breaking news
Nalgonda District Latest News
-
నేడు మొదటి విడత ‘పంచాయతీ’కి నోటిఫికేషన్
మొదటి విడత జరిగే మండలాలు.. మండలం పంచాయతీలు వార్డులు చిట్యాల 18 180 కనగల్ 31 262 కట్టంగూర్ 22 206 కేతేపల్లి 16 160 నకిరేకల్ 17 160 నల్లగొండ 31 270 నార్కట్పల్లి 29 262 శాలిగౌరారం 24 230 తిప్పర్తి 26 216 చండూరు 19 166 గట్టుప్పల్ 7 68 మర్రిగూడ 18 170 మునుగోడు 28 294 నాంపల్లి 32 276 మొత్తం 318 2,870 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దీనిలో భాగంగా కలెక్టర్ నేతృత్వంలో బుధవారం ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీలకు శిక్షణ పూర్తి చేశారు. నాలుగైదు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామాల్లో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీల్లో డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. తొలివిడతకు సంబంధించిన నామిషనేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమై శనివారంతో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రి గోదాముల్లో నుంచి ఆయా మండలాలు, క్లస్టర్లకు తరలించారు. 117 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్తోపాటు(ఆర్ఓ) అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను (ఏఆర్ఓ) నియమించారు. వారికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. రెండు డివిజన్లు, 318 గ్రామాల్లో ఎన్నికలు నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు 2,870 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి చేశారు.ఫ తొలివిడతలో 318 సర్పంచ్, 2,870 వార్డులకు ఎన్నికలు ఫ నామినేషన్ల స్వీకరణకు 14 మండలాల్లోని 117 క్లస్టర్ల ఏర్పాటు -
బంగారిగడ్డలో పత్తి రైతుల ఆందోళన
చండూరు : పత్తి మిల్లులో దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారని ఆరోపిస్తూ బుధవారం బంగారిగడ్డ గ్రామంలో మంజీత్ పత్తి మిల్లు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దళారులు రైతుల పాస్బుక్ల ద్వారా ఎక్కువ స్లాట్లు బుక్ చేసుకుని అమ్ముతున్నారని, రైతులు తీసుకువస్తే పత్తి బాగాలేదని, పత్తి కాయ వచ్చిందని, నల్లగా మారిందని కుంటిసాకులు చెబుతూ తిప్పి పంపుతున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీదేవి పత్తి మిల్లు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల పత్తిని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించడంతో వివాదం సద్దుమనిగింది. -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాడాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 65 లక్షల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్నవెంకులు, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, డబ్బీకార్ మల్లేష్, ఎండీ.సలీం, డి.సత్తయ్య, అవుట రవీందర్ పాల్గొన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీచిట్యాల : మండలంలోని గుండ్రాంపల్లి ఆరోగ్య ఉప కేంద్రాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్లో రికార్డులు, మందుల స్టాక్ను పరిశీలించారు. గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, వెలిమినేడు వైద్యాధికారి ఉబ్బు నర్సింహ, ఏఎన్ఎం హేమలత, మల్లీశ్వరి ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థుల ఆందోళననల్లగొండ టౌన్ : లాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్–2 అభ్యర్థుల కౌన్సిలింగ్ ఆర్డర్ కాపీని ఈ నెల 24న విడుదల చేసి స్థానిక ఎన్నికల పేరుతో కౌన్సిలింగ్ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ నల్లగొండలో బుధవారం ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. అంగన్వాడీలు సమయపాలన పాటించాలి మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీలు సమయపాలనను పాటించాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. బుధవారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. బ్రూణ హత్యలు, శిశు విక్రయాలు, బాల్య వివాహాలు ఉంటే వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి, సీడీపీఓ రేఖల మమత, సూపర్వైజర్లు రాధిక, నజిమాబేగం, మోహ్మద్, వాణి, నిహారిక, లీలాకుమారి, హేమాదేవి, నాగమణి, రమణి, అశ్రిత, శోభ, కవిత తదితరులు పాల్గొన్నారు. -
రెఫరెండం
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలివ్వడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోవడం పరిపాటి. కానీ, కొద్దిమంది ప్రజాప్రతినిధులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు తమ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. అందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అలా నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తమ పాలనపై రెఫరెండం నిర్వహించుకుని.. ప్రజాభిప్రాయం తీసుకున్నారు. ఈ రెఫరెండంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. స్థానిక సంస్థల్లోఆలగడప మాజీ సర్పంచ్ వేనేపల్లి పాండురంగారావు తమ పాలనపై ప్రజాభిప్రాయం తీసుకున్న ఇద్దరు సర్పంచ్లు, ఒక ఎంపీటీసీ రెఫరెండంలో మరింత ఆదరణ పొందిన ఆ నాయకులు మిర్యాలగూడ : దేశంలో 22ఏళ్ల క్రితం ఆ గ్రామం పేరు మారుమోగింది. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా అప్పటి సర్పంచ్ తన పాలనపై పెట్టుకున్న రెఫరెండం దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా తన పాలనపై రెఫరెండం పెట్టుకొని గెలిచి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడంతోపాటు గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి ‘తెలంగాణ మట్టి మనిషి’గా పేరుతెచ్చుకున్నాడు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ‘మనిల్లు’ అని పేరు పెట్టుకుని ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు వేనేపల్లి పాండురంగారావు. ప్రజలే నామినేషన్ వేయించారు.. ఊరి జనం మొత్తం పాండురంగారావును సర్పంచ్గా చేయాలని పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు పోటీ చేయకుండా నిరాకరించాడు. ఎట్టకేలకు 2001లో ప్రజలే ఆయనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పాండురంగారావుకు కాంగ్రెస్, సీపీఎం మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థి బరిలో ఉన్నాడు. పాండురంగారావు కేవలం రూ.200 ఖర్చు పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో అప్పుడు సుమారు 3,800 ఓట్లు ఉండగా 3,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. అందులో పాండురంగారావుకు 2,800 ఓట్లు వచ్చాయి. ఇంకా 400 ఓట్ల పోలింగ్ చిట్టీలపై అభిమానులు నినాదాలు రాయడంతో అవి చెల్లలేదు. ప్రత్యర్థికి కేవలం 400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీతో పాండురంగారావు గెలుపొందారు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊరిలో సారా నిషేధం పెట్టాడు. ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చాలా మందిని సొంత ఖర్చులతో చదివించారు. 2003లో రెఫరెండం.. పాండురంగారావు సర్పంచ్గా తన రెండేళ్ల పాలనపై 2003లో రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పట్లోనే దేశానికి ఆలగడప పేరును పరిచయం చేశాడు. ‘పదవిలో నేను ఉండాలా.. వద్దా..’ అని బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ నిర్వహించగా 1710 మంది ఉండాలని, 70 మంది వద్దని తీర్పు ఇచ్చారు. అప్పట్లో ఆలగపడ గ్రామాన్ని జాతీయ మీడియా వెతుక్కుంటూ వచ్చింది. ఈ విజయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎంపికై కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దేశంలోనే మొట్టమొదటగా ఆలగడప గ్రామంలో.. ‘సాక్షి’తో వేనేపల్లి పాండురంగారావు మా గ్రామంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న సమయంలో ప్రజలు నన్ను సర్పంచ్గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. 2001లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగాక.. పదవిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండెం పెట్టాను. దానిలో 90శాతం మంది ప్రజలు పదవిలో ఉండాలని, పాలన బాగుందని తీర్పు ఇచ్చారు. ఈ రెఫరెండెం దేశ చరిత్రలో మొదటిసారి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు
కోదాడ : ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభమైన గ్రామపంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు కోసం 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచనలను జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్ రాష్ట్రం అమలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనిని 1959 అక్టోబర్2న అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని దీనిలో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి ప్రెసిడెంట్ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3 వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండేవారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం –1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవడం ప్రారంభమైంది. ఫ పోటీ చేసే అభ్యర్థుల పేరు ఓటరు లిస్టులో లేకున్నా, వయస్సు సరిగ్గా లేకపోయినా నామినేషన్ను తిరస్కరిస్తారు. ఫ నామినేషన్ వేసే అభ్యర్థుల సంతకాలు, ప్రతిపాదకుని సంతకాలు లేకున్నా, గత ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు 45 రోజుల్లోగా ఇవ్వని అభ్యర్థుల నామినేషన్ను అధికారులు తిరస్కరిస్తారు.ఫ గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు. ఫ గ్రామ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు. బకాయిలపై నోటీసులు ఇచ్చినా స్పందించని వారు. ఫ మతిస్థిమితం లేనివారు, బధిరులు. ఫ పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు. ఫ గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేస్తున్నా, నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. -
సమర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి
నల్లగొండ : పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకుంటే వారు తన వద్దకు వచ్చి పనులు చేయించుకుని గ్రామాలను అబ్ధివృద్ధి చేస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని కతాల్గూడెం నుంచి దర్వేశిపురం వరకు నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని మిగతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఏకగ్రీవమైతే రూ.30 లక్షలు ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే ఆ గ్రామానికి సొంతంగా రూ.10 లక్షలు, తన నిధుల నుంచి మరో రూ.20 లక్షలు కలిపి మొత్తం రూ.30 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించారు. ప్రజలు సమర్థులైన వారిని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని సాగర్ ఎక్స్రోడ్డు నుంచి దర్వేశిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించి.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.450 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ పనులు చేపడతామన్నారు. నల్లగొండకు రింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నల్లగొండలోనే రూ.వెయ్యి కోట్ల పైచిలుకు పనులు చేపట్టామన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలాల్లో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించబోతున్నామని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని బొట్టుగూడలో నిర్మించిన పాఠశాలను డిసెంబర్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, శ్రీనివాసగౌడ్, ఆలకుంట్ల నాగరత్నంరాజు, దర్వేశిపురం ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి, గడ్డం అనూప్రెడ్డి, బారత వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ పంచాయతీల్లో కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపించాలి ఫ మిగతా పార్టీ వారు గెలిచినా ప్రయోజనం ఉండదు ఫ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మూడేళ్లకు ప్రజాభిప్రాయం
కట్టంగూర్ : కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన గద్దపాటి దానయ్య 2001లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 800 ఓట్లు ఉండగా దానయ్యకు 450 ఓట్లు రాగా ప్రత్యర్ధి పులి నర్సింహకు 350 ఓట్లు వచ్చాయి. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత 2004లో తన పాలనపై రెఫరెండం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో రెఫరెండం చేపట్టారు. దానయ్య రైతు గుర్తుతో, వ్యతరేకంగా క్రాస్ గుర్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఈ రెఫరెండం పోలింగ్లో మొత్తం 750 ఓట్లు పోలవ్వగా 110 ఓట్ల మెజార్టీతో గద్దపాటి దానయ్య గెలుపొందారు. తన పాలనపైనే ప్రజల తీర్పు కోరిన దానయ్య ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15, 2004లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రజల ఆమోదంతో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ప్రజాపాలనలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే రెఫరెండం విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ మెరుగు పడుతుంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు కలిగేలా పనులు చేయాలంటే ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలి – గద్దపాటి దానయ్య, మాజీ సర్పంచ్, పందెనపల్లి -
అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే
ఫ సర్పంచ్కు రూ.2.50 లక్షలు ఫ వార్డు సభ్యుడికి రూ.50 వేలు భువనగిరి టౌన్ : పంచాయతీరాజ్ చట్టంలోని 237(3)ల ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చును నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయవచ్చనే విషయాన్ని నిర్ణయించారు. ఎన్నికల్లో పారదర్శకత, సమతుల్యాన్ని కాపాడేందుకు ఈ ఖర్చు పరిమితిని విధించారు. గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్యను బట్టి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఖర్చు పరిమితులు నిర్ణయించారు. ఫ 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో గరిష్టంగా రూ. 2.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేసేందుకు వీలుంది. ఫ 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసేవారు రూ.30 వేల వరకు ఖర్చ చేయవచ్చు. ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల ఖర్చు లెక్కలను కూడా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. -
ప్రజలు మద్దతుగా నిలిచారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి. అందుకుగాను నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల ఆలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది. – దుబ్బాక నర్సింహారెడ్డి, నేరడ, చిట్యాల మండలంచిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది. -
ఏఎస్పీ మౌనికకు ఆత్మీయ వీడ్కోలు
కొండమల్లేపల్లి : దేవరకొండ ఏఎస్పీగా విధులు నిర్వహించి ఇటీవల అదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్లిన పి.మౌనికకు దేవరకొండ సబ్డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు. కొండమల్లేపల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీడ్కోలు పొందిన ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ ఈ డివిజన్లో 11 నెలలు పనిచేయడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. సిబ్బంది సహకారంతో పలు కేసులను చేధించామన్నారు. అనంతరం ఆమెను సిబ్బంది ఘనంగా సన్మానించారు. దేవరకొండ నూతన డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఐలు బీసన్న, వెంకట్రెడ్డి, రాజు, ఎస్ఐలు అజ్మీరా రమేష్, రామ్మూర్తి, నర్సింహ, బాలకృష్ణ, సాలకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
మునగాల : బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాత్రి మునగాల శివారులో చోటు చేసుకుంది. పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన కొండమీది వెంకన్న బైక్పై కోదాడకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మునగాల శివారులోని కొక్కిరేణి వెళ్లే రోడ్డుపై రైతులు ఽఆరబోసిన ధాన్యం గమనించకుండా బైక్ను వెళ్లనీయడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. వెంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే రోడ్లపై కూడా ధాన్యం ఆరబోయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
మాజీ సైనికుల పిల్లలకు ఉపకార వేతనాలు
నల్లగొండ టూటౌన్ : మాజీ సైనికులు, అమరులైన సైనికుల పిల్లలు వృత్తి విద్యా కోర్సులు చదువుతుంటే వారికి కేంద్ర రక్షణ శాఖ ఉపకార వేతనాలు అందిస్తోందని నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, ఎంబీబీఎస్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ చదువుతూ ఉండి ఇంటర్లో 60 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. బాలురకు నెలకు రూ. 2500, బాలికలకు రూ.3వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన సైనిక కుటుంబాలకు చెందిన వారు డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు www.kr b.gov.in ను గానీ, లేదా జిల్లా సైనిక సంక్షేమ అధికారిని, ఫోన్ 08682–224820 నంబర్కు సంప్రదించాలని కోరారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికనేరేడుచర్ల : జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు నేరేడుచర్లకు చెందిన వరాల వరుణ్కుమార్ ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్లో అతను పాల్గొని ప్రతిభ కనబర్చడంతో అధికారులు వరుణ్కుమార్ను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హర్యానాలో జరుగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో వరుణ్ తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జాతీయ స్థాయికి ఎంపికై న వరుణ్ను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్రెడ్డి, నామ నర్సింహారావు, అసోసియేషన్ మండలాధ్యక్షుడు నూకల సందీప్రెడ్డి, కార్యదర్శి సైదులు అభినందించారు. మహిళ అవయవాలు దానంయాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. రామాజీపేట గ్రామానికి చెందిన కల్లెపల్లి ఐలయ్య భార్య ఉపేంద్ర (43)తో కలిసి ఈ నెల 11న బైక్పై ఆలేరు నుంచి రామాజీపేట గ్రామానికి వస్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కల్లెపల్లి ఉపేంద్ర మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ ఫౌండేషన్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. అవయవ దానానికి ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య అంగీకరించడంతో ఉపేంద్ర కాలేయం, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ‘డ్రాగెన్ బోట్’లో ఉత్తమ ప్రతిభరాజాపేట : జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్ షిప్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడేనికి చెందిన ఎం.రేవంత్ ప్రతిభ కనబర్చాడు. మహారాష్టలోని నాందెండ్లో ఈ నెల 24 నుంచి జరుగుతున్న జాతీయస్థాయి డ్రాగెన్ బోట్ చాంపియన్షిప్ పోటీల్లో రేవంత్ తెలంగాణ తరఫున పాల్గొంటున్నాడు. బుధవారం నిర్వహించిన సీనియర్ మెన్ వెయ్యి మీటర్ల పోటీల్లో రేవంత్ సిల్వర్ మెడల్, 500 మీటర్లు, సీనియర్ మిక్స్డ్ వెయ్యి, 500 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించాడు. -
గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకోవాలి
ఫ జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జేడీ మరియదాస్ గరిడేపల్లి : గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనాలు సమకూరుతాయని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ ఎ.మరియదాస్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో ‘వేర్ హౌసింగ్ డెవలప్మెంట్, నెగోషియబుల్ వేర్ హౌస్’పై బుధవారం రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యజమానులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొలంలో ఎలుకల యాజమాన్యంపై వివరించారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆహార ధాన్యాలు వృథా కాకుండా కాపాడుకోవచ్చన్నారు. లేదంటే చీడ పురుగులు, ఎలుకల వల్ల 10 నుంచి 30శాతం వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ధాన్యం నిల్వ చేసే సమయంలో ఉపయోగించే హెర్మటిక్ బ్యాగ్ల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ, కిరణ్, అక్షిత్సాయి, ఎన్. సుగంధి, రైతులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పెద్దఅడిశర్లపల్లి : గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనపురంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపురం గ్రామ శివారులో జడ్చర్ల–నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని మహిళ(50) నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చైన్ స్నాచింగ్కు పాల్పడి అప్పులు తీర్చాడు
మిర్యాలగూడ అర్బన్ : మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం దీక్షిత్నగర్కు చెందిన మందడి వినోద్ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చాలంటూ అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 14న మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంలో వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్పై పారిపోయాడు. హుజూర్నగర్ మండలం రామస్వామిగట్టుకు చెందిన తన స్నేహితురాలు షేక్ నజ్మాకు సదరు బంగారు పుస్తెల తాడు ఇచ్చి ఆమె పేరుపై శ్రీరామ్ ఫైనాన్స్లో రూ.2.30 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుల్లోంచి కొంత అప్పు తీర్చి, మిగతా దాంతో పేకాట ఆడి పోగొట్టుకున్నాడు. సీతారంపురంలో జరిగిన చైన్స్నాచింగ్పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు పట్టణంలోని సీసీ కెమరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మళ్లీ చైన్స్నాచింగ్కు పాల్పడేందుకు ఈ నెల 25న నంబర్లేని పల్సర్ బైక్పై మిర్యాలగూడకు రాగా రాజీవ్చౌక్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తాను చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇతడిపై ఇప్పటికే హుజూర్నగర్, మునగాల, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 3.2 తులాల బంగారు పుస్తెల తాడు, పల్సర్ బైక్, సెల్ఫోన్, చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నామని, వినోద్తో పాటు అతడికి సాయం చేసిన షేక్ నజ్మాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన టూటౌన్ సీఐ సోమనర్సయ్య, సిబ్బందికి రివార్డులు అందించారు. ఆయన వెంట ఎస్ఐ బి.రాబాబు, ఏఎస్ఐ చంద్రయ్య, సిబ్బంది ఉన్నారు. -
రాజేశ్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి
కోదాడరూరల్ : దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉండి ఇటీవల మృతి కోదాడకు చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రాజేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్ను అదుపులోకి తీసుకొని నాలుగురోజుల పాటు చిలుకూరు, రూరల్ పోలీస్స్టేషన్లకు తిప్పి చిత్రహింసలు పెట్టడంతోనే మృతి చెందాడన్నారు. అమాయక దళితులను చంపి డబ్బు ఆశ చూపడం ద్వారా నిందితులు చట్టం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. రాజేశ్ కేసు విషయంలో జరిగిన పరి ణామాలు చూస్తుంటే దళితుల మాన ప్రాణాలకు విలువ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకమై కేసును నీరు గారుస్తు న్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, ఆయన సతీమణి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం బాధకరమని అన్నారు. రాజేశ్ మృతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్మాదిగ, నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఏపూరి రాజుమాదిగ, యలమర్తి రాము, ఆంజనేయులు, కోటేశ్, బోడ సునీల్, రాజన్న, చింత వినయ్బాబు ఉన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
హమాలీగానూ.. ఆమె
పెన్పహాడ్ : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, గృహనిర్మాణ రంగాల్లో కూలీలుగా పని చేసిన మహిళలు ఇప్పుడు హమాలీలుగా పని చేస్తూ తాము తలచుకుంటే ఏపనైనా చేయగలమని నిరూపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేస్తూ మగ వారితో సమానంగా పనులు చేస్తున్నారు. పెన్పహాడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో 10 మంది మహిళలు హమాలీలుగా పనులు నిర్వహిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని గోనె సంచుల్లోకి ఎత్తడం, దానిని తూకం వేయడం, బస్తాలను సీల్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు, పత్తి ఏరే పనులు చేపడుతున్నారు. అయితే వరిని యంత్రాల ద్వారా కోయడం, ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి దెబ్బతినడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోయింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. రోజుకు 500 బస్తాల్లో ధాన్యం నింపి తూకం వేయడం ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు కూలి వస్తున్నట్లు మహిళలు పేర్కొంటున్నారు. అయితే ఇన్న రోజులు హమాలీల కొరత కారణంగా కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మహిళలు హమాలీ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో కాంటాలు వేగవంతమై తమ ఇబ్బందులు తీరాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాల నిర్వహణ ఉపాధి పొందుతున్న వ్యవసాయ కూలీలు -
ఆస్పత్రిని త్వరితగతిన ప్రారంభించాలి
నకిరేకల్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్కు మంజూరు చేసిన 100 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి త్వరితగతిన ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. నకిరేకల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రి భవన సముదాయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జనవరి 22న రూ.32 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించి 80 శాతం మేర పూర్తిచేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేయించడంలో జాప్యం చేస్తోందన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే ఆస్పత్రి నిర్మాణంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోందన్నారు. అప్పట్లో వైద్యశాల నిర్వహణ, 69 మంది సిబ్బంది వేతనాల కోసం ప్రతి ఏటా రూ.6.35 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. వైద్యశాల సముదాయాన్ని త్వరితగతిన పూర్తిచేసి పేద ప్రజల అందుబాటులో తేవాలని కోరారు. ఆయన వెంట నకిరేకల్ మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, నాయకులు రాచకొండ వెంకన్నగౌడ్, గుర్రం గణేశ్, దైద పరమేషం, నోముల కేశవరాజులు, రాచకొండ శ్రవణ్, యానాల లింగారెడ్డి, పల్లె విజయ్, రావిరాల మల్లయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు. కేసీఆర్కు పేరు వస్తుందనే పనుల్లో జాప్యం జరుగుతోంది నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
అనుమానాస్పద స్థితిలో వలస కూలీ మృతి
మునుగోడు : పత్తి మిల్లులో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో మంగళవారంజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ముస్తఫా జాఫర్ సార్జారాల్(30) తమ ప్రాంతానికి చెందిన మరో 15 మందితో కలిసి 15రోజుల క్రితం మునుగోడుకు వచ్చాడు. వీరంతా కొంపల్లిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లులో పని చేస్తున్నారు. ముస్తఫా సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని అదే మిల్లులో ఉన్న తమ నివాసానికి వెళ్లాడు. మద్యం తాగిన ముస్తాఫా జాఫర్ తోటి కూలీతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో తోటి కూలీ అతడిని మిల్లులోకి తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి పత్తి కుప్ప వద్ద నిద్రించారు. అతడి వెంట నిద్రించిన వ్యక్తి మంగళవారం ఉదయం లేచి పనికి వెళ్లాడు. జాఫర్ పనికి రాకపోవడంతో మిల్లు నిర్వాహకులు, తోటి కూలీలు వెతికగా పత్తి కుప్పలో విగతజీవిగా పడి ఉన్నాడు. మద్యం మత్తులో తోటి కూలీలు కొట్టడంతో మృతి చెందాడా లేదా పత్తి కుప్ప వద్ద నిద్రించిన అతడిని గమనించకుండా ట్రాక్టర్ సాయంతో పత్తిని మిల్లులో వేసే సమయంలో మృతి చెందాడా అనేది తేలాల్సి ఉంది. అతడి కుటుంబ సభ్యులు వచ్చేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించవద్దని తోటి కూలీలు అడ్డు తగలడంతో అక్కడే ఉంచారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
● ప్రథమ బహుమతులు గెలుచుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లుచౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరిరోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 12మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాజేష్ను అకారణంగా పొట్టనపెట్టుకున్నారు
కోదాడ : కోదాడకు చెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ను పోలీసులు అకారణంగా చిత్రహింసలకు గురిచేసి హత్యచేశారని, దీనికి కారణమైన చిలుకూరు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడలో రాజేష్ కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పరామర్శించారు. రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజేష్ పాత నేరస్తుడు కాకపోయినా.. చిలుకూరు పోలీసులు ఐదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేయడం వలనే మృతిచెందాడని ఆరోపించారు. రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడంతో పాటు అతడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలుకూరు పోలీసులు ఏ తప్పు చేయనప్పుడు రూ.8లక్షలు ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. దళితులు చనిపోతున్నా దళిత మంత్రులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. దళితల కోసం గ్రేహౌండ్స్ తరహా రక్షణ దళం ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
తిరుమల వెళ్లే ప్రయాణికులకు ఊరట
● సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలుకు అదనంగా నాలుగు బోగీలు మిర్యాలగూడ అర్బన్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్–తిరుపతి వెళ్లే వందేభారత్ రైలు ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్ కార్లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడుస్తుండగా.. అదనంగా 4 ఏసీ చైర్ కార్లతో కూడి బోగీలను శాశ్వత ప్రాతిపదికన జతచేయాలని నిర్ణయించారు. దీంతో 20 బోగీలతో పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలులో మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం నుంచి బోగీలను జత చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలపడంతో నల్లగొండ, మిర్యాలగూడ నుంచి నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు ఎంపికనేరేడుచర్ల : జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు నేరేడుచర్లకు చెందిన మచ్చ పరమేశ్ ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్లోని పఠాన్చెరు మైత్రి గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న పరమేశ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి సూర్యాపేట జిల్లా జట్టును రెండో స్థానంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అధికారులు అతడిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. డిసెంబర్ 5 నుంచి 7వరకు జమ్మూ కశ్మీర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పరమేశ్ పాల్గొన్ననున్నట్లు లాక్రోస్ రాష్ట్ర కోచ్ భానుచందర్ తెలిపారు. జాతీయస్థాయి పోలీలకు ఎంపికై న పరమేశ్ను తల్లిదండ్రులు స్వరాజ్యం, రాంబాబుతో పాటు తోటి క్రీడాకారులు, పట్టణ వాసులు అభినందించారు. భార్యతో గొడవపడి యువకుడి బలవన్మరణంహుజూర్నగర్ : బట్టలు కొనే విషయంలో భార్యతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన పిల్లుట్ల నవీన్ (22), మేళ్లచెరువుకు చెందిన పి. త్రిషను ఆరు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరు నవీన్ ఇంటి దగ్గర రెండునెలల పాటు ఉన్నారు. నాలుగు నెలల క్రితం వారు హుజూర్నగర్ పట్టణంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఇటీవల నవీన్ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. మంగళవారం బట్టలు కొనేందుకు దుకాణానికి వెళ్లారు. బట్టలు కొనే క్రమంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో నవీన్ బైక్పై ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత త్రిష ఇంటికి వెళ్లేసరికి నవీన్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించడంతో త్రిష కత్తితో గొంతు కోసుకునే ప్రయత్నం చేసింది. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి నవీన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. త్రిషకు ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్బాబు తెలిపారు. -
రోజుకు రూ.600 వస్తున్నయ్
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాంటా వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరినై. ప్రతి రోజు సుమారు రూ.600ల వరకు కూలి వస్తుంది. ఈ డబ్బలతో ఇంట్లో అవసరాలను తీర్చుకుంటున్నం. – అలివేంద్ర, హమాలీ పెన్పహాడ్కూలి పనులు దొరకక..గ్రామంలో కూలి పనులు దొరకడం లేదు. పనుల్లేక ఇంట్లో ఖాళీగా ఉండి, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను అధిగ మించడం కోసం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసే పనిని ఎంచుకున్నాం. దాంతో రోజు పని లభించడంతో పాటు చేతికి డబ్బు అందుతోంది. – ఒగ్గు నాగమణి, హమాలీ, పెన్పహాడ్ -
869 పల్లెల్లో పోరు
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పల్లె పోరుకు నగారా మోగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. జిల్లాలోని 33 మండలాల్లో 869 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 11న మొదటి విడతలో నల్లగొండ చండూరు రెవెన్యూ డివిజన్లలో, 14న రెండో విడతలో మిర్యాలగూడ, 17న మూడు విడతలో దేవరకొండ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. మొదటి విడతలో 318 పంచాయతీలు డిసెంబరు 11న జరిగే మొదటి విడతలో నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. చిట్యాల, కనగల్, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్, నల్లగొండ, నార్కట్పల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాల పరిధిలో 318 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 29వ తేదీన ముగుస్తుంది. 30వ తేదీన పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీల్కు అవకాశమిచ్చి.. మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 282 పంచాయతీలుడిసెంబరు 14వ తేదీన జరిగే రెండో విడతలో మిర్యాలగూడ మిర్యాలగూడ డివిజన్లోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల పరిధిలో 282 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీన గ్రామాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన చేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన నామినేషన్ల గడువు పూర్తవుతుంది. 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు చెల్లిన నామినేషన్లను ప్రకటించి డిసెంబర్ 4న అప్పీల్కు అవకాశమిచ్చి మరుసటి రోజు వాటిని పరిశీలిస్తారు. డిసెంబరు 6న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 3 గంటల తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 269 పంచాయతీలు డిసెంబరు 17న జరుగనున్న మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి(డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ము, పీఏపల్లి మండలాల పరిధిలో 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికల జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఓటరు జాబితా ప్రకటిస్తారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 5వ తేదీన ముగుస్తుంది. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత చెల్లిన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 7వ తేదీన అప్పీల్కు అవకాశం ఇస్తారు. 8వ తేదీన పరిశీలించి, 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 17వ తేదీన పోలింగ్ జరగనుంది. పంచాయతీలు 869 వార్డులు 7,494మొత్తం ఓటర్లు 10,73,506పురుషులు 5,30,860మహిళలు 5,42,589ట్రాన్స్జెండర్లు 57 పోలింగ్ స్టేషన్లు 7,494ఫ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఫ నల్లగొండ, చండూరు డివిజన్లలో మొదటి విడత ఫ రెండో విడతలో మిర్యాలగూడ, మూడో విడతలో దేవరకొండ డివిజన్లలో ఎన్నికలు ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగంపంచాయతీ ఎన్నికల వివరాలు ఇలా.. డివిజన్ మండలాలు పంచాయతీలు వార్డులు పోలింగ్ తేదీ నల్లగొండ, చండూరు 14 318 2,870 డిసెంబర్ 11న మిర్యాలగూడ 10 282 2,418 డిసెంబర్ 14న దేవరకొండ 09 269 2,206 డిసెంబర్ 17న -
నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
భువనగిరి టౌన్ : డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లికొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భువనగిరిటౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు. అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. తనను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆగస్టు 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ వివరించారు. -
పోచంపల్లికి కర్ణాటక చేనేత కార్మికులు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ వస్త్ర తయారీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 58 మంది చేనేత కార్మికులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్లో మగ్గాలపై తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలు, రంగులద్దకం, చిటికి కట్టడం తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక టెక్స్టైల్ ఇన్స్పెక్టర్ రమేశ్, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ సీనియర్ ఆఫీసర్ దివాకర్బాబు, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు మాట్లాడుతూ.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని మూడు చేనేత సహకార సంఘాలకు చెందిన చేనేత కార్మికులు పోచంపల్లి ఇక్కత్ వస్త్ర తయారీలో అవలంబిస్తున్న టెక్నిక్లను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా చేనేతకు పేరెన్నికగన్న నారాయణపేట, వెంకటగిరి, మధురై, సేలం తదితర ప్రాంతాలను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. -
బీసీలను వంచిస్తున్న ప్రభుత్వాలు
నల్లగొండ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ కల్పించుకుండా బీసీలను వంచిస్తున్నాయని బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు విమర్శించారు. జీఓ 46కు వ్యతిరేకంగా నల్లగొండలోని గడియారం సెంటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పెట్రోల్ను, దిష్టిబొమ్మలను తీసుకెళ్లడంతో జీఓ నంబర్ 46 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ రాహుల్గాంధీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో కేశబోయిన శంకర్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్లా సోమమల్లయ్య, నకిరెకంటి కాశయ్యగౌడ్, కంది సూర్యనారాయణ, చొల్లేటి రమేష్, సాయిబాబా, మధు, గోవర్ధన్, ఆది నారాయణ, భిక్షమయ్య, సర్వయ్య, మల్లయ్య, సుధాకర్, తరుణ్, ప్రవీణ్, రవి పాల్గొన్నారు. పశువైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలిమాడుగులపల్లి : పశువైద్య శిబిరాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్ర రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వికె.శర్మ, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జూలకంటి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని చెరువుపల్లి గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు. 50 పశువులకు గర్భకోశ పరీక్షలు, పలు పశువులకు చూడి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు పాడి రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, పశువైద్యులు రాంరెడ్డి, యశ్వంత్, సందీప్కుమార్, అశోక్, శ్రీకాంత్రెడ్డి, విక్రమ్రెడ్డి, నాగేంద్ర, శ్రవణ్, సాయిరాం, స్వామినాయక్, సంతోష్, తులసీ, పరుశురామ్, సిబ్బంది శ్రీలత, జయమ్మ, రాకేష్, గోపాలమిత్రలు రవి, సూపర్వైజర్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. క్షేత్రపాలకుడికి నాగవళ్లి దళార్చన యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరం పాటు పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. దర్వేశిపురంలో బహిరంగ వేలంకనగల్ : మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి వివిధ వస్తు విక్రయ హక్కులను కల్పించేందుకు మంగళవారం టెండర్ కం బహిరంగ వేలాన్ని నిర్వహించారు. లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దామరచర్లకు చెందిన డి.నెహ్రూ రూ 14,14,141కు దక్కించుకున్నారు. గాజుల అమ్మకం హక్కులను నల్లగొండ పట్టణానికి చెందిన పి.రవికుమార్ రూ.9లక్షల 65 వేలకు, దేవస్థానం ఫంక్షన్ హాల్ నిర్వహణను దర్వేశిపురం గ్రామానికి చెందిన సత్తయ్య రూ.లక్షకు వేలంపాడి హక్కులను దక్కించుకున్నారు. కాగా కిరాణం, బొమ్మలషాపు, ఫొటోలు తీసేందుకు సరైన వేలం రానందున వాయిదా వేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలనాధికారి పి.ఏడుకొండల్, ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, కార్యనిర్వాణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్మకర్తలు శంకర్ రెడ్డి, ప్రభాకర్, బాబు, సైదులు, రమేష్, దుర్గమ్మ, సీనియర్ అసిస్టెంట్లు చంద్రయ్య, నాగేశ్వర్రావు, జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, చనగోని శ్రీకర్గౌడ్, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు మాకొద్దు!
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయకపోవడంతో 139 మంది ఇళ్లను రద్దు చేసి ఇతరులకు అవకాశం ఇచ్చాం. స్థలం సమస్య కారణంగా కూడా కొందరు ఇల్లు వద్దని చెప్పి రాసిచ్చారు. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్నల్లగొండ టూటౌన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పలువురు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సాయం సరిపోయే అవకాశం లేకపోవడం, నిబంధనల కారణంగా కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి విముఖత చూపుతున్నారు. నీలగిరి మున్సిపాలిటీలో 550 ఇళ్లు మంజూరు కాగా.. 139 మంది మాకు ఇల్లు వద్దని రాసిచ్చారు. ఆ ఇళ్లకు ముగ్గు కూడా పోయకపోవడంతో వాటిని రద్దు చేసి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు. 45 వేల దరఖాస్తులు ఇళ్ల నిర్మాణం కోసం నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల నుంచి దాదాపు 45 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో నీలగిరి మున్సిపాలిటీకి 550 ఇళ్లను మంజూరు చేసింది. పట్టణంలో 48 వార్డుల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. 550 మంది లబ్ధిదారుల్లో 139 మంది ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు రాకపోవడం, ముగ్గు కూడా పోయకపోవడంతో మున్సిపల్ అధికారులు వాటిని రద్దు చేశారు. ఆ 139 లబ్ధిదారుల స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించారు. ఆర్థిక స్థోమత లేదని కొందరు.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసినా రాని వారు కొందరు ఉంటే.. అదృవశాత్తు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కొందరు మాకొద్దు అంటున్నారు. కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఇంటి నిర్మాణం చేపడుతుండగా, చేతిలో నయా పైసా లేని వారు ఇంటి నిర్మాణం చేయాలంటే మా దగ్గర పైసలు లేవని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ.10 లక్షల ఖర్చు అవుతుందని లబ్ధిదారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలతో ఇబ్బందులు.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా కొందరికి ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. మున్సిపాలిటీ పరిధిలో కొందరివి గ్రామ కంఠం స్థలాలు కాగా, మరి కొందరికి వక్ఫ్బోర్డు స్థలాలు ఉండడం ప్రభుత్వ నిబంధనలకు అడ్డంకిగా మారింది. ఇక, 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే నిర్మాణం చేపట్టానే నిబంధన కూడా లబ్ధిదారుల అనాసక్తికి కారణంగా తెలుస్తోంది. కాగా ప్రభుత్వం నిబంధనలను సడలించాలని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు.. మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయినట్లు తెలిసింది. ఫ ఇళ్ల నిర్మాణంపై నీలగిరి మున్సిపాలిటీలో లబ్ధిదారుల అనాసక్తి ఫ మాకొద్దని రాసిచ్చిన 139 మంది లబ్ధిదారులు ఫ అసలు ముగ్గు పోయకపోవడంతో ఇతరులకు అవకాశం -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మిర్యాలగూడ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని పలు విత్తనాల దుకాణాలు, ఫర్టిలైజర్స్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. డీలర్లు రైతులకు నాసిరకం విత్తనాలు, పురుగులు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో చలి తీవ్రంగా ఉన్నందున రైతులు విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్.. లక్ష్యానికి దూరం
మార్చి 2026 నాటికి నిర్దేశించిన సాగు లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మొక్కలు నాటాం. మిగతా 4500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. జిల్లాలోని అన్ని సహకార సంఘాల రైతులకు అవగాహన కల్పించాం. చాలామంది రైతులు ఆయిల్పామ్ సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. – కె.సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు లక్ష్యానికి దూరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 14 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ తోటలు సాగు చేశారు. ఈ ఏడాది మరో 6500 ఎకరాల్లో తోటలు సాగు చేయించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలల్లో రెండు వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్పామ్ తోటలు రైతులు సాగు చేశారు. మార్చి నాటికి మిగిలిన 4500 ఎకరాల్లో సాగు చేయించేందుకు గాను ఉద్యానవన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కానీ, నాలుగు నెలల్లో లక్ష్యం చేరుకోవడం అనుమానంగానే ఉంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం.. ప్రస్తుత మార్కెట్లో ఆయిల్పామ్ గెలలకు మంచి గిరాకీ ఉంది. ప్రభుత్వం కూడా తోటల సాగుకు ప్రోత్సాహం ఇస్తోంది. పంట చేతికొచ్చేంత వరకు నాలుగేళ్ల పాటు ఎకరానికి రూ.4,200 ఇస్తుంది. ఎకరానికి 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇందులో రైతు వాటా కేవలం రూ.23 మాత్రమే. మొక్క నాటిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు వస్తుంది. పెద్ద రైతులకు 80 శాతం, చిన్న రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తోంది. దీనిపై ఉద్యానవన శాఖ అవగాహన కల్పిస్తుండటంతో రైతులు తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. టన్ను ధర రూ.20,506.. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్పామ్ గెలలకు టన్నుకు రూ.20,506 ధర పలుకుతుంది. పతంజలి సంస్థ జిల్లాలో ఆయిల్పామ్ గెలలను కొనడానికి అనుముల, త్రిపురారం మండలం ముకుందాపురం, నిడమనూరు మండలం ముప్పారం, మాడ్గులపల్లి మండలం కుక్కడం, నల్లగొండ మండలం చందనపల్లి గ్రామాల్లో ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా ఆయా కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఫ ఈ ఏడాది 6500 ఎకరాల్లో సాగు లక్ష్యం ఫ ఎనిమిది నెలల్లో రెండు వేల ఎకరాల్లోనే సాగు ఫ మార్చి చివరి నాటికి లక్ష్యం చేరడం అనుమానమే.. ఫ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పడని అడుగు పతంజలి సంస్థ జిల్లాలో ఆయిల్పామ్ ప్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో ప్యాక్టరీ నిర్మాణం కోసం 26 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసింది. ప్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని ఏడాది నుంచి ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా చేయలేదు. సీఎం రేవంత్రెడ్డి, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్బాబా సమయం కుదరకపోవడంతో నిర్మాణ పనుల శంకుస్థాపనకు జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
మహిళా సాధికారతతోనే అభివృద్ధి
మిర్యాలగూడ : మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం స్థానిక కళాభారతిలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,689 స్వయం సహాయక సంఘాలకు రూ.10.11 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్తో కలిసి ఆమె అందజేసి మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు ప్రభుత్వాలు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం సంక్షమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అంతకుముందు పట్టణంలోని నైట్ షెల్టర్ను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గూడూరులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ సురేష్కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సెర్ప్, మెప్మా అధికారులు బక్కయ్య, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పాడి రైతులకు త్వరలో బిల్లులు చెల్లిస్తాం
యాదగిరిగుట్ట : మదర్ డెయిరీలో పాడి రైతుల బిల్లులు త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి రైతులంతా క్షమించాలని సంస్థ చైర్మన్ జి. మధుసూదన్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు, మదర్ డెయిరీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టర్ల సమిష్టి నిర్ణయంతోనే మదర్ డెయిరీని ఎన్డీడీబీకి ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించేందుకు ఎన్డీడీబీ సిద్ధంగా ఉండటంతో ఆ బ్యాంక్ అధికారులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాంక్ల నుంచి క్లియరెన్స్ తీసుకొని త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను చెల్లిస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో బ్యాంక్ అధికారులు చెప్పారన్నారు. లోపాలను సరిదిద్దుకుంటూ, మదర్ డెయిరీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ను సబ్సిడీ కింద ఇస్తామన్నారు. మళ్లీ రైతులంతా మదర్ డెయిరీకి పాలు పోయాలని, వారందరికీ 15 రోజులకు ఒకసారి డబ్బులు అకౌంట్లో వేస్తామని ఎన్డీడీబీ హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో కళ్లెపల్లి శ్రీశైలం, గొల్లేపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహ, శ్రీధర్రెడ్డి, సందిళ్ల భాస్కర్గౌడ్, మండలి జంగయ్య, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, కస్తూరి పాండు, రంగారెడ్డి, బి.నరేందర్రెడ్డి పాల్గొన్నారు. మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి -
ప్రభుత్వ పాఠశాలలో చెట్లు నరికివేత
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అక్కలాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ చెట్లను గుట్టు చప్పుడు కాకుండా కొట్టివేశారు. సుమారు 10 చెట్లకు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చెట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చెట్లను సదరు వ్యాపారి సెలవురోజున నరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. చెట్లను తొలగించడంపై గ్రామానికి చెందిన కొందరు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఈఓ భిక్షపతి, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఈఓ భిక్షపతి వివరణ కోరగా.. అక్కలాయిగూడెం పాఠశాలలో చెట్లు నరికేసి అమ్ముకున్నారని ఫిర్యాదు అందిన మాట వాస్తవమే అన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయడానికి నార్కట్పల్లి ప్రధానోయపాధ్యాయుడిని విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. రూ. 30వేలు జరిమానా అక్కలాయగూడెం పాఠశాలలో అక్రమంగా చెట్లను నరికేసిన కాంట్రాక్టర్ఫై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులు పాఠశాలను సందర్శించి విచారించారు. చెట్లను కొట్టి తీసుకుపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రూ.30,300 చలానా కట్టించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.ఫ కలెక్టర్, డీఈఓకు గ్రామస్తుల ఫిర్యాదు ఫ కాంట్రాక్టర్కు జరిమానా విధించిన అటవీశాఖ అధికారులు -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 33 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు చట్ట పరంగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. దేవరకొండ డీఎస్పీగా శ్రీనివాస్రావుదేవరకొండ : దేవర కొండ డీఎస్పీగా ఎంవీ శ్రీనివాస్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్ర స్తుతం ఇక్కడ పని చేస్తున్న ఏఎస్పీ పి.మౌనిక ఆదిలా బాద్కు బదిలీ కాగా రాచకొండ మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏఎస్పీగా పని చేస్తున్న ఎంవీ శ్రీనివాస్రావు దేవరకొండ డీఎస్పీగా బదిలీపై వచ్చారు. 30వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ నల్లగొండ : ఆసరా పింఛన్లను ఈ నెల 30 తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాపీస్లలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని సూచించారు. క్షయ రోగులను గుర్తించాలినల్లగొండ టౌన్ : క్షయ రోగులను గుర్తించి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ సూచించారు. సోమవారం నల్లగొండలోని టీఎన్జీవో భవన్లో పీహెచ్సీల వైద్యదులు,క సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెపటైటిస్ వ్యాధికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు కూడా పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. టీబీ నివారణలో భాగంగా పోలీసులకు ఎక్స్రేలు చేయించాలని సూచించారు. గర్భిణులకు సేవలందించడంలో వెనుకబడిన పీహెచ్సీలకు మెమోలు జారీ చేశారు. సమావేశంలో డాక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, కృష్ణకుమారి, అరుందతి, పద్మ, తిరుపతిరావు పాల్గొన్నారు. తూకాల్లో మోసాలకు పాల్పడొద్దు వేములపల్లి : ధాన్యం కాంటాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వి.శ్రీనివాసులు అన్నారు. సోమవారం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో రైస్ మిల్లుల వద్ద గల శాంతి వేబ్రిడ్జి, శ్రీరామ వేబ్రిడ్జిలతోపాటు శ్రీలక్ష్మీరైస్ మిల్లుల్లోని వేబ్రిడ్జిలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. తూకాల విషయంలో రైతులను మోసగిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామన్నారు. రైతులు తమ ధాన్యం తూకాల్లో ఏమైనా అవకతవకలు జరిగితే తమకు ఫిర్యాదు చేస్తే వేబ్రిడ్జిలను తనిఖీ చేస్తామని.. మోసాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వర్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యతా శిబిరానికి వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనే వలంటీర్లను సోమవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన వలంటీర్లకు భాషా పరిజ్ఞానం, కమ్యునికేషన్ స్కిల్స్, సాంస్కృతిక అంశాలపై ఎన్ఎస్ఎస్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపిక చేశారు. ఇక్కడ ఎంపికై న వారు ఈనెల 28న హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరానికి హాజరుకానున్నట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి తెలిపారు. ఎంపికై న వారిని యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, చాంద్పాషా, ఆనంద్, కవిత, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్టీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని టీఆర్టీఎఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో టీఆర్టీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా తంతెనపల్లి సైదులు వ్యవహరించగా, జిల్లా అధ్యక్షుడిగా నిమ్మనగోటి జనార్దన్, కార్యదర్శిగా తరాల పరమేశ్యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నిబంధనను సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. టెట్ అంశంపై డిసెంబర్ 11న న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్టీఎఫ్ అసోసియేట్ ప్రెసిడెంట్ అర్రూరి జానయ్య, బెజవాడ సూర్యనారాయణ, దొడ్డేని సాయిబాబు, ముప్పిడి మల్లయ్య, గడ్డం జానకిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
● జిల్లాకు అత్యధికంగా రూ.26.34 కోట్లు కేటాయింపు ● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ ● పాల్గొననున్న ప్రజాప్రతినిధులునల్లగొండ : స్వయం సహాయక సంఘాల మహిళలు పలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక సాధికారత సాధించేలా ప్రభుత్వం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం రూ.66.78 కోట్లు వడ్డీ లేని రుణాలను అందించింది. 2023–24 సంవత్సరంలో 21,235 సంఘాలకు రూ.19.06 కోట్లు, 2024–25లో 20,501 సంఘాలకు రూ.21.34 కోట్లు, 2024–25లో 22,997 సంఘాలకు రూ.26.37 కోట్ల వడ్డీలేని రుణాలు అందించింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.26.34 కోట్ల వడ్డీ లేని రుణాలను జిల్లాకు కేటాయించింది. ఈ రుణాలను ఆయా నియోజవర్గ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మంగళవారం నుంచి పంపిణీ చేయనుంది. ఎమ్మెల్యేల చేతులమీదుగా..వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాసనసభ్యులు అధ్యక్షత వహిస్తారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నకిరేకల్లోని శకుంతల ఫంక్షన్హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు, మిర్యాలగూడలో ఎన్ఎస్పీ క్యాంపులోని కళావేదికలో ఉదయం 10 గంటలకు, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించి హాలియాలోని చైతన్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు, దేవరకొండలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు. -
పత్తిపై పరిమితి ఎత్తివేత
ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు సీసీఐ అంగీకారంమునుగోడు : పత్తి రైతులకు కొంత ఊరట లభించింది. సీసీఐలో గతేడాది ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిన అధికారులు ఈ ఏడాది 7 క్వింటాళ్లకు కుదించారు. కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుమతి చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పత్తి సాగుచేసిన రైతులు ఆందోళన చెందారు. ఈ విషయంపై పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు రైతులు, జిన్నింగ్ మిల్లు యజమానులు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు సమ్మతించిన కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా కపాస్ కిసాన్ యాప్లో అనుమతి ఇచ్చింది. కానీ గతంలో మాదిరిగా రైతులు నేరుగా అమ్ముకునేందుకు వీల్లేకుండా అధిక దిగుబడి వచ్చినట్లు ఏఈఓ ధ్రువీకరిస్తేనే ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా నిబంధన విధించింది. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 33 మండలాలల్లో ఈ ఏడాది మొత్తం 12 లక్షల 148 ఎకరాలల్లో వివిధ పంటలు సాగుచేయగా అందులో అత్యధికంగా 5,38,085 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే మొదట వ్యవసాయ అధికారులు ఎకరానికి సగటున 8 క్వింటాళ్ల దిగుబడి చొప్పున 43,04,680 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ ఈ ఏడాది అకాల వర్షాలు కురవడంతో పంటకు తెగుళ్ల సోకి ఎకరాకు ఒకటి, రెండు క్వింటాళ్లు తగ్గుతుందని అంచనా వేశారు. అయితే వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం ఎర్ర నేలలు, చౌవుడు నేలల్లో సాగుచేసిన పంట మాత్రం తక్కువ దిగుబడి వచ్చింది. నల్లరేగడి భూముల్లో సాగుచేసిన పంట అధికారుల అంచనా కంటే అధికంగా ఎకరానికి 10 క్వింటాళ్ల నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు సీసీఐలో అమ్ముకోవాలనుకునే రైతులు తమ పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్కార్డు జతచేసి ఏఈఓకి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ఏఈఓ ఆ రైతు భూమి వద్దకు వెళ్లి నిజంగా ఎంత దిగుబడి వచ్చిందో నిర్ధారిస్తారు. ఆ తరువాత కపాస్ కిసాన్ యాప్లో ఆ రైతు పేరుతో అదనంగా ఎంత దిగుబడి వస్తే అంతా (7 నుంచి 12 క్వింటాళ్లలోపు) నమోదు చేస్తాడు. ఆ సమయంలో ఆ రైతు ఆధార్కార్డుకు లింకు ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పితే ఆ రైతు పేరుమీద ఏఈఓ ఎంత నమోదు చేస్తే అంత అప్లోడ్ అవుతుంది. ఆ తరువాత రైతు తమ పత్తి అమ్ముకునేందుకు కపాస్ కిసాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇలా మునుగోడు మండలంలో దాదాపు 100 మందికిపైగా రైతులు ఏఈఓల వద్ద ధ్రువీకరణ పొంది తమ పత్తి దిగుమతి పెంచుకున్నారు. ఈ విషయం తెలిసినా మరి కొంత మంది రైతులు ఆనందం వ్యక్తంచేస్తూ తమ పంట దిగుబడి పెంచుకునేందుకు ఏఈఓలను ఆశ్రయిస్తున్నారు. ఫ ఏఈఓ ధ్రువీకరించాలని నిబంధన ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు -
గ్రీవెన్స్లో భూ సమస్యల గోడు
నల్లగొండ : గ్రీవెన్స్లో భూ సమస్యలపైనే దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. తమ పిల్లలు భూములు పట్టా చేసుకుని తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు.. పిల్లలు భూమి రిజిస్ట్రేషన్ చేయాలని వేధిస్తున్నారని మరి కొందరు తల్లిదండ్రులు కలెక్టకు విన్నవించారు. వీటితోపాటు భూమి పట్టా కాలేదని, పాస్ పుస్తకంలో ఎక్కలేదని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల కోసం పలువురు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్.. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిని పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. నాకు ఇద్దరు కొడుకులు. నాకున్న 14 ఎకరాల్లో చెరి ఐదెకరాల చొప్పున పట్టా చేశాను. 4 ఎకరాలు నా పేరున ఉంది. నా చిన్న కొడుకు శ్రీనివాస్రెడ్డి ఊరిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. అతను ఆ 4 ఎకరాలు పట్టా చేయమని ఒత్తిడి చేస్తుండు. పొలాన్ని కౌలుకు ఇవ్వనీయకుండా పడావు పెట్టాడు. నా తదనంతరం ఇద్దరు కొడుకులు పంచుకోవచ్చు. ఆ భూమి నేను ఇప్పుడు వారికి ఇవ్వను.. నాకు న్యాయం చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ కొడుకుతో మాట్లాడి అవసరమైతే కేసు పెట్టాలని ఐసీడీఎస్ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి నాగిరెడ్డిని ఆదేశించారు. – కంచర్ల సుగుణమ్మ, ఉట్లపల్లి, మిర్యాలగూడ మండలం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్కు విన్నవించిన వృద్ధులు -
రుణాలు పంపిణీ చేస్తాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠినల్లగొండ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 3.66 లక్షల ఇందిరా మహిళా శక్తి చీరలు వచ్చాయని.. 3 లక్షల పంపిణీ చేసామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ఫ పీవీ విగ్రహావిష్కరణ
నల్లగొండ : న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, చిన్నచిన్న వ్యక్తిగత సమస్యల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించ గలిగే అవకాశం ఉందన్నారు. కోర్టుల్లో పెరిగిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందన్నారు. మధ్యవర్తితం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. న్యాయవాదులు ఐదు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్కు ఎంజీ యూనివర్సిటీలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై. అశోక్రెడ్డి బోకేలు అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్టర్ సీహెచ్.పంచాక్షరి, జిల్లా జడ్జి కవిత, యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు, పురుషోత్తం, అనంతరెడ్డి, నాంపల్లి నరసింహ, న్యాయవాదులు పాల్గొన్నారు.మధ్యవర్తిత్వం.. కేసుల భారం తగ్గిస్తుందిఇసుక మరింత ప్రియంప్రభుత్వం నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. కానీ, ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన ఇసుక దొరకక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో రూ.3 వేలకు దొరకే ఇసుక ఇప్పుడు రూ.7వేలకు పైగా చేరింది. అది కూడా చాలా ఇబ్బందులు పడి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇసుక ధర పెరగడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందించాలి. – సయ్యద్ గౌస్, శెట్టిపాలెం, వేములపల్లి మండలంఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి ఇసుక రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశాం. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తుంది. ఇసుక ధర రెట్టింపు కావడం, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సా యంలో పెద్ద మొత్తం ఇసుక కోసం ఖర్చు చే యాల్సి వస్తోంది. సాండ్ బజార్లో ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే నాలుగు టన్నులకు రూ.4వేలు, ఆ ట్రాక్టర్ రవాణా ఖర్చు దూ రాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరగడంతోపాటు వారు చెప్పినంత ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్ ఇసుకకు సుమారు రూ.7వేలకు పైగా అవుతోంది.మిర్యాలగూడ : ఇసుక సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. గతంలో తక్కువ ధరకు దొరికిన ఇసుక.. ఇప్పుడు రెట్టింపు అయ్యింది. గతంలో రీచ్ల నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా చేసేవారు. దానికి తోడు మిర్యాలగూడలో సాండ్ బజార్ కూడా అందుబాటులో ఉండడంతో ఇసుక కొరత తీరుతుందని ప్రజలు భావించారు. కానీ, ఇసుక దందా చేసే వారు దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా రవాణా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలలోపు ఉండగా.. ఇప్పుడు రూ.5 వేలకు పైగా దాటింది. పైగా రవాణా ఖర్చులను కూడా వినియోగదారులు భరించాల్సి ఉండడంతో అదనంగా మరో రూ.2వేల మేర ఖర్చవుతుండడంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.7వేలకు చేరింది. ఇసుక ధర పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సాండ్ బజార్కు చేరకుండా పక్కదారి అక్రమ రవాణాను అరికట్టి ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలని భావించి మిర్యాగూడలో సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. వినియోగదారులు.. వారికి అవసరమైన ఇసుక ఇక్కడి నుంచి కొనుగోలు చేయాలని అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వంగమర్తి నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా మిర్యాలగూడకు తరలించి సాండ్ బజార్లో డంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుగోలు చేసి.. సొంత రవాణా ఖర్చులతో ఇసుకను తీసుకెళ్లాలి. కానీ వంగమర్తి నుంచి వచ్చే ఇసుక టిప్పర్లు రాత్రికి రాత్రే ప్రైవేట్ స్థలాలకు తరలించి అక్కడ డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా దళారులు అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. తాజాగా గురువారం రాత్రి మూడు టిప్పర్లు సుమారు 180 టన్నుల ఇసుకను పట్టణ శివారులోని రవీంద్రనగర్ కాలనీ వద్ద డంపింగ్ చేసినట్లు సమాచారం. శుక్రవారం కూడా మరో మూడు టిప్పర్లు ద్వారా ఇసుకను ప్రైవేట్ స్థలంలో డంపింగ్ చేసినట్లు తెలిసింది. వారం రోజులుగా ఇసుక పక్కదారి పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ఆంధ్రా నుంచి కూడా మిర్యాలగూడకు ఇసుకను తరలిస్తున్నారు. ఈనెల 13 నుంచి 19వ తేదీలోపు ఏడు లారీలను వాడపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. మఠంపల్లి ప్రాంతంలో నుంచి కూడా అక్రమంగా ఇసుకను జిల్లాలో డంపింగ్ చేస్తున్నారు. అధిక రేటుకు విక్రయం ఇసుక రీచ్ల ద్వారా బుకింగ్ చేసుకుంటే మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడు, వేములపల్లి మండలంలోని రావులపెంట, కామేపల్లి రీచ్ల నుంచి ఇసుక సరఫరా అయ్యేది. ఈ ప్రాంతాల నుంచి ఇసుకను కొనుగోలు చేస్తే ట్రాక్టర్ ఇసుక రూ.3వేల లోపు మూడున్నర టన్నుల ఇసుక అందేది. కానీ సాండ్ బజార్లో సాధారణంగా అయితే టన్ను రూ.1300 నాలుగు టన్నులకు రూ.5200, ఇందిరమ్మ ఇళ్లకు రూ.1000 చొప్పున రూ.4వేలు ధర పడుతుంది. రవాణా చార్జీలు అదనం. దూరాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు దళారులు ఇందిరమ్మ ఇళ్ల పేరిట అధికారుల చేతులు తడిపి అనుమతులు తెచ్చుకుని అధిక ధరలకు అక్రమంగా అమ్ముతున్నారు. వంగమర్తి నుంచి వచ్చే ఇసుక ఒక టిప్పర్ సుమారు 50టన్నుల నుంచి 60టన్నులు వస్తుంది. ఆ ఇసుకను సాండ్ బజార్లో డంపింగ్ చేయాలి. కానీ వారం రోజులుగా ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ దళారులు టన్ను రూ.1900 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 4టన్నులు అయితే రూ.7600కు అమ్ముతున్నారు. పైగా రవాణా చార్జీల వేరుగా వసూలు చేస్తున్నారు. వాడపల్లి వద్ద పట్టుబడిన ఇసుక లారీలు, రవీంద్రనగర్ శివారులో అక్రమంగా డంప్ చేసిన ఇసుక ఫ మిర్యాలగూడలో 4 టన్నులకు రూ.7 వేల పైనే.. ఫ సాండ్ బజార్ పేరుతో ప్రైవేట్ స్థలాల్లో డంపింగ్ ఫ ఆంధ్రా నుంచి కూడా అక్రమంగా రవాణా ఫ అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న దళారులు ఫ ఆందోళనలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫ హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ -
బీసీలకు భారీగా కోత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను భారీగా దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయాయి. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలంతా ఆయా వివరాలను ఆర్డీఓలకు అందించగా, ఆర్డీఓలు వాటిని ఫైనల్ చేసి కలెక్టర్కు పంపారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారు. అయితే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో బీసీ రిజర్వేషన్లలో భారీగా కోత పడింది. 2019 సంవత్సరంలో బీసీలకు 164 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా.. ఆదివారం చేసిన రిజర్వేషన్లో కేవలం 140 స్థానాలే దక్కాయి. 2019తో పోల్చుకుంటే 24 స్థానాలు తగ్గిపోయాయి. ఇక ఎస్సీలకు 153 స్థానాలు రిజర్వు కాగా, ఎస్టీలకు 192 స్థానాలు, అన్రిజర్వుడులో 384 స్థానాలు ఉన్నాయి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సంగతి దేవుడెరుగు.. పాత రిజర్వేషన్ పద్ధతిలో అమలు చేయడం, రొటేషన్లో రిజర్వేషన్ కల్పించడంతో బీసీ సీట్లకు భారీగా కోత పడింది. అన్నీ సిద్ధం చేసిన అధికారులు గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినందున ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిపికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాతో పాటు బ్యాలెట్ పేపర్లు, బ్యాలెటు బాక్సులు తెప్పించి సిద్ధంగా ఉంచుకున్నారు. పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు ఫ రొటేషన్ పద్ధతి అమలుతో బీసీలకు తగ్గిన స్థానాలు ఫ బీసీలకు 2019 ఎన్నికల్లో 164.. ఇప్పుడు 140 స్థానాలే.. ఫ ఎస్సీలకు 153, ఎస్టీలకు 192 స్థానాలు రిజర్వ్ ఫ అన్ రిజర్వుడ్లో 384 పంచాయతీలు ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల సర్పంచ్ రిజర్వేషన్లను గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. పాత రిజర్వేషన్లనే యథావిధిగా అమలు చేశారు. బీసీ రిజర్వేషన్లను డెడ్కేటెడ్ కమిషన్ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. సెప్టెంబరు నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 310 స్థానాలను కేటాయించారు. ఇప్పుడు కేవలం 140 స్థానాలే బీసీలకు దక్కాయి. రొటేషన్ పద్ధతి వల్లే బీసీలకు సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగింది. మండలాల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు ఇలా.. మండలం ఎస్సీ ఎస్టీ బీసీ అన్రిజర్వుడ్ మొత్తం మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ నల్లగొండ 4 4 0 0 3 4 8 8 31 కనగల్ 3 3 0 1 4 4 8 8 31 తిప్పర్తి 3 3 0 0 4 4 6 6 26 నకిరేకల్ 2 2 0 0 1 2 5 5 17 కట్టంగూర్ 2 3 0 0 3 3 5 6 22 శాలిగౌరారం 3 3 0 0 3 3 6 6 24 కేతేపల్లి 2 2 0 0 2 2 4 4 16 నార్కట్పల్లి 3 4 0 0 3 4 7 8 29 చిట్యాల 1 2 0 0 3 3 4 5 18 అనుముల 2 3 1 1 2 3 6 6 24 పెద్దవూర 2 2 4 5 1 2 6 6 28 తిరుమలగిరిసాగర్ 1 2 10 10 0 1 5 6 35 త్రిపురారం 2 3 4 5 1 2 7 8 32 గుర్రంపోడు 4 4 1 1 5 5 9 9 38 నిడమనూరు 3 3 0 1 3 4 7 8 29 మిర్యాలగూడ 4 4 7 8 1 2 10 10 46 వేములపల్లి 1 2 0 0 1 2 3 3 12 మాడుగులపల్లి 2 2 1 2 3 4 7 7 28 అడవిదేవులపల్లి 0 0 3 3 0 0 3 4 13 దామరచర్ల 2 2 7 8 0 0 8 8 35 చండూరు 2 2 0 0 2 3 5 5 19 మునుగోడు 3 3 0 0 4 4 7 7 28 గట్టుప్పల్ 0 1 0 0 1 1 2 2 7 నాంపల్లి 3 4 2 3 3 3 7 7 32 మర్రిగూడ 1 2 1 1 2 2 4 5 18 దేవరకొండ 2 3 10 11 1 1 6 7 41 డిండి 3 4 8 8 1 1 7 7 39 పీఏపల్లి 1 2 4 6 1 2 4 5 25 గుడిపల్లి 1 2 1 1 0 1 3 3 12 కొండమల్లేపల్లి 1 2 7 8 1 1 3 4 27 చింతపల్లి 3 3 4 5 3 4 7 7 36 చందంపేట 2 2 7 8 0 1 5 5 30 నేరెడుగొమ్ము 1 1 6 8 0 0 2 3 21 మొత్తం 69 84 88 104 62 78 186 198 869జిల్లాలో 869 గ్రామ పంచాయతీలుండగా, వాటిల్లో 384 పంచాయతీలను అన్రిజర్వుడ్గా ఉంచగా.. మహిళకు 186, జనరల్కు 198 స్థానాలు కేటాయించారు. బీసీలకు 140 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 62, జనరల్కు 78 స్థానాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరికి 153 స్థానాలను రిజర్వు చేయగా, అందులో మహిళలకు 69, జనరల్కు 84 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరిలో 192 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 88 జనరల్కు 104 స్థానాలను రిజర్వు చేశారు. -
నాకు అన్యాయం చేశారు
నల్లగొండ : కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పని చేసినా పదవులు ఇచ్చే సమయంలో నాకు అన్యాయం చేశారని ఆ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి అన్నారు. 22 ఏళ్లుగా పార్టీలో ఉంటూ.. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా పని చేస్తున్నానని డీసీసీ అధ్యక్ష పదవికి నా సామాజిక వర్గమే నాకు అడ్డయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశానని.. ఎస్సీనో, బీసీనో అయితే నాకు పదవి వచ్చేదన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో 70 శాతానికి పైగా కార్యకర్తలు తనకు ఇవ్వాలని చెప్పారని.. కానీ అవకాశం రాలేదన్నారు. అభిప్రాయ సేకరణ కాకుండా నేరుగా డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే బాగుండేదన్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పున్న కైలాష్కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి నష్టం చేయాలనుకునే వారికి వెంటపెట్టుకుని తిప్పితే చూస్తూ ఊరుకోమన్నారు. కార్యకర్తను కాపాడుకున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశానని.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నమ్మకం ఉండేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడితే తాను వారికి అండగా ఉండి కాపాడుకున్నానని చెప్పారు. ఆ సమయంలో నల్లగొండ మున్సిపాలిటీలో బుర్రి శ్రీనివాస్రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి 20 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ తరఫున గెలుచుకున్నమన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిపై తనకు విజన్ ఉందని.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనేది తన ఆలోచన అన్నారు. 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ ఇప్పించవచ్చు.. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు ,నాయకులు అనుకుంటే తనకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ పదవి ఇప్పించవచ్చన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా అడ్డం వచ్చిన తన సామాజిక వర్గం.. కార్పొరేషన్ పదవికి అడ్డుకాదన్నారు. జిల్లా నాయకులంతా కలిసి తనకు కార్పొరేషన్ పదవి వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించా ఫ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించాలి ఫ కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాకు వస్తే తాను కార్యకర్తలను తీసుకుని పాదయాత్రలో వెంట నడిచానన్నారు. ‘అప్పుడు నా భుజాన చేయి వేసిన రేవంత్రెడ్డి నేడు నా గొంతు కోస్తాడని అనుకోలేదని’ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్నోళ్లకే పదవులు వస్తున్నాయని, చామల కిరణ్కుమార్రెడ్డి, రఘువీర్ ఎంపీలు అయ్యారని తెలిపారు. తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో కార్యకర్తలు తీసుకుని పాల్గొన్నానని చెప్పారు. ‘మా నాన్న ఎంపీ, ఎమ్మెల్యే అయి ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యే వాడిని.. మా నాన్న పార్టీలో కార్యకర్తగా పని చేశాడు’ అని మోహన్రెడ్డి చెప్పారు. పదవుల కోసం కాళ్లు మొక్కడం, బ్లాక్మెయిల్ చేయడం తనకు అలవాటు లేదన్నారు. -
క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం
నల్లగొండ టూటౌన్ : కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ రాష్ట్రస్థాయి చెస్ పోటీల పోస్టర్ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ మారం గోనారెడ్డి, కార్యదర్శి కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 20న ప్రతీక్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా చెస్ అసోసియేషన్, ప్రతీక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 20, 21 తేదీల్లో చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలకు రూ.50,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు.వివరాలకు 99854 23823 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు
నల్లగొండ టౌన్ : ప్రైవేట్ జీఎన్ఎం(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్సైట్ dme.tealnga na.gov.inలో చూసుకోవచ్చని సూచించారు. దర్వేశిపురం వద్ద 25న బహిరంగ వేలంకనగల్ : మండలంలోని దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ వస్తు విక్రయ హక్కులను ఏడాది కాలానికి (2026) కల్పించేందుకు ఈనెల 25న టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లడ్డూ, పులిహోరకు రూ.2 లక్షలు, గాజుల అమ్మకానికి రూ.1 లక్ష, బొమ్మలు, కిరాణ సామగ్రి అమ్మకానికి రూ.50 వేలు, ఆలయ ఫంక్షన్ హాల్ నిర్వహణకు రూ.50 వేలు, దేవస్థానం వద్ద ఫొటోలు తీసేందుకు రూ.20 వేల చొప్పున డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. 25వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు డీడీని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలని పేర్కొన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలికొండమల్లేపల్లి : పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లక్ష్మీ ప్రభ సూచించారు. శనివారం స్థానిక శ్రీ క్రాంతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమయానుకూలంగా పరీక్ష పత్రాలను డౌన్లోడ్ చేసుకొని నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట సిట్టింగ్ స్క్వాడ్ సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ గుంటోజు ఆంజనేయులు, ఏఓ యర్రమాద గోవర్దన్రెడ్డి, నరేంద్రచారి తదితరులున్నారు. ఎన్జీ కళాశాలలో రక్తదానంరామగిరి (నల్లగొండ): ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 బెటాలియన్ పోలీసులు, ఎన్సీసీ కేడెట్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మేజర్ మాధవరావు, కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సమన్వయకర్త చిలుముల సుధాకర్, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలి నల్లగొండ టౌన్: బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆయన నల్లగొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల, రాజకీయ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్, బీజేపీలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలన్నారు. లేని పక్షంలో వాటిని బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చీర పంకజ్ యాదవ్, కొలగాని పర్వతాలు, వెంకటాచారి, చెన్నయ్య, మిర్యాల యాదగిరి, అయితగోని జనార్దన్గౌడ్, అబ్దుల్ ఖదీర్, గజ్జి అజయ్ యాదవ్, మార్గం సతీష్, చిలకరాజు సతీశ్కుమార్, వడ్డెబోయిన రామకృష్ణ, చెన్నూరి భరద్వాజ్ యాదవ్, అనంత నాగరాజుగౌడ్, గడగోజు విజయ్, కర్నాటి యాదగిరి, తలారి యాదగిరి, పగిల్ల సైదులు, సతీశ్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
మహిళలందరికీ చీరలు ఇస్తాం
నల్లగొండ : మహిళల ఆత్మగౌరవానికి తగ్గట్టుగా అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చీరలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గమంతా చీరల డిజైన్కు ఏడాది పాటు ఆలోచించి నాణ్యమైన చీరలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి చీరలు అవసరముంటే ఇప్పటికే 65 లక్షల చీరలు వచ్చాయన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు పంపిణీ చేస్తున్నారని, మిగతా చీరలు రాగానే పట్టణ మహిళలకు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా డీఆర్డీఏ ద్వారా మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తునానమన్నారు. నల్లగొండ జీజీహెచ్, మెడికల్ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశామని, ప్రతినెలా 800 ప్రసవాలతో పాటు అత్యాధునిక శస్త్ర చికిత్సలు కూడా చేస్తున్నామని తెలిపారు. మహిళల నైపుణ్యాభివృద్ధికి న్యాక్ ద్వారా భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలంతా స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే రుణాలతో ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం.. బస్లు, పెట్రోలు బంక్లు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించిందన్నారు. భవిష్యత్లో రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యత కూడా అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలోని మహిళలకు 4.24 లక్షల చీరలు అందించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ పాల్గొన్నారు. ఫ ఏడాది పాటు ఆలోచించి చీరలు డిజైన్ రూపొందించాం ఫ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
డీసీసీ అధ్యక్షుడిగా కై లాష్ నేత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పున్నా కై లాష్ నేత నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు పర్యటించి జిల్లా అధ్యక్షుని నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా పున్నా కై లాష్ నేతను నియమించారు. పార్టీ విధేయుడిగా.. పున్నా కై లాష్కు మొదటి నుంచి పార్టీ విధేయుడిగా పేరుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచరుడిగా పార్టీలో గుర్తింపు లభించింది. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. అయితే అప్పటి పరిణామాల దృష్ట్యా పాల్వాయి స్రవంతికి పార్టీ టికెట్ ఇచ్చింది. 2023లో టికెట్ ఆశించినా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడంతో రాజగోపాల్రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఆ తరువాత భువనగిరి లోక్సభ టికెట్ ఆశించినా అధిష్టానం చామల కిరణ్కుమార్రెడ్డికి ఇచ్చింది. అయితే పార్టీ పరంగా 2014 నుంచి 2022 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా, ఆ తరువాత నుంచి ఇప్పటివరకు టీపీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే పద్మశాలి సామాజికవర్గం నుంచి ఒక్కరే ఉన్న పున్నా కై లాష్కు అధిష్టానం జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించింది. జిల్లా ముఖ్యనేతల అండదండలతోనే ఆయనకు అధ్యక్ష పదవి దక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థి ఉద్యమాల్లో.. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న సమయంలోనే పున్నా కై లాష్ నేత రీసర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థి నేతగా, విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షునిగా, తెలంగాణ జేఏసీ అధికార ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమ సమయంలో ఆయనపై పోలీసులు 153 కేసులు నమోదు చేశారు. 45 రోజులు జైలు జీవితం గడిపారు.సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ సారథ్యంలో, జిల్లాలోని పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్, ముఖ్య నేతల అండదండలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు సహకారం అందిస్తూ, అందరికి అందుబాటులో ఉంటా. రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్తో పాటు నా నియామకానికి సహకరించిన మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీలు రఘువీర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, వీరేశం, జైవీర్రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు. ఫ విధేయతకు పట్టం కట్టిన అధిష్టానం ఫ విద్యార్థి ఉద్యమ నేతగా, సీఎం అనుచరుడిగా గుర్తింపు ఫ జిల్లా ముఖ్య నేతల అండదండలతో అధ్యక్ష పదవి -
స్మార్ట్గా ఆలోచిస్తే మీరే లక్షాధికారి..!
నాగారం : ప్రపంచమంతా ప్రస్తుతం ఏఐ (కృత్రిమ మేథ) దిశగా పయనిస్తోంది. ఇలాంటి తరుణంలో ఏఐ రంగంలో విద్యార్థులు, యువత నుంచి నూతన ఆవిష్కరణలను స్వాగతించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, మై భారత్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా ‘యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహంతోపాటు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఎంపిక విధానం..ప్రాథమిక ఎంపిక, ప్రాజెక్టును మెరుగుపర్చడం, ముఖాముఖి ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరిలో జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్లో సదరు ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. నిపుణుల పరిశీలనలో ఎంపికై న ప్రాజెక్టును ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది. విజేతలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఢిల్లీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఏఐ నిపుణుల కార్యశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వీరే అర్హులు..● యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొనేందుకు 13 నుంచి 21ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ● ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివేవారు అర్హులు. ● ఒకరు లేదా ఇద్దరు బృందంగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. నగదు బహుమతులుఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.15 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన మూడు బృందాలకు రూ.10లక్షలు, ప్రత్యే బహుమతి కింద రెండు బృందాలకు రూ.5లక్షల చొప్పున అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 వరకు https:/impact.indiaai.gov.in/eventsyuvaai వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.రూపొందించాల్సిన ప్రాజెక్టులు..ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు, పరిజ్ఞానం, సృజనాత్మకత ఆలోచనలు, బాధ్యతాయుత వినియోగ పద్ధతులకు సంబంధించిన ఆలోచనలకు నిర్వాహకులు అధిక ప్రాధాన్యమిస్తారు. సామాజిక సాధి కారత, ప్రాథమిక రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా), స్మార్ట్ ఎకో సిస్టం, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు, ఓపెన్ ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించాలి. విద్యార్థుల నుంచి నూతన ఆవిష్కరణలను స్వాగతిస్తున్న కేంద్రం ఎంపికై న వారికి మెరుగైన అవకాశాలు ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం -
వైభవంగా గంధం ఊరేగింపు
అర్వపల్లి: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి శివారులో ఉన్న హజ్రత్ సయ్యద్ ఖాజ నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. రాత్రి అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు నిర్వహించారు. వక్ఫ్బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ కార్యదర్శి అమీర్హైమద్, నాగారం, తుంగతుర్తి సీఐలు నాగేశ్వరరావు, నర్సింహారావు, కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి మధుకర్రెడ్డి, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఎస్కే.మహమూద్, మహ్మద్ హుస్సేన్, స్థానిక ఎస్ఐ ఈట సైదులు, ముజావర్ అలీలు గంధం పాత్రలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వై జంక్షన్ వరకు వచ్చారు. ఊరేగింపునకు ముందు ఫకీర్లు జరబ్ నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చారు. తొలిరోజు ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద విధ రకాల దుకాణాలు వెలిశాయి. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ పాలెల్లి సురేష్, సాయిని మనోహర్, వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు ఉర్సు సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో నాగారం సీఐ నాగేశ్వరరావు, స్థానిక ఎస్ఐ ఈట సైదులు ఆధ్వర్యంలో డివిజన్న్పరిధిలోని ఎస్ఐలు, 100మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గా వద్ద రిటైర్డు ఎస్ఐ అబ్ధుల్ హమీద్ కుమారుడు మహ్మద్ హుస్సేన్ 2,500 మంది భక్తులకు అన్నదానం చేశారు. అర్వపల్లి దర్గా ఉర్సు ప్రారంభం వేలాదిగా తరలివచ్చిన భక్తులు -
ఎస్ఐ తీరుపై గ్రామస్తుల నిరసన
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి అకారణంగా కాంగ్రెస్ నాయకుడు అన్నెం కరుణాకర్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కాంగ్రెస్ నాయకులతోపాటు స్థానికులు నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అన్నెం కరుణాకర్రెడ్డి స్థానిక రామాలయంలో జరుగుతున్న అయ్యప్పస్వాముల పూజకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి అతడి వాహనాన్ని ఆపి దురుసుగా ప్రవర్తిస్తూ సెల్ఫోన్, బైక్ తాళాలను లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తనకే సమాధానం చెబుతావా అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడని కరుణాకర్రెడ్డి ఆరోపించాడు. స్పందించిన సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు ఎస్ఐ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు కరుణాకర్రెడ్డి తెలిపారు. రహదారిపై కాంగ్రెస్ నాయకులు, స్థానికులు చేస్తున్న ఆందోళనను పోలీసులు నచ్చజెప్పి విరమింపజేశారు. మొదటి నుంచి వివాదాస్పదమే..వాడపల్లి పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్రెడ్డి మొదటి నుంచి వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. గతంలో దామరచర్ల మండలానికి చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును చిన్న పంచాయితీని ఆసరాగా చేసుకుని అకారణంగా స్టేషన్లో విచక్షణ రహితంగా కొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు, హెచ్ఆర్సీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసు విషయంలో సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయినప్పటికీ ఎస్ఐ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాలకు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా..
మోటకొండూర్: ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని తన బైక్పై పాఠశాలకు తీసుకువచ్చిన ఆసక్తికర ఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గఫార్.. కాటేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు రావడం లేదని గమనించి శుక్రవారం వారి ఇళ్లకు వెళ్లాడు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో వారి తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించాడు. అనంతరం విద్యార్థులను తన బైక్పై ప్రార్థనా సమయానికి ముందే పాఠశాలకు తీసుకువచ్చాడు.విద్యార్థులను బైక్పై తీసుకువస్తున్న ప్రధానోపాధ్యాయుడు గఫార్ -
కుట్రతోనే కేటీఆర్పై ఇ–ఫార్ములా కేసు
నకిరేకల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తేందుకు కాంగ్రెస్ పార్టీకి ముఖం లేక కుట్రపూరితంగా కేటీఆర్పై ఇ–ఫార్ములా కేసు తీసుకువచ్చారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. నకిరేకల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్కు ఆదరణ తగ్గుతోందనే కేటీఆర్ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదని.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కనుసైగల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. మంత్రులంతా సీఎం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాలకు తెరలేపిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయరాని తప్పిదాలు చేసిందన్నారు. ఒక వైపు ఎంఐఎంతో, మరోవైపు బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించి రిగ్గింగ్ చేసి బీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గించాలని ప్రయత్నించిందన్నారు. అయినా తమ పార్టీకి ఓట్ల శాతం తగ్గలేదన్నారు. మోదీ, అమిత్షాతో మాట్లాడుకుని, గవర్నర్తో ఒప్పందం చేసుకుని మళ్లీ ఇ–ఫార్ములా కేసును తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కేటీఆర్, హరీష్రావు మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులు చేసినా.. బీఆర్ఎస్ శ్రేణులు చెక్కచెదరరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని విచారణ పేరుతో కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ వీక్ అవుతుందని అనుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచడంలో కేటీఆర్ ఐటీ మంత్రిగా కృషి చేశాడని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, ,మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్నగౌడ్, నాయకులు పెండెం సదానందం, వీరయ్య, పల్లె విజయ్, మల్లయ్య, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా
నాగార్జునసాగర్ : సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే లాంచీ ప్రయాణం వాయిదా పడినట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. టికెట్లు తక్కువగా బుక్ కావడంతో ఈ శనివారం లాంచీ వెళ్లడం లేదని.. తిరిగి ఎప్పుడు వెళ్లేది ప్రకటిస్తామన్నారు. కార్తీక మాసం మొదలై శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూయగానే లాంచీ ప్రయాణం మొదలైతే సుమారుగా మూడు ట్రిప్పులైనా వేసేవారు. పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, ప్రచారం లేకపోవడంతో టికెట్లు బుక్ కాలేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇన్చార్జ్ న్యాయమూర్తిగా రాధాకృష్ణ చౌహాన్హుజూర్నగర్ : హుజూర్నగర్ రెండో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తిగా సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహాన్ శుక్రవారం స్థానిక కోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. తన పరిధిలో కక్షిదారులందరికీ సత్వర న్యాయం అందించడం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.మారుతిప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయోషా షరీన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి, ఉపాధ్యక్షుడు జక్కుల నాగేశ్వరరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ అగ్రికల్చర్ : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నూతన కమిటీని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ పట్టణంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నల్ల శ్రీనివాస్, యేశాల విశ్వకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా చిలుకూరు వెంకటేశం, కోశాధికారిగా పున్నం వేణుగోపాల్ ఎన్నికయ్యారు. నూతన సంఘం పదవీ కాలం మూడేళ్లు ఉండనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. అనంతరం సంఘం సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తిరందాసు యాదగిరి, యాద గిరేందర్, గంజి వెంకటశ్రీనివాస్, పొట్టబత్తుల శ్రీనివాస్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుకట్టంగూర్ : కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కాల్వపాలెం గ్రామానికి చెందిన దంపతులు సీహెచ్ సైదులు–సరిత కట్టంగూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో తమ బంధువుల ఇంటిలో జరిగే దశదిన కర్మకు వచ్చారు. తిరిగి ద్విచక్ర వాహనంపై స్వ గ్రామం వెళుతూ ఎరసానిగూడెం స్టేజీ వద్ద ఉన్న డివైడర్ను దాటుతుండగా కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నం కేసులో యువకుడి రిమాండ్భూదాన్పోచంపల్లి : వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన మహమ్మద్ నవాజ్ అనే యువకుడు పాత కక్షలను మనుసులో పెట్టుకుని సెప్టెంబర్ 19 రాత్రి తన మేన బావమరిది అయిన పోచంపల్లికి చెందిన షేక్ నవీద్ను బీరు సీసాతో పొడిచి చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనలో నవీద్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు నవీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవాజ్పై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటన జరిగిన రోజునుంచి నవాజ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. శుక్రవారం అతడిని పోచంపల్లిలో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రామన్నపేట కోర్డులో రిమాండ్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ ఆదేశాల మేరకు అతడిని నల్లగొండ జైలుకు తరలించారు. -
వాట్సాప్తో మీ సేవలు..
తెగిన విద్యుత్ తీగలు.. తృటిలో తప్పిన ప్రమాదం ఆలేరు: విద్యుత్ తీగలు (ఎల్టీ లైన్) తెగి తృటిలో ప్రమాదం తప్పిన సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరులోని వివేకానంద విగ్రహం వద్దకు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో లారీ ఓవర్లోడ్తో బహుదూర్పేట బైపాస్ మీదుగా వెళుతోంది. మంతపురి మార్గంలోని మైత్రి–సిల్క్నగర్ కాలనీల వద్దకు రాగానే లారీపైన ఉన్న సామగ్రికి రెండు కాలనీల మీదుగా వెళుతున్న విద్యుత్ తీగలు తాకడంతో తీగలు తెగిపోయి కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న కిరాణ దుకాణదారులు, యువకులు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో భయంతో వారు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విద్యుత్ లైన్మెన్ రమేష్ సబ్స్టేషన్లో ఎల్సీ తీసుకుని సంఘటన ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయించాడు. విద్యుత్ తీగల రాపిడితో లారీ లోడ్పైన ఉన్న ప్లాస్టిక్ కవర్కు అంటుకున్న మంటలను స్థానికులు, లారీ డ్రైవర్ ఆర్పివేయడంతో అందరూ ఉపీరి పీల్చుకున్నారు. గంటన్నరపాటు సిల్క్నగర్, మైత్రి కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత తీగలను సరిచేసి ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కొత్త డిజిటల్ సేవలను ఇటీవల ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండానే చేతిలోని మొబైల్ ద్వారా మీ సేవలను పొందవచ్చు. 580 సేవలుమీ సేవ ప్లాట్ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న 580 సేవలు, ఇక వాట్సాప్ చానల్ కిందకు తీసుకొస్తారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్స్ పొందడానికి అవకాశం ఉంది. వీటిని దశలవారీగా పెంచుకుంటూ పూర్తి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. ఆదాయం, కులం, నివాస, జనన, మరణ, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్ల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి, ఆస్తి పన్ను, ఆర్టీఏ, ఆలయాలు, పౌర సరఫరాల సేవలు పొందవచ్చు. మీ సేవ కేంద్రాలు లేనిచోట, గ్రామీణ ప్రాంత ప్రజలకు వాట్సాప్ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. సేవలు ఎలా పొందవచ్చంటే..● స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా సేవలు పొందడం ఎంతో సులభం. ● ముందుగా మొబైల్లో మీ సేవ నంబర్ 8096958096 ను సేవ్ చేసుకోవాలి. ● వాట్సాప్ ఒపెన్ చేసి మీ సేవ వాట్సాప్ నంబర్కు హెచ్ఐ లేదా ఎంఈఎన్యూ(మెనూ) అని టైప్ చేసి సెండ్ చేయాలి. ● మీసేవలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది. ● జాబితా వచ్చిన తర్వాత ఆధార్ ధృవీకరణ ఆప్షన్ వస్తుంది. ● ఆధార్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి. ● దరఖాస్తు ఫారమ్ను ఇంటర్ఫేస్ ద్వారా నింపవచ్చు. ● దరఖాస్తు చేసే సేవకు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వాట్సాప్లో అప్లోడ్ చేయాలి. ● సేవ ఆధారంగా నిర్ణయించిన ఫీజును ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించవచ్చు. ● దరఖాస్తు స్టేటస్, అప్డేట్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు. ● సర్టిఫికెట్, డాక్యుమెంట్ అప్రూవ్ అయితే, దాని డౌన్లోడ్ లింక్ వాట్సాప్కు వస్తుంది. ● అనంతరం దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మీ సేవ’లు సులభతరం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం మొబైల్ ద్వారా సర్టిఫికెట్లు పొందే అవకాశం -
జింక్ లోపం నివారిస్తే అధిక దిగుబడులు
గుర్రంపోడు : యాసంగి వరిసాగుకు సిద్ధమవుతున్న రైతాంగం దుక్కిలో ముందస్తుగా జింక్ సల్ఫేట్ వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యాసంగి వరిలో జింక్ లోపాన్ని నివారించుకుంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. యాసంగి వరి సాగులో ఎక్కువగా ఏర్పడే జింక్ లోప నివారణకు వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సలహాలు ఆయన మాటల్లోనే.. వరిలో జింక్ లోపానికి కారణాలువరిలో జింకు లోపం అధికంగా రావడానికి ముఖ్య కారణం సేంద్రియ ఎరువుల వినియోగం తక్కువగా ఉండడం. వరి సాగుకు ముందు పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను సాగుచేసి నేలలో కలియదున్నుతున్నారు. ఇది మినహా సేంద్రియ ఎరువుల వినియోగం వరిలో అత్యధిక విస్తీర్ణంలో లేనట్లే. వరిలో జింక్ లోపం ఏర్పడడానికి మరో ముఖ్య కారణం వరిసాగు చేసే నేలల్లో చౌడు ఉండడం. చౌడు వల్ల నేలల్లో ఉన్న జింకు.. మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాక.. పైరులో జింకు లోపం ఏర్పడుతుంది. ఈ కారణాలే కాక రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడనప్పుడు, మురుగు నీరు సరిగా బయటకు వెళ్లని నేలల్లో సాగు చేసినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా వరిలో జింకు లోపం కనిపిస్తుంది. దిగుబడులపై ప్రభావంజింకు లోపం ఉంటే ఏ పంటలోనైనా రసాయన ఎరువులు తీసుకునే శక్తి తగ్గిపోయి వేసిన ఎరువులు వృథా అవుతాయి. వరిలో వచ్చే జింకు లోపం పంట పెరుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింకు లోపం ఉన్నప్పుడు నాటిన పైరు అనారోగ్యంగా కనిపిస్తుంది. పిలకలు తక్కువగా ఆలస్యంగా వస్తాయి. అంతేగాక వచ్చిన పిలకలు సరిగా పెరగక పైరు కృశించినట్లు, గిడసబారి కనిపిస్తుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోయి, పైరు కళ తప్పి కనిపిస్తుంది. జింకు లోపం తీవ్రత అధికంగా ఉన్నచోట్ల అడుగు ఆకులు ఎండిపోతాయి. దీంతో దిగుబడులు తగ్గుతాయి. నివారణ చర్యలుజింకులోప నివారణకు పంటకు అవసరమైన పోషకాలను కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పశువుల ఎరువును తప్పనిసరిగా వేయాలి. ఇతర జీవన ఎరువులను కూడా వాడాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడానికి వీలు కానప్పుడు వరి నాటడానికి ముందు ఎకరాకు 20 కిలోల వంతున జింకు సల్ఫేట్ దమ్ములో వేస్తే పైరులో జింకు లోపం నివారించుకోవచ్చు. జింకు సల్ఫేట్ దమ్ములో వేసినప్పుడు భాస్వరపు ఎరువుల్లో కలిపి వేయరాదు. జింకు సల్ఫేట్ వేయడానికి ముందు, తర్వాత రసాయన ఎరువులు వేయడానికి నాలుగు రోజల విరామం ఉండాలి. జింకు సల్ఫేట్ను వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకసారి వేస్తే సరిపోతుంది.వరి నాటిన తర్వాత.. దమ్ములో జింకు సల్ఫేట్ వేయని పొలాల్లో పైరుపై జింకు సల్ఫేట్ పిచికారీ చేసి కూడా జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. వరి నాటిన 20 రోజులకు ఒకసారి, మళ్లీ వారం వ్యవధిలో మరోసారి ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయాలి. పదిహేను రోజుల వ్యవధిలో మరోదఫా ఇదే మోతాదును పిచికారీ చేసుకోవాలి. జింకు సల్ఫేట్ను వరి పొలంలో పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. చౌడు నేలల్లో జింకు సల్ఫేట్ను దమ్ములో వేయడం కంటే రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడం లాభదాయకం. -
చెంచులుగానే గుర్తించాలి
మా కాలనీని కలుపుకొని చెంచువానితండా గ్రామ పంచాయతీ చేశారు. మమ్మల్ని చెంచులుగానే గుర్తించి, హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఇప్పటికై నా మా కాలనీని చెంచుకాలనీగా ప్రత్యేకంగా గుర్తించి, ప్రభుత్వ పథకాలు అందించాలి. – సావుటి వెంకటేశ్వర్లు మా కాలనీలో అంగన్వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి. పథకాలను వర్తింపజేయాలి. మా దరఖాస్తుపై స్పందించి కలెక్టర్ మేడం రావడంతో మాకు ధైర్యం వచ్చింది. మా జీవితాలు కూడా మారుతాయని నమ్మకం వచ్చింది. – శీలం ఆదమ్మ -
రోడ్డు ప్రమాదాలను నివారిస్తాం
మిర్యాలగూడ అర్బన్ : జిల్లా పోలీస్ శాఖ.. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల(బ్లాక్స్పాట్స్)ను ఆర్అండ్బీ, ఎకై ్సజ్, ఆర్టీఓ, హైవే ఇంజనీర్ అధికారులతో కలిసి పరిశీలించారు. మిర్యాలగూడ పరిధిలోని నందిపాడు ఎక్స్రోడ్డు, ఈదులగూడ ఎక్స్రోడ్డు, గూడూరు ఎక్స్రోడ్డు, దామరచర్ల బ్లాక్ స్పాట్లను సందర్శించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బ్లాక్స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రంబుల్ స్టిక్స్, వేగనియంత్రణ సూచికలు, రాంగ్రూట్లో వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో తరుచూ ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్స్ గతంలో 58 ఉండగా ప్రస్తుతం 41కి తగ్గిందని, నిరంతర పెట్రోలింగ్ చేస్తూ రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు, రూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, వన్టౌన్ సీఐ నాగభూషణ్, ఎస్ఐలు లక్ష్మయ్య, రాంబాబు, శ్రీకాంత్రెడ్డి, అంజయ్య, రోడ్డు సెఫ్టీ ఇంజనీర్లు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నేనున్నానని..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అడవి తల్లే వారి ప్రపంచం. ఊరు దాటి పట్టణానికి వెళ్లే వారు తక్కువ. అప్పుడప్పుడు పట్టణానికి వచ్చే ఆ కొద్దిమందికే ఆధార్ కార్డులున్నాయి. అవీ ఎప్పుడో తీసుకున్నవి. వాటిని అప్డేషన్ చేయించుకునే అవకాశం లేక వారు సంక్షేమ పథకాలు దూరమవుతున్నారు. పిల్లలు పెద్దగైనా రేషన్ కార్డుల్లో పేర్లు లేక రేషన్ అందని వారూ ఉన్నారు. బుక్కెడు తిండి కోసం తంటాలు పడుతున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోని తిరుమలగిరిసాగర్ మండలం చెంచుకాలనీ ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి మీకు అండగా నేనున్నానంటూ ముందుకొచ్చారు. తండావాసి ఆదమ్మ ఫిర్యాదుతో.. అందరిలాగే తమ జీవితాలు బాగుండాలని, తమ బతుకులు మారాలన్న ఆలోచన ఆ చెంచు కుంటుంబాల్లోని ఒక మహిళ శీలం ఆదమ్మకు వచ్చింది. 20 రోజుల కిందట కాలనీవాసులు కొందరిని వెంట తీసుకొని కలెక్టరేట్లో ప్రజావాణికి వెళ్లి కలెక్టర్ ఇలా త్రిపాఠికి తమ గోడు వివరించింది. తాము ఐదు దశాబ్దాలుగా అడవిలోనే బతుకున్నామని, కనీస సౌకర్యాలు లేవని, తాగటానికి కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, రెండు, మూడు రోజులకు ఒకసారి వచ్చే భగీరథ నీటినే నిల్వ చేసుకొని తాగాల్సి వస్తోందని, కొన్నిసార్లు అవీ రావడం లేదని, కాలనీలో మోటార్లు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయని ఇలా సమస్యలతో కూడిన లేఖను కలెక్టర్కు అందజేసింది. ఐదు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని, ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాయని వివరించింది. కలెక్టర్ స్పందించి.. స్వయంగా వచ్చి.. ఆదమ్మ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారికి ఎలాగైనా న్యాయం చేయాలనుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఆయన కూడా వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 7 గంటలకే ఎమ్మెల్యేతో సహా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను తన వెంట తీసుకొని కాలనీకి చేరుకున్నారు. చెంచుకాలనీ మొత్తం కలియదిరిగి, వారికి కావాల్సిన సదుపాయలను అడిగి తెలుకొని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొందరికి ఆధార్ నమోదు, ఆధార్ అప్డేషన్ చేయించారు. చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు, కులం, నివాస, ఆదాయం ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేయించారు. నూతన పెన్షన్లు, నూతన రేషన్ కార్డులు, రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు నమోదు చేయించారు. వీటితో పాటు చెంచులకు ప్రత్యేకంగా సబ్సిడీ యంత్రాలు, ఆరోగ్య శ్రీ సేవలు, ఎయిర్టెల్ లేదా బీఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడి సెల్ టవర్ను ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇదీ చెంచువానికాలనీ స్వరూపం తిరుమలగిరి(సాగర్) మండలంలో చెంచువానితండా గతంలో నెల్లికల్లు గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం మూల తండా, చెంచువానితండా (మొత్తం 60 ఇళ్లు, 210 ఓటర్లు్), చెంచువాని కాలనీ కలిపి (43 కుటుంబాలు, 110 మంది ఓటర్లు) కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అన్నీ మట్టి రోడ్లే. చీకటి పడితే కాలనీ మొత్తం అంధకారమే. విద్యుత్ సదుపాయం లేదు. ఫ చెంచుల సమస్యలు పరిష్కరించేందుకు వారి వద్దకే వెళ్లిన కలెక్టర్ ఫ అభివృద్ధికి ఆమడ దూరంలో ఆ గ్రామం ఫ ప్రభుత్వ పథకాలకు నోచుకోని కుటుంబాలు ఫ వారికి భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యువకళపై నిర్లక్ష్యం!
నల్లగొండ టూటౌన్ : యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామని ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే ఇక్కడి అధికారులు మాత్రం నిర్లక్ష్య దోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జిల్లాస్థాయి యువజనోత్సవాలపై ముందుగానే జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న యువతకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులపై ఉంటుంది. ఇక్కడ గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న యువజనోత్సవంపై ముందుగానే మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా యువతకు జిల్లా యువజనోత్సవాలపై సమాచారం తెలియకుండా పోయింది. అధికారుల మధ్య సమన్వయ లోపం.. ఈనెల 22వ తేదీన నల్లగొండలో జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపిక సమాచారం మీడియా సైతం శుక్రవారం సాయంత్రం పంపడం గమనార్హం. నవంబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు స్వయంగా కార్యాలయంలో గానీ, మెయిల్కు లేదా, వాట్సప్ నంబర్ (8074487020) ద్వారా గానీ పేర్లు నమోదు చేయించుకోవాలని నిబంధన పెట్టారు. సంబంధిత శాఖ అధికారులు జిల్లా యువజనోత్సవాలకు ఒక్కరోజు ముందు పత్రికల ద్వారా సమాచారం అందిస్తే వారు యువజనోత్సవాల్లో పాల్గొనడానికి సాధ్యమేనా అనే అనుమానాలు ఎవరికై నా రావడం సహజం. సంబంధిత శాఖలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కూడా ఇందుకు కారణంగా తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జిల్లా యువజనోత్సవాలపై అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధం కావడానికి సమయం లేదు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యువజనోత్సవాల సమచారం కనీసం నాలుగు రోజులు ముందుగానే అందిస్తే యువత ఆయా పోటీలకు సన్నద్ధం అవుతుంది. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. యువజనోత్సవాల్లో జానపద నృత్యం గ్రూప్, జానపద గేయాలు గ్రూప్, వ్యాసరచన, పోస్టర్ తయారి, వక్తృత్వ పోటీ, కవిత్వం, ఇన్నోవేషన్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) నిర్వహిస్తారు. వాటికి సన్నద్ధం కావాలంటే మూడు, నాలుగు రోజుల సమయం పడుతుంది. ఒక్కరోజు ముందు సమాచారం ఇవ్వడంతో యువత యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీని వివరణ కోరగా ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు చెప్పడం గమనార్హం. మరిఎంత మందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారో అధికారులకే తెలియాలి. ఫ యువజనోత్సవాల సమాచారం చేరవేడంలో అధికారుల మీనమేషాలు ఫ నేడు యువజన కళాకారుల ఎంపికలు.. శుక్రవారం మీడియాకు సమాచారం ఫ కళాకారులు సిద్ధమయ్యేందుకు కూడా సమయం లేదు ఫ మంచి అవకాశానికి దూరమవుతున్న యువత నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 15 నుంచి 29 సంవత్సరాలలోపు వారై ఉండాలని, ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి యువజనోత్సకాలకు పంపుతామని పేర్కొన్నారు. జానపద నృత్యం గ్రూప్, జానపద పాటల గ్రూప్, కథారచన (హిందీ, ఇంగ్లిష్, తెలుగు), పెయిటింగ్, ఉపన్యాసం వక్తృత్వం, కవిత్వం (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) అంశాలపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8074487020 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
నల్లగొండ టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ట్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, సింగం లక్ష్మీనారాయణ, రమేష్గౌడ్, జనార్దన్, హరిబాబు, వెంకన దీపేందర్, నాగరాజు, తిరుపతయ్య, యాదగిరి, సతీష్, శంకరయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్గా ఆలోచిస్తే..
ఏఐ రంగంలో విద్యార్థులు, యువత నుంచి నూతన ఆవిష్కరణలను స్వాగతించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. - 10లోవ్యాధులపై అప్రమత్తత అవసరంపెద్దఅడిశర్లపల్లి : సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండల కేంద్రంలో పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి టైపాయిడ్, మలేరియా, కుక్క కాటు గురించి అడిగి తెలుసుకున్నాడు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేశ రవి, వైద్యాధికారి ప్రియాంక ఉన్నారు. -
ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో జరిగే నిత్యారాధనల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా జరిపించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామున సుప్రభాతం, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీదేవరకొండ : దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దేవరకొండ ఏఎస్పీగా ఆమె దాదాపు 11 నెలల పాటు విధులు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవుమర్రిగూడ : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ మాతృనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను, ఫార్మా సెంటర్, ఎక్స్రే, డయాలసిస్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రికి అవసరమైన రెండు ఆక్సిమీటర్లు, నాలుగు వీల్చైర్లను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శంకర్నాయక్, మెడికల్ ఆఫీసర్ శాలిని, సిబ్బంది పాల్గొన్నారు. ‘హ్యాండ్లూమ్ టెక్నాలజీ’లో పుట్టపాక చేనేత స్టాల్ సంస్థాన్ నారాయణపురం: హైదారాబాద్లోని శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ హ్యండ్లూమ్ టెక్నాలజీ లాబోరేటరీ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు చేనేత స్టాల్ ఏర్పాటు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేనేత స్టాల్ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. తేలియా రుమాల్ వస్త్రం తయారీ విధానం, విశిష్టతపై తెలుసుకున్నారు. చేనేత జాతీయ ఆవార్డు గ్రహీతలు గూడ శ్రీను, గూడ పవన్, అనందం నాగరాజు, గజం సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేశారు. -
పత్తి కొనాలని రైతుల ఆందోళన
మునుగోడు : రెండు రోజుల పాటు సీసీఐ కేంద్రం పడిగాపులు కాయించి తమ పత్తి కొనుగోలు చేయకుండా నిరాకరించడంపై ఆగ్రహిస్తూ మునుగోడులో పలువురు రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం.. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది రైతులు కపాస్ కిసాన్ యాప్లో 20వ తేదీన స్లాట్ బుక్ చేసుకొని 19వ తేదీ రాత్రే మునుగోడులోని సలాసర్ బాలాజీ పత్తి మిల్లు వద్ద క్యూలో పెట్టారు. ఆ వాహనాల్లోని పత్తి తేమశాతం చూసిన సీసీఐ సిబ్బంది పత్తి కొనుగోలు చేస్తామని చెప్పి పట్టా పాస్పుస్తకం జిరాక్స్లపై తేమశాతం రాసి క్యూలో ఉండమని చెప్పారు. వాహనాలు అధికంగా ఉండటంతో వాటి సీరియల్ వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. ఆ సమయంలో సీసీఐ సర్వర్ రావడం లేదని, ఇప్పుడు కొనుగోలు చేయలేమని.. మరుసటి రోజు కొనుగోలు చేస్తామని సిబ్బంది చెప్పారు. దీంతో రైతులు తమ పత్తి వాహనాలను మిల్లులోనే ఉంచారు. తిరిగి ఉదయం కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ సిబ్బంది పత్తి బాగా లేదని దిగుమతికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మిల్లు ఎదురుగా ఉన్న మునుగోడు–చౌటుప్పల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చండూరు సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎస్ఐ రవి అక్కడికి చేరుకుని ఆందోళన చేయకుండా రైతులను అడ్డుకున్నారు. సీసీఐ అధికారులతో మాట్లాడి రెండు రోజులు పడిగాపులు కాయించి పత్తి కొనుగోలు చేయకపోవడం సరికాదని, ఎలాగైనా ఆ రైతుల పత్తి దిగుమతి చేసుకుని వారికి న్యాయం చేయాలని సూచించారు. దీంతో సీసీఐ అధికారి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. -
నేడు ఉపాధ్యాయులకు అవగాహన సమావేశం
నల్లగొండ టూటౌన్ : వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాజెక్టుల తయారీపై ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నల్లగొండ సమీపంలోని చర్లపల్లి డీవీఎం కాలేజీలో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల భౌతిక శాస్త్రం, గణితం, జీవశాస్త్రం ఉపాధ్యాయుల్లో ఒకరు తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరారు. బాయిల్డ్ రైస్ కోటా మంజూరు చేయాలినల్లగొండ: జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి గురువారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యాన్ని వేగంగా తరలించడానికి జిల్లాకు అదనపు రైల్వే వ్యాగన్లను కేటాయించాలని లేఖలో కోరారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టొద్దునల్లగొండ: రహదారులపై రైతులు ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రాత్రి సమయంలో రోడ్లపై ధాన్యాన్ని ఉంచి, రాళ్లు పెట్టడం, నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనబడక, వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఒక్కోసారి వాహనదారుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. సీఎంఆర్ సమస్యలను పరిష్కరిస్తాంనల్లగొండ: వానాకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ నరసింహరాజు అన్నారు. గురువారం నల్లగొండలోని రెవెన్యూ అదనపు కలెక్టర్ చాంబర్లో 2024–25, 2025–26 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), వానాకాలం ధాన్యం సేకరణపై పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలంకు సంబంధించిన ధాన్యం అన్లోడ్ను మిల్లర్లు వెంటనే చేసుకోవాలని సూచించారు. మిల్లర్లు కోరినట్లు 2023–24 సీఎంఆర్ చెల్లింపు పొడిగింపు వస్తుందని తెలిపారు. జిల్లాకు ఎక్కువ వేగన్స్ కేటాయింపు వచ్చే అవకాశముందన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్. జె.శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు కర్నాటి నారాయణ, రేపాల భద్రాద్రి, జూలకంటి ఇంద్రాడ్డి, వీరమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంపెద్దఅడిశర్లపల్లి : మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ వసతి గృహంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ వెంకట య్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీలోపు ఎమ్మార్సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ ముందుంది
ఫ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోిషి నల్లగొండ: ధాన్యం ఉత్పత్తి, సేకరణలో నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ముందుందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నల్లగొండలోని ఎఫ్సీఐ గోదాము ఆవరణలో నూతనంగా నిర్మించిన డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎఫ్సీఐ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాముల్లో 60 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే మరో ఎఫ్సీఐ గోదామును నల్లగొండలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బియ్యం సూర్యాఘర్ ముక్తి బిజిలీ పథకం కింద 20,175 ఇళ్లకు రూ.20 వేల కోట్ల రాయితీ ఇస్తున్నామన్నారు. రైతులు వరిపైనే కాకుండా ఆయిల్ సీడ్స్ వాణిజ్య పంటలు పండించాలని కోరారు. కోవిడ్ సమయంలో తెలంగాణకు రావాల్సిన సబ్సిడీ రూ.343 కోట్లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంఆర్ డెలివరీకి సంబంధించి 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ.1400 కోట్లకు సరైన రికార్డులు సమర్పిస్తే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. కేంద్ర మంత్రికి వినతి జిల్లా రైతుల కోసం ఆధునిక ధాన్యం గోదాము, బత్తాయి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నవించారు. ఆధునిక గోదాములు లేకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం నాణ్యత తగ్గి, సకాలంలో ఎఫ్సీఐకి పంపడం కష్టంగా మారిందని తెలిపారు. జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమన్నారు. గోదాముల నిర్మాణానికి తిప్పర్తి మండలంలో స్థలం అందుబాటులో ఉందన్నారు. నల్లగొండలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా తయారు చేస్తారని, ఇక్కడి మిల్లర్లకు రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ ఏదైనా ఎఫ్సీఐకి ఇచ్చే అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. బత్తాయి నిల్వ సమస్యలను అధిగమించడానికి, అత్యవసరంగా 2500 మెట్రిక్ టన్నుల(ఎంటీ) సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్ను నల్లగొండకు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ 2025–26కు సంబంధించి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఎఫ్సీఐ ఈడీ వనిత శర్మ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎఫ్సీఐ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్సీఐ అధికారులు పాల్గొన్నారు. -
కంకర మిల్లులకు కొత్త రూల్స్
నల్లగొండ: ప్రభుత్వం కంకర మిల్లులకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇటీవల రంగారెడ్డి– వికారాబాద్ జిల్లాల పరిధిలో జరిగిన కంకర లారీ రోడ్డు ప్రమాదం సంఘటనను దృష్టిలో ఉంచుకుని గనులు, భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిబంధనలు జారీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఖనిజాలను రవాణా చేయడంతోపాటు ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున స్పందించిన ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొత్త నిబంధనలు ఇవీ.. ● జిల్లాలో ఉన్న క్రషర్ మిల్లులు అన్నీ రూ.50 వేల చొప్పున చెల్లించి కచ్చితంగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ● ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ● కొత్తగా క్రషర్ పెట్టేవారు కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ● క్రషర్ నడిపించాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ● క్రషర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వేబ్రిడ్జిని కూడా వారు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ● క్రషర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను మైనింగ్ స్టేట్ డైరెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అనుమతి పొందిన వాహనాలకు మాత్రమే.. ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర ఏ వాహనమైనా ఇసుక, కంకర, ఇటుకలు, రాయి, మట్టి, రాయి పొడి తదితర ఏ ఇతర ఖనిజ సంపదను రవాణా చేయాలన్నా రూ.2వేలు చెల్లించి కచ్చితంగా జిల్లా కేంద్రంలోని ఏడీ మైన్స్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఆన్లైన్ చేస్తారు. ఇక్కడ అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఖనిజ సంపదను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఫ ప్రతి మిల్లుకు రిజిస్ట్రేషన్ ఫ ఖనిజాలు సరఫరా చేసే ప్రతి వాహనానికి కూడా.. ఫ అనుమతి లేకుండా ఖనిజాలు సరఫరా చేస్తే కేసులే ఫ జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారి సామ్యేల్ జాకబ్జిల్లాలో 20 క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఆ యజమానులంతా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. 150 టిప్పర్ల యజమానులు కూడా రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. కంకర, ఇసుక, ఇటుక, రాయి తదితర ఖనిజా లను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వాహనాల్లో ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతోపాటు కేసులు కూడా నమోదు చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎల్ఎస్ కమిటీ ఇసుక సరఫరాను ప్రతి వినియోగదారుడికి సరసమైన ధరలకు అందించాలని నిర్ణయించింది. ట్రాక్టర్ యజమానులు, ఇతర బ్రోకర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ఇటీవల కురిసిన వర్షాలతో వాగుల్లో వర్షం వచ్చి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్వరలోనే ఆ సమస్య పరిష్కారమవుతుంది. –సామ్యేల్ జాకబ్, నల్లగొండ మైన్స్ ఏడీ -
కష్టపడితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు
రామగిరి(నల్లగొండ): కష్టపడితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. చదువును అలవాటుగా చేసుకుంటే ఆలోచన శక్తితోపాటు సృజనాత్మకత పెరుగుతుందన్నారు. పుస్తక పఠనం చేస్తే శాంతి, సహనం, చిత్తశుద్ధి అలవడుతుందన్నారు. అనంతరం వారం రోజులుగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్యదర్శి బాలమ్మ, డీఎస్పీ టి.మల్లారెడ్డి, బాలికల జూని యర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి, బాలుర జూ నియర్ కాలేజీ ప్రిన్సిపాల్ యూసుఫ్ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ ఎంవీ.గోనారెడ్డి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ -
సహకార రంగంలో అపార అవకాశాలు
నల్లగొండ టూటౌన్ : సహకార రంగంలో యువతకు అపార అవకాశాలు లభిస్తున్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటీవ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.గణేశన్ అన్నారు. గురువారం ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థులకు సహకార రంగంలో అవకాశాలపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర చట్టాలకు లోబడి భావసారూప్యత కలిగిన 20 మంది వ్యక్తులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా సహకార రంగంలో సాధించిన విజయాలను విద్యార్థులకు వివరించారు. ఇంటర్న్షిప్ అవకాశాలు సైతం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూసీసీబీఎం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీదేవి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ హరీష్ పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాలు నడిపింది సీపీఐనే
మిర్యాలగూడ అర్బన్ : బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు, భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజాఉద్యమాలు నడిపింది సీపీఐ పార్టీనే అని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల ముగింపు సభ విజయవంతం చేయడానికి చేపట్టిన బస్సు జాతా గురువారం మిర్యాలగూడ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మొట్టమొదటగా పోరాటం చేసింది సీపీఐ అని.. బీజేపీ ఏరోజు దేశం కోసం పోరాడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజల మధ్య మత విద్వేషాలు, భావోద్వేగాలను రెచ్చగొడుతోందన్నారు. బీజేపీ బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టులను చంపుకుంటూపోతోందని విమర్శించారు. మావోయిస్టులు తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలే కానీ బూటకపు ఎన్కౌంటర్లు చేయడం విచారకరమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బాలనరసింహ మాట్లాడుతూ డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించే సభకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముందుగా సీపీఐ జెండాను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్దె శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్రెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, పబ్బు వీరస్వామి, కెఎన్.రెడ్డి, నాయకులు జగన్, గణేశ్నాయక్, జిల్లా యాదయ్య, గజాల లక్ష్మీనరసింహారెడ్డి, ఎండీ.సయీద్, బిల్లా కనకయ్య, ధీరావత్ లింగానాయక్, అంజనపల్లి రామలింగం, ధనావత్ శాంత, వల్లంపట్ల వెంకన్న, ఎర్రబోతు పద్మ, దాసర్ల దుర్గమ్మ, షమీమ్, ఉదయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
శిశు విక్రయాలు నివారించాలి
నల్లగొండ : శిశు విక్రయాలు, బాల్యవివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మున్సిపల్ కమిషనర్లు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, ఎంపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 30లోగా అన్ని గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్ తయారు చేసుకొని విడతల వారీగా సమావేశాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్యవివాహాలు, బాలికలు యుక్త వయసులో గర్భం దాల్చడం తదితర అంశాలపై చర్చించాలని, ఈ అంశాలపై బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోక్సో చట్టం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, అక్రమ దత్తత, మత్తుమందులకు బానిసలు కాకుండా ఉండే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం గుర్తించిన తండాలు ,గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాక మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలకు తనతో పాటు, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఏఎస్పీ, జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు. చీరల పంపిణీని విజయవంతం చేయాలి నల్లగొండ : జిల్లాలో ఇందిరా మహిళశక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తోందన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. పాఠశాలల్లో యూనిఫాం కుట్టే బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని వారికి రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 554 కోట్ల రూపాయల విలువ చేసే అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై ధాన్యం.. వాహనదారులకు ప్రాణ సంకటం
రామగిరి(నల్లగొండ): రైతులు తమ పంటలను ఆరబెట్టడానికి రహదారులను వాడుతున్నారు. ధాన్యంపై నల్లటి టార్పాలిన్ కప్పడంతో రాత్రి సమయంలో అది స్పష్టంగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవయ్యే అవకాశం ఉంది. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే దారిలో రోడ్డుపై రైతులు తమ ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం పైనుంచి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం రాశులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. వరి పంటను యంత్రాలతో కోయిస్తుండడంతో ధాన్యం పచ్చిగా ఉంటోంది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వ్యవసాయ బావుల వద్ద కల్లాలు లేకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారు. కొర్లపహాడ్, చీకటిగూడెం గ్రామాల్లో హైవేతోపాటు, కొప్పోలు, ఉప్పలపహాడ్, భీమారం గ్రామాల్లో బీటీ రోడ్లు పూర్తిగా ధాన్యం రాశులతో నిండిపోయాయి. ధాన్యానికి రక్షణగా రోడ్డుపైనే బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రివేళ ప్రయాణించే వాహనాదారులకు దగ్గరకు వచ్చే వరకు రోడ్డుపై ఉంచిన రాళ్లు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై రాళ్లు పెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. -
అర్హులా.. అనర్హులా!
అప్పట్లో సొంత ఇల్లు ఉన్న వారు కూడా డబుల్ బెడ్ రూం కోసం దరఖాస్తు చేసుకున్నారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయగా, సొంత ఇల్లు ఉన్న పలువురికి డ్రాలో ఇల్లు వచ్చింది. దానిపై ఫిర్యాదులు రావడంతో గతంలో కొందరివి రద్దు చేశారు. ఆ రద్దు చేసిన ఇళ్లను ఎలాంటి విచారణ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అధికారులు ఇళ్లకు ఎంపికై న వారు అర్హులా.. కాదా.. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూం రెండింటికీ ఎంపిక అయ్యారా అనే సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను మున్సిపల్ సిబ్బంది సర్వే చేస్తున్నారు. గత ప్రభుత్వ హాయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరు సొంతిల్లు ఉన్న వారు కూడా ఉన్నారనే ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ సిబ్బంది సంబంధిత లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇల్లుకు రెండింటికి ఎంపిక అయితే వాటిలో ఒకటి రద్దు చేస్తున్నారు. ఇల్లు లేని పేద వారికి మాత్రమే డబుల్ బెడ్ రూం ఇవ్వాలని మంత్రి ఆదేశించడంతో వాస్తవాలను తెలుసుకోవాలన్న క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కగా సర్వే చేశాక లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది. నీలగిరిలో 554 డబుల్ బెడ్రూం ఇళ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీలగిరి పట్టణంలోని కలెక్టరేట్ వెనుక, పెద్దబండ సమీపంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. రెండు చోట్లా కలిపి మొత్తం 554 ఇళ్లు ఉన్నాయి. వాటిలో అంతర్గత పనులు చేపట్టకుండానే లబ్ధిదారులను ఎంపిక చేసింది. కానీ లబ్ధిదారులకు కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కోమటిరెడ్డి నిధులు మంజూరు చేయించి కరెంట్, డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్ తదితర పనులను ఇటీవల పూర్తి చేయించారు. ఫ నీలగిరిలో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సర్వే ఫ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఫ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూం రెండూ వస్తే.. ఒకటి రద్దు -
ఓటరు జాబితా ప్రచురణకు షెడ్యూల్
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తామని ప్రకటించడంతో ఇంతకు ముందు తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తిరిగి ప్రచురించాలని సూచించింది. అక్టోబర్ 2వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వచ్చినా లేదా సుమోటోగా అభ్యంతరాలుంటే పరిశీలించి వాటిని సరి చేయాలని సూచించింది. ఈ నెల 20వ తేదీన పొరపాట్లను సరిచేయాలని పేర్కొంది. 22వ తేదీన వచ్చిన అభ్యంతరాలు పరిశీలించాలని, 23న ఫైనల్ రి పబ్లికేషన్ ఫొటోలతో ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రచురించాలని పేర్కొంది. అదే రోజు పోలింగ్ స్టేషన్ల జాబితాను తిరిగి ప్రచురించాలని సూచించింది. నేడు కేంద్ర మంత్రి రాకనల్లగొండ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం నల్లగొండ రానున్నారు. నల్లగొండలోని పెద్దబండలో ఎఫ్సీఐ బఫర్ స్టోరేజీ కాంప్లెక్స్ను ఆయన ప్రారంభించనున్నారు. తూకం యంత్రాల పరిశీలననల్లగొండ : జిల్లాలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 994 రేషన్ షాపులు ఉండగా పెరిగిన గ్రామ పంచాయతీలతో మరో 54 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త షాపులకు ఇవ్వాల్సిన తూకం యంత్రాలు బుధవారం నల్లగొండ డీఎస్వో కార్యాలయానికి చేరాయి. ఆ యంత్రాల పనితీరును ఏఎస్ఓ రాజశేఖర్ పరిశీలించారు. నేడు మానవహక్కుల కమిషన్ చైర్మన్ రాక రామగిరి(నల్లగొండ) : మానవహక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ గురువారం నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారో త్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉదయం 11.30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగనున్న అక్షరాస్యత దినోత్సవంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. పత్తి కొనుగోలు చేయాలని రాస్తారోకో డిండి : పత్తి కొనుగోలు చేయాలని డిండి మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి సమీపంలో జడ్చర్ల–కోదాడ హైవేపై రైతులు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలింగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మండలంలో ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు చేస్తున్నారని రైతులకు తెలపడంతో రాస్తారోకో విరమించారు. -
విద్య.. ప్రగతికి మూలం
రామగిరి (నల్లగొండ) : మనిషి ప్రగతికి మూలం.. విద్య అని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారని, పేదల సంక్షేమానికి గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ.. ఏదైనా సాధించాలనే తపన, కోరిక కలిగి ఉండాలని, చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సంతోషంగా, ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పారు. జిల్లా గ్రంధాలయ సంస్థ ప్రస్తుత భవనం సరిపోనందున పాత టౌన్ హాల్ స్థానంలో నూతన భవనం నిర్మించే ఆలోచనలో ఉన్నామని, అందుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశామని వెల్లడించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఏ.హఫీజ్ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బి.బాలమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గ్రామీణ క్రీడాకారులకు సహకారం అందిస్తా
నల్లగొండ : గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తాను ఎల్లవేళలా సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటో గ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న ఎన్పీఎల్–6 క్రీడల పోస్టర్ను హైదరాబాద్లోని సెక్రటేరియట్లో బుధవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. టోర్నమెంట్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. క్రీడాకారులంతా ఈ టోర్నమెంట్లో పాల్గొని రాణించాలన్నారు. మొదటి బహుమతి రూ.2,22,222, రెండో బహుమతి రూ.1,11,111 అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, ఆంగోతు ప్రదీప్నాయక్, కేసాని వేణుగోపాల్రెడ్డి, నిర్వాహకులు బోనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, పాలకూరి శ్రీధర్, గంజి గిరి, కోమటిరెడ్డి, శేఖర్రెడ్డి, సాయి, చిన్ని రంగ, మధు, నవీన్రెడ్డి, నాని పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
పేదల పక్షాన సమరశీల పోరాటం
నల్లగొండ టౌన్ : పేదల పక్షాన సమరశీల పోరాటాలు నడిపింది సీపీఐ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 26 ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని చేపట్టిన ప్రచార జాతా బుధవారం రాత్రి నల్లగొంగకు చేరుకుంది. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా గర్జించిన పార్టీ సీపీఐ అన్నారు. బీజేపీ ఏరోజు కూడా దేశం కోసం పోరాడలేదు అని, ఏ ఒక్క నాయకుడు కూడా జైలుకు వెళ్లలేదన్నారు. కానీ, దేశభక్తి పేరుతో ఓట్లు అడుగుతోందని విమర్శించారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్ నుంచి గడియారం సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నర్సింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్దె శ్రీనివాస్, నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, పబ్బు వీరస్వామి, బొల్గూరి నర్సింహ, గురిజ రామచంద్రం, తిర్పాటి వెంకటేశ్వర్లు, కేఎస్.రెడ్డి, చాపల శ్రీను, ఎండీ.అక్బర్, సురిగి చలపతి, బొడిగె సైదులు, జగన్, గణేష్నాయక్, యాదయ్య, ముండ్ల ముత్యాలు, కోమటిరెడ్డి ప్రద్యుమ్నారెడి్డ్ తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల పోరాటాల చరిత్ర సీపీఐ సొంతం
చండూరు : ప్రజా సమస్యలపై వందేళ్లుగా పోరా టాలు చేసిన చరిత్ర సీపీఐ సొంతమని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగనున్న సీపీఐ వంద సంవత్సరాల ముగింపు వేడుకల సందర్భంగా గద్వాల నుంచి ప్రారంభమైన ప్రచార జాత మంగళవారం చండూరుకు చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు ప్రచార జాతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభలో ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ ఖమ్మం సభకు మునుగోడు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు ఉజ్జిని రత్నాకర్రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రాలమలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు. పేదల పక్షాన పోరాడేది సీపీఐమర్రిగూడ : పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడేది కేవలం సీపీఐ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగనున్న సీపీఐ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేసేందుకు చేపట్టిన ప్రచార జాత మంగళవారం మర్రిగూడ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగింపు ఉత్సవాలకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహా, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈదుల భిక్షంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు
నల్లగొండ టూటౌన్ : మత్తు మందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిస కావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తు మందులకు ఒకసారి అలవాటైతే వాటిని వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్ నాషనం అవుతుందని పేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపైనే ఆధార పడిఉందన్నారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డిప్యూటి డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్గా అరుణప్రియ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్గా అరుణప్రియను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరుణప్రియ ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. ఏడాది పాటు ఆమె స్టూడెంట్ అఫైర్స్ డెరెక్టర్గా సేవలందించనున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలిచిట్యాల : రైతులంతా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను పండిస్తే ప్రభుత్వం నుంచి అని విధాలుగా మద్దతు ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) పి.శ్రవణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం గుండ్రాంపల్లిలోని కవిత, కృష్ణ సాగు చేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలను పండించే వారంతా సంఘంగా ఏర్పడితే ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలను అందిస్తుందన్నారు. వరి పండించే రైతులంతా యాసంగిలో తమ భూముల్లో జింక్ సల్పేట్ రెండు గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ మీనాకుమారి, రైతులు పాల్గొన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా రవిశంకర్నల్లగొండ టూటౌన్ : బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన రావులపాటి రవిశంకర్ను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నియామకపత్రం అందుకున్న సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మామావతి ఆధ్వర్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు శాలిగౌరారం : సీసీఐ ఆధ్వర్యంలో బుధవారం నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగనున్నట్లు శాలిగౌరారం మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మాధారంకలాన్ వద్ద గల కాటన్మిల్లులో పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. సైనిక స్కూల్ ఏర్పాటుకు సాగర్ గురుకులం పరిశీలన నాగార్జునసాగర్ : సైనిక స్కూల్ ప్రతిపాదనలో భాగంగా మంగళవారం స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను సైనిక్ స్కూల్ ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనాలు కలిగిన 21 గురుకుల పాఠశాలలను సైనిక స్కూల్స్గా మార్చాలనే లక్ష్యంతో ఎంజేపీ గురుకులాల సంస్థ సెక్రెటరీ సైదులు సూచనల మేరకు ఈ ఏడాది జులైలో సంబంధిత అథారిటీలకు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో బీజాపూర్ సైనిక్స్కూల్ ప్రిన్సిపాల్ కెప్టెన్ రాజ్యలక్ష్మీ పృథ్వీరాజ్, నల్లగొండ కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పాఠశాలను సందర్శించారు. దరఖాస్తుతో జతచేసిన అంశాలను, పత్రాలను పరిశీలించారు. పరిశీలన నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. వారి వెంట ఆర్సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్ తదితరులు ఉన్నారు. -
ఆరోగ్య బీమా.. జీవితానికి ధీమా
నల్లగొండ: ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా ఇస్తుందని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డులకు, సిబ్బందికి ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. హెచ్డీఎఫ్సీ, యాక్సెస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న సిబ్బంది ప్రతి సంవత్సరం రూ.11,650 ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలోని నలుగురు (కుటుంబ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలకు) రూ.33 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు. ఈ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ ఉండి డెబిట్ కార్డు ఉన్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.30 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోం గార్డ్ ఆర్ఐ శ్రీను, హెచ్డీఎఫ్సీ మేనేజర్ సత్యనారాయణ, యాక్సెస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్రెడ్డి, ఇన్సూరెన్స్ అధికారులు, హోం గార్డ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి రైతులను మోసం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు కమీషన్లకు కక్కుర్తి పడి బస్తాకు 2,3 కేజీల చొప్పున కట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2800 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతుబంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి పేరు వస్తుందనే.. పసల్ బీమాను అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, నాయకులు పిల్లి రామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పకీర్ మోహన్రెడ్డి, సురకంటి రంగారెడ్డి, జగన్మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి, గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, జగ్జీవన్రామ్, ఓరుగంటి వంశీ, పిండి పాపిరెడ్డి, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి -
పాత పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం పాత పద్ధతిలోనే అమలు చేయనుంది. ఆ ప్రకారం జిల్లాలో బీసీలకు 166 స్థానాలే లభించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి 310 సర్పంచ్ స్థానాలు దక్కేలా చర్యలు చేపట్టినా.. ఆ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్లనే వర్తింపజేస్తూ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల పనుల్లో నిమగ్నం కానుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం 166 స్థానాలే.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు రిజర్వేషన్ల జాబితా సిద్ధం చేసి సెప్టెంబరు 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో 114 గిరిజన పంచాయతీలు పోగా, 755 గ్రామ పంచాయతీల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 310 స్థానాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. రిజర్వేషన్ల పెంపును సవాల్చేస్తూ రెడ్డి జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో బీసీలకు 166 స్థానాలే దక్కనున్నాయి. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం 310 స్థానాలకు కేటాయించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 10.73 లక్షల ఓటర్లు జిల్లాలోని 33 మండలాల్లో 869 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో అప్పట్లోనే ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దాని ప్రకారం 10.73 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పించి మొత్తం 9996 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేసినా ఎన్ని కల నిర్వహణకు సిద్ధమవుతోంది. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఇచ్చింది. ఫ 42 శాతం రిజర్వేషన్ అమలైతే 310 స్థానాలు దక్కేవి ఫ రిజర్వేషన్ల కోటా 50 శాతం మించొద్దని చెప్పిన కోర్టు ఫ పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించనున్న కాంగ్రెస్ ఫ ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం.. జిల్లాలో 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జిల్లాలో 844 స్థానాలు ఉన్నాయి. అప్పట్లో గిరిజన గ్రామ పంచాయతీలు 104 పోగా.. మిగిలిన 740 గ్రామ పంచాయతీల్లో 22 శాతం రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 164 స్థానాలు లభించాయి. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 869కి పెరిగింది. అయినా అదనంగా రెండు స్థానాలు పెరిగి 166 పంచాయతీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వంద శాతం గిరిజన పంచాయతీల సంఖ్య 114కు పెరిగింది. వాటిని మినహాయించి లెక్కిస్తే 755 గ్రామ పంచాయతీల ఆధారంగానే రిజర్వేషన్లను కల్పించనున్నారు. వాటి ప్రకారం బీసీలకు 166 స్థానాలు దక్కనున్నాయి. మరోవైపు పెరిగిన 25 గ్రామ పంచాయతీల్లో వంద శాతం గిరిజన గ్రామాల కింద 10 పంచాయతీలు పోగా, మిగతా 15 స్థానాల్లో రెండు బీసీలకు, 13 స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతోపాటు జనరల్ స్థానాల్లోనే కలవనున్నాయి. -
విద్యుత్ శాఖ.. ప్రజాబాట
వారంలో మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటలకే గుర్తించిన ప్రాంతాలకు ఏఈ, ఇతర అధికారులు వెళ్లి ప్రజాబాట నిర్వహించాలి. దీని కోసం జీపీఎస్ ద్వారా అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఎక్కడో ఉండి హాజరైటన్లుగా చూపించే అవకాశం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఈతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా ఎస్ఈ, డీఈ, ఏడీఈలంతా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక చోట తప్పనిసరిగా హాజరవుతారు. నల్లగొండ : నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టింది. మొదట పట్టణ, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడతలో పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబర్ నెల నుంచి వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారం) ప్రజాబాట నిర్వహించి విద్యుత్ సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తోంది. నాణ్యమైన విద్యుత్ అందించేలా.. విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలను తెలుసుకొని తక్కువ ఖర్చుతో కూడుకున్న వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఎక్కువ వ్యయంతో కూడుకున్న పనులకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులే కాకుండా ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెట్ల పొదలు, తీగ జాతి చెట్లను తొలగిస్తున్నారు. ఇనుప స్తంభాలను గుర్తిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడితే జరిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఫ వారంలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఫ తొలుత పట్టణాల్లో నిర్వహణ ఫ బస్తీల్లో విద్యుత్ సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా కార్యాచరణటీజీఎస్పీడీసీఎల్ చేపట్టిన ప్రజాబాట ద్వారా వినియోగదారులకు మేలు చేకూరనుంది. చిన్న సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్యలను ప్రజాబాటలో అధికారులు గుర్తిస్తారు. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించడమే సంస్థ లక్ష్యం. – వెంకటేశ్వర్లు, ఎస్ఈ -
చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి
నల్లగొండ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నల్లగొండ జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం నల్లగొండలోని తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సూచనల మేరకు చిత్తడి నేలల సర్వే, నిర్ధారణ, నోటిఫికేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులుగా మిల్లు బయటే..
తిప్పర్తి : కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ఖరీదు చేసిన ధాన్యం లారీ దిగుమతికాక.. వారం రోజులుగా మిల్లు ముందే ఉంది. వివరాలలోకి వెళితే నల్లగొండ మండలం శేషమ్మగూడెం గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో రైతులు పేర్ల నాగమ్మ (352 బస్తాలు), బొజ్జ శ్రీను (356 బస్తాలు)కు చెందిన ధాన్యాన్ని కాంటా వేసిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి గ్రామంలోని సాయి వెంకటేశ్వర మిల్లుకు పంపారు. మిల్లు యజమాని ధాన్యం బాగాలేదని లారీని తిరస్కరించాడు. దీంతో ఈనెల 13వ తేదీ నుంచి లారీ మిల్లు బయటే ఉంది. ధాన్యం బాగా లేకుంటే కాస్త కోత విధించి అయినాదిగుమతి చేసుకోవాలని రైతులు కోరగా.. మంగళవారం దిగుమతి చేసుకుంటామని చెప్పిన మిల్లు యాజమాన్యం 25 క్వింటాళ్ల కోత విధిస్తామని చెప్పాడు. అంతకోత విధిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు చెప్పడంతో మిల్లు యజమాని ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో వారం రోజులుగా రైతులు మిల్లు వద్దే పడిగాపులు కాస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
నేలపైనే నిద్ర
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఎస్టీ (ఏ) హాస్టల్లో కిటీకీలకు డోర్లు లేకపోవడంతో విద్యార్థులు చద్దర్లను కిటికీలకు అడ్డంగా కట్టుకున్నారు. చలి విపరీతంగా ఉన్నప్పటికీ చన్నీటి స్నానాలు చేస్తున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో బయట నల్లాల వద్దనే స్నానాలు చేస్తున్నారు. ఎస్టీ (సీ) హాస్టల్లోనూ అదే పరిస్థితి ఉంది. సుందర్నగర్లోని ఎస్టీ కళాశాల హాస్టల్లో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. గదుల కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలి గాలి వస్తోందని, ఉదయాన్నే చల్లటి నీటితో స్నానాలు చేసి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు హీటర్లను అందించాలని కోరుతున్నారు. -
6,362 కేసుల పరిష్కారం
నల్లగొండ : జాతీయ మెగా లోక్అదాలత్లో 6,362 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నిర్వహించిన లోక్అదాలత్కు హాజరైన నిందితులు, కక్షిదారులకు అవగాహన కల్పించి జిల్లా వ్యాప్తంగా 6,362 కేసులు పరిష్కరించామని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 45 మంది బాదితులకు రూ.8,84,642 అందజేశారని తెలిపారు. ఈ కేసులను పరిష్కరించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, కోర్టు కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయ్యనల్లగొండ టౌన్ : అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయ్య ఎన్నికయ్యారు. శనివారం రాత్రి నల్లగొండలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్గ ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షుడిగా మేక రాంరెడ్డి, అధ్యక్షునిగా కోడి సోమయ్య, ఉపాధ్యక్షుడిగా ఉక్లా, ప్రధాన కార్యదర్శిగా కోమటిరెడ్డి అనంతరెడ్డి, కార్యదర్శిగా పాతూరి శ్రీనివాస్రావు, కోశాధికారిగా ఎం.అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్మునుగోడు : మండలంలోని పలివెల జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు గేర నర్సింహను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా అధికారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకొని పాఠశాలకు రాగా.. ఉపాధ్యాయుడు నర్సింహ అసభ్యంగా మాట్లాడటంతో పాటు మాల తీసి పాఠశాలకు రావాలని ఆదేశించాడు. దీంతో ఈ విషయం తెలిసినా కుటుంబ సభ్యులు, పలువురు మాలదారులతో పాటు బీజేపీ నాయకులు అదే రోజు ఆ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొవాలని అదనపు కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ చేసిన అధికారులు ఉపాధ్యాయుడు నర్సింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 19న కబడ్డీ జట్ల ఎంపికనిడమనూరు : నల్లగొండ జిల్లా సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ జట్ల ఎంపికను ఈ నెల 19న మధ్యాహ్నం నిడమనూరులో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషుల విభాగంలో 85 కేజీలలోపు, మహిళల విభాగంలో 75 కేజీలలోపు ఉండాలని పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో రావాలని సూచించారు. కోలుకుంటున్న చిన్నారులునాగార్జునసాగర్ : ఇంజెక్షన్ వికటించి అస్వస్థతతకు గురైన 17మంది చిన్నారులు ప్రాణాపాయం తప్పడంతో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పైఅధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారంతా త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. -
నృసింహుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఆదివారం ఉదయాన్నే ఆలయాన్ని తీసిన అర్చకులు సుప్రఽభాతం, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక.. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేశారు. -
మంత్రుల పర్యటనకు అంతా సిద్ధం
మిర్యాలగూడ : మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కట్పల్లి బైపాస్లోని హెలిపాడ్ వద్దకు ఉదయం 9:30 గంటలకు మంత్రులు చేరుకుంటారని, రోడ్డు మార్గం ద్వారా కాల్వపల్లిలో శెట్టిపాలెం నుంచి అవంతీపురం వరకు నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హౌసింగ్బోర్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సాగర్ రోడ్డులో గల ఫ్లైవర్ బిడ్జి వద్ద 75 కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అశోక్నగర్లో గల అయ్యప్ప దేవాలయంలో జరిగే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. 12.30గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతారని తెలిపారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాస్, తహసీల్దార్లు సురేష్కుమార్, రాగ్యానాయక్ తదితరులు ఉన్నారు. నల్లగొండ : పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్తో కలెక్టర్ ఫోన్ ద్వారా మాట్లాడి జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను వివరించారు. అయితే రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగ్ మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు. ఫ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే -
సంక్షేమ హాస్టళ్లలో చలికి గజగజ వణుకుతున్న విద్యార్థులు
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలికి గజగజ వణికుతున్నారు. ఓ పక్క సరైన వసతులు లేకపోవడం.. మరోవైపు హాస్టళ్లలో అందించిన దుప్పట్లు పల్చగా ఉండడంతో ఇంటి నుంచి దుప్పట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భవనాల్లో కిటికీలు సరిగా లేక చల్లటిగాలికి నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు. వణికించే చలిలో విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేయడం కష్టంగా మారింది. ఇక, కొన్నిచోట్ల బెడ్లులేక బండలపైనే దుప్పట్లు పరుచుకుని పడుకుంటున్నారు. ఆదివారం జిల్లాలోని కొన్ని హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి.ఫ చలికాలం వచ్చినా రగ్గులు ఇవ్వని దుస్థితి ఫ కిటికీలు ధ్వంసమై చలిగాలులతో ఇబ్బందులు ఫ కొన్నిచోట్ల బండలపైనే నిద్రిస్తున్న విద్యార్థులు ‘సాక్షి’ విజిట్లో వెలుగుచూసిన వాస్తవాలునల్లగొండ: సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ లోగిళ్లుగా మారాయి. జిల్లాలో చాలా హాస్టళ్లు అద్దె భవనాల్లో మగ్గుతున్నాయి. వాటికి ప్రభుత్వం నుంచి అద్దె విడుదల కాకపోవడంతో యజమానులు మరమ్మతులు చేయించడం లేదు. దీంతో అరకొర వసతుల నడుమ విద్యార్థులు గడుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులోని ఎస్సీ కళాశాల హాస్టల్లో ఒక్క మరుగుదొడ్డినే 80 మంది విద్యార్థులు వాడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఆ మరుగుదొడ్డి వద్ద లైన్ కడుతున్నారు. కిటికీలకు తలుపులు లేవు. కొన్ని రూమ్లలో ఫ్యాన్లు లేవు. కొన్ని రూమ్లలో లైట్లు లేవు. హాస్టల్లో ఏ మూలన చూసినా ఎర్రగా గుట్కాలు తిని ఊసినట్లుగా కనిపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి చెబుతున్నా కనీసం సున్నం వేయించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇక హాస్టల్లో విద్యార్థులకు చద్దర్లు లేక చలికి వణుకుతున్నారు. ఇక, పట్టణంలోని శాంతినగర్ బీసీ బాలుర హాస్టల్లోనూ అదే దుస్థితి. రేకులు దెబ్బతినడంతో వర్షం వచ్చినప్పుడు నీరు వస్తోంది. కిటికీలకు తలుపులు లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పానగల్ రోడ్డులోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం మంచిగా ఉన్నప్పటికీ ఆవరణలో బండలు దెబ్బతిన్నాయి. బాత్రూమ్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
కిటికీలకు తలుపుల్లేవు..
కేతేపల్లి : కేతేపల్లిలోని ఎస్పీ హాస్టల్లో రికార్డు ప్రకారం మొత్తం 60 మంది విద్యార్థులకుగాను శుక్రవారం రాత్రి 32 మంది ఉన్నారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు పలుచగా ఉన్నాయి. దీంతో కొంతమంది ఇళ్ల వద్ద నుంచి దుప్పట్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. వసతిగృహంలో గది కీటికీలకు తలుపులు సక్రమంగా లేకపోవటంతో వాటిని బట్టలు ఆరవేసే దండాలుగా ఉపయోగిస్తున్నారు. కిటీకీల తలుపులు మూసే అవకాశం లేకపోవటంతో రాత్రివేళ చలి నుంచి రక్షణ లేకుండా పోయింది. బాత్రూమ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ఆరుబయట ట్యాంకు వద్దనే చలికి వణుకుతూ స్నానాలు చేస్తున్నారు. -
హైవేపై వాహనాల రద్దీ
చిట్యాల : హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వైపునకు వాహనాలు భారీగా వెళ్తున్నాయి. చిట్యాల పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ జాం కాకుండా చిట్యాల పోలీసులు పర్యవేక్షించారు. చిట్యాల వద్ద హైదరాబాద్ వైపునకు వెళుతున్న వాహనాలు -
42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం
నల్లగొండ టౌన్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాల వద్ద రన్ ఫర్ సోషల్ జస్టీస్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాలుగా బీసీలు వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రకారం అన్ని రకాలుగా హక్కులను పొందాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను మోసం చేసే పార్టీలకు రానున్న రోజులలో తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేశబోయిన శంకర్ముదిరాజ్, కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, కంది సూర్యనారాయణ, జె.ఇంద్రయ్య, శ్యాంసుందర్, కేశవులు, వాడపల్లి సాయిబాబా, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, సీతారాములు, కొల్లోజు సత్యనారాయణ, భాస్కర్, శంకరాచారి, సమీర్, శంకర్, మాధవి, మధుయాదవ్, లింగస్వామి, శివ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ విలువలే సమాజాన్ని నడిపిస్తాయి
రామగిరి(నల్లగొండ): సమాజానికి మూలం కుటుంబమే అని, కుటుంబ విలువలే సమాజాన్ని నడిపిస్తాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్ వివాహ వేడుకపై రాసిన చేతిలో చెయ్యేసి కథల పుస్తకాన్ని ఆదివారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్ల ఆనంద్ సామాజిక బాధ్యత ఉన్న సాహిత్యకారుడు కనుక కుటుంబ ఉత్సవాలను సైతం సాహిత్య ఉత్సవాలుగా మార్చుతున్నారని అన్నారు ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నల్లగొండ కథకు పుట్టినిల్లుగా నిలిచిందని, ఇప్పుడు నల్లగొండ నుంచి వినూత్నంగా పెళ్లి నేపథ్యంగా కథలు రావడం శుభ పరిణామన్నారు. ఈ సంకలనాన్ని సృజన సాహితీ కార్యదర్శి సాగర్ల సత్తయ్య దంపతులకు అంకితమిచ్చారు. డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మునాసు వెంకట్, కోమలి కళా సమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, కవయిత్రి నాగిరెడ్డి అరుణజ్యోతి, పుస్తక సమీక్షకులు, ఎంజీయూ అధ్యాపకురాలు సి.అనితకుమారి, డాక్టర్ పొట్ట బత్తుల రామకృష్ణ, బండారు శంకర్, పుస్తక సంపాదకులు శీలం భద్రయ్య షీలా అవిలేను, డాక్టర్ పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, పెందోట సోము, మాదగాని శంకరయ్య, పగిడిపాటి నరసింహ, ఎంజీయూ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
విద్యుత్ బిల్లుల వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు
నల్లగొండ: విద్యుత్ బిల్లుల వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని ట్రాన్స్కో సీఈ యు.బాలస్వామి అన్నారు. శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చిట్యాలలో చేపట్టిన ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం నల్లగొండలో విద్యుత్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విద్యుత్ బిల్లుల వసూలులో నల్లగొండ డివిజన్ వెనుకబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం వసూలు చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులకు కూడా సబ్సిడీ ఇస్తుందని, బిల్లులు చెల్లించే స్తోమత ఉన్న వారినుంచి కూడా వసూలు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బస్తీ బాటలో భాగంగా వారానికి మూడు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి విద్యుత్ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఎ. వెంకటేశ్వర్లు, డీఈ హనుమయ్య, ఏడీఈ వేణుగోపాలచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఫ ట్రాన్స్కో సీఈ బాలస్వామి -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సూర్యాపేటటౌన్: టేకుమట్ల నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖంపై యాసిడ్ పోసిన గుర్తులు ఉన్నాయని, అంతేకాకుండా పెట్రోల్తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లు ఉందని పోలీసులు తెలిపారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ కూడా మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686006 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు. -
సమయపాలనపై పట్టింపేదీ!
నల్లగొండ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమయపాలన పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 గంటలకు తమతమ కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు, అధికారులు, వివిధ సెక్షన్ల అధికారులు 12 గంటల వరకు కూడా రావడం లేదు. శనివారం ‘సాక్షి’ విజిట్లో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంతోపాటు దానికి అనుబంధంగా కొనసాగే పలు కార్యాలయాలు, సెక్షన్లలో ఒకోదాంట్లో ఉదయం 11 గంటలు, కొన్నింటిలో 12 గంటలకు వరకు కూడా అధికారులు, సిబ్బంది కనిపించలేదు. ఆ తర్వాత వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 3.30గంటలకు ఒక్కరూ కనిపించలేదు. దీంతో దాదాపు అన్ని కార్యాలయాల గదులు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. లేట్ కమింగ్.. ఎర్లీ గోయింగ్ ఫ ఇష్టానుసారంగా జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఫ ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరుకాని అధికారులు ఫ మధ్యాహ్నం 3.30 గంటలకే ఖాళీ అవుతున్న కార్యాలయాలు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రతిరోజు ఫీల్డ్ విజిట్కు పోతున్న సమయాన్ని గమనించిన సెక్షన్ అఽధికారులతోపాటుగా ప్రోగ్రామ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులకు సక్రమంగా రావడం లేదు. ముడుపులు ముట్టజెప్పే వారు వస్తే తప్ప సెక్షన్లకు రాకుండా కొందరు ఉద్యోగులు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ అమలు చేస్తున్న పథకాల విషయంలో కనీసం కొంత సమాచారాన్ని కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సిబ్బంది లేనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా గాడితప్పిన వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజారోగ్య పరిరక్షణకు కృషిచేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఉద్యోగులు, సెక్షన్ అధికారులు తప్పకుండా విధులకు రావాల్సిందే. సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
లోక్ అదాలత్లో 2,921 కేసులు పరిష్కారం
రామగిరి(నల్లగొండ): లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ఇన్చార్జి జడ్జి జి.సంపూర్ణ ఆనంద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 31 సివిల్, 2,813 క్రిమినల్, 45 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 6 చెక్ బౌన్స్ కేసులు, 26 సైబర్ క్రైమ్స్తో కలిపి మొత్తం 2,921 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. ఇందులో ప్రమాద బీమా కేసులలో కక్షిదారులకు రూ.2,95,35,000 నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ కేసులో రికవరీ రూ.2,17,915 ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, మహిళా కోర్టు జడ్జి కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఇన్చార్జి జడ్జి సంపూర్ణ ఆనంద్ -
పల్టీకొట్టిన కంప్రెషర్ ట్రాక్టర్
● డ్రైవర్ మృతి ● మృతుడు అడ్డగూడూరు వాసికేసముద్రం: కంప్రెషర్ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి శివారులోని ఓ క్వారీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాట్రపల్లి గ్రామ శివారులోని క్వారీలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన గుంజ రాములు(53) కంప్రెషర్ నడుపుతున్నాడు. శనివారం క్వారీలోకి కంప్రెషర్ ట్రాక్టర్ను వెనక్కి తీసుకెళ్తుండగా బ్రేక్లు ఫెయిలయ్యాయి. దీంతో పది ఫీట్ల ఎత్తునుంచి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి అదృశ్యంభూదాన్పోచంపల్లి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి 13 రోజులైనా తిరిగి రాకపోవడంతో బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు శనివారం భూదాన్పోచంపల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేశ్ముఖి గ్రామానికి చెందిన వరికుప్పల స్వామి (40) ఈనెల 2న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. గతంలో కూడా ఇలానే ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగైదు రోజుల తరువాత వచ్చాడు. ఈసారి కూడా అలానే వస్తాడని కుటుంబ సభ్యులు 13 రోజులుగా ఎదురుచూశారు. కాని తిరిగి రాకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుచివ్వెంల(సూర్యాపేట): ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ హైవేపై చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో దురాజ్పల్లి గ్రామ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బండరాళ్లను దాటుకుంటూ బడికి..
నిడమనూరు : మండల కేంద్రం నుంచి బంకాపురం, వెనిగండ్ల, సూరేపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిలో నిడమనూరు ఆదర్శ పాఠశాల సమీపంలోని లో లెవల్ కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. కల్వర్టు సీసీ లైనింగ్ పూర్తిగా దెబ్బతిని రాళ్లమయంగా మారింది. ఆ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే.. మండల కేంద్రం నుంచి ఆదర్శ పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ప్రజలు ఆ బండ రాళ్లపైనుంచే వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, ధాన్యాన్ని తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. లోలెవల్ కల్వర్టు స్థానంలో రూ.3 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. లోలెవల్ కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు రైతులు కోరుతున్నారు. -
‘పెండ్లిపాకల’ పనులు పునరుద్ధరిస్తాం
కొండమల్లేపల్లి: ఇటీవల కురిసిన మోంథా తుపాను వల్ల దెబ్బతిన్న పెండ్లిపాకల రిజర్వాయర్ పనులన్నీ పునరుద్ధరిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని దెబ్బతిన్న పెండ్లిపాకల రిజర్వాయర్ను శనివారం ఆమె.. ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె ఒకటవ వీయర్ నుండి 5వ వీయర్ వరకు కాలినడకన పర్యటిస్తూ రిజర్వాయర్ కింద ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన కాలువలు, దెబ్బతిన్న, రహదారులు, బాటలను, కుంట కట్టల పరిస్థితిని పరిశీలించారు. అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే గ్రావిటీ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుందని కలెక్టర్కు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండ్లిపాకల పనుల పునరుద్ధరణకు ఎఫ్డీఆర్లను పంపించినట్లు తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ భద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ నాయక్, డీఈ రాములు, ఏఈఈ భాస్కర్ రావు, శ్రవణ్, సతీష్, కొండమల్లేపల్లి తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ అజ్మీరా రమేష్ ఉన్నారు. నక్కలగండి పరిశీలన చందంపేట : చందంపేట మండలంలోని తెల్దేవర్పల్లి పరిధిలోని నక్కలగండి రిజర్వాయర్ పనులను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు రావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో కలెక్టర్ పర్యటించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు. నెలాఖరు వరకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ నల్లగొండ: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నల్లగొండ కలెక్టరేట్ నుంచి శనివారం ఆమె హౌసింగ్ పీడీ, ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మొత్తం వీడియో తీయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మిర్యాలగూడ ఆస్పత్రి సూపరింటెండెంట్పై వేటు
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస సమరథ్పై వేటు పడింది. ఆయనను సూపరింటెండెంట్ పోస్టు నుంచి తప్పించి అతడి స్థానంలో డాక్టర్ బి.రంగయ్యను నియమిస్తూ జిల్లా వైధ్యాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో శనివారం రంగయ్య బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులుగా ఏరియా ఆస్పత్రిలో నిర్వహణ గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే సూపరింటెండెంట్ను తొలగించారని ప్రచారం జరగుతోంది. దీనికితోడు ఇటీవల ఒక మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి రాగా ఆమెకు సరైన వైద్యం అందక మృతి చెందిందని రోగి బందువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ సైతం సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో ఏరియా ఆస్పత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంట్లోభాగంగా డాక్టర్ రంగయ్యను సూపరింటెండెంట్గా నియమించినట్టు తెలుస్తోంది. ఫ కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ రంగయ్య నియామకం -
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం
నార్కట్పల్లి: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన మందడి సుఖేందర్రెడ్డి(40) 20 ఏళ్ల క్రితం నార్కట్పల్లికి వలస వచ్చి ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సుఖేందర్రెడ్డికి స్వగ్రామం పుల్లెంలలో ఎకరం భూమి ఉండగా.. అందులో పత్తి సాగుచేస్తున్నాడు. సరైన దిగుబడులు రాక అప్పుల పాలైన సుఖేందర్రెడ్డి మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. మృతుడి నేత్రాలు దానం.. మృతుడు సుఖేందర్రెడ్డి నేత్రాలను కుటుంబ సభ్యుల అనుమతితో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ సభ్యులు సేకరించారు. -
హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా..
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై శనివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో కారులో వస్తున్న వ్యక్తులు కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నాగారం మండల పరిఽధిలోని నాగారం బంగ్లాలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం బంగ్లాలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శీలం కమలాకర్(34)కు గతంలో తనతో కలిసి కానిస్టేబుల్గా పనిచేసిన అశోక్ కలవడంతో రోడ్డు పక్కకు వచ్చి అతడితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనగామ నుంచి సూర్యాపేట వైపు అతివేగంగా కారులో వెళ్తున్న వ్యక్తులు ముందున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కన నిల్చున్న కానిస్టేబుల్ కమలాకర్, అశోక్తో పాటు మరో వ్యక్తిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కమలాకర్కు రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. అశోక్కు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. కానిస్టేబుల్ కమలాకర్ను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడతో హైదరాబాద్కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. మృతుడి స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ గ్రామం. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్కు తరలించేకంటే ముందు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కానిస్టేబుల్ కమలాకర్ను ఎస్పీ నరసింహ పరామర్శించారు. కారు ఢీకొని కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
బెదిరింపులతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచింది
నకిరేకల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయడంతోపాటు బెదిరింపులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దొంగ ఓట్లతో గెలిచిందని, అక్కడ నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో ప్రధానంగా ప్రచార సభల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికలతో పోల్చితే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ బలహీన పడలేదన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్రెడ్డి ప్రకటించిన ప్రకటనలు ఉత్తవేనని అన్నారు. దివగంత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాల హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సెంటర్లను మహిళలకు కేటాయించకుండా పీఏసీఎస్ వారికి అప్పగించడం రైతులను దోపిడీ చేసేందుకేనని మండిపడ్డారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి బాగా లేదని ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు గోర్ల వీరయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, పల్లె విజయ్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ఓటరు జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్
నల్లగొండ: ఓటరు జాబితా సవరణపై శని వారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా నవీకరణ, అభ్యంతరాల పరిష్కారం, డేటా ఎంట్రీ వంటి ముఖ్య అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్కు ఇన్చార్జి డీఆర్ఓ అశోక్రెడ్డి, చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్లు హాజరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాంనాగార్జునసాగర్: సాగర్లోని కమలానెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్య వికటించి పలువురు పిల్లల అస్వస్థతకు కారణమైన వారిపై కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. సాగర్ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యం వికటించి 17మంది పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి శనివారం సాయంత్రం ఆసుపత్రిని సందర్శించారు. పిల్లలు వైద్యం పొందుతున్న వార్డును సందర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. పిల్లలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషితిరుమలగిరి(నాగార్జునసాగర్): మత్స్యకారుల సంక్షేమానికే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఈసం మారయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన ఉచిత చేపపిల్లలను శనివారం ఆయన మత్స్యకారులతో కలిసి తిరుమలగిరి(నాగార్జునసాగర్) మండలం తిరుమలగిరి, చిల్కాపురం, అల్వాల, రాజవరం, చింతలపాలెం, సఫావత్ తండాల్లోని చిన్న, పెద్ద చెరువుల్లో వదిలారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఓ గంట హర్షిత, కార్యదర్శి శేఖర్, సొసైటీ చైర్మన్ పిట్టల కృష్ణ, కటికర్ల మల్లయ్య, చింతకాయల శ్రీను, నగేష్, మారయ్య, యల్లోజి, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. పుస్తక పఠనం అలవర్చుకోవాలిరామగిరి (నల్లగొండ) : ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ఖాన్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను జిల్లా ఉపాధికల్పన అధికారి నంద పద్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బాలమ్మ, మాజీ చైర్మన్ గాదె వినోద్రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్.వేణుగోపాలచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేపాల్ అమ్మాయి.. నకిరేకల్ అబ్బాయి
నకిరేకల్: నేపాల్ దేశానికి చెందిన యువతిని నకిరేకల్కు చెందిన యువకుడు శనివారం నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వివరాలు.. కేతేపల్లి మండల పరిధిలోని బండపాలెం గ్రామ పంచాయతీకి చెందిన బచ్చుపల్లి భిక్షపతిరావు, సక్కుబాయమ్మ దంపతులు చాలా ఏళ్లుగా నకిరేకల్లో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే ఉంటున్నారు. వారి కుమారుడు రాజేష్ ఉన్నత చదువులు పూర్తయ్యాక హోటల్ మేనేజ్మెంట్ చేసేందుకు ఏడేళ్ల క్రితం దుబాయ్కు వెళ్లాడు. అక్కడ రాజేష్కు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతానికి చెందిన సుజీతతప పరిచయం ఏర్పడి ప్రేమగా మారిది. వారిద్దరు కలిసి దుబాయ్లో నాలుగేళ్లు పనిచేశాక.. కెనడాకు వెళ్లి అక్కడ మూడేళ్లు కలిసి పనిచేశారు. తిరిగి నకిరేకల్కు వచ్చి స్థిరపడాలనుకుని ఇద్దరు కలిసి ఇక్కడకు వచ్చారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల సభ్యులకు తెలపగా వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో పెద్దల సమక్షంలో శనివారం నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం నకిరేకల్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో తెలుగు సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. త్వరలో నకిరేకల్లోని హోటల్ స్థాపించి ఇక్కడే నివాసముండనున్నట్లు రాజేష్ దంపతులు తెలిపారు. -
పార్ట్టైం జాబ్ పేరిట సైబర్ నేరగాళ్ల టోకరా
చౌటుప్పల్: పార్ట్టైం జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు ఓ యువకుడికి టోకరా పెట్టారు. అత్యాశకు పోయిన సదరు యువకుడు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి చౌటుప్పల్ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల అతడి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. కాగా.. ఈ నెల 5న అతడి వాట్సాప్కు సైబర్ నేరగాళ్లు ఓ మెసేజ్ పంపారు. దీంతో సదరు యువకుడు నాలుగు రోజుల పాటు చాటింగ్ చేశాడు. అనంతరం యువకుడిని సైబర్ నేరగాళ్లు తమ వాట్సాప్ గ్రూప్లో చేర్చుకున్నారు. అనంతరం స్వాతికృష్ణ అనే మహిళ పేరుతో సదరు యువకుడితో వాట్సాప్లో చాటింగ్ చేసి సెల్ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటి వద్దనే ఉంటూ ప్రతిరోజు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు సంపాదించవచ్చని నమ్మించారు. దీంతో ఈ నెల 10న యువకుడు తన ఫోన్ నంబర్తో ఐడీ క్రియేట్ చేసుకుని తన వివరాలను వారికి షేర్ చేశాడు. వెంటనే మరో యువతి లైన్లోకి వచ్చి తన పేరు, ఇతర వివరాలు చెప్పి తాను హోటల్ రిసెప్షనిస్ట్నని పరిచయం చేసుకుంది. యువకుడి పేరు, ఫోన్, చేసే పనితో పాటు వ్యక్తిగత వివరాలు సైతం సేకరించింది. తర్వాత తన ఐడీతో రూ.800 పెట్టుబడి పెట్టమని యువకుడికి చెప్పింది. కొద్ది క్షణాల్లోనే రూ.1040 లాభం వచ్చినట్లు అతడి ఫోన్కు మెసేజ్ వచ్చింది. అనంతరం అతడితో పలుమార్లు పెట్టుబడి పెట్టించారు. వాటికి రూ.40,000 లాభం వచ్చినట్లు మెసేజ్ చేశారు. కానీ ఆ డబ్బులను తమ వద్దనే పెట్టుకున్నామని, వాటికి మరింత తాము జమ చేస్తామని నమ్మించారు. అయినా వదలని కేటుగాళ్లు ఆ యువకుడితో ఆరోజు మొత్తంగా రూ.2,92,663 పెట్టుబడిగా పెట్టించారు. అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టి.. ఇంత జరిగినా ఇదేదో మోసంగా ఉన్నదని యువకుడు గ్రహించకుండా పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలి, అవసరమైతే రెండింతల లాభాలు గడించాలని ఆశ పెంచుకున్నాడు. మరుసటి రోజున పెట్టుబడి పెట్టేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఈ నెల 11న తన బంధువు వద్ద రూ.5,00,000 అప్పుగా తెచ్చుకున్నాడు. ఈ నెల 12న తిరిగి తన వద్ద ఉన్న డబ్బులను పెట్టుబడిగా పెట్టాడు. అదంతా పోయింది. మొత్తంగా ఆ యువకుడు రూ.8,42,663 పోగొట్టుకున్నాక ఇక వద్దనుకునే ఆలోచన చేస్తుండగా.. తిరిగి కేటుగాళ్లు మరోసారి లైన్లోకి వచ్చారు. నీకు 90పాయింట్లు వచ్చాయి, 100పాయింట్లు పూర్తయితే నీ డబ్బులు తిరిగి వస్తాయి, అందుకోసం నీకు తక్కువగా ఉన్న 10పాయింట్లను పాయిట్కు 10వేల రూపాయల చొప్పున రూ.1,00,00తో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో తీవ్రంగా ఆలోచన చేసిన సదరు యువకుడు జరిగిన విషయాన్ని అదే రోజున తన మిత్రులతో పంచుకున్నాడు. స్నేహితులు చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. అయినప్పటికీ కేటుగాళ్లు యువకుడిని ఏమాత్రం వదలకుండా వాట్సాప్ చాటింగ్ చేస్తూ మరింతగా ప్రలోభాలకు గురిచేయసాగారు. చివరకు ఈ నెల 14న సదరు యువకుడు 1940 నంబర్కు ఫోన్చేసి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. శనివారం సైబర్ క్రైం కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. యువకుడి నుంచి రూ.8,42,663 కొట్టేసిన కేటుగాళ్లు సైబర్ క్రైంకు ఫిర్యాదు -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో శుక్రవారం అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీశైలం, కోశాధికారి జి.మోహన్రెడ్డి, గాయం నారాయణరెడ్డి, రంగయ్య, మోహన్రావు, యుగేందర్రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కె.నారాయణరెడ్డి, బి.లింగయ్య, ఎండీ హుస్సేన్, ఎం.శంకర్రెడ్డి, సంతోష్రెడ్డి, యాదగిరి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి
రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయ అభివృద్ధికి కృషిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాఫీస్ ఖాన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జిల్లా గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ గ్రంథాలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించామన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 20 వరకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అసోసియేషట్ ప్రెసిడెంట్ ఎస్.వేణుగోపాలచార్యులు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఎంఎస్.శ్రవణ్కుమార్, మాజీ కౌన్సిలర్లు బషీరుద్దీన్, సమద్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్రెడ్డి, అల్లి సుభాష్, చొల్లేటి ప్రభాకర్, లైబ్రేరియన్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలికేతేపల్లి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నకిరేకల్ సీనియర్ జవిల్ జడ్జి, న్యాయసేవా అధికారిణి మంజుల సూర్యావర్ అన్నారు. నకిరేకల్ మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు ప్రకాశ్రావు, దోడ సోమయ్య, చౌగోని నాగరాజు, వంగూరి వెంకన్న, కేతేపల్లి ఏఎస్ఐ ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలి
నల్లగొండ టూటౌన్: చదువే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలన్నారు.ఆడపిల్లలు మంచిగా చదువుకుంటే కలెక్టర్లుగా, డాక్టర్లుగా తయారు కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణ, నాగసేనారెడ్డి, డీసీపీఓ గణేష్, సరి త, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దు నల్లగొండ: ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇతర కళాశాలల్లనూ ర్యాగింగ్కు పాల్పడకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జె.సత్యనారాయణ, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, కళాశాల అదనపు ప్రిన్సిపాల్ ఆర్.రాధాకృష్ణ, సురేస్ గుప్తా పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే..
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్ వద్ద బీసీ జేఏసీ నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రం ఎంతకు కల్పించరని ప్రశ్నించారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్గౌడ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య, దుడ్డు కృష్ణమూర్తి, పుట్ట వెంకన్నగౌడ్, కట్టెకోలు దీపేందర్, చిలకరాజు సతీష్ కుమార్, కర్నాటి యాదగిరి, తల్లారి యాదగిరి, ఎంఏ.ఖదీర్, చెన్నూరి భరద్వాజ, నీలకంఠం నాగరాజు, మార్గం సతీష్ కుమార్, చెన్నోజు రాజు, పి.నాగరాజు, బి.ధర్మేందర్, ఆర్.బాలాజీ పాల్గొన్నారు. -
ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన
రామగిరి(నల్లగొండ): ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇందిరమమ్మ ఇళ్లు, సిమెంట్ రోడ్లు, నర్సరీ, ఐకేపీ సెంటర్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. వీరికి గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఎంపీడీఓ యాకుబ్నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జె.మహేష్, హిమబిందు, స్వర్ణలత, వేద రక్షిత, వంశీధర్ ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. -
నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు
నల్లగొండ టూటౌన్: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుకవ్రా రం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి, పాఠశాల ప్రిన్సి పాల్ ఉదయ్కుమార్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్రే స్కానింగ్ను సద్వినియోం చేసుకోవాలి నల్లగొండ: జిల్లా క్షయ నివారణ కేంద్రం సహకారంతో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కోసం ఏర్పాటు చేసిన ఏఐ టెక్నాలజీ ఎక్స్రే స్కానింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని పోలీస్ కార్యా లయంలో ఆధునిక ఏఐ టెక్నాలజి ఎక్స్రే స్కానింగ్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 14 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ మొబైల్ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఛాతీ ఎక్స్రే, రక్త పరీక్షలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, డాక్టర్ ప్రదీప్, రవి ప్రసాద్, జమా ల్, సూపర్వైజర్ బి.అనిల్ కుమార్, ఎం.సైదులు, వెంకట రెడ్డి, సయాదుద్దీన్, ఇనాయత్ అలీ, లెనిన్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కథల పోటీల్లో బహుమతుల పంట
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు ఉప్పల పద్మ పర్యవేక్షణలో పలువురు విద్యార్థినులు కథలు, రచనలు చేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. గతేడాది బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థిని సీమ హన్సిక పాల్గొని కన్సొలేషన్ బహుమతి పొందింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థిని కంకాల శిరీష రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించింది. ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాల సాహిత్య పరిషత్, మాచిరాజు బాల సాహిత్య పీఠం సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో గుండ్రాంపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కూరాకుల భావన రాసిన నాన్న కష్టం కథకు ప్రోత్సాహక బహుమతి లభించింది. తెలంగాణ సాహితి నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాఠశాలకు చెందిన ఆర్. వాసవి ద్వితీయ స్థానంలో, అక్షిత కన్సొలేషన్ బహుమతులు పొందారు. -
దర్వేశిపురంలో నేడు బహిరంగ వేలం
కనగల్ : మండల పరిధిలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి (2026) వస్తు విక్రయ హక్కులను కల్పించేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయల వేలంలో పాల్గొనే వారు రూ.10 లక్షలు, పూలుపండ్లకు రూ.3 లక్షలు, గాజుల అమ్మకాలకు రూ.1లక్ష, ఆలయ ఫంక్షన్హల్కు రూ.50 వేలు, దేవస్థానం వద్ద ఫొటోలు తీయడానికి రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలలోపు షీల్డ్ టెండర్కు డీడీని జతపరిచి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలని సూచించారు. బుద్ధవనం అద్భుతంఫ రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాలపెద్దవూర : సాగరతీరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం అద్భుతమైన శిల్పకళా నిర్మాణమని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల ప్రశంసించారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆయన బుద్ధవనాన్ని సందర్శించి, బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహాస్థూపం సమావేశ మందిరంలో ప్రదర్శించిన బుద్ధవనం విశేషాలపై లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర ఎంపీ సిన్హాకు బుద్ధవనం నిర్మాణ విశేషాలను తెలియజేసి కండువాతో సత్కరించి, బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశపు సంస్కృతికి, చరిత్రకు బుద్ధవనం ప్రతీకగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకుడు శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణరామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఏ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 76600 22517, 08682 244416 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షలకు 1160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలిమునుగోడు : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. గురువారం ఆయన మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా అమర్చిన టీబీ ఎక్స్రే మిషన్ పనితీరును పరిశీలించారు. ఆ మిషన్ ద్వారా ఎక్స్రే తీయించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
గంజాయి నిందితుల రిమాండ్
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డ నిందితులును గురువారం రిమాండ్కు తరలించినట్లు తరలించారు. హైదారాబాద్కు చెందిన అల్లం సాంబశివుడు, కర్రీ శ్రీనివాస్(24), కర్రీ రేషిత సంధ్య గంజాయిని ఏపీలోని సీలేరులో కొనుగోలు చేసి హైదారాబాద్కు తరలిస్తుండగా పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వారి నుంచి 24 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి వేములపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పెదపంగ జానమ్మ(65) ఈ నెల 7న మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం సమీపంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జానమ్మను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ధాన్యం తూకాల్లో మోసాలు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ : ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉండేవారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించి తూకాల్లో మోసాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ ఆరోపించారు. నకిరేకల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 2 కేజీలు అధికంగా తుకాలు వేస్తున్నారని, నిర్వాహకులకు కమీషన్ ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు కొప్పుల ప్రదీప్రెడ్డి, తలారి బలరాం, మారం వెంకట్రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, గొర్ల వీరయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు. -
ఆడిట్తో అక్రమాలకు చెక్
ఫ ఎస్ఎల్ఎఫ్ సంఘాల పొదుపుపై కొనసాగుతున్న ఆడిట్ ఫ నీలగిరి పట్టణంలో 75 సంఘాలు నీలగిరి పట్టణంలో ఎస్ఎల్ఎఫ్ సంఘాలు 75 ఉండగా.. వీటిలో 750 మంది సభ్యులు ఉన్నారు. వీరు ప్రతినెలా పొదుపు చేసిన డబ్బులు, తీసుకున్న రుణం, ఇచ్చిన అప్పు తదితర లెక్కలు పక్కాగా తీయడానికి ఒక్కో పొదుపు సంఘానికి ఆడిట్ చేసే సిబ్బంది రూ.1000 చొప్పున తీసుకుంటున్నారు. అయితే పొదుపు సంఘాల మహిళలకు ఆడిట్ ఖర్చు ఎక్కువగానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు సిబ్బంది 75 సంఘాలను రెండు రోజుల్లోనే ఆడిట్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకు రూ.75 వేలు అవుతుండడం గమనార్హం. నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని స్లమ్ లెవర్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్) సంఘాల మహిళల పొదుపు లావాదేవీలపై ఆడిటింగ్ ప్రారంభమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ జరుగుతోంది. స్లమ్ లెవల్ ఫెడరేషన్ కింద నీలగిరిలో 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఇటీవల 40 సంఘాల ఆడిట్ పూర్తి కాగా, గురువారం 35 సంఘాల వారు ఆడిటింగ్ చేయించారు. ఏటా ఆడిటింగ్ చేయడం ద్వారా సంఘంలో జరిగే పూర్తి వివరాలు తెలియడంతోపాటు అక్రమాలకు సైతం చెక్ పడనుంది. రూపాయితో సహా అన్నింటిని సంఘ సభ్యులకు పేపర్పై రాసి లెక్కలు చెబుతున్నారు. రూ.1000 వరకు పొదుపు నీలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్లమ్ లెవల్ ఫెడరేషన్ కింద 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ప్రతి 15 సంఘాలు కలిసి ఎస్ఎల్ఎఫ్ సంఘంలో నెలకు రూ.100 నుంచి రూ.1000 వరకు పొదుపు చేసుకుంటున్నారు. బ్యాంకుతో సంబంధం లేకుండానే పొదుపు చేసుకున్న డబ్బులను సంఘంలో వ్యాపార అవసరాలు ఉన్న మహిళలు అప్పుగా ఇస్తారు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీతో సహా నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వారి వ్యాపారాన్ని బట్టి ఒకొక్కరికి రూ.లక్ష వరకు రుణం ఇస్తుంటారు. ఆయా సంఘాల వారు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, తీసుకున్న రుణం, చెల్లింపులు, అప్పు తదితర వాటిపై ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో 75 ఎస్ఎల్ఎఫ్ సంఘాల లావాదేవీలను ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది ఆడిట్ చేస్తున్నారు. ఏటా ఆడిటింగ్.. పొదుపు సంఘాల మహిళలు తమ అవసరాల కోసం తీసుకుంటున్న రుణాలను తిరిగి చెల్లింపులు జరుపడం, 15 సంఘాల వారు కలిసి పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా తీసుకుంటున్న రుణం, వడ్డీ తదితర వాటికి సంబంధించిన డబ్బుల లావాదేవీలు పారదర్శకంగా ఉండాల్సి ఉంటుంది. దాంతో ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ప్రక్రియ చేపట్టి అవకతకలను గుర్తిస్తుంటారు. ఎస్ఎల్ఎఫ్ సంఘాలు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, ఇచ్చే రుణం, అప్పు తదితర వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సర ఆడిటింగ్ నడుస్తుంది. చిన్న, చిన్న పొరపాట్లు ఉన్నా.. గుర్తించి లెక్కలు సరిచేస్తారు. పారదర్శకత కోసమే ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం. – శ్రీనివాస్, మెప్మా టీఎంసీ, నల్లగొండ -
బీసీ జేఏసీ ధర్మపోరాట దీక్ష
నల్లగొండ టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఎన్జీ కళాశాల వద్ద ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ఫ్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బాధ్యతను తీసుకుని పార్లమెంట్లో చట్టపవరణ చేయించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తండు సైదులుగౌడ్, సుంకరి మల్లేష్గౌడ్, పిల్లిరామరాజు, కేశబోయిన శంకర్ముదిరాజ్, కంది సూర్యనారాయణ, కొల్లోజు సత్యనారాయణ, నేటపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, జివ్వాజి ఇంద్రయ్య, సీతారాములు, శంకర్, సాయిబాబా, వెంకటేశ్వర్లు, నల్ల సోమమల్లయ్య, ఎల్లంరాజు, చొల్లేటి రమేష్, శ్యాంసుందర్, ఆదినారాయణ, మధుయాదవ్, రాములు, గోవర్ధనచారి పాల్గొన్నారు. -
బాల మేధావి అక్షయ
తిప్పర్తి: ఆడుతూ పాడుతూ మారం చేసే చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించి పలువురి మన్ననలు అందుకుటోంది. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నెలగొందరాశి రమేష్, దివ్యభారతి దంపతుల మొదటి సంతానం అక్షయ. రెండున్నరేళ్ల వయసున్న అక్షయ తన మేధోశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం అక్షయ నల్లగొండలోని ఆల్ఫా స్కూల్లో యూకేజీ చదువుతుంది. అక్షయ తండ్రి రమేష్ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తల్లి దివ్యభారతి మార్కెట్కు, షాపింగ్కు వెళ్లినప్పుడు అక్కడ కనపడిన వస్తువులను అక్షయకు పదేపదే చెప్పగా ఆమె వాటన్నింటినీ గుర్తుకుపెట్టుకుని తిరిగి చెప్పేది. అక్షయ జ్ఞాపకశక్తిని గ్రహించిన తండ్రి రమేష్ ఆమెకు ప్రపంచ దేశాల పేర్లు ఒకటి రెండుసార్లు చెప్పగా.. ఆమె వెంటనే టకీమని వాటిని తిరిగి చెప్పేది. రెండున్నరేళ్ల వయసులోనే 104 దేశాల పతాకాలను గుర్తించడంతో పాటు రసాయన మూలకాలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాపటాలను గుర్తించి వారి పేర్లు చెప్పేది. రాష్టాలు, వాటి రాజధానులు, పండ్లు, కూరగాయల పేర్లు, ప్రపంచ పటంలోని ఖండాలను గుర్తించి చెప్పేది. అక్షయ మేధోశక్తిని తండ్రి రమేష్ గుర్తించి తెలిసిన వారి ద్వారా 2022లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో పేరు నమోదు చేయించాడు. వారు అక్షయ మేధోశక్తిని గుర్తించి బుక్ ఆఫ్ ఛాంపియన్ వరల్డ్ రికార్డులో ఆమె పేరును ప్రకటించారు. అనంతరం ఆ సంస్థ చైర్మన్ బీవీ పట్టాభిరాం చిన్నారి అక్షయ పేరు వరల్డ్ రికార్డులో నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అక్షయ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ సైతం అందుకుంది. -
6,57,229 ఎకరాల్లో సాగు
యాసంగి ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయ శాఖనల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా ప్రస్తుత యాసంగి సీజన్లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విత్తనాలకు ఇండెంట్ యాసంగి సీజన్కు సంంధించిన వరి, పెసర, వేరుశనగ విత్తనాల కోసం జిల్లా వ్వవసాయ శాఖ అంచనా లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపించింది. వరి విత్తనాలైన ఎంటీయూ 1010, బీపీటీ, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ రకాలు 1,20,850 క్వింటాళ్లు, పెసర 1100 క్వింటాళ్లు, వేరుశనగ 22,180 క్వింటాళ్లు అవసరంగా గుర్తించిన వ్యవసాయ శాఖ దానికి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. 1,62,200 టన్నుల ఎరువులు అవసరం జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు 1,62,200 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా జిల్లా వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందులో యూరియా 74,955.08 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,582.69 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,600.68 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 46,628.22 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 7433.07 మెట్రిక్ టన్నులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.యాసంగి సాగు అంచనా వివరాలు ఇలా పంట ఎకరాలు వరి 5,64,678 సజ్జ 50 జొన్న 1,400మొక్కజొన్న 825పెసర 1,100వేరుశనగ 22,180 ఉదాన పంటలు 65,794 ఇతర పంటలు 1,202మొత్తం 6,57,229 యాసంగి సీజన్కు అవసరమైన విత్తనాలు,ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించాం. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
వావ్.. వండర్ కిడ్స్
బాలల రక్షణకు ప్రత్యేక చట్టాలు చివ్వెంల(సూర్యాపేట): బాలల హక్కుల్ని కాపాడేందుకు 1989 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల తీర్మాణాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశం కాబట్టి 1992 డిసెంబర్ 11న ఈ తీర్మాణాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం 18ఏళ్ల లోపు వయస్సు వారంతా బాలలే. బాలల రక్షణ కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. ఆర్టికల్ 1 నుంచి 52 వరకు బాలల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాలను అమలు చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలు బడిలో మాత్రమే ఉండాలి. గనులు, ఇటుక బట్టీలు, హైరిస్క్ ప్రాంతాలు, కిరాణా షాపుల్లో బాలల చేత పనులు చేయించరాదు. బాల కార్మిక చట్టం 1986, రూల్– 2బి ప్రకారం ఆర్టీఈ చట్ట ప్రకారం బాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పనిచేయరాదు. పెద్దలు చేసే పనికి ప్రత్యామ్నాయంగా పిల్లలు పని చేయరాదు. చట్టానికి వ్యతిరేకంగా బాలల చేత పనులు చేయిస్తే సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 సెక్షన్ 2(ఎ) ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయి, 21 ఏళ్లు నిండని అబ్బాయి బాల్య దశలో ఉన్నట్లుగా గుర్తించబడుతారు. బాల్య వివాహంలో యుక్త వయస్సు ఉన్న పురుషుడు, బాలిక తల్లిదండ్రులు, సంరక్షకులు, వివాహాన్ని జరిపించిన, ప్రోత్సహించిన వ్యక్తులు, వివాహ కార్యక్రమానికి హజరైన వ్యక్తులు దోషులుగా గుర్తించబడుతారు. వీరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. పిల్లలపై లైంగిక దాడి చేయడం, అవమానించడం, వేధించడం నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్(పోక్సో)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పిల్లలపై నేరానికి పాల్పడిన వారికి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. నేరారోపణ ఎదుర్కొంటున్న బాలలతో పాటు నేరం చేసినట్లు రుజువైన బాలల సంరక్షణ, వారి పోషణ, అవసరమైన పిల్లలకు వారి ప్రాథమిక అవసరాలు తీర్చడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం, పునరావాసం, వారికి అవసరమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడం కోసం చేసిన చట్టాలను ఏకం చేస్తూ సవరించిన చట్టం ఇది. ఈ చట్టం ద్వారా అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడిన బాలలకు సరైన రక్షణ, సంరక్షణ దొరుకుంతుంది.అక్షయ సాధించిన తెలుగు, వరల్డ్ బుక్ రికార్డుల సర్టిఫికెట్లు అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఔరా అనిపించుకుంటున్న బాలలు తెలుగు, ఇండియా , వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు నేడు బాలల దినోత్సవంఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాధారణంగా రెండున్నర నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు అప్పుడప్పుడే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ బుడతడు జంతువులు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో సహా దాదాపు 10 అంశాలను గుర్తుంచుకుని అతి పిన్న వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన వెల్గూరి రాజేష్, లిఖితకు 2022లో వివాహం జరిగింది. రాజేష్ సూర్యాపేటలోని యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. లిఖిత గృహిణి. వీరికి కుమారుడు అద్వైత్ జన్మించగా.. ప్రస్తుతం అతడి వయస్సు 27 నెలలు. చిన్నప్పటి నుంచి అద్వైత్ చాలా చురకుగా ఉండేవాడు. ఇది గమనించిన తల్లి లిఖిత ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని అద్వైత్కు చెబుతూ ఉండేది. ఇలా చెప్పిన విషయాలను మరునాడు అడిగితే తిరిగి చెప్పేవాడు. 10 అంశాలతో రికార్డుల్లోకి..! అద్వైత్ ఏడాది వయస్సు ఉన్నప్పుడే 10 మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను చూపిస్తే వారిని గుర్తించి తిరిగి చెప్పేవాడు. అలాగే 10 శరీర భాగాలు, 10 రకాల జంతువులు, 12 రకాల ఫలాలు, ఏ నుంచి జెడ్ వరకు ఆంగ్ల వర్ణమాల పదాలు, 10 రకాల మంచి అలవాట్లు, 5 రకాల వాహనాల పేర్లు, 4 రకాల రంగులను వెంటనే గుర్తించి చెబుతాడు. వీటన్నింటిని రికార్డు చేసి తల్లిదండ్రులు అద్వైత్ 21 నెలల వయస్సులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపించగా.. రెండు నెలలకు అతడికి అందులో చోటు దక్కింది. ప్రస్తుతం ఇవే కాకుండా ఇంగ్లిష్లో నెలలు, వారాల పేర్లు చెబుతున్నాడు. మరో 10 దాకా వివిధ రాష్ట్రాల రాజధానులను అడిగితే టకీమని చెబుతూ అబ్బుర పరుస్తున్నాడు. -
‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’..
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్న రీతిలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’ అని హోరింగ్పై పెద్ద అక్షరాలతో రాయించారు. దాని కింద ‘ఎవ్రీ లైఫ్ కౌంట్–నల్లగొండ పోలీస్ కేర్’ అని రాసి ఉంది. అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదానికి గురై తుక్కుగా మారిన కారును కూడా హోర్డింగ్కు ప్రత్యేకంగా అమర్చారు. ఈ హోర్డింగ్.. హైవే మీద ప్రయాణించే వారికి ఒక కిలోమీటర్ దూరం నుంచే కనిపించేలా 25ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారీ హోర్డింగ్ను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలకు అనుగుణంగా నియమిత వేగంతో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకోవాలన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు
మునుగోడు : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆమె మునుగోడులో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటా వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పత్తి సాగుచేసిన రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునేందుకు 12 శాతంలోపు తేమతో ఉంటేనే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కిష్టాపురం గ్రామంలో ఓ యువ రైతు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేసే పంటలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం ధరిచేరదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎం గోపికృష్ణ, డీఎస్ఓ వెంకటేష్, డీసీఓ సత్యనాయక్, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, సీఈఓ సుఖేందర్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నీటి గుంతలో పడి రైతు మృతి
ఫ మృతుడి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు కనగల్: నీటి గుంతలో పడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం కనగల్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండల కేంద్రానికి చెందిన రైతు నక్కల శంకరయ్య(64) ధాన్యం కాంటా వేయించేందుకు గురువారం తెల్లవారుజామున తన కుమారుడు రాజుతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. శంకరయ్యను వడ్ల రాశి వద్ద ఉండమని చెప్పి రాజు అమ్మగూడెం గ్రామంలో వడ్ల కాంటాను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. రాజు తిరిగి వచ్చేసరికి పొలం వద్ద తన తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతుండగా పొలం పక్కన గల నీటి గుంతలో శంకరయ్య పడిపోయి ఉన్నాడు. పక్కనే ఉన్న హమాలీలను పిలిపి వారి సహాయంతో శంకరయ్యను గుంత నుంచి బయటకు తీయగా.. అప్పటికే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజీవ్రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు శంకరయ్య నేత్రాలను నల్లగొండ లయన్స్ క్లబ్ ఐ డొనేషన్ చారిటబుల్ ట్రస్ట్కు కుటుంబ సభ్యులు దానం చేశారు. -
‘కథ’నరంగంలో సత్తా చాటుతున్న విద్యార్థులు
చిట్యాల: వారంతా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులలో పలువురు ప్రవృత్తిగా కవిత, రచనలు రాసే వారున్నారు. ఆ ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో విద్యార్థులు సైతం కవితలు, కథలు రాస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి జెడ్పీహెచ్ఎస్కు చెందిన నలభై మంది విద్యార్థులు 2019లో ఖమ్మం జిల్లాలోని పాపికొండలు ప్రాంతానికి ఉపాధ్యాయులతో కలిసి విజ్ఞాన, విహారయాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో విద్యార్థులు పొందిన అనుభవాలను, అనుభూతులను కథ రూపంలో రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఆ పాఠశాలలో భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకులుగా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు రాసిన వ్యాసాలు, కవితలతో ‘రెక్క విప్పిన బాల్యం’ పుస్తకాన్ని ప్రచురించి ప్రముఖ కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు.. అదే పాఠశాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు కూడా కథలు రాసేందుకుగాను ఆసక్తితో ఉండటంతో 2022లో కవులు, రచయితలతో ప్రత్యేక శిబిరాన్ని ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. ఆ శిబిరంలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు పలు కథలు రాయగా.. ఆ కథలతో ‘కథల బండి’ పుస్తకాన్ని ముద్రించారు. 2024లో జర్నీ పుస్తకం.. 2023లో మరోసారి పాఠశాల విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రలో భాగంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ యాత్ర నేపథ్యంలో విద్యార్థులు రచించిన కథలతో ‘జర్నీ’ పుస్తకాన్ని ఉపాధ్యాయులు పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకీయంలో ముద్రించారు. ఈ పుస్తకాన్ని 2024 నవంబర్ 14న ఆవిష్కరించారు. -
మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్ట్
కొండమల్లేపల్లి: మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న దొంగల ముఠాను గురువారం చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందిన అమ్ములూరి విజయ్ప్రసాద్, అమ్ములూరి నందిని, నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్కుమార్, గుంజ కార్తీక, అనుముల మండలం అలీనగర్కు చెందిన సంపంగి శారద, సంపంగి వెంకటేష్, శబరీష్ ముఠాగా ఏర్పడి మేకలు, గొర్రెల చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున చింతపల్లి మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అటుగా స్కార్పియో కారులో వచ్చిన వీరు పోలీసులను చూసి తప్పింకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకునే లోగా సంపంగి వెంకటేష్, శబరీష్ కారు దిగి పారిపోయారు. మిగతా ఐదుగురికి అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ స్కానర్తో చెక్ చేయగా.. గతంలో వారిపై మేకల దొంగతనం కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారు గతంలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి తిరిగి నేరాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారి నుంచి మూడు కార్లు, రూ.1.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తితో పాటు పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించగా.. ఏఎస్పీ మౌనిక వారికి రివార్డు అందజేశారు. ఫ పరారీలో మరో ఇద్దరు -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను త్రిపురారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండల ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పిల్లి మణికంఠ, మాడుగులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన దండు వినోద్, బండి కోటేష్ స్నేహితులు. వీరు ముగ్గురు గంజాయి సేవించేవారు. వీరికి ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కొమ్మెర శివ తన స్నేహితుడైన చల్లా అంజి వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయించేవాడు. గురువారం శివ తన స్నేహితుడైన అంజి వద్ద 1.6 కిలోల గంజాయిని మాచర్లలో కొనుగోలు చేసి ఉదయం పది గంటల సమయంలో త్రిపురారం గ్రామ శివారులో గంగదేవరమ్మ గుడి వద్ద మణికంఠ, వినోద్, కోటేశ్కు విక్రయిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు త్రిపురారం ఎస్ఐ కె. నరేశ్ తన సిబ్బందితో వెళ్లి నలుగురిని పట్టుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న చల్లా అంజి పరారీ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హాలియా సీఐ డి. సతీష్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీను, చంద్రశేఖర్, నాగేశ్వర్రావు, ఆర్. శ్రీనివాస్, హోంగార్డులు ఉన్నారు. 250 గ్రాముల గంజాయి పట్టివేత మిర్యాలగూడ టౌన్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన అమరలింగంకు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నివాసముంటున్న పులిజాల లక్ష్మీనారాయణ, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఎస్కే రియాజ్, రవీంద్రనగర్కు చెందిన కె. వంశీతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి ఈ నెల 12న మిర్యాలగూడ మండలం గుండూరు గ్రామ శివారులోని యాదాద్రి వెంచర్ వద్ద గంజాయి తీసుకురాగా.. పక్కా సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఎస్కే రియాజ్, వంశీని అరెస్ట్ చేశారు. అమరలింగం, లక్ష్మీనారాయణ పర్యారయ్యారు. పట్టుబడిన వారి నుంచి 250 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం
ఫ బస్సు టైరు ఎక్కడంతో బుల్లెట్లా దూసుకొచ్చిన రాయి ఫ ప్రయాణికురాలి తలకు తగలడంతో తీవ్ర గాయాలు కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో గురువారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. మేళ్లచెరువు మండలానికి చెందిన ఓ ప్రయాణికురాలు బస్సు కోసం కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో వేచి ఉండగా.. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వేగంగా బస్టాండ్లోకి వచ్చింది. ఈ క్రమంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న గులకరాయి పైకి బస్సు టైరు ఎక్కడంతో రాయి బుల్లెట్ వేగంతో వచ్చి ప్లాట్ఫాం వద్ద నిల్చున్న ప్రయాణికురాలి తలకు తగిలింది. ఏం జరిగిందో తెలుసుకొనే లోపే మహిళ కుప్పకూలిపోయింది. తోటి ప్రయాణికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి మిర్యాలగూడ టౌన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మిర్యాలగూడ మండలంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కేళ్లపాడు గ్రామానికి చెందిన గుండు సురేష్(25) తన ఇంటికి వచ్చి పక్కనే ఉన్న దొడ్డిలోకి ట్రాక్టర్లో నుంచి గడ్డి కట్టలు దింపే క్రమంలో అడ్డుగా ఉన్న విద్యుత్ సర్వీసు వైరును కర్ర సహాయంతో పక్కకు జరుపుతుండగా.. విద్యుత్ వైరు చేతిపై పడి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న గుండు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణంపాలకవీడు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్ వెళ్లే రోడ్డు మార్గంలో అదానీ సిమెంట్ పరిశ్రమ సమీపంలో గురువారం జరిగింది. ఎస్ఐ ఆర్. కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహంకాళిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల లింగయ్య(45) బైక్పై వెళ్తుండగా.. కంకర లోడ్తో శూన్యపహాడ్ వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనం ఢీకొని.. మిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామానికి చెందిన పోలేపల్లి లక్ష్మయ్య(38) గ్రామ పరిధిలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. బైక్పై వెళ్తూ డీసీఎంను ఢీకొని ఒకరు మృతి మునగాల: విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఒకరు మృతిచెందారు. మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతుడు కోదాడ మున్సిపాలిటీలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఎస్కే సిరాజ్గా పోలీసులు గుర్తించార. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తామునగాల: మునగాల మండలం నేలమర్రి–మాధవరం గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుపై గురువారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నేలమర్రి గ్రామానికి చెందిన రెణబోతు జానకిరెడ్డి తాను పండించిన ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా.. అప్రోచ్ రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా తరచూ ఈ అప్రోచ్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్రోచ్ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు రోడ్డు మర్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
జల సంరక్షణలో నల్లగొండకు రెండో స్థానం
జల సంరక్షణ కోసం జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలో అత్యధికంగా పనులు చేపట్టగా, ఆ తర్వాత స్థానంలో నాంపల్లి మండలం ఉంది. తిరుమలగిరి సాగర్లో 3,678 పనులు చేపట్టగా, నాంపల్లిలో 3,628 పనులను చేపట్టారు. అతి తక్కువగా మునుగోడు మండలంలో 1,410 పనులను చేపట్టారు. నల్లగొండ : జల సంరక్షణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అబియాన్ కింద చేపట్టిన జల్ సంచయ్–జల్ భాగీదారీ (జేఎస్జేబీ) పథకం కింద డీఆర్డీఏ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పనులు చేపట్టారు. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో అత్యధికంగా పనులు చేసినందుకుగాను నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. జిల్లాకు అవార్డు దక్కడంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డిని అభినందించారు. జల శక్తి అభియాన్ కింద 13 రకాల పనులు కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కింద జల సంరక్షణ కోసం జల్ సంచయ్–జల్ భాగీదారీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో నీటి సంరక్షణ కోసం గృహాల్లో మ్యాజిక్ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పత్తి చేలలో కుంటలు, ఎంఐ ట్యాంకులు, చెరువుల పూడికతీత, ఊట కుంటలు, చెక్ డ్యామ్లు, గుట్టల వద్ద కందకాలు, వరద కట్టలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, రూప్ వాటర్ ఇంకుడు గుంతలను నిర్మించి నీటి సంరక్షణ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపునకు చర్యలు చేపట్టింది. మొత్తంగా 84,827 పనులు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ పథకం కింద జిల్లాలోని 31 మండలాల పరిధిలో మే 2025 వరకు 84,827 పనులను చేపట్టారు. ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జల్ సంచయ్–జల్ భాగిదారి పోర్టల్లో అప్లోడ్ చేసింది. చేసిన పనులకు సంబంధించి 99 శాతం వెరిఫికేషన్ పూర్తి చేయడంతో పాటు 31 మండలాల పరిధిలో 849 పనుల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కేంద్ర అధికారులు బొల్లం సంతోష్కుమార్, ఆనంద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఈ ఏడాది జూన్ 19వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఆగస్టు 8వ తేదీన పరిశీలన పూర్తయింది. అవార్డుకు నల్లగొండ ఎంపిక రాష్ట్రంలోనే అత్యధికంగా 96 వేల పనులు చేపట్టి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా 84,827 పనులతో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మంచిర్యాల జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ మూడు స్థానాలు దక్కించుకున్న జిల్లాలకు అవార్డుతోపాటు రూ.2 కోట్ల చొప్పున నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన పనులు విజయవంత మయ్యాయి. నీటి బొట్టును ఒడిసిపట్టడంలో జిల్లా బెస్ట్గా నిలిచింది. జలసంరక్షణ పనుల నిర్వహణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి.. అవార్డుకు ఎంపికై ంది. ఫ జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద అవార్డు ఫ 31 మండలాల్లో 13 కేటగిరీల్లో 84,827 పనుల నిర్వహణ ఫ పెద్ద ఎత్తున భూగర్భ జలాల సంరక్షణకు కృషి ఫ 18న రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోనున్న కలెక్టర్ -
నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలే..
● పాఠశాలలు, ఆస్పత్రుల్లోనూ అరకొర వసతులే.. ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూసేకరణ చేసినా.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నల్లగొండలో ఆమె పర్యటించారు. మేధావులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. నక్కలగండి, మోత్యతండాను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సందర్శిస్తే వారి సమస్యలు అర్థమవుతాయన్నారు. అక్కడ భూమి సేకరించారు వృథాగానే ఉందని, అలాంటప్పుడు రైతులకు సేద్యం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించానని ఎంఆర్ఐ లేకపోవడం దారుణమన్నారు. అరకొర సదుపాయాలు ఉన్నా వైద్యులు, నర్సులు సేవలు అందిస్తున్నారని వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గురుకులంలో వసతులు లేవని, 450 మంది ఉంట్లే ఇద్దరు వర్కర్లు ఉన్నారని పిల్లల దుస్తులు లాండ్రీ చేసేవారు లేరన్నారు. అధికారులు, మంత్రులు ఒక రోజైన హాస్టల్, గురుకులాల్లో నిద్రిస్తే వారి బాధలు తెలుస్తాయన్నారు. సాగర్లోని నాగార్జునకొండ మీద, నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయంలో పలు చారిత్రక నిర్మాణాలను ఏపీలోని గుంటూరు మ్యూజియానికి తరలించారని వాటిని వెనక్కు తేలేకపోయారన్నారు.ఎంసీహెచ్ సందర్శననల్లగొండ టౌన్ : జాగృతి జనంబాటలో భాగంగా ఎమ్మెల్సీ కవిత బుధవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని ఎస్ఎన్సీయూ, ఐసీయూ, మెటర్నటీ వార్డులను సందర్శించి రోగులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది తమకు గత నాలుగు నెలలుగా వేతనాలను అందడం లేదని, వేతనాలను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
● కూత.. మోత
చందంపేట : మండలంలోని గన్నెర్లపల్లి గ్రామ పరిధిలోని చెంచుకాలనీలో 65 కుటుంబాలు.. 200 జనాభా ఉంది. ఈ కాలనీకి రెండు నెలలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీలో ఉన్న రెండు బోర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో గుక్కెడు నీటి కోసం ఈ కాలనీ ముందు నుంచి పారుతున్న డిండి ప్రాజెక్టు నీటిని పట్టుకొని దప్పిక తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ వాగులో నీరుంది. లేకుంటే బిందెలు తీసుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిందే. నీటి సమస్య తీర్చాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఖాళీ బిందెలతో బుధవారం కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని దేవరకొండ – శ్రీశైలం వెళ్లే రోడ్డు వద్దకు నడిచి వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ లోకేష్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామని చెప్పడంతో వెనుదిరిగారు.గుక్కెడు నీటికి గిరిజనుల గోస -
బాలికలకు అథ్లెటిక్స్ లీగ్
విద్యార్థినుల్లో క్రీడా ప్రతిభను వెలికితీ సేందుకు కేంద్రం ‘అస్మిత ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టిందిపూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 587.60 అడుగులు ఇన్ఫ్లో : 50,933 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 50,933 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,779 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,654 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్వరిసాగులో చరిత్ర.. వరిసాగులో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. - 8లోదేశభక్తిని పెంచడంలో పటేల్ పాత్ర గొప్పది నల్లగొండ : దేశభక్తిని పెంపొందించడంలో వల్లభాయ్ పటేల్ పాత్ర ఎనలేనిదని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఆవరణలో ‘యూనిట్ మార్చ్’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి అక్బర్ అలీ, మై భారత్ స్టేట్ సభ్యులు అనుస్మాన్, ప్రసాద్దాస్, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటినీ సర్వే చేయాలి
తిప్పర్తి : ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేయాలని తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. 2027 జనగణనలో భాగంగా బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన ఎంతో ముఖ్యమైనదని, ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని జియోటాగ్ చేయాలని, ఇల్లు వివరాలను స్టేటస్ను పొందుపర్చాలన్నారు. మొదట ఇళ్లకు నంబర్ వేయాలని చెప్పారు. ఈ సర్వే ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సులువు అవుతుందన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. కార్యక్రమం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్ఐ శంకర్, ఆర్ఐ ద్రోణార్జున తదితరులు పాల్గొన్నారు. -
నేడు బీసీ జేఏసీ ధర్మ పోరాట దీక్షలు
నల్లగొండ టౌన్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్మపోరాట దీక్షలను నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీలో పదోన్నతులునల్లగొండ : నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం 9 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కొప్పు రాంబాబు, తెలంగాణ పంచాయతీ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నరేందర్రెడ్డి పాల్గొన్నారు. పిల్లలపై ప్రత్యేక దృషి సారించాలికొండమల్లేపల్లి : చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృషి సారించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం కొండమల్లేపల్లి, దేవరకొండలో గల పలు కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆయన వెంట సతీష్, దుండిగళ్ల అశోక్, యర్రమద గోవర్ధన్రెడ్డి తదితరులున్నారు. ‘కలల సందుక’ కవితా సంపుటి ఆవిష్కరణచిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి, రచయిత డాక్టర్ మండల స్వామి రచించిన ‘కలల సందుక’ కవితా సంపుటిని మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్వామి సమసమాజాన్ని కాంక్షించే కవిత్యాన్ని రచించారనొ కొనియాడారు. డాక్టర్ నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ వృత్తిదారుల జీవితాన్ని కవిత్వంలో నిలిపారని చెప్పారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలచారి, మోత్కూరి నరహరి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, వేముగంటి మురళీకృష్ణ, ప్రవీణ్కుమార్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ ఉప్పల పద్మ, డాక్టర్ కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్, ప్రకాష్ పాల్గొన్నారు. 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలురామగిరి(నల్లగొండ) : ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
సదరం నూతన భవనం ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన సందరం కార్డుల జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత ఎక్కువగా ప్రసవాలు నల్లగొండ జీజీహెచ్లో అవుతున్నాయని చెప్పారు. సదరం నూతన భవనాన్ని ప్రారంభించామని, వైకల్యం కలిగిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ : ధాన్యం దిగుమతి చేసుకోవడంతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతోందని, కొనుగోళ్లు ఆలస్యమైతే రైతులకు సమాధానం చెప్పలేమని.. అవసరమైతే రాత్రింబవళ్లు కాంటాలు వేయాలని అధికారులను ఆదేశించారు. రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు నిలపడం వల్ల కేంద్రాల్లో కాంటా వేసిన బస్తాలు తరలించడం సాధ్యం కాదని.. మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్లర్లు నారాయణ, ఇంద్రారెడ్డి, భద్రాద్రి ధాన్యం తడవడం వల్ల నూకలు అవుతున్నాయని.. బాయిల్డ్రైస్ సరఫరాకు అనుమతి ఇప్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆరు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మిల్లింగ్ చార్జీలు రావాలని, రవాణా బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్పందించిన మంత్రి కేంద్ర మంత్రితో మాట్లాడి బాయిల్డ్ రైస్ పెట్టేందుకు అనుమతి కోసం కృషి చేస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడి బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిల్లర్లు మిల్లు పాయింట్కు వచ్చిన ధాన్యం తిరిగి పంపించడం సరి కాదన్నారు. ఏదైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. గత సీజన్ సీఎంఆర్ తీసుకోకపోవడం వల్ల మిల్లుల్లో స్థలం లేదని సీఎంఆర్ తీసుకుంటే ధాన్యం దిగుమతికి ఇబ్బంది ఉండదని మిల్లర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీసీఓ పత్యానాయక్, ఆర్డీఓ అశోక్రెడ్డి, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన రామగిరి(నల్లగొండ) : నల్లగొండ సమీపంలో చర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిశీలించారు. ధాన్యం తేమశాతాన్ని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, హమాలీలతో మాట్లాడారు. గడచిన 20 రోజులు వర్షానికి ధాన్యం తడవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ప్రస్తుతం రోజూ 10,000 మెట్రిక్ టన్నులకు పైగానే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేట్లో ధాన్యం అమ్మవద్దని సూచించారు. బ్రాహ్మణ వెల్లంలతోపాటు, కాల్వలు పూర్తయితే చర్లపల్లి, మర్రిగూడెం, అన్నెపర్తి, కంచనపల్లి చెరువులను నింపుతామని తద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చుట్టుపక్కల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణకు రూ.17 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫ ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
గురుకులాల్లో వసతులు కల్పిస్తాం
పెద్దవూర : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల క్రీడామైదానంలో అండర్–14, అండర్–19 జిల్లాస్థాయి క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించే విద్యార్థులకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా ఆమె మహాత్మాజ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే చిత్రపటాల వద్ద జ్యోతిప్రజ్వలన చేసి జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, బీసీ గురుకులా ఆర్సీఓ స్వప్న, పెద్దవూర ఎంఈఓ తరిరాములు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, నందికొండ మున్సిపల్ కమిషనర్ వేణు, ప్రిన్సిపాల్స్ రవికుమార్, భవాని, ఎస్ఐ ముత్తయ్య పాల్గొన్నారు. నల్లగొండ : వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంగళవారం వివిధ సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఏఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడినా.. నిర్లక్ష్యం వహించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం గోపికృష్ణ, డీసీఓ పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఊరి చివరనే మద్యం
మునుగోడు : మునుగోడు పట్టణంలో ఇప్పటి వరకు కొనసాగిన మద్యం దుకాణాలు ఇక, నుంచి గ్రామ శివారుకు తరలనున్నాయి. ఈ నెల చివరి నాటికి మద్యం దుకాణాల లీజు ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నియంత్రించాలనే ఆలోచనతో కొన్ని సూచనలు చేశారు. దీంతో నూతన టెండర్లలో వైన్ షాపులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యే సూచనలు పాటించేందుకు ఇప్పటికే గ్రామ శివారులో దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్ 1వ నూతన షాపులు.. మునుగోడు మండలంలో నాలుగు మద్యం దుకాణాలు ఉండగా.. చౌటుప్పల్ రోడ్డులో ఒకటి, నల్లగొండ రోడ్డులో రెండు, చండూరు రోడ్డులో ఒకటి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన దుకాణాలు ప్రారంభించాల్సి ఉండడంతో.. అందుకు అవసమైన నిర్మాణాలను వేగవంతం చేశారు. అయితే ఎంతో కాలంగా జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేస్తుండడంతో మహిళలు, మద్యం వ్యతిరేకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో పాటు.. మధ్యాహ్నం తరువాతే మద్యం విక్రయాలు చేపట్టాలని నూతన వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం దుకాణాల్లో సిట్టింగ్లు కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు గతంలో మాదిరి బెల్ట్ దుకాణాలకు మద్యం విక్రయించకుండా.. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులే గ్రామాల్లో ప్రత్యేకంగా మినీ దుకాణాలను ఏర్పాటుచేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. మినీ దుకాణాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులను కూడా కలిసినట్లు సమాచారం. విచ్చలవిడి మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసేలా వ్యాపారులు కూడా సిద్ధం కావడంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పలువురు కృతజ్జతలు తెలుపుతున్నారు. ఫ మునుగోడు శివారులో ఏర్పాటుకు నూతన వ్యాపారుల నిర్ణయం ఫ మద్యం అమ్మకాలు నియంత్రించేలా సన్నాహాలు -
ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా?
చందంపేట, నాంపల్లి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ప్రజల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాక రైతులు, పరిహారం అందక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో మంగళవారం ఆమె జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మాపురంలో నిర్మిస్తున్న కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ను, చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టును, తిరుమలగిరిసాగర్ మండలంలోని నెల్లికల్లు లిఫ్టు పనులను పరిశీలించారు. ఆయా చోట్ల నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు రైతులు మోంథా తుపాన్ కారణంగా పంట నష్టపోయామని ఆమెకు వివరించారు. ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రిగా పనిచేసిన జగదీశ్రెడ్డి నెల్లికల్లు లిఫ్టును పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి చేస్తానని చెప్పారని.. ఆ తర్వాత ఎటుపోయారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగలేదన్నారు. నెల్లికల్లు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న సోయి ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, తేమశాతం అఽధికంగా ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూతవేటు దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా నేటికి సాగునీరు ఈ ప్రాంత రైతులకు అందకపోవడం ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ నిర్వాసితుల తరఫున తాను ముందుండి కొట్లాడుతానన్నారు. కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్యాదవ్, రూప్సింగ్, రవీందర్, నిరంజన్, శంకర్, రామ్కోటి, శివారెడ్డి, జితేందర్, ప్రజాపతి, నరేష్ తదితరులు ఉన్నారు. ఫ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ జాగృతి జనం బాటలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన -
ధాన్యం ఇవ్వకున్నా..
ఫ ఆరు మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టిన అధికారులు ఫ ఆయా మిల్లులకు ఈ సీజన్లో ధాన్యం కేటాయింపు నిలిపివేత ఫ వేరే మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని తీసుకొని మరాడిస్తున్న.. ఆ మిల్లులు ఫ సీఎంఆర్ ధాన్యం అమ్ముకున్నారని తేలినా.. చర్యలకు అధికారుల వెనుకంజ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు మిల్లర్లు అక్రమాల బాటను వీడడం లేదు. గతంలో జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం నుంచి 4.5 లక్షల క్వింటాళ్ల ధాన్యం తీసుకుని దానికి సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వలేదు. దీంతో వారికి ఈ వానాకాలం సీజన్లో అధికారులు ధాన్యం కేటాయించలేదు. అయినా వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇతర మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మరాడించి తమ పని కానిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇతర జిల్లాల్లో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం రాకపోవడంతో రూ.కోట్లలో నష్టం తప్పడం లేదు. కొంతమంది అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కై చర్యలకు వెనుకంజ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆరు మిల్లులకు ధాన్యం కేటాయింపు లేదు రెండేళ్ల కిందట జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆ మిల్లర్లను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈ వానాకాలం సీజన్లో ఆ మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా ఆపేశారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆయా మిల్లులు ఇతర మిల్లుల నుంచి ధాన్యం తీసుకుంటున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో నల్లగొండలో అధికారులు ధాన్యమే కేటాయించని ఓ మిల్లుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించారు. అప్పట్లో ఈ విషయంలో బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్నీ ప్రభుత్వమే ఇస్తున్నా.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యం కొని రైతులకు డబ్బులు ఇస్తోంది. లారీల ట్రాన్స్పోర్టుకు డబ్బు ఇస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపుతోంది. మిల్లర్ దానిని మరాడించి సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చినందుకు డబ్బులు చెల్లిస్తోంది. ఈ ప్రక్రియలో ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. మిల్లర్లు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా ధాన్యం తీసుకొని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అయినా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతునఆన అధికారుల్లో చలనం లేకుండాపోతోంది. ప్రభుత్వ ధాన్యాన్ని మింగేశారని తేల్చిన అధికారులు చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు. మిల్లర్ల నుంచి అందే అమ్యామ్యాల కారణంగానే కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బియ్యం ఇవ్వకుండా ఏళ్ల తరబడి కాలం గడుపుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చాక, తనిఖీలు చేశాక, అక్రమాలు జరిగినట్లు తేలాక కూడా చర్యలు చేపట్టడం లేదంటే.. మిల్లర్ల లాబీ ప్రభావం అధికారులపై ఏస్థాయిలో ఉందో అర్థఽం చేసుకోవచ్చని పౌర సరఫరాల విభాగంలో చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రాబట్టడం లేదని, గతేడాది కూడా అక్రమాలకు పాల్పడిన కొన్ని మిల్లులకు ధాన్యం కేటాయించి వారి అక్రమాలకు మరింత వత్తాసు పలికారన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కాజేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, మిల్లులను సీజ్ చేస్తే అక్రమాలకు పుల్స్టాప్ పడే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. -
అమ్మా నేనెందుకు ఇలా..
చిన్నారులను జోలెలో వేసుకుని భిక్షాటన చేస్తున్న మహిళలు పిల్లలు నిద్ర లేవకుండా మత్తు పదార్థాలు ఇస్తున్నారు. - 8లోమిల్లుకు తరలిన ధాన్యంరామగిరి(నల్లగొండ) : మండలంలోని జీకె అన్నారం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని మంగళవారం మిల్లులకు తరలించారు. ‘సాక్షి’లో ‘నిలిచిన ధాన్యం ఎగుమతులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు లారీలు లేక ఎగుమతి ఆగిపోవడంతో వెంటనే లారీ కాంట్రాక్టర్తో మాట్లాడారు. మంగళవారం మూడు లారీలను పంపి.. కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించారు. లారీపైకి బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీలు -
ఇసుకను బ్లాక్ చేస్తే కేసులు పెడతాం
నల్లగొండ : ఇసుకను బ్లాక్ చేసి బ్రోకర్లు అమ్మితే కేసులు నమోదు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ హెచ్చరించారు. నీలగిరి పట్టణంలో ఇసుక సరఫరాలో అక్రమాలపై ‘సాక్షి’లో ఈనెల 8న ‘ఆన్లైన్ ఇసుక అధ్వానం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో మైనింగ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ మాట్లాడుతూ ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సరఫరా చేయాలని అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కొందరు డ్రైవర్లు.. ఇసుక బాగలేదని, దూరంగా ఉందని మాయమాటలు చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని సహించమన్నారు. అధికంగా డబ్బులు వస్తాయని ఇసుకను బ్రోకర్లకు అమ్మితే డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని, ఆ ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న చిరునామాకు అలాట్ అయిన వెంటనే డెలివరీ చేయాలన్నారు. ఇకనుంచి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని ఎంట్రీ, ఎగ్జిట్ కచ్చితంగా నమోదై ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మైనింగ్ ఏడీ జాకబ్ -
అబుల్ కలాం ఆజాద్కు నివాళి
నల్లగొండ : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధి ప్రదాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ప్రజలు ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్రెడ్డి, డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, డాక్టర్ ఎంఏ.ఖాన్, సయ్యద్హసన్, ఎండీ.సలీం, ఎంఏ రఫీ ఉన్నారు. -
13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీఈఓ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్లో 5,400, మూడవ సెమిస్టర్లో 5,830, ఐదవ సెమిస్టర్లో 5,597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేటలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజాబాటలో విద్యుత్ శాఖనల్లగొండ : పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ఆ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్లగొండలోని 21 వార్డులో పర్యటించారు. వార్డులో ఉన్న విద్యుత్ లూజ్ లైన్లు, దెబ్బతిన్న కరెంట్ స్తంభాలను పరిశీలించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, విద్యుత్ డీఈ అన్నయ్య, సలీం, షామిర్ పాల్గొన్నారు. నల్లగొండకు నేడు మంత్రి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బుధవారం నల్లగొండకు రానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దుబ్బ రూప కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, వర్షాల వల్ల వాటిల్లిన నష్టంపై సమీక్షిస్తారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారు. ట్రక్షీట్ జారీపై విజిలెన్స్ విచారణమిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆలగడప పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ జారీ చేయడంపై మంగళవారం విజిలెన్స్ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైతులు మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి సైదిరెడ్డి, త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన ధనావత్ తులస్యనాయక్ను విచారించారు. పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ సైదులు, వ్యవసాయ విస్తరణాధికారి ఆఫ్రీన్ను ధాన్యం రాకుండా ట్రక్ షీట్ ఎలా మంజూరు చేశారని, ట్యాబ్లో ఎలా అప్లోడ్ చేశారని ప్రశ్నించారు. 741బస్తాలు(296.40 క్వింటాళ్లు) ధాన్యం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని శ్రీశివసాయి రైస్ ఇండస్ట్రీస్కు తరలించినట్లు విచారణలో రైతులు పేర్కొన్నారు. కాగా పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం శ్రీశివసాయి రైస్ మిల్లును తనిఖీ చేశారు. రైస్మిల్లు తనిఖీచిట్యాల: కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో అన్లోడింగ్ చేసుకోవడం లేదని ఓ రైతు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ వెంటనే స్పందించి ధాన్యం రైస్ మిల్లును తనిఖీ చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ను ఆదేశించారు. దీంతో ఆయన చిట్యాల పట్టణంలో భువనగిరి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం చిట్యాల శివారులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి ఉన్నారు. -
ఆంధ్రా ధాన్యం రాకుండా చెక్పోస్టులు
మిర్యాలగూడ : ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి శివారు సూర్య రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లులో ధాన్యం ట్రాక్టర్ల వద్ద ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా నుంచి ధాన్యం రాకుండా వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా మిల్లర్లు సాఫీగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు రైస్ మిల్లర్లు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షుడు గోళ్ల రామ్శేఖర్, మోహన్రావు తదితరులు ఉన్నారు. ఫ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ -
నిలిచిన ధాన్యం ఎగుమతులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల కొరత ఏర్పడింది. అనేక కేంద్రాల్లో ధాన్యం బస్తాల ఎగుమతి కాక ఎక్కిడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నల్లగొండ మండలంలోని జీకే అన్నారం కొనుగోలు కేంద్రానికి మూడు రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో సుమారు 5 వేల బస్తాలు ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ రవాణా చేయాల్సి ఉంది. మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ చేసుకోవడంలో ఆలస్యం చేస్తుండడంతో లారీలు అక్కడే ఉండిపోతున్నాయి. అదేవిధంగా లారీలను కాంట్రాక్టర్ సరిపడా అందుబాటులో ఉంచకపోవడం కూడా కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అధిక లారీలను పంపాలని రైతులు కోరుతున్నారు. -
విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడొద్దు
నల్లగొండ టౌన్ : విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. సోమవారం నల్ల గొండలోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. నేటి సీనియర్లు ఒకప్పుడు జూని యర్లు అనే విషయం మరచిపోవద్దని హితవు పలికారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. మానసికంగా, శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుంచి తరిమేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాదాకృష్ణ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్


