breaking news
Nalgonda District Latest News
-
అడుగంటిన పానగల్లు ఉదయ సముద్రం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాకు ప్రధాన తాగునీటి ఆధారమైన ఉదయసముద్రంలో ప్రస్తుతం కేవలం 10 నుంచి 12 రోజులకే సరిపడా నీటి నిల్వలే మిగిలాయి. దీంతో నల్లగొండ కార్పొరేషన్, చిట్యా ల, నకిరేకల్, మోత్కూరు మున్సిపాలిటీలతో పాటు 578 పరిసర గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) ప్రధాన కాలువ లైనింగ్ పనులు నిలిపివేసి ఉదయ సముద్రానికి నీటిని తరలించే అంశంపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సాగర్లోనూ అరకొరగానే నీటి నిల్వలు.. ప్రస్తుతం నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటిని హైదరాబాద్కు తాగునీటిగా తరలించడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. నాగార్జునసాగర్లో 510 అడుగుల నీటిమట్టం వరకు తాగు నీటిని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 513 అడుగుల నీటిమట్టం ఉండటంతో అధికారులు ఉదయ సముద్రానికి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉదయసముద్రం రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. అందులో 0.38 టీఎంసీల నీటినే వినియోగించుకు వీలుంది. బురద కారణంగా మిగతా నీటిని తీసుకునే పరిస్థితి ఉండదు. వేయి క్యూసెక్కులు సరఫరా చేస్తేనే.. ప్రస్తుతం ఉదయ సముద్రానికి నీటిని సరఫరా చేయాలంటే హైదరాబాద్కు సరఫరా చేసే నీరు పోగా అదనంగా వేయి క్యూసెక్కులు ఎత్తిపోయాలి. ఉదయ సముద్రం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీకాగా, కట్ట బలహీనంగా ఉండటంతో 1.2 టీఎంసీకి మించి నీటిని నిలువ చేసే పరిస్థితి లేదు. ఆ మేరకు నీటిని నింపినా నవంబర్ వరకు తాగునీటి సమస్య ఉండదని అధికారులు భావిస్తున్నారు. నిలిచిపోనున్న లైనింగ్ పనులు.. జిల్లాలో ప్రస్తుతం ఏఎంఆర్పీ ప్రధాన కాలువ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉదయ సముద్రానికి నీటిని ఈ కాలువ ద్వారానే సరఫరా చేయాలి. ఉదయసముద్రంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయన్న విషయం ముందగా తెలిసినా, నీటిని నింపే అంశంపై అధికారులు ముందుగా ఆలోచన చేయలేదు. లైనింగ్ పనులను ప్రారంభించకముందే నీటిని నింపి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు ఉదయసముద్రానికి నీటిని విడుదల చేయాల్సి వస్తే ఈ లైనింగ్కు బ్రేక్ తప్పదు. దీంతో లైనింగ్పైనా ప్రభావం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. తాగునీటి సమస్యను అధిగమించేందుకు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) నుంచి ఉదయసముద్రానికి నీటిని తరలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఇప్పటికే నివేదిక సమర్పించారు. ప్రస్తుతం సాగర్ వెనుక జలాల నుంచి పుట్టంగండిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. పుట్టంగండి సిస్టరన్స్ వద్ద 4 మోటార్లు ఉండగా.. రెండు మోటార్ల ద్వారా ప్రస్తుతం 900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అందులో 550 క్యూసెక్కులకు పైగా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసమే సరఫరా చేస్తున్నారు. ఫ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ అర టీఎంసీనే ఫ నాలుగు మున్సిపాలిటీలు, 578 గ్రామాలకు తాగునీటి ముప్పు ఫ ఏకేబీఆర్ నుంచి నీటిని తరలిందుకు కసరత్తు ఫ నిలిచిపోనున్న ప్రధాన కాలువ లైనింగ్ పనులు -
64 మందితో డీసీసీ కార్యవర్గం
నల్లగొండ : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గాన్ని 64 మందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ఆమోదించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత సమర్పించిన ప్రతిపాదనల మేరకు 64 మందితో కూడిన కార్యవర్గాన్ని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పున్న కై లాస్ నేత జాబితాను విడుదల చేశారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యం.. కొత్త కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, 24 మంది ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు అధి కార ప్రతినిధులు (స్పోక్స్పర్సన్స్), 27 మంది కార్యదర్శులను నియమించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా కార్యవర్గాన్ని రూపొందించినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ అప్పగించిన ఈ బాధ్యతలను అంకితభావంతో, నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని కై లాష్నేత పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటు ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. -
రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన
నార్కట్పల్లి : నార్కట్పల్లి – మునుగోడు రూట్లో నార్కట్పల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన పనులను శనివారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించి మాట్లాడారు. రూ.76 కోట్లతో కిలో మీటర్ వరకు రైల్వే ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్ పూర్తయితే నార్కట్పల్లి మునుగోడు మధ్య వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఉండదన్నారు. ఆయన వెంట ఆర్అండ్బీ డీఈ సుధాకర్, ఏఈ అజయ్, సర్పంచ్ భరత్, సైదులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాయం శ్యాంసుందర్రెడ్డి, బత్తుల ఉషయ్య, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్రెడ్డి, భూపాల్రెడ్డి, యానాల రాంరెడ్డి, ప్రజ్ఞాపూర్ సత్తి పాల్గొన్నారు. -
భక్తుల వసతులకు పెద్దపీట
వైటీడీ పాలక మండలి చేత ఆలయ ఈఓ భవాని శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి ఉదయం 11.37గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత సభ్యులు వరుసగా వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ ప్రమాణం చేశారు. అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈఓ భవాని శంకర్, ప్రధానార్చకుడు కె.వెంకటాచార్యులు ప్రమాణం చేశారు. పాలక మండలి సభ్యుల్లో వినోద్ వెంకటస్వామి, స్వాతి కంఠమణి ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సత్యనారాయరెడ్డితో పాటు ఆరుగురు సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు తెలుగులో ‘దైవ సాక్షిగా’ అని ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆధ్మాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) పాలకమండలి శనివారం కొండపైన గర్భాలయంలోని బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ పాలక మండలి తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం వివరాలను చైర్మన్ సత్యనారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. పాలక మండలి మొదటి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించామని టీటీడీ తరహాలో వైటీడీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొండపైన భక్తులకు సౌకర్యాలు లేక ఉదయం వచ్చి, సాయంత్రం వెళ్తున్నారని, అలా కాకుండా భక్తులు కొండపైన బస చేసేలా చర్యలు చేపడతామన్నారు. కొండపైన విష్ణు పుష్కరిణి అంశంపై ఈఓ భవాని శంకర్ తమ దృష్టికి తీసుకువచ్చారని, విష్ణు పుష్కరిణి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై దృష్టి పెడతామన్నారు. శ్రీస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేదుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, రాత్రి సమయంలోనూ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ విష్ణు పుష్కరిణి అందుబాటులోకి తెస్తాం ఫ వైటీడీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి వెల్లడి ఫ కొలువుదీరిన కొత్త పాలకవర్గం -
భూ భారతి రీ సర్వే చేపట్టాలి
నల్లగొండ : భూ భారతి రీసర్వే చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 13 నుంచి నిర్దేశించిన 70 గ్రామల్లో రీ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాపాలన, రెవెన్యూ సదస్సులు, ఇతర సందర్భాల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్కుమార్, డీఈఓ సుశీందర్రావు పాల్గొన్నారు. 13న నులిపురుగుల నిర్మూలన దినోత్సవంనల్లగొండ టౌన్ : ఈ నెల 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 3,90,134 మంది ఉన్నారని.. వీరి కోసం 4,17,400 ఆల్బెండజోల్ (400 మి.గ్రా.) మాత్రలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలల్లో శిక్షణ పొందిన ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య పర్యవేక్షకులు మాత్రలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అనర్హులను జాబితా నుంచి తొలగించాలినల్లగొండ టూటౌన్ : నల్లగొండ నియోజకవర్గంలో అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శనివారం ఆర్డీఓ అశోక్రెడ్డిని కలిసి విన్నవించారు. సర్ ద్వారా నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పడుతున్న సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. నల్లగొండలో బయటి గ్రామాలకు చెందిన వారి ఓట్లు అనేకంగా ఉన్నాయన్నారు. ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్ బానావత్ దీప్లా, నాయకులు గోపగాని రాజశేఖర్, దండంపల్లి సత్తయ్య, జంగయ్య, వివేక్రెడ్డి పాల్గొన్నారు. -
వాటర్కు హోటల్ బ్రాండ్!
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో నీటి దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సొంత బ్రాండ్ల పేర్లతో స్టిక్కర్లు అంటించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారు. పట్టణంలోని ప్రముఖ హోటల్స్లో సొంత లోగోలు, క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్లతో కూడిన స్టిక్కర్లు వాటర్ బాటిళ్లపై దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో లభించే బ్రాండెడ్ వాటర్ కంపెనీల ధరలకు ఏమాత్రం తగ్గకుండా, (లీటర్ రూ.25) ఈ సొంత స్టిక్కర్ల బాటిళ్లను కస్టమర్లకు విక్రయిస్తున్నారు. కానీ ఈ బాటిల్లో నీటి నాణ్యతపై మాత్రం ఎటువంటి గ్యారెంటీ ఉండడం లేదు. నాణ్యతపై కస్టమర్లలో అనుమానాలు.. హోటళ్లలో విక్రయిస్తున్న వాటర్ బాటిళ్లలోని నీరు నిజంగానే శుద్ధి చేసినదేనా? ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి ప్రభుత్వ సంస్థల అనుమతులు వీటికి ఉన్నాయా? అనే సందేహాలు కస్టమర్లలో వ్యక్తమవుతున్నాయి. కేవలం తమ హోటల్ బ్రాండింగ్ కోసం సాధారణ నీటిని బాటిళ్లలో నింపి, ఆకర్షణీయమైన స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో సాగుతున్న ఈ వాటర్ బాటిళ్ల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని, నీటి నాణ్యతను పరీక్షించి వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫ హోటళ్లు, రెస్టారెంట్లలో సొంత స్టిక్కర్లతో వాటర్ బాటిళ్లు ఫ బ్రాండెడ్ రేట్లకు తగ్గకుండా అమ్మకాలు ఫ నీటి నాణ్యతపై వినియోగదారుల ఆందోళన హోటళ్లు, రెస్టారెంట్లలో ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు లేని వాటర్ బాటిళ్లను విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధం. కేవలం సొంత స్టిక్కర్లు అంటించుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నీటిని విక్రయిస్తే వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. త్వరలో తనిఖీలు నిర్వహించి నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలను మోసం చేస్తున్నట్లు తేలితే సదరు హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎన్.శివశంకర్రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నల్లగొండ -
తొలి సమావేశంలో తీర్మానాలు ఇవే..
ఫ శ్రీస్వామి వారి అనుగ్రహంతో యాదగిరీశుడి పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దడంతో పాటు సాధారణ భక్తులు, పీఠాధిపతులు, మఠాలు, ధార్మిక సంస్థలు, దాతలు, ప్రవాస భారతీయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, భాగస్వామ్యంతో ముందుకు సాగుతాం. ఫ శ్రీనృసింహుడి క్షేత్రంలో ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా, అత్యంత ప్రవిత్రత, శాస్త్ర బద్ధత, వైభవంతో నిర్విహిస్తామని, దివ్య బాధ్యత నిర్వహించడంతో తామంతా అంకితభావం, దృఢ సంకల్పం, భగవద్భక్తి అనే నాలుగు స్తంభాలను సేవ ప్రస్థానానికి మూలధారాలుగా స్వీకరిస్తాం. ఫ సామాన్య భక్తుల ప్రయోజనాలకు భంగం కలుగనివ్వని, విశిష్ట అతిథుల ప్రతిష్టకు ఎలాంటి లోటూ రాకుండా సక్రమమైన విధి విధానాలు, సమయ నియంత్రణ, ప్రత్యేక ప్రణాళికలు, సాంక్షేతిక పరిష్కార మార్గాల ద్వారా సామాన్య భక్తుల ప్రాధాన్యత, విశిష్ట అతిధుల గౌరవం అనే రెండు ధర్మాలను సమతుల్యంగా సమన్వయ పరుస్తామని, దర్శన వ్యవస్థను యాదగిరిగుట్టలో నెలకొల్పుతాం. -
రాజీవ్ యువ వికాసం.. దరఖాస్తులకే పరిమితం!
రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 79,495 దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించి తదుపరి ప్రక్రియను కొనసాగించడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏవైనా ఆదేశాలు వస్తే వెంటనే దరఖాస్తుల పరిశీలనతో పాటు తదుపరి కార్యాచరణ చేపడతాం. ఇప్పటివరకై తే దరఖాస్తులన్నీ హోల్డ్లోనే ఉన్నాయి. – శశికళ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి నల్లగొండ కొండమల్లేపల్లి : యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీతో రుణాలను మంజూరు చేయడానికి యువత నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎన్నో ఆశలతో యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. కానీ, లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఈ పథకం అమలుకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై దృష్టి సారించాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సబ్సిడీ వివరాలు.. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి రూ.50 వేల రుణానికి 100 శాతం సబ్సిడీ, రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల వరకు 80 శా తం సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70శాతం సబ్సిడీ ఉందని అధికారులు తెలి పారు. 2025లో దరఖాస్తులు స్వీకరించగా ఆయా కేటగిరీల నుంచి 79,495 మంది దరఖాస్తు చేసుకున్నారు. తప్పని ఎదురు చూపులు.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మొదటగా రూ.లక్షకు సంబంధించిన యూనిట్లను గతేడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. చివరి క్షణంలో పలు ఆరోపణలు రావడంతో రుణాల పంపిణీ వాయిదా వేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు. రుణాలు మంజూరు చేస్తే వాటితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని జీవనం సాగించాలని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం రుణాల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఫ పథకానికి మొత్తం 79,495 దరఖాస్తులు ఫ లబ్ధిదారుల ఎంపిక.. యూనిట్ల మంజూరుపై స్పష్టత కరువు ఫ యువత తప్పని ఎదురుచూపులు కేటగిరీల వారీగా దరఖాస్తులు ఇలా.. కేటగిరి దరఖాస్తులు ఎస్సీ 21,203 బీసీ 39,370ఈబీసీ 2000ఎస్టీ 11,581ముస్లిం 5,112క్రిస్టియన్ 229 మొత్తం 79,495 -
నేడు వైటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకారం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి శనివారం ఉదయం 11.37 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆలయ ముఖ మండపంలోని గర్భాలయ బంగారు వాకిలి చెంత చైర్మన్తో పాటు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. పాలకమండలి సభ్యులకు ఘనంగా స్వాగ తం పలికేందుకు అధి కారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ మండపాన్ని విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దడంతో పాటు పూలతో అలంకరించారు. ఆలయ పరిసరాలు, తిరు, మాడ వీధులు పరిశుభ్రంగా కనిపించేలా తీర్చిదిద్దారు. మొదట చైర్మన్తో.. వైటీడీ పాలకమండలి చైర్మన్గా మహబూబ్నగర్కు చెందిన ఎం. సత్యనారాయణరెడ్డి మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సభ్యులు వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, విజయేందర్ తూళ్ల, పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం. రాఘవేందర్రావు, లక్ష్మీనారాయణనాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి. నర్సింహమూర్తితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులచే ఆలయ ఈఓ భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం చైర్మన్, సభ్యులంతా కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీ తొలి సమావేశంలో పాల్గొననున్నారు. -
భాషా నైపుణ్యాన్ని పెంపొందించాలి
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్పెల్–1 శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులను సమర్థవంతమైన అభ్యాసకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్ రావు, కోఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, డైట్ ప్రిన్సిపాల్ నరసింహ, సెంటర్ ఇన్చార్జ్ రఘుపాల్రెడ్డి, రిసోర్స్ పర్సన్లు అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమాశంకర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ 15లోపు పూర్తి చేయాలి నల్లగొండ : ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం 48 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, వెనుకబడిన బీఎల్ఓలు వెంటనే పనులు వేగవంతం చేసి రానున్న రెండు రోజుల్లో 86 శాతానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూభారతి, 13–ఏ ఫారాలు, సాధా బైనామాలకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 70 గ్రామాల్లో సోమవారం నుంచి రీ–సర్వే ప్రారంభమవుతుందని, ఇందుకు జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి వెంటనే విధుల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
చేనేత సహకార సభ్యుల ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో పలువురు సభ్యులుగా విజయం సాధించారు. పాలకవర్గ సభ్యులుగా ముషం రవి, గంజి రమేష్, రాపోలు గణేశ్, గంజి రమేష్, చిట్టిప్రోలు రమేష్, కటకం వెంకటేశ్వర్లు, రాపోలు భిక్షం, రాపోలు శేషమ్మ, గంజి వెంకమ్మ గెలుపొందారు. ఎన్నికల అధికారి నారాయణస్వామి గెలుపొందిన సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్, వేణుబాబు, నరేందర్, పాండరి, రమేష్, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నీలగిరి నగరానికి రూ.550 కోట్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరాభివృద్ధిపై నజర్ పెట్టిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నగరానికి నిధుల వరద పారిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నగరంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఎస్ఎల్బీసీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.550 కోట్లు మంజూరు చేయించారు. శివారు ప్రాంతాలకు మహర్దశ నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలతోపాటు విలీన గ్రామాల్లో 15 ఏళ్లు అవుతున్నా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగానే నిధులు విడుదలవుతున్నాయి. రూ.250 కోట్లతో 180 కిలోమీటర్ల మేర యూజీడీ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా 208 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగనుండడంతో రోడ్ల సమస్య తీరనుంది. కాగా 2008లో రూ.56 కోట్లతో 208 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, రూ.35 కోట్లతో 180 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. తాజాగా మరోసారి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్లకు రూ 300కోట్లు మంజూరు చేయించారు. ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు బైపాస్ నల్లగొండ నగర పరిధిలోని ఎస్ఎల్బీసీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.250 కోట్లు మంజూరు చేశారు. నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ద్వారా నీలగిరి నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. హ్యామ్ రోడ్ల కింద ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు 150 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా మిర్యాలగూడ వైపు నుంచి వాహనాలు నగరంలోకి రాకుండానే నాగార్జునసాగర్, దేవరకొండ ప్రాంతాల వైపు చేరుకోవచ్చు. ఇప్పటికే పానగల్ ఛాయా సోమేశ్వరాలయం నుంచి మర్రిగూడ, కతాల్గూడ మీదుగా ఎస్ఎల్బీసీ వరకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులన్నీ పూర్తయితే నీలగిరి నగరం చుట్టూ నాలుగు వరుసల రోడ్డు అందుబాటులోకి రానుంది. భారీ వాహనాలు, ఇతర వాహనాలు సైతం నగరంలోకి రాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చు. ఫ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం ఫ ఎస్ఎల్బీసీ నుంచి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు -
ఐటీఐలకు కొత్త కళ
ప్రస్తుతం జిల్లాలోని ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఐటీఐలను నైపుణ్య హబ్లుగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో.. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన సాంకేతికతపై విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. ఈ నూతన కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రముఖ కంపెనీలలో వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం సేతు) పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు (ఐటీఐలు) కొత్త ఊపునివ్వనుంది. తెలంగాణలో 15 ప్రభుత్వ ఐటీఐలను మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.757 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ బాలికల ఐటీఐ–నల్లగొండ, ప్రభుత్వ ఐటీఐ–భువనగిరి ఎంపిక కావడం విశేషం. ఈ ప్రతిపాదనలకు నాలుగో నేషనల్ స్టీరింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అత్యాధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. రెండు క్లస్టర్లలో జిల్లా ఐటీఐలు అపోలో మెడ్ స్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో మూడు క్లస్టర్లలో ఐటీఐలను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ పాతనగరం ప్రభుత్వ ఐటీఐ క్లస్టర్ కేంద్రంగా దీనికి అనుబంధంగా వరంగల్, నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ, వికారాబాద్ బాలికల ఐటీఐ, పంజాగుట్ట ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేస్తారు. ఈ క్లస్టర్పై రూ.241.01 కోట్ల పెట్టుబడి వ్యయం చేయనున్నారు. పటాన్చెరువు ప్రభుత్వ ఐటీఐని కేంద్రంగా తీసుకుని షాద్నగర్, మార్పల్లి, నల్లగొండ ప్రభుత్వ బాలికల ఐటీఐ, భువనగిరి ప్రభుత్వ ఐటీఐలను సిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. దీనికి రూ.275.24 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నారు. ఈ రెండు క్లస్టర్లలో జిల్లాలోని మూడు ఐటీఐలు ఉన్నాయి. మారనున్న ఐటీఐల రూపురేఖలు.. పీఎం–సేతు పథకం అమలుతో ఐటీఐల్లో ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా కొత్త ట్రేడ్లు ప్రారంభం కానున్నాయి. స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ బోధన, అత్యాధునిక యంత్రాలు, ఈవీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఏఐ, సీఎన్సీ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలతో అనుసంధానంగా అప్రెంటిస్షిప్, ఆన్–ది–జాబ్ శిక్షణ, ప్లేస్మెంట్ అవకాశాలను పెంచడంతో పాటు అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ పీఎం–సేతు పథకం కింద ఉమ్మడి జిల్లాలోని మూడుఐటీఐల ఎంపిక ఫ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ఫ సరికొత్త కోర్సులు.. వెంటనే ఉద్యోగాలు -
‘కార్పొరేషన్’ ఉద్యోగులకు తీపికబురు
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)తో పాటు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ) అమలు చేస్తూ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 జనవరి 13 నుంచి ఈ సౌకర్యాలు అమల్లోకి రానున్నాయి. దీంతో అర్హులైన ఉద్యోగులకు ఆ తేదీ నుంచి రావాల్సిన హెచ్ఆర్ఏ, సీసీఏ బకాయిలను చెల్లించాలని ట్రెజరీ అధికారి, పే అండ్ అకౌంట్స్ అధికారి, అన్ని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు (డీడీఓలు) కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక వేతనంపై 13 శాతం హెచ్ఆర్ఏ లభించేది. కార్పొరేషన్గా మారడంతో అది 17 శాతానికి పెరిగింది. అర్హతల పరిశీలన అనంతరం బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ నిర్ణయంతో కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. ఫ 17 శాతం హెచ్ఆర్ఏ, సీసీఏ అమలు -
ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్కు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో యూనివర్సిటీలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, అంతర్ విశ్వ విద్యాలయ క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనభరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కె.హరీష్కుమార్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ రాజేష్కుమార్, వసంత, మిర్యా ల రమేష్కుమార్, కె.అరుణప్రియ, సీహెచ్.సుధాకర్రెడ్డి, రవినాయక్ పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలిహాలియా : ప్రభుత్వ హాస్టళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. శుక్రవారం ఆయన హాలియా పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల హాస్టళ్లతో పాటు కేజీబీవీని సందర్శించారు. ఆయా హాస్టళ్ల పరిసరాలు, పరిశుభ్రత, ఆహార నాణ్యత, మంచినీటి వసతి, సివిల్ వర్క్స్, మెనూ వివరాలు, భోజనశాలు, వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులకు ఎలాంటి లోటురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రామచందయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హైమావతి, పలు హాస్టళ్ల వార్డెన్లు తదితరులు ఉన్నారు. మేరా యువ భారత్ కమిటీ ఏర్పాటునల్లగొండ టూటౌన్ : మేరా యువ భారత్ జిల్లా సమన్వయ కమిటీని నియమించినట్లు జిల్లా యువజన క్రీడల జిల్లా అధికారి అక్బర్ అలీ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సమన్వయ కమిటీ యాక్షన్ ప్లాన్ 2026–27 సంవత్సరానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై భారత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్లో క్యూఆర్ కోడ్ ద్వారా జిల్లాలోని యువత అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో జిల్లా యూత్ అధికారి గౌతమ్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, భానుచందర్, ఇంటర్మీడియట్ అధికారి దస్రూనాయక్, ప్రిన్సిపాల్స్ ఘనశ్యాం, పద్మ, ఉపేందర్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, కరుణాకర్, యూత్ వలంటీర్లు పాల్గొన్నారు. యాప్తో యూరియా బుకింగ్ సులభంనకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియ సులభంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి వినోధ్కుమార్ తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని పలు పర్టిలైజర్ల దుకాణాల్లో శుక్రవారం ఆయన ఆకస్మికం తనిఖీల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ స్మార్ట్ పోన్ ద్వారా ఇంటి నుంచే సులభంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఆయన వెంట ఏఓ మహ్మద్ జానీమియా, డీలర్లు కోటగిరి రమేష్, మురారిశెట్టి క్రిష్ణమూర్తి, దయాకర్ ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్.ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారంథాయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం పీహెచ్సీకి వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న మందుల తదితర వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.యాకుబ్నాయక్, సర్పంచ్ చామకూరి శంకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులివ్వద్దన్నా అక్కకు ఇస్తుంది.. అందుకే అమ్మను చంపేస్తున్నా!
నల్గొండ, తుంగతుర్తి: సంపాదించిన డబ్బంతా కుమార్తెకే ఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తుంగతుర్తి సీఐ ఉపేందర్రావు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (74), కనకలక్ష్మి (66) దంపతులు అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరు జీవనోపాధి కొరకు ఒకరు సూర్యాపేటలో, మరొకరు తిరుమలగిరిలో ఉంటున్నారు.అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును కనకలక్ష్మి ఎక్కువగా కుమార్తెకు ఇస్తుందని, అంతేకాకుండా కుమార్తెకు రూ.3 లక్షలతో తిరుమలగిరిలో ప్లాటు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆమెతో భర్త కోటేశ్వరరావు తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కనకలక్ష్మి నెల క్రితం పెద్ద కుమారుడు సోమేశ్వర్ దగ్గరకు వెళ్లింది. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి పంచాయితీ పెట్టి కనకలక్ష్మిని తిరిగి గొట్టిమర్తికి తీసుకొచ్చారు. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య పంచాయితీ జరగడంతో కనకలక్ష్మి తన కుమారులకు ఫోన్ చేసింది.కుమారులిద్దరు కాన్ఫరెన్స్లో తల్లిదండ్రులతో మాట్లాడి ‘మీరు పంచాయితీ పెట్టుకోవద్దు.. మేము వస్తామని’ చెప్పారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఫోన్లో మాట్లాడుతూ.. ‘మీ అమ్మ నేను చెప్పినట్లు వినడం లేదు, నాకు తెలియకుండా డబ్బులన్నీ అక్కకు ఇస్తుంది, ఎలాగైనా మీ అమ్మను చంపుతాను’ అని చెప్పడంతో కుమారులిద్దరు కలిసి తండ్రిని వారించి సర్ది చెప్పారు.సూసైడ్ నోట్ గోడకు అంటించి..!ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కనకలక్ష్మి తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం కోటేశ్వరరావు సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉన్న గోడకు అంటించాడు. తన వద్ద రూ.4.90 లక్షలు అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9వేల నగదు ఉందని, ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా తీసుకోవాలని, గొడవ పెట్టుకోవద్దని సూసైడ్ నోట్లో రాశాడు. 4.20 గంటలకు ఉరేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని, తాను చేసుకున్న కర్మ అని రాసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గురువారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుమారులకు సమాచారం ఇచ్చారు. కుమారులిద్దరు వచ్చి చూడగా.. అప్పటికే కోటేశ్వరరావు, కనకలక్ష్మి మృతిచెంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. మృతుల చిన్న కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
ఏ పంటలు వేయాలో అవగాహన కల్పించాలి
నల్లగొండ : రైతులు ఎలాంటి పంటలు వేసుకో వాలో సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉందని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులందరికీ తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్, ఉద్యాన శాఖ అధికారి శేఖర్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఆయా ప్రాజెక్టుల ఇంజనీర్లు, చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. గ్రామ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి గ్రామ అవసరాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి దోహదపడే పనులు చేపట్టే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. అనంతరం డీఆర్డీఓ శేఖర్రెడ్డి వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం, గ్రామ సమృద్ధి ప్రణాళికలు, మహిళా సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, డీపీఓ శంకర్నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) నమోదును 13 వేల వరకు పెంచాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో ఎంఈఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం పోషణ్ పథకం, మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, ఫుడ్ సేఫ్టీ తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. పలు సూచనలు చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నీటిని పొదుపు చేస్తేనే భావితరాలకు భవిష్యత్తు
తిప్పర్తి : నీటిని పొదుపు చేసి భావితరాలకు భవిష్యత్తునిద్దామని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. జలసంచాయి–జన్భాగీదారి కార్యక్రమంలో భాగంగా గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని బాలుర, బాలికలు, కస్తూరిబా, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు మనగడ ఉంటుందన్నారు. మొక్కల పెంపకంతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కళాజాత బృందంచే పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం రజితసుధీర్, ఉపసర్పంచ్ దేవకమ్మ, ఎంఈఓ నర్సింహనాయక్, వేముల పుష్ప, ఏపీఓ రాంమోహ్మన్, కార్యదర్శి షఫి పాల్గొన్నారు. ఆంగ్ల భాషపై భయాన్ని పోగొట్టాలినల్లగొండ : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల భాషపై ఉన్న భయాన్ని పోగొట్టేలా అర్థమయ్యే రీతిలో బోధించాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డైట్ కాలేజిలో గురువారం ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహించిన సమగ్ర వృత్యంతర శిక్షణను డీఈఓ సుశీందర్రావుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ నేర్చుకున్న అంశాలను తరగతి గది బోధనా అభ్యసన ప్రక్రియలలో సమర్థంగా అమలుపరచాలన్నారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ నరసింహ, క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసగౌడ్, సెంటర్ ఇన్చార్జి రఘుపాల్రెడ్డి, అనురాధ, విష్ణు, శ్రీనివాస్, ఉమా శంకర్, సత్యనారాయణ, శ్రీధర్ పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలికట్టంగూర్ : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర పరిశీలన బృందం ప్రతినిధి డాక్టర్ శ్యామ్ జార్జ్ అన్నారు. గురువారం కట్టంగూర్లోని పీహె చ్సీ డీఎంహెచ్ఓ.కె రాహుల్, అదనపు జిల్లా వైద్యాధికారి పి.శంకర్, రాష్ట్ర పరిశీలన బృందం సభ్యులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి జమున, సూపర్వైజర్ అలివేలుమంగ, ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాస్, సరిత, ప్రమీల, విజయలక్ష్మి పాల్గొన్నారు. 12న ‘యంగ్ ఇండియా’ ప్రవేశపరీక్ష సూర్యాపేటటౌన్ : యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ గురువారం తెలిపా రు. చింతలపాలెం, గరిడేపల్లి, పెన్పహాడ్ కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు చింతలపాలెం కేజీబీవీ 86398 42487, గరిడేపల్లి కేజీబీవీ 99513 19952, పెన్పహాడ్ కేజీబీవీ 99082 22434 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు
మిర్యాలగూడ అర్బన్ : స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు అని, అవి ప్రభుత్వాల బిక్ష కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వెయ్యిమంది విద్యార్థులతో మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత చదువుకు దూరం చేస్తోందన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రంలో రూ.10,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కార్యదర్శులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో కమిటీల చిచ్చు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకాలు ఆ పార్టీలో వర్గ పోరుకు తెరలేపాయి. పాత, కొత్త కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల అనుచరుల మధ్య ఉన్న విభేదాలు.. ఈ నియామకాలతో బహిర్గతమయ్యాయి. పలు మండలాల్లో బహిరంగంగానే నిరసనలు, ఘర్షణలు చోటు చేసుకోగా మరికొన్ని మండలాల్లో అంతర్గతగా అసంతృప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూర్, మోత్కూర్ మండలాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికే చెందిన వారని సీనియర్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిని అధిష్టానానికి వివరించేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంఽధీభవన్కు వెళ్తుండగా అర్వపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు, సీనియర్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం గాంఽధీ భవన్ వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని కాకుండా ఇటీవల తనతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి మండల అధ్యక్షులుగా నియమించారని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి, దివంగత దామోదర్రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మాత్రం.. మండల అధ్యక్షుల నియామక విషయంలో ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటించాల్సి ఉందని ఇటీవల టీపీసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రి ఉత్తంకుమార్రెడ్డి సూచించిన వ్యక్తికి కూడా మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కూడా ఆందోళనకు కారణమైంది. ● మద్దిరాల మండలంలో గతంలో అధ్యక్షుడిగా ఉన్న ముక్కాముల అవిలమల్లుయాదవ్ స్థానంలో పచ్చిపాల వెంకన్నయాదవ్ను నియమించారు. వెంకన్న యాదవ్.. ఎమ్మెల్యే సామేల్తో గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే తన అనుచరుడికే పదవి కట్టబెట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సీనియర్ నాయకుడు మార్త కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● మోత్కూర్ మండల అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు నియామకాన్ని ముసిపట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా అధ్యక్షుడిని నియమించారని ఆరోపించారు. మునుగోడు మండలంలో బహిరంగంగా ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకపోయినా.. మండల అధ్యక్షుడి ఎంపికపై కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోసం పని చేసిన నాయకుడికే పదవి ఇవ్వడంతో.. రాజగోపాల్రెడ్డి వెంట బీజేపికి వెళ్లి తిరిగి వచ్చిన వారికి అవకాశం లేకపోవడం కొందరికి నచ్చ లేదని తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు మండలాల అధ్యక్షులను మార్చడం పార్టీలో చర్చనీయాంశమైంది. కనీస సమాచారం ఇవ్వకుండా మార్చడంతో సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంటిపులి వెంకటేష్ను కోదాడ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలో చర్చకు దారితీసింది. బయటకు ఎవరు స్పందించకపోయినా లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నర్సింగ్ విజయ్కుమార్గౌడ్ను నియమించడంతో అక్కడ వర్గపోరు బయటపడింది. మొదట మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి పేరును మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రతిపాదించినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం చొరవతో ఊట్కూరు గ్రామానికి చెందిన విజయ్కుమార్కు పదవి దక్కింది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని ఉన్నప్పటికి విస్మరించారని రామేశ్వరి మట్టారెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో విభేదాల కారణంగా ఎమ్మెల్యే జైవీర్రెడ్డి కూడా నిడమనూరు మండల కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఫ కొత్త అధ్యక్షుల నియామకంతో వర్గపోరు బహిర్గతం ఫ అర్వపల్లిలో కొట్టుకున్న కార్యకర్తలు ఫ మిగతా మండలాల్లోనూ అంతర్గత అసంతృప్తి ఫ ఎమ్మెల్యేల ఆధిపత్యంపై నిరసనలు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్ వర్గాల మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ కొన్ని మండల కమిటీల ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామరచర్ల, మిర్యాలగూడ రూరల్, టౌన్ కమిటీలో ఇరువర్గాలు పోటీపడుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకంలో రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎమ్మెల్యే నిర్ణయంతో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవి కేటాయించినట్లు చర్చ జరగుతోంది. దీంతో పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా స్పందించడం లేదు. -
హాస్టళ్ల నిర్వహణ అధ్వానం
నల్లగొండ టూటౌన్ : వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమస్యల మయంగా మారుతోంది. సమస్యలను పరిష్కరిస్తూ చిన్న, చిన్న ఘటనలు చోటుచేసుకున్న సమయంలోనే విద్యార్థులతో మాట్లాడి మరోసారి జరుగకుండా చూడాల్సిన యంత్రాంగం పంతానికి పోవడం.. బెదిరించే ధోరణిలో మాట్లాడడం..కీలకమైన బాధ్యతల్లో ఉన్న అధికారుల ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ విద్యార్థులు చేస్తున్న ధర్నాలతో యూనివర్సిటీ దద్దరిల్లుతోంది. బాధ్యతారహితంగా సిబ్బంది మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇటీవల చోటు చేసుకుంటున్న రూ.99 లక్షల జీఎస్టీ ఎగనామం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అక్రమాలు, ఓ అధ్యాపకుడు విద్యార్థుల నుంచి వసూలు చేసి న పరీక్ష ఫీజు చెల్లించకుండా ఉండడం, అన్నంలో పురుగులు, తాగునీటిలో కప్పలు, చెత్తాచెదారం రావడంతో విద్యార్థులు ఫ్రిజ్ను ధ్వంసం చేయడం లాంటి వరుస ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా.. హాస్టల్ నిర్వాహకులు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ నిర్వహణ లోపాభూయిష్టంగా మారినా దానిని గాడిలో పెట్టే పనిచేయకుండా మిన్నకుండి పోవడంతోనే సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉండడం లేదు. ఆందోళనలు జరుగుతున్నా.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో పురుగుల అన్నం పెట్టారని, అన్నంలో గుట్కా ప్యాకెట్ వచ్చిందని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినా యూనివర్సిటీ బాధ్యులకు ఎలాంటి చలనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలోని కళాశాల వద్ద ఉన్న తాగునీటి ఫ్రిజ్లో జెర్రీ, కప్పలు, పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగి దానిని ధ్వంసం చేసే వరకు తెచ్చుకున్నారు. ఇన్ని జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులకు ఎందుకు పట్టడంలేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎనిమిది నెలలుగా సరఫరాకాని నీరు ఎనిమిది నెలలుగా బాలికల హాస్టల్లో తాగునీరు, వాడుకునే నీరు సరిగా సరఫరా కాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన వారు బెదింరింపు ధోరణితో వ్యవహరించడం వల్లే అర్ధరాత్రి ఆడపిల్లలు వైస్ ఛాన్స్లర్ అతిథి గృహం ముట్టడించారంటే సమస్య ఎంత జఠిలంగా ఉందో ఎవరికై నా అర్థమవుతోంది. కానీ యూనివర్సిటీల బాధ్యులు దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా తమకు మౌలిక వసతులు కల్పించి వివాదాలకు తెర దించాలని విద్యార్థులు కోరుతున్నారు. ధర్నాలతో దద్దరిల్లుతున్న ఎంజీయూ ఫ అన్నంలో పురుగులు.. తాగునీటిలో కప్పలు, జెర్రులు ఫ ఆందోళనలో విద్యార్థులు ఫ దిద్దుబాటు చర్యలకు పూనుకోని యూనివర్సిటీ యంత్రాంగం -
నేడే చేనేత ఎన్నికలు
భూదాన్పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవమైన సంఘాలు పోను మిగిలిన 28 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 సంఘాలకు 539 మంది, నల్లగొండ జిల్లాలోని 9 సంఘాలకు 175 మంది, సూర్యాపేట జిల్లాలో 1 సంఘానికి 11 మంది బరిలో ఉన్నారు. యాదాద్రి జిల్లాలో ఎన్నికలు జరిగే సంఘాల్లో మొత్తం 5818 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 2,851 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 230 మంది ఓటర్లు మొత్తం 8,899 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లకు సంఘం గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు జరిగే సంఘాలు ఇవే.. భూదాన్పోచంపల్లి , భువనగిరి, బండసోమారం, ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్పేట మార్కండేయ సొసైటీ, యాదగిరిగుట్ట ఎస్ఎల్ఎన్ఎస్ సిల్క్ సొసైటీ, వలిగొండ మండలం వెల్వర్తి సంఘం, చౌటుప్పల్, కొయ్యలగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, నారాయణపురం, పుట్టపాక శ్రీభావనారుషి సొసైటీ, పుట్టపాక సిల్క్సొసైటీ, రామన్నపేట మండలం భోగారం, సిరిపురం, జనంపల్లి, వెంకటరమణ సొసైటీ, వెల్లంకి, మోత్కూర్, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి, నార్కట్పల్లి మండలం మాండ్ర, గట్టుప్పల్, గట్టుప్పల్ ధనలక్ష్మి సొసైటీ, మునుగోడు, పలివెల, పలివెల బాలాజీ సిల్క్ సొసైటీ , చండూర్, మర్రిగూడ మండలం వట్టిపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. రహస్య పద్ధతిలో ఓటింగ్ ప్రతి చేనేత సంఘంలోని 7 జనరల్, 2 మహిళా రిజర్వు మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జనరల్ అభ్యర్థులకు తెలుపు రంగు, మహిళా రిజర్వు అభ్యర్థులకై తే పింక్ రంగు బ్యాలెట్ పత్రం ఇస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కోరం ఉంటే పోలింగ్ జరిగిన 3 రోజుల లోపు ఎప్పుడైనా ఎన్నికై న 9 మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, కోశాధికారిని చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు జనరల్ స్థానాలలో పోటీ చేస్తున్న డైరెక్టర్ల అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో గరిష్టంగా 7, లేదా అంతకంటే తక్కువ మందికి ఓటు వేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఏడుగురి ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వేసినా అది రద్దవుతుంది. అలాగే రెండు మహిళా స్థానాల బ్యాలెట్లో రెండు, లేదా ఒకరికి ఓటు వేసినా చెల్లుతుంది. కానీ రెండుకంటే ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు. ఫ ఉమ్మడి జిల్లాలో 28 సంఘాలకు ఎన్నికలు ఫ ఉదయం 7నుంచి 3గంటల వరకు పోలింగ్ ఫ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి -
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధితుల వద్ద నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజావానిలో రెవెన్యూ శాఖకు 56, ఇతర శాఖలకు 40 మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ (టైనీ) శ్రీకాంత్రెడ్డి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్కుమార్, డీఆర్ఓ దశరథ పాల్గొన్నారు. 99.2 శాతం ఫారాలు పంపిణీ చేశాం నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 99.2 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి పాల్గొని మాట్లాడారు. సర్కు సంబంధించి డిజిటైజేషన్ 25 శాతం పూర్తి చేశామని తెలిపారు. బీఎల్ఓలు చురుకుగా లేనిచోట గుర్తించి సంబంధిత మండలాల జూనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ దశరథ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో ‘ఎఫ్ఆర్ఎస్’
నల్లగొండ : విద్యుత్ శాఖ అధికారులకు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) హాజరు విధానం త్వరలో అమలు కానుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జేఎల్ఎం స్థాయి ఉద్యోగి నుంచి ఎస్ఈ వరకు అందరికీ డిజిటల్ హాజరు విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. విధులకు హాజరు కాకుండానే పూర్తిస్థాయి వేతనాలు పొందుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఈ కొత్త నియమం వర్తించనుంది. మొదటగా డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. రెండో విడతలో గ్రామాలకు విస్తరించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. రోజుకు రెండుమార్లు హాజరు.. లేదంటే సెలవే! కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు తమ వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లలో ఎస్సీపీడీసీఎల్ ఎంప్లాయి పోర్టల్ నుంచి ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉద్యోగి ఐడీ, హోదా, వారు పనిచేసే లొకేషన్ వివరాలు నమోదవుతాయి. ఉదాహరణకు ఒక లైన్మెన్ తాను పనిచేసే పరిధిలో ఉదయం 10 గంటలలోపు మొదటిసారి, తిరిగి సాయంత్రం 6 గంటలకు రెండోసారి యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. రోజులో ఈ రెండుమార్లలో ఏ ఒక్కసారి హాజరు నమోదు చేయకపోయినా.. ఆ రోజును సెలవుగానే పరిగణిస్తారు. ఆలస్యంగా వచ్చినా ఆ రోజుకు వేతనం కోత పడే అవకాశం ఉంది. పెరగనున్న జవాబుదారీతనం సబ్ స్టేషన్లు, ఉపకేంద్రాల పరిధిలోనే డిజిటల్ హాజరు వేయాల్సి ఉండడంతో ఉద్యోగులు విధుల్లో ఉండేలా ఈ యాప్ కట్టడి చేయనుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సాధారణ ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. సొంత పనులపై బయటకు వెళ్లే వీలుండదు. ఈ కొత్త విధానాన్ని కొందరు ఉద్యోగులు స్వాగతిస్తుండగా, మరికొందరు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.నల్లగొండ జిల్లాలోని మండలాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పక్క జిల్లాల నుంచి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వారు సకాలంలో విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలోని కిందిస్థాయి సిబ్బంది మాత్రం గ్రామాల్లో అందుబాటులోనే ఉంటున్నారు. ఈ కొత్త యాప్ విధానం వల్ల ఇకపై ఏ అధికారి విధుల నుంచి తప్పించుకునే వీలుండదు. యాప్లోనే ఉద్యోగుల వార్షిక, నెలవారీ సెలవుల వివరాలు, మిగిలిఉన్న లీవ్ల డేటా మొత్తం కనిపిస్తుంది. ఫ ఉద్యోగులకు యాప్ ద్వారా హాజరు విధానం ఫ రోజుకు రెండుమార్లు తప్పనిసరిగా నమోదు -
బాబూ జగ్జీవన్రామ్కు నివాళి
నల్లగొండ : బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల వద్ద జగ్జీవన్రామ్ విగ్రహానికి మహనీయులు ఆశయ సాధన సమితి (మాస్), జగ్జీవన్ రామ్–అంబేద్కర్ భవన అభివృద్ధి కమిటీ, అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శశికళ, అంబేద్కర్–జగ్జీవన్ రామ్ భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, మాస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిక కరణ్ జయరాజ్, గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖకుమార్, జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్కుమార్, ఉమామహేశ్వర్, కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు. -
చెరువుమట్టి లూటీ
చెక్డ్యాం అనుమతుల పేరుతో ఫ కందుకూరు చెరువు మట్టి యథేచ్ఛగా తరలింపు డిండి : మండల పరిధిలోని కందుకూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు అక్రమ మట్టి రవాణాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నిబంధనలకు పాతరేస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడి నుంచి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు. కందుకూర్ గ్రామ శివారులో చెక్ డ్యాం నిర్మించేందుకు ప్రభుత్వం ఇటీవల ఓ కాంట్రాక్టర్కు పనుల అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ పనుల ముసుగులో భారీ ఎత్తున మట్టి దందాకు తెరలేపారు. ఈ చెక్ డ్యాం నిర్మాణ పనుల నిమిత్తం అవసరమైన మట్టిని తరలించేందుకు సదరు కాంట్రాక్టర్ మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, భారీ టిప్పర్ల ద్వారా చెరువులోంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల వద్ద బుకాయింపు ఈ వ్యవహారంపై గ్రామ సర్పంచ్ కొండలు, గ్రామ కార్యదర్శి స్వామి నేరుగా కాంట్రాక్టర్ను నిలదీశారు. మట్టి తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపాలని గట్టిగా అడగగా.. ‘ప్రస్తుతం పనులు ప్రారంభించాం, త్వరలోనే అన్ని అనుమతులు వస్తాయి’ అంటూ ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పి దర్జాగా పనులు కొనసాగించినట్లు వారు స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన ఇరిగేషన్ అధికారులు కందుకూర్ చెరువులోంచి విచ్చలవిడిగా కొనసాగుతున్న ఈ అక్రమ మట్టి తరలింపు వ్యవహారంపై సోమవారం ‘సాక్షి’.. ఇరిగేషన్ డీఈ హన్మంతురావును సంప్రదించి వివరణ కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చెరువు నుంచి మట్టి తరలింపు విషయంపై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే అక్రమ రవాణాను అడ్డుకున్నాం. ఎలాంటి అనుమతులు లేనందున, ప్రస్తుతం మట్టి తరలింపు పనులను పూర్తిగా నిలిపివేశాం’ అని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యం అప్పగించారు..
ఉమ్మడి జిల్లాలో రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం మింగిన మిల్లర్లునల్లమలలోకి రేకులవలయంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాబట్టుకోవాల్సిన పౌర సరఫరాల విభాగంలోని కొందరు అధికారులు అడ్డగోలు తీరుతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లింది. మిల్లర్లు ఒక్క నల్లగొండ జిల్లాలోనే 248.61 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించగా, సూర్యాపేట జిల్లాలో రూ.252 కోట్ల విలువైన ధాన్యాన్ని, యాదాద్రి జిల్లాలో రూ.52.80 కోట్ల విలువైన ధాన్యాన్ని దిగమింగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు పెండింగ్లో పడ్డాయి. ఇదంతా ఒక్క 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిందే కావడం గమనార్హం. మిల్లర్లతో కుమ్మక్కు అయి అమ్యామ్యాలకు అలవాటుపడిన కొందరు అధికారులు వాటి రికవరీ చేయడంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేక వేలం వేసిన ప్రభుత్వం రైతులనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించింది. మిల్లర్లు మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఏ సీజన్లో ధాన్యం కేటాయిస్తే గరిష్టంగా మూడు నెలల్లోగా బియ్యంగా మార్చి మిల్లర్లు ఇవ్వాలి. 2022–23 యాసంగిలో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని దాదాపు 200 మిల్లుల నుంచి 2,47,416.47 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదు. అయినా అప్పట్లో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మిల్లులోని ఆ ధాన్యాన్ని 2024లో వేలం వేసింది. దాంతో వేలం దక్కించుకున్న వారికి మిల్లర్లు అప్పగించింది కేవలం 9 శాతం లోపే. మిగతా ధాన్యం ఎందుకు ఇవ్వడం లేదన్న విషయాన్ని సీరియస్గా తీసుకొని మిల్లుల్లో తనిఖీలు చేయించింది. మిగిలిన ఆ ధాన్యం చాలా మిల్లుల్లో లేదని తనిఖీ బృందాలు గుర్తించాయి. మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు తేల్చాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో ప్రభుత్వం రికవరీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏడు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. రికవరీ చేసింది అంతంతే.. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అంతేకాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్) అమలుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొందరు మిల్లర్లు ధాన్యానికి బదులుగా డబ్బు చెల్లిస్తామని ముందుకొచ్చారు. మిల్లర్ల తరఫున కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో వివాదం లేకుండా ధాన్యం రికవరీ కోసం ప్రభుత్వం రెండు నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఇటు మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ, ధాన్యం కొనుగోలు చేసేందుకు వేలంలో పాల్గొన్న సంస్థలతో చర్చించింది. మూడు నెలల్లో ధాన్యానికి సంబంధించి అంతే విలువైన డబ్బు చెల్లించాలని మిల్లర్లకు సూచించింది. ఇది జరిగి రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు 5 శాతం కూడా చెల్లించలేదు. మొత్తంగా రూ.553.42 కోట్లు రావాల్సి ఉండగా.. మిల్లర్లలో కొందరు మాత్రమే రూ.15 కోట్లలోపే చెల్లించారు. ఇప్పుడు మిల్లర్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారని, ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన గడువు ఆగస్టు 5వ తేదీతో ముగుస్తుందని, ఆలోగా చెల్లించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఫ పునరాసంపై అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు జిల్లా వారీగా రికవరీ ఇలా.. నల్లగొండ జిల్లాలో 58 మిల్లుల నుంచి 1,11,146.43 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.248.61 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.9 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.239.61 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో దాదాపు 70 మిల్లుల నుంచి 1,12,661.26 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.252 కోట్లు రావాల్సి ఉండగా, ఏమీ రాలేదని పౌరసరఫరాల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. యాదాద్రి జిల్లాలో దాదాపు 40 మిల్లుల నుంచి 23,608.78 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.52.80 కోట్లు రావాల్సి ఉండగా, రూ.2 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇంకా రూ.50 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఫ 2022–23 యాసంగి సీజన్ ధాన్యం తీసుకుని సీఎంఆర్ ఇవ్వని పలు మిల్లులు ఫ రెండేళ్ల క్రితం ఆయా మిల్లర్లపై కేసు నమోదు ఫ 90 రోజుల్లో రికవరీ చేయాలని కేబినెట్ సబ్కమిటీ ఆదేశం ఫ రెండు నెలల్లో చెల్లించింది రూ.15 కోట్లలోపే.. ఫ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు -
మంచమే వాహనం..
తిప్పర్తి మండలానికి చెందిన రమేష్ వెన్నెముక దెబ్బతిన్నా మనోధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.- 8లోపలువురు ఎస్ఐల బదిలీనల్లగొండ : ఉమ్మడి జిల్లాలో జిల్లాలో 9 మంది ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు 5వ జోన్ డీఐజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, ప్రజాహితం దృష్ట్యా ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ 1టౌన్లో ఎస్ఐగా పని చేస్తున్న బి.లచ్చిరెడ్డి మోతె ఎస్ఐగా, మోతె ఎస్ఐ టి.అజయ్కుమార్ సూర్యాపేట–1 టౌన్లో ఎస్ఐ–2గా, సూర్యాపేట–1 టౌన్ ఎస్ఐ బి.మోహన్బాబు చిలుకూరు ఎస్ఐగా, తేజస్విని డీఎస్బీ సూర్యాపేట నుంచి నడిగూడెం ఎస్ఐగా, జి.అజయ్కుమార్ నడిగూడెం నుంచి కోదాడ టౌన్ ఎస్ఐ1గా, కె.ఉపేందర్రెడ్డి వీఆర్ సూర్యాపేట నుంచి కోదాడ టౌన్ ఎస్ఐ–2గా, సీహెచ్. గోపాల్రెడ్డి కోదాడ రూరల్ నుంచి నేరేడుచర్ల ఎస్ఐగా, ఎస్కే.యాకుబ్ డీసీఆర్బీ సూర్యాపేట నుంచి కోదాడ రూరల్ ఎస్ఐగా, చిలుకూరు ఎస్ఐ వి.సురేష్రెడ్డి నల్లగొండ వీఆర్కు బదిలీ అయ్యారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫోన్ద్వారా పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్లో భాగస్వాములు కావాలినల్లగొండ టూటౌన్ : మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ భారత్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పులు అంజిరెడ్డి అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో సోమవారం మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ భారత్ విద్యార్థుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే విద్యార్థులందరి భాగస్వామ్యం అవసరం అన్నారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకొని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, జిల్లా యూత్ ఆఫీసర్ గౌతమ్రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కట్టా కిరణ్మయి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాశివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
హైవేపై మృత్యు వేగం!
జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతుండటంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలు, మూల మలుపుల వద్ద నిబంధనల మేరకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలి. కానీ, చాలా వాహనాలు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము సమయాల్లో డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, దానికి తోడు అతివేగం తోడవడంతోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే కారణమవుతున్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా దూసుకొస్తూ.. ముందు వెళ్తున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొడుతుండటం వల్లే వరుస దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిట్యాల : 65వ నంబర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుంటోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సృష్టిస్తున్న బీభత్సంతో జాతీయ రహదారి నెత్తురోడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది. కూతురి వైద్య చికిత్స కోసం చైన్నె వెళ్లి ఇంటికి తిరుగు పయనమైన ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును.. ఓ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కళ్లెదుటే భార్య, ఇద్దరు పిల్లలతో పాటు స్నేహితుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుటుంబ పెద్ద ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గమ్యానికి మరో గంటలో చేరుకుంటారనగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ హైదరాబాద్లోని మధురానగర్లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్బాబు తన కూతురు వైద్యం కోసం భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రియ, కుమారుడు ప్రభవ్, స్నేహితుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ (62)తో కలిసి చైన్నెకి వెళ్లారు. శనివారం రాత్రి చైన్నె నుంచి కారులో హైదరాాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై గల యూటర్న్ వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు చుట్టూ తిరుగుతూ డివైడర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జుగా మారింది. దీంతో జేసీబీలు, కట్టర్ల సహాయంలో కారు టాప్ను కత్తిరించి విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్, శ్రీకర్ప్రసాద్ మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంతో దాదాపు గంటపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫ జూన్ 30న చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్ను దాటి అవతలి వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో నార్కట్పల్లి మండలం అక్కెనపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫ ఈనెల 2న కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆ బస్సు ముందు వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద చెరువువిజయవాడహైదరాబాద్ గాంధీగుడిప్రమాదం జరిగిన స్థలంఫ పెద్దకాపర్తి శివారులో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాద ఊహా చిత్రంఫ 65వ నంబర్ జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు ఫ ట్రావెల్స్ బస్సుల అతివేగం, నిర్లక్ష్యంతోనే అనర్థాలు ఫ వారం వ్యవధిలో మూడు ఘటనలు.. ఫ తాజాగా పెద్దకాపర్తి శివారులో కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు ఫ ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు సహా నలుగురి దుర్మరణం ఫ కూతురి వైద్యం కోసం వెళ్లి వస్తుండగా కాటేసిన మృత్యువు -
కరెంట్ కాటు.. పరిహారం లేటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో విద్యుత్ ప్రమాదాలతో మరణించిన అందరి కుటుంబాలకు పరిహారం అందడం లేదు. రెండేళ్లలో 69 మంది మరణిస్తే కేవలం 23 మంది కుటుంబాలకే పరిహారం అందింది. ఇంకా 46 కుటుంబాలకు పరిహారం అందలేదు. విద్యుదుఘాతంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు బతుకు వెళ్లదీయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు వర్షాకాలం ప్రారంభమైతే చాలు విద్యుత్ ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వర్షాలకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, లీకేజీలు ప్రమాదకరంగా మారుతుండడంతో ఏటా ప్రాణ, ఆస్తినష్టం చోటుచేసుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో చాలా చోట్ల కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు, తుప్పుపట్టిన ఐరన్ పోల్స్, విద్యుత్ తీగలకు చెట్లు తాకడం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2024–25లో ప్రమాదాల తీవ్రత ఎక్కువ 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 261 విద్యుత్ ప్రమాదాలు నమోదయ్యాయి. ఆ ఒక్క ఏడాదే 46 మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. అదే ఏడాది 211 జంతువులు బలయ్యా యి. వర్షాకాలంలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగి నట్టు విద్యుత్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025–26లో కాస్త తక్కువే.. గతేడాది విద్యుత్ ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2025–26లో 155 ప్రమాదాలు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. జంతు మరణాలు 126గా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే గత ఏడాది విద్యుత్ ప్రమాదాలు, మానవ మరణాలు కొంత తగ్గినా, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పక్కా భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన తీగలు, వ్యవసాయ మోటార్ల సమీపంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రూ.1.24 కోట్ల ఎక్స్గ్రేషియా విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు, జంతు యజమానులకు విద్యుత్ సంస్థ ఎక్స్గ్రేషియా అందించింది. రెండేళ్లలో 23 మానవ ప్రమాద కేసులకు రూ.1.04 కోట్లు, 71 జంతు ప్రమాద కేసులకు రూ.20.20 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా 1.24 కోట్ల రూపాయలకు పైగా ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. రెండు సంవత్సరాలలో 416 విద్యుత్ ప్రమాదాలు ఫ 69 మంది బలి.. 337 జంతువులు మృతి ఫ వానాకాలం వస్తే నిత్యం భయం గుప్పిట్లోనే.. ఫ రక్షణలేని ట్రాన్స్ఫార్మర్లే మృత్యు కేంద్రాలు ఫ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరులో అధికారుల నిర్లక్ష్యం జిల్లాలో 2024 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు మొత్తం 416 విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా 337 పశువులు, ఇతర జంతువులు విద్యుత్ షాక్కు బలయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 71 జంతువులకు సంబంధించిన వాటి యజమానులకు మాత్రమే ఎక్స్గ్రేషియా అందింది. ఇంకా 266 జంతువులకు సంబంధించిన వారికి పరిహారం అందలేదు. -
చేయూత పింఛన్లపై విచారణ
నల్లగొండ : చేయూత (ఆసరా) పెన్షన్ల ప్రక్షాళనకు అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. లైవ్నెస్ అథెంటికేషన్ ప్రక్రియలో ఇప్పటికే 204 మంది పెన్షన్దారులు మరణించినట్లు గుర్తించారు. వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం పెన్షన్లను అధికారికంగా తొలగించనున్నారు. అదే సమయంలో మిగిలిన అభ్యంతరాల కేసులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలేని వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మరణించిన వారిలో.. చేయూత పింఛన్ల ప్రక్షాళనలో భాగంగా 204 మంది మరణించినట్లు గుర్తించిన అధికారులు 55 మంది వివరాలు సేకరించలేకపోయినట్లు తెలిసింది. మరో 55 మందికి ఆధార్ సమస్యలు, 40 మంది ఆచూకీ లేనివారిగా, ఏడుగురు రాష్ట్రం వెలుపల ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కేవలం 8 మంది స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. మరణించిన వారి కుటుంబాలకు వెళ్లి ధ్రువీకరణ పూర్తిచేసిన తర్వాత వారి పెన్షన్లు రద్దు చేయనున్నారు. అయితే పెండింగ్ ఉన్న 165 కేసులపై విచారణ నిర్వహించి అనర్హులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారిస్తున్నారు. అర్హులకే పింఛన్ అందేలా.. అర్హులైన వారికే చేయూత పింఛన్లు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నకిలీలు, అనర్హులను గుర్తించి పెన్షన్ జాబితాను ప్రక్షాళన చేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని పెన్షన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ ఇప్పటికే 204 మంది మృతుల గుర్తింపు ఫ అనర్హుల తొలగింపునకు కార్యాచరణ ఫ పెండింగ్ కేసులపైనా క్షేత్రస్థాయిలో పరిశీలన -
అవినీతి రహిత సమాజానికి..
అవినీతి రహిత సమాజానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని సమాచార కమిషనర్ డి.భూపాల్ అన్నారు. - 8లోఈ చిత్రంలోని బాలుడు చండూరు మండలం చొప్పరివారిగూడెంలో జూన్ 3న 11 కేవీ విద్యుత్ వైరు తాకి విద్యుదాఘాతంతో చనిపోయిన ఇంటర్ విద్యార్థి చొప్పరి చందు (16). విద్యుత్ వైరు తెగిపడడం, అది చూడకుండా చందు అటుగా వెళ్లి ప్రమాదం బారినపడి మరణించాడు. ఎదిగిన కొడుకు మరణించిన బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా తేరుకోలేదు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారసత్వ ధ్రువీకరణ పెండింగ్లో ఉండడంతో పరిహారం అందలేదు. -
హక్కుల సాధనకు పోరాటమే ఆయుధం
నల్లగొండ టౌన్: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న యువ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణ హక్కులు దక్కాలంటే సంఘటిత పోరాటమే ఆయుధమని తెలంగాణ యంగ్ వర్కర్స్ కన్వీనర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. నల్లగొండలో ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాల కారణంగా యువ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అసంఘటిత రంగ యువతలో అత్యధిక మందికి కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అందడం లేదన్నారు. జిల్లా స్టీరింగ్ కన్వీనింగ్ కమిటీ 15 మందితో ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా చిన్నపాక లక్ష్మీనారాయణ, కోకన్వీనర్లుగా ఎం రవినా యక్, భీమగాని గణేష్, మరో 12మంది సభ్యులను ప్రకటించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలె సత్యనారాయణ, భీమగాని గణేష్, బండారి మధు, గంజి రాజేష్, ఏర్పుల శ్రావణ్, జి.కొండల్, టి.రాజు, పోగల శశిధర్, ఎ.నరేష్ భాగ్యరాణి పాల్గొన్నారు. ఫ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ -
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, శివాలయం, క్యూకాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వామివారిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజల ద్వారా రూ.54,30,877 నిత్యాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
మర్రిగూడ : ప్రజా పోరాటాలతోనే నిరుపేదల సమస్యల పరిష్కారంతోపాటు హక్కుల రక్షణ కల్పించబడుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకులు చేసిన త్యాగాలు, వీరోచిత పోరాటాల ఫలితంగానే నేడు సమాజంలో సామాన్య ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ పేదల పొట్టగొడుతోందన్నారు. ఉపాది హామీ పథకం పేరు మార్చి శ్రామికుల హక్కులను కాలరాసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా, మండల నాయకులు ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, బూడిద సురేష్, మేతరి యాదయ్య, ఇస్కిళ్ల మహేందర్, సత్యం, లక్ష్మయ్య, విరజాల మహేందర్, గిరి, అశోక్, ఈశ్వర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
8న మూసీ మత్స్య సంఘం చైర్మన్ ఎన్నిక
నకిరేకల్ : మూసీ మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘం చైర్మన్తో పాటు ఇతర పదవులకు ఈనెల 8న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కె.శ్రీరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 11 గంటల నుంచి 11.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైతే అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అధికారులే కూలీలుగా..చందంపేట : సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్లు ఆదివారం చందంపేట మండల కేంద్రంలోని రైతు వేదికకు చేరాయి. వీటిని మండలంలోని పోలేపల్లి రైతు వేదికకు తరలించాల్సి ఉండగా ఎవరూ లేకపోవడంతో మండల వ్యవసాయ అధికారి లక్పతి, ఏఈఓలు ప్రవీణ్, సర్దార్ స్వయంగా వాహనంలోకి ఎక్కించి తరలించారు. ఇక్కడ వ్యవసాయ అధికారులే కూలీలుగా అవతారం ఎత్తడం గమనార్హం. రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలుకనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారికి అర్చకుడు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి కుంకుమ పూజ, అభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయ వద్ద ఉన్న పుట్టలో పాలు పోసి నాగ పడగలకు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని వేప, రావి కొమ్మలతో ముడుపులు కట్టారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, నాగేశ్వర్రావు, ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలిసంస్థాన్ నారాయణపురం : విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఉషారాణి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాల (సర్వేల్)లో 1976, 1980 ఎస్ఎస్సీ బ్యాచ్ల విద్యార్థులు రూ.8.5 లక్షల వ్యయంతో నిర్మించిన వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులను ఆమె ప్రారంభించారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1985 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థుల తరఫున రూ.70 వేల విలువైన మూడు ట్యాబ్లను బహూకరించి మాట్లాడారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, 1976 బ్యాచ్కు చెందిన పద్మారెడ్డి, సురేందర్రెడ్డి, జితేందర్రెడ్డి, 1980 బ్యాచ్కు చెందిన రాజశేఖర్రెడ్డి, కరుణాసాగర్, 1985 బ్యాచ్కు చెందిన పురుషోత్తంరెడ్డి, పీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
పొలమే నా ఆఫీస్
భువనగిరి జిల్లా రామన్నపేట మా సొంతూరు. మా నాన్న అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. నేను వ్యవసాయ రంగంపై ఇష్టంతోనే అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాను. 2017లో ఏఈఓ ఉద్యోగానికి ఎంపియ్యాను. విధుల్లో చేరిననాటి నుంచి ‘పొలమే నా ఆఫీస్’గా పనిచేస్తున్నాను. రైతులకు అవసరమైన కొత్త టెక్నాలజీని, ప్రభుత్వ పథకాలను అందించి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నాను. నా క్లస్టర్ పరిధిలో ఒక్క ఎకరం భూమి కూడా బీడుగా లేకుండా రైతులకు అవగాహన కల్పించి పంటలు వేసేందుకు సూచనలు ఇస్తున్నాను. ఇటీవల గ్రామాల్లో ఎఫ్పీఓలను తయారు చేసి రైతులు తమ పండించిన పంటలను నేరుగా అమ్ముకునేలా, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునేలా గైడ్ చేస్తున్నాను. – ఉయ్యాల శశాంక, ఏఈఓ, తాళ్లవెల్లెంల, చిట్యాల మండలం -
బియ్యం ఎగుమతికి ఇన్సెంటివ్
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ దున్నపోతులగండి, నెల్లికల్లు ఎత్తిపోతల పనుల పరిశీలన మిర్యాలగూడ : ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యానికి ఇన్సెంటివ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. వాతావరణంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను సాగు చేయాలన్నారు. శనివారం ఆయన జిల్లాలో నిర్మాణంలో ఉన్న దున్నపోతులగండి, నెల్లికల్లు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న ఆయన ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే రెండున్నరేళ్లలో పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైస్ మిల్లులు నిర్మించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలో గోదాములను మహిళలే నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షుడు కైలాష్నేత, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలిండియా రైస్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, మిల్లర్లు కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్, బండారు కుశలయ్య గుండా మల్లయ్య, చకిలం రామయ్య, చిన్నపరెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ నాటికి దున్నపోతుల గండి పూర్తి.. అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం ఆయన దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి.. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఈ గంధం శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ మోసిన్బిన్అహ్మద్, తహసీల్దార్ రాగ్యానాయక్, సీఐ పీఎన్డీ.ప్రసాద్, ఎస్ఐ శేఖర్, కాంట్రాక్టర్ సుమన్రావు, డీఈలు కేశవ్, స్వప్న, జేఈ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అధికారిగా ఆమె రైతుకు చేదోడు
ఫ వ్యవసాయ రంగంలో రాణిస్తున్న మహిళా ఏఓలు, ఏఈఓలు ఫ పంటల దిగుబడి పెంచేలా రైతులకు దిశానిర్దేశం మా స్వస్థలం సూర్యాపేట పట్టణం. మా తల్లితండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. నాకు డాక్టర్ కావాలనే ఆలోచన ఉన్నా.. డాక్టర్ కంటే రైతులకు సేవ చేస్తే బాగుటుందని మా అమ్మానాన్న చెప్పేవారు. ఈ క్రమంలో నేను 2002లో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. ఆ సమయంలోనే నాకు బీఎస్సీ అగ్రికల్చర్లో అధిక మార్కులు ఉండటంతో ఎలాంటి పోటీ పరీక్ష లేకుండా నాకు ఏఈఓ ఉద్యోగం ఇచ్చింది. కానీ నేను అప్పుడు చేరకుండా పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత 2009లో ఉద్యోగంలో చేరాను. ఏఈఓగా ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే నాకు ఏఓగా పదోన్నతి లభించింది. విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ రైతులకు తగిన సలహాలు, సూచనలు చేస్తున్నాను. – ఎస్.పద్మజ, ఏఓ, మునుగోడు మా నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. నిత్యం రైతులు మా ఇంటికి వచ్చి పంట పొలాల విషయంపై చర్చించేవారు. నేను కూడా మానాన్న బాటలోనే నడిస్తూ అగ్రికల్చర్ అధికారి కావాలన్న లక్ష్యంతో నేను కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేశా. రైతులకు సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, సేంద్రియ విధానాలపై అవగాహన కల్పిస్తున్నా. రైతుకు మేలు జరిగే ఏ విషయాన్ని కూడా తాత్సార్యం చేయకుండా రైతులకు తెలియజేస్తున్నా. మహిళ రైతులను సైతం ఈ రంగం వైపు మళ్లించేందుకు నావంతుగా కృషి చేస్తున్నా. – మేకల రుషేంద్రమణి, ఏఓ, మిర్యాలగూడ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
కట్టంగూర్, నిడమనూరు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఈఈ) వాణిశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్, నిడమనూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్కుమార్తో కలిసి పరిశీలించారు. ముందుగా కట్టంగూర్లోని గాంధీనగర్ కాలనీ నివాసితుల ఇంటి స్థలాలు, గుడిసెలను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అర్హత ప్రమాణాల మేరకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిడమనూరు మండలం జంగాలవారిగూడెంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న 30 ఇళ్లను పరిశీలించారు. రెండో విడత ఇళ్ల మంజూరులో గుడిసెల్లో ఉంటున్న వారికే ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అనంతరం ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. 3వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వ నిర్దేశించిన 750 గజాల్లోపు ఇంటి నిర్మాణం చసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు అంజన్రెడ్డి, ఎస్డీ.ఇమామ్ ఏఈలు బానోతు అరుణ, మేఘన, సర్పంచ్లు ముక్కాముల శ్యామలశేఖర్, రూపాని పుష్పలతకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఈఈ వాణిశ్రీ -
రైతుకు సాయం అందించడంలో ఆనందం
రైతుకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ విస్తరణాధికారిగా పదేళ్ల క్రితం విధుల్లో చేరాను. మాది రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం దుబ్బతండా. మా నాన్న థావుర్యా ఆర్టీసీ డ్రైవర్. ఆ కుటుంబంఅంతా వ్యవసాయం చేసేవారు కావడంతో నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి 2017 వ్యవసాయ విస్తరణాధికారిగా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం కొండమల్లేపల్లి మండలంలో ఏఈఓగా రైతులకు సేవలందిస్తున్నాను. నా విద్యాభ్యాసం పూర్తిగా కొండమల్లేపల్లిలోనే పూర్తికావడం ఇక్కడి రైతులకు తనవంతుగా సేవలందించడం ఎంతో ఆనందంగా ఉంది. – మాధురి, ఏఈఓ, కొండమల్లేపల్లి -
ఓటర్లకు బీఎల్ఓల సాయం
నకిరేకల్ : ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యమంలో భాగంగా ఫారాలు పూరించడంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చేందుకు నకిరేకల్లో బీఎల్ఓలు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. ‘సర్కు సవాళ్లు’ శీర్షికన శనివారం శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రంగా స్పందించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నకిరేకల్ తహసీల్దార్ యశ్వంత్రాజ్ పలు ప్రాంతాలను సందర్శించారు. సాక్షి కథనంలో ప్రస్తావించిన వృద్ధుడు పుట్ట యల్లయ్య నివాసానికి చేరుకుని స్వయంగా అతని ఫారాన్ని నింపడంలో సహయం చేసి.. పూర్తి చేసిన ఫారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఎల్ఓలు సాయం అందిస్తారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిసి వారి సమక్షంలోనే ఫారాల్లో అవసరమైన వివరాలను నమోదు చేయించి సంతకాలు తీసుకుని స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు ఇబ్బందులపై కథనం ప్రచురించిన ‘సాక్షి’ దినపత్రికకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట సూపర్వైజర్లు మోదిన్పాష, గీతా, బీఎల్ఓలు నాగమణి, సుజాత ఉన్నారు. -
ఎస్ఐఆర్లో లోపాలు ఉండొద్దు
మిర్యాలగూడ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించి.. లోపాలు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామంలో ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించి బీఎల్ఓలు, రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వే సందర్భంగా ఓటర్ల వివరాల సేకరణ, ఫారాలు నింపడం, ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియలను పరిశీలించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు, అవగాహన లేని ఓటర్లకు అవసరమైన సాయం అందించి వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో సేకరించిన సమాచారాన్ని వెంటనే డిజిటల్ విధానంలో నమోదు చేసి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా కీలకమైందని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ, బీఎల్ఓలు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్నల్లగొండ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 6న జిల్లా కేంద్రాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి (డీసీఓ) శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల, అనుముల (పోప్ పాల్ జూనియర్ కాలేజీ ప్రాంగణం), బత్తాయి మార్కెట్ ఎదురుగా, నల్లగొండకు, విద్యార్థినులు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్, నిడమానూరు(ఎస్ఆర్టీఎస్), సాగర్ రోడ్, నల్ల గొండకు రావాలని పేర్కొన్నారు. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకువచ్చి కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారానే మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2026 రెగ్యులర్గా పాస్ అయిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పారదర్శకంగా విక్రయాలు చేపట్టాలిమిర్యాలగూడ : రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి వల్లోజు వినోద్కుమార్ సూచించారు. మిర్యాలగూడలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో శనివారం ఆయన తనిఖీలు చేపట్టారు. స్టాక్ వివరాలు, ధరల పట్టికలు, విక్రయ రికార్డులు, లైసెన్స్లను పరిశీలించి మాట్లాడారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి సాగులో అధిక దిగుబడులు అందించే సన్నరకాల విత్తనాలను రైతులకు చేరవేసే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై పడే అవకాశం ఉన్నందున రైతులకు ముందస్తు సూచనలు అందించాలని, పంటల ఎంపికలో శాసీ్త్రయ సలహాలు ఇవ్వాలని అదికారులకు సూచించారు. ఆయన వెంట ఏఓ రుషేంద్రమణి, ఏఈఓలు ఉన్నారు. అప్పీలుదారుకు రూ.5 వేల పరిహారంనల్లగొండ : సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని సకాలంలో పూర్తిగా అందించడంలో విఫలమైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రజా సమాచార అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పీలుదారుకు రూ.5 వేల పరిహారం చెల్లించడంతో పాటు రికార్డుల పరిశీలనకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. ధర్మావత్ బాల్సన్ నాయక్ 2010–2025 మధ్యకాలానికి సంబంధించిన 14 అంశాల సమాచారాన్ని కోరగా, మూడు అంశాలకు మాత్రమే ఆలస్యంగా సమాచారం అందించినట్లు కమిషన్ గుర్తించింది. దీంతో మిగిలిన రికార్డులను కార్యాలయంలో పరిశీలించే అవకాశం కల్పించి, పరిశీలన అనంతరం రెండు వారాల్లో ఉచితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్టీఐ చట్టంలోని సెక్షన్–20 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. -
విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలి
మిర్యాలగూడ, వేములపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఉత్తమ బోధన అందించాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. శనివారం ఆయన మిర్యాలగూడలోని కేజీబీవీని, వేములిపల్లి జెడ్పీహెచ్ఎస్ను, ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయాచోట్ల తరగతి గదులను, భోజనశాలను, వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడంతోపాటు పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులకు ఎలాంటి లోటురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాన్ని సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు ధర్మానాయక్, లక్ష్మణ్నాయక్, ఎస్ఓ నాగమణి, జీహెచ్ఎం బూరుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి దశలో 8వేల ఎకరాలకు నీరిస్తాం
తిరుమలగిరి(సాగర్) : డిసెంబర్ నాటికి నెల్లికల్లు లిఫ్టు మొదటి విడత పనులు పూర్తిచేసి 8 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన తిరుమలగిరి(సాగర్) మండలంలోని నెల్లికల్లు లిఫ్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిల్లులు వెంటటనే చెల్లించి సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వచ్చే వేసవి నాటికి రెండో విడత పనులను పూర్తి చేసి 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు, శంకుస్థాపనలకే పరిమితమైందని, నేడు ఆ పనులు తాము చేపడుతున్నామని చెప్పారు. ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్కు గండిపడే ప్రమాదం ఉంటే రూ.55 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచే తాను ఆరు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యానని.. ఈ ప్రాంతంపై తనకు బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, ఎస్ఈ మల్లికార్జునరావు, జీఎం శ్రీనాథ్రెడ్డి, డిప్యూటీ ఎస్ఈ భద్రు, ఈఈ సత్యనారాయణ, డీఈ శ్రవణ్కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ కాంసాని చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లాలునాయక్, గడ్డం సాగర్రెడ్డి పాల్గొన్నారు. -
‘మీసేవ’లో అధిక వసూళ్లు వద్దు
నల్లగొండ : మీ–సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలని, ప్రజల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక చార్జీలు వసూలు చేయవద్దని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల యజమానులు, ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల సవరించిన యూజర్ చార్జీలు వెంటనే అమల్లోకి వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని.. ఇకపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. కేంద్రాలు నిర్ణీత పనివేళలను తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా కారణంతో కేంద్రం ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తే సంబంధిత తహసీల్దార్కు ముందస్తుగా సమాచారం అందిచాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, మీసేవ జిల్లా అధికారి రాజశేఖర్, ఈడీఎం దుర్గారావు, ఏపీడీ శ్రవణ్ కుమార్, రవి పాల్గొన్నారు. నల్లగొండ, సాక్షి ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (ఎస్ఐఆర్–సర్) ఓటర్లు నానా తంటాలు పడున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. అనేక కాలనీల్లో పంపిణీ చేసిన ఓటరు ఫారాలను ఎలా నింపాలో, ఏ వివరాలు ఎక్కడ రాయాలో అర్థం కావడం లేదంటూ ప్రజలు సిబ్బందిని అడుగుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో దశాబ్దాల కిందట, ఎప్పుడో మరణించిన తమ తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పెద్దగా చదుకోని వారు పాత వివరాలను ఎలా తెలుసుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 ఏళ్ల కిందటి ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. 99 శాతం పంపిణీ పూర్తి జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా, 15,00,788 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 98.98 శాతం లక్ష్యాన్ని జిల్లా సాధించింది. కేవలం 15,465 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా తొలి స్థానంలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తిరిగి ఇవ్వడంలో జాప్యం క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల బీఎల్ఓల పనితీరుపై ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేయాల్సిన బీఎల్ఓలు.. కొందరు ఓటర్లకు ఫోన్ చేసి తమ వద్దకే వచ్చి ఫారాలు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఫారాలు పూర్తిగా నింపిన అనంతరం తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలని కూడా చెబుతున్నారని పలువురు ఓటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అంగన్వాడీ కేంద్రాలు, వార్డు ఆఫీస్లకు వచ్చి ఇవ్వాలని చెబుతున్నట్లు ఓటర్లు పేర్కొంటున్నారు. ఇక ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో 1,39,847 ఫారాలను మాత్రమే (9.22 శాతం) డిజిటలైజ్ చేశారు. ఎప్పటికప్పడు ఫారాలు తీసుకున్న ఓటర్లు తిరిగి ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతోంది. ఎదురవుతున్న సమస్యలెన్నో.. 2002 ఓటరు జాబితాలో పేర్లు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు ఉండటంతో మ్యాపింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2002 తర్వాత ఓటరుగా నమోదైన పలువురు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో ఆలస్యం చేస్తున్నారు. వలస వెళ్లిన ఓటర్లను ఫోన్లో సంప్రదించినా స్పందన లేకపోవడంతో ఫారాల పంపిణీ, సేకరణ జాప్యం అవుతోంది. అద్దె ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు మారిన వారి కొత్త చిరునామాలు గుర్తించడం కష్టంగా మారింది. ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు నమోదై ఉండటంతో ఏ ఓటును కొనసాగించాలనే విషయంలో ఓటర్లు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. కొంతమంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంపై ఆసక్తి చూపకపోవడంతో బీఎల్ఓలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈనెల 30వ తేదీ నాటికి ఫారాల సేకరణ పూర్తి చేసి డిజిటలైజ్ చేయాల్సి ఉంది. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. ఈలోగా ఫారాలను పూర్తి చేయించడం, వాటిని డిజటలైజ్ చేయడం సవాల్గా మారింది.నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచాలని, ఇప్పటికే ఉన్న విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తిచేసుకున్న చిన్నారులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఎఫ్ఆర్ఎస్ నమోదు అనంతరం విద్యార్థులు పాఠశాల వెలుపలికి పంపకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 25 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని, ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేరికలు పెంచేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి.. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలన్నారు. మూడు నెలలకోకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విద్యార్థులు సమర్థంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఈఓ సుశీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలకే సేవలు అందించాలి ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం ఫ 2002 నాటి వివరాలు దొరక్క ఓటర్ల ఆందోళన ఫ జిల్లాలో 98.98 శాతం ఫారాల పంపిణీ పూర్తి ఫ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నల్లగొండ నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ నియోజకవర్గం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ శాతం దేవరకొండ 2,69,098 2,67,172 99.28 నాగార్జునసాగర్ 2,34,722 2,33,505 99.48 మిర్యాలగూడ 2,40,574 2,36,351 98.24 నల్లగొండ 2,49,571 2,43,276 97.48 మునుగోడు 2,63,757 2,63,533 99.92 నకిరేకల్ 2,58,531 2,56,951 99.39 -
పత్తి ఉత్పాదక మిషన్
పత్తి విత్తనాలకు రైతుల బారులుగుర్రంపోడు : జాతీయ పత్తి ఉత్పాదకత పథకం కింద రైతులకు ఉచితంగా అందిస్తున్న పత్తి విత్తనాల కోసం శుక్రవారం గుర్రంపోడు రైతు వేదిక వద్ద రైతులు బారులుదీరారు. భారీ సంఖ్యలో రైతులు చేరుకోవడంతో పోలీసుల బందోబస్తు నడుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాలకు సరిపడా పత్తి విత్తన ప్యాకెట్లను అందజేశారు. ఉచితంగా పొందిన పత్తి విత్తనాలను సద్వినియోగం చేసుకుంటామని, దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహిస్తామని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. విత్తనాలు పొందిన రైతుల పత్తి పంటను జియోట్యాగింగ్ చేసి విస్తరణాధికారులు పర్యవేక్షిస్తారని ఏఓ కంచర్ల మాధవరెడ్డి తెలిపారు. పంట ఎదిగేందుకు ఉచితంగా గ్రోత్ ప్రమోటర్లను కూడా అందిస్తామన్నారు. నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్రంలో పత్తి ఉత్పత్తులను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు ప్రోత్సాహం అందించనుంది. పత్తి ఉత్పాదక మిషన్ ద్వారా పత్తి సాగును పెంచాలని నిర్ణయించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో 18 జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనుంది. అందులో నల్లగొండ జిల్లాలో కూడా పత్తి ఉత్పాదక మిషన్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింది ఒక్కో రైతుకు ఎకరం నుంచి రెండున్నర ఎకరాల వరకు సబ్సిడీ అందించనుంది. ఈ మిషన్ ద్వారా అధిక సాంద్రత, తక్కువ దూరంలో విత్తనాలను విత్తడం, సమగ్ర పంట యాజమాన్యం, సమగ్ర పోషకాల యాజమాన్యం, అంతర పంటల పద్ధతి వంటి ఐదు పద్ధతుల్లో పత్తిని సాగు చేయించడంతో పాటు సబ్సిడీతో పాటు ఇన్ఫుట్లను కూడా రైతులకు అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి అవసరమైన పత్తి విత్తనాలను కేంద్రం జిల్లా వ్యవసాయ శాఖకు పంపింది పత్తి సాగులో పాటించే ఐదు పద్ధతులు ఇవే.. ● అధిక సాంద్రత పద్ధతిన (హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్) జిల్లాలో 20,600 ఎకరాల్లో సాగు చేయించనున్నారు. ఈ విధానానికి వర్షాధార పరిస్థితులు, లోతు తక్కువ నల్లరేగడి, ఎర్రనేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పద్ధతిలో 90´15 సెంటీమీటర్ల దూరంలో, ఎకరానికి 29,629 మెక్కలను నాటాల్సి ఉంటుంది. ఎకరానికి 6 ప్యాకెట్లు విత్తనాలను(ఒక్కో ప్యాకెట్ 450 గ్రాములు) ఇతర ఇన్ఫుట్ కింద ప్రభుత్వం రూ.7200 సబ్సిడీపై రైతులకు కేంద్రం ఇవ్వనుంది. ● తక్కువ దూరం పాటించడం (క్లోసర్ స్పెసింగ్) ఈ పద్ధతిలో సాగు చేయడానికి మధ్యస్థ సారవంతమైన నల్లరేగడి భూములు అనుకూలం. 90´30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకోవాలి. ఎకరానికి 14,814 మొక్కల చొప్పున ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఎకరానికి నాలుగు ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటుంది. జిల్లాలో ఈ పద్ధతిన 9 వేల ఎకరాల్లో సాగు చేయించాలని నిర్ణయించారు. విత్తనాలతో పాటు ఇతర ఇన్ఫుట్ కింద ఎకరానికి రూ.5,400ల వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించనుంది. ● పత్తిలో సమగ్ర పంట యాజమాన్యం పద్ధతిలో జిల్లాలో 1400 ఎకరాలలో సాగు చేయించాలని నిర్ణయించింది. 90´60 సెంటీమీటర్ల దూరంలో ఎకరానికి 7 వేల మొక్కలు ఉంటేలా విత్తనాలు విత్తుకోవాలి. ● సమగ్ర పోషకాల యాజమాన్యం పద్ధతిలో 725 ఎకరాల్లో సాగు చేయించనున్నారు. ● అంతర పంటలు పద్ధతిలో 350 ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని నిర్ణయించింది. వీటికి ఎకరానికి రూ.2800 చొప్పున విత్తనాలతో పాటు ఇతర ఇన్ఫుట్ కింద పలు సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది. పత్తిసాగు పెంచేందుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న కేంద్రం ఫ రైతులకు విత్తనాలు, ఇన్ఫుట్ సబ్సిడీలు ఫ ఐదు పద్ధతుల్లో సాగు చేయించేలా ప్రణాళిక -
‘సర్’లో తప్పిదాలు చేయొద్దు
చిట్యాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాలను పూరించటంలో ఓటర్లు తప్పిదాలు చేయకుండా చూడాలని స్టేట్ డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్ రామ్ప్రసాద్రావ్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి బీఎల్ఓలకు సూచించారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ, ఉరుమడ్ల గ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, పత్రాలను పూరించిన అనంతరం బీఎల్ఓలకు అందజేసే కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.విజయ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐ జానిషరీఫ్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
షూటింగ్లో నల్లగొండ యువతి సత్తా
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణానికి చెందిన తేలు ఈశిత్వ శ్రీకృష్ణ యువ షూటర్గా జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. పదో తరగతి చదువుతున్న ఆమె చిన్న వయసులోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేకత చాటుతోంది. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర రైఫిల్ ఛాంపియన్షిప్ –2026 పోటీల్లో 400గాను 393 స్కోర్ సాధించి రెండ రజత పతకాలు కై వసం చేసుకుంది. టీం ఇండియా సెలక్షన్ ట్రయల్ –3లో 610 స్కోర్, సెలక్షన్ ట్రయల్ –4 లో 610.9 స్కోర్ సాధించి ట్రయల్ –5, 6కు ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన ఈశిత్వ శ్రీకృష్ణను పలువురు అభినందించారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
రామగిరి(నల్లగొండ): జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు జిల్లా గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లించి, గ్రంథాయాల అభివృద్ధికి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం స్థానిక గ్రంథాలయ సంస్థలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని, కలెక్టర్ గెజిట్ ప్రకారం సిబ్బంది ఆరుగురు గ్రంథపాలకులు, ఇద్దరు లైబ్రరీ హెల్పర్ల నియామకానికి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం ఐదు ఎజెండా అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, విద్యాశాఖ సీఎంఓ కత్తుల రవీందర్, వయోజన విద్య అధికారి దుర్గాప్రసాదరావు, ఏపీఆర్ఓ బీమేష్, డీపీఓ అధికారి వెంకటేశ్వర్లు, లైబ్రరీ ఇన్చార్జ్ రాజేష్ పాల్గొన్నారు. -
ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన
కొండమల్లేపల్లి: పట్టణ కేంద్రంలోని పశువుల సంత సమీపంలో గల రైతువేదికను గురువారం జిల్లా వ్యవసాయాధికారి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కాటన్ మిషన్, కపాస్ క్రాంతి పథకం, పంటమార్పిడి, ఎరువుల మోతాదు వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కపాస్ క్రాంతి కార్యక్రమం కింద రైతులకు పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం మండల పరిధిలోని పెండ్లిపాకల గ్రామం వద్ద ఉన్న రైతువేదికను సందర్శించి యూరియా పంపిణీ విధానాన్ని పర్యవేక్షించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి జానకిరాములు, ఏఈఓలు మల్లేష్, మాధురి, తులసి, స్థానిక రైతులు తదితరులున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలిమర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల తానేదారుపల్లికి చెందిన విద్యార్థులు తమకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాంరెడ్డిపల్లిలో చండూరు–మాల్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తమ గ్రామం ప్రధాన రహదారికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డు వరకు నడుచుకుంటూ వెళ్లడం వల్ల సమయం వృథా కావడమే కాకుండా సకాలంలో విద్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలల సమయానికి అనుగుణంగా తమ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కాగా, రహదారిపై విద్యార్థులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేపు స్పాట్ అడ్మిషన్లునాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి శనివారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఐలయ్య గురువారం తెలిపారు. పాలిసెట్–2026 లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు, పాలిసెట్ రాయకపోయినా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల విద్యార్థులు పైలాన్కాలనీలోని పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ సర్టిఫికెట్లతో స్వయంగా హాజరుకావాలని కోరారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నకిరేకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్స్ అండ్ ట్రైనింగ్) రాష్ట్ర పరిశీలకుడు రమేష్ అన్నారు. నకిరేకల్ మండలం చందంపల్లి, నకిరేకల్లోని జెడ్పీ హైస్కూళ్లను గురువారం ఆయన డీఈఓ సుశీందర్రావు తో కలిసి సందర్శించారు. చందంపల్లిలో ప్రీప్రైమరీ బోధన తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, బోధన విధానం, పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట ఎంఈఓ మేక నాగయ్య, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కోదాటి రాములు, చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం నవీన్రెడ్డి తదితరులున్నారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి చిట్యాల: ప్రాథమిక స్థాయి తరగతుల్లోని విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, డీఈఓ సుశీందర్రావు తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ప్రీప్రైమరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ను గురువారం వారు సందర్శించారు. వారి వెంట ఎంఈఓ సైదానాయక్, హెచ్ఎంలు అరుణ, శ్రీనివాస్ తదితరులున్నారు. ఫ ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకుడు రమేష్ -
నీలగిరిలో ‘భువన్’ సర్వే
నల్లగొండ టూటౌన్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను డిమాండ్ను లెక్కించేందుకు ప్రభుత్వం ‘భువన్ సర్వే’ రెండో విడతకు శ్రీకారం చుట్టింది. ఫేస్–1లో గతేడాది 14వేల భవనాలకు కొలతలు తీసుకొని భువన్ సర్వే ప్రకారం ఇంటి యజమాని, భవనానికి చెందిన సమగ్ర వివరాలను పక్కాగా అప్లోడ్ చేశారు. నగరంలోని 48 డివిజన్లలో దాదాపు 48 వేల అసిస్మెంట్లు ఉండగా.. ఈ ఏడాది ఫేస్–2 కింద 18,003 భవనాలను కొలతలు తీసుకుని ఆస్తిపన్ను నిర్ధారించనున్నారు. ఆయా డివిజన్లలో ఎంపికై న ఇంటి నంబర్లకే భువన్ సర్వే చేయనున్నారు. పక్కాగా భవనాల ఆస్తి పన్ను.. భువన్ సర్వే నగరంలోని 18,003 భవనాలకు పక్కాగా ఆస్తి పన్ను లెక్కించడంతో పాటు అన్ని ధ్రువపత్రాలను తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. సంబంధిత ఇంటి నంబర్ పై ఒక్క క్లిక్తో ఇంటి యాజమాని, ఇంటి అనుమతుల ధ్రువపత్రాలు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, కుళాయి నంబర్, భవనం ఎన్ని అంతస్తులు, వాణిజ్యమా, నివాస భవనమా అనే వివరాలు తెలుస్తాయి. పెరగనున్న డిమాండ్ ... నగరంలోని పలు డివిజన్లలో పాత వాటి స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టినవి ఉన్నాయి. ఇటీవల నివాస భవనాల స్థానంలో కమర్షియల్ భవనాలు భారీగా వెలిశాయి. ఈ భువన్ సర్వే చేయడం ద్వారా డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గత నాలుగైదేళ్లుగా నగరంలో ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు, కార్పొరేట్ షాపింగ్ మాల్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో భువన్ సర్వే చేయడం ద్వారా ఆస్తి పన్ను డిమాండ్ కూడా పెరుగనుంది. గతేడాది భువన్ సర్వే చేయడంతో రూ. 2 కోట్లు డిమాండ్ పెరిగింది. కానీ ఈ ఏ డాది భువన్ సర్వే ఎక్కువ భాగం విలీన గ్రామాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 6 వేల భవనాల వరకు విలీన గ్రామాల్లో ఉండగా, మిగతావి పట్టణంలోనే ఉన్నాయి. ఈ సారి కూడా ఆస్తి పన్ను డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫ 18,003 భవనాలకు పక్కా లెక్క ఫ ఆస్తి పన్ను నిర్ధారణే లక్ష్యంగా అధికారుల కసరత్తు ఫ ఈసారి విలీన గ్రామాలపైనే ఫోకస్ భువన్ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. డివిజన్ల వారీగా ఇంటి నంబర్లను విభజించి వార్డు ఆఫీసర్లకు ఇచ్చారు. త్వరలోనే సర్వే ప్రారంభించి అన్ని వివరాలు సేకరించి అప్లోడ్ చేస్తాం. – శివరాంరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ -
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా పూర్తి స్థాయి కమిటీ
ఇప్పటికే మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తయినందున, ఆయా అధ్యక్షులంతా కూర్చొని మండల, పట్టణ కమిటీలకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సామాజికవర్గాల వారీగా కూర్పుతో పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారిని ఆయా కమిటీలలో నియమించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ సూచిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం పూర్తి కాగా ప్రస్తుతం జిల్లా పూర్తి స్థాయి కమిటీ నియామకంపై అధిష్టానం దృష్టి సారించింది. దీనికి సంబంధించి జిల్లాలోని మంత్రితోపాటు ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కై లాష్ నేత సంప్రదించి.. కమిటీలో చేర్చాల్సిన వారి పేర్లను సేకరించారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పంపించారు. కాగా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకత్వం దృష్టిసారించినా.. ప్రస్తుతానికి ప్రకటించే అవకాశం లేదని తెలిసింది. సామాజిక న్యాయం ఆధారంగా కూర్పు! జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో సీనియారిటీ ఆధారంగా, సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల అనుమతితో జిల్లా కార్యవర్గం జాబితా సిద్ధం చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా కార్యవర్గంలో చోటు కల్పించడంతోపాటు, కష్టపడి పనిచేసిన సీనియర్లకు అవకాశం ఇవ్వాలన్నది పార్టీ ఉద్దేశం. కార్యవర్గం కూర్పుకోసం ఎమ్మెల్యేలతో జిల్లా పార్టీ అధ్యక్షుడు కై లాష్ సంప్రదింపులు జరిపి జాబితా సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్కు అందజేశారు. జంబో కార్యవర్గమేనా.. డీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని వంద మందికి పైగా నాయకులతో నియమించనున్నట్లు తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి 15 మందికి తగ్గకుండా పేర్లను ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల ద్వారా జిల్లా అధ్యక్షుడు సేకరించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం తగ్గకుండా కమిటీలో అవకాశంకల్పించేలా జిల్లా కార్యవర్గాన్ని సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఒక అధికార ప్రతినిధి ఉండేలా జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కమిటీతోపాటు మండల, పట్టణ కమిటీల్లో చోటు కోసం పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పించాలని ఆశావాహులు కోరుతున్నారు. అయితే, అధిష్టానం నుంచి తుది ఆమోదం వచ్చిన వెంటనే జిల్లా పూర్తి స్థాయి కమిటీ ప్రకటించనున్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లా కమిటీ పేర్లు వెలువడే అవకాశం ఉంది. ఫ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో డీసీసీ అధ్యక్షుడి సంప్రదింపులు ఫ అధిష్టానానికి నివేదిక పంపిన జిల్లా అధ్యక్షుడు కై లాష్ ఫ జిల్లా కమిటీలో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపు -
ఫారాల పూర్తిలో పొరపాట్లు రానీయొద్దు
నల్లగొండ: సర్ ప్రక్రియలో భాగంగా సూపర్వైజర్లు, బీఎల్ఓలు తప్పులు లేకుండా ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియ ఇప్పటికే 98 శాతం పూర్తయిందని, మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 86 శాతం పూర్తయిందన్నారు. పనితీరు సరిగా లేని బీఎల్ఓలకు అవగాహన కల్పించి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, హెల్ప్ డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల ఫొటోల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆధునిక పద్ధతులు అవలంబించాలి కట్టంగూర్ : పత్తి రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కపాస్ క్రాంతి పథకం కింద రైతులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పత్తి విత్తనాల ప్యాకెట్లను గురువారం కట్టంగూర్లోని రైతు వేదికలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథకంలో భాగంగా 19 ప్రముఖ కంపెనీలకు చెందిన లక్ష 65వేల పత్తి ప్యాకెట్లు జిల్లాలోని రైతు వేదికల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలతో పాటు సస్యరక్షణ మందులైన వేపనూనె, సూక్ష్మ పోషకాలు, జీవ నియంత్రణ ఎరువులును రైతులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. పత్తి సాగులో లోపాలను సవరిస్తూ ఎకరాకు కనీసం 750 కిలోల దిగుబడి సాధించే విధంగా నాణ్యమైన పత్తి విత్తనాల ప్యాకెట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్నగర్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట నకిరేకల్ ఏడీఏ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్రెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఏఈఓ పరుశురాములు తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
దొడ్డు రకాలకు స్వస్తి!
ఫ సన్నాల సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు ఫ ఇదే అదునుగా విత్తనాల ధరను పెంచిన వ్యాపారులునల్లగొండ అగ్రికల్చర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్న రకాల ధాన్యాన్నే సేకరించడంతోపాటు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, రేషన్ ద్వారా సన్న బియ్యాన్నే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ వానాకాలం నుంచి ఏడు రకాల సన్న ధాన్యం రకాలు అయిన బీపీటీ–5204 ( సాంబ మసూరి), డబ్ల్యూజీఎల్– 44 (సిద్ధి), ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం–1638 ( కూనారం వరి–2), జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం–7715 రకాలకే మద్దతు ధరతో పాటు ప్రత్యేక బోనస్ ప్రకటించడంతో రైతులు దొడ్డు రకాలను వదిలి వీటి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వానాకాలం యాసంగి సీజన్లకు అనువైన తెలంగాణ సోనా, కూనారం వరి 2 రకాలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సోనా 125 రోజులు, కూనారం వరి –2 120 నుంచి 125 రోజులు పంట కాలం కావడం, దిగుబడి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల చొప్పున రావడంతో వీటిపై మొగ్గు చూపుతున్నారు. ఇక.. జైశ్రీరాం, కేఎన్ఎం 7715, హెచ్ఎంటీ సోనా రకాలకు 135 రోజులు పంట కాలం ఉంటుంది. దిగుబడి కూడా 25 నుంచి 28 క్వింటాళ్లు ఎకరానికి వచ్చే అవకాశం ఉన్నందున రెండో ప్రాధాన్యత ఉన్న వీటిని సాగు చేసే ఆలోచనలో రైతులు ఉన్నారు. మిగతా రకాలు కూడా వానాకాలం సాగుకు అనుకూలమైనా సాంబమసూరి 145 నుంచి 150 రోజులు,హెచ్ఎంటీ సోనా 135 రోజులు, డబ్ల్యూజీఎల్ –44 వరి 140 నుంచి 150 రోజులు పంట కాలం కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని ప్రచారం జరుగుతుండటంతో ఇంకా రైతులు నార్లు కూడా పోయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 40 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉండడంతో వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఎక్కువ ధరకు విక్రయం రైతుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విత్తన వ్యాపారులు ఆయా రకాల సన్న విత్తనాల ధరను ఏకంగా పెంచారు. ఎంఆర్పీ ధర కంటే అదనంగా రూ. 300 వరకు అధికంగా అమ్ముతున్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ అధికారులు విత్తన వ్యాపారుల దోపిడి అరికట్టకపోగా వారికే వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
పశుసంపదకు రక్ష.. ‘లంపీస్కిన్’ టీకా
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో వ్యాపించే లంపీస్కిన్ డిసీజ్ (ముద్ధ చర్మ వ్యాధి) నివారణకు చేపట్టిన టీకాల కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గత నెల 24న ప్రారంభమైన టీకాల కార్యక్రమం ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 1.40లక్షల పశువులు ఉండగా ఇప్పటి వరకు 45 వేల పశువులకు టీకాలు వేశారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమించింది. లంపీస్కిన్ డిసీజ్ వ్యాప్తి ఇలా.. లంపీస్కిన్ డిసీజ్ పశువుల్లో వచ్చే వైరస్ వ్యాధి. ఇది కాప్రిపాక్స్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేలు వంటి రక్తం పీల్చే కీటకాల ద్వారా బాధిత పశువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కలు షితమైన సూదులు, పరికరాల ద్వారా సోకుతుంది. వ్యాధి లక్షణాలు : పశువులలో ఎక్కువ జ్వరం, శరీరంపై గట్టిగా ఉండే గడ్డలు, మెడ, భుజం, కాళ్ల వద్ద లింప్ గ్రంధుల వాపు, కళ్లనుంచి, ముక్కు నుంచి స్రావం, కాళ్లవాపు, కుంటుతూ నడవడం, పాల ఉత్పత్తి తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ ఇలా : ఏటా టీకాలు వేయించాలి. బాధిత పశువులను వేరుగా ఉంచాలి. దోమలు, ఈగలను నియంత్రించాలి. పశువుల కొట్టాలు, షెడ్లను శుభ్రంగా ఉంచి క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం ద్వారా పశువుల్లో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఫ గతనెల 24 నుంచి ముద్ధ చర్మ వ్యాధి నివారణ టీకాలు ఫ ఇప్పటి వరకు 45వేల పశువులకు అందజేత ఫ 8వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం పశువుల యజమానులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలలి. ప్రభుత్వం ఉచితంగా వేస్తున్న టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం లంపీస్కిన్ నివారణ టీకా వేయిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. – డాక్టర్ జీవీ.రమేష్, జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ అధికారి -
‘వీబీజీ రామ్జీ’ని రద్దుచేయాలి
నల్లగొండ టౌన్: గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుమార్చి అమల్లోకి తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లగొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ మాట్లాడుతూ పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ.. పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో చినపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, ఊట్కూరి నారాయణరెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఎన్యూమరేషన్’ 98శాతం పూర్తి
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) జిల్లాలో వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 15,16,253 మంది ఓటర్లలో 98 శాతం మందికి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బుధవారం వరకు 14,85,928 మంది ఓటర్లకు ఫారాలు అందగా, 30,325 మందికి అందాల్సి ఉంది. జూలై 30లోగా ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తికానంది. జూలై 31న ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబర్ 28లోపు పరిష్కరించనున్నారు. తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల కానుందని అధికారులు తెలిపారు. నల్లగొండ పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లురామగిరి(నల్లగొండ) : నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. పాలిసెట్–2026లో అర్హత సాధించిన వారితో పాటు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా ఈ నెల 3వరకు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ 26, సివిల్ ఇంజనీరింగ్ 17, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ 11, కంప్యూటర్ ఇంజనీరింగ్ 2తో కలిపి మొత్తం 56 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 4న జరిగే కౌన్సిలింగ్కు పాలిసెట్–2026 ర్యాంక్ కార్డు, పదో తరగతి మెమో, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని తెలిపారు. ప్రవేశం పొందేవారికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. -
మహిళా శక్తి పెట్రోల్ బంకును సిద్ధంచేయాలి
నల్లగొండ : నల్లగొండలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద నిర్మిస్తున్న ఇందిర మహిళా శక్తి పెట్రోల్ బంకు పనులను వారం రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పెట్రోల్ బంకులో పనిచేసే మహిళా సిబ్బందికి ఇప్పటినుంచే ఐఓసీఎల్ ద్వారా శిక్షణ ఇప్పించాలని డీఆర్డీఓ అదనపు పీడీకి సూచించారు. పెట్రోల్ బంకు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించనున్న సూపర్ మార్కెట్, రెస్టారెంట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక్కడ ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న విద్యుత్ లైన్లన్నింటినీ మార్చాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉత్తమ పెట్రోల్ పంపుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ఆధారం లేని, ఒంటరి మహిళలకు ఈ బంకులో ఉపాధి కల్పించాలన్నారు. ఈ తనిఖీలో డీఆర్డీఓ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రవణ్, విద్యుత్ ఏడీఈ. వేణుగోపాల్, డివిజనల్ ఇంజినీర్ ప్రసాదరావు, ఏఈ యాసిన్ అలీ పాల్గొన్నారు. రైతు భరోసా.. రూ.189.26 కోట్లునల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉల్లోజు వినోద్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరం భూమి ఉన్న 1,88,297మంది రైతులకు రూ.65,65,74,154, రెండు ఎకరాలు ఉన్న 1,34,839 రైతులకు రూ.123,60,58,171 జమచేసిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3,23,136 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.189,26,32,325 జమచేసిందని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ప్రేమ్కరణ్రెడ్డినల్లగొండ: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నంద్యాల ప్రేమ్కరణ్ రెడ్డి బుధవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా పనిచేస్తున్న ప్రేమ్కిరణ్ రెడ్డికి అదనంగా బాధ్యతలు అప్పగించారు. నేడు ఫుట్బాల్ జట్ల ఎంపికనల్లగొండ టూటౌన్ : నల్లగొండ సమీపంలోని చర్లపల్లి విపస్య స్కూల్లో ఈ నెల 2న ఉద యం 9 గంటలకు ఫుట్బాల్ సబ్ జూనియర్ బాలికల జట్ల సెలక్షన్స్ జరుగుతాయని ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, సెక్రటరీ గిరిబాబు సంయుక్త ప్రకటనలో తెలిపారు. 2013, 2014, 2015 సంవత్సరాల్లో జన్మించిన ఆసక్తిగాల బాలికలు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, నాలుగు పాస్ ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను త్వరలో నిజామాబాద్లో జరిగే స్టేట్ మీట్లో పాల్గొనే అర్హత పొందుతారని తెలిపారు. -
వాన ఎక్కువే కురిసింది!
నల్లగొండ అగ్రికల్చర్ : జూన్ మాసంలో జిల్లాలో కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం కురిసినట్లు చీఫ్ ప్లానింగ్ కార్యాలయం వెల్లడించింది. ప్రతిరోజూ మండలాల వారీగా ఎంత వర్షం కురిసిందనే నివేదికను జిల్లా ప్రణాళిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. జిల్లాలో జూన్ చివరి నాటికి సాధారణ వర్షం 86.8 మిలీమీటర్లకు 126.5 కురిసి 45.8 మిల్లీమీటర్ల అధికంగా నమోదైనట్లు తన నివేదికలో చీఫ్ ప్లానింగ్ కార్యాలయం వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా 33 మండలాలకు గాను కట్టంగూర్, నకిరేకల్, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, తిరుమలగిరి సాగర్, నేరడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, చండూరు, గట్టుప్పల్తో కలిపి 13 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసిందని పేర్కొంది. అదేవిధంగా చిట్యాల, నార్కట్పల్లి, శాలిగౌరారం, కనగల్, త్రిపురారం, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్దవూర, చింతపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, గుడిపల్లి, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసినట్లు నివేదించింది. కేవలం కేతేపల్లి, పీఏపల్లి మండలాల్లో మాత్రమే దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తన నివేదికలో తెలియజేసింది. ఈ సీజన్లో పంటల సాగు తక్కువే.. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు పత్తి విత్తనాలు పెట్టుకోవడంతో పాటు వరినారు పోసుకునే వారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2 లక్షల 10,350 ఎకరా ల్లో పత్తి గింజలు పెట్టుకున్నప్పటికీ అవి ఇప్పటికీ మొ లకెత్తని పరిస్థితి నెలకొంది. జొన్న 124, కంది 406 ఎకరాల్లో సాగు చేసుకోగా వరి 124 ఎకరాల్లో మా త్రమే నాట్లు వేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఎలాంటి వర్షపాతం నమోదైందో స్పష్టమవుతోంది. నిడమనూరు మండలం వేంపాడు ప్రాథమిక పాఠశాల భవనం అసంపూర్తిగా నిలిచిపోయింది. గతంలో రూ.5 లక్షలతో ఒక తరగతి గది, వరండా నిర్మాణం చేపట్టగా, నిర్మాణ వ్యయం పెరిగిందని నిర్మాణ పనులు నిలిపివేశారు. మరోవైపు వంట గది నిర్మాణ పనులు కూడా నిలిపివేశారు. అసంపూర్తి భవనంలోనే బోధనను కొనసాగిస్తున్నామని, సొంత డబ్బులతో ఫ్లోర్ పనులు చేయిస్తున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత విద్యార్థులను ఇబ్బందుల పాలు చేస్తోంది. తరగతి గదుల్లేక చెట్ల కింద చదువులు, ఒకే తరగతి గదిలో రెండు మూడు తరగతులకు బోధన చేస్తుండడంతో విద్యార్థులకు పాఠాలు అర్థం కావడం లేదని వాపోతున్నారు. టాయిలెట్లు లేక మూత్రం వస్తే ఉగ్గపట్టుకోవాల్సి పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆట స్థలాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతుండగా స్కూళ్లకు ప్రహరీలు లేక ఎప్పుడు ఏ విషపురుగులు తరగతి గదుల్లోకి వస్తాయోనన్న ఆందోళనలో చదువుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3,731 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిల్లో 3,89,592 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో ఒక్కో స్కూళ్లో ఒక్కో సమస్యతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 156 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇక్కడ బాలుర కోసం టాయిలెట్లు లేకపోవడంతో ఆరుబయటకే వెళ్లాల్సి వస్తుంది. విద్యార్ధులకు ఆడుకునేందుకు ఆటస్థలం కూడా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. ● డోర్లు లేక ఇబ్బందులు మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంపు బకల్వాడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇక్కడ సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేరు. ఉన్న వాటికి డోర్లు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పాఠశాలలో ఆట స్థలం ఉన్నప్పటికీ వర్షాల కారణంగా నీళ్లు నిలుస్తుండడంతో విద్యార్ధులు ఇబ్బందులు తప్పడం లేదు. ● ఒకటే మరుగుదొడ్డి మిర్యాలగూడ పట్టణంలోని గాంధీపార్క్ యూిపీఎస్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 336 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉంది. దానిని ప్రాథమిక తరగతులకు ఒక మరుగుదొడ్డి మాత్రమే ఉంది. అది బాలికలకు వినియోగిస్తున్నారు. బాలురకు టాయిలెట్ లేకపోవడంతో వారంతా ఆరు బయటకే వెళ్లాల్సి వస్తోంది. మండలాల వారీగా జూన్లో వర్షపాతం (మిల్లీమీటర్లలో..) పాఠశాలల్లో కనీస వసతులు కరువు ఫ తరగతి గదులు సరిపోక చెట్ల కిందే చదువులు ఫ ఒకే గదిలో రెండు మూడు తరగతులకు బోధన ఫ పిల్లలు ఎక్కువ మూత్రశాలలు, మరుగుదొడ్లు తక్కువ ఫ ఇబ్బందుల్లో విద్యార్థులు ఫ 13 మండలాల్లో సాధారణ వర్షపాతం ఫ 18 మండలాల్లో భారీ వర్షాలు ఫ కేతేపల్లి, పీఏపల్లిలోనే దుర్భిక్షం ఫ జూన్లో కురవాల్సింది 86.8..కురిసింది 126.5 మి.మీ. ఫ చీఫ్ ప్లానింగ్ కార్యాలయ నివేదికలో వెల్లడి వర్షపాతం నమోదుకు మండల స్థాయిలో మండల రెవెన్యూ కార్యాలయంలో గేజ్ను ఏర్పాటు చేస్తారు. అక్కడ కురిసిన వర్షాన్ని బట్టి గేజ్లో నమోదైన వర్షాన్ని బట్టి మండలమంతా అదే స్థాయిలో వర్షం కురిసిందని మండల స్థాయి అధికారులు సీపీఓకు నివేదిస్తారు. ప్రస్తుతం జిల్లాలో మండలంలో ఒక గ్రామంలో వర్షం కురిస్తే పక్క గ్రామంలో కూడా వర్షం కురవని పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్నివో ప్రభావంతో రుతుపవనాలు సరైన దిశలో పయనించక వర్షాలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి. గ్రామ స్థాయిలోనే వర్షపాతం నమోదుకు పరికరాలను ఏర్పాటు చేసి నమోదు చేస్తేనే వర్షపాతం లెక్కలు పక్కాగా తేలనున్నట్టు నిపుణులు అంటున్నారు. స్కూళ్లో టాయిలెట్ ఒకటే ఉండటంతో బాలికలు మినహా బాలురంతా ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల చుట్టూ ఇండ్లు ఉండటంతో కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ఆట స్థలం కూడా లేకపోవడంతో క్రీడలకు దూరం అవుతున్నాం. – పరమేష్, 10వ తరగతి, బంగారుగడ్డ -
శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు
మిర్యాలగూడ అర్బన్ : శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు నాకాబందీ (కార్డన్ సెర్చ్) నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 150 వాహనాలపై, అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడిన 40మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్ధరాత్రి వరకు అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం, బైక్ రేసింగ్, గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. గంజాయి, గుట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలు, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దన్నారు. ఇకపై కార్డన్ సెర్చ్లు నిరంతరం కొనసాగిస్తామన్నారు. పట్టణంలోని దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్లు, టీ స్టాళ్లు తదితర వ్యాపార సంస్థల నిర్వాహకులు నిర్దేశిత సమయానికే మూసి వేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐ ఉ నాగభూషణరావు, సోమనర్సయ్య, పీఎన్డీ.ప్రసాద్, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫ మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ ఫ సరైన పత్రాలు లేని 150 వాహనాలపై కేసులు ఫ డ్రంక్ అండ్డ్రైవ్లో 40మంది పట్టివేత -
కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్
ఫ మండలాలకు కూడా అధ్యక్షుల నియామకం నల్లగొండ : కాంగ్రెస్పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీని వాస్యాదవ్ నియమితులయ్యారు. నల్లగొండ రూరల్ మండల అధ్యక్షుడిగా గంగుల సైదులు, తిప్పర్తి మండల అధ్యక్షుడిగా పడూరి శ్రీనివాస్రెడ్డి, కనగల్ అధ్యక్షుడిగా గడ్డం అనూప్రెడ్డి, మాడుగులపల్లి మండల అధ్యక్షుడిగా గడ్డం వేణుగోపాల్రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.శ్రీనివాస్యాదవ్ (నల్లగొండ పట్టణం)సైదులు (నల్లగొండ రూరల్ మండలం)శ్రీనివాస్రెడ్డి (తిప్పర్తి) -
11 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకవర్గం
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట దేవస్థానం(వైటీడీ) బోర్డును ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. ఒక చైర్మన్తో పాటు పది మంది సభ్యులు, మరో ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే, పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి.అస్తవ్యస్తంగా పాలన..దేవస్థానానికి పాలకవర్గం లేకపోవడంతో దేవస్థానంలో అధికారుల హవా కొనసాగింది. దీంతో పలు ఆరోపణలు వచ్చాయి. దేవస్థానం అధికారి ఏసీబీకి పట్టుబడడం, డాలర్లు మాయం కావడం. దేవస్థానం గోదాం నుంచి సరుకులు దొంగిలించుకుపోతుండగా పోలీసులు పట్టుకోవడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం, దేవస్థానంలో దుకాణాల కేటాయింపులో అక్రమాలు వంటి పలు అంశాలు రచ్చ కెక్కాయి. అలాగే భక్తుల సౌకర్యాల కంటే దేవస్థానంలో వీఐపీలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు దేవాలయం ఉద్ఘాటన తర్వాత ఒక్క రోజు లక్ష మంది భక్తులు రావడంతో సౌకర్యాల కొరత కనిపించింది.బోర్డు ఏర్పాటుపై రెండేళ్ల క్రితం సీఎం ప్రకటనసీఎం రేవంత్రెడ్డి రెండవసారి 2024 నవంబర్ 8న యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు దేవస్థానం పాలకవర్గం నియామకంపై ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుట్టలో ప్రకటించిన విధంగానే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు బిల్లును 2025 మార్చి18న అసెంబ్లీలో ఆమోదించారు. నూతన చట్టం ప్రకారం 11 మంది సభ్యులు, ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటైంది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరితోపాటు వంశపారంపర్య ధర్మకర్త కూడా సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ(ఎండోమెంట్) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, దేవస్థానం ఈవో, వై టీడీఏ వైస్ చైర్మన్, సీనియర్ ప్రధానార్చకుడు ఉంటారు. బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది.చైర్మన్గా సత్యనారాయణరెడ్డియాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.సభ్యులు వీరే..వినోద్ వెంకటస్వామి : మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి కుమారుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేకొణిదెల సురేఖ : ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీమణిసి.విజయారాజం : ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్ రాజం సతీమణితూళ్ల విజయేందర్ : మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్గౌడ్ కుమారుడుస్వాతి కంఠమని : నాట్కో ఫార్మా యాజమాన్యానికి చెందిన వారుగుండు మల్లయ్య : హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్కు చెందిన ఆధ్యాత్మికవేత్తఎం.రాఘవేందర్రావు : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.రఘునందన్రావు తండ్రి ఎం,రాఘవేందర్రావుడాక్టర్ లక్ష్మీనారాయణనాయక్ : వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ధన్వంతి భర్త, జనగామ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యుడుపోచబోయిన ఈశ్వరమ్మయాదవ్ : హైదరాబాద్లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్బి.నర్సింహ మూర్తి : యాదరిగుట్ట ఆలయ వంశపారంపర్య ధర్మకర్తఉమ్మడి నల్లగొండ జిల్లా వారికి దక్కని చోటు!ప్రభుత్వం నియమించిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అవకాశం దక్కలేదు. ఉమ్మడినల్లగొండకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంతో కాలంగా దేవస్థానం పాలక మండలి పదవులను ఆశించారు. కానీ, ఎవరికీ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చాలి
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలుగా మార్చి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంటిగ్రేటెడ్ పాఠశాలగా మార్చడం ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. వంట చేసే సిబ్బందికి సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు జరగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను నియోజకవర్గానికి ఒక్కటే కాకుండా ప్రతి మండలానికి మూడు పాఠశాలలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, పాండు, రామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
డిగ్రీ కళాశాలల పని వేళలు మార్చాలి
తుంగతుర్తి: మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల పని వేళలను మార్చాలని గురుకుల డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తన్నీరు గిరిప్రసాద్ కోరారు. మంగళవారం బీసీ గురుకులాల డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో కలిసి హైదరాబాద్లో ఎమ్మెల్సీ కోదండరాంకు ఈ మేరకు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కళాశాలలు కొనసాగుతున్నాయని, ఎస్సీ గురుకులాల పని వేళలకు అనుగుణంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించేలా మార్పు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజ్యశ్రీ, డాక్టర్ కిషోర్, అధ్యాపకులు డాక్టర్ దీప్తి, సుమాంజలి, శిరీష, వినీత పాల్గొన్నారు. -
ఏడాదిలోగా ప్రాజెక్టులు పూర్తిచేయాలి
నల్లగొండ: జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఏడాదిలోపు పూర్తిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్అండ్ఆర్) పనుల్లో జాప్యం చేయొద్దన్నారు. ప్రాజెక్టుల పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్రెడ్డి, స్పెషల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు, ల్యాండ్ అక్విజిషన్ అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
హాలియా : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అనుముల (హాలియా) మండలంలోని జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మధారిగూడెం, హాలియా మున్సిపాలిటీలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్ఓల పనితీరును పరిశీలించి మాట్లాడారు. ఓ ఇంటి యజమానితో మాట్లాడుతూ ఇంట్లో ఎంత మంది ఉంటారు, ఓటర్లు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వచ్చే బీఎల్ఓ, సూపర్వైజర్లకు ప్రజలు సహకరించాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ చందర్రావు తదితరులు ఉన్నారు. అందుబాటులో యూరియామిర్యాలగూడ : రైతులకు అవసరమైన సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ వల్లోజు వినోద్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మిర్యాలగూడలోని యూరి యా రేక్ పాయింట్, మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ను సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించి మాట్లాడారు. మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ గోదాములో సుమారు 20 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఏడీఏ జగదీశ్వర్రెడ్డి, ఏఓ రుషేంద్రమణి తదితరులు ఉన్నారు. నీలగిరి ఇన్చార్జి కమిషనర్గా అశోక్ కుమార్ నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో మున్సిపల్ డీఈ అశోక్ కుమార్కు మంగళవారం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) ఇంకా ఎవరికి అప్పగించలేదు. త్వరలో పూర్తిస్థాయి కమిషనర్ను నియమించే అవకాశం ఉంది. ఇన్చార్జి ఎస్ఈగా శ్రీనివాసులునల్లగొండ : తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) నల్లగొండ ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) ఇన్చార్జిగా సూర్యాపేట డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్) ఎ.శ్రీనివాసులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నల్లగొండ సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎ.వెంకటేశ్వర్లు జూన్ 30న పదవీ విరమణ చేశారు. దీంతో పాలనా అవసరాల దృష్ట్యా ఎ.శ్రీనివాసులును అడ్హాక్ ప్రాతిపదికన ఇన్చార్జ్ ఎస్ఈగా నియమించారు. 2న సీనియర్ బాలుర క్రికెట్ జట్టు ఎంపికనల్లగొండ టూటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా సీనియర్ బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్టు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు ెహెచ్సీఏ ఆధ్వర్యంలో జరిగే సీ–డివిజన్ లీగ్ పోటీలో ఆడనుందని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ధ్రువపత్రాలతో పాటు సొంత క్రికెట్ కిట్టుతో సకాలంలో హాజరుకావాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సత్తయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థుల ఈ నెల ఒకటి నుంచి మూడో తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 4న ఒరిజినల్ సర్టిఫికెట్తో హాజరుకావాలని కోరారు. -
రిజిరసే్టషన్లకు బ్రేక్!
నల్లగొండ : రిజిస్ట్రేషన్ శాఖలో తలెత్తిన సర్వర్ సమస్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ మెయింటెనెన్స్ పనులు చేపట్టడంతో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. అనంతరం మంగళవారం నుంచి సేవలు పునరుద్ధరించినప్పటికీ సర్వర్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఆస్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, ప్రతిరోజూ సగటున 350 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. పెద్ద కార్యాలయాల్లో రోజుకు 50 నుంచి 60 వరకు, చిన్న వాటిల్లో ఐదు నుంచి పది వరకు డాక్యుమెంట్లు నమోదవుతుంటాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రోజుకు 50 నుంచి 70 వరకు స్లాట్ బుకింగ్లు జరుగుతాయి. అయితే మంగళవారం సర్వర్ సమస్యల కారణంగా కేవలం 16 స్లాట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది సర్వర్ సమస్య తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. రెండు రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా స్లాట్లు బుక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు స్థంభించింది. స్లాట్ బుకింగ్కు అవస్థలు స్లాట్ బుక్ చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడంతో బ్యాంకు రుణాలు, మార్టిగేజ్ నమోదు, ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా నిలిచిపోయాయి. దీంతో కొందరు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నారు. సాధారణంగా కొనుగోలుదారులు, విక్రేతలు, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ విక్రేతలు, న్యాయవాదులతో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. స్లాట్ బుకింగ్లు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యతో స్లాట్ బుకింగ్కు ఆటంకం ఫ మూడు రోజులుగా నిలిచిన సేవలు ఫ మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు ఫ సేవలు పునరుద్ధరించినా మొరాయించిన సర్వర్ ఫ ఇబ్బందుల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు -
నేటి నుంచి ‘ఆపరేషన్ ముస్కాన్’
నల్లగొండ : జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు బుధవారం నుంచి ఈనెల 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం నల్లగొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలలను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. తనిఖీల్లో గుర్తించిన బాల కార్మికులను వెంటనే విముక్తి చేసి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో పోలీసు శాఖతో పాటు మహిళా, శిశు సంక్షేమ, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ రవికుమార్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజలి, ఆపరేషన్ ముస్కాన్ బృందం సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యూరియా బుకింగ్ యాప్ అప్డేట్ చేసుకోండి
భువనగిరిటౌన్ : రైతులు యూరియా బుకింగ్ యాప్ను(ఫర్టిలైజర్) వెంటనే అప్డేట్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ యాప్ అప్డేట్ కాకపోతే పాత యాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ గూగుల్ ప్లేస్టోర్ నుంచి కొత్త వెర్షన్న్ డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు. నూతన యాప్ 1.0.12 అని చూపిస్తుందో లేదో సరిచూసుకోవాలన్నారు. ఈ యాప్కు సంబంధించి ఏమైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు టోల్ఫ్రీ నంబర్ 18001237157 ద్వారా వినియోగదారుల సేవా కేంద్రాన్ని(కస్టమర్ కేర్) సంప్రదించవచ్చని, మొబైల్ యాప్ సేవలు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక మిర్యాలగూడ : రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించిన నల్లగొండ జిల్లాకు చెందిన వనమాల శశాంక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన 12వ యూనిక్స్ సన్రైస్ అండర్–19 స్టేట్ ఛాంపియన్షిప్లో శశాంక్ ఈ ఘనత సాధించాడు. శశాంక్ ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై నల్లగొండ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అంజయ్య, అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ప్రశాంత్, పి. నవీన్కుమార్, జిల్లా కోచ్ రామకృష్ణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించేలా విద్యార్థులను ప్రోత్సహించాలి
భూదాన్పోచంపల్లి : సమస్యల పరిష్కారం వైపు విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ రవి పూవయ్య అన్నారు. సోమవారం భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శ్రీడిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్శ్రీ మూడు రోజుల ఫ్యాకల్టీ వర్క్షాప్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి, నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి, యూనివర్సిటీ అడ్వైజర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. ప్రజల నిజమైన అవసరాలను గుర్తించడమే డిజైన్ థింకింగ్ ఇన్నోవేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సాంకేతిక ప్రపంచంలో మానవీయ విలువలు తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి వర్క్షాపులు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అనంతరం ముంబై జెల్లో ల్యాబ్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ అజంతా సేన్ మాట్లాడుతూ.. విపత్తుల, రిస్క్ను తగ్గిస్తూ మనిషి మనుగడ సాగించేలా సరికొత్త విద్యావిధానం వచ్చినపుడే ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు, ఆయా విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు బిడ్డల పొలం బాట’ ప్రారంభం
చిట్యాల (నార్కట్పల్లి): ఏరువాక పౌర్ణమి సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని కొండపాకోనిగూడెం గ్రామంలో రైతు బిడ్డల పొలం బాట కార్యక్రమాన్ని సోమవారం ‘భూమి’ సునీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. సాగు పనులు మొదలుపెడుతున్న తరుణంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమకు ఉన్న ఇబ్బందులను వివరించగా వారి సందేహాలు ఆయన నివృత్తి చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేలా అవసరమైన సాయం అందేలా సంబంధిత ప్రభుత్వ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యతతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కేతేపల్లి : రైతాంగ అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సోమవారం మూసీ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వలకు ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించి తెలంగాణను సస్యశామలం చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. మూసీ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉండటంతో రైతులు నాట్లు వేసుకునేందుకు వీలుగా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. నీరు చివరి భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మూసీ ప్రాజెక్టు డీఈ రమేష్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, ఎన్డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, సర్పంచ్లు బొజ్జ సుందర్, బీరం జాన్రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్, మందడి వెంకట్రామ్రెడ్డి, బడుగుల నరేందర్, కత్తుల వీరయ్య, అల్లి అంజన్యాదవ్ పాల్గొన్నారు.ఫ మూసీ కాల్వలకు నీటి విడుదల -
కోతులు బెదిరె.. అడవి పందులు అదిరె..
తుర్కపల్లి : అడవి జంతువుల బెడదతో వ్యవసాయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సౌర కంచెలు వరంగా మారాయి. వర్షాధార పంటలను వదిలి, కేవలం వరి సాగుకే పరిమితమవుతున్న పరిస్థితుల్లో.. ‘పిలుపు’ సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో అమలు చేసిన ‘కై ్లమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్’ ఆశాజనక ఫలితాలిస్తోంది. తుర్కపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సౌర కంచెలతో రైతులు ఇప్పుడు ధీమాగా కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ● కూరగాయల సాగుపై మళ్లీ ఆసక్తి..తుర్కపల్లి మండలంలో గతంలో రైతులు వర్షాధార పంటలతో పాటు కూరగాయలు పండించేవారు. అయితే అడవి పందులు, కోతుల బెడద తీవ్రం కావడంతో.. చేతికొచ్చే దశలో పంటలు నాశనమై తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూశారు. ముఖ్యంగా టమాట, మిర్చి, బెండ, వంకాయ, దోసకాయ వంటి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుండటంతో రైతులు పూర్తిగా వరి సాగుకు పరిమితమయ్యారు. దీంతో పంటల వైవిధ్యంతో పాటు ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి ‘పిలుపు’ సంస్థ, నాబార్డు సహకారంతో కై ్లమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్రయోగాత్మకంగా నలుగురు రైతులకు సౌర కంచెలు ఏర్పాటు చేసి కూరగాయల సాగును ప్రోత్సహించింది. ఒక్కో కంచె ఏర్పాటుకు సుమారు రూ.30వేలు ఖర్చు కాగా.. అందులో రూ.19 వేల వరకు నాబార్డు ఆర్థిక సాయం అందించింది. మిగతా రూ.11వేలు రైతు భరించాల్సి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఈ కంచెలు అడవి జంతువులను సమర్థంగా అడ్డుకుంటున్నాయి. దీంతో రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా కాయాల్సిన అవసరం తప్పింది. పంట నష్టం గణనీయంగా తగ్గడంతో.. రైతులు మళ్లీ కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ● మరో 26 మందికి..ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సౌర కంచెలు సత్ఫలితాలు ఇవ్వడంతో మరికొందరు రైతులు సైతం వీటి ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్డీఎస్ఎస్’ సంస్థ సహకారంతో మరో 26మంది రైతులకు సౌర కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో అడవి జంతువుల బెడదను నివారించడమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని రైతుల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద, ఆర్థిక సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తే రైతులకు భరోసా లభిస్తుందని వ్యవసాయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జంతువులకు ఎలాంటి హాని ఉండదు.. కోతులు, అడవి పందులు సౌర కంచెకు తాకగానే అలారం మోగుతుంది. చిన్నపాటి షాక్ తగిలి అవి పంటకు దూరంగా వెళ్తాయి. సౌర కంచెల ద్వారా జంతువులకు ఎలాంటి హాని ఉండదు.ఒకప్పుడు వ్యవసాయం అంటే నష్టాలే గుర్తొచ్చేవి. ఇప్పుడు సౌర కంచె వల్ల ధైర్యంగా పంటలు సాగుచేస్తున్నాం. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. జంతువుల బెడదను వంద శాతం నియంత్రించడం సాధ్యం కాకపోయినా.. సౌర కంచెలు సమర్థవంతమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు వ్యవసాయాన్ని స్థిరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. – కొడారి కిష్టయ్య, రైతు, మల్కాపురం పంటలను కాపాడుతున్న సౌర కంచె మళ్లీ కూరగాయల సాగుబాటలో తుర్కపల్లి రైతులు నాబార్డు కై ్లమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ సక్సెస్గతంలో అడవి పందులు, కోతుల భయంతో కూరగాయల సాగు చేయలేకపోయేవాళ్లం. పంట చేతికొచ్చే సమయంలో నాశనం చేసేవి. రాత్రంతా పొలాల వద్దే కాపలా కాయాల్సి వచ్చేది. సౌర కంచె ఏర్పాటు చేశాక పరిస్థితి పూర్తిగా మారింది. పంట నష్టం తగ్గింది. ఇప్పుడు టమాట, మిర్చి, బెండ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రభుత్వం మరింత సబ్సిడీ ఇస్తే ఎక్కువ మంది రైతులు ముందుకొస్తారు. – మోహన్, రైతు, ధర్మారం -
ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లను సోమవారం నల్ల గొండ జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్ఓ) కె.రాహుల్ తనిఖీ నిర్వహించారు. ఆయా ఆస్పత్రులకు సంబంధించిన అనుమతి పత్రాలతో పాటు వైద్యుల విద్యార్హతల రికార్డులను పరిశీలించారు. వైద్యశాఖ నుంచి అనుమతి పొందిన గడువు ముగిసినప్పటికీ రెన్యువల్ చేయించుకోని 30 ఆస్పత్రులను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా బహుళ అంతస్తుల సెల్లార్లలో నిర్వహిస్తున్న శ్రీసాయి జనరల్ ఆస్పత్రి, రుద్ర డయాగ్నస్టిక్ సెంటర్లను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డాక్టర్స్ కాలనీలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నట్లు గుర్తించామని, సెల్లార్లలో ఆస్పత్రులు, ల్యాబ్లు ఏర్పాటు చేయడం వలన రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. పద్మావతి ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు..ఈ నెల 26న గర్భిణికి అబార్షన్ చేసేందుకు యత్నించిన డాక్టర్స్ కాలనీలోని పద్మావతి హాస్పిటల్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని, షోకాజ్ నోటీసు సైతం ఇచ్చామని డీఎఎంహెచ్ఓ తెలిపారు. సదరు గర్భిణి ఇదే కాలనీలోని మోనికా స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించుకుందని, అక్కడ కూడా వివరాలు సేకరించామని, ఆ స్కానింగ్ సెంటర్లో కొన్ని లోపాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట జిల్లా మలేరియా అధికారి కె. నగేష్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. అంజయ్యగౌడ్, సీసీ రంజిత్కుమార్ పాల్గొన్నారు.ఫ గడువు ముగిసిన, లైసెన్స్ రెన్యువల్ చేసుకోని ఆస్పత్రులకు నోటీసులు ఫ సెల్లార్లో నిర్తహిస్తున్న ఆస్పత్రి, ల్యాబ్ సీజ్ -
కూలిన ఇంటి పైకప్పు రేకులు
కట్టంగూర్ : మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం రాత్రి కురిసింది. దీంతో మండల కేంద్రంలోని పల్లె సత్తయ్యకు చెందిన ఇంటి పైకప్పు సిమెంట్ రేకులు కూలిపోయాయి. మహిళ అదృశ్యంహుజూర్నగర్ (మేళ్లచెరువు) : మండలంలోని కందిబండ గ్రామానికి చెందిన తోడేటి లక్ష్మి ఈ నెల 24న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి స్వతహాగా దైవ భక్తురాలని, కావున దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు భావిస్తున్నామని ఎస్ఐ నవీన్కుమార్ తెలిపారు. లక్ష్మి ఆచూకీ తెలిసిన వారు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. మహాశివుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేసి భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
తరలిపోయిన విద్యాసంస్థలు
నాగార్జునసాగర్, పెద్దవూర : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే కీలకమని అందరూ భావిస్తుంటే.. పెద్దవూర మండల పరిధిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడికి మంజూరైన లేదా ప్రతిపాదించిన పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మండల, గ్రామ స్థాయిల్లో పరిపాలన, విద్యా వ్యవస్థలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యమన్న పెద్దల మాటలు ఇక్కడ కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేజారిన ప్రతిష్టాత్మక సంస్థలు..● గతంలో నాగార్జునసాగర్లో ఏర్పాటుకు సన్నద్ధమైన జవహార్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ), బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలు తదనంతర కాలంలో హైదరాబాద్కు తరలివెళ్లాయి. జేఎన్టీయూ మొదటి బ్యాచ్ విద్యార్థుల సర్టిఫికెట్లపై ఇప్పటికీ ‘జేఎన్టీయూ నాగార్జునసాగర్’ అనే ఉండటం గమనార్హం. ● మహాత్మా గాంధీ వర్సిటీ, బీఈడీ కాలేజ్ ఇక్కడే ఏర్పాటు చేయాలని సర్వేలు జరిగినప్పటికీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం చివరకు నల్లగొండకు తరలిపోయింది. అలాగే సాగర్లో విజయవంతంగా కొనసాగిన ప్రతిష్టాత్మక బీఈడీ కళాశాలను సైతం నల్లగొండకు మార్చారు. ● గతంలో పెద్దవూర మండలానికి మోడల్ స్కూల్ మంజూరైనప్పటికీ, స్థల సమస్యల కారణంగా అది పట్టాలెక్కకుండానే రద్దయింది. ఇటీవల కాలంలోనూ అదే తీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం నాగార్జునసాగర్తో పాటు పెద్దవూర మండలంలోని చలకుర్తి (నవోదయ విద్యాలయం సమీపంలో) ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. కానీ, చివరకు దీన్ని నిడమనూరు మండలం ఊట్కూర్కు తరలించారు. తాజాగా పెద్దవూర మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభదశలోనే హాలియాకు తరలించడం స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల డిగ్రీ కళాశాలకు అవసరమైన ప్రభుత్వ భవనాలు నాగార్జునసాగర్లో సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధికారులు మాత్రం నిడమనూరు మండల కేంద్రం సమీపంలోని ఒక ప్రైవేటు భవనంలోకి మార్చడం విమర్శలకు తావిస్తోంది. పాలనా కార్యాలయాలూ అంతే.. కేవలం విద్యాసంస్థలే కాకుండా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ ప్రాంతం నుండి తరలిపోతున్నాయి. గతంలో పెద్దవూరలోనే సేవలందించిన ఐసీడీఎస్ కార్యాలయాన్ని సైతం హాలియాకు మార్చడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.ఫ గతంలో పెద్దవూర మండలంలో జేఎన్న్టీయూ, ఓపెన్ యూనివర్సిటీ, బీఈడీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నాలు ఫ కొన్ని కారణాల వల్ల జిల్లాలోని ఇతర ప్రాంతాలకు తరలింపు ఫ పాలనా కార్యాలయాలూ మరోచోటుకు..పెద్దవూర, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో సొంత భవనాలు, రవాణా సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ విద్యాసంస్థలు, కార్యాలయాలు వేరే ప్రాంతాలకు తరలిపోవడం వల్ల స్థానిక విద్యార్థులు, నిరుద్యోగ యువత మంచి అవకాశాలను కోల్పోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి.. మండలానికి మంజూరైన సంస్థలను స్థానికంగానే ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యాభివృద్ధికి తోడ్పడాలని పెద్దవూర, నాగార్జునసాగర్ వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
జూలై ఒకటో తేదీ నుంచి రేషన్..
నల్గొండ జిల్లా, సూర్యాపేట: రేషన్ కార్డు దారులకు జూలై నెల కోటా బియ్యం అందించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటున్నది. ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా బియ్యాన్ని ఏప్రిల్లో ఒకేసారి పంపిణీ చేసిన విషయం విదితమే. తాజాగా జూలై నెలకు సంబంధించిన బియ్యం అందించేందుకు గానూ రేషన్ దుకాణాల డీలర్లకు బియ్యం సరఫరా ప్రక్రియను ప్రారంభించారు. జూలై 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం అందించనున్నారు.గోదాంల నుంచి డీలర్లకు..సూర్యాపేట జిల్లాలో 3.50 లక్షలకు పైగా రేషన్ కార్డులు, 610 రేషన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డు దారులకు అందించేందుకు 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ మేరకు జిల్లాలోని గోదాంల నుంచి రేషన్ దుకాణాలకు సుమారు 2,400 మెట్రిక్ టన్నుల వరకు బియ్యాన్ని ఇప్పటికే సరఫరా చేశారు. సుమారు 40 శాతం వరకు బియ్యాన్ని దుకాణాలకు చేరవేశారు. ఈ నెల 30 నాటికి జూలై కోటాకు సంబంధించిన పూర్తిస్థాయి బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు అన్నారు. -
ఎదురుగా వచ్చిన మృత్యువు
గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. - 8లోధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశంలో ధాన్యం దిగుమతి కొనుగోళ్లలో తెలంగాణ ముందుంటే.. తెలంగాణలో నల్లగొండ జిల్లా ముందుందన్నారు. జిల్లాలో కొత్తగా 75 వేల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఏఎమ్మార్పీ, సాగర్ కాల్వల ఆదునీకరణ పనులు చేపట్టామన్నారు. నా జీవితంలో ఇంత పెద్ద రోడ్ల ప్రాజెక్టు ఎక్కడా ఒకేసారి చేపట్టిన దాఖలాలు లేవన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో హైలెవల్, లోలెవల్ కెనాల్ పూర్తిచేసి లింక్ కలపాలని, డిండి, ఎదుల్ల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. -
ఎస్ఎల్బీసీ, డిండి
ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్రెడ్డివచ్చే ఎన్నికల నాటికి..నల్లగొండ : ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్థిక మంత్రి చూస్తారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కళాశాల బహిరంగ సభ ప్రాంగణం వద్ద రూ.83 కోట్లతో మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఎల్బీసీ పూర్తిచేసి కృష్ణాజలాలను నల్లగొండ గడ్డపై పారిస్తానని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మూసీ కంపు, కాలుష్యం నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు. మూసీ కంపు వల్ల జిల్లాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం ఎందుకు పోవాలి ‘నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు యువకులు నాకు ఇలా చెప్పారు. సూర్యాపేటలో తులసివనంలో గంజాయి మొక్క ఉందన్న. ఆ మూడు జానలాయన కోమటిరెడ్డిని విమర్శిస్తుండు. ఈ సారి ఆ గంజాయి మొక్కను గెలువనివ్వమని నాకు చెప్పారు. నేను కూడా మీకు చెబుతున్నా ఆ ఒక్క మొక్కను కూడా పీకేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన పోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మా ఆడపడుచులంతా.. కళ్ల సంబురంగా నేను పెట్టిన చీరనుకట్టుకుని వచ్చిండ్రు. నేను అడుగుతున్నా.. వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవాల్నా.. గ్యాస్, సన్న బియ్యం, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాల్నా’ అంటూ ముఖ్యమంత్రి వేదిక నుంచి ప్రశ్నించారు. ఫ మూసీ కాలుష్యం నుంచి నల్లగొండకు విముక్తి కల్పిస్తాం ఫ సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం పోవాల్నా ఫ నల్లగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కనగల్ : కనగల్ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ వద్ద సీఎం రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092.37 కిలోమీటర్ల పరిధిలో 441 రహదారులను విస్తరించి, పటిష్టపరచేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుందని సీఎంతో పాటు మంత్రులు వెల్లడించారు. మెరుగైన రహదారుల నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా వాణిజ్య, వ్యవసాయ రంగాల పురోగతికి ఊతమిస్తుందని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. -
పల్స్ పోలియో 94 శాతం
నల్లగొండ టౌన్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 1,54,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో పల్స్ పోలియో 94 శాతం పూర్తయింది. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నారు. నల్లగొండలోని జీజీహెచ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.రాహుల్ ప్రారంభించారు. హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుపర్ణతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నారులకు విధిగా పోలియో చుక్కలను వేయించడం వల్ల వారి జీవితానికి భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మ, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, వైద్యసిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.మూసీ కాలుష్యంతో ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాలను మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ‘కేసీఆర్, కేటీఆర్ మీరు ఒకసారి నకిరేకల్ ప్రాంతంలో రాత్రి నిద్రపోయి చూడండి, ఇక్కడి ప్రజలు దోమలతో, మూసీ కంపుతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుందన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ పూర్తి చేయిస్తానని కేసీఆర్ ఎన్నికల్లో ప్రకటించి ఒక్కసారి కూడా అక్కడికి పోలేదన్నారు. సొరంగం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో నల్లగొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నల్లగొండను కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీకి మరో రూ.400 కోట్లు, షాదీఖానా నిర్మాణానికి, సొరంగ మార్గానికి మరో రూ.500 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. -
శాస్త్ర విజ్ఞానంతో కొందరి చేతుల్లోకే సంపద
● ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నల్లగొండ టౌన్ : శాస్త్ర విజ్ఞానం కొందరికి సంపద సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. జిల్లా ఔషధ అధికారి కాకి పరాబ్కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండలోని మెడికల్ కళాశాల ఎగ్జామినేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ కారణంగా సంపద ఆదానీ, అంబానీ చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమించే వారిని పక్కన పెడతూ ప్రస్తుత పాలకులు సోమరిపోతులను ప్రోత్సహిస్తోందన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం వీపీ డాక్టర్ బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తూనే సమాజంలో మార్పు కోసం తన కుటుంబ వారసత్వాన్ని పరాబ్ కొనసాగించారని తెలిపారు. అనంతరం పరాబ్కు జ్ఞాపికలు, పుస్తకాలు బహూకరించారు. శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్క్రతిక మండలి అధ్యక్షురాలు బండ్రు విమల, అంబటి నాగయ్య, ఎలమంచిలి రవీంద్రనాథ్, సోమ మల్లయ్య, అమృత రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ క్రీడలో రాణించాలితిప్పర్తి : హ్యాండ్ బాల్ క్రీడలో విద్యార్థులు ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ ఎల్వి.రావు అన్నారు. తిప్పర్తిలో ఆదివారం నిర్వహించిన హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన హ్యండ్ బాల్ ఆసొసియేషన్ అధ్యక్షుడిగా నర్సింహారావు, కార్యదర్శిగా ఎండీ.అక్బర్, కోశాధికారిగా ఎండీ.బాబర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ను సందర్శించిన చిన్నారెడ్డినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజావాణి ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాగార్జునకొండ పురావస్తు మ్యూజియం, మహాస్తూపం, సింహాల విహారాలను సందర్శించారు. అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధుడి పాదాలకు వందనం సమర్పించారు. మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఆయనను బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర కండువాలు, బ్రోచర్లతో సత్కరించారు. ఆయనకు టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జునసాగర్ ను సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బుద్ధవనం ఎంతో అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. వారి వెంట ప్రొఫెసర్ జలంధర్రెడ్డి, ప్రొటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆస్పత్రుల నిర్వహణ భారం
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో కనీస వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద ఏటా రూ.వంద కోట్లు విడుదల చేసేది. నాలుగేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. ప్రతి పీహెచ్సీకి ఏటా రూ.1.50 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాల(సబ్సెంటర్ల)కు రూ.10 వేలు విడుదల అయ్యేవి. 2022–23 సంవత్సరంలో చివరిసారిగా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు మొండిచేయి చూపుతోంది. దీంతో జిల్లాలోని 34 పీహెచ్సీలు, 5 అర్బన్హెల్త్ సెంటర్లు, 257 సబ్ సెంటర్లు, 7 బస్తీ దవాఖానాల్లో నిర్వహణ భారంగా మారి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్హెచ్ఎం నిధులతో చేపట్టే కార్యక్రమాలు.. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటక జనిత, అసంక్రమిత, క్షయ, కుష్టు, సార్వత్రిక వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాలుగేళ్లుగా నిధుల్లేక ఆయా కార్యక్రమాలు కుంటుపడిపోయాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం.. గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకోసం ప్రతి ఐదువేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు (సబ్సెంటర్) ఏటా రూ.10వేల చొప్పున ఎన్హెచ్ఎం నిధులను విదుదల చేసేవారు. ఆ నిధులతో సబ్సెంటర్లో పారిశుద్ధ్య మెరుగు, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, అద్దెలు, తాగునీటి సౌకర్యాలకు వినియోగించే వారు. కానీ, నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా తయారైంది. నిలిచిన కుటుంబ నియంత్రణ శిబిరాలు.. కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకుంటే పురుషులకు రూ.1100, సీ్త్రలకు రూ.800 చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ, ఎన్హెచ్ఎం నిధులు విడుదలకాని కారణంగా నాలుగేళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్లో ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల వేలాది రూపాయలను భరించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా నిలిచిన ఎన్హెచ్ఎం నిధులు అభివృద్ధికి దూరంగా పీహెచ్సీలు, సబ్సెంటర్లు కొనసాగని ఆరోగ్య కార్యక్రమాలు ఆస్పత్రుల్లో కుంటుపడిన వైద్యసేవలు -
సీఎం సెక్యూరిటీ, కాంగ్రెస్ నేతల తోపులాట
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ముగిసిన తరువాత మహిళా సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వేదికపైనే సీఎంను సన్మానించారు. ఇదే సమయంలో మాజీ మున్సిపల్ చైర్మన్, మేయర్ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్రెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహనన్రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని సన్మానించేందుకు వెళుతుండగా సీఎం సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పలుమార్లు వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే క్రమంలో నేతలను సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం పర్యటనలో ముఖ్యమైన నాయకులకు ఇలా జరగడం చర్చనీయాంశమైంది. ప్రకటనల్లో ఫొటోలపై నారాజ్.. సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా రోడ్లు భవనాల శాఖ జారీ చేసిన ప్రకటనల్లో ఫొటోలపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రొటోకాల్ ప్రకారం జిల్లాకు చెందిన, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం ఫొటోలను వేయలేదు. దీంతో గుత్తా సుఖేందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంబంధిత అఽధికారులకు అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సీఎం పర్యటనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేతకు ఆహ్వానం అందకపోవడం, మంత్రి అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు, హోర్డింగ్లలోనూ డీసీసీ అధ్యక్షుడి హోదాలో కైలాష్ నేత ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు నివాళి
పీవీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న భూపాల్రెడ్డి, పీవీ నర్సింహారావు అభిమానులునల్లగొండ టౌన్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం నల్లగొండ పట్టణంలో పీవీ అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పీవీ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయ మన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కార్పొరేటర్ రమేష్, ఏవీఎల్ నర్సింహారావు, చకిలం సంధ్యారాణి, చకిలం వేణుగోపాలరావు, కంచనపల్లి రవీందర్రావు, రాజేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
నల్లగొండ : ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట టీఎస్యూటీఎఫ్ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అశాసీ్త్రయమైన ఎన్ఈపీ 2020ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతను ఆపివేయాలని డిమాండ్ చేశారు. అవసరం ఉన్న చోట నూతన పాఠశాలలను తెరవాలని, విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిచాలని, పీఆర్సీకి రిపోర్ట్ తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. అనంతరం డీఆర్ఓ దశరథకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, నల్ల నరసింహ, జి.నాగమణి, నర్రా శేఖర్రెడ్డి, జి.అరుణ, వడ్త్యా రాజు, గేర నరసింహ, శ్రీనివాస్రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, యాదగిరి, చిన వెంకన్న, కొమర్రాజు సైదులు, గంటల వెంకట్, భాను ప్రకాష్, నరసింహమూర్తి, వరలక్ష్మి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘సర్’ బృందాలకు సహకరించాలి
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) భాగంగా ఇంటింటికి వచ్చే బీఎల్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్లకు ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని రహమత్నగర్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యజమానులతో మాట్లాడారు. ఇంటో ఎంతమంది ఉంటారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారని? అడిగి తెలుసుకున్నారు. యాప్ అప్డేట్ చేసుకున్నారా అని బీఎల్ఓను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారని, ఇందులో పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను జతపరచి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, నల్లగొండ తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ అమీనా ఫరీద్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రశాంతంగా మూసీ మత్స్య సంఘం ఎన్నికలు
నకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూసీ మత్స్య సంఘానికి తొమ్మిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు పంచాయతీ పోరును తలంపించాయి. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పెదసంఖ్యలో బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓటర్లను హాల్లోకి అనుమతి ఇచ్చారు. మొత్తం 13 డైరెక్టర్ల పదవులకు గాను 44 మంది పోటీ పడుతున్నారు. ప్రతి ఓటరు 13 మందికి ఓటు వేయాల్సి ఉండడంతో పోలింగ్ ప్రక్రియ గంట అలస్యంగా ముగిసింది. మొత్తం 3,557 మంది ఓటర్లకుగాను, 3,118 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.బరిలో 44 మంది అభ్యర్థులు మూసీ మత్స్య సంఘం ఎన్నికల నిర్వహణతో ఓగోడు గ్రామంలో సందడి నెలకొంది. పోటీలో ఉన్న 44 మంది అభ్యర్థులు తమకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రం ఎదుట ప్రచారం నిర్వహించారు. దీంతో మాధారం – ఓగోడు రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సెంటర్ను డీసీఆర్బీ డీఎస్పీ రవి సందర్శించి పర్యవేక్షించారు. నకిరేకల్, శాలిగౌరారం సీఐలు హరిబాబు, రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 87.65 శాతం పోలింగ్ నమోదు అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ -
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆసక్తి, అర్హత గల ప్రభుత్వ ఉపాధ్యాయులు జూలై 10వ తేదీలోగా nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ సుశీందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీని నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖలో బదిలీలునల్లగొండ : జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీ–ఈఓ)గా పనిచేస్తున్న బి.సంతోష్ను సిద్దిపేట జిల్లా డీపీ–ఈఓగా బదిలీ చేశారు. నల్లగొండలో ఏపీ–ఈఎస్గా విధులు నిర్వహిస్తున్న బి.చాణక్యను మంచిర్యాల జిల్లా డీపీ–ఈఓగా నియమించారు. డీపీ–ఈఓ పోస్టు ఖాళీ కావడంతో, నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్)కు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ప్రస్తుతం నల్లగొండ డీసీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జాయింట్ డైరెక్టర్ (ఈస్ట్)గా పనిచేస్తున్న సివి.శశిధర్రెడ్డిని నల్లగొండ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. సరూర్నగర్ డీపీ–ఈఓగా ఉన్న ఎస్.ఉజ్వలరెడ్డికి నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్)గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన అధికారులు తక్షణమే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది. హెడ్కానిస్టేబుళ్లకు ఎస్పీ అభినందననల్లగొండ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్ పట్టీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరిగినట్లేనని చెప్పారు. కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాంమిర్యాలగూడ అర్బన్ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న సంఘం ఈసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు మాడుగుల శ్రీనివాస్, మర్రి జోజికుమార్, పెరుమళ్ల ధనమ్మ, సావిత్రి, శోభ, కోడిరెక్క ప్రవీణ్, అభినవ్, నాగరాజు, నగేష్, నాగేంద్ర, సుహాసిని పాల్గొన్నారు. -
స్నేహితుడి మరణం.. సమాజ సేవకు ప్రేరణ
సూర్యాపేటటౌన్ : ఎక్కడ జనసందోహం ఉన్నా.. ఎక్కడ పెద్ద జాతరలు, వారసంతలు ఉన్నా నల్లటి దుస్తులు ధరించి మెడలో పుర్రెల దండ వేసుకొని నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ ఫ్లెక్సీని పట్టుకొని అక్కడ కనిపిస్తారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సమాజంలో కనీసం ఒక్కరినో.. ఇద్దరినో మత్తు పదార్థాల బారి నుంచి విముక్తి కల్పించడమే తన కర్తవ్యంగా భావించి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. మూడేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం ప్రభాకర్ను తీవ్రంగా కలిచివేసింది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆయనను ఆలోచింపజేశాయి. సమాజంలో అవగాహన పెంచాలని సంకల్పించిన ఆయన అప్పటి నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభాకర్ ప్రత్యేక వేషధారణను ఎంచుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో పుర్రెల బొమ్మలతో చేసిన దండ వేసుకుని నో డ్రగ్స్..సేవ్ లైఫ్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంప్రదాయ పండగలు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగల సమయంలో ఆయా మతస్తుల వేషధారణతో మత్తు జోలికి వెళ్లొదని వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వేషధారణ చూసిన వారంతా ఆసక్తిగా దగ్గరకు రావడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సెలవు దొరికిన ప్రతిసారి ప్రభాకర్ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలను ఎంచుకుంటారు. వారసంతలు, జాతరలు, సభలు, ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో తన వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. యువతతోపాటు పెద్దలకు కూడా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బైక్ యాత్రతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవకు ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ పుర్రె దండతో మత్తుపై యుద్ధం ఫ నల్లటి దుస్తుల్లో మత్తు వ్యతిరేక సందేశం ఫ ‘నో డ్రగ్స్.. సేవ్ లైఫ్’ అంటూ చైతన్య యాత్ర ఫ మత్తు రహిత సమాజానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కృషినేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభాకర్ చేస్తున్న సేవ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే తన లక్ష్యమని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. -
నీలగిరిలో సిటీ బస్సులు
ఫ దర్వేశిపురం – అనిశెట్టి దుప్పలపల్లి రూట్లో నడిచే బస్సు దర్వేశిపురం, జి.చెన్నారం, జి.చెన్నారం ఎక్స్ రోడ్డు, కొత్తపల్లి, కతాల్గూడెం, హౌజింగ్ బోర్డు కాలనీ, సాగర్ ఎక్స్ రోడ్డు, మునుగోడు ఎక్స్ రోడ్డు, నేషనల్ ఫంక్షన్హాల్, డీవీకే రోడ్డు బస్టాప్, భాస్కర్ థియేటర్, క్లాక్టవర్, నల్లగొండ బస్టాండ్, రహమత్నగర్, బీటీఎస్, కలెక్టరేట్, అలకాపురి కాలనీ, రాంనగర్ పార్కు, కేంద్రియ విద్యాలయం, కేశరాజుపల్లి, హ్యాపీహోమ్స్, అనిశెట్టి దుప్పలపల్లి. ఫ చెర్వుగట్టు నుంచి ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజీ మధ్య నడిచే బస్సు ఎల్లారెడ్డిగూడెం, రాంనగర్కాలనీ, ఎంజీ యూనివర్సిటీ, 12వ బెటాలియన్, సీతారాంపురం, జీ స్కూల్, టీజీఎస్డబ్ల్యూర్ కాలేజీ, నలంద కాలేజీ, చర్లపల్లి, సాయి సదన్ హోమ్స్, మర్రిగూడ బైపాస్, మర్రిగూడ, ఐటీ హబ్, ఎస్బీఐ బ్యాంకు, వీటీ కాలనీ, పూజిత అపార్ట్మెంట్, ఎన్జీ కాలేజీ, క్లాక్ టవర్, నల్లగొండ బస్టాండ్, క్లాక్ టవర్, భాస్కర్ థియేటర్, డీవీకే రోడ్డు బస్టాప్, మునుగోడు ఎక్స్ రోడ్డు, సాగర్ ఎక్స్ రోడ్డు, అయ్యప్ప దేవాలయం, భాగ్యనగర్ కాలనీ, మెడికల్ కాలేజీ స్టాప్లో బస్సు ఆగుతుంది. ఫ చెర్వుగట్టు వద్ద : ఉదయం 06:45, 08:55, 11:25, మధ్యాహ్నం 01:55, సాయంత్రం 04:45, 06:35. ఫ ఎల్ఎల్బీసీ మెడికల్ కాలేజ్ వద్ద : ఉదయం 07:55, 10:05, మధ్యాహ్నం 12:35, 03:05, సాయంత్రం 05:25, రాత్రి 07:45. ఫ దుప్పలపల్లి వద్ద : ఉదయం 07:00, 09:10, 11:20, మధ్యాహ్నం 01:40, సాయంత్రం 04:10, రాత్రి 06:20. ఫ దర్వేశిపురం వద్ద : ఉదయం : 08:05, 10:15, మధ్యాహ్నం 12:25, 02:45, సాయంత్రం 05:15, రాత్రి : 07:25. ఫ రెండు సర్వీస్లను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి ఫ 20 ఏళ్ల తర్వాత అందనున్న సిటీ బస్ సేవలు ఫ నగర ప్రజలకు ఎంతో ఉపయోగం -
గుట్టలు మాయమై.. సాగుకు సిద్ధమై!
మండలంలో గుట్టలు, ప్రభుత్వ భూములు ఇలాగే మాయమైపోతే.. భవిష్యత్లో ప్రభుత్వ భవనాలు, సబ్స్టేషన్లు, సోలార్ ప్లాంట్ల వంటి అవసరాలకు స్థలం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, భూ ఆక్రమణలు, మట్టి తవ్వకాలపై పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.నిడమనూరు : నిడమనూరు మండలంలో గుట్టల తవ్వకాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకవైపు వ్యవసాయ సీజన్ దగ్గర పడుతుండటంతో.. గుట్టలను, ప్రభుత్వ అసైన్డ్ భూములను తవ్వేస్తూ సాగు భూములుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల గుట్టలు సగానికి పైగా మాయమవగా, తాజాగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ‘ఎర్రగుట్ట’ చుట్టూ భారీ తవ్వకాలు.. నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఎర్రగుట్ట చుట్టుపక్కల రెండు వారాలుగా జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఎర్రబెల్లి, సోమోరిగూడెం, బుంటువారిగూడెం, మారుపాక గ్రామాలకు చెందిన కొందరు ఈ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 494లో 115 ఎకరాల 35 గుంటలుగా ఉన్న ఈ గుట్ట.. ఇప్పుడు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. ఇందులో రెండు సబ్ స్టేషన్లకు 6 ఎకరాలు, వాటర్ ట్యాంక్ (మిషన్ భగీరథ) కోసం కొంత స్థలం కేటాయించారు. భూ పంపిణీ కింద 30 నుండి 40 ఎకరాలు ఇవ్వగా.. దానికి రెట్టింపు భూమి ఆక్రమణకు గురైంది. మరో 10 నుంచి 15 ఎకరాల్లో తెల్లరాయి మైనింగ్ జరుగుతుండగా, మరికొందరు 20 ఎకరాల్లో తమకు పట్టా ఉందంటూ మట్టిని విక్రయిస్తున్నారు. మండలంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు ● మార్లగడ్డ–రాజన్నగూడెం (సర్వే నెం. 278) వెనిగండ్ల దేవునిగుట్ట వెనుక భాగాన్ని గతంలో పట్టా చేసుకోగా, ఇప్పుడు మట్టిని తవ్వి అమ్ముకుంటూ భూమిని చదును చేస్తున్నారు. ● గుంటకగూడెం బోడు (నిడమనూరు చెరువు పైన) ఇక్కడ అప్పుడప్పుడు రహస్యంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇప్పటికే 30 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురికాగా.. ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్, సబ్స్టేషన్ ఏర్పాటును ఆక్రమణదారులు అడ్డుకోవడం గమనార్హం. గతంలో సర్వే నెంబరు 294 లోని 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ముగ్గురు ప్రభుత్వ అధికారులే ఆక్రమించుకున్నా.. రెవెన్యూ అధికారులు కేవలం నోటీసులకే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● ముప్పారం సబ్స్టేషన్ గుట్టకు ఇరువైపులా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ముప్పారం–గుంటిపల్లి, ముప్పారం–సోమోరిగూడెం రోడ్డులోని గుట్టలు సగానికి పైగా మాయమయ్యాయి. ● తుమ్మడం పెద్ద చెరువు సర్వే నంబర్ 880 అసైన్డ్ భూమిలో 50–120 మీటర్ల వెడల్పున్న యేన ప్రాంతంలో మట్టిని తవ్వి సాగుకు సిద్ధం చేస్తున్నారు. ● వెనిగండ్ల సర్వే నంబర్ 99లో ఇటీవల ప్రధానమంత్రి సడక్ యోజన రహదారి పనుల అనుమతుల చాటున కొందరు అక్రమంగా మట్టి విక్రయాలు జరిపారు. నిడమనూరు మండలంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి తవ్వకాలు ఫ సగానికిపైగా ఆక్రమణకు గురైన ఎర్రబెల్లి గుట్ట ఫ పట్టా భూముల పేరుతో మట్టి దందా ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు -
నేటి నుంచే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
జిల్లాలో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి ఇప్పటివరకు 86.62 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారు. మొత్తం 15,16,253 మంది ఓటర్లలో 13,13,325 మంది వివరాలు మ్యాపింగ్ కాగా, ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) వివరాల ధ్రువీకరణ కావాల్సి ఉంది. మ్యాపింగ్ పూర్తయిన వారిలో కూడా 4,02,517 మంది (30.65 శాతం) ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లు వెల్లడైంది. వాటిని సరి చేసేందుకు అవకాశాలు కల్పించనున్నారు. ఫ ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్న బీఎల్ఓలు ఫ 2002, 2026 ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్ ఫ ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్లు 2.02 లక్షల మంది ఫ బీఎల్ఓలకు కిట్ల అందజేత, శిక్షణ కూడా పూర్తి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. వలసలు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉంటే వాటిని తొలగిస్తారు. వంద రోజుల పాటు చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా కొత్త ఓటరు జాబితాను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) నేటినుంచి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి వివరాలు సేకరించనున్నారు. జిల్లాలోని 1812 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో బీఎల్ఓను, వారిపై పర్యవేక్షణ కోసం 181 మంది సూపర్ వైజర్లను నియమించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ను (బీఎల్ఏ) కూడా నియమించుకునే అవకాశం కల్పించారు. వారు కూడా ఓటర్లకు సహకరిస్తూ పారాలను నింపడంలో భాగస్వామ్యులు కావచ్చు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 15,16,253 మంది ఓటర్లున్నారు. ప్రతి ఓటర్కు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఒక పారాన్ని నింపి సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వాల్సి ఉండగా, మరో ఫారాన్ని భవిష్యత్ అవసరాల కోసం తమ వద్ద ఉంచుకోవాలి. ఇందుకోసం మొత్తం 31,62,352 పారాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎల్ఓలకు అవసరమైన కిట్లు, శిక్షణను కూడా ఇచ్చారు. మొదటి నాలుగు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పారాలు పంపిణీ చేస్తారు. అనంతరం వాటిని తిరిగి సేకరించి రోజు వారీగా ఆన్లైన్ చేయనున్నారు. ఈసారి సర్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితా, ప్రస్తుత 2026 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రతి ఓటర్ను ధ్రువీకరించనున్నారు. 2002లో జిల్లాలో 10,92,369 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం 15,16,253కు చేరింది. 24 సంవత్సరాల్లో ఓటర్ల సంఖ్య 4,23,884కు పెరిగింది. 2002 జాబితాలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా వివరాలను సరిపోల్చి అసలైన ఓటర్లను గుర్తించనున్నారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి పేర్లు, అర్హతలేని పేర్లను గుర్తించి తొలగించనున్నారు. 2002 జాబితాలో పేర్లు లేని వారు లేదా కుటుంబ వివరాలతో మ్యాపింగ్ కాని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి. సర్ ప్రక్రియ వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను జులై 31వ తేదీన ప్రకటిస్తారు. అందులో తమ పేరు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా, కొత్తగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓటు తొలగిస్తే సంబంధిత వ్యక్తులు ఫారం 6తో పాటు డిక్లరేషన్ సమర్పించాలి. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి జత చేసి బీఎల్ఓకు అందజేయాలి. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో నల్లగొండ నియోజక వర్గంలోనే తక్కువ మ్యాపింగ్ అయింది. కేవలం 75.01 శాతం మ్యాపింగ్ కాగా నాగార్జునసాగర్లో 95.40 శాతం, నకిరేకల్లో 95.04 శాతం, దేవరకొండలో 88.53 శాతం, మునుగోడులో 87.90 శాతం , మిర్యాలగూడలో 77.50 శాతం నమోదైంది. దేవరకొండ నియోజక వర్గంలో అత్యధికంగా 96,725 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ‘సర్’ సాగుతుంది ఇలా.. – జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం – జులై 31వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రకటన – జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ – సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం – అక్టోబర్ 1వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటన -
జూలై 22న ఎన్జీ కళాశాల స్నాతకోత్సవం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని నాగార్జున కళాశాల (ఎన్జీ) స్నాతకోత్సవాన్ని జూలై 22న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ, 2024–25 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ స్నాతకోత్సవానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు కళాశాలకు వచ్చి, నిర్ణీత ఫీజును చెల్లించి స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి తెలిపారు. స్నాతకోత్సవానికి అర్హులైన విద్యార్థుల జాబితా ఇతర పూర్తి వివరాలు కళాశాల అధికారిక వెబ్సైట్ nfco efe na go nd-a.ac.i n లో చూడవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9550636464 నంబర్ను సంప్రదించాలని సూచించారు. మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దుచండూరు : చండూరు మండలపరిదిలోని పుల్లెంల గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దని గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన స్కూల్ బస్సులను సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిప్పి పంపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కాముల వెంకన్న, ఉప సర్పంచ్ ఊషయ్య, బొడ్డు సైదులు తదితరులు పాల్గొన్నారు. నేడు మూసీ మత్స్య సంఘం ఎన్నికలునకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది మంది మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్ సహకార సొసైటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 డైరెక్టర్ పదవులకు గాను 43 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఘం పరిధిలో నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఓ పంక్షన్ హాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం తుర్కపల్లి: ఇండస్ట్రీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ అధికారి వెంకన్న, ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాపూర్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ సీతారాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
నల్లగొండను మోడల్ సిటీ చేస్తా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ.కోటీ 20 లక్షలతో చేపట్టనున్న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. సిటీ పరిధిలో రెండు సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ నగరంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. నల్లగొండ అదనంగా 30 బస్సులు కేటాయించామని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్ద పెట్రోల్ పంపు, ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధిలో భాగంగా రూ.83 కోట్లతో తాగునీటి శుద్ధి (వాటర్ ఫిల్టర్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ సిటీగా రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్, మేయర్ బుర్రి చైతన్య, రాష్ట్ర ప్రణాళిక ఆర్థిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, కార్పొరేటర్ కవిత, రమేష్, లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులకు శంకుస్థాపన -
పథకాలు అందించే బాధ్యత అధికారులదే..
నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఆయన అధికారులను అభినందించారు. అధికారులు ఆర్థిక విషయాలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ పథకాలను అమలు చేయాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ద్వారా డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులతో పాటు, విద్యార్థులు దోమలు బారిన పడకుండా దోమ తెరలు, తలుపులు వంటి మరమ్మతులన్నీ చేపట్టాలని సూచించారు. జిల్లాలో పథకాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అంతకుముందు ఆయనకు.. కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, డీఎఫ్ఓ రాజశేఖర్, సీపీఓ శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ -
అందుబాటులోకి తేనున్న రవాణా శాఖ
సాంకేతిక పద్ధతిలో టెస్టులను నిర్వహించేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్టులు, ఫిట్నెస్ టెస్టులను అధికారుల పర్యవేక్షణలో నిర్వహించి, డ్రైవింగ్ సరిగ్గా చేశారా? వాహనం ఫిట్నెస్ సరిగ్గా ఉందా? లేదా? చెక్ చేసి, సర్టిఫై చేసే వారు. ఇకపై సాంకేతిక సహకారంతో టెస్టులను నిర్వహిస్తారు. ఇందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్ల ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఫ అందుకు కొత్త ట్రాక్ల నిర్మాణానికి కసరత్తు ఫ దండెంపల్లి వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించేలా ప్రతిపాదనలు ఫ రవాణా శాఖ కార్యాలయంతో పాటు ట్రాక్లు అక్కడే.. ఫ ఆటోమేటెడ్ విధానంలో డ్రైవింగ్, వాహనాల ఫిట్నెస్ టెస్టులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోనూ ఆ దిశగా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నల్లగొండ కలెక్టరేట్ వెనుక భాగంలో రవాణా శాఖ కార్యాలయం ఉంది. అక్కడే కార్యాలయ సేవలతోపాటు టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల కలెక్టరేట్ విస్తరణలో భాగంగా రవాణా శాఖ స్థలంలో కలెక్టరేట్ అదనపు భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ ట్రాక్ సగం వరకు పోయింది. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ కోసం హైదరాబాద్ రోడ్డులో స్థలాన్ని ఇవ్వాలని భావించినా అది లిటిగేషన్లో ఉండటంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. నల్లగొండ మండలంలోని దండెంపల్లిలో గతంలో తోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలాన్ని రవాణా శాఖకు ఇవ్వాలని, అక్కడే రవాణా శాఖ కార్యాలయాలతోపాటు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఫిట్నెస్ టెస్టు సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే వాటి నిర్మాణ పనులను ప్రారంభించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఆటోమేటెడ్ ఫిట్నెస్లోనూ అంతే.. ఇప్పటివరకు వాహన ఫిట్నెస్ను అధికారులు స్వయంగా పరిశీలించి ఫైలు రాసి ఫిట్నెస్ జారీచేస్తారు. స్టీరింగ్, వీల్ అలైన్మెంట్, పొల్యుషన్, లైట్స్, బ్రేక్ తదితర కేటగిరీల్లో ఫిట్నెస్ను పరిశీలిస్తారు. ఆటోమేటెడ్ టెస్ట్లో.. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మిషన్లే పరీక్షిస్తాయి. వాటి ఫలితాల ఆధారంగానే అధికారులు సర్టిఫై చేస్తారు. ఒక్కో పరీక్షను ఒక్కో మిషన్ నిర్వహించనుంది. ఇంటివద్ద నుంచే లర్నింగ్ లైసెన్స్ లర్నింగ్ లైసెన్స్ను ఇంటివద్ద నుంచే ఆన్లైన్ ద్వారా పొందేలా రవాణ శాఖ సేవలను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. త్వరలో ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం రాబోతోంది. అందులో వాహనదారులు రవాణా శాఖ పోర్టల్ ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని, కంప్యూటర్లోనే టెస్ట్ రాసి లర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. రవాణా శాఖ సేవలను సులభతరం చేసేందుకు, పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని వాహనాల డీలర్లకు అప్పగించింది. త్వరలో ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. అలాగే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది. – కిరణ్కుమార్, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్, నల్లగొండడ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ (మోడల్) కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెస్స్ తీసుకోవాలనుకునే వాహనదారుడు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలి. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇందులో భాగంగా 8, హెచ్ ఆకారంలో ఉండే ట్రాక్లో రివర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర కేటగిరీల్లో సదరు వాహనదారుడు వాహనాన్ని ఎడ్జెస్కు తగులకుండా నడుపుతున్నాడా? లేదా? అన్న విషయాలను రవాణా శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. అయితే, ఇప్పుడు కొత్తగా రాబోయే ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్ కూడా 8, హెచ్ ఆకారంలోనే ఉన్నప్పటికీ అందులో సెన్సార్లు ఉంటాయి. సెన్సార్లో గుర్తించి.. ఏమైనా తప్పు చేస్తే అతను డ్రైవింగ్లో ఫెయిల్ అయినట్లుగా సిస్టమ్లో చూపిస్తుంది. దాంతో అధికారులు అతను ఫెయిల్ అయినట్లుగా నిర్ధారిస్తారు. -
వ్యవసాయానికి నిరంతర విద్యుత్
నల్లగొండ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యుత్ శాఖ అధికారులతో నల్లగొండ సర్కిల్ పరిధిలోని టి–కోడ్ వారీ అంచనాలు, అభివృద్ధి పనుల పురోగతి, అమలు స్థితి, పెండింగ్లో ఉన్న పనులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కాలిపోయిన, పనిచేయని విద్యుత్ మీటర్లను తక్షణమే మార్చాలని అధికారులను ఆదేశించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అసంపూర్తి పనుల పురోగతిని పరిశీలించిన సీఎండీ, వాటి పూర్తి కోసం అవసరమైన నిధులు, సామగ్రి అవసరాలపై చర్చించారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త అంచనాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, చేపట్టనున్న అభివద్ధి పనులపై సమీక్షించారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.నరసింహులు, చీఫ్ ఇంజనీర్ (రూరల్ జోన్) బాలస్వామి, ఎస్ఈ (ఆపరేషన్స్)నల్లగొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎండీకి వినతి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ను మంగళవారం విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా విద్యుత్ శాఖ స్టోర్లలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్ల పనుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.పర్వతాలు, జిల్లా అధ్యక్షుడు ఎస్కే మొహిజ్, లింగస్వామి పాల్గొన్నారు. ఫ టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ -
నేడు రేణుకా ఎల్లమ్మ కల్యాణం
కనగల్ : ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో బాగంగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునిల కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా సాగనుంది. కల్యాణోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మంగళవారం సుప్రభాత సేవ, లలిత సహస్రనామార్చన, బాల భోగ నివేదన పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా సాగింది. కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి అమ్మవారి కల్యాణ మహోత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం, భక్తుల సౌకర్యార్థం కుర్చీలు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 25న గురువారం ఆలయం వద్ద 108 కళాశాలతో అష్టోత్తర శతకటాభిషేక మహోత్సవంతో పాటు ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల్లో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. పూజల్లో పూజల్లో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి దంపతులు, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఏసీకే భాస్కర్, సర్పంచ్ రాయల శేఖర్, మాజీ చైర్మన్లు కంచకుంట్ల గోపాల్రెడ్డి, ముత్తయ్య, కార్యదర్శులు పద్మ, రాజేందర్రెడ్డి, ముఖ్య అర్చకులు మల్లాచారి, శ్రవణ్కుమారాచార్యులు, ఉమామహేశ్వరరావు, దామోదర్రావు, శ్రీనివాసచారి, ఫణి కుమార్, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు ఉపేందర్రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, శ్రీకర్, రవి, నాగరాజు పాల్గొన్నారు. ఫ పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి దంపతులు ఫ దర్వేశిపురం ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం -
నీరు తక్కువగా వాడే పంటల సాగు మేలు : కలెక్టర్
కనగల్ : వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం కనగల్ రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వాడాలి తదితర అంశాలపై వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందింస్తామన్నారు. అనంతరం కనగల్లోని మార్కెట్ యార్డ్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్, ఏఓ అమరేందర్గౌడ్, గోలి జాగల్రెడ్డి, సర్పంచ్ మురళీధర్గౌడ్, తహసీల్దార్ పద్మ పాల్గొన్నారు. -
వైటీపీఎస్ను ప్రైవేటీకరిస్తే సమ్మెబాట పడతాం
మిర్యాలగూడ : దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని ఏ విభాగాన్నీ ప్రైవేటీకరణ చేయవద్దని ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకు వెళితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులంతా ఆందోళనలు నిర్వహించి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వైటీపీఎస్ వద్ద మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి భోజన విరామ సమయంలో నినాదాలు చేశారు. టీజీ జెన్కో ఉద్యోగుల రేషనలైజేషన్ను అమలు చేస్తూ, త్వరితగతిన వైటీపీఎస్ ప్లాంట్కు అవసరమైన ఉద్యోగులను కేటాయించాలని కోరారు. సీహెచ్పీ, ఏహెచ్పీ టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భరోసా కేంద్రాలు బలోపేతం కావాలి : ఎస్పీ
నల్లగొండ : భరోసా కేంద్రాల సేవలు మరింత బలోపేతం కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 2021 నుంచి 2026 వరకు పోక్సో, అత్యాచారం, మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 806 కేసులు నమోదయ్యాయని, 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని, బాధితులకు రూ.1.68 కోట్లకు పైగా పరిహారం అందించినట్లు వివరించారు. సమావేశంలో ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి, ఎకై ్సజ్ కోర్టు జడ్జి సాయి మేఘన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, పీపీ రంజిత్కుమార్, సీఐ మంజుల, భరోసా ఇన్చార్జి ఎస్ఐ అమ్రిన్, కోఆర్డినేటర్ నళిని తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
నల్లగొండ : నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్థాన్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘చాత్రోంకి గూంజ్’ (విద్యార్థి యువత గొంతుక) మహా ఉద్యమానికి నల్లగొండ డీసీసీ మద్దతు నిస్తుందన్నారు. నీట్ పరీక్షల రద్దు, ప్రశ్నపత్రాల లీకేజీలు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం యువతను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, బట్టు జంగయ్య, ఎండీ అజీజ్, చింత ధనుంజయ్, జమ్ము అశోక్, ఆకటి సైదులు, ఎండీ అమన్ పాల్గొన్నారు. ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలినల్లగొండ టౌన్ : హైదరాబాద్లో ఈ నెల 28న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం చైర్మన్ పిడమర్తి రవి కోరారు. మంగళవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఉద్యమకారులు సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, 250 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మాతంగి అమర్, గురుపాటి సుదర్శన్, ఏర్పుల శ్రవణ్కుమార్, ఆసిఫ్ (అష్రఫ్), ముస్తఫా, నాగరాజు, వెంకన్న, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. యాప్లతో వ్యవసాయం చేయలేం నల్లగొండ టౌన్ : ఎరువుల యాప్ ద్వారా రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేంద ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వానా కాలం సీజన్ ఆరంభమైనందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. దుకాణాల్లో డీఏపీ, యూరియాను అమ్మేవిదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులను విడుదల చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేషం, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతువేదికల్లో నేడు విత్తన మేళా
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధవుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న, వినియోగదారుడు ఇష్టపడే తక్కువ కాలపరిమితి కలిగిన నాణ్యమైన సన్న వరి రకాలను ప్రోత్సాహించడం, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం విత్తన మేళా ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రైవేట్ విత్తన వ్యాపారులు, వారు ఎన్నిక చేసుకున్న రైతు వేదికల్లో విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు. ఏడు రకాల సన్నాలకే బోనస్ వరి సన్న రకాల్లో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్44, జైశ్రీరాం ఈ రకాలకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విత్తనాలతోపాటు పంట మార్పిడిలో భాగంగా కంది, పెసర, మినుములు, నువ్వులు, కూరగాయల విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు. యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడకాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించేందుకు నానో యూరియాను కూడా రైతు వేదికల్లో అందుబాటులో ఉంచుతారు. మంగళవారం జిల్లాలోని 33 మండలాల్లో ఒక్కో రైతు వేదికల్లో అధికారికంగా విత్తన మేళాను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 140 రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తారు. రైతులంతా ఈ విత్తన మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్ కోరారు. ఫ అమ్మకానికి విత్తనాలు, నానో యూరియా ఫ పంట మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యం -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల నమోదు పెంచాలిదేవరకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య కోరారు. సోమవారం దేవరకొండ మండల పరిధిలోని కస్తూరాబా పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన వంటి వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సుశీందర్రావు, హెచ్ఎం పాత్లావత్ శ్రీను, ఉపాధ్యాయులు సయ్యద్, వెంకట్రెడ్డి, వినోద, దామోదర్, సత్యనారాయణ, క్రాంతి తదితరులు ఉన్నారు. గురుకుల జూనియర్ కళాశాలలో్ల స్పాట్ అడ్మిషన్లు రామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. నార్కట్పల్లి పోలీసులకు డీజీపీ అభినందన నార్కట్పల్లి : నార్కట్పల్లి పోలీసులను డీజీపీ అభినందించారు. ఆదివారం నీట్ రాసేందుకు వివిద ప్రాంతాల నుంచి ఎంజీ యూనివర్శిటీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పలువురు విద్యార్థులు యూనివర్సిటీ గేటు నుంచి కాలినడకన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. గమనించిన నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసుల ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రం వద్దకు తరలించారు. ఈ సంఘటన వీడియోను స్థానికులు ఎక్స్ ఖాతాలో డీజీపీ సీవీ ఆనంద్కు ట్యాగ్ చేశారు. స్పందించిన డీజీపీ నార్కట్పల్లి పోలీసుల సేవలను గుర్తించి అభినందించారు. వీరు అవార్డులకు అర్హులని ఎక్స్లో రాసుకొచ్చారు. -
చిరుగాలికే నేలకొరిగాయి!
మిర్యాలగూడ: కొద్దిపాటి ఈదురు గాలులకే విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఇవి నేలకొరుగుతుండడంతో ఒకవైపు ప్రమాదాలు జరుగుతుండగా, మరోవైపు ట్రాన్స్కోకు భారీగా నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్పీడీసీఎల్)కు కాంట్రాక్టర్లు విద్యుత్ స్తంభాలను సరఫరా చేస్తుంటారు. వీటిని ట్రాన్స్కో ద్వారా పనులు చేపట్టేందుకు సదరు కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం స్తంభాలను నాటి, విద్యుత్ తీగలను బిగించి వినియోగదారులకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇలా ఏర్పాటు చేసిన స్తంభాలు కొద్దిరోజులకే, స్వల్ప గాలులకే విరిగిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో విరిగిన స్తంభాలు ఇటీవల ఈదురుగాలులకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా సుమారు 2 వేల విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు తెలిసింది. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో సుమారు 600 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి–సాగర్, మాడ్గులపల్లి, వేములపల్లి ప్రాంతాల్లో మరో 1400 వరకు స్తంభాలు నేలమట్టమయ్యాయి. క్యూరింగ్ లోపమే కారణమా? భారీ ఈదురుగాలుల వల్లే ఈ నష్టం జరుగుతోందని అధికారులు చెప్తున్నప్పటికీ, స్తంభాల తయారీలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిమెంట్ కాంక్రీట్తో అచ్చు వేసిన అనంతరం స్తంభాలను కనీసం 20 రోజుల పాటు క్యూరింగ్ (నీటిలో నానేలా) ఉంచాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు వారం లోపే వాటిని తెచ్చి వాడేస్తుండడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం స్తంభాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే, వారు నాణ్యత లేని మెటీరియల్ను వాడుతున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లేని స్తంభాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. డివిజన్ వ్యాప్తంగా ఇటీవల సుమారు 2వేల స్తంభాలు విరిగినట్లు తమ దృష్టికి వచ్చింది. హన్మకొండ, వరంగల్ నుంచి సరఫరా అయ్యే స్తంభాల్లో నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించాం. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. విరిగిన స్తంభాల స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేస్తాం. – శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ, మిర్యాలగూడ మిర్యాలగూడ డివిజన్లో ఇటీవల 2 వేల స్తంభాలు నేలమట్టం ఫ నాణ్యతా లోపమే కారణమంటున్న రైతులు, అధికారులు -
కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ధర్నా
నల్లగొండ టూటౌన్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం అమలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, గుండా నవీన్రెడ్డి, లింగస్వామి, కరుణాకర్రెడ్డి, సత్యనారాయణ, సామ వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, భిక్షంరెడ్డి, బీపంగి జగ్జీవన్, మధుకర్, పాపిరెడ్డి, వెంకట్రెడ్డి, ఓంప్రకాష్ ఉన్నారు. -
చెంతకు వచ్చి.. భరోసా ఇచ్చి!
నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్కు చెందిన బాణావత్ పార్వతి వితంతు, దివ్యాంగ మహిళ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చింది. వీల్చైర్లో ఉన్న ఆమె వద్దకు కలెక్టర్ స్వయంగా వచ్చారు. ఆమె సమస్యను విన్నారు. తనకు భర్త లేడని, ఎలాంటి ఉపాధి లేదని, ఇంటి అద్దె చెల్లించే స్థితిలో లేనని కలెక్టర్కు వివరించింది. దీంతో కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తూ కలెక్టరేట్ మెట్లు దిగేందుకు తీవ్ర ఇబ్బంది పడిండుతూ కనిపించింది. -
హౌసింగ్ బోర్డులో గజం రూ.75 వేలు
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని నల్లగొండ–దేవరకొండ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వాణిజ్య అవసరాలకు కేటాయించిన ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సోమవారం నిర్వహించిన బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. మొత్తం 31 ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.44.15 కోట్ల ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి.గౌతం వెల్లడించారు. ప్రతి ప్లాట్ 233 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా, చదరపు గజానికి రూ.20 వేల కనీస ధరను నిర్ణయించారు. అయితే కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో గరిష్టంగా చదరపు గజానికి రూ.75,500, కనిష్టంగా రూ.55,500 ధర నమోదైంది. ఈ వేలంలో భూములను కొనుగోలు చేసేందుకు 201 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ పాట్లు నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడం, భూములకు ఎలాంటి వివాదాలు లేకపోవడం వంటి కారణాలతో ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని గౌతం తెలిపారు. మొత్తం విక్రయాల్లో చదరపు గజానికి సగటున రూ.61 వేల ధర వచ్చినట్లు ఆయన తెలిపారు. వేలంలో రికార్డుస్థాయిలో ధర పలికిన కమర్షియల్ స్థలాలు ఫ 31 ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ.44.15 కోట్ల ఆదాయం -
ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. మారని పలువురు అధికారుల తీరు
నల్లగొండ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ లంచగొండులపై ఉక్కుపాదం మోపుతున్నా కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, ట్రాప్ కేసులు వరుసగా నమోదవుతున్నా లంచాల జోరు మాత్రం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన నాలుగు ఏసీబీ ట్రాప్ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు డిమాండ్ చేస్తుండగా, బాధితుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ అవినీతికి అలవాటు పడిన కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే.. జిల్లాలో కేవలం ఆరు నెలల వ్యవధిలో నాలుగు ట్రాప్ కేసులు నమోదు కావడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఇంకా ఏ స్థాయిలో కొనసాగుతోందో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, వక్ఫ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వంటి ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల అధికారులు ఏసీబీ వలలో చిక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ అధికారులు నిరంతరం నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారులు లంచాలు తీసేందుకు వెనుకాడకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా అరికట్టాలంటే కేవలం ట్రాప్ కేసులు మాత్రమే కాకుండా శాఖాపరమైన కఠిన చర్యలు, వేగవంతమైన విచారణలు, దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదిలో ఏసీబీ కేసులు ఇలా.. ● ఫిబ్రవరి 2న గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం భూ రికార్డులకు సంబంధించిన పని నిమిత్తం రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెవెన్యూ శాఖలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ● ఏప్రిల్ 16న దేవరకొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.30 వేల లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డాడు. ● జూన్ 6న మిర్యాలగూడలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహమూద్ అధికారిక నివేదిక కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు3న్నారు. ● జూన్19న నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి.పవన్కుమార్ భూమి సర్వే నివేదిక జారీ చేయడానికి రూ.35 వేల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.15 వేల స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫ ఆరు నెలల్లో ఏసీబీకి పట్టుబడిన నలుగురు అధికారులు ఫ ప్రజలకు పారదర్శకంగా అందని సేవలు ఫ లంచగొండులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్కు సోమవారం బాధితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నీట్కు 283 మంది గైర్హాజరు
నల్లగొండ : నీట్–2026 రీ ఎగ్జామినేషన్ నల్లగొండలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,065 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 1,782 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్రియ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఎన్జీ కాలేజి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, హాజరు–గైర్హాజరు, పోలీసు బందోబస్తు, భద్రతా తనిఖీలు తదితర అంశాలను పరిశీలించి కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. -
మేకల అభినవ్ను ఆదర్శంగా తీసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : చెస్ క్రీడాకారులు మేకల అభినవ్ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మేకల అభినవ్ స్మారకార్థం మేకల అభినవ్ మెమోరియల్ కంబైన్డ్ జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినవ్ చెస్లో జిల్లాకు పేరుతెచ్చాడని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చెస్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ సెక్రటరీ కరుణాకర్రెడ్డి, చీఫ్ అర్బీటర్ విశ్వప్రసాద్, మేకల అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, కృష్ణారెడ్డి, కళ్యాణి, శోభన్, రమేష్, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపికరామగిరి(నల్లగొండ) : చండూరుకు చెందిన కవి, సాహితీవేత్త, పరిశోధకుడు ఇడికోజు శ్రీనివాసాచారి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వహించనున్న కవి సమ్మేళనానికి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన మూల వేదికపై నిర్వహించనున్న ఈ కవి సమ్మేళనంలో రాష్ట్రంలోని ప్రముఖ కవులతో పాటు ఇడికోజు శ్రీనివాసాచారి పాల్గొని తన కవితను వినిపించనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు సాహిత్య రంగంలో కవి, విమర్శకుడు, పరిశోధకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపిక కావడంపై నల్లగొండ జిల్లా కవులు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అండ.. ఏఐటీయూసీ జెండాగుర్రంపోడు : కార్మికుల హక్కులకు కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం గుర్రంపోడులో జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల శ్రమ దోపిడీ పెరిగిందన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం పట్టదన్నారు. అనంతరం ఏఐటీయూసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.లక్ష్మీపతి, మండల అధ్యక్షుడిగా ఎస్కే.అమీర్, ఉపాధ్యక్షులుగా జాల నర్సింహ్మ, నారాయణ, ప్రధాన కార్యదర్శిగా జాల పెదనర్సింహ, శ్రీను, కార్యదర్శిగా పోలేని సత్తయ్య, కోశాధికారిగా తవిటి వెంకన్నను ఎన్నుకున్నారు. -
రైతు వేదికల్లో యూరియా భద్రమేనా..!
మునుగోడు : రైతులకు యూరియా సులభంగా అందించాలనే ఉద్దేశంతో అధికారులు రైతువేదికల్లో విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో 40 రైతు వేదికలను ఎంపిక చేశారు. రైతు వేదికల్లో పీఏసీఎస్ ద్వారా మాత్రమే యూరియా విక్రయాలు సాగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ నిర్ణయం ఆచరణలో మాత్రం అనేక సమస్యలకు దారితీస్తుందని రైతులు, సహకార సంఘాల అధికారులు చెప్పుతున్నారు. మొత్తం 148 రైతు వేదికలు ప్రభుత్వం క్లస్టర్కు ఒకటి చొప్పున ఐదేళ్ల ఏండ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా మొత్తం 148 రైతు వేదికలు నిర్మించింది. వాటిలో 40 రైతు వేదికల్లో యూరియా విక్రయించనున్నారు. అందులో ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు అధికంగా ఉన్న మండలాల్లో ఒకటి, పర్టిలైజర్ దుకాణాలు తక్కువగా ఉన్న మండలాల్లో రెండు చొప్పున ఎంపిక చేశారు. ఎంపిక చేసిన రైతు వేదికలు చాలా వరకు గ్రామానికి దూరంగా ఉన్నాయి. కొన్ని రైతు వేదికల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కొన్నింటికి సరైనా రోడ్డు మార్గం లేదు. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నా పర్వేలేదు, కానీ గ్రామానికి దూరంగా ఉండటంతో ఆ యూరియాకి భద్రత ఎవరుంటానే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అదనపు సిబ్బంది అవసరం వ్యవసాయ శాఖ ద్వారా రైతు వేదికలను యూరియా విక్రయానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధికారులకు అప్పగిస్తే ఆ అధికారులే యూరియా నిల్వచేసి ఏఈఓలు చెప్పిన రైతులకు యూరియా విక్రయించాలి. రైతు వేదికల్లో యూరియా విక్రయానికి అదనపు సిబ్బంది అవసరం. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సహకార సంఘాలకు రైతు వేదికల్లో యూరియా విక్రయించడం ద్వారా మరిన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఏఈఓలు సైతం రైతు వేదికల్లో యూరియా విక్రయాలు కొనసాగిస్తే తమకు కూడా ఇబ్బందిగా ఉంటుందనే భావనలో ఉన్నారు. ఫ యూరియా విక్రయానికి 40 రైతు వేదికల ఎంపిక ఫ రైతు వేదికల్లో అరకొర వసతులు -
విపత్తును ఎదుర్కొనేలా..
నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత వర్షాకాలంలో వరద ప్రభావం వల్ల అత్యవసర సమస్యలు ఏర్పడితే వాటిని వెంటనే పరిష్కరించేలా నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 24 గంటల పాటు నగర ప్రజలకు అత్యవసర సేవలందించేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాలకు వచ్చే వరదల కారణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రెస్క్యూ బృందాలను నియమించింది. గతంలో రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షానికి నీలగిరి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు వరద ప్రభావిత కాలనీలకు వెంటనే ప్రత్యేక బృందాలను పంపించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సమస్యను తెలిపేందుకు కంట్రోల్ రూమ్ నగరంలో భారీగా ఈదురు గాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రోడ్లపైనే పడిపోయి రాకపోకలకు అంతరాయం కలగడం లాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగితే వెంటనే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్కు సమాచారం అందిస్తే మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, గోడలు కూలినా తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు తగిన తోడ్పాటు అందించనున్నారు. డ్రెయినేజీలు పొంగడం, నీటి నిల్వ చేరడం, రోడ్లు దెబ్బతినడం లాంటివి జరిగితే తక్షణ చర్యలు తీసుకుంటారు. అందుబాటులో 150 సిబ్బంది ప్రస్తుత సీజన్లో ఏ క్షణంలోనైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కురిసే భారీ వర్షాలకు నగరంలో ఉన్న మూడు గుట్టల నుంచి వరద నీరు వివిధ కాలనీలను ముంచెత్తే ప్రమాదముంది. రోజంతా ఓ మోస్తరుగా వర్షం కురిసినా పెద్దగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. ఒకవేళ రెండు, మూగు గంటల పాటు కుండపోత వర్షంకురిస్తే నగరంలోని చాలా కాలనీలకు వరద ముంపు పొంచి ఉంటుంది. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురిసిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి జరుగకుండా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. వార్డు అధికారులు, శానిటేషన్ జవాన్లు, తాగునీటి సరఫరా సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, హరితహారం సిబ్బంది, టౌన్ప్లానింగ్ ఉద్యోగులు, రెవెన్యూ, శానిటేషన్ విభాగల అధికారులతో కలిపి 150 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ బృందాలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. ఫ వర్షాకాలం నేపథ్యంలో ‘నీలగిరి’ యంత్రాంగం అప్రమత్తం ఫ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఫ అత్యవసర సేవలకూ ప్రత్యేక రెస్క్యూ బృందాలు ఆపద వస్తే ఫోన్ చేయాల్సిన నంబర్ 08682–220100 నగర ప్రజల భద్రతే మా కర్తవ్యం. భారీ వర్షాలు కురిసి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజల కోసం 24 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చి సమస్య పరిష్కరిస్తారు. – బి.శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
రైతులను ముంచేందుకు కుట్ర
మునుగోడు : రైతులను నిండా ముంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల ప్రత్యేక ఓటరు సవరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికే మూడు మార్లు ఎగ్గొట్టడమే కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనలేమని బాహాటంగా ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పుచేసి నామమాత్రపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సమచారం లేకుండా అర్హులైన ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సర్ కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీకి తొత్తుగా మారి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథను మూడు నెలల పాటు జైల్లో ఉంచాల్సి బోయి నెల రోజులు కాకముందే బెయిల్ ఇప్పించారని ఆరోంపించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, కల్గుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మునగాల నారాయణరావు, కర్నాటి వెంకటేష్, పల్లె కళ్యాణి, పెద్టింటి బుచ్చిరెడ్డి, మందుల సత్యం, నల్లగొండ అంజి, పగిళ్ల సతీష్, మాదరబోయిన పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
నేడు యోగా దినోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఆదివారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు కూడా హాజరై జయప్రదం చేయాలని కోరారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టుల పనులు పూర్తిఫ నీటి పారుదల శాఖ కమిషనర్ శివకుమార్ నాయుడు నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న నీటి ప్రాజెక్టుల పనులను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ భూసేకరణ, నీటిపారుదల శాఖ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధ్యక్షతన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టు, చింతపల్లి రిజర్వాయర్, సింగరాజుపల్లి, కష్ణంపల్లి, అంబాభవాని, కంబాలపల్లి, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో అవార్డులు మంజూరైనందున పనుల విషయంలో జాప్యం చేయొద్దన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీల కోసం భూసేకరణ పూర్తయిన చోట లేఅవుట్లు రూపొందించి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేసినందుకు కలెక్టర్ను కమిషనర్ అభినందించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, సీఈ గగనం శ్రీనివాస్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరి శ్రీకాంత్రెడ్డి, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మాధురి, జిల్లా అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
నాన్న త్యాగమే.. నా విజయం
తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్రెడ్డి నల్లగొండ : మాది ఏపీలోని కడప జిల్లా చెన్నూరు. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సావిత్రి. మాది సాధారణ కుటుంబం. నన్ను, చెల్లిని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నాన్నకు అమ్మ తోడుగా నిలిచారు. మా నాన్న కుటుంబంలో పెద్దగా చదువుకున్నవారు లేరు. అందుకే మేమైనా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి వరకు కడపలో ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ నెల్లూరులో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మధ్యప్రదేశ్లోని ఐఐటీ ఇండోర్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. తర్వాత బెంగళూరులో రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సిద్ధమయ్యాను. రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకోలేకపోయినా నిరాశ చెందలేదు. నాన్న మాటలే ముందుకు నడిపించాయి తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ, తల్లి అవసరమైన సందర్భాల్లో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపారు. వారిద్దరూ ఎన్నో కష్టాలు పడినా మా చదువులో మాత్రం ఎలాంటి లోటు రానీయలేదు. నాన్న చెప్పిన ‘మాకు చదువు లేదు.. మీరు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి రావాలి’ అనే మాటలే నన్ను ముందుకు నడిపించాయి. మా చెల్లి శ్రీలత బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో ప్రయత్నంలో సక్సెస్ సివిల్స్ సాధించాలన్న నా కలను నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. మూడోసారి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ సమయంలో కుటుంబం నుంచి, ముఖ్యంగా నాన్న నుంచి ఎంతో మద్దతు లభించింది. వారి ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫలితంగా సివిల్స్లో మూడో ప్రయత్నంలో 151వ ర్యాంకు సాధించగలిగాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధులు నిర్వహిస్తున్న నేను ఐఏఎస్ సాధించడంతో అమ్మానాన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ నాన్న ఒకటే చెబుతుంటారు.. ‘ప్రజలకు నిజాయితీగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని. ఆ మాటలే నాకు మార్గదర్శకం. మంచి పేరు తెచ్చుకోవాలని నాన్న కోరిక.. ఫ చిన్నచిన్న వ్యాపారాలు చేసి మమ్మల్ని చదివించారు ఫ ఆయన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించాను ఫ నిజాయితీగా సేవలందించాలనే సూచన తప్పక పాటిస్తా నల్లగొండ అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరు శ్రీకాంత్రెడ్డి -
23 నుంచి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
దర్వేశిపురం శ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ బ్రహ్మో త్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా చూస్తాం. జిల్లా నలుమాలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి. – చీదేటి వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కనగల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కనగల్ మండలం దర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి 25వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి, గుత్తా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న నిత్య పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం సుప్రభాతసేవ, లలితా సహస్రనామర్చన, బాలభోగ నివేదన అనంతరం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. 24న శ్రీజమదగ్ని మహర్షి–ఎల్లమ్మ అమ్మవార్ల 24వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ గారిచే దేవస్థాన ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణకుమారాచార్యులు, అర్చకులు గాదె ఉమామహేశ్వర్రావు, దామోదర్రావు నేతృత్వంలో జరిపించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఫ ముస్తాబవుతున్న దర్వేశిపురం దేవస్థానం ఫ 24న అమ్మవారి కల్యాణ మహోత్సవం -
స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, ఒకేషనల్ కళాశాలలను మంత్రి సందర్శించి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యను అందించేలా నెలరోజుల్లో ప్రత్యేక ల్యాబ్ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజేందర్, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.ఉపేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైలాన్ పనులు పరిశీలించిన మంత్రి కనగల్ : కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద త్వరలో సీఎం రేవంత్రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా, శనివారం మంత్రి కోమటిరెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ పనులను పరిశీలించారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి గుర్తుగా నల్లగొండ నియోజకవర్గంలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డీఈ గణేష్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్రెడ్డి, జేఈ దినేష్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, సర్పంచ్ నర్సింగ్ మురళీగౌడ్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
లోక్ అదాలత్లో 11,233 కేసులు పరిష్కారం
రామగిరి (నల్లగొండ): కక్షిదారులు లోక్అదాలత్ను ఉపయోగించుకుంటే సమయం, డబ్బులు ఆదా అవుతాయని జిల్లా జడ్జి పి.వసంత్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 17వ జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన లోక్అదాలత్కు జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో మొత్తం 11,233 కేసులు (21 సివిల్, 4,196 క్రిమినల్, 69 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 6,890 ట్రాఫిక్ చలాన్ కేసులు, 34 బ్యాంకు రికవరీ కేసులు, 5 ఎలక్ట్రిసిటీ, 45 సైబర్ క్రైమ్) పరిష్కారమయ్యాయన్నారు. ప్రమాద బీమా కేసుల్లో రూ.3,15,73,000 నష్టపరిహారం ఇప్పించగా.. బ్యాంకు రికవరీ రూ.35,85,300, ట్రాఫిక్ చలాన్ రూ.20,31,300, ఎలక్ట్రిసిటీ రూ.16000, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.3,72,138 రికవరీ డబ్బులు ఇప్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తంరావు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ కుమార్, బి.అశోక్కుమార్, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఫ జిల్లా జడ్జి వసంత్ -
‘వీబీజీ రామ్జీ’లో మహిళల పనిదినాల వాటా 66.49 శాతం
ప్రస్తుత వీబీజీ రామ్జీ గతంలో ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు అనుమతి ఉండగా, వీబీజీ రామ్జీలో తొలగించారు. అప్పట్లో ఆ పనుల కింద 90 రోజుల పనిదినాలు కల్పించే వారు. ప్రస్తుతం అవి లేకపోవడం, మరోవైపు పథకం అమలుకు రాష్ట్రాల నుంచి అదనంగా ప్రతిపాదనలను కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేర్చాలని ప్రతిపాదించింది. అలాగే కూరగాయల పందిరి సాగుకు కూడా చేర్చాలని పేర్కొంది. వాటిని చేర్చితే గ్రామీణ ప్రజలకు మరింత మేలు చేకూరనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్జీ) అమలులో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ప్రగతి సాధిస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆమోదించిన 68.09 లక్షల పనిదినాల లేబర్ బడ్జెట్లో 41.08 లక్షల పనిదినాలు పూర్తిచేసి, 60.33 శాతం లక్ష్యాన్ని సాధించింది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి మేలు చేసే పనులను వేగంగా చేపడుతోంది. జిల్లాలో 33 మండలాలు, 868 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. మొత్తం 3.52 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 7.31 లక్షల మంది కార్మికులు నమోదయ్యారు. ప్రస్తుతం 2.14 లక్షల క్రియాశీల జాబ్ కార్డులు, 3.68 లక్షల మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు ఉపాధి హామీ పనుల్లో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. మొత్తం పనిదినాల్లో మహిళల వాటా 66.49 శాతంగా నమోదైంది. అందులో ఎస్సీ కార్మికుల పనిదినాలు 16.69 శాతం, ఎస్టీల పని దినాలు 24.74 శాతంగా ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కుటుంబాలకు భరోసా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలల్లో ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి సగటున 28.36 రోజుల ఉపాధి లభించింది. ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.301.72 వేతనం అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. రూ.154 కోట్ల వ్యయం ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఉపాధి పనులకు సంబంధించి రూ.154.03 కోట్ల వ్యయం జరిగింది. ఇందులో రూ.123.36 కోట్లు కార్మికుల వేతనాలకే ఖర్చు చేయగా, రూ.28.89 కోట్లు మెటీరియల్, నైపుణ్య కార్మికుల ఖర్చులకు వెచ్చించారు. పాలనా వ్యయం రూ.1.77 కోట్లుగా నమోదైంది. వ్యవసాయాభివృద్ధి ప్రాధాన్యం జిల్లాలో పనుల సంఖ్య 41 వేలకుపైగా ఉండగా, ఈ ఏడాది 555 పనులు పూర్తయ్యాయి. మొత్తం వ్య యంలో 40.6 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల పనులపైనే ఖర్చు చేయడం విశే షం. చెక్డ్యాంలు, ఫార్మ్పాండ్లు, నీటి సంరక్షణ, భూ సార అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెల్లింపుల్లో పారదర్శకత ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జిల్లాలో పురోగతి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100 శాతం చెల్లింపులు ఈ–ఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జరగగా, 15 రోజుల్లోపు చెల్లింపులు వంద శాతంగా నమోదైంది. ఫ మూడు నెలల్లోనే 41 లక్షల పనిదినాలు ఫ ఇప్పటికే పూర్తయిన పనులు 555 ఫ ఇళ్ల నిర్మాణాలకు అనుమతిస్తే పెద్ద ఎత్తున పనులు -
జల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
పెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్లో జల సంచయ్–జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం కొండవాలు ప్రాంతాల్లో కందకాలు, చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, సర్పంచ్ నగేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఏపీఓ రాజు, ఏపీఎం నాగలీల, టీఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలను దత్తత తీసుకోవాలిచండూరు : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి, దానిని దత్తత తీసుకొని సంరక్షించాలని జిల్లా ఫారెస్ట్ అధికారి సుమన్, ఎంపీడీఓ బండారు యాదగిరి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా శనివారం చండూరు పట్టణ పరిధిలోని బంగారిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ బోయపల్లి సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, ఏపీఓ శ్రీనివాస్, హెచ్ఎం వేలంగిని మేరి, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
‘నీట్’ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నల్లగొండ : ఈ నెల 21న నీట్–2026 రీఎగ్జామినేషన్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించనున్నామని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతించబోమన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, నార్కట్పల్లి సీఐ సురేష్ పాల్గొన్నారు. ఫ అదనపు ఎస్పీ రమేష్ -
ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, సంధ్యారాణి, కళ్యాణి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యమునుగోడు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, ప్రతిఒక్కరు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ సుశీందర్రావు కోరారు. శుక్రవారం మునుగోడులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి, ఎంఈఓ మల్లేషం, హెచ్ఎం సుంకరి భిక్షంగౌడ్, వెంకట్నారాయణ, యూసుఫ్పాషా పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు నల్లగొండ టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో సంఘమిత్ర కోఆపరేటీవ్, అర్బన్ బ్యాంకు ముందంజలో ఉందని బ్యాంక్ ఫౌండర్, చైర్మన్ సంగం రామకృష్ణ తెలిపారు. శుక్రవారం బ్యాంకు 28వ వార్షికోత్సవ వేడుకలు బ్యాంకు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగం రామకృష్ణ మాట్లాడుతూ 1998లో బ్యాంకును స్థాపించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పున్న చండీకేశ్వర్, కొంగరి భిక్షం, గజ్జల వెంకటేశ్వర్లు, గుండ్ల అంజిరెడ్డి, ఎర్రమల్ల లక్ష్మీనర్సు, చెరిపల్లి పద్మ, వీరవెల్లి భవాని, రేణిగుంట చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
వేములపల్లి : పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అన్నారు. శుక్రవారం వేములపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్లో పెండింగ్ కేసులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించి మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, గుట్కా, మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
సీజనల్ వ్యాధులను అరికడతాం
క్షేత్రస్థాయిలో అవగాహన.. సీజనల్ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో తమ సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా సర్వే నిర్వహించి వారి ఇంట్లో ఎవరైనా జ్వరంతో, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అని తెలుసుకుని అవసరమైన మందులు ఇస్తారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. ఎలాంటి మందుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నల్లగొండ టౌన్ : ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులకు నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాటాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాధులు వ్యాపించే సీజన్.. వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాల అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, ఫైలేరియా, చికున్గున్యా, డెంగీ, డయేరియా, కలరా, టైఫాయిడ్, స్వైన్ఫ్లూతో పాటు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వేలైన్స్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్, పిడియాట్రిక్ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎం, ఎల్టీలు, ఆశ వర్కర్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఆదేశించాం. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లోని నీటి గుంటలు ఉండే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహర పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి పదార్థాలను బుజించాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్ బిల్లలు చేసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఫ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం ఫ సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం ఫ పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపైకి విస్తరించిన చెట్ల కొమ్మలు, ముళ్లపొదలను తొలగించాలని సూచించారు. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు కోతకు గురికాకుండా చూడాలని, కనగల్–దేవరకొండ రహదారిపై గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లు సహా అన్ని వాహనాలకు రిఫ్లెక్టర్లు, గుర్తింపు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాంగ్రూట్లో రహదారులు దాటకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చిట్యాల ప్రాంతంలోని పరిశ్రమల వద్ద కార్మికుల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుంచి 26 వరకు మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 26న 2కే రన్ నిర్వహిస్తామన్నారు. అనంతరం మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
చండూరు : చండూరు మండలం దోనిపాములలో అగ్రిప్రమాదానికి గుడిసె దగ్ధమై ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ బండారు యాదగిరి కలిసారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘ఆదుకోండి సారూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఎంపీడీఓ యాదగిరి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఇందిరమ్మ రెండో విడతలో వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ టౌన్: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాలు, నీళ్ల విరోచనాలు, ఓఆర్ఎస్ ఉపయోగం, వాడే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పద్మ వైద్యాధికారులకు వివరించారు. సమావేశంలో డాక్టర్ కేవీఎన్ కృష్ణకుమారి, డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, డీపీఓ విష్ణు, మాతా శిశు సంక్షేమ అధికారి డాక్టర్ దీప పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ రాహుల్ -
మత్స్య సొసైటీకి ముగిసిన నామినేషన్లు
నకిరేకల్: మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ముగిసింది. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు గురువారం వరకు 71 నామినేషన్ల దాఖలయ్యాయి. చివరి రోజు 29 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీరామ్ తెలిపారు. 25న నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు 3.30 గంటల తరువాత ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు జలాశయం చుట్టూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557మంది మత్స్యకారులు ఓటర్లుగా నమోదై ఉండగా వీరంతా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
లక్ష్యం దిశగా ‘సమీకృత’ అడుగులు
నిడమనూరు: నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రూ.220 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకోవడంతో భారీ సంఖ్యలో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, నిర్మాణ కార్మికులు ఊట్కూరుకు చేరుకున్నారు. 21.5 ఎకరాల చదునైన భూమి సేకరణ పాఠశాల నిర్మాణం కోసం ఊట్కూరులోని సర్వే నంబరు 354లో గల 12.5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, దానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 358, 361లలో మరో 9 ఎకరాల ప్రైవేట్ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఎకరాకు రూ.23.5 లక్షల చొప్పున పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. గతంలో నాగార్జునసాగర్లో ఈ స్కూల్ నిర్మించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జైవీర్ కలిసి ఊట్కూరులోని ఈ చదునైన స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాలు వర్షకాలంలో పునాదులు, పిల్లర్ల గుంతల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ సంస్థ పిల్లర్ల పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన పరిపాలన భవనానికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. పనుల నిమిత్తం ప్రత్యేక విద్యుత్ లైన్లు, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాల నిర్మాణం కూడా పూర్తయింది. ఫ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచిన అధికారులు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కేజీ నుంచి పీజీ వరకు 2600 మంది విద్యార్థుల సరిపడేలా తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్ల నిర్మాణ చేపట్టనున్నారు. ప్రధానంగా విద్యాలయ భవనాలు జీ ప్లస్ 3 నమునాలో 5.5 ఎకరాల్లో నిర్మాణ పనులు పిల్లర్ పనులు వేగంగా చేస్తున్నారు. జీ ప్లస్ 2 నమూనాలో 2 అకాడమిక్ భవనాలు, 68 అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. పరిపాలన భవనం, గ్రంథాలయం, వంటశాల, డార్మెటరీ జీ ప్లస్ 1 నమునాలో 80 వేల చదరపు అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. అదేవిధంగా విద్యార్థుల హాస్టల్, ఉపాధ్యాయుల నివాసానికి జీప్లస్ 2 నమునాలో 24 డబుల్ బెడ్రూం నిర్మాణాలు, ప్రిన్సిపాల్, పరిపాలనాధికారుల నివాసానికి త్రిబుల్ బెడ్రూం నిర్మాణాలు 4, సెక్యూరిటీ, సందర్శకుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. -
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి
నల్లగొండ: ఈ ఏడాది జిల్లాలో 57లక్షల 70 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్టపై మొక్కల పెంపకానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.65 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, డీఎఫ్ఓ రాజశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, డీఐఈఓ దశ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యం అందించాలి నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆస్పత్రిలో ఆయన హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తనకు పంపించాలన్నారు. ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలు, ప్రత్యేక కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఇ– కేవైసీ 80 శాతమే..
నల్లగొండ: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు, అర్హులకే రేషన్ అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇ– కేవైసీ ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తున్నప్పటికీ, జిల్లాలో ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారులు ఈ– కేవైసీకి దూరంగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 991 రేషన్ షాపులు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 991 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,28,303 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది మాత్రమే ఈ– కేవైసీ పూర్తి చేసుకోగా.. మిగిలిన 20 శాతం మంది ఇంకా బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులతో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు రేషన్ పంపిణీలో అక్రమాలు, అనర్హుల పేర్ల కొనసాగింపు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఇ– కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటికీ మరణించిన వ్యక్తుల పేర్లు కొన్ని రేషన్ కార్డుల్లో కొనసాగుతుండగా, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దడంతో పాటు అర్హులైన కుటుంబాలకు మాత్రమే రేషన్ అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ– కేవైసీ చేయించుకునే విధానం.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న ఈ –పాస్ యంత్రంలో వేలిముద్ర నమోదు చేయగానే ఆధార్ వివరాలు ధ్రువీకరించబడతాయి. దీంతో ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు ఇ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదేపదే అవకాశం కల్పిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా పెండింగ్లో ఉన్న 20 శాతం మంది లబ్ధిదారులు వెంటనే తమ సమీప రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ ఫ బయోమెట్రిక్ చేయించుకోని 20 శాతం మంది రేషన్ లబ్ధిదారులు ఫ అలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారుల హెచ్చరిక ఫ జిల్లాలో 5.28 లక్షల కార్డులు ఉండగా పెండింగ్లో లక్షకు పైగా లబ్ధిదారులు -
ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంజీవయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ.4 వేల చొప్పున ప్రీమెట్రిక్ ఉపకార వేతనం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలి పారు. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటో, బ్యాంకు పాస్ బుక్ కాపీ, స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు నల్లగొండ: 2026–27 విద్యా సంవత్సరానికిగాను నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ పవిత్ర వాణి కర్ష గురువారం తెలిపారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో (మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ), (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్), (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్లో (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), (మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీకాం (బిజినెస్ అనలైటిక్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఏ (హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్) కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21లోపు కళాశాలలో సంప్రదించాలని కోరారు. గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లేష్కట్టంగూర్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్గౌడ్ నియామకమయ్యారు. బీసీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గురువారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతులమీదుగా మల్లేష్గౌడ్ నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామాకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు బత్తిని నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ కోటయ్య, అసిస్టెంట్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాసుదేవ్, వేణు, బొజ్జ అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిధులు లేక..
రూ. 40 కోట్ల వరకు నిధులు పెండింగ్ జిల్లాలో ఒక కార్పొరేషన్తోపాటు మరో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు నెలకు సరాసరిగా రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ నిధులతో స్థానిక అవసరాలైన స్మశాన వాటికలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతుంటారు. అయితే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్ల వరకు నిధులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లగొండ టూటౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలనెలా విడుదల కావాల్సిన ‘పట్టణ ప్రగతి’ నిధులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు కాకపోవడంతో పట్టణాల ప్రగతి పూర్తిగా ఆగిపోయింది. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాలకు గత ఏడాది (2025) జూలై నుంచి ఇప్పటివరకు పట్టణ ప్రగతి నిధుల మంజూరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు సకాలంలో రాక ఇబ్బందులు పడగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి నెలకొంటుండడంతో పట్టణాల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్న మున్సిపాలిటీల అవస్థలు ముఖ్యంగా చిన్న మున్సిపాలిటీలు నిధుల కొరతతో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనీసం చిన్నపాటి మరమ్మతులు లేదా అత్యవసర పనులు చేపట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఉందని పలువురు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పట్టణ ప్రగతి నిధులను నెలనెలా విడుదల చేస్తేనే మున్సిపాలిటీలు ప్రగతి సాధిస్తాయని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఏడాదిగా మంజూరు కాని పట్టణ ప్రగతి నిధులు ఫ చిన్నపాటి మరమ్మతులకూ నిధుల కొరత ఫ నిలిచిపోయిన అభివృద్ధి పనులునల్లగొండ 1. 26 కోట్లు మిర్యాలగూడ 78. 91లక్షలు హాలియా 16. 68 లక్షలు నకిరేకల్ 22. 15 లక్షలు నందికొండ 16. 62 లక్షలు చండూరు 11. 65 లక్షలు చిట్యాల 13. 64 లక్షలు దేవరకొండ 23. 54 లక్షలు మొత్తం 3.09 కోట్లు -
రోడ్డు దాటడం ఇక సులభం
ఆటో ఎక్కండి.. స్కూల్కు రండి..నగరంలో ప్రతి రోడ్డులోనూ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. పలు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పుడు సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద ఈ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో రోడ్డు దాటే మార్గం సులభం కానుంది. అదే విధంగా రెడ్డి హాస్టల్ వద్ద, మేళ్ల దుప్పలపల్లి రోడ్డు క్రాసింగ్ వద్ద, గంధంవారిగూడెం క్రాసింగ్ వద్ద వాహాణాల వేగాన్ని నిరోధించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని డీవీకే రోడ్డు సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ వద్ద నిర్మిస్తున్న ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. అత్యధిక రద్దీ గల ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా రోడ్డు దాటే ప్రజలకు ఊరట కలగనుంది. ఉదయం, సాయంత్రం రద్దీ.. డీవీకే రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోవాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. జాతీయ రహదారి నిర్మాణం సంస్థ ఈ బ్రిడ్జి నిర్మిస్తోంది. తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. పెద్ద, పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఈ ఎస్కలేటర్ బ్రిడ్జి తాజాగా నీలగిరి నగరంలో కూడా అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిగా నిలిచిపోనుంది. అదే విధంగా ఖమ్మం, మహబూబ్నర్ లాంటి జిల్లాల్లో కూడా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవని అధికారులు చెబుతున్నారు. తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెం గ్రామంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో సౌకర్యం కల్పించారు. ఆ ఆటోను సర్పంచ్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు యర్రమాద కవిత నరేందర్రెడ్డి, చింతకుంట్ల రవీందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆదిమల్ల శ్రీనివాస్, మధుబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.నీలగిరిలో శరవేగంగా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఫ సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రూ.8 కోట్లతో పనులు -
బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి
మిర్యాలగూడ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు అత్యంత అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగి అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, జూలై 31న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను సరి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త వెరిఫికేషన్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొట్టమొదటగా విజయం సాధించే సీటు మిర్యాలగూడ అని ధీమా వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని, ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్దార్థ, ఇలియాస్ఖాన్, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసిన్అలీ, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, షహనాజ్బేగం, ఎండీ.యూసుఫ్, పాలుట్ల బాబయ్య, షోయబ్, పెద్ది శ్రీనివాస్గౌడ్, హాతీరాం, చిట్టిబాబునాయక్ పాల్గొన్నారు. ఫ వైటీపీఎస్ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
సమస్యలు తీర్చండని మంత్రికి మొర
నల్లగొండ : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం వివిధ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. మంత్రిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్రెడ్డి బుధవారం నల్లగొండలోని ఇందిరాభవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్క అందజేశారు. -
డీఎంహెచ్ఓగా డాక్టర్ రాహుల్
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.రాహుల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓగా పని చేస్తున్న ఆయనకు నల్లగొండ డీఎంహెచ్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్.. కరోనా సమయంలో నోడల్ అధికారిగా పనిచేశారు. జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాహుల్ తెలిపారు. ఆయనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ కలెక్టర్ చంద్రశేఖర్ను మర్యాద పుర్వకంగా కలిశారు. డీఈఈ–సెట్ ఫేజ్–2 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలనల్లగొండ : డీఈఈ–సెట్–2026 ఫేజ్–2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదలైనట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి జూన్ 18న డైట్, నల్లగొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్ ఆప్షన్, ఫేజ్–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 21న వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన జూన్ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులు జూన్ 25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూసీ మత్స్య సొసైటీకి 42 నామినేషన్లునకిరేకల్ : మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నకిరేకల్ మండలం వల్లభాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకుగాను బుధవారం వరకు 42 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి కే.శ్రీరామ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి తేదీ కావడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైస్ మిల్లర్ లక్ష్మయ్య అరెస్ట్రామగిరి (నల్లగొండ) : సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) అవకతవకల కేసులో నల్లగొండ పట్టణానికి చెందిన గౌతమి రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను నల్లగొండ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, భారీగా అవకతవకలకు పాల్పడినట్లు లక్ష్మయ్యపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. లక్ష్మయ్యపై రామ్లక్ష్మణ్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై కూడా కేసు ఉంది. -
నక్కలగండిని సందర్శించిన ఎన్టీసీఏ బృందం
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) బృందం బుధవారం సందర్శించింది. నక్కలగండి ప్రాజెక్టుకు 450 ఎకరాల అటవీ భూమి అవసరం ఏర్పడింది. ఆ భూమికి బదులుగా ప్రభుత్వం చందంపేట మండలంలో కోరుట్ల, ముర్పునూతల, నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద భూమిని అటవీ శాఖకు కేటాయించింది. ఆయా భూములను, నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎన్టీసీఏ బృందం సభ్యులు ఇక్కడికి వచ్చారు. భూముల వివరాలు తెలుసుకున్నారు. సందర్శించిన వారిలో హరిణి, ఏఐజి జివి.గోపి, సృష్టిమోడి, ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. -
‘సర్’ పేరుతో బీజేపీ కుట్రలు
చండూరు : సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని కాపాడుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఎండోమెంట్ సహాయ కమిషనర్ కె.భాస్కర్, అర్చకులు నాగోజు మల్లాచారి, గాదె దామోదర్రావు, జినుకుంట్ల చంద్రయ్య, కె.ఉపేందర్రెడ్డి, ఎన్.ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 21న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలునల్లగొండ టూటౌన్ : మేకల అభినవ్ 36వ జయంతి పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ సౌజన్యంతో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డి, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో అండర్ – 7, 9, 11, 13, 15, 17 విభాగాల్లో బాల, బాలికలకు స్విస్ పద్ధతిలో 5 రౌండ్లలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 36 మంది విజేతలకు బహుమతితో పాటు ఫిడే రేటెడ్ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. చెస్ పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాని, ఇతర వివరాలకు 9985423823 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించొద్దుచందంపేట : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ సూచించారు. మంగళవారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్ బుక్కులు, విక్రయ రికార్డులను పరిశీలించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదు పొందాలని సూచించారు. రైతులు భూమిలో సరిపడా తేమ లేకుండా విత్తనాలు విత్తడం వల్ల మొలకలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుందన్నారు. ఆయన వెంట ఏడీఏ శ్రీలక్ష్మి, ఏఓ యాదగిరి ఉన్నారు. పశువులకు గొంతువాపు నివారణ టీకాలుమాడుగులపల్లి : పశువులకు ముందస్తుగా గొంతువాపు నివారణ టీకాలు వేయాలని జిల్లా పశువైద్యాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాడుగులపల్లి మండలంలోని గండ్రవానిగూడెం గ్రామంలో పశువుల గొంతువాపు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు వచ్చే జ్వరం, గొంతువాపు నివారణ కోసం ఈ టీకాలు వేస్తామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినెలా పశువైద్య సిబ్బంది పర్యటించి గొంతువాపు ముందస్తు టీకాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, సర్పంచ్ బొబ్బలి కావ్యశ్రీనివాస్, రైతులు మాధవరెడ్డి, సతీష్, రవి, నారాయణ, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, సిబ్బంది రాకేష్, రవిచందర్ పాల్గొన్నారు. -
‘చేయూత’ చెక్కు అందజేత
నల్లగొండ : పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నకిరేకల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కుటుంబానికి చేయూత పథకం కింద రూ.2 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవడం పోలీస్శాఖ బాధ్యత అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం, పెన్షన్, ఇతర సంక్షేమాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.


