 మిర్యాలగూడ 42,744 44,685 0 87,429 నకిరేకల్ 11,755 12,463 0 24,218 నల్లగొండ 62,215 64,828 1 1,27,044 నందికొండ 6,560 6,975 0 13,535 ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,32,291 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 64,900 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శుక్రవారం సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తేవడం సరికాదని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, చిన్నవెంకులు, దండంపల్లి సరోజ, ఎండీ.సలీం, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, గంజి నాగరాజు, మన్నె భిక్షం, పోలె సత్యనారాయణ, సర్దార్ అలీ, అంజయ్య, రవీందర్, రాజేష్, ఆవుల అనురాధ, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్కు పదోన్నతి
మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ను బదిలీ అయ్యారు. ఆయనను నారాయణ్పేట జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసింది. నారాయణ్ అమిత్ 2024 సెప్టెంబర్ 5న మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు కృషి చేశారు. అక్రమదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడంతో జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. పుల్లెలంలో రేపు హనుమంతు అంత్యక్రియలుచండూరు : ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు స్వగ్రామమైన చండూరు మండలంలోని పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అంత్యక్రియల ఏర్పాట్లను హనుమంతు బావ మల్లిక్ పరిశీలించి గ్రామంలోని ముఖ్యులతో సమావేశమై చర్చించారు. సీసీఐ కేంద్రం తనిఖీచిట్యాల : చిట్యాల పట్టణ శివారులోని కృష్ణ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల ఈ కేంద్రం పత్తిని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేసిన నేపథ్యంలో అధికారులు తనిఖీ చేపట్టారు. సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు తీరును పరిశీలించారు. స్లాట్ బుకింగ్లో ఏర్పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ సీరియల్ ప్రకారం పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. నేటి నుంచి డిండి ఉర్సుడిండి: మండల కేంద్రంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుపొద్దీన్ దర్గా 77వ ఉర్సె షరీఫ్ను శని, ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షర్పొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గంధోత్సవం, ఆదివారం దీపారాధన, ఖత్మేఖునాన్ వంటి పూజా కార్యక్రమాలతోపాటు ఖవ్వాలి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కుల మతాల కతితంగా ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఉర్సుకు హాజరయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ధనుర్మాస వ్రత పూజలు హాలియా : పట్టణంలోని స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గోవర్ధన రాఘవాచార్యులు పర్యవేక్షణలో అష్టాక్షరి సహిత సుదర్శన నరసింహ హోమం, లోక కల్యాణార్థం కోసం కోసం నిత్య మూల మంత్ర హోమం, భగవతారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, నిత్య పూర్ణహుతి తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అరుణ, చంద్రకళ, లావణ్య, సుమలత, వరలక్ష్మి, శోభారాణి, శేఖర్, సాయి చందు ఉన్నారు. -
ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29, 30తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 సాయంత్రం 5 గంటలకు మంగళవాయిద్యం, వేదమంత్రపఠనం, శాసీ్త్రయ సంగీత కచేరీతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రాత్రి 8 గంటలకు భక్త రామదాసు హరికథ, లక్ష్మీనృసింహనామ ససంకీర్తనం నిర్వహించనున్నారు. 30వ తేదీ తెల్లవారుజామున స్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయంలో లక్షారేపత్రి పూజ, గ్రామోత్సవం, స్వామి వారి ఆలయ ప్రవేశం, రాత్రి 8 గంటలకు మట్టపల్లి క్షేత్ర మహత్యం బుర్రకథ ఉంటుందని కమిటీ ఆలయ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, ప్రసాదాలు, దైవదర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
లైనింగ్కు మోక్షం
ఏఎమ్మార్పీ ప్రధానకాల్వగుర్రంపోడు : ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ లైనింగ్ పనుల్లో ముందడుగు పడింది. లైనింగ్ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ పూర్తయింది. ఏఎమ్మార్పీ లైనింగ్ పనులకు మే నెలలో ప్రభుత్వం రూ.442 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసి.. టెండర్లు పిలిచింది. రూ.339 కోట్లకు ఓ కంపెనీ టెండర్ దక్కించుకుంది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. ప్రస్తుతం నీటి విడుదల జరుగుతున్నందున యాసంగి సీజన్ ముగియగానే వేసవిలో పనులు ప్రారంభించేలా కంట్రాక్టు సంస్థ సన్నద్ధమవుతోంది. ముందస్తుగా త్వరలో కంపచెట్ల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి నెలలో సీఎం చేతుల మీదుగా లైనింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. చివరి భూములకు అందని నీరు ఏఎమ్మార్పీ కాల్వ చివరి భూములకు నీరు అందకపోవడానికి కారణం ప్రధాన కాల్వతోపాటు ఏ మేజర్కు సీసీ(సిమెంట్ కాంక్రీట్) లైనింగ్ లేకపోవడమే. మూడు దశాబ్దాలుగా సీసీ లైనింగ్ లేకుండా నీరు అందిస్తున్నారు. ప్రధానకాల్వకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే కోతకు గురైన గండ్లు పడే ప్రమాదం ఉండటంతో 3 వేల క్యూసెక్కులకుగాను కేవలం 1200 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో చివరి భూములు బీళ్లుగా మారుతున్నాయి. మేజర్ల లైనింగ్ ప్రతిపాదనలు పెండింగ్ డిస్ట్రిబ్యూటరీల్లో 50 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండి ఎక్కువ ఆయకట్టు గల ప్రధానమైన డి–19, డి–22, డి–25 మేజర్లకు లైనింగ్ పనులకు రూ.150 కోట్లతో ఇప్పటికే పంపిన ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క డి–25 మేజర్ కింద 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నిధులు కూడా మంజూరైతే ప్రధాన మేజర్లకు లైనింగ్ జరిగి పూర్తిస్ధాయిలో ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. కాల్వ వెడల్పు చేయాలని డిమాండ్ ప్రస్తుతానికి ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ పనులకే పరిమితంగా కాగా జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి కాల్వ వెడల్పునకు డిమాండ్ వస్తుండడంతో.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రధాన కాల్వను మూడు వేల క్యూసెక్కులకు సరిపడా డిజైన్ చేశారు. అప్పట్లో 2.20 లక్షల ఆయకట్టుతో డిజైన్ చేయగా.. ప్రస్తుతం బ్రహ్మణవెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్టులు వచ్చాయి. వీటి ఆయకట్టు 1.10 లక్షలు ఉంది. తొలుత ఆరుతడి పంటలకే కాల్వను డిజైన్ చేయగా.. ఇప్పుడు వరిసాగే ఎక్కువగా జరుగుతోంది. అన్నింటికి మూడు వేల క్యూసెక్కులు సరిపోవు. దీంతో ప్రధాన కాల్వను మరో ఆరు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేపట్టాలనే డిమాండ్ ఉంది. పనులు ప్రారంభమయ్యేలోగా కాల్వ వెడల్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 136 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పొడవునా 55 మేజర్ల ద్వారా 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్లగొండ పట్టణంతోపాటు హైదరాబాద్కు నీరందించే కోదండాపురం నీటి శుద్ధి కేంద్రానికి తాగునీరు ఏఎమార్పీ నుంచే అందాల్సి ఉంది. ఏఎమార్పీ ప్రధానకాల్వ కామన్ పాయింట్ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ వరకు 113 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వకు సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. యాసంగి నీటి విడుదల ముగిసేలోగా కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, సామగ్రిని సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఆంధ్రా పాంతంలో పలు ప్రాజెక్టుల లైనింగ్ పనులు చేసిన అనుభవం ఇక్కడి లైనింగ్ పనులు దక్కించుకున్న కంపెనీకి ఉన్నట్లు తెలుస్తోంది. ఫ రూ.339 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఫ పూర్తయిన అగ్రిమెంట్ ఫ యాసంగి సీజన్ ముగియగానే ప్రారంభం కానున్న పనులు ఫ నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేలా లక్ష్యం ఫ కాల్వ వెడల్పుపై స్పష్టత కరువు -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం వంటి పూజలు నిర్వహించారు. -
రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో పోటీలు శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. బాలికల విభాగంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన ఎస్.శ్రీజ, కె.సిరిచందన, కె.సిరి, డి.సహస్ర, సీహెచ్.అస్మిత, పి.మేఘన, టి.రుచిత, వి.హాసిని ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో డి.అభిషేక్, మనిసాత్విక్, కె.సాయిరాం, ఉపేందర్, కె.విజ్ఞాన్ ప్రథమ స్థానం సాధించారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో బి.వైష్ణవి, కె.భానుశ్రీ, ఆర్.హారిక, అంజలి ద్వితీయ స్థానం సాధించారని జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సభ్యుడు ప్రసాద్, ఎంఈఓ టి.గోపాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సీనియర్ ఇన్స్ట్రక్టర్ పి.బాలరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిశెట్టి అవిలుమల్లు, బీసీ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పోచం సోమయ్య, మెంట నగేష్, పీఈటీలు జి.జ్ఞానసుందరి, పి.శ్వేత, ఇన్స్ట్రక్టర్ కనుకు రాజు, చొల్లేటి నరేష్, పోచం మచ్చేందర్, పుల్కరం నిఖిల్, ఊర మత్స్యగిరి పాల్గొన్నారు. -
జీవాల ఆరోగ్యం పదిలం
ఈ నెల 31వ తేదీ వరకు జీవాలకు నట్టల నివారణ మందు తాగిస్తాము. లక్ష్యాన్ని నూరుశాతం పూర్తి చేస్తాం. పెంపకం దారులంతా తమ జీవాలకు నట్టల మందును తాగించాలి. గ్రామాలకువచ్చే పశువైద్య సిబ్బందికి సహకరించాలి. – డాక్టర్ జీవీ రమేష్, జిల్లా సంవర్థక శాఖ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించే కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. జీవాల్లో నట్టలను నివారించడానికి జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 10 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటికి మందు తాగించడానికి 250 మందితో 78 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఉదయం 8 గంటలకే మందల వద్దకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును తాగిస్తున్నాయి. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 శాతం జీవాలకు నట్టల నివారణ మందును తాగించారు. ఈ నెలఖరు నాటికి నూరు శాతం మందును తాగించే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా జిల్లా పశు వైద్య సంవర్థక శాణ ముందుకు సాగుతోంది. మందు తాగించడం వల్ల ప్రయోజనాలు జీవాలైన గొర్రెలు, మేకల్లో నులిపురుగులు, కార్జపు జలగలు, పొట్ట జలగలు, బద్దె పురుగులు మొదలైనవి ఉండడం వల్ల జీవాలు నీరసించిపోతాయి. దీని కారణంగా పెరుగుదల మందగించడం, రక్తహీనత, ఎదకురాకపోవడం, బలహీనమైన పిల్లలు జన్మించడం, ఇతర వ్యాధుల బారిపడుతాయి. నట్టల నివారణ మందును తాగించడం వల్ల అంతర పరాన్న జీవులు చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగుదల బాగుండి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు కూడా సోకవు ఫ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం ఫ గొర్రెలు, మేకలకు మందు తాపిస్తున్న పశువైద్య బృందాలు -
4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
నల్లగొండ : వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. రెండు నెలల క్రితం జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 4.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా కేంద్రాల్లో 25 నుంచి 30 టన్నుల ధాన్యం ఉంది. ఈ నెల చివరిలోగా అవి కూడా కాంటాలు వేస్తే.. కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. 60 కేంద్రాల్లో ధాన్యం రాశులు ఈ సీజన్లో మొత్తం 392 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయ్యాయి. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలో ఆలస్యంగా కోతలు ప్రారంభం కావడంతో అక్కడ ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వస్తోంది. అక్కడ 60 కేంద్రాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి. వెంటనే ట్రక్ షీట్ ఇవ్వని మిల్లర్లు.. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు చెల్లించింది రూ.1078 కోట్లే. ఇంకా రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ట్యాబ్ ఎంట్రీలు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపినా మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో ఆలస్యం అవుతోంది. దీంతో ట్యాబ్ ఎంట్రీలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులకు చెల్లింపుల్లోనూ ఆలస్యం అవుతోంది. ఫ కేంద్రాల్లో మరో 30 టన్నులు ఉన్నట్లు అంచనా ఫ ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం -
చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి
మునగాల : కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేసే వరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన కొనసాగుతూనే ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాముల శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ను ఆయన సందర్శించారు. కర్ల రాజేశ్ ఇదే బంక్లో పనిచేయడంతో ఆయన బంక్లో పని చేస్తున్న సిబ్బందిని కలిసి విచారించారు. అనంతరం మాట్లాడుతూ కోదాడ రూరల్ సీఐ, ఇతర పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే రాజేశ్ మృతిచెందాడని పేర్కొన్నారు. దళిత వర్గాలపై పోలీసుల వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిఽధి ఏపూరి రాజుమాదిగ, కర్ల రాజేశ్ సోదరుడు కమల్, నాయకులు ఉన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
రామగిరి(నల్లగొండ) : క్రీస్తు బోధనలు ప్రపంచానికి సేవాగుణాన్ని నేర్పించాయని, అవి మనకు అనుసరణీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు మనకు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని గుర్తుచేస్తాయన్నారు. ఏసు ప్రభువు కృపతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు క్రిస్టోఫర్, బెనర్జీ, విలియమ్స్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, పశల శౌరయ్య తదితరులు పాల్గొన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు బలిదానాలకు పాల్పడుతుంటే చలించిన సోనయాగాంధీ ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్రాన్ని ప్రకటిచిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెల్చుకోవడం శుభపరిణామన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మసీ, లా కోర్సులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి ఫ నల్లగొండలో క్రిస్మస్ వేడుకలకు హాజరు -
కరుణానంద స్వామి ఆరాధనోత్సవాలు
నకిరేకల్ : పట్టణంలోని అచల గురు మందిరంలో కరుణానంద (మంచుకొండ పాపయ్య) స్వాములవారి 33వ రాజయోగి ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. సద్గురు శ్రీ పూర్ణానంద కర్నాటి పాండరమ్మ మాతాజీ తన శిష్య బృందంతో ఆరాధన కీర్తనలు ఆలపించారు. స్వామీజీ చిత్రపటంతో ఊరేగింపు, జెండా పూజలు చేశారు. గురువులు మిట్టపల్లి కృష్ణమూర్తి, సుగుణ, మల్లికార్జున, పసుపర్తి ధనమ్మ, శ్రీదేవి, శివకుమార్, గుండా అనసూయ, కాసం సుకన్య, చిలుకురి ప్రసాద్, గుండా భిక్షపతితోపాటు మరో 25 మంది సద్గురువులు ప్రవచనాలు వినిపించారు. సర్వశ్రీఅబ్బాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గురు మందిర అధ్యక్షుడు దేవరశెట్టి మధుసూదన్, ఉపాధ్యక్షులు శివకోటి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కోటగిరి పద్మజారమేష్, కోశాధికారి కోటగిరి రమాదేవి, గౌవర సలహాదారులు కాసం దయానందం, తొనుపూనురి గాంధీ, గుండా సోమనాథం, అనసూయ, పాలవర్గ సభ్యులు రేపాల నిర్మల, గుడిపాటి జయ, శివకోటి రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
మనుధర్మశాస్త్రంతోనే సామాజిక అసమానతలు
నల్లగొండ టౌన్ : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలో సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రమే కారణమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువు రాసిన మనుధర్మ శాస్త్రాన్ని తొంభై ఏళ్ల క్రితమే డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దహనం చేశారని, ఆ రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అశాసీ్త్రయమైన ఈ మనుస్మృతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేసేలా జీవో తెచ్చి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పందుల సైదులు, మానుపాటి భిక్షం, ఇందూరి సాగర్, గోలి సైదులు, కొండ వెంకన్న, అద్దంకి రవీందర్, తెలగమల యాదగిరి, గాదె నరసింహ, బొల్లు రవీందర్, అవుట రవీందర్, దండెంపల్లి సత్తయ్య , మల్లం మహేష్, కోట సైదులు, నలుపరాజు సైదులు, మురళి, సీహెచ్.తిరుపతయ్య, గోలి మల్లేష్, జయచందన్, పెరికె నరసింహ, చింత రామలింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 8న ప్రసాద విక్రయానికి వేలం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకేంద్రం పరిధిలోని పానగల్లులో గల ఛాయాసోమేశ్వారాలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయానికి వచ్చేనెల 8వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రాపోలు బాలకృష్ణ తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని కోరారు. ‘ఉపాధి’ బిల్లును ఉపసంహరించుకోవాలినల్లగొండటౌన్: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్చుతూ కొత్తగా తీసుకొచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టం పేరును ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త బిల్లు వల్ల కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో పడిపోతున్న ఉపాధి పనిదినాల వల్ల పేదలు బతకలేరని వాపోయారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ, ములకపల్లి రాములు, దండెంపల్లి సరోజ, దండెంపల్లి సత్తయ్య, చినపాక లక్ష్మీనారాయణ, మల్లం మహేష్, పోలె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘టాప్రా’ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలినల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్ కోరారు. గురువారం నల్లగొండలోని టీఎస్ యూటీఎఫ్ భవ న్లో జరిగిన టాప్రా జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. 2024 మార్చి తరువాత నుంచి పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండి.ఖాదర్, కోశాధికారి కుకుడా ల గోవర్ధన్, పాదురు విద్యాసాగర్రెడ్డి, వై.సత్తయ్య, పులి కృష్ణమూర్తి, చాపల అంజిరెడ్డి, పట్టేటి కృష్ణయ్య, వనం వాణిశ్రీ, రమేష్, భద్ర య్య, యోగేంద్రనాధ్, నరసరాజు పాల్గొన్నారు. ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలినల్లగొండ టౌన్ : ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా ఎదుగుతూ బలోపేతం కావాలని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, దాసరి స్వామి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలుపొందిన ముదిరాజ్లకు ఈ నెల 30న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం పోస్టర్లను గురువారం నల్లగొండలోని ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జనార్దన్, దొంతరగోని గణేశ్, హరీష్, ముఖేష్ పాల్గొన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు రాజాపేట : రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల రాష్ట్ర కన్వీనర్, సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. 5,6,7,8,9 క్లాసుల్లో ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు జనవరి 21 వరకు ఉందని, రూ.100 ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంపై ఒకరి ఫొటో బదులు మరొకరిది పెట్టి అప్లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి ● మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చిట్యాల : హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్ని గతేడాది మేడ్చల్లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది. -
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్ : రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తరువాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బెనిఫిట్స్ అందక చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, ముజాహిద్ అలీఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, భిక్షం, లక్ష్మారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్యాంసుందర్, నారాయణరెడ్డి, భాస్కర్, ఏడుకొండలు, భాలయ్య, రాధాకృష్ణ, సుధారాణి, సుజాత, నాగమణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులందరికీ ట్రై సైకిళ్లు అందిస్తాం
నల్లగొండ : జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని టీటీడీసీలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనేకమంది దివ్యాంగులు తమకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు ఇవ్వాలని ప్రజావాణిలో దరఖస్తులు చేస్తున్న నేపథ్యంలో ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి మొదటి విడతగా 105 మంది దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిళ్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో 50 మందికి పంపిణీ చేశామన్నారు. తాను జిల్లా కలెక్టర్గా వచ్చిన వెంటనే సర్వే నిర్వహించి జిల్లాలో 55వేల మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్ల మాదిరిగానే కృత్రిమ అవయవాలు అవసరం ఉందని, ఇందుకు సర్వే నిర్వహించి రిపోర్టు వచ్చిన తర్వాత అలింకో, ఈసీఐఎల్కు సమర్పిస్తామన్నారు. మోటార్ సైకిళ్లు సమకూర్చి ఇచ్చిన ఈసీఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులకు తమ సంస్థ ద్వారా ట్రై సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబమూర్తి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతనాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఈఓ భిక్షపతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్, అలింకో ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


