Nalgonda District Latest News
-
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
చింతపల్లి: మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయంలో గురువారం శ్రీస్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీధర్స్వామి ఆధ్వర్యంలో రామ్చరణ్ శర్మ, కిరణ్ శర్మలు పూర్ణాహుతి హోమం జరిపారు. సాయిబాబా విగ్రహానికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ్య పావని, ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి వెంకటయ్య చంద్రకళ, కుంభం పుల్లారెడ్డి సుకన్య, టి.శ్రీనివాస్ లతా దంపతులు, కోశాధికారి ఊరె కృష్ణయ్య, ట్రస్ట్ సభ్యులు మంచి కంటి జనార్దన్, ఆలంపల్లి చంద్రశేఖర్, కొమిరిశెట్టి అశోక్, ఆలంపల్లి పాండురంగయ్య, రవి, మంచి కంటి శ్రీనివాస్, ఆగిరి రవి, గోవింద్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఫ ముగిసిన సాయి ఆలయ వార్షికోత్సవాలు -
బీజేపీని తరిమికొడితేనే దేశాభివృద్ధి
మునుగోడు: మతోన్మాదం పెంచడంతోపాటు పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొడితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో గురువారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీకి మద్దతులేని రాష్ట్రాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తోందన్నారు. బీజేపీ నాయకుల కుట్రలు, ఎత్తుగడులను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ కూటమితో జత కట్టామని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం కాల్చిచంపడం సరైందికాదన్నారు. ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్గఢ్ అడవుల్లోని యూరేనియం తవ్వి కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే మావోయిస్టులను చంపేస్తున్నారని ఆరోపించారు. ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈసభలో గుర్జ రామచంద్రం, సురిగి చలపతి, బిలాలు, చాపల శ్రీను, లింగయ్య, మందుల పాండు, యాదయ్య, వెంకన్న, కై లాస్, జానీ, వంశీకృష్ణ, శంకర్ పాల్గొన్నారు. -
ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్నగర్లో డీఎస్పీ కె.రాజశేఖరరాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీసులు పలు బృందాలుగా విడిపోయి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అద్దెకు ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 ద్విచక్రవాహనాలు, 16ఆటోలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్తో పాటు 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కాలనీలో మొత్తం 50మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా వారిలో ఎనిమిది మందికి టెస్టుల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐదుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. డిండి విద్యార్థులకు సీఎం అభినందనలుడిండి: డిండి అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పది మంది విద్యార్థులను బుధవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ఫెలిసిటేషన్ సెర్మోనీ–2025 కార్యక్రమంలో సీ ఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించి అభినందించారు. ఇందులోభాగంగా డిండి మండల కేంద్రానికి చెందిన అవుల అఖిల, నారిమళ్ల ప్రవళిక ఉన్నారు. వీరికి సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, కోచ్ పరశురాం అభినందనలు తెలిపారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలిచండూరు: కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో మాట్లాడి రికార్డులు, కార్యకలాపాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ యాదగిరి, సూపరింటెండెంట్ నర్సింహ, సిబ్బంది ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలి నకిరేకల్ : హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కుంభం నర్సిరెడ్డి అన్నారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో కొనసాతుతున్న హ్యాండ్బాల్ బాలబాలికల ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో మాట్లాడారు. జూన్ 4 నుంచి 6 వరకు మంగళపల్లిలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్బాల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ ఉస్మాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభేషికం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం నిర్వహించారు. -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు అనుమతులు
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 25 ఎకరాల్లో రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి కొండమల్లేపల్లి మండలం కోల్మంతల్పహాడ్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. నేరేడుగొమ్ములో దాదాపు రూ.47కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. సమావేశంలో నాయకులు ఆలంపల్లి నర్సింహ, ఎంఏ సిరాజ్ఖాన్, నాయిని మాధవరెడ్డి, మారుపాకల సురేష్గౌడ్, శిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేష్గౌడ్, కొర్ర రాంసింగ్, సుగుణయ్య ఉన్నారు. ఫ ఎమ్మెల్యే బాలునాయక్ -
2 నుంచి యువ రుణాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల్లో ఎంపిక చేసినవారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న తొలి విడతగా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అర్హుల జాబితాను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించారు. 79,493 మంది దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతీయువకులు ఆయా శాఖలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 79,493 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి జాబితాలను జిల్లా అధికారులకు నివేదించారు. నియోజకవర్గాల్లో రుణాల పంపిణీ జూన్ 2న అన్ని నియోజకవర్గాల పరిధిలో రూ.లక్షలోపు రుణాలకు ఎంపికై న లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు. రాజీవ్ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం ఫ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాలు అందజేత ఫ తొలి విడతగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు.. ఫ జిల్లా కమిటీకి చేరిన అర్హుల జాబితా జూన్లో 3 వేల మందికి రుణాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.లక్ష లోపు రుణాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన దాదాపు 3 వేల మందికి జూన్లో కేటగిరీల వారీగా రుణాలు అందించేలా కార్యాచరణ రూపొందించాం. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ, నల్లగొండఐదు విడతల్లో రుణాలు ఇచ్చేలా.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద ఐదు విడతల్లో రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జూన్ నెలలో రుణాలు అందించనున్నారు. ఇందు కోసం దాదాపు 3వేల మంది వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇవ్వనున్నారు. ఇందులో మిగిలిన లబ్ధిదారులకు ఇదే నెలాఖరులోగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే రెండో విడతలో భాగంగా జూలైలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందించనుంది. అలాగే ఆగస్టులో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలు, చివరగా సెప్టెంబర్లో నాలుగు, ఐదు విడతల్లో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి మోస్తారుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగాఉన్నా.. మూడునెలల ముందుగా మేలోనే వరదలు మొదలవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు భారీ వర్షాలకు ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చింది. ఎగువ నుంచి 82 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లు రెండు మీటర్ల ఎత్తు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరదలు మొదలైతే గత ఏడాది కన్నా ముందుగానే ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉంటాయని సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 512.50 అడుగులుగా కాగా 135.9545 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు). ఫ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్: నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆయుష్ డిపార్టుమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ చక్రధర నర్సింహారావు అన్నారు. ప్రపంచ యోగా మాసోత్సవాల సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణ్, యోగా ఇన్స్పెక్టర్లు సింగం ప్రవీణ్యాదవ్, కోమల, జ్యోతి, చంద్రయ్య, చంద్రమౌళి, అమీన్బాబా, తదితరులు పాల్గొన్నారు. -
భవిత కేంద్రాల్లో పనులు పూర్తిచేయాలి
నల్లగొండ: భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలకు సివిల్ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేశామన్నారు. భవిత కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు. అన్ని భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, రైలింగ్, ర్యాంపు, యాక్టివిటీ రూమ్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిత కేంద్రాల్లో వినియోగించనున్న సామగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ప్రదర్శించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్లగొండ, దేవరకొండ ఆర్డీకోలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తించాలి?– గపూర్, నకిరేకల్, వినయ్కుమార్, కురంపల్లి, కనగల్ మండలం, జేడీఏ : ప్రభుత్వ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి. కోనేటప్పుడు ప్యాకెట్ ధర, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, లాట్ నంబర్, కంపెనీ పేరు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. అన్ని సక్రమంగా ఉంటేనే అసలైన విత్తనాలు. అవి లేకపోతే నకిలీవని గుర్తించాలి. ధర ప్యాకెట్కు రూ.901 మాత్రమే ఎక్కువ ధరకు అమ్మినా, ఎలాంటి అనుమానాలు ఉన్నా వ్యవసాయ అఽధికారులకు తెలియజేయాలి. విత్తనాల కొన్నాక తప్పకుండా రశీదుని తీసుకుని దాన్ని పంటల సాగు సీజన్ సమయం ముగిసే వరకు భద్రంగా ఉంచుకోవాలి. నల్లగొండ అగ్రికల్చర్ : ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురవడంతో రైతులు సాగు పనులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చే నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పాల్వాయి శ్రవణ్కుమార్ సూచించారు. అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రశీదు తప్పకుండా పొందాలి.. మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలని అంటున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు గురువారం సాక్షి ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. రైతులు వెలిబుచ్చిన సందేహాలను జేడీఏ సావదానంగా విని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి పి.అనంతరెడ్డి, కేవీకే కంపాసాగర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్, సైంటిస్టు కె.సంధ్యారాణి, మండల వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కీర్తి, స్టెనోగ్రాఫర్ పాల్గొన్నారు. ప్రశ్న : వర్షాలు కురిసినందున ఇప్పుడు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చా?– బండి ఆంజనేయులు, అడవిదేవులపల్లి జేడీఏ : దుక్కులు దున్నుకోనివారు దుక్కులను దున్నుకోవాలి. దున్నుకుని సిద్ధంగా ఉన్న రైతులు మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. ప్రశ్న : నందిపాడు సీడ్స్ కార్పొరేషన్ నుంచి జనుము విత్తనాలను అందుబాటులో ఉంచాలి?– ఇంద్రారెడ్డి, నిడమనూరు జేడీఏ : తప్పక మీ మండల కేంద్రంలో రేపటి వరకు జనుము, ఇతర వరి విత్తనాలను సీడ్స్ కార్పొరేషన్ ద్వారా అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రశ్న : వానాకాలం వరినారు పోసుకోవచ్చా.. ఎప్పటి వరకు నాట్లు వేసుకోవాలి?– శ్రీశైలం దోరెపల్లి, కనగల్ మండలం జేడీఏ : దొడ్డురకం కేఎన్ఎం 118, రకం, బీపీటీ సన్నాలతో నారు పోసుకోవచ్చు, ఆగస్టు 15 వరకు వరినాట్లు పూర్తి చేసుకోవాలి. ప్రశ్న : డీఆర్ఆర్ వరిరకం విత్తనాలు ఇస్తున్నారా?– నర్సిరెడ్డి, వెలుగుపల్లి, నల్లగొండ మండలంజేడీఏ : డీఆర్ఆర్ రకం వరి విత్తనాలు మినికిట్లు వచ్చాయి. అయిపోయాయి. మళ్లీ రాగానే సహకార సంఘాల ద్వారా ఇప్పిస్తాం. ప్రశ్న : భూసార పరీక్షలను చేసి కార్డులను ఇవ్వడం లేదు. అసలు పరీక్షలు చేస్తున్నారా? –కోట వెంకటేశ్వర్రావు, చీకటిగూడెం జేడీఏ : పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి తప్పకుండా భూసార పరీక్షలను చేసి రైతులకు కార్డులను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిస్తాం. ప్రశ్న : రైతు విశిష్ట కార్డులు తీసుకోవాలా.. వద్దా?–సైదులు, అన్నెపర్తి జేడీఏ : మనకు ఆధార్ కార్డులు ఎలాగో భూములకు విశిష్ట కార్డులు అవసరం. తప్పకుండా వాటిని తీసుకోవాలి. ఏఈఓలు గ్రామాలకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ఫ అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి ఫ ముందస్తు వర్షాలతో వరినార్లు పోసుకోవచ్చు ఫ మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి ఫ ‘సాక్షి ఫోన్ఇన్’లో రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్కుమార్ సూచనప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని అరికట్టి రైతులను కాపాడాలి?–బ్రహ్మయ్య, అడవిదేవులపల్లి జేడీఏ : ఆంధ్రా ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. అదేవిధంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి దాడులను చేయిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలి. ప్రశ్న : ఈ వానాకాలంలో ఏరకం వరి విత్తనాలు సాగు చేసుకోవాలి– జానయ్య, రమేష్రెడ్డి, తిప్పర్తి, ఈశ్వర్, జీకే అన్నారం, నల్లగొండ మండలం జేడీఏ : ముందుస్తుగా కురిసిన వర్షాల వల్ల వరినార్లు పోసుకోవచ్చు. సన్నాలైన బీపీటీ, దొడ్డురకమైతే కేఎన్ఎం118 రకం వరి విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనాలు కేవీకే కంపాసాగర్లో అందుబాటులో ఉన్నాయి. సన్నాల సాగుకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ను సద్వినియోగం చేసుకోవాలి. -
నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయాలి
నల్లగొండ: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు రవాణా కాకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. జిల్లాలో వరి, పత్తి, ఇతర ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టేవారిపై నిఘా ఉంచాలన్నారు. రైతులు అనుమతి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని, లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వస్తే పోలీసుల సహకారం తీసుకుని దాడులు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అనరు్హలను తొలగించేలా..
విచారించిన తర్వాతే తొలగింపు ప్రస్తుతం ఆరు నెలల పైచిలుకు రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు 5,092 మంది ఉన్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి వారి జాబితా మాకు అందింది. మండలాల వారీగా ఆ వివరాలను తహసీల్దార్లకు పంపించాం. నివేదిక వచ్చిన తర్వాతే దాన్ని పూర్తిగా విచారించి అనర్హులను తొలగిస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ నల్లగొండ: రేషన్ షాపుల ద్వారా అందించే సన్న బియ్యం అర్హులైన పేదలకే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల క్రితం వరకు దొడ్డు బియ్యం ఇచ్చిన ప్రభుత్వం రెండు నెలల నుంచి సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అర్హులైన పేదలకు మాత్రమే ఈ బియ్యం అందాలనే ఉద్దేశంతో అనర్హులను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని కార్డుదారుల వివరాలు గుర్తించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. మొదలైన విచారణ జిల్లాలో గత ఆరు మాసాల నుంచి దాదాపు సంవత్సరం కాలంగా 5,092 మంది రేషన్ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడం లేదని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా కార్డుదారులు అసలు ఉన్నారా.. లేరా వలస వెళ్లారా.. లేక చనిపోయారా అనే దానిపై విచారణ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తొలగించేందుకు నివేదిస్తారు. అయితే గత జనవరి నుంచి పరిశీలిస్తే మార్చి వరకు జిల్లాలో లక్ష మంది వరకు ఒక్కో మాసంలో కార్డుదారులు బియ్యం తీసుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వడంతో బియ్యం తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరు నెలల పైచిలుకు ఒక్కసారి కూడా బియ్యం తీసుకోనివారిని మాత్రమే సర్వే చేస్తున్నారు. ఆరు నెలల పైచిలుకు బియ్యం తీసుకోని వారి జాబితాను రేషన్ షాపుల వారీగా సేకరించి తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పంపించారు. ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు, ఆర్ఐలు ఇతర సిబ్బందిచేత గ్రామాల్లో, పట్టణాల్లో ఆ కార్డుదారులు ఉన్నారా లేరా అనే దానిపై విచారణ చేసి నివేదిక సమర్పిస్తారు. అర్హులకు న్యాయం చేయాలనే.. ఒక పక్క ప్రభుత్వం అర్హులైన వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో 15 వేల మందికి కొత్త కార్డులు మంజూరయ్యాయి. ఇంకా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అర్హులకు అందించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనర్హుల కార్డులు ఏరివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నెలల తరబడి బియ్యం తీసుకోని కార్డుదారులను పరిశీలించి ఆ పేర్లను తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఫ ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులపై నజర్ ఫ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఫ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఫ ఇప్పటికే రేషన్ తీసుకోని కార్డుదారులు 5,092గా గుర్తింపు ఫ ఐదు నెలలుగా బియ్యం తీసుకోని వారి సంఖ్య లక్షల్లోనే..2025 జనవరి నుంచి రేషన్ తీసుకోని వారి వివరాలు నెల మొత్తం కార్డులు తీసుకోనివారు జనవరి 4,65,998 1,04,278 పిబ్రవరి 4,66,649 1,09,731 మార్చి 4,66,522 1,10,033 ఏప్రిల్ 4,65,941 87,515 మే 4,74,681 98,083 -
కోవిడ్పై అలర్ట్!
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025నల్లగొండ టౌన్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా (కోవిడ్) కొత్త వేరియంట్ ప్రబలి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ నల్లగొండలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)తోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసింది. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలతోపాటు చికిత్సకు పది బెడ్ల చొప్పున సిద్ధం చేసుకోవాలని మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ నిల్వలున్నా..! నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 700 పడకలు ఉండగా అన్ని బెడ్లకు ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 20 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉండడంతో పాటు ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో గతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 పడకల వార్డు అందుబాటులో ఉంది. మిర్యాలగూ ఏరియా ఆస్పత్రిలో 200 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆసుపత్రుల్లో వంద పడకలు ఉండగా ఆక్సిజన్ ఆందుబాటులో ఉంది. మర్రిగూడ ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అవసరమైన మందులు సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నల్లగొండతో పాటు అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్ష కిట్లు అందుబాటులో లేనట్టు తెలిసింది. 2020 మార్చిలో తొలి కేసు కరోనా దేశాన్ని గడగడలాడించింది. ఈ నేపథ్యంలో 2020 మార్చి నెలలో జిల్లాలో తొలి కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా 1,107 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మందులు, ఆక్సిజన్ అందుబాటులో.. మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ డివిజన్లో కరోనా వైరస్ సోకినట్లు ఇంతవరకు ఎవరిని గుర్తించనప్పటికీ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంచారు. మందులు, ఆక్సిజన్తో పాటు ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు గదులు అందుబాటులో ఉన్నాయి. కరోనాతో ప్రజలు భయాందోళన చెందవద్దు.. జలుబు మాదిరిగా అది మారిపోయిందని, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరథ్ తెలిపారు. ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు సన్నాహాలు నాగార్జునసాగర్: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇరవై రోజుల క్రితం ప్రపంచ సుందరీమణులు సాగర్కు వచ్చిన సందర్భంగా వారికోసం 20 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఐసీయూ పడకలు ఏర్పాటు చేయడానికి సామగ్రిని తీసుకొచ్చారు. 20 బెడ్లలో కొన్నింటిని వేరు చేసి ప్రత్యేకంగా ఐసీయూను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నకిరేకల్ల్లో ఐసోలేషన్ వార్డు లేదు నకిరేకల్: నకిరేకల్లోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు కేటాయించ లేదు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో లేవు. కేవలం నకిరేకల్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓగోడు, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా కిట్లు అందుబాటులో లేవు. వీటిని సమకూర్చుకునే పనిలో వైద్యసిబ్బంది నిమగ్నమైంది.న్యూస్రీల్ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఫ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మౌఖిక ఆదేశాలు ఫ ముందస్తు ఏర్పాట్లకు సూచన ఫ అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టిన జిల్లా యంత్రాంగం -
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడులు
నిడమనూరు : వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ విధానంలో వరిసాగు చేస్తే వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ రైతులకు సూచించారు. బుధవారం నిడమనూరు మండలం వల్లభాపురం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. సాగర్ ఆయకట్టులో జగిత్యాల విత్తనం జేజేజీఎల్–27536 రకాన్ని కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధి చేసిందని, 135 రోజుల్లోనే ఎకరాకు 42 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని వివరించారు. ధాన్యం చింట్లు మాదిరిగా ఉంటుందన్నారు. భూమి సారాన్ని కాపాడుకునేందుకు సాగుకు ముందు జీలుగా, జనుము వేసుకోవాలన్నారు. యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అధికారి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులు వాడాలన్నారు. విత్తన కార్పొరేషన్ నందిపాడు(మిర్యాలగూడ), నిడమనూరు ప్రాథమిక సహకార సంఘంలో లభించే విత్తనాలను వివరించారు. వానాకాలంలో అధికంగా సాగుచేసే సన్న రకాల గురించి వివరించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాగులో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి తనూజ, అభ్యుదయ రైతులు నన్నెబోయిన రవి, వెంకట్ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఫ వల్లభాపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం -
ముందే వానాకాలం ‘రైతు భరోసా’
జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్ ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 51294 తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 144 మంది హాజరు
నల్లగొండ: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 136 మంది విద్యార్థులకు 106 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ పరీక్షలకు 56 మంది హాజరు కావాల్సి ఉండగా 38 మంది విద్యార్థులు హాజరయ్యారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులునల్లగొండ టౌన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించే కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అడ్వయిజరీ సలహా మండలి నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగినజిల్లా అడ్వయిజరీ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేసే గర్భిణుల పూర్తి వివరాలు ఫార్మాట్ రూపంలో వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో అర్హత లేని రేడియాలజిస్టులు, గుర్తింపు పొందిన సంస్థలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో ఎంసీహెచ్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్లు అరుంధతి, స్వరూపారాణి, సుచరిత, వందన, గీత, కళ్యాణచక్రవర్తి, రవి, కృష్ణకుమారి, నర్సయ్య, రమేష్ పాల్గొన్నారు. ఎస్టీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులునల్లగొండ: జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని త్రిపురారం మినీ గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 14, 3లో 6, 4లో 4, 5 వ తరగతిలో 10 బ్యాక్లాగ్ సీట్లు, పెద్దవూర గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 18, 3లో 9, 4లో 8, 5లో 5సీట్లు, చందంపేటలో 1లో 30, 2లో 1, 5లో 11సీట్లు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీ కోసం గిరిజన విద్యార్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలననాగార్జునసాగర్: సాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నందికొండ మున్సిపాలిటీలో బుధవారం మి ర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ స్థల పరిశీలన చేశారు. హిల్కాలనీ బీసీ గురుకుల పాఠశాల వెనక భాగంలో నాట్కో ట్రస్టు క్వా ర్టర్ల పక్కన స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలా న్ని పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయనవెంట ప్రాజెక్టు ఇన్చార్జ్ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, ఫారెస్టు అధికారులు రాఘవేందర్రావు, రమేష్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలినల్లగొండ: కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని సురక్ష బీమా పథకం కింద ఖాతాదారుడు ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. జీవన జ్యోతి బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, 18 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగి ఉండాని పేర్కొన్నారు. -
మిర్యాలగూడ మున్సిపల్ సిబ్బందికి మెమోలు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీలో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రూ.70లక్షలు కాజేసిన వ్యవహారంపై మున్పిల్ డీఈతోపాటు మరో ముగ్గురు సిబ్బందికి అదనపు కలెక్టర్ మెమోలు జారీ చేయడంతోపాటు సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అందించారు. ఈ విషయంపై బుధవారం సాక్షి దినపత్రికలో మొక్కలు మింగేశారు అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ స్పందించారు. బుధవారం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటకుండా చెక్కు ఎలా జారీ చేశారంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఆ చెక్కు పాస్ కాకుండా హోల్డ్లో పెట్టించారు. దీనికి బాధ్యులుగా మున్సిపల్ డీఈ వెంకన్నకు, అకౌంటెంట్ ధనుంజయ, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, మరో సిబ్బంది సుబ్రహ్మణ్యంకు మెమోలు జారీ చేసి షోకాజ్ నోటీసులు అందించారు. అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి చెక్కు జారీలో మీ ప్రమేయం ఏంటో మూడు రోజుల్లో మీ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలపాలని ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు. ఫ డీఈతోపాటు ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ ఫ ‘మొక్కలు మింగేశారు’ కథనంపై స్పందించిన సబ్ కలెక్టర్ -
మా మనసు దోచాయి
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మా మనసును దోచాయని ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రతినిధులు కొనియాడారు. - 8లోదేవరకొండలో పది బెడ్లు సిద్ధం దేవరకొండ: దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కిట్లు, పది బెడ్లతో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఆస్పత్రికి ఇటీవల జిల్లా కలెక్టర్ నాలుగు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. -
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
ఫ విత్తే సమయమొచ్చే..నల్లగొండ : ధాన్యం సేకరణ, వ్యవసాయ సీజన్ సంసిద్ధత, భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాపాలన మాదిరిగానే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన 10 శాతం ధాన్యం సేకరించాలని సూచించారు. ఎంత ఎరువులు, విత్తనాలు కావాలో ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎవరైనా ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి జాబితా తయారుచేసి వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పక్కగా అమలు చేయాలని, మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదన కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇన్చార్జ్ డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్
నివేదిక సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తాం. మున్సిపాలిటీల్లోని అన్ని విభాగాల ఉద్యోగులు 100 రోజుల్లో చేయాల్సిన పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించి అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నాం. –సయ్యద్ ముసాబ్ అహ్మద్, నీలగిరి మున్సిపల్ కమిషనర్ ఫ జూన్ 2 నుంచి ప్రారంభం ఫ అభివృద్ధి పనుల పూర్తి, రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు లక్ష్యం ఫ ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు నల్లగొండ టూటౌన్: మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని విభాగాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులతో కలిసి జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించడం, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, ఎక్కడ పంపిణీ చేయాలి, ఎక్కడ నాటాలి అనే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను తప్పుఒప్పులను సవరించడం లాంటి కార్యక్రమం 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. ఈ నెలాఖరులోగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు మున్సిపాలిటీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలాంటివి చేపట్టాలి. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు.. ఇంజనీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు పూర్తి చేయడంతోపాటు వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, క్రమబద్ధీకరించడం, లేదా తొలగించడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు వైద్యశిబిరాలు చేపట్టాలి. పార్కుల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 100 రోజుల్లో ఏ విభాగం ఎంతమేర పనితీరు మెరుగుపర్చారో నివేదిక అందజేయాల్సి ఉంటుంది. వార్డులకు నోడల్ ఆఫీసర్ల నియామకం చేపట్టి నిరంతరం పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయా మున్సిపాలిటీలు తేదీల వారీగా జాబితా రూపొందించే పనిల్లో పడ్డాయి. -
మొక్కలను మింగేశారు..!
ఫ అవెన్యూ ప్లాంటేషన్ పేరిట నిధులు స్వాహా ఫ పనులు చేయకుండానే బిల్లులు డ్రా ఫ సోషల్ మీడియాలో మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ పోస్టు వైరల్ మిర్యాలగూడ: మున్సిపాలిటీలకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులను పనులను చేయకుండానే అధికారులు స్వాహా చేస్తున్నారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతున్నా మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయలు కాజేసినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ అవినీతి అంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇద్దరు అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.70లక్షల నిధులు మంజూరు.. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై 2023లో అవెన్యూ ప్లాంటేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బడ్జెట్ కింద మిర్యాలగూడ మున్సిపాలిటీకి నందిపాడు బైపాస్ (2.33 కి.మీ) నుంచి ఖలీల్ దాబా (4.66 కి.మీ) వరకు ఇన్నర్, ఔటర్లో అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.70,14,616.60 నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను చేసేందుకు 5 సెప్టెంబర్ 2023న టెండర్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 14న టెండర్ల గడువు ముగియడంతో అదేరోజు సాయంత్రం టెండర్లను ఓపెన్ చేశారు. ఈ పనులు 90 రోజుల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మొక్కలను నాటలేదు. దీంతో అప్పటి అధికారులు బిల్లులు చేయలేదు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. అప్పుడున్న మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, ఏఈ బదిలీ అయ్యారు. హడావిడిగా చెక్కు జారీ మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ నుంచి ఖలీల్ దాబా వరకు రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను నాటాల్సి ఉంది. అప్పటికే బైపాస్ వెంట కోనోకార్పస్, గన్నేరు మొక్కలు నాటి ఉన్నాయి. ఎక్కువ క్వాలిటీ ఉన్న మొక్కలను నాటాలని రూ.70 లక్షల నిధులు మంజూరు చేయగా మొక్కలను నాటకుండానే మున్సిపల్ అధికారులు ఇటీవల బిల్లులు నమోదు చేసి చెక్కు జారీ చేశారు. హడావుడిగా కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, ఏఈలు బిల్లులు చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మొక్కలను నాటకుండానే నాటినట్లు అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. మున్సిపాలిటీలో అవినీతిపై జోరుగా చర్చ అవెన్యూ ప్లాంటేషన్లో జరిగిన అవినీతిపై మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళవారం మన మిర్యాలగూడ ఫేస్బుక్ పేజీలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యమా? అని పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. బైపాస్రోడ్డు వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారని, దానికి సంబంధించిన టెండర్, నోటిఫికేషన్ పోస్టు చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మొక్కలను నాటకుండానే నాటినట్లు మున్సిపల్ అధికారులు బిల్లులు రాసి రికార్డు చేసి చెక్కు జారీ చేశారని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలని కోరడంతో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై జోరుగా చర్చ సాగుతోంది. కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ను, డీఈ వెంకన్నను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
మహిళలకు ఇది మంచి అవకాశం
ఉల్లాస్ పథకం ద్వారా చదువురాని మహిళలకు చదవడం, రాయడం, నేర్పించడంతోపాటు మధ్యలో బడి మానేసినవారిని ఓపెన్ టెన్త్, డిగ్రీ చదివించడం కోసం ప్రత్యేక తరగతులను కూడా మండల స్థాయిలో నిర్వహిస్తారు. దివ్యాంగులకు కూడా చదువుకునేందుకు ఇందులో అవకాశం లభిస్తుంది. వయోజన విద్యా శాఖ అధికారులకు ఇప్పటికే మహిళా సంఘాల జాబితా అందించాం. ప్రస్తుతం చదువురాని వారు ఎవరు, చదువుకున్న వారు ఎవరనేది గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు ఇది మంచి అవకాశం – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ -
ఘనంగా లక్ష పుష్పార్చణ
నార్కట్పల్లి : చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు వేద మంత్రాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సాయంత్రం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చారు. భక్తులు రాత్రి కొండపైన నిద్రించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. లక్ష పుష్పార్చనలో ఈఓ నవీన్కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల జాబితా రూపొందించాలి
జిల్లా వ్యవసాయాధికారితో 29న ఫోన్ ఇన్ ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 51294 తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు -
గ్రీవెన్స్లో వినతులు స్వీకరించిన కలెక్టర్
నల్లగొండ: గ్రీవెన్స్ సందర్భంగా ప్రజావాణిలో కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినతులు స్వీకరించిన వారిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్ఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. మేము ఇళ్లు కట్టుకున్న భూమికి రైతు భరోసా పొందుతున్నారు నల్లగొండ మండలం కాకుల కొండారంలో గ్రామ కంఠంలో కట్టుకున్న భూమికి వేరే వ్యక్తులు రైతు భరోసా పొందుతున్నారని, దాన్ని రద్దు చేసి తమ పేర్లు ఆన్లైన్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు గ్రామస్తులు గ్రీవెన్స్లో విన్నవించారు. సర్వే నంబర్ 171 నుంచి 176 వరకు భూమిలో దోమలపల్లి ప్రభాకర్రావు తండ్రి నరసింహ పేరున రికార్డుల్లో చూపుతోందని తెలిపారు. ఈ సర్వే నంబర్లలో 200 గృహాలు ఉన్నాయని, ఆ సర్వే నంబర్లలో ఇళ్లు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని వివరించారు. ఆ పట్టా రద్దు చేసి ఆ భూమిని గ్రామ కంఠం భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పు చేయించాలని గ్రామానికి చెందిన గండిచెర్వు వెంకన్న, భిక్షమయ్య, ఉశయ్య, సైదులు, లవయ్యతోపాటు పలువురు మహిళలు విన్నవించారు. -
సాగు పనుల్లో రైతన్న బిజీ
ఫ వర్షంతో ఊపందుకున్న దున్నకాలు ఫ విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు ఫ 11.60 లక్షల ఎకరాల్లో సాగు అంచనా నల్లగొండ అగ్రికల్చర్: తొలకరి వర్షాలు ముందే కురుస్తుండడతో జిల్లా అంతటా రైతులు దుక్కులను దున్నుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు పత్తిచేలలో కట్టెను తొలగించుకుని సిద్ధంగా ఉండడంతో పత్తి సాగుకు అవసరమైన దుక్కులను దున్నుకుంటున్నారు. వరి, పత్తి విత్తనాల కొనుగోలు కోసం రైతులు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్ గత వానాకాలం సీజన్ కంటే వారం ముందుగా ప్రారంభం కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఆదివారం రోహిణి కార్తె ప్రారంభం కాగా.. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అదేవిధంగా జూన్ 11న ఏరువాక పౌర్ణమి కావడంతో రైతులు ఆ రోజు ఏరువాక ప్రారంభించనున్నారు. పెట్టుబడుల కోసం తిప్పలు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగుకు రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పేలా లేవు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నాలుగు ఎకరాలపై భూమి ఉన్న రైతులకు నేటివరకు అందని పరిస్థితి. ప్రస్తుతం వానాకాలం సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్కు జూన్ మొదటి వారంలోనే గత ప్రభుత్వం పెట్టుబడి సాయం రైతు బంధు పేరుతో అందించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతుభరోసా వస్తుందో రాదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్లో కూడా రైతులందరికీ రైతు భరోసా అందలేదు. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుబాటులో విత్తనాలు.. రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 13 లక్షల 80 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉందని గుర్తించి దానికి అనుగుణంగా జిల్లాలోని విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. అదేవిధంగా లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలను కూడా డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. కంది, పెసర, వేరుశనగ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యాబై శాతం సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.పత్తి సాగు వైపే మొగ్గు.. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 11లక్షల 60 వేల ఎకరాల్లో వరి, పత్తి ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో సింహభాగంగా పత్తి 5,47,735 ఎకరాల్లో, వరి 5,25,350 ఎకరాల్లో, మిగతా కంది, పెసర, వేరుశనగ, సజ్జ, జొన్న పంటలు సాగు కానున్నాయి.దుక్కులు దున్నుకుంటున్నారు నైరుతి రుతుపనాలు మూడు రోజుల ముందే రావడం మంచి పరిణామం. ఇప్పటికే జిల్లా అంతటా రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. వానాకాలం సీజన్ జూన్ నుంచే ప్రారంభమవుతుంది. రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలను పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. –పాల్వాయి శ్రవణ్కుమార్, జేడీఏ -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ 45 మంది నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్నల్లగొండ: స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్కు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణ అమిత్కు కలెక్టర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఇండోనేషియాలోని బాలిలో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, రీజనల్ పాలసీ ఫోరం 78వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి ఇస్తున్న రుణాలు, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో వివరించారు. వ్యవసాయ రంగంలో వేస్టేజీ, పొల్యూషన్ లేకుండా వనరులు వాడుకునే విధానం, ఇండోనేషియాలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధి విధానాలను తెలుసుకోవడం కోసం క్షేత్ర పర్యటనలో ఆయన పర్యటించారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల సహకార బ్యాంకుల చైర్మన్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షయ రహిత జిల్లాగా మార్చాలినల్లగొండ టౌన్: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కృషిచేసి క్షయ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్లో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మందుల ద్వారా క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే జిల్లా కేంద్రంలోని టీబీ ఆస్పత్రిలో సంప్రదించి పరీక్షలు చేయించుకుని కోర్సు ప్రకారం మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్: నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, రైతులందరికీ రుణమాఫీ చేసి, రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలని కోరారు. మిల్లెట్ పంటలను ప్రోత్సహించడంతోపాటు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల ఎరువులను రైతులను అందుబాటులో ఉంచాలని, చెరువులు, కుంటలు, కాల్వలకు మరమ్మతులు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, యాసంగి ధాన్యానికి వెంటనే బోనస్ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్, పిండి పాపిరెడ్డి, గడ్డం మహేష్, కన్మంతరెడ్డి అశోక్రెడ్డి, బీపంగి జగ్జీవన్రామ్, గుండా నవీన్రెడ్డి, సాయన్నగౌడ్, రమణముదిరాజ్, బైరు సత్తయ్య, దాసోజు యాదగిరాచారి తదితరులు ఉన్నారు. -
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
నల్లగొండ: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూ సేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్ లైన్ సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అన్నారు. అనంతరం 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు కలెక్టర్ సర్వే సామగ్రి అందజేశారు. సర్వేయర్లకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్చార్జ్ ఏడీ సుజాత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణయ్య, సూపరింటెండెంట్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
వేములపల్లి: ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. గతంలో ఉపాధి హామీ పథకానికి రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రూ.86 వేల కోట్లకు కేంద్రం కుదించిందన్నారు. అదేవిధంగా గతంలో 23 కోట్ల జాబ్కార్డులు ఉంటే ఇప్పుడు 13 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఉపాధి కూలీలకు రూ.500 రోజువారి వేతనంతోపాటు పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వలు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు గౌతంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, నాయకులు చల్లబొట్ల ప్రణీత్రెడ్డి, వడ్డెగాని సైదులు, రెమడాల భిక్షం, సుకన్య తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
కొనుగోళ్లలో రెండో స్థానం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచింది. ఆఖరి స్థానంలో అతి తక్కువ ధాన్యం కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. మొదటగా నల్లగొండలో కేంద్రాలు ప్రారంభం రాష్ట్రంలోనే మొదటగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. యాసంగి కోతలు నల్లగొండ జిల్లాలో ముందస్తుగా రావడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదేరోజు మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. రెండో స్థానంలో నల్లగొండ.. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా.. 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా ఆదిలాబాద్ 249 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఇబ్బందులు ఎదుర్కొంటూ.. జిల్లాలో ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు సక్రమంగా అంచనా వేయలేకపోయారు. ప్రతిసారి వారు వేసిన అంచనాకు మించి ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. దాంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అధికంగా వస్తోంది. అయితే ఈసారి యాసంగి సీజన్ సమయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు రిటైర్డ్ కావడంతో డీఎం హరీష్కు ఇన్చార్జ్ డీఎస్వో బాధ్యతలు అప్పగించారు. రెండు కీలక పోస్టుల్లోను ఆయనే వ్యవహరించాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మహబూబ్నగర్ నుంచి వెంకటేశ్వర్లు డీఎస్వోగా బదిలీపై వచ్చారు. కొనుగోళ్ల భారం కలెక్టర్ మీద వేసుకుని జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఏరోజుకారోజు తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వచ్చారు. ధాన్యం సంచుల కొరత, లారీల కొరత ఎదురైనప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ధాన్యం కొనుగోళ్లు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో 5.83 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఫ జిల్లాలో అంచనాకు మించి దిగుబడి ఫ సమన్వయంతో పనిచేసిన అధికారులుసమన్వయంతో పనిచేశాం యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కలెక్టర్ ఇలా త్రిపాఠి నిత్యం అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయడంతో కొనుగోళ్లలో ముందు వరుసలో ఉన్నాం. లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్తోపాటు ఇటు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు తీసుకున్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు విడుదలయ్యాయి. వాటిని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. –హరీష్, పౌర సరఫరాల శాఖ డీఎం అంచనాకు మించి కొనుగోళ్లు.. జిల్లాలో మొత్తం 5.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అంచనాకు మించి మొత్తం 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇచ్చిన టార్గెట్ 5.36 లక్షలు అయితే.. 5.83 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అంటే 47 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశారు. దాదాపు రూ.1350 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 82 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. -
గిరిజనులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
హాలియా : గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం(టీఆర్జీఎస్) ఆధ్వర్యంలో పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించిన విద్యా, వైజ్ఞానిక రాజకీయ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చి గిరిజన రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. అందులో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫారెస్టు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తుందని గుర్తు చేశారు. గిరిజనులను ఐక్యమత్యంతో గిరిజన నాయకులు ముందుకు నడిపించి హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలనే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. టీఆర్జేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన సంఘం సీనియర్ నాయకులు రమావత్ శంకర్నాయక్, బుడియాబాబు పీఠాధిపతి ఆంగోతు భగవాన్నాయక్, టీఆర్జీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, రిటైర్డ్ డీటీడీఓ లాల్సింగ్, రమావత్ లలితాబాయి, రమావత్ జవహర్నాయక్, వెంకన్న, చంద్రుడునాయక్, రాగ్యానాయక్, నరేష్నాయక్, శ్రీనునాయక్, సురేష్, భాస్కర్నాయక్, అశోక్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నకిరేకల్లో డీలక్స్ బస్స్టాప్ ఎత్తివేత
నకిరేకల్ : మున్సిపాలిటీ, నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్లో ఆర్టీసీ డీలక్స్ బస్స్టాప్ను ఎత్తివేసింది. ఇప్పటి వరకు సూర్యాపేట నుంచి నకిరేకల్, తాటికల్ మీదుగా నల్లగొండకు డీలక్స్ బస్సులు నడిపింది. రోజూ 20 ట్రిప్పులు నడిచేవి. ఈ డీలక్స్ బస్సులతో నకిరేకల్ ప్రాంత ప్రయాణికులు నల్లగొండ, సూర్యాపేట వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్ల్లో మహలక్ష్మి పథకం అమలుతో ప్రయాణికుల రద్దీ విపరితంగా పెరిగింది. దీంతో చాలా మంది డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు. ఇటీవల ఆ డీలక్స్ బస్సుల స్టాప్ను నకిరేకల్లో ఎత్తివేసి.. వాటిని నాన్స్టాప్ సర్వీసులుగా మార్చారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార కేంద్రంగా ఉన్న నకిరేకల్లో డీలక్స్ బస్స్టాప్ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈవిషయంపై నకిరేకల్ ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ పల్స వీరయ్యను వివరణ కోరగా.. నకిరేకల్లో డీలక్స్ బస్స్టాప్ పునరుద్ధరించే విషయాన్ని ఆర్టీసీ డీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.స్టాప్ను పునరుద్ధరించాలి కొంతకాలంగా నకిరేకల్ స్టాప్గా సూర్యాపేట – నల్లగొండకు వయా తాటికల్ మీదుగా ఆర్టీసీ డీలక్స్ బస్సులు నడిపింది. కొన్ని రోజుల నుంచి నకిరేకల్ స్టాప్ను ఎత్తివేసి నాన్స్టాప్ సర్వీస్గా మార్చారు. ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం నల్లగొండ – నకిరేకల్ – సూర్యాపేటకు రాకపోకలు సాగిస్తుంటారు. మహాలక్ష్మి ఫథకంతో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగులు చాలా మంది డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు. నకిరేకల్లో స్టాప్ ఎత్తివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నకిరేకల్లో స్టాప్ను పునరుద్ధరించాలని నల్లగొండ, సూర్యాపేట ఆర్టీసీ డీఎంలకు విన్నవించాం. – బెల్లి యాదయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, నకిరేకల్ఫ నాన్ స్టాప్గా సూర్యాపేట– నల్లగొండ డీలక్స్ సర్వీస్ ఫ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
దేవరకొండలో తిరంగా ర్యాలీ
దేవరకొండ : పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం దేవరకొండ పట్టణంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, లాలునాయక్, ఏటి కృష్ణ, కల్యాణ్నాయక్, రవికుమార్, సురేష్, వస్కుల సుధాకర్, పున్న వెంకటేష్, నక్క వెంకటేష్, ఎన్వీటీ, శివగౌడ్, గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పౌరస్పందన వేదిక ప్రచార జాతా
నల్లగొండ : నల్లగొండలో సోమవారం పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రచార జాతా ప్రారంభం కానున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆదిఆవరం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిస్తూ ఈ ప్రచార జాతా పట్టణంలోని గడియారం సెంటర్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ జాతాకు టీఎస్యూటీఎఫ్ జిల్లా, మండల బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుద్ధవనం మహాద్భుతంనాగార్జునసాగర్ : సాగర్లో నిర్మాణమైన బుద్ధవనం మహాద్భుతంగా ఉందని జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి సముద్రాల సంపూర్ణ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన నాగార్జునసాగర్ను కుటుంబ సమేతంగా సందర్శించారు. సాగర్ పర్యటనలో భాగంగా బుద్ధవనం చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు బుద్ధవనం ఈఓ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. మహాస్థూపం ధ్యాన మందిరంలో న్యాయమూర్తి దంపతుల చేత జ్యోతి ప్రజ్వలన చేయించారు. బుద్ధచరితవనం, ధ్యానవనం, స్థూపపార్కు తదితర ప్రాంతాలను సందర్శించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ మ్యూజియాన్ని సందర్శించారు. ఆయన వెంట గైడ్ సత్యనారాయణ, ఎస్ఐ సంపత్, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, కోర్టు, పోలీస్ సిబ్బంది నరేష్, శివ, కిషన్ ఉన్నారు. కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలునల్లగొండ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ మ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 4398 మంది విద్యార్థులకు గాను 4105 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకు 1,670 మంది హాజరు కావాల్సి ఉండగా 1,590 మంది పరీక్ష రాశారు. ఉత్తమ సాధన రాష్ట్ర కమిటీకి చందంపల్లి టీచర్నకిరేకల్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధి, బోధనాంశాల్లో మంచి అనుభవాలను గుర్తించేందుకు విద్యాశాఖ తీసుకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ స్కూల్స్ (ఉత్తమ సాధన) రాష్ట్ర స్థాయి కమిటీకి నకిరేకల్ మండలం చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం కనుకుంట్ల నవీన్రెడ్డి ఎంపికయ్యారు. కలెక్టర్ చైర్పర్సన్గా జిల్లా వ్యాప్తంగా 39 మంది ఉపాధ్యాయుల పేర్లను పరిశీలించి వీరిలో ముగ్గురిని ఎంపిక చేశారు. నవీన్రెడ్డి చందంపల్లి పాఠశాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి ఎంపిక చేశారని ఎంఈఓ మేకల నాగయ్య తెలిపారు. నవీన్రెడ్డిని డీఈఓ భిక్షపతి, సెక్టోరియల్ ఆఫీసర్ రామచంద్రయ్య అభినందించారు. కళాశాలల మూసివేత నిర్ణయం సరికాదుసూర్యాపేట : రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల మూసివేత నిర్ణయం సరికాదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, జిల్లా అధ్యక్షులు బోయిళ్ల అఖిల్, అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
రైతు ప్రయోజనాలే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తృతం చేశామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు ద్వారా ఇచ్చే రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1917లో ప్రారంభమైన డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..రైతులకు డ్రోన్ల సహకారం రైతులకు బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయబోతున్నాం. డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. బ్యాంకు పరిధిలోని 108 సహకార సంఘాల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. వాటిని ఈ వానాకాలం సీజన్లోనే అందజేస్తాం. బయటి మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతో రైతులు వరి, పత్తి చేలకు పురుగు మందులను పిచికారి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాం పెద్ద ఎత్తున రుణ సదుపాయం, జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1100 కోట్లు గతేడాది కంటే రూ.483 కోట్ల అదనపు రుణాలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి మరో 6 కొత్త శాఖలు ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో కొత్త శాఖల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మరో 6 కొత్త శాఖల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. -
జూన్లోనే మూడు నెలల రేషన్
జూన్, జూలై, ఆగస్టు మాసాల కోటా బియ్యం పంపిణీ నల్లగొండ : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే వర్షాకాలంలో వర్షాలు, వరదలకు బియ్యం రవాణా, సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండడంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను జూన్ మాసంలోనే పేదలకు పంపిణీ చేయనుంది. అందులో భాగంగా అధికారులు రేషన్ షాపులకు బియ్యం రవాణాను ప్రారంభించారు. నెలకు 9 వేల మెట్రిక్ టన్నులు.. జిల్లాలో మొత్తం 4,84,216 మంది రేషన్కార్డుదారులు ఉండగా అందులో 15,02,656 మంది సభ్యులు ఉన్నారు. వారందరికి నెలకు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. మూడు నెలలక సంబంధించి 27 వేల పైచిలుకు మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఈ నెల 30లోగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే రేషన్ షాపుల్లో కొన్నిచోట్ల మూడు బియ్యం నిల్వ చేయడానికి స్థలం లేనందున విడతల వారీగా సరఫరాను చేయాలని నిర్ణయించారు. మొదట ఒక లారీ, వారం రోజుల తర్వాత మరో లారీ, మరో వారం తర్వాత లారీ.. ఇలా మూడు విడతలుగా షాపులకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రవాణా అవుతాయి. జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యాన్ని మూడు మాసాలకు సంబంధించిన కోటాను జూన్ మాసంలో పంపిణీ చేయనున్నారు. రేషన్ డీలర్లు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆదేశం ఫ ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు బియ్యం సరఫరాబియ్యం రవాణా ప్రారంభించాం రేషన్ కార్డుదారులకు ఒకేసారి మూడు మాసాలకు సంబంధించిన బియ్యం కోటాను అందించాలని ఆదేశాలు వచ్చాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు రవాణా ప్రారంభించాం. జూన్ 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఏ ఒక్క కార్డుదారుడు ఇబ్బంది పడకుండా డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు. రవాణాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – హరీష్, డీఎం పౌర సరఫరాల శాఖ, నల్లగొండ -
అమ్మ పేరుతో ఒక మొక్క!
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మహిళా సంఘాల భాగస్వామ్యంతో చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అమృత్ 2.0 స్కీం కింద ‘ఏక్ ఫేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) అనే నినాదంతో మహిళా సంఘాల సభ్యులు మొక్కను నాటడంతో పాటు రెండేళ్ల పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారే చూసేలా కార్యాచరణ రూపొందించింది. రెండు ప్రాంతాలు గుర్తింపు.. ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవం విజయవంతానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా చెరువుల సమీపాల్లో మొక్కలను నాటనున్నందున పట్టణానికి అనువైన స్థలాలుగా యాద్గార్పల్లి పందిర్లపల్లి చెరువు(బోటింగ్ పార్క్), హౌజింగ్ బోర్డు చిన్న చెరువులను గుర్తించారు. చెరువుల వద్ద మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తారు. జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం.. మున్సిపాలిటీలో గుర్తించిన రెండు ప్రాంతాల్లో జూన్ 5వ తేదీ నుంచి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు మొక్కలు నాటనున్నారు. ఫ వన మహోత్సవంలో మహిళా సంఘాల భాగస్వామ్యం ఫ మొక్క నాటి సంరక్షించే బాధ్యత మహిళలకు అప్పగింత ఫ మిర్యాలగూడ మున్సిపాలిటీలో వినూత్న కార్యక్రమం ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసుఫ్ మహిళా సంఘాలకు సూచిస్తున్నారు. మున్సిపాలిటీలో మొక్కలను నాటేందుకు గుర్తించిన స్థలాల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి రైతులకు ముందస్తు వ్యవసాయ ప్రణాళిక చాలా అవసరం. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకున్నప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అవసరం లేకున్నా రసాయనిక ఎరువుల వాడడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. విత్తనాలను శాస్త్రవేత్తల సలహాలు సూచనల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. భూగర్భ జలాలను కాపాడుకోవడానికి నీటిని పొదుపుగా వాడుకోవాలి. మెట్ట వరి పైరును సైతం సాగు చేసుకోవచ్చు. – డాక్టర్ శ్రీనివాసరావు, కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ త్రిపురారం : వానాకాలం సీజన్లో వివిధ రకాల పంటల సాగుకు రైతులు ముందస్తుగా ప్రణాళిక ప్రకారం వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గ్రామాల్లో సైతం రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతులకు ఖరీఫ్ సిజన్లో పాటించాల్సిన పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దుక్కులు దున్నడం అత్యంత కీలకం దుక్కులు దున్నడం వల్ల తొలకరి వర్షాలకు భూమి నీటిని పీల్చుకొని పొలంలో తేమ శాతం పెగడానికి ఉపయోడపడుతుంది. వాలుకు అడ్డంగా లోతు దుక్కులు దున్నడంతో వర్షపు నీరు వృథా కాకుండా నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. తోటల్లో దుక్కుల వల్ల మొండి జాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు వచ్చి పిచ్చి మొక్కల కలుపు నివారణ జరుగుతుంది. నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, వర్మి కంపోస్ట్ను దుక్కుల్లో వేసుకోవచ్చు. చౌడు నేలలను బాగు చేసుకోవడం భూగర్భ జలాలను విరివిగా వాడడం వల్ల నీటిలోని క్లోరైడ్తో పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయి. భౌసార పరీక్షలను అనుసరించి చౌడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా మార్చేందుకు వేసవి కాలం అనువైన సమయం. ఎండాకాలంలో నేలపైకి పొంగి ఉన్న ఉప్పు, చౌడు పొరలను తొలగించాలి. నీరు బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20 నుంచి 25 సెంట్లుగా మడులను విభజించి గట్టు వేయాలి. కారు చౌడు నేలలను ఎండినప్పుడు పలక రాయి వలే గట్టిగా ఏర్పడతాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మొత్తగా ,ఇక్కటి బురద తయారవుతుంది. ఇలాంటి నేలను బాగు చేసుకోవడానికి ఇదే మంచి సమయం. పొలం గట్లు, పంట కాలువల తయారీ రైతులు పొలం గట్ల తయారీ, పంట కాలువలపై అత్యంత శ్రద్ధ వహించాలి. వివిద రకాల కలుపు మొక్కలు పొలం గట్ల నుంచి పంటలకు వచ్చి పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి. కలుపు మొక్కలైన ఓయ్యారి భామ, మూల మాతంగి, నీరు గోబ్బి, గొగలగరాకు, గొంగలి రాకాశి, తుంగ వంటి మొక్కలు పంటలలో పెరిగి పలు రకాలపై చేడు పరుగులు వ్యాప్తి చెంది చీడపీడల వ్యాప్తికి కారణయావుతాయి. అందువల్ల ముందస్తుగానే పొలం గట్లు, పంట కాలువను శుభ్రం చేసుకొని తయారు చేసుకోవాలి. విత్తనాల ఎంపిక రైతులు తమ విత్తనాలను తమ పొలం నుంచి సిద్ధం చేసుకోవచ్చు. తాలు గింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలను వేరు చేసి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. వరి పరిశోధన స్థానాల నుంచి సేకరించిన విత్తనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సర్టిఫైడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసిన విత్తనాలను మొలక శాతం పరిశీలించుకొని నారు పోసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్ల సాగు పంట సాగుకు ముందస్తుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకొని కలియదున్నడం వల్ల నేలలో భూసారం పెంపొందుతుంది. తొలకరి వారాలకు జనుము, జీలుగ, పిల్లిపెసర అలసంద వంటి పలు రకాల పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకొని కలియదున్నుకోవచ్చు. దీంతో ఎకరాకు 20 నుంచి 30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. పిల్లి పెసర, జనుమును పశువుల మేతగా కూడా వినియోగంచుకోవచ్చు. భూసార పరీక్షలు భూమిలో పోషక విలువలు తగ్గిపోయి పంటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపిస్తుంటాయి. పోషకాలను బట్టి పంటలకు అందించే శక్తి, గాలి, నీరు భూమిలోకి చొచ్చుకుని వెళ్లి ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్య పోషకాలు పంటల దిగుబడిపై ప్రభావ చూపుతాయి. అందువల్ల భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఏడాదికి ఓక్కటి, రెండు పంటలు పండించే భూముల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్ష కేంద్రాల్లో అందజేయాలి. వారి సూచనల మేరకు పంటల సాగు చేపట్టి ఎరువుల వాడకం చేపట్టడం ఉత్తమం. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో శ్రీస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, మాడ వీధుల్లో సందడి వాతావరణం కనిపించింది. కాగా శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారి ప్రసాద విక్రయశాల, మాడ వీధులు, క్యూలైన్లు, బస్టాండ్ ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. శ్రీస్వామివారిని 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,77,624 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
స్కూటీకి నిప్పంటించిన దుండగులు
రామన్నపేట: ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్కూటీపై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రామన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బాలగోని వెంకట హరిదీప్ తన స్కూటీని శుక్రవారం రాత్రి తన ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి 11గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చి స్కూటీపై చల్లి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. స్కూటీ ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కారును ఢీకొట్టిన డీసీఎం.. నలుగురికి గాయాలు
నకిరేకల్: ముందు వెళ్తున్న కారును డీసీఎం ఢీకొనడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణ శివారులో జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవే బైపాస్ పైకి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొని ఆగిపోయింది. డీసీఎం అదుపుతప్పి అదే కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి, డీసీఎంలో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంలో వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. క్షతగాత్రులంతా హైదరాబాద్కు చెందినవారని పేర్కొన్నారు. -
గేదెను ఢీకొని యువకుడి మృతి
భూదాన్పోచంపల్లి: బైక్పై ఇంటికి వెళ్తున్న యువకుడు గేదెను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతావానిగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు సాయి(24) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్పై ఇంటికి వెళ్తుండగా ముక్తాపూర్ నుంచి తప్పించుకొని సీతావానిగూడెం వైపు వచ్చిన గేదె పరిగెడుతూ రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా రావడంతో గేదెను తప్పించబోయి దానిని ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సాయి తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అంబులెన్స్లో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే సాయి మృతిచెందినట్లు తెలిపారు. సాయి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. -
విదేశాలకు డ్రై వెజిట బుల్స్
బొమ్మలరామారం: హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళీరాజ్ డ్రై వెజిటబుల్స్(ఆరబెట్టిన కూరగాయలు)ను విదేశాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. అంతేకాకుండా సోలార్ డ్రైయర్ యూనిట్లను స్వయంగా తయారుచేస్తూ డ్రై వెజిటబుల్ వ్యాపారం చేసేందుకు ఆసక్తి గల రైతులకు విక్రయిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామ శివారులో 16ఎకరాల భూమిని మురళీరాజ్ కౌలుకు తీసుకొని సోలార్ డ్రైయర్ వెజిటబుల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పలు రకాల కూరగాయలతో పాటు మార్కెట్లో లభించే పండ్లను సైతం సోలార్ వెజిటబుల్ డ్రైయర్ యూనిట్లో ఆరబెట్టి స్థానిక మార్కెట్లో విక్రయించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా తాను సోలార్ డ్రైయర్లు విక్రయించిన రైతుల వద్ద ఆరబెట్టిన కూరగాయలను కూడా సేకరించి యూరప్లోని జర్మనీ, నార్వే, స్పెయిన్, రష్యా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలైన టర్కీ, కువైట్, ఒమన్, సౌదీలకు ఎగుమతి చేస్తున్నారు. అదేవిధంగా పర్వతారోహణ చేసే వారి కోసం హిమాలయాల వరకు సైతం ఈ డ్రై వెజిటబుల్ వ్యాపారం విస్తరించింది. ప్రధానంగా అల్లంవెల్లుల్లి, మునగాకు, మునగకాయలు, ఉసిరి, అరటి, టమాట, ద్రాక్ష పండ్లను ఎగుమతి చేస్తున్నారు. బహుళ ప్రయోజనకారిగా యూనిట్లు కూరగాయలు సాగుచేస్తున్న రైతులకు సోలార్ డ్రైయర్ యూనిట్లు లాభసాటిగా మారాయి. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసి, మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులకు ధర గిట్టుబాటు కాక అప్పులపాలైన సంఘటన చాలా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తక్కువ విస్తీర్ణంలో సాగు లాంటి కారణాలతో కొన్ని సమయాల్లో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇలాంటి సమయాల్లో సోలార్ డ్రైయర్ యూనిట్ను ఏర్పాటు చేసుకుని ఆ యూనిట్లో కూరగాయలు, పండ్లను ఆరబెట్టి భద్రపరచడంతో ఆరు నెలల వరకు ఈ డ్రై వెజిటబుల్స్ను వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన రైతులు నష్టాలబారిన పడకుండా, వినియోగదారులకు అధిక ధరల సెగ తగలకుండా ఉంటుంది. పోషకాల లోపం ఉండదు వెజిటబుల్స్ను 40–50 డిగ్రీల మధ్యనే ఆరబెట్టడంతో పోషకాల లోపం ఉండదని మురళీరాజ్ పేర్కొంటున్నారు. క్యాటరింగ్ చేసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు, ఎన్ఆర్ఐలకు ఈ డ్రై వెజిటబుల్స్ఉపయోగకరంగా ఉంటున్నాయి. కూరగాయలతో పాటు పండ్లు, అన్నిరకాల మాంసహార ఉత్పత్తులను సైతం సోలార్ డ్రైయర్లో ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ప్రభుత్వం చేయూతనివ్వాలి సోలార్ వెజిటబుల్ డ్రైయర్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి కెపాసిటీని బట్టి రూ.75వేల నుంచి రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే చాలా మంది కూరగాయల రైతులకు మేలు జరుగుతుంది. కూరగాయల సాగు చేస్తున్న రైతుల్లో డ్రై వెజిటబుల్స్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు 40 మంది రైతులు తన నుంచి సోలార్ డ్రైయర్లను కొనుగోలు చేసినట్లు మురళీరాజ్ పేర్కొన్నారు. చాలామంది రైతులు తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ డ్రైయర్ వెజిటబుల్ యూనిట్లను సందర్శించి, తమకు కూడా యూనిట్లను తయారు చేసి ఇవ్వాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. ఫ ఆరబెట్టిన కూరగాయలను గల్ఫ్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఔత్సాహిక రైతు మురళీరాజ్ ఫ నాగినేనిపల్లిలో 16 ఎకరాల్లో సోలార్ డ్రైయర్ యూనిట్ల ఏర్పాటు ఫ ఆసక్తి గల రైతులకు సోలార్ డ్రైయర్ యూనిట్లు అందజేసి ప్రోత్సాహం డిమాండ్ అధికంగా ఉంది రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాను. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు సోలార్ డ్రైయర్లో ఆరబెట్టిన కూరగాయలను సేకరించి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాం. గల్ఫ్, యూరప్ దేశాల్లో డ్రై వెజిటేబుల్స్కు మంచి డిమాండ్ ఉంది. పర్వతారోహకులు ఎక్కువ బరువు గల కూరగాయలను తమతో తీసుకెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. వారి సౌలభ్యం కోసం డ్రై వెజిటేబుల్స్ అందిస్తున్నాం. – మురళీరాజ్, నాగినేనిపల్లి -
నేడు ఉమ్మడి జిల్లా చెస్ సెలక్షన్స్
సూర్యాపేట: సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10గంటల నుంచి ఉమ్మడి జిల్లా అండర్–11, 17 బాలబాలికల చెస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి గండూరి కృపాకర్, ఎల్. సతీష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారిని హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 9394753343 నంబర్ సంప్రదించాలన్నారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో తనిఖీలుమిర్యాలగూడ టౌన్: నల్లగొండ రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి నార్కోటిక్ డాగ్స్తో మిర్యాలగూడ రూరల్ పోలీసుల సహకారంంతో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లోని పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మిర్యాలగూడ రూరల్ ఏఎస్ఐ ఉమాపతిరావు, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.కుమారుడిని సర్కారు బడిలో చేర్పించిన ప్రభుత్వ టీచర్ తిరుమలగిరి: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉపాధ్యాయురాలు దొంగరి ప్రశాంతి తన కుమారుడు రిషికి తిరుమలగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, తన కుమారుడికి నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట భర్త హరీష్, మండల విద్యాధికారి శాంతయ్, ప్రధానోపాధ్యాయులు అశోక్రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, సత్యనారాయణరెడ్డి, వెంకట్రామనర్సయ్య, సౌమ్యబాయి, గిరి, వెంకటయ్య పాల్గొన్నారు. చికిత్స పొందుతూ మృతిచింతపల్లి: నిచ్చెన పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. చింతపల్లి మండలం ఉమాంతలపల్లి గ్రామానికి చెందిన అరేకంటి నర్సింహ (59) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో కరెంట్ రాకపోవడంతో గురువారం నిచ్చెన సహాయంతో ఇంటి పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. -
అప్పులు చేసి పరారైన వ్యాపారి
భువనగిరి టౌన్: డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే వ్యక్తి తన వద్ద పనిచేసే మహిళల నుంచి అప్పులు తీసుకుని వాటిని తీర్చలేక పరారయ్యాడు. దీంతో అతడికి అప్పు ఇచ్చిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా.. పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన శనివారం భువనగిరిలో వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిగిరి రాధాకృష్ణ, అతడి కుమారుడు అవినాష్ భువనగిరిలోని గంజ్ మార్కెట్ వెనుక రుద్ర డ్రై ఫ్రూట్స్ పేరిట వ్యాపారం చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, మసాలాలు ప్యాకింగ్ చేసేందుకు వారి వద్ద ఏడుగురు మహిళలు పనిచేస్తున్నారు. వ్యాపారం అభివృద్ధి చేస్తానని చెప్పి అధిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద పనిచేసే మహిళలకు ఒకరికి తెలియకుడా మరొకరి నుంచి రూ.30 లక్షలకు పైగా అప్పులు తీసుకున్నారు. వారి వద్ద పనిచేసే భువనగిరి పట్టణంలోని అర్బన్కాలనీకి చెందిన తోట సరిత రూ.2.40 లక్షలు అప్పుగా ఇచ్చింది. అంతేకాకుండా మరో రూ.లక్ష ఇతరుల నుంచి అప్పుగా ఇప్పించింది. అయితే తీసుకున్న డబ్బులను రాధాకృష్ణ, అతడి కుమారుడు అవినాష్ తిరిగి ఇవ్వకపోగా.. మూడు రోజుల నుంచి వారు ఇంట్లో లేకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆందోళనకు గురైన సరిత శనివారం ఇంట్లో బాత్రూంలు కడిగే హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇటీవలే విడాకులు తీసుకున్న మరో మహిళ పుస్తెలతాడు అమ్మి అప్పు ఇవ్వగా.. మరికొందరు చిట్టీలు ఎత్తి, బజాజ్ ఫైనాన్స్ కార్డుల ద్వారా డబ్బులు తీసి అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం రాధాకృష్ణ కుటుంబం పరారైందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. ఫ డబ్బులు ఇచ్చి మోసపోయిన మహిళ ఆత్మహత్యాయత్నం ఫ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు -
ఆ దరఖాస్తులకు విలువేదీ!
ప్రజాపాలనలో రేషన్కార్డు దరఖాస్తులను పట్టించుకోని ప్రభుత్వంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : రేషన్కార్డు కోసం ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకు విలువ లేకుండా పోతోంది. కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికే ప్రభుత్వం ఇటీవల కార్డులు మంజూరు చేసింది. ఇదేమని దరఖాస్తు దారులు అధికారులను అడిగితే.. దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో ప్రజాపాలనలో రేషన్కార్డు కోసం చేసుకున్న 71,563 దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆ దరఖాస్తుదారుల్లో కొంతమంది మీ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకొని ఉండడంతో 9,650 మందికి మార్చి నెలలో కార్డులను మంజూరు చేశారు. 2024లో ప్రజాపాలన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించింది. చాలామంది ఇళ్లు, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్, గ్యాస్, తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకోగా, రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారే 71,563 మంది ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ ఆర్థిక, రాజకీయ, కులగణన సమయంలోనూ రేషన్కార్డు లేని వివరాలు సైతం స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పిల్లల పేర్లు కార్డులో నమోదు కోసం చేసుకున్న దరఖాస్తులు కూడా అలాగే ఉండిపోయాయి. తామేం చేయలేమంటున్న అధికారులు ప్రజాపాలనలో రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల విషయంలో అధికారులు తామేం చేయలేమని చెబుతున్నారు. ఆ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, వాటిని పరిశీలించి అర్హులకు మంజూరు చేయాలన్న విషయాన్ని కూడా తమకు చెప్పలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రజాపాలనలో, ఇటు కులగణన సర్వే సమయంలో రేషన్ కార్డులు కావాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. అధికారులు మాత్రం రేషన్కార్డు కావాలంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ప్రజలు మళ్లీ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఫ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ఫ పెండింగ్లో 71,563 ప్రజాపాలన దరఖాస్తులు ఫ అధికారులను అడిగితే మీసేవ కేంద్రాల్లో చేసుకోవాలంటూ సలహా పేదలకు తప్పని ఎదురుచూపు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ సమయంలో కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను, కులగణన సర్వేలో రేషన్కార్డు కావాలని చెప్పిన వినతులను పక్కన పడేసింది. కేవలం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేసింది. అయితే ప్రజా పాలనలో చేసుకున్న 71,563 దరఖాస్తుదారుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం వాటి పరిశీలన కూడా చేయలేదు. ప్రజాపాలనలో రేషన్కార్డు కోసం వచ్చిన దరఖాస్తులుమండలం దరఖాస్తులు అడవిదేవులపల్లి 662 అనుముల 2,148 చందంపేట 2,302 చండూరు 1616 చింతపల్లి 1,731 చిట్యాల 2,752 దామరచర్ల 4,036 దేవరకొండ 1,732 గుండ్లపల్లి 2,056 గుర్రంపోడు 3,230 కనగల్ 2,599 కట్టంగూర్ 3,901 కేతేపల్లి 2,630 కొండమల్లేపల్లి 1,379 మాడుగులపల్లి 3,255 మర్రిగూడ 1,739 మిర్యాలగూడ 353 మునుగోడు 2,021 నకిరేకల్ 795 నల్లగొండ 2,634 నాంపల్లి 2,813 నార్కట్పల్లి 4,106 నేరెడుగొమ్ము 0 నిడమానూరు 3,903 పెద్దఅడిశర్లపల్లి 2,757 పెద్దవూర 2,570 శాలిగౌరారం 1,259 తిప్పర్తి 2,683 తిరుమలగిరిసాగర్ 3,239 త్రిపురారం 2,775 వేములపల్లి 1,888 మొత్తం 71,563 -
ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలోని 12 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 2036 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 1851 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 282 మందికి 231 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. వృత్యంతర శిక్షణతో ఆధునిక బోధనమిర్యాలగూడ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక బోధనా పద్ధతులు అమలు పర్చడానికి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఉపయోగపడుతుందని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో.. దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. విద్యాశాఖ ఆదేశానుసారం పాఠశాల పునః ప్రారంభానికి ముందే ప్రతి ఉపాధ్యాయుడు ఐదు రోజులు శిక్షణ పొంది ఉండాలన్నారు. శిక్షణ అంశాలను ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకోని సమాధానాలు రాబ ట్టారు. శిక్షణలో వసతులు, భోజన సౌకర్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులంతా మాతృభాష తెలుగులో దారాళంగా చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచాలని అన్నారు. జూన్ 6 నుంచి ఉపాధ్యాయులంతా బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓలు లావూరి బాలు, ఎం.బాలాజీనాయక్, ఆర్.వరలక్ష్మి ఉన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలునల్లగొండ టూటౌన్ : పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సమతా సంక్షేమ సమితి, దళిత మోర్చాల ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ఇవ్వనున్న పురస్కారాల పండుగ బ్రోచర్లను శుక్రవారం ఆయన నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, చింతా ముత్యాల్రావు, రావెళ్ల కాశమ్మ, ఫకీరు మోహన్రెడ్డి, దాసోజు యాదగిరిచారి పాల్గొన్నారు. యాదగిరీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం తదితర పూజలు నిర్వహించారు. -
గర్భిణులకు అవగాహన కల్పించాలి
నల్లగొండ : అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో గర్భిణులను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మాతా శిశు మరణాలను నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖకు.. ఐసీడీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సహకరించాలని సూచించారు. ఆరోగ్య సమస్యపై పీహెచ్సీకి వస్తే.. అక్క సాధ్యం కాకపోతే ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ మాతృనాయక్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి శిరీష ఆస్పత్రిపై విచారణకు ఆదేశం.. గతేడాది డిసెంబర్లో మిర్యాలగూడలోని శిరీష ఆసుపత్రికి కాన్పు కోసం వచ్చిన అడావత్ రాజేశ్వరికి రాజేశ్వరి వెళ్లగా, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శిరీష చివరి క్షణం వరకు రాజేశ్వరిని ఆసుపత్రిలో ఉంచుకొని.. పరిస్థితి విషమించాక నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పంపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసవానంతరం డిసెంబర్ 28న ఆమె మృతి చెందింది. రాజేశ్వరిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపండంలో నిర్లక్ష్యం వహించిన శిరీష ఆసుపత్రిపై మెజిస్టీరియల్, శాఖా పరమైన విచారణకు ఆదేశిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. -
వన మహోత్సవానికి సన్నద్ధం
దేవరకొండ: జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇందుకుగాను ఆయా మండలాలతోపాటు శాఖల వారీగా లక్ష్యాలను జిల్లా అధికారులు నిర్దేశించారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 39,51,700 మొక్కలు నాటాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 844 నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు పలు రకాల పూల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రణాళికలు సిద్ధం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రామపంచాయతీల్లో గల నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండ వేడిమి నుంచి సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నర్సరీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయడంతోపాటు మొక్కలకు ప్రతిరోజూ నీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. డీఆర్డీఓ శేఖర్రెడ్డి జిల్లాలోని ఆయా నర్సరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు. విద్యాసంస్థలు, ఖాళీ స్థలాలు, వసతి గృహాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మండలాల వారీగా లక్ష్యం ఇలా.. మండలం మొక్కలు అడవిదేవులపల్లి 55,714 అనుముల 79,778 చందంపేట 1,05,915 చండూరు 1,20,960 చింతపల్లి 1,45,537 చిట్యాల 1,31,183 దామరచర్ల 1,60,521 దేవరకొండ 1,20,724 గుండ్లపల్లి 1,49,807 గుర్రంపోడ్ 1,39,794 కనగల్ 1,34,416 కట్టంగూర్ 1,51,264 కేతేపల్లి 1,21,232 కొండమల్లేపల్లి 1,04,255 మాడ్గులపల్లి 1,17,856 మర్రిగూడ 1,19,407 మిర్యాలగూడ 2,13,248 మునుగోడు 1,46,891 నకిరేకల్ 1,02,171 నల్లగొండ 1,42,727 నాంపల్లి 1,28,473 నార్కట్పల్లి 1,64,291 నేరేడుగొమ్ము 69,965 నిడమనూరు 1,41,629 పీఏ పల్లి 1,53,265 పెద్దవూర 1,25,938 శాలిగౌరారం 1,52,052 తిప్పర్తి 1,03,014 త్రిపురారం 1,40,411 టి.సాగర్ 1,24,978 వేములపల్లి 84,280నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సమష్టిగా సంరక్షిస్తాం. జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అన్ని గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వన మహోత్సవ లక్ష్య సాధనకు కృషి చేస్తాం. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ, నల్లగొండజిల్లా వ్యాప్తంగా 39.51 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ఫ 844 నర్సరీల్లో మొక్కల పెంపకం ఫ మండలాల వారీగా లక్ష్యాల నిర్దేశం -
ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి
మిర్యాలగూడ : ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ను కేంద్రం వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం నరమేధం సాగిస్తోందన్నారు. కగార్ ఆపరేషన్ను వెంటనే ఆపి అక్కడ ఉన్న బలగాలను వెనక్కి పిలిపించాలన్నారు. ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని ప్రభుత్వం దుర్మార్గంగా చంపడం హేయమైన చర్య అన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారే తప్ప వ్యక్తిగతంగా హింస చేయడం లేదన్నారు. అడవిలో ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపదను కాజేసి బడా కంపెనీలకు అప్పజెప్పడం కోసం ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్నారు. ఆపరేషన్ కగార్పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, వినోద్నాయక్, తిరుపతి రామ్మూర్తి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మరో 10,311 ఇందిరమ్మ ఇళ్లు
నల్లగొండ : జిల్లాకు రెండో విడతలో 10,311 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మొదటి విడతలో 1,753 ఇళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇక, రెండు విడతల్లో కలుకుని ఇప్పటివరకు మొత్తం 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. సిద్ధమవుతున్న అర్హుల జాబితా జిల్లాలోని నియోజకవర్గాల్లో మొత్తం 17,500 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు విడతల్లో కలుపుకుని 12,064 ఇళ్లు మంజూరు కాగా.. మిగిలిన ఇళ్లకు సంబంధించి కూడా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు లిస్టు తయారు చేస్తున్నాయి. వాటన్నింటిని మండల స్థాయిలో గెజిటెడ్ అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి అప్రూవల్తో కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ను లబ్ధిదారులకు అందించనున్నారు. ఫ రెండో విడత మంజూరు చేసిన ప్రభుత్వం ఫ మొదటి విడతలో 1,753 ఇళ్లు.. వివిధ దశల్లో వాటి నిర్మాణాలు గ్రామాల్లో పూర్తయిన సర్వే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం గ్రామాల్లో సర్వే నిర్వహించింది. ఎల్–1 (ఇంటి స్థలం ఉండి ఇల్లులేని వారు), ఎల్–2 (ఇంటి స్థలం, ఇల్లు లేనివారు), ఎల్–3 (పక్కా ఇల్లు ఉన్నవారు) ఇలా మూడు జాబితాలను తయారు చేసింది. మొదటగా ఎల్–1 జాబితాలో ఉన్నవారికి ఇళ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం మొదటి విడతలో ఆయా గ్రామాలకు 1,753 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 591 ఇళ్ల నిర్మాణానికి మార్క్ చేయగా.. 238 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో, 3 ఇళ్లు రూప్లెవెల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్లకు బెస్మెంట్ బిల్లు కూడా చెల్లించింది. నిర్మాణంలో నిబంధనలు పాటించాలి ఇందిరమ్మ ఇళ్లు నిబంధనల ప్రకారం నిర్మించాలి. ఇప్పటికే రెండో విడతల్లో 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడత ఇళ్ల నిర్మాణం వివిద దశల్లో ఉంది. కొన్ని ఇళ్లకు పేమెంట్లు కూడా చేశాం. మిగిలిన ఇళ్లను ఇందిరమ్మ కమిటీల సిఫారసు మేరకు పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తాం. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించి ప్రభుత్వం నుంచి డబ్బులు పొందాలి. – రాజ్కుమార్, హౌసింగ్ పీడీ -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : ప్రత్యామ్నయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు, ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహ కల్పించాలని సూచించారు. రానున్న వానాకాలం సాగు సంసిద్ధంపై శుక్రవారం కలెక్టరేట్లో శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు పండించే వరి, పత్తి వంటి పంటల వల్ల శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటోందని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లించాలని కంది, కూరగాయలు, పండ్ల తోటలు అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల వైపు వారిని మళ్లించాలన్నారు. ఉద్యాన పంటలు, నూతన వంగడాల సాగుకు సంబంధించి ప్రతి రెండు మండలాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్కు ప్రోత్సాహం కల్పించేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ, డ్రిప్ సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, పద్మారెడ్డి, అంజిరెడ్డి, నవీన్రెడ్డి, శ్రీనివాస్, సత్తిరెడ్డి, శ్రీనివాస్రావు, గోపాల్రెడ్డి, జగన్, రాంరెడ్డి, వీరయ్య, ఎల్లయ్య, డీఏఓ శ్రవణ్కుమార్, ఉద్యాన అధికారి అనంతరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పండ్లతోటల పెంపకానికి ప్రోత్సాహం
నల్లగొండ: పండ్ల తోటలు పెంచాలనుకునే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు సన్న, చిన్నకారు రైతులకు కూడా నూటికి నూరు శాతం సబ్సిడీ అందిస్తోంది. ఐదు ఎకరాలలోపు భూమి ఉండి నీటి వసతి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ. ఈ పథకంలో భాగంగా పది రకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం రైతులకు ఉంది. మొ క్కలు నాటినప్పటి నుంచి ఎదిగేంత వరకు మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఇది పూర్తి స్థాయి సబ్సిడీ. సబ్సిడీ ఇలా.. బత్తాయికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి రూ.15,036 చొప్పున మూడు సంవత్సరాలకు మొత్తం రూ.45,108 చెల్లించనుంది. నిమ్మకు ఎకరాకు సంవత్సరానికి రూ.16,540 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.49,620 చెల్లించనుంది. అదేవిధంగా మామిడికి ఎకరాకు రూ.10,525 చొప్పున మూడేళ్లకు రూ.31,575, తైవాన్ జామ తోటలకు సంవత్సరానికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 8 వేలు, సీతాఫలం తోటలకు సంవత్సరానికి రూ.2005 చొప్పున మూడేళ్లకు రూ.6015, డ్రాగన్ప్రూట్ 0.5 ఎకరానికి సంవత్సరానికి రూ.36 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 8 వేలు, మునగ తోట పెంపకానికి ఎకరాకు సంవత్సరానికి రూ.9016 చొప్పున మూడేళ్లకు రూ.27,048, కొబ్బరి బ్లాక్ ప్లాంటేషన్ ఎకరాకు సంవత్సరానికి రూ.10,525 చొప్పున మూడేళ్లకు రూ.31,575, కొబ్బరి బండ్ ప్లాంటేషన్ ఎకరాకు సంవత్సరానికి రూ.6014 చొప్పున మూడేళ్లకు రూ.18,042 చెల్లించనుంది. ఫ ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు 5 ఎకరాలలోపు ఉన్న వారు అర్హులు ఫ నూరు శాతం సబ్సిడీ అందించనున్న ప్రభుత్వం -
కేశవరావు ఎన్కౌంటర్పై నిరసన
నల్లగొండ : సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావుది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని కోరుతూ గురువారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి కేశవరావును హత్య చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో ఇందూరి సాగర్, పందుల సైదులు, జ్వాల వెంకటేశ్వర్లు, గూడూరు జానకిరామ్రెడ్డి, కోమటిరెడ్డి అనంతరెడ్డి, గద్దపాటి సురేందర్, గోలి సైదులు, అయితగోని జనార్దన్గౌడ్, దుర్గయ్య, బీవీచారి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ లోపం
మూడు రోజులుగా నీలగిరిలో నీటి సరఫరాకు అంతరాయంతాగునీటి ప్రాజెక్టులోనల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో మూడు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు తంటాలు పడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ ప్లాంట్లో నిర్వహణ లోపం కారణంగా తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. పానగల్ మిషన్ భగీరథ ప్లాంట్లో చిన్నపాటి మరమ్మతులు ఏర్పడినా పట్టణ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఇళ్లల్లో బోర్లు లేనివారు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు మిషన్ భగీరథ అధికారులు ఆ సమాచారాన్ని నీలగిరి మున్సిపల్ అధికారులకు ఇవ్వకపోవడంతో నల్లగొండ పట్టణంలో నీటి సమస్య ఏర్పడుతోంది. ఒక్కసారి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే తిరిగి యథాస్థితికి రావాలంటే మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాగా నీలగిరి మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మిషన్ భగీరథ నుంచి వస్తేనే మున్సిపాలిటీకి నీరు.. పానగల్లోని మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి ప్రతిరోజు మున్సిపాలిటీకి 25 ఎంల్డీ వరకు తాగు నీటిని అందిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చోటుచేసుకున్నా తాగు నీటి సరఫరాపై ప్రభావం పడుతుంది. మిషన్ భగీరథ ప్లాంట్కు కనీసం జనరేటర్ సౌకర్యం, ఎలక్ట్రీషియన్ కూడా లేకపోవడంతో చిన్న మరమ్మతు వచ్చినా చూసేవారు లేక నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. ప్లాంట్లోని ప్యానల్ బోర్డులో ఏర్పడిన సమస్య కారణంగా తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వేగంగా స్పందించని కారణంగా నీలగిరి పట్టణంలో మూడు రోజులపాటు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా గురువారం నల్లగొండ పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు అధికారులు తాగునీరు సరఫరా చేశారు. ఫ పానగల్ మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద మరమ్మతు ఫ కనీసం ఎలక్ట్రీషియన్ కూడా లేని వైనం ఫ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు -
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
మిర్యాలగూడ : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద అందజేసే పింఛన్ల పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో చేయూత పథకంపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైనవారు, వివిధ కారణాలతో బయోమెట్రిక్ పడని వారికి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు వారి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు చెల్లించాలన్నారు. చనిపోయినవారు, ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 29 వేల మంది పెన్షన్దారులు శాశ్వతంగా వలస వెళ్లినవారి జాబితాలో ఉన్నారని, గత నెల నుంచి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన, వలస వెళ్లినవారి పేర్లను తొలగించామన్నారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వన మహోత్సవం కింద మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు టాయిలెట్స్ మంజూరు చేశామన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి ప్రభుత్వ సంస్థలో సోక్పిట్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్అమిత్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకుడు గోపాలరావు, ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్రావు, మున్సిపల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం
ఫ పీసీసీ పరిశీలకుడు నసీర్ అహ్మద్ నకిరేకల్ : కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ జిల్లా పరిశీలకుడు నసీర్ అహ్మద్ పార్టీ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నకిరేకల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో గురువారం నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వారం రోజుల్లో పార్టీ గ్రామ, మండల, బ్లాక్ కమిటీల నియామకం పూర్తి కావాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, బత్తుల ఊశయ్య, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, లక్ష్మీనర్సు పాల్గొన్నారు. దివ్యాంగ ఓటర్లను గుర్తించాలిచండూరు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దివ్యాంగ ఓటర్లను గుర్తించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి అన్నారు. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై గురువారం చండూరు మున్సిపల్ కేంద్రంలో అధికారులతో చండూరు ఆర్డీఓ శ్రీదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో చండూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, చండూరు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల డీటీలు, సీడీపీఓ, ఎంఈఓ, రెవెన్యూ సిబ్బంది, వికలాంగ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
కాసులిస్తేనే కేబుల్!
నల్లగొండ : విద్యుత్ శాఖలో అధికారులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబందించి కేబుల్, కండక్టర్ వైర్ల పంపిణీలో మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ముందుగా మంజూరైన రైతులను వదిలేసి.. ఇటీవల మంజూరైన వారికి కేబుల్, కండక్టర్ వైర్లను అప్పగిస్తున్నారు. ముడుపులకు ఆశపడి సీరియల్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే స్టోర్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.2020 నుంచి రెండు వేల ఎస్టిమేట్లు పెండింగ్.. విద్యుత్ శాఖ నుంచి వ్యవసాయ కనెక్షన్ తీసుకున్న రైతులకు కండక్టర్ వైరు (సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు వచ్చేది), కేబుల్వైరు (ట్రాన్స్ఫార్మర్ నుంచి రైతు బావి, బోరు వరకు స్తంభాల మధ్య లాగేది) ఇస్తుంది. రైతులు తమ వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఆ దూరాన్ని బట్టి కేబుల్ వైర్, అవసరాన్ని బట్టి కండక్టర్ వైర్ను విద్యుత్ శాఖ సరఫరా చేయాల్సి ఉంటుంది. 2020 నుంచి దరఖాస్తు చేసుకున్న రైతులకు వారి ఎస్టిమేట్ల ఆధారంగా విద్యుత్ శాఖ మంజూరు చేస్తూ వచ్చింది. 2020 నుంచి 2025 వరకు దాదాపు 2 వేల ఎస్టిమేట్ల వరకు రైతులకు కేబుల్, కండక్టర్ వైరు పెండింగ్లో ఉంది. ఇటీవల ప్రభుత్వం పెద్ద మొత్తంలో కేబుల్, కండక్టర్ వైర్లను విడుదల చేసింది. అయితే మొదట మంజూరైన రైతులకు కాకుండా.. వెనుకాల మంజూరైన రైతులకు వైర్లను ఇస్తూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో కొందరిని తప్పించి.. 2020 జూన్ నెల నుంచి కేబుల్, కండక్టర్ వైర్లు మంజూరైనా పంపిణీ చేయలేదు. ఇటీవల ప్రభుత్వం నుంచి వైర్లు రావడంతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ అధికారులు స్టోర్ పంపిణీ ప్రారంభించారు. మొదట 2023 జూలైలో దరఖాస్తు చేసుకున్న ఒకరికి 250 మీటర్ల వరకు వైర్ ఇచ్చారు. ఆ రైతు కంటే ముందు దాదాపు 250 మంది వరకు రైతులు ఉన్నారు. వారికి ఇవ్వకుండా వెనుకాల మంజూరైన రైతుకు ఇచ్చారు. ఆ తర్వాత మధ్యలో చాలా మందిని వదిలేసి 2024 మార్చిలో మంజూరైన రైతుకు 100 మీటర్లు ఇచ్చారు. ఇలా 2020 నుంచి 2025 మే 2వ వారం వరకు మధ్య చాలా మంది రైతులను వదిలేసి వెనుక మంజూరైన వారికి కేబుల్, కండక్టర్ వైరు ఇచ్చారు. ముడుపులు ఇచ్చిన వారికేనా! ముడుపులు ఇచ్చిన వారికే స్టోర్ నుంచి కేబుల్, కండక్టర్ వైర్ అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన రైతులకు సీరియల్ ప్రకారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో స్టోర్ అధికారుల చేతివాటం ప్రదర్శించారనే విషయం స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల స్టోర్ అధికారుల వ్యవహారం ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి ముందుగా మంజూరైన రైతులకు కేబుల్, కండక్టర్ వైర్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ కేబుల్, కండక్టర్ వైరు పంపిణీలో నిబంధనలు పాటించని విద్యుత్శాఖ ఫ సీరియల్ తప్పించి ఇష్టానుసారంగా అప్పగింత ఫ 2020లో మంజూరైన రైతులను వదిలేసి 2025 వారికి ఇచ్చిన స్టోర్ అధికారులు ఫ ముడుపులు ఇచ్చే వారికే ముట్టజెపుతున్నారని ఆరోపణలు పొరపాటు జరిగితే సరిచేస్తాం కేబుల్, కండక్టర్ వైర్ల బాధ్యత డీఈ, ఏఈలకు అప్పగించా. జిల్లాలో 38 విద్యుత్ సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్కు 3 కిలో మీటర్ల చొప్పన అందరికీ సీనియార్టి ప్రకారం ఇవ్వాలని చెప్పాం. డీఈలు, ఏఈలు చెప్పిన విధంగా మెటీరియల్ ఇవ్వాలని సూచించారు. ముందు మంజూరైన రైతులకు కాకుండా వెనుక మంజూరైన రైతులకు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి ముందు మంజూరైన రైతులకు వైరు ఇస్తాం. – ఎస్ఈ వెంకటేశ్వరు -
వైటీపీఎస్ చీఫ్ ఇంజనీర్గా రమేష్బాబు
మిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో గల యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (వైటీపీఎస్) చీఫ్ ఇంజనీర్గా వి.రమేష్బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ రమేష్బాబు మాట్లాడుతూ వైటీపీఎస్లో నీటి సదుపాయం కల్పిస్తామని, వీరప్పగూడెం నుంచి వీర్లపాలెం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, కార్మికులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుతామని, రెండవ అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రామ్మోహన్రావు, శ్రీనివాస్రావు, విజయేందర్రావు తదితరులు ఉన్నారు. మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలునకిరేకల్ : నర్సరీలో మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి కోరారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామలోని గ్రామపంచాయతీ నర్సరీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ నిర్వహణ, వన మహోత్సవ యాక్షన్ ప్లాన్ వివరాలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ రమణయ్య తదితరులు ఉన్నారు. రెండో దశ మిషన్ ఇంద్రధనస్సు ప్రారంభంకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రెండో దశ మిషన్ ఇంధ్రదనస్సు కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం మే 21 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్కర్ల ద్వారా గర్భిణులకు, పదేళ్లలోపు వయస్సున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి కల్యాణ్ చక్రవర్తి, కేశ రవి, ప్రోగ్రాం అధికారులు ఎస్.పద్మ, కృష్ణకుమారి, డీపీఓ విష్ణు, డీవీఎల్ఎం జి.రాము, ఉదయ్, వైద్యాధికారి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. క్రికెట్లో రాణించాలినల్లగొండ టూటౌన్ : క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సయ్యద్ అమీనొద్దీన్ కోరారు. నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఔట్డోర్ స్టేడియంలో ఇంట్రా ఉమ్మడి జిల్లా లీగ్ మ్యాచ్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు లీగ్ మ్యాచ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ఆధారంగానే త్వరలో హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్ జిల్లా టోర్నమెంట్కు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సయ్యద్ సఫియొద్దీన్, సతీష్, విశ్వనాథ్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలి
కొండమల్లేపల్లి : ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు రశీదు తీసుకోవాలని, డీలర్లు విత్తనాలను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని, రైతులు ఎరువులు కొనుగోలు చేసేసమయంలో విధిగా ఆధార్కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎరువులు విక్రయించే డీలర్లు ఈ–పాస్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. అంతకుముందు పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఓ వై.జానకిరాములు, ఏఈఓ, డీలర్లు తదితరలు ఉన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు 11376 మంది సాధారణ విద్యార్థులు, 1578 మంది ఒకేషనల్.. మొత్తం 12,954 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫ హాజరుకానున్న 12954 మంది విద్యార్థులు -
అంతటా వర్షం.. ఉపశమనం
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఇప్పటివరకు వేసవి కాలం ఎండలతో అల్లాడిన ప్రజలు వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచే అకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం వేళ జిల్లా అంతటా మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరి సాగర్ మండంలో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత నకిరేకల్లో 60 మిల్లీమీటర్లు, పులిచెర్లలో 57.8, ఐటిపాములలో 47.5, అంగడిపేట, 38.8, కేతేపల్లి 37,8, నార్కట్పల్లి 37, హాలియా 32.5, కనగల్ 31.8, ఇబ్రహీంపేట, 30.8, రేగులగడ్డ, తుమ్మడం 26,8 ఉరుమడ్ల 24, పజ్జూరు 20.3, నెమ్మాని 19, నిడమనూర్ 18.5, గూడపూరు 17, తిమ్మాపూర్ 15,8, వెలుగుపలి కట్టంగూర్, నల్లగొండ, దామరచర్ల, గుర్రంపోడ్ ప్రాంతాల్లో 15 మిల్లీ మీటర్ల నుంచి 3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలగిరిలో నిలిచిన రాకపోకలు వర్షం కారణంగా తిరుమలగిరి మండల కేంద్రం సమీపంలోని రాజవరం రోడ్డుపై ఉన్న బంధం పైనుంచి భారీగా వరద ప్రవహించింది. సుమారు మూడు గంటలకుపైగా అక్కడి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో వర్షం నీరు చేరడంతో చెరువులను తలపించాయి. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటుకు నల్లగొండ మండలం అప్పాజిపేటలో మహిళా రైతు మృతిచెందింది. పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో రెండు ఆవులు, కట్టంగూర్ మండలంలో కురుమర్తిలో రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. తిరుమలగిరి సాగర్లో అత్యధికంగా 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చల్లబడ్డ వాతావరణం అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లడింది. ఈ వేసవిలో చాలా రోజులు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదయ్యాయి. దీంతో జనం వేడిమితో అల్లాడారు. బుధవారం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. గరిష్ట ఉష్ణోగ్రత కూడా 36 డిగ్రీలకు పడిపోయింది. -
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
నల్లగొండ : స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని సెట్విన్ శిక్షణ సంస్థ నల్లగొండ కో ఆర్డినేటర్ ఎం.సరిత అన్నారు. నలగొండ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చిన మొదటి బ్యాచ్కు బుధవారం పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ కోర్సులు, కంప్యూటర్ బేసిక్స్, డీటీపీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, డిప్లమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్టైల్స్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇచ్చామన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
కనగల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి.. వర్షాకాలంలోపు గృహ ప్రవేశాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తేలకంటిగూడెంలో 107 ఇళ్లను మంజూరు చేశామని.. ఇందులో 71 ఇళ్లు గ్రౌండింగ్ కాగా, ప్రస్తుతం 48 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో, రెండు రూఫ్ స్థాయిలో ఉన్నాయన్నారు. 44 ఇండ్లకు బేస్మెంట్ బిల్లులు చెల్లించామన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు.. కలెక్టర్తో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి గుడిసెల్లో జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడమే కాకుండా, ఇంత త్వరగా ఇండ్లు కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి, కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్, మాజీ సర్పంచ్ బోగారి రాంబాబు తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
నాగార్జునసాగర్ : సాగర్ హిల్కాలనీలో నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారి వెంట ఉన్న మహాత్మాజ్యోతీబాపూలే బీసీ గురుకుల విద్యాలయం ఎదుట ఫుట్ ఓవర్బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం స్థల పరిశీలన చేశారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల, హాస్టల్ ఉండడంతో రోజూ మూడుసార్లు 1200 మంది విద్యార్థులు కష్టంగా రోడ్డు దాటుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. డిగ్రీ కళాశాలను మార్చాలని వినతి బీసీ గురుకుల విద్యాలయం ఆవరణలో ఉన్న డిగ్రీ కళాశాలను ఇక్కడి నుంచి మార్చాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే ప్రత్యామ్నాయంగా మరో బిల్డింగ్ ఎక్కడ ఉందని ఆడగగా.. సాగర్ ఎర్త్డ్యాం దిగువన పాత బీఈడీ కళాశాల భవనం ఉందని చెప్పడంతో.. వర్షంలోనే కలెక్టర్ అక్కడికి వెళ్లి బిల్డింగ్ను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అధికారులకు రక్షణ కరువు
రామన్నపేట : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ అధికారులకు రక్షణ కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఇరిగేషన్ అధికారులపై దాడి జరిగితే బాధ్యత గల అధికార పార్టీ నాయకులే కేసు లేకుండా చేశారని ఆరోపించారు. గవర్నర్ అధికార నివాసంలో చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు, గన్నీ బ్యాగుల సరఫరాలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో హడావిడి చేసి పేదల ఇళ్లను కూల్చారని, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధించడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఉమారమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్గౌడ్, సాల్వేరు అశోక్, అంతటి రమేష్, ఎస్కే చాంద్, బత్తుల వెంకటేశం, గర్దాసు విక్రం, మిర్యాల మల్లేశం, జాడ సంతోష్, ఆమేర్, బొడ్డు అల్లయ్య, కూనూరు శ్రీనివాస్, బాలగోని శివ, జాల అమరేందర్రెడ్డి ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే శిక్షణ పొందాం
2009లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు అందరం అప్పట్లో శిక్షణను పూర్తి చేశాం. ప్రస్తుతం మేమంతా ప్రాథమిక చికిత్సనే అందిస్తున్నాం తప్ప ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయడం లేదు. మాపై మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – పొనుగోటి హనుమంతరావు, సుశృత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
మాతృదేవోభవ.. పితృదేవోభవ
మోత్కూరు : మాతృదేవోభవ–పితృదేవోభవ అనే స్వచ్ఛంద సంస్థ విస్త్రృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతోంది. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన కురుమేటి నవీన్ ఏర్పాటు చేసిన మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ ద్వారా గ్రామీణ నిరుపేద, వృద్ధులు, అనాథలు, విద్యార్థులకు ఐదు సంవత్సరాలకు పైగా వివిధ రకాల సేవలను అందిస్తోంది. నవీన్కు 6 సంవత్సరాల వయస్సులోనే తండ్రి నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి నర్సమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ ఇద్దరు కుమారులు, నవీన్, నరేందర్ను చదివించింది. నవీన్ 8వ తరగతి చదువుతుండగానే తల్లి నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అమ్మమ్మ, నానమ్మ, బాబాయి గోవర్ధన్ల పర్యవేక్షణలో పెరుగుతూ నవీన్ 10వ తరగతి పూర్తి చేశాడు. మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదవలేక జనరల్ నర్సింగ్ మెడిసిన్ (జీఎన్ఎం) కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ మరోవైపు సామాజిక సేవ చేస్తున్నాడు. మే 2019లో మాతృదేవోభవ–పితృదేవోభవ స్వచ్ఛంద సేవా సంస్థను నవీన్ ఏర్పాటు చేశాడు. నవీన్ అధ్యక్షుడిగా, తమ్ముడు నరేందర్ ఉపాధ్యక్షుడిగా, బాబాయి కురుమేటి గోవర్ధన్ సహకారంతో సేవలు అందిస్తున్నాడు. గ్రామంలోని పెద్ద మనుషులు, దాతలు, విద్యావంతులు సూరారం యాదయ్య, చిరుమర్తి యాదయ్య, కురుమేటి యాదయ్యల సహకారంతో పేదలకు సేవ చేస్తున్నాడు. వృద్ధులకు కంటి వైద్య శిబిరాలు..మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో ఆదరణకు నోచుకోని వృద్ధులు, వితంతువులకు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో బియ్యం, నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. మోత్కూరు, గుండాల మండల కేంద్రాల్లో హైదరాబాద్కు చెందిన మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి సహకారంతో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు అందజేశారు. కరోనా సమయంలో పాటిమట్ల గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించి దాతల ద్వారా రక్తాన్ని సేకరించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, దుస్తులు పంపిణీ చేశారు. రామన్నపేట మండలం కక్కిరేణిగూడెంలో హైదరాబాద్ బీఎన్.రెడ్డి నగర్కు చెందిన సుశీల ‘కంటి ఆస్పత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 30 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్వగ్రామం పాటిమట్లలో తన ఇంటినే గ్రంథాలయంగా ఏర్పాటు చేసి 30 మంది పిల్లలకు చదువు చెబుతున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్సు సర్వీస్ ఏర్పాటు చేసి సుమారు 100 మందికి పైగా సహాయం చేశారు. 2024లో విజయవాడలో వచ్చిన అకాల వర్షాలు, వరద బాధితులకు తన స్నేహితులతో కలిసి 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖమ్మంలో అకాల వర్షాలకు నివాసాన్ని కోల్పోయిన సుమారు 500 మంది బాధితులకు భోజన ప్యాకెట్లను అందజేశారు. నేడు రక్తదానంపై అవగాహన పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృదేవోభవ – పితృదేవోభవ 6వ వార్షికో త్సవం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ హాజరవుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నవీన్ తెలిపారు. ● వృద్ధులు, నిరుపేదలు, అనాథలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ ● నేడు పాటిమట్లలో 6వ వార్షికోత్సవం -
ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నిఖిల్రెడ్డికి 11వ ర్యాంకు
మిర్యాలగూడ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ నిఖిల్రెడ్డి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించాడు. నిఖిల్రెడ్డి మిర్యాలగూడ పట్టణానికి చెందిన చాడ శ్రీనివాస్రెడ్డి– సునంద దంపతుల కుమారుడు. నిఖిల్రెడ్డి తల్లి సునంద పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తుండగా, తండ్రి చాడ శ్రీనివాస్రెడ్డి వేములపల్లి మండల ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్నారు. నిఖిల్రెడ్డి ప్రాథమిక విద్యను మిర్యాలగూడలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్మీడియట్ విజయవాడ సమీపంలో గూడవలిల్లో చదివారు. ఐఐటీలో 91వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటీలో సీటు సాధించాడు. 2019–20లో ఆడోబ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశారు. యూపీఎస్పీ పరీక్షలకు ఐదుసార్లు హాజరై ఐదవసారి ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఎంపికై న చాడ నిఖిల్రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. -
పీఏసీఎస్లలో బదిలీల ప్రక్రియ
నల్లగొండ టౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని 107 సహకార సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న సీఈఓల బదిలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు 44 జీఓను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు మించి ఒకేచోట పనిచేస్తున్న సీఈఓలను బదిలీ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పలువురు సీఈఓలు దీర్ఘకాలికంగా సంఘాల్లో విధులు నిర్వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సంఘాలను ఆర్థికంగా దివాళా తీయిస్తున్నారనే అపవాదు ఉంది. ప్రస్తుత చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే దీర్ఘకాలికంగా సంఘాల్లో ఉద్యోగాలు చేస్తున్న సీఈఓలను బదిలీ చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్ర సహకార వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుపై ఒత్తిడి తెచ్చి బదిలీల ప్రక్రియకు ఉత్తర్వులను జారీ చేయించారు. త్వరలో జిల్లాస్థాయి ఎన్పవర్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సంఘాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓలను బదిలీ చేయనున్నారు. ఫ సొసైటీల సీఈఓలకు త్వరలో స్థానచలనం పారదర్శకంగా బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 44 ప్రకారం జిల్లా ఎన్పవర్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో సంఘాల సీఈఓల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తాం. సీఈఓలు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తుండటం వల్ల సంఘాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. బదిలీల వల్ల సంఘాలు బలోపేతమయ్యే అవకాశం ఉంది. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
నృసింహుడి సేవలో హిమాన్షు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హిమాన్షుకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కాగా హిమాన్షుకు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్వాగతం ఫలికారు. -
మూడేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం
కనగల్ : మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం కనగల్ మండలం జి.యడవల్లిలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న చెరువు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రూ.4000 కోట్లతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టామని.. అటువైపు నుంచి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. పనులను తిరిగి ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. జి.యడవల్లి గ్రామంలో రూ.4 కోట్ల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. రూ.5 కోట్లతో బీబీ రోడ్లు, రూ.30 లక్షలతో డ్రెయినేజీ మంజూరు చేశామన్నారు. కనగల్ పీహెచ్సీలో గ్లూకోమా కంటి పరీక్షల కోసం అధునాతన యంత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయసముద్రం, బ్రాహ్మణ వెల్లెంల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జి.యడవల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృథా అవుతతోందని తెలుసుకుని మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్లగొండ ఆర్డిఓ వై.అశోక్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు
రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు తెచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జిల్లా కన్వీనర్ మహ్మద్ అబ్దుల్ బషీర్ రషాది వ ఖాస్మి అన్నారు. మంగళవారం నల్లగొండలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శించారు. సవరణ బిల్లులో పేర్కొన్న అంశాలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. ఈ బహిరంగ సభకు ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మౌలానా ఇలాలుద్దీన్, ఎండీ.నిజాముద్దీన్, నోమన్, ఎండీ.షఫినవాజ్ఖాన్, ఎండీ.సజ్జత్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలిమునుగోడు : ప్రతి గ్రామంలోని నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యం మేరకు మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధం చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. మంగళవారం మునుగోడు మండలం జమస్థాన్పల్లి గ్రామంలోని నర్సరీ వద్ద మండల ఉపాధిహామీ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులకు హరితహారంపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్కా పెరిగి పెద్దయ్యేలా చొరవ చూపాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఇంకుడు గుంతలు తవ్వించాలని సూచించారు. వేలిముద్రలు రాని వృద్ధులు, వికలాంగుల పింఛన్ను కార్యదర్శుల వేలిముద్రలతో డ్రా చేసి ఇవ్వాలని.. అందుకు అది ఎంపీడీఓ అనుమతి తీసుకొవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, పంచాయితీ అధికారి స్వరూపరాణి, ఏపీఓ నాగరాజు, టెక్నకల్ అసిటెంట్లు, పీల్డ్ అసిటెంట్లు ఉన్నారు. ఇంకుడుగుంతలు తీయాలిపెద్దఅడిశర్లపల్లి : గ్రామాల్లో వ్యక్తిగత, సామాజిక ఇంకుడు గుంతలు తీసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పెద్దఅడిశర్లపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవాలి త్రిపురారం : భూగర్భ జాలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కంపాసాగర్ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త శివప్రసాద్ అన్నారు. రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద రైతులకు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త సంధ్యారాణి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ అంబటి రాము, యువ రైతు నాయిని సంతోష్ కుమార్, పుట్టల సైదులు, సంపత్, నగేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
సౌరశక్తి వినియోగంతో ఆర్థికాభివృద్ధి
కట్టంగూర్ : సౌరశక్తి వినియోగంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ఆర్థికసాయంతో స్వబాగ్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ప్యానల్తో విద్యుత్ను స్టోరేజీ చేసి ఆదాయం సంపాదించేందుకు దేశంలోనే మొదటిసారిగా అయిటిపాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వశక్తితో మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ద్వారా 50 మంది స్వయం సహాయక మహిళలకు రూ.50 లక్షలు ఇచ్చామని తెలిపారు. త్వరలో ఈ 50 మంది మహిళలకు బ్యాంకు ద్వారా మూడు లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలు అందజేతరాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున జూన్ 2న అందించనున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో అయిటిపాముల మాదిరిగానే నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. అయిటిపాములలో 100 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఒక్కొక్కరికి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం మహిళలకు రూ.10 లక్షల చెక్కు, స్వచ్ఛ శక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మహిళలు సోలార్ ప్యానెల్ను సద్వినియోగం చేసుకుని ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా మహిళలకు నెలకు రూ.2 వేలు ఆదాయం లభిస్తుందని తెలిపారు. మంత్రి చొరవతో రూ.100 కోట్లతో అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించామని, పైపులైను పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యుత్ యూనిట్లకు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్వబాగ్ ల్యాబ్స్ యజమాన్యాన్ని కోరారు. మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందేలాకలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళలు ఇంటి నుంచే ఆదాయం పొందేలా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేశామన్నారు. సోలార్ విద్యుత్ బ్యాటరీ జీవిత కాలం 10 సంవత్సరాలు పనిచేస్తుందన్నారు. 50 మందితోపాటు గ్రామంలోని మిగతా మహిళలను బ్యాటరీ ఏర్పాటులో భాగస్వాములను చేస్తామన్నారు. స్వలాబ్ ల్యాబ్స్ సీఈఓ సుధాకర్ మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 50 మంది మహిళలకు రూ.50 లక్షలు అందించి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే మొదటిదని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్కు బదులుగా ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చన్నారు. తామే బ్యాటరీలను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ మాట్లాడుతూ సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్కు ప్రభుత్వం యూనిట్కు రూ.3 నుంచి 3.50 రూపాయలు ఇస్తుండగా, స్వబాగ్ ల్యాబ్స్ వారు యూనిట్కు రూ.16.50 చెల్లిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, ఇన్చార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, ఎఫ్పీఓ చైర్మన్ సైదమ్మ, ఏపీఓ రాంమోహన్ ఉన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డినెలకు రూ.2వేల ఆదాయం వస్తోందిప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్తో నెలకు రూ.2 వేల ఆదాయం వస్తోంది. ఇప్పటికే రెండు నెలల డబ్బులు నా ఖాతాతో జమ అయ్యాయి. సోలార్ ప్లేట్ల క్లీనింగ్ తప్ప ఎలాంటి రిస్క్ లేదు. ప్రతి నెల రూ.2 రావడంతో ఇంట్లో చిల్లర ఖర్చులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. – పసునూరి విజయలక్ష్మి, అయిటిపాముల -
వానాకాలం సాగుకు సన్నద్ధం
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్మకాలను పూర్తి చేసుకున్న అన్నదాతలు, చెలకల్లో పత్తి కట్టెలను తొలగించిన రైతులు దుక్కులు దున్నుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నెల 27 వరకు నైరుతి రుతుపననాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. ఈ నెల 25న రోహిణి కార్తే, జూన్ 5వ తేదీ నుంచి మృగశిర కార్తే ఆరంభమై వర్షాలు కురవగానే వరినార్లు పోసుకోవడంతో పాటుగా పత్తి విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుబాటులో విత్తనాలు వానాకాలం సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలు 3,120 క్వింటాళ్లను అందుబాటులో ఉంచింది. జిల్లాలో 33 మండలాల్లోని ప్రాథమిక సహకార సంఘాలు, అగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు ఉన్నాయి. వీటిని రైతులకు 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. దీంతో పాటు వరి, పత్తి విత్తనాలు కూడా ప్రైవేటు విత్తన దుకాణాదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం సీజన్కు 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 1,44,802 మెట్రిక్ టన్నుల యూరియా, 61,343 మెట్రిక్ టన్నుల డీఏపీ, 33,758 ఎంఓపీ, 1,14,043 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 12,923 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరంగా గుర్తించారు. ఇప్పటికే సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.దుక్కులను దున్నుతున్న రైతులు ఫ దుక్కులు దున్నుతున్న రైతులు ఫ 11.60 లక్షల ఎకరాల్లో సాగు కానున్న పంటలు ఫ అందుబాటులో జనుము, జీలుగ, వరి, పత్తి విత్తనాలు ఫ 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా ఫ జూన్ మొదటి వారంలో వరినారు పోసుకునే అవకాశంవానాకాలం సాగు అంచనా ఇలా.. (ఎకరాల్లో) పత్తి 5,47,735 వరి 5,25,350 కంది 10,000సజ్జ 200 జొన్న 500 మొక్కజొన్న 500ఆముదం 500 పెసర 1200 వేరుశనగ 1500 ఇతర పంటలు 72,904 మొత్తం 11,60,389 ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశాం వానాకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు అంచనాలకు తగ్గట్లుగా సిద్ధం చేస్తున్నాం. నకిలీ విత్తనాల అమ్మకంపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశాం. రైతులు విధిగా నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి రశీదును తీసుకోవాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ -
గోవులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత
చింతపల్లి: కొండమల్లేపల్లి వైపు నుంచి హైదరాబాద్కు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 9 ఆవు దూడలను పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాల్లో 9 ఆవు దూడలను కబేళాలకు తరలిస్తుండగా వాటికి ఎలాంటి అనుమతి లేదని గుర్తించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్కు చెందిన నోముల భాగ్యయ్య గౌడ్ ఎండీ.సాజిద్పాషాను పట్టుకున్నారు. ఆవు దూడలకు వెటర్నరీ డాక్టర్ వద్ద పరీక్షలు నిర్వహించి, గురునానక్ గోశాల వెల్దండకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
వారసత్వ భూమి ఇప్పించండి..
స్వాతంత్య్ర సమరయోధుడైన నా తండ్రి గోపయ్య నుంచి నాకు రావాల్సిన భూమిని నా తమ్ముడు.. అతని భార్య పేరున పట్టా చేయించుకున్నాడు. దాన్ని రద్దు చేసి నాకు న్యాయం చేయాలంటూ కొంపల్లి వెంకటేశం విన్నవించారు. ఈ సమస్యపై పది సంవత్సరాల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నాకు పుట్టుకతోనే పోలియో. నడవలేని పరిస్థితి. అప్పట్లో అటెండర్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాను. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలోని సర్వే నంబర్ 504లో అప్పటి ప్రభుత్వం నా తండ్రికి భూమి ఇచ్చింది. అది వారసత్వంగా కుమారులుగా సమానంగా రావాలి. కానీ నాకు రావాల్సిన ఎకరం భూమి నా చిన్న తమ్ముడు సత్యనారాయణ అతని భార్య పేరున పట్టా చేసుకున్నాడు. అది రద్దు చేసి నాకు రావాల్సిన ఎకరం భూమిని ఇప్పించాలని కోరాడు. – కొంపల్లి వెంకటేశం, తాటికల్, నకిరేకల్ మండలం -
హైస్పీడ్ రైల్వే లైన్లు!
సూర్యాపేట మీదుగా శంషాబాద్ – విశాఖపట్నం హైస్పీడ్ కారిడార్కు కేంద్రం ఓకేఫ ఫైనల్ లొకేషన్ సర్వేకు నిధులు ఫ డోర్నకల్ – గద్వాల కొత్త లైన్కు గ్రీన్ సిగ్నల్ ఫ కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు కేటాయింపు ఫ రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన ఫ నిధుల కేటాయింపు వివరాలను పింక్ బుక్లో వెల్లడించిన రైల్వే శాఖ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సూర్యాపేట జిల్లా కేంద్రం మీదుగా రెండు రైల్వే లైన్లు రానున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్ కింద శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర రైల్వే శాఖ ఓకే చెప్పింది. అలాగే సూర్యాపేట, నల్లగొండ మీదుగా డోర్నకల్ – గద్వాల లైన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే పనులకు నిధులను కేటాయించింది. రైల్వే బడ్జెట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులు, ఎఫ్ఎల్ఎస్లకు కేటాయించిన నిధుల వివరాలతో కూడిన పింక్ బుక్ను ఇటీవల విడుదల చేసింది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులకు నిధులు ఇలా.. ● మాచర్ల నుంచి నల్లగొండ వరకు 92 కిలోమీటర్లు పొడవునా రూ.458.26 కోట్లతో కొత్త రైల్వే లైన్కు ఓకే చెప్పింది. దానికి సంబంధించిన సేఫ్టీ పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించింది. ● రూ.77.80 కోట్లతో విష్ణుపురం నుంచి జాన్పహాడ్ వరకు 11 కిలోమీటర్ల పొడవునా కొత్తలైన్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీనికి సేఫ్టీ ఫండ్స్ కింద రూ.5 కోట్లు కేటాయించింది. ● జగ్గయ్యపేట నుంచి మేళ్లచెరువు వరకు 19.1 కిలోమీటరు పొడవునా కొత్త లైన్కు ఓకే చెప్పింది. దాంతోపాటు మేళ్లచెరువు–జాన్పహాడ్ లైన్ 24 కిలోమీటర్ల పొడవునా ఆధునుకీకరణ పనులకు రూ.513.20 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి బీబీనగర్ వరకు 14.25 కిలోమీటర్ల పొడవునా 3, 4 లైన్ల డబ్లింగ్ చేసేందుకు ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ఇందుకు రూ.29 లక్షలు కేటాయించింది. ● భువనగిరి– బీబీనగర్ మధ్య 15 కిలోమీటర్ల పొడవునా 3వ లైన్ డబ్లింగ్కు ఎఫ్ఎల్ఎస్కు రూ.30 కోట్లు కేటాయించింది. ● ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ –2 విస్తరణకు ఓకే చెప్పింది. దీనికి వివిధ పద్దుల కింద రూ. 110 కోట్లు కేటాయించింది. ● అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రిలో ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను కేటాయించింది. అలాగే యాదాద్రిలో 4 కిలోమీటర్ల పొడవునా బైపాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. ● గుంటూరు– బీబీనగర్ మధ్య డబ్లింగ్కు సంబంధించిన ఎఫ్ఎల్ఎస్కు రూ.3.10 కోట్లు, బీబీనగర్–భువనగిరి మధ్య డబ్లింగ్ కోసం ఎఫ్ఎల్ఎస్కు రూ.30 లక్షలు కేటాయించింది. ● గుంటూరు – బీబీనగర్ మధ్య రూ.2,853 కోట్లతో చేపట్టే డబ్లింగ్కు, రూ.110.89 కోట్లతో విష్ణుపురం వద్ద బైపాస్ లైన్ నిర్మాణానికి ఓకే చెప్పింది. ● మోతుమర్రి– విష్ణుపురం మధ్య డబ్లింగ్కు నిధులను కేటాయిచింది. ● రూ.3.32 కోట్లతో మిర్యాలగూడ గూడ్స్ షెడ్ను అభివృద్ధి చేయనుంది.ఏళ్ల నాటి కల.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు కొత్త రైల్వే లైన్లను ప్రతిపాదించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే, విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా శంషాబాద్ వరకు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్కు హైస్పీడ్ రైల్వే కారిడార్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను చేపట్టింది. ఆ సర్వే గతేడాది చివరలో పూర్తి కావడంతో దానిని ఈ ఏడాది బడ్జెట్లో పొందుపరిచింది. తాజాగా ఆ కొత్తలైన్ ఎఫ్ఎల్ఎస్కు కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది కార్యరూపం దాల్చితే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 296 కిలోమీటర్ల పొడవున సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు డోర్నకల్ – గద్వాల కొత్త రైల్వే లైన్ ఎఫ్ఎల్ఎస్కు ఓకే చెప్పింది. దానికి రూ.7.40 కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడనుంది. -
సుందరయ్య ఆశయాలను సాధించాలి
మిర్యాలగూడ : పేదల కోసం నిరంతరం పోరాడిన పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఈదులగూడెం వద్ద సుందరయ్య విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సుందరయ్య ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పేదల కోసం ఉద్యమించారని, పీడిత ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పార్లమెంట్ ప్రతిపక్ష సభ్యుడిగా ఉండి సైకిల్పై పార్లమెంట్కు వెళ్లి ప్రజా సమస్యలను ప్రస్తావించి అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి సీపీఎం కార్యాలయంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జ్యోతి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మువ్వా రామారావు, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్ఛంద్ర, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, రెమిడాల పరుశురాములు, వరలక్ష్మీ, సీతారాములు, వినోద్నాయక్, పాదూరి శశిధర్రెడ్డి, అయూబ్, అంజాద్, దేశీరాంనాయక్, వెంకట్రెడ్డి, బాబునాయక్, శ్రీనివాస్, జగన్నాయక్, కోడిరెక్క మల్లయ్య, దేవయ్య పాల్గొన్నారు. -
ఇద్దరు డీఎస్పీలు బదిలీ
నల్లగొండ : జిల్లాలో ఇద్దరు డీఎస్పీలు బదిలీ అయ్యారు. బాగంగా నల్లగొండ డీసీఆర్బీలో పనిచేస్తున్న డీఎస్పీ బి.సైదాను హుజూ రాబాద్కు బదిలీ చేశారు. నల్లగొండలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీ రవికిరణ్రెడ్డిని కూకట్పల్లి ఏసీపీగా బదిలీ చేశారు. అయితే సైబరాబాద్లో డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఎస్బీ డీఎస్పీగా నల్లగొండకు బదిలీ చేశారు. ‘రాజీవ్ యువ వికాసం’లో జిల్లాను ముందుంచాలినల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకం అమలులో నల్లగొండ జిల్లాను మంచి స్థానంలో ఉంచేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాజీవ్ యువ వికాస పథకంపై సోమవారం కలెక్టరేట్లో జిల్లా బ్యాంకు కో–ఆర్డినేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద వచ్చిన 73,464 దరఖాస్తుల్లో బ్యాంకులకు పంపించిన 73,200 దరఖాస్తులను సిబిల్ అర్హతను పరిశీలించి సంబంధిత ఎంపీడీఓలకు వెంటనే ఇవ్వాలన్నారు. ఎంపీడీఓలు వారి స్థాయిలో అన్ని అర్హతలు పరిశీలించి ఈనెల 25 లోగా జాబితాను తయారు చేయాలని సూచించారు. సిబిల్ అర్హత పరిశీలనలో బ్యాంకర్లు జాప్యం చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి తీసుకెళతామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రామిక్ మాట్లాడుతూ బ్యాంకర్లు 11 వేల దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి తిరిగి ఎంపీడీఓఓలకు అందజేశారని, 6500 దరఖాస్తులను అప్డేట్ చేశారని తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శేఖర్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నసీరుద్దీన్, మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్రెడ్డి, బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కమిటీ నియామకంనల్లగొండ టౌన్ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీని సోమవారం నియమించారు. అధ్యక్షుడిగా ఎస్కే.మొదీన్పాష, ప్రధాన కార్యదర్శిగా రావిరాల జగన్, మహిళా అధ్యక్షురాలిగా కె.రమణ, ఉపాధ్యక్షులిగా రోజా పుష్పతో పాటు కార్యవర్గ సభ్యులను నియమించి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుండ జనార్దన్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎండీ.షేక్పాష, జిల్లా కరుణాకర్, మామిడి శంకర్, చంద్రమోహన్, మాచర్ల స్వామి, శంకరయ్య, అంజయ్య, క్రిష్ణయ్య, వెకటమ్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటాంరామగిరి(నల్లగొండ) : అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందని ఆ సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తమరావు అన్నారు. సోమవారం నల్లగొండ న్యాయ సేవధికార సంస్థ కార్యాలయంలో జరిగిన అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు భద్రత, వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తే యాజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హక్కులకు భంగం కలిగిస్తే న్యాయ స్థానాల ద్వారా కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో లేబర్ అధికారి రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నిమ్మల భీమార్జున్రెడ్డి, కార్మిక నాయకులు ఆచారి, రవి, మదార్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శిక్షణకు హాజరవ్వాలినల్లగొండ : ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి నిర్వహించే వృత్యంతర శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణన కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని శిక్షణ కేంద్రం ఇన్చార్జి, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. -
అమ్మా.. మా గోడు పట్టించుకోండి
నల్లగొండ : వివిధ సమస్యలపై కలెక్టరేట్కు వచ్చిన బాధితులు మా గోడు పట్టించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నవించారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 97 దరఖాస్తులు రాగా వాటిలో రెవెన్యూ సంబంధించినవి 53, ఇతర సమస్యలకు సంబంధించినవి 44 ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిస్థితిని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమిత్నారాయణ్, రాజ్కుమార్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఆర్ఓ అశోక్రెడ్డి ఉన్నారు. ఫ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఎదుట బాధితుల వేడుకోలు ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బహుళ అంతస్తులు భద్రమేనా!
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలను తనిఖీ చేసి నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నేను ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్నా.. ఎల్ఆర్ఎస్ పనితో పట్టణంలో తనిఖీలు చేయలేదు. సిబ్బంది కూడా కొత్తగా వచ్చిన వారే ఉన్నారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు. – కృష్ణవేణి, మున్సిపల్ ఏసీపీ● చుట్టూ ఖాళీ స్థలం లేకుండా అంతస్తు మీద అంతస్తు ● భద్రతా ప్రమాణాలు పాటించని భవన యజమానులు ● ప్రమాదం జరిగితే ఇక పరిస్థితి ఏంటని పలువురి ప్రశ్న నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, పైవ్రేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భారీ బహుళ అంతస్తుల భవనాల చుట్టూ కనీసం గజం కూడా ఖాళీ స్థలం వదిలేయకుండా నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు, మరణాలతో మన నల్లగొండ పట్టణంలోని బహుళ అంతస్తుల భవనాలు అన్ని భద్రమేనా అనే చర్చ వస్తోంది. కొందరు ఒకసారి రెండంతస్తులు నిర్మించి కాలక్రమేనా దానిపైనే మరో మూడు, నాలుగు అంతస్తుల స్లాబ్ వేశారు. సెల్లార్తో కలిపి ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న భవన యాజమానులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే ఐదారు అంతస్తుల భవనాలు నిర్మించడం వల్ల అనుకోకుండా షార్ట్ సర్కూట్ ప్రమాదాలు, సిలిండర్ల ద్వారా జరిగే ప్రమాదాలు, పరుపుల ద్వారా అంటుకునే మంటలు తదితర ఉపద్రవాలను నివారించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ కనీసం 50 శాతం కూడా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనేది బహిరంగ రహస్యమే. ఖాళీ స్థలం లేకుండా నిర్మాణాలు.. భవనాల నిర్మాణానికి సంబంధించి.. 30 ఫీట్ల రోడ్డులో 500 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవన నిర్మాణం చేపడితే ముందు భాగంలో మూడు మీటర్లు, చుట్టూ రెండు మీటర్లు ఖాళీ స్థలం తప్పకుండా వదలాలి. అదే విధంగా వంద ఫీట్ల రోడ్ అయితే ముందు భాగంలో నాలుగున్నార ఫీట్లు, చుట్టూ మూడు ఫీట్లు ఖాళీ స్థలం వదలాల్సి ఉంటుంది. కానీ.. ఈ నిబంధన నీలగిరి పట్టణంలో ఎక్కడా పాటించినట్లు కనిపిండం లేదు. పట్టణంలో డాక్టర్స్ కాలనీ, బొట్టుగూడ, ప్రకాశం బజార్, డీవీకే రోడ్, హైదరాబాద్ రోడ్ లాంటి ప్రాంతాల్లో భారీ భవనాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల భవనాలు 70కి పైగా, షాపింగ్ మాల్స్ మరో 100కు పైగా, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో అయితే రోగులు, వారి సహాయకులు, షాపింగ్ మాల్స్ అయితే వినియోగదారులు, విద్యా సంస్థల్లో అయితే విద్యార్థులు వందల సంఖ్యల్లోనే ఉంటారు. ఇలాంటి అత్యంత కీలకమైన భవనాల్లో కనీస నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేయడం ద్వారా రాబోవు కాలంలో ఎలాంటి ఘటన జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. సెట్ బ్యాక్ ఉండదు.. ఫైర్ఇంజన్ తిరగదు నీలగిరిలో ఇటీవల కాలంలో వ్యాపార, వాణిజ్య భవనాలు భారీగా నిర్మాణం అవుతున్నాయి. ఏ ఒక్క భవన నిర్మాణదారుడు కూడా సెట్ బ్యాక్ తీసి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చి ఆయా భవనాల చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉండడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు భవనాలను నిర్మాణం చేసుకుంటున్నా సంబంధిత అధికారులు కిమ్మనడం లేదనే విమర్శలు ఉన్నాయి. నేతల ఒత్తిళ్లా.. లేక మరే ఇతర కారణమో కానీ నిబంధనలు పాటించని భవనాలను అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడంలేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. -
రోడ్డు దాటాలంటే భయం.. భయం
నకిరేకల్ : నిత్యం వాహనాల రద్దీ ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్ పట్టణం శివారులోని పద్మానగర్ జంక్షన్ ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఈ జంక్షన్ వద్ద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రాంతాన్ని గతంలోనే బా్ల్క్ స్పాట్గా గుర్తించిన అధికారులు.. నామమాత్రపు భద్రతా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు పట్టణ సమీపంలో సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తికాలేదు. దీంతో ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నాళ్లకే స్టాపర్ల తొలగింపు పద్మానగర్ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు ఏప్రిల్ నెలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. సగం ఇసుక, సగం నీరు నింపి రోడ్డుకు అడ్డంగా రంబూల్స్ పెట్టారు. అవి కేవలం ఇక వారం రోజుల పాటు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి తీసేవేశారు. దీంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఈ జంక్షన్ పక్కనే పద్మానగర్ కాలనీ ఉంది. ఈ కాలనీవాసులు రాత్రి వేళలో జాతీయ రహదారి కూడలి దాటి నకిరేకల్ పట్టణానికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. అండర్పాస్ నిర్మాణమే పరిష్కారం హైదారబాద్–విజయవాడ రహదారి విస్తరణ సమయంలో నకిరేకల్ ప్రధాన జంక్షన్ వద్ద అండర్పాస్ వంతెనలు నిర్మించలేదు. ఈ రోడ్డు గుండా రోజూ 50 వేలకుపైనే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ప్రమాదాల నివారణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రధానంగా నకిరేకల్లోని పద్మానగర్ వద్ద అండర్పాస్ నిర్మించలేదు. చీమలగడ్డ ఫ్లై ఓవర్ అండర్ పాసింగ్ నుంచి ఇనుపామలు జంక్షన్ వరకు సర్వీస్ రోడ్లు పూర్తి కాలేవు. నకిరేకల్ పట్టణం నుంచి హైదరాబాద్, నల్లగొండ వైపునకు వెళ్లాలంటే పద్మానగర్ జంక్షన్ దాటి వెళ్లాలి. జంక్షన్ దాటే క్రమంలో హైవేపై వాహనాలు అతి వేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అండర్ పాసింగ్ వంతెన నిర్మాణంతో సమస్యకు చెక్ పడనుంది.ప్రమాదాలకు నిలయంగా నకిరేకల్ పద్మానగర్ జంక్షన్ ఫ బ్లాక్ స్పాట్గా గుర్తించినా.. నామమాత్రంగా భద్రతా చర్యలు ఫ అండర్ పాస్ నిర్మించాలని కోరుతున్న ప్రజలు ఫ ఇనుపాముల వద్ద పూర్తి కాని సర్వీస్ రోడ్లు అండర్పాస్ నిర్మాణానికి కృషి చేస్తా నకిరేకల్లోని పద్మానగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్పాస్ నిర్మించాలని ప్రభుత్వం దృషికి తీసుకెళ్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సహకారంతో నేషనల్ హైవే అధికారులకు ఈ విషయాన్ని నివేదించాం. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అండర్పాస్ నిర్మాణం చేపడతాం. – వేముల వీరేశం, ఎమ్మెల్యే, నకిరేకల్ ప్రమాదాలు జరగకుండా చూస్తాం నకిరేకల్లోని పద్మానగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతాం. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేలా చూస్తాం. ఇక్కడ అండర్పాస్ నిర్మించాల్సిన అవసరం ఉందని హైవే అదికారులకు ప్రతిపాదనలు పంపాం. ప్రజలకు కూడా ఈ జంక్షన్ వద్ద జాగ్రత్తలు పాటించాలి. – రాజశేఖర్, సీఐ, నకిరేకల్ -
యాంత్రీకరణకు నిధులేవీ!
నల్లగొండ అగ్రికల్చర్ : గత ప్రభుత్వ హయాంలో (2018లో) నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తామని అట్టహాసంగా ప్రకటించింది. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తామని చెప్పి 2024 సంవత్సరానికి గాను జిల్లాకు రూ.1.81 కోట్ల నిధులను కేటాయించింది. మార్చి 31వ తేదీలోగా రైతులకు యాంత్రీకరణ పరికరాలను గ్రౌండింగ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదలు చేయకపోవడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకాన్ని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మూలన పెడుతుందా లేదా నిధులను విడుదల చేసి పునరుద్ధరిస్తుందా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. 820 యూనిట్లు మంజూరు రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెబుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 820 యూనిట్లు మంజూరు చేసింది. కలెక్టర్ అనుమతిలో జిల్లా వ్యవసాయ శాఖ మండలాల వారీగా వ్యవసాయ పరికరాలను అలాట్ చేసింది. వాటిని కేటాయించేందుకు రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ మార్చి దాటి మే నెల వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదు. సబ్సిడీ పరికరాల కోసం జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీసినా.. వారి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఆరేడు సంవత్సరాలుగా యాంత్రీకరణ పథకం లేకపోవడం వల్ల రైతులే పూర్తిగా డబ్బులు వెచ్చింది ట్రాక్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, స్స్రేయర్లు, ఇతర యాంత్రీకరణ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణను పునరుద్ధరిస్తామని ప్రకటించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఫ రూ.1.81 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఫ మార్చి నెలాఖరుకు గ్రౌండింగ్ చేయాలని ఉత్తర్వులు ఫ నిధులు రాకపోవడంతో గ్రౌండింగ్ చేయని వ్యవసాయ శాఖ ఫ రైతుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వంనిధులు విడుదల కాలేదు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. పరికరాలు, నిధుల కేటాయింపు మాత్రమే చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పరికరాలను గ్రౌండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ -
నీరు వృథా.. రైతు వ్యథ
నల్లగొండ : వర్షాలు సరిగ్గా కురవక ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతుంటే.. ఉన్న నీటిని ఒడిసిపట్టడంలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ అధికారులు విఫలమవుతున్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం నుంచి గేట్ల వద్ద వాల్వ్ సక్రమంగా లేక నీరు లీకై వృథాగా పోతోంది. దాంతో ఆ ప్రాంతంలో భారీగా జమ్ము మొలవడమే గాక ఆ నీరు రైతుల పొలాల్లో పారుతోంది. దీంతో పొలాలు జాలుపట్టి పంటలు సరిగా పండడం లేదు. ఎప్పుడూ నీరు ఉండడం వల్ల పొలాలు ఆరడం లేదు. పంట కోతకు వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాల్వ్ సక్రమంగా లేక.. వాల్వ్ సక్రమంగా లేక సంవత్సరం నుంచి నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. పంటలు కోత కొచ్చిన సమయంలో వరి కోత మిషన్ దిగబడుతుండడంతో మిషన్ యజమానులు ముందుకు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ సీజన్ సమీపిస్తోంది. పొలాలు దున్నాలన్నా.. ఆరడం లేదని రైతులు వాపోతున్నారు. వృథాగా పోతున్నా నీటిని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి లీకేజీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.ఫ ఉదయ సముద్రం గేట్ల నుంచి లీకవుతున్న నీరు ఫ జాలు పడుతున్న పొలాలు ఫ పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతుల ఆవేదన ఫ ఏడాది కాలంగా పట్టించుకోని అధికారులు వృథా నీటితో ఇబ్బంది పడుతున్నాం వాల్వ్ సక్రమంగా బిగించకపోవడం వల్ల ఉదయ సముద్రం నుంచి పెద్ద ఎత్తున నీరు లీకై వృథాగా పోతోంది. వరద ఎక్కువై పొలాల మీదుగా పారుతుండడంతో పంట పెద్దగా రాకపోగా పండిన కొద్ది పంటను కూడా కోసుకోలేకపోతున్నాం. మళ్లీ వ్యవసాయ సీజన్ వస్తోంది. భూమి దున్నాలన్నా నీరు పోయే పరిస్థితి లేదు. ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వృథా నీటితో ఇబ్బంది పడుతున్నాం. – సముద్రాల అంజయ్య, రైతు సమస్యను పరిష్కరిస్తాం ప్రస్తుతం తాగునీటి కోసం ఉదయసముద్రంలో నీటిని నింపాం. నీరు అధికంగా ఉన్నప్పుడు కట్ట నుంచి కూడా సీపేజి వాటర్ వస్తుంది. ఇక్కడ తూము ఉండడం వల్ల మరింత పెరిగింది. రోజు మార్చి రోజు మరమ్మతులు చేస్తున్నాం. కానీ తగ్గడం లేదు. ఉదయ సముద్రంలో నీరు తగ్గుతుంటే సీపేజి వాటర్ తగ్గుతుంది. అప్పుడు పూర్తిగా నీరు లీక్ కాకుండా చేస్తాం. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ డీఈ -
మండువేసవిలో నిండుగా జలం
తిప్పర్తి : వేసవి వచ్చిందంటే చెరువులు, కుంటలు ఎండిపోయి కనిపిస్తాయి. కానీ తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో ఉన్న చెరువు మాత్రం మండుటెండలో నిండుకుండలా జలకళ సంతరించుకుంది. పానగల్ చెరువు నుంచి వచ్చే జాలు, చందనపల్లి వద్ద ఉన్న వాటర్ప్లాంట్నుంచి వేస్ట్ వాటర్ ఈ చెరువులోకి చేరుతుంది. ఈ చెరువులో నిత్యం నీరు ఉండడంతో గంగన్నపాలెం, కాశివారిగూడెం, నానాపురం, రాజుపేట గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వేసవిలో చెరువు నిండు కుండలా ఉండడంతో ముందస్తుగా పంటల సాగుకు అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
21న ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ
నల్లగొండ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ పరిరక్షణకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ నెల 21న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సభ కన్వీనర్ మౌలానా బసీర్ ఖాస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫూల్లా రహమాని అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఈ సభకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సభకు ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మంత్రి తుమ్మలను కలిసిన డీసీసీబీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డినల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్లో నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విన్నవించారు. వీటికి సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తాని హామీ ఇచ్చారని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంనల్లగొండ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివానం నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాల కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. ఈ కేంద్రాలనికి మొత్తం 185 మంది విద్యార్థులను కేటాయించగా.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 181 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగిన రెండో పేపర్కు 180 మంది విద్యార్థులు హాజరయ్యారు. నేత్రపర్వంగా తిరువీధి సేవ భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అంతకుముందు వేకువజామున సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణ వేడుక తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి కర్పూర మంగళహారతులు సమర్పించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దు సూర్యాపేట : ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వొద్దని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్పీ వర్గీకరణ తీర్పు, గైడ్లైన్స్ను సరిగ్గా పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం తగదని పేర్కొన్నారు. ఈ విషయంపై మాల మహానాడు, షెడ్యూల్డ్ కులాల హక్కుల ఫోరం తరఫున హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. రెండు వాయిదాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వొద్దని పేర్కొన్నారు. -
లక్ష్యాన్ని మించి.. రుణం
పొదుపు సంఘాలకు 105 శాతం బ్యాంకు లింకేజీ రుణాలు నల్లగొండ : మహిళల ఆర్థికాబివృద్ధికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రుణాలు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటాయి. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏటా రుణాలు ఇవ్వడంలో లక్ష్యాన్ని నిర్ణయ్తింది. 2024–25 సంవత్సరంలో రుణాల మంజూరులో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఇతర అధికారులు అవార్డు అందుకున్నారు. రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు.. స్వయం సహాయక మహిళా సంఘాలకు సెర్ప్ అధికారులు, సిబ్బంది ఆయా సంఘాల అర్హతను బట్టి రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేశారు. సభ్యులకు సంఘాల తీర్మాణంతో రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు సైతం ఇచ్చారు. ఈ రుణంతో మహిళలు కిరాణా, వస్త్ర, స్టేషనరీ, పిండి గిర్నిలు, ఎంబ్రాయిడరీ, స్వీట్ల తయారీ తదితర దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా మహిళలంతా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ రుణాలు దోహదపడుతున్నాయి. జిల్లాలో 22,937 మహిళా సంఘాలు జిల్లాలోని 32 మండలాల పరిధిలో మొత్తం 22,937 సంఘాలు ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1094 కోట్ల రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సగానికి పైగా సంఘాలకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ రుణాలు పొందాయి. అన్ని సంఘాలకు కలిపి రూ.1150 కోట్లు రుణాలు అందించారు. దీంతో 105.23 శాతం రుణాలను మహిళా సంఘాలకు అందించగలిగారు. సిబ్బంది సమష్టి కృషి నల్లగొండ జిల్లా డీఆర్డీఏ అధికారులు బ్యాంకు లింకేజీలో లక్ష్యానికి మించి రుణాలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ కింద రుణాలు అధికంగా ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించినందుకు ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చింది. డీఆర్డీఏ సిబ్బంది అంతా కలిసికట్టుగా పని చేయడం వల్లే అవార్డును సాధించగలిగామని డీఆర్డీఓ శేఖర్రెడ్డి పేర్కొంటున్నారు. ఫ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాకు మొదటిస్థానం ఫ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఆర్డీఓ ఫ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్న రుణం -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: ఓ వైపు నిత్య పూజా కార్యక్రమాలు, మరోవైపు భారీగా తరలివచ్చిన భక్తుజనులతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామును ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా..?
● క్యూలైన్లలో భక్తుల సమస్యలు తెలుసుకున్న ఈఓ వెంకట్రావ్ వేసవి సెలవుల్లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం సుమారు 40వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వెంకట్రావ్ శనివారం క్యూలైన్లలో, మాఢ వీధుల్లో తిరుగుతూ భక్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని భక్తులను అడిగారు. ఎండల తీవ్రతకు, ఉక్కపోతకు భక్తులు ఇబ్బందులుపడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెంట్రావ్ పేర్కొన్నారు. కొండ కింద శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం వెంటనే ఏసీలు బిగించాలని అధికారులను ఆదేశించారు. వ్రత పూజల్లో పాల్గొనే భక్తులకు సామాగ్రీ, రవ్వ ప్రసాదంతో పాటు అదనంగా శ్రీస్వామి వారి శేష వస్త్రం (శెల్లా, కనుము) అందజేసేందుకు ఏర్పాటు చేయాలని ఆధికారులకు చెప్పారు. ఆయన వెంట డిప్యుటీ ఈఓ దోర్బాల భాస్కర్శర్మ ఉన్నారు. -
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త
కల్తీలను గుర్తించండిలా..● యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ ఎరువులుగుళికలుగా ఉంటాయి. ● ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. ● 5 మి.లీ. నీటిలో చెంచా ఎరువు వేసి బాగా కలిపితే స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. ● ఒక చెంచా యూరియాను ఐదు మి.లీ. పరిశుభ్రమైన నీటిలో వేసి కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇలాగే పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి.పెద్దవూర: మరో పది హేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలను సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్కుమార్ సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయని, వాటిని చూసి విత్తనాలు కొనుగోలు చేయొద్దని పేర్కొన్నారు. విత్తనాలు, పురుగుల మందు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. విత్తనాల ఎంపిక..● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు. ● రశీదుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబర్, విక్రయదారుడి గ్రామం పేరు, సంతకం, విత్తన రకం, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, తూకం, ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతృప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి. పురుగు మందుల ఎంపిక..● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. ● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి. ● ఒక పంటకు వాడిన మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనలతో వాడాలి. ఎరువుల ఎంపిక..● లైసెన్స్ కల్గిన దుకాణాల్లోనే ఎరువులు కొనాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. ● కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి. ● చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి. కంపెనీల ప్రకటనలు చూసి రైతులు మోసపోవద్దు -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ముఖ మండపం, ప్రసాద విక్రయశాల, ఇతర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.42,32,003 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. నృసింహుడి సన్నిధిలో విశేష పూజలు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. 40వేలకు పైగా దర్శించుకున్న భక్తులు ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం -
సెలవుల్లో.. కంప్యూటర్ శిక్షణ
తాళ్లగడ్డ (సూర్యాపేట): ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు విద్యార్థులు, యువత తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ లేదా స్విమ్మింగ్, కరాటే, స్పోకెన్ ఇంగ్లిష్ వంటివి నేర్చుకునేవారు. మరికొందరు సంగీతం, వివిధ రకాల కళలను నేర్చుకునేవారు. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవుల్లో కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనుగుణంగానే పట్టణాల్లో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు విద్యార్థులు, యువతతో కళకళలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల యువత, విద్యార్థులు వేసవి సెలవుల్లో ప్రతిరోజు వచ్చి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లలో చేరి శిక్షణ పొందుతున్నారు. కొందరు ఉపాధి కోసం మరికొందరు ఉన్నత చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగోన్నతి కోసం కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్నారు. ఆకట్టుకుంటున్న నిర్వాహకులు..సూర్యాపేట పట్టణంలో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ల సంఖ్య పెరగడంతో పోటీని తట్టుకునేందుకు పలువురు నిర్వాహకులు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఎక్కువగా యువత, చిన్నారులు శిక్షణకు వస్తుండటంతో బ్యాచ్కు 10 నుంచి 5 మంది చొప్పున, ప్రతిరోజు 10 బ్యాచ్ల వరకు నడుపుతున్నారు. నెల రోజులు పాటు ఇచ్చే శిక్షణకు గాను రూ.2000 వరకు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందిన ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు పలువురు నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులు, యువత క్రీడలతో సమానంగా పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులుకొన్ని కోర్సులకు మంచి డిమాండ్యువత కంప్యూటర్ కోర్సులో ఎంస్ ఆఫీస్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత ఫొటోషాప్, డీటీపీ, టాలీ, ఆటో కాడ్ వంటి కోర్సులు నేర్చుకుంటున్నారు. వీటి తర్వాత పీజీడీసీఏ ఆరు నెలల కోర్సు కావడంతో అవసరం ఉన్న వారు మాత్రమే దానిని ఎంచుకుంటారు. శిక్షణ పొందిన వారు కొందరు ఇంటర్నెట్ సెంటర్లలో, కాలేజీలు, ఆస్పత్రుల్లో కంపూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.ఫోన్ వద్దని కంప్యూటర్ క్లాసులకు.. ఇంటి దగ్గర ఫోన్ వాడుతుండటంతో మా అమ్మానాన్నలు ఫోన్కి బదులుగా జీవితంలో ఉపయోగపడే కంప్యూటర్ నేర్చుకోమని ఇనిస్టిట్యూటల్లో జాయిన్ చేశారు. కంప్యూటర్ కొంతమేర నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. – ఈషాన్, 8వ తరగతి, సూర్యాపేటఉపాధి పొందేందుకు ఉపయోగంవేసవి సెలవులను వృఽథా చేయకుండా ప్రస్తు తం సూర్యాపేట పట్ట ణంలోని ఈసీఎస్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో టాలీ నేర్చుకుంటున్నాను. కాల వ్యవధి లోగా టాలీపై పట్టుసాధించి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలనేదే నా లక్ష్యం.. – నసీర్, డిగ్రీ, సూర్యాపేట భవిష్యత్ కోసం.. నేను పదో తరగతి పూర్తి చేశాను. సూర్యాపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉన్న గుంజలూరు నుంచి రోజూ వచ్చి కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. ఉన్నత చదువుల కోసం, భవిష్యత్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. – ప్రదీప్, 10వ తరగతి, గుంజలూరుకంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా కంప్యూటర్ అనుసంధానంగానే పనులు జరుగుతున్నాయి. గతంతో అవసరం ఉంటేనే కంప్యూటర్ నేర్చుకునేవారు.. కానీ నేడు కంప్యూటర్ నేర్చుకొని ఉండటం తప్పనిసరి. శిక్షణ అనంతరం కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాము. మా వద్ద శిక్షణ తీసుకున్న వారు కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. – ఎండీ మహ్మద్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు -
వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాల అపహరణ
నకిరేకల్: వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకలపట్టణంలోని వీటీ కాలనీలో నివాసముంటున్న స్థానిక పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు తల్లి లక్ష్మమ్మ ఇంటికి శనివారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు రూములు కావాలంటూ వచ్చారు. తమ ఇంట్లో అద్దెకు రూములు లేవని లక్ష్మమ్మ వారికి చెప్పింది. తాగడానికి మంచినీళ్లు కావాలని సదరు వ్యక్తులు ఆమెను అడిగారు. దీంతో మంచినీళ్లు ఇచ్చేందుకు లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్తుండగా.. ఆమైపె ఆ ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కాళ్లు, చేతులు కట్టివేశారు. లక్ష్మమ్మ కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు పెట్టి మొహంపై పిడుగుద్దులు గుద్దారు. అనంతరం ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు, చేతులకు ఉన్న వెండి గాజులు లాక్కోని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ చేతి కట్లు విప్పుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె కూమారుడు వెంకటేశ్వరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో లక్ష్మమ్మ ఇంటికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి క్లూస్టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల దాడిలో గాయపడిన లక్ష్మమ్మను నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మ మ్మను ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. వృద్ధ మహిళలే టార్గెట్.. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామంలో పుట్ట చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చోని ఉండగా గుర్తుతెలియన ఇద్దరు యవకులు వచ్చి తన మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించారు. -
సూర్యాపేట డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ
సూర్యాపేటటౌన్: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం సభ్యులు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్సనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్, డిప్యూటీ సీఎస్ పీసీపీ ఎన్డీటీ డాక్టర్ సుమిత్రా రాణి, డిపూఓ్యటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడ్మిన్ శ్వేతా మోహన్.. డీఎంహెచ్ఓ కోటాచలాన్ని విచారించారు. సూర్యాపేటలో నాలుగు ఆస్పత్రుల పర్మిషన్కు సంబంధించిన సర్టిఫికెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిశీలన అనంతరం తీసుకునే చర్యల సంబంధిత వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిస్తామన్నారు. -
విత్తన సరఫరాలో డీలర్ల పాత్ర కీలకం
రామగిరి(నల్లగొండ) : రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ప్రధానమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడరాఉ. విత్తనం విషయంలో డీలర్లు రైతులను ప్రలోభాలకు గురి చేయవద్దన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీలర్లు రైతులకు ఇచ్చే విత్తనాలను అవసరమైతే వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో తనిఖీ చేయించుకోవాలని సూచించారు. దుకాణం ముందు ఎమ్మార్పీ ధరలకు విత్తనాలను అమ్మే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. కోరమండల్ కంపెనీ టెక్నికల్ స్టాఫ్ను పెంచాలని, వారు అందజేసే ఈ –పాస్లో ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే అధిగమించే విధంగా కృషి చేయాలన్నారు. గడిచిన యాసంగి సీజన్లో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని.. అందుకు అనుగుణంగా విత్తనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా వంద మంది విత్తన డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరమండల్ కంపెనీ సీజీఎం వెంకటేశ్వర్లు, విత్తన డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, రామ్మూర్తి, రవి, రాజేందర్, హర్ష తదితరులు పాల్గొన్నారు. -
సెలవుల్లో కంప్యూటర్ శిక్షణ
విద్యార్థులు, యువత వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. - 8లోరైతులకు ప్రయోజనం కేంద్ర పభుత్వ ఏఐఎప్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు డ్రోన్లను సబ్సిడీపై అందజేయాలని నిర్ణయించాం. డ్రోన్ల ద్వారా మందులను తక్కువ ధరలో పిచికారీ చేయడం వల్ల రైతులకు ప్రయోజరం కలుగుంది. సంఘాలకు లాభాలు వస్తాయి. వానాకాలం సీజన్ వరకు డ్రోన్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ● -
శిక్షణతో మెరుగైన బోధన అందించాలి
నల్లగొండ : వృత్తి నైపుణ్యం కోసం ఇస్తున్న శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన పద్ధతిలో బోధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. రిసోర్స్ పర్సన్లకు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ ఈనెల 17 వరకు మొదటి విడత, 20 నుంచి 24 వరకు రెండవ విడత, 27 నుంచి 30 వరకు మూడవ విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ఆయా పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్లు నల్లగొండ ఎంఈఓ అరుంధతి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, చిట్యాల ఎంఈఓ సైదయ్య పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
విద్యుత్శాఖ ముందస్తు సన్నద్ధం
మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేలా విద్యుత్శాఖ ముందస్తు మరమ్మతులు చేపడుతోంది. రాబోయే వర్షాకాలంలో విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికా బద్ధమైన విధానాల ద్వారా లోపాలను సరి చేస్తోంది. ప్రతీ వేసవి కాలంలో విద్యుత్ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రస్తుతం ట్రాన్స్కో అధికారుల ఆధ్వర్యంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ సబ్స్టేషన్ల వారీగా సరఫరా వ్యవస్థను మెరుగు పర్చుతున్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 172 విద్యుత్ సబ్స్టేషన్లు.. జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 172 ఉండగా, 133 కేవీ సబ్స్టేషన్లు 16 ఉన్నాయి. ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ఉండేలా అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. లోపాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన అధికారులు ప్రస్తుతం వ్యవస్థ మెరుగుదలకు కసరత్తు చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయా ప్రాంతాల సబ్స్టేషన్ల విద్యుత్ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా విద్యుత్ సబ్స్టేషన్ల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహణ వ్యవస్థను పర్యవేక్షిస్తుండగా ఈ నెల చివరి వరకు పనులు పూర్తి అవుతాయని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేలా మరమ్మతులుఫ కరెంట్ తీగలను తాకుతున్న చెట్ల తొలగింపు ఫ వేలాడుతున్న విద్యుత్ తీగల బిగింపు ఫ శిథిలావస్థలో ఉన్న స్తంభాల మార్పు ఫ వచ్చే వానాకాలంలో ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక పకడ్బందీగా పనులు అంతరాయం లేకుండా విద్యు త్ సరఫరా చేసేందుకు పకడ్బందీ పనులు చేపడుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపడుతూ లోపాలను సవరిస్తున్నాం. సిబ్బంది సమన్వయంతో పని చేస్తే విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా కరెంట్ అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసచారి, ట్రాన్స్కో డీఈ, మిర్యాలగూడపాతవి తొలగించి.. కొత్తవి అమర్చుతూ.. విద్యుత్శాఖ ముందస్తు మరమ్మతుల్లో భాగంగా విద్యుత్ తీగలకు తగిలే చెట్టుకొమ్మలను తొలగిస్తున్నారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను టైట్ చేస్తున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిర్వహణ వ్వవస్థ మెరుగుదలకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మరమ్మతులకు గురైన ప్యూజ్ బాక్స్లను తొలగించి కొత్త వాటిని అమర్చుతున్నారు. బలహీనంగా మారిన విద్యుత్ తీగల స్థానాల్లో సామర్థ్యం గల తీగలను బిగిస్తున్నారు. -
ఉత్తమ బోధనకు కేరాఫ్.. కేజీబీవీ
ఫ ఇంగ్లిష్ మీడియంలో బోధన.. సకల వసతులు ఫ ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం ఫ జిల్లాలో 27 విద్యాలయాలు కేతేపల్లి : పేద, వెనుకబడిన, మద్యలో బడిమానేసిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పింది. తల్లిదండ్రులు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనేదే వీటి లక్ష్యం. ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి ఉత్తమ బోధనతోపాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సొంత భవనాల్లో ఉచిత వసతితో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించటం ఈ విద్యాలయాల ప్రత్యేకత. ఆరో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉండటంతో ఈ విద్యాలయాల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి తరగతిలో 40 మంది.. జిల్లాలో మొత్తం 27 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థినులు ఉంటారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్లో ఎంపీహెచ్డబ్ల్యూ, సీఈసీ కోర్సుల్లో 40 మంది చొప్పున విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది. భవిష్యత్లో ఉపాధి పొందేలా.. కేజీబీవీల్లో విద్యార్థినులకు అన్ని వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తారు. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా భవిష్యత్లో విద్యార్థినులు ఉపాధి పొందేలా కుట్లు, అల్లికలతో పాటు కంప్యూటర్ శిక్షణ, మార్షల్ ఆర్ట్స్పై తర్ఫీదు సైతం ఇస్తారు. వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ఇలా.. కేజీబీవీలో ప్రవేశాలకు సంబంధించి మొదట తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత మిగిలిన విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం విద్యార్థినులు 5వ తరగత వరకు చదువుతున్న బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. -
ఎస్సీ గురుకులాల్లో ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందడానికి ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ నెల 20లోగా ఆన్లైన్ tgswreis.telanga na. go v.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని షెడ్యుల్డ్ కులాల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7995010667 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగొద్దుకేతేపల్లి : రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల డీఎం జె.హరీష్ ఆదేశించారు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.07 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం 17,729 టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.903 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట కేతేపల్లి ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఏఓ బి.పురుషోత్తం, ఆర్ఐ రాంచంద్రయ్య తదితరులు ఉన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ టీచర్స్ జిల్లా కమిటీని శనివారం నల్లగొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రూపవత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా రమావత్ శ్రీనునాయక్, ఉపాధ్యక్షులుగా రుపావత్ అనంతరాములు, వెంకటరెడ్డి, బ్రహ్మచారి, కోశాధికారిగా జిలకర భాస్కర్, కార్యదర్శులుగా ఆర్.వెన్నెల, పి.రూప, ఎం.అనితను ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతినల్లగొండ: నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, చలపతిరావు ఉన్నారు. జ్యూరీ మెంబర్గా మిర్యాలగూడ వాసిమిర్యాలగూడ : గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 కమిటీలో జ్యూరీ మెంబర్గా మిర్యాలగూడకు చెందిన సీనియర్ జర్నలిస్టు వాకిటి మధును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన రాష్ట్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. మిర్యాలగూడ డివిజన్లో 1979 వరకు ఓ దినపత్రికలో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థలో మేనేజర్గా చేరారు. ఉద్యోగ విరమణ అనంతరం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అవార్డు జ్యూరీ సభ్యులుగా మధు ఎంపికపై స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. -
‘ప్రత్యేక’ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
నల్లగొండ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాలపై గురువారం నల్లగొండ కలెక్టరేట్లో మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో ఎలాంటి పనులు చేపట్టాలి, వారికి ఏమి అవసరం ఉన్నాయో వెంటనే గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్కుమార్, నల్లగొండ, చండూరు ఆర్డీఓలు అశోక్రెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
హాలియా : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితులతోపాటు గంజాయి ఇతర మాదకద్రవ్యాలు విక్రయించేవారి సమాచారాన్ని విలేజ్ పోలీస్ అధికారి అందించడం వల్ల నేరాలను నిరోధించవచ్చన్నారు. గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు, హాలియా సీఐ జనార్దన్ గౌడ్, ఎస్ఐ సతీష్రెడ్డి, వీపీఓ సరిత తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరతచంద్ర పవార్ -
అడ్డొస్తున్నాడని..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వెల్మకన్నె గ్రామానికి చెందిన మహిళ తన భర్తను హతమార్చింది. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.క్షేత్రపాలకుడికి పూజలు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని సుందరీమణులు దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయంలోని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కారు. అక్కడి నుంచి గర్భాలయంలోకి వెళ్లి స్వయంభూలకు పూజలు నిర్వహించారు. ఆలయ పారాయణీకుడు నల్లంథీఘల్ సీతారామచార్యులు స్వామివారి విశిష్టతను వారికి వివరించారు. అనంతరం చెంతనే ఉన్న ఆండాల్ అమ్మవారిని సుందరీమణులు దర్శించుకున్నారు. సుందరీమణులకు ఆలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ శ్రీస్వామివారి ప్రతిమతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం వారు ఉత్తర ప్రథమ ప్రాకార మండపానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణశిలతో చెక్కిన యాలీ పిల్లర్లు, సింహం తదితర విగ్రహాలను పరిశీలించి తన్మయత్వం పొందారు. అంతకుముందు సుందరీమణులకు కూచిపూడి, భరత నాట్యం, కోలాటం కళాకారులు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. కోలాట బృందంతో కలిసి సుందరీమణులు కోలాటం ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెంపుల్.. సో బ్యూటిఫుల్ ఆలయంలో కలియదిరిగి పరిశీలించిన సుందరీమణులు.. టెంపుల్ సో బ్యూటీఫుల్ అని కితాబునిచ్చారు. అద్భుత కళాఖండం అంటూ కొనియాడారు. ఆలయ నిర్మాణ శైలిని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు వారికి వివరించారు. సుందరీమణుల పర్యటన సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు కొనసాగింది. -
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఈనెల 26 వరకు డీలక్స్, సూపర్ లక్జరీ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదని తెలిపారు. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులునల్లగొండ : కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో 400 మార్కులకుపైగా సాధించిన జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, జెడ్పీహెచ్ఎస్లు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. సొంత జిల్లాలకు తహసీల్దార్లునల్లగొండ: ఎన్నికల విధుల్లో భాగంగా గతంలో బదిలీ అయిన తహసీల్దార్లను ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాలకు పంపింది. ఈ మేరకు ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం మల్టీజోన్–2 పరిధిలోని జిల్లాలకు చెందిన తహసీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. వారిలో ఇప్పుడు 44 మందిని బదిలీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 11 మంది తహసీల్దార్లు వారి జిల్లాలకు పంపగా, మరో ఏడుగురు బదిలీపై జిల్లాకు వచ్చారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధచూపాలి కట్టంగూర్, శాలిగౌరారం : గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపాలని డీఆర్డీఓ వై.శేఖర్రెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం కురుమర్తి, నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో నర్సరీలతోపాటు శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో నర్సరీ, రైతులు సాగుచేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి కూలీలకు రోజువారీగా రూ.307 తగ్గకుండా కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని ఏపీఓ, ఉపాధి సిబ్బందికి సూచించారు. నారెగూడెం, ఎరసానిగూడెం గ్రామాల్లో గల నర్సరీల్లో మొక్కల పెంపకం సక్రమంగా లేకపోవటంతో జీపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఎంపీఓను ఆదేశించారు. నిమ్మ, కొబ్బరి, మామిడి, మునగ, డ్రాగన్ ప్రూట్ తోటల సాగులో ప్రభుత్వ రాయితీని పొందడంతోపాటు అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నారు. ఆయన వెంట నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ బీఎల్ నర్సింహారావు, ఎంపీఓలు చలపతి, సుధాకర్, ఏపీఓలు కడెం రాంమోహన్, జంగమ్మ, ఏపీఎం సైదులు, కార్యదర్శులు జయసుధ, పెద్దయ్య, ఈసీ శ్రీధర్ తదితరులు ఉన్నారు. స్వర్ణగిరీశుడికి తిరుపావడ సేవ భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం తిరుపావడ సేవ వైభవంగా నిర్వహించారు. 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు. -
ఇక్కత్కు, శిల్పకళకు ఫిదా..
సందడి చేసిన ప్రపంచ సుందరీమణులు భూదాన్పోచంపల్లిలోని టూరిజం పార్క్లో సుందరీమణులుభూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన సుందరీమణులు గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఒక బృందం భూదాన్పోచంపల్లిని, మరో బృందం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించింది. నేతన్నల గొప్పదనం చూసి అబ్బురపడి.. ఆఫిక్రా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు భూదాన్పోచంపల్లిని సందర్శించారు. స్థానిక రూరల్ టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన చేనేత థీమ్లో పాల్గొని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి అబ్బురపడ్డారు. చేనేతల గొప్పతనం చూసి అందాలభామలు చప్పట్లు కొట్టారు. అలాగే ఇండో వెస్ట్రన్ ఇక్కత్ దుస్తులతో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్ వాక్ చూపి మైమరిచిపోయారు. ప్రముఖ డిజైనర్ స్వాతి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రూపొందించిన ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వస్త్రాలను ప్రముఖ మోడల్స్ ధరించి, ప్రముఖ కొరియోగ్రఫీ సుందర్ పర్యవేక్షణలో ప్రదర్శించిన రాంప్వాక్ వావ్ అన్పించింది. సుమారు 30 మంది మోడల్స్ ర్యాంప్వాక్ చేశారు. ఆకట్టుకున్న చేనేత స్టాళ్లు టూరిజం పార్కు ఆవరణలో పద్మశ్రీ గజం గోవర్థన్, జాతీయ అవార్డు గ్రహీత తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు భోగ బాలయ్య, ఎన్నం మాధవిశివకుమార్, చేనేత టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, చేనేత సహకార సంఘంతో పాటు గద్వాల్, నారాయణపేట, సిద్ధిపేట గొల్లభామ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేశారు.వీటిలో పోచంపల్లి ఇక్కత్తో పాటు తేలియారుమాళ్లు, గొల్లభామలు చీరలను చూసి ప్రపంచ సుందరీమణులు మురిసిపోయారు. సంప్రదాయ చీరకట్టుతో నృసింహుడి క్షేత్రానికి.. కరేబియన్ దీవులకు చెందిన తొమ్మిది మంది సుందరీమణులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్ప కళను చూసి పరవశం పొందారు. సంప్రదాయ చీరకట్టు, లంగా ఓణీతో సాయంత్రం 5గంటలకు కొండపైన గల అతిథిగృహానికి చేరుకున్న సుందరీమణులు.. తొలుత అఖం దీపారాధన చేశారు. ఆ తరువాత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫొటోకు పూజలు చేసి మీడియా గ్యాలరీ వద్ద అతిథులకు అభివాదం చేశారు. అలాగే బ్రహ్మోత్సవ మండపం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లో శ్రీస్వామివారి కై ంకర్యాలను వీక్షించి ఫొటోలు దిగారు. ఇక్కత్ వస్త్రాలతో సన్మానం సుందరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఇక్కత్ శాలువాతో సన్మానించారు.ఫ జిల్లాలో రెండు బృందాలుగా పర్యటన ఫ ఒక టీం భూదాన్పోచంపల్లి, మరొకటి యాదగిరిగుట్ట ఆలయ సందర్శన ఫ ఇక్కత్ డిజైన్లు చూసి అబ్బురపడిన అందగత్తెలు ఫ యాదగిరిగుట్టలో నృసింహుడి దర్శనం, శిల్పకళను వీక్షించి పరవశం -
61.35 శాతం మందికే!
కార్డుదారులందరికీ అందని రేషన్ బియ్యం ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడే ఎందుకు? పదేళ్ల నుంచి జిల్లాలో ధాన్యం అత్యధికంగా పండుతోంది. ఈ నాలుగైదేళ్లలో గణనీయంగా దిగుబడి పెరిగింది. ఇన్నేళ్ల కాలంలో ఏటా ఎంత ధాన్యం కొనుగోలు చేసినా, బియ్యం పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. జిల్లా యంత్రాంగానికి ధాన్యం ఎంత మార్కెట్కు వస్తుందన్న విషయం ముందుగానే తెలిసినా, ఇటు ధాన్యం లారీల కాంట్రాక్టు వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించడమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. బియ్యం సరఫరాకు సరిపడా లారీలు ఉన్నాయా? లేదా? అనేది చూడకుండానే ధాన్యం సరఫరా కాంట్రాక్టు అప్పగించడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ సవాలక్ష్య సమస్యలతో సాగుతోంది. కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ గడువు ఈనెల 15వ తేదీతో ముగిసినా పూర్తి స్థాయిలో గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరలేదు. చేరిన బియ్యం కూడా ప్రజలకు ఇంకా పూర్తి స్థాయిలో అందనేలేదు. బుధవారం వరకు 61.35 శాతం కార్డుదారులకే రేషన్ బియ్యం అందినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో మొదటి నెల నుంచే ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రేషన్ పంపిణీ సమయం ముగిసినా.. ప్రతినెలా 30 తేదీ వరకే ఎఫ్సీఐ గోదాముల నుంచి బియ్యం రేషన్ షాపులకు చేరాలి. ఆ తరువాత ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపు డీలర్లు బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయాలి. అయితే ఈ నెలకు సంబంధించి ఏప్రిల్ 30 నాటికే బియ్యం రేషన్ షాపులకు చేరాల్సి ఉండగా, మే 15వ తేదీ వచ్చినా కూడా ఇంకా రేషన్ షాపులకు పూర్తి స్థాయిలో బియ్యం చేరకపోవడంతో కార్డుదారులకు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. ముందుచూపులేని అధికారులు జిల్లాలో ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే రేషన్ బియ్యం సరఫరాకు, ధాన్యం సరఫరాకు సంబంధించి కాంట్రాక్టు పనులను అధికారులు ఒకరికే అప్పగించడం ఈ సమస్యకు కారణం అవుతోంది. ప్రతినెలా జిల్లాలో ప్రజలకు పంపిణీ చేసే దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐ గోదాముల నుంచి రేషన్ షాపులకు పంపిణీ చేయాలి. ఈ పనులకు జిల్లాలో ఒక కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులను అధికారులు అదే కాంట్రాక్టర్కు అప్పగించారు. బియ్యం పంపిణీలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో 30వ తేదీ నాటికే షాపులకు చేరాల్సిన బియ్యం 15 రోజులు గడిచినా పూర్థిసాయిలో చేరలేదు. సమన్వయ లోపం.. లారీల సమస్య ఈ యాసంగి సీజన్లో 11,26,021 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 5,68,152 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొంటారని, మరో 5,57,869 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందని సూచించింది. అయినా ఇటు పౌరసరఫరాల సంస్థ, అటు పౌరసరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పుడేమో బియ్యం పంపిణీకి ఉపయోగించే లారీలను కూడా ధాన్యం ట్రాన్స్ పోర్టుకు వినియోగిస్తున్నామని చెప్పి ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ధాన్యం విషయంలోనూ అదే దుస్థితి కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాక ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో కేంద్రానికి మూడు నాలుగు రోజులకు కూడా ఒక లారీ రాని పరిస్థితి ఇటీవల సాక్షి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున లారీలు పెట్టాల్సి ఉన్నా, అవసరం మేరకు పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. పైగా మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకోవడం లేదనే సాకును చెబుతున్నారు. అదే నిజమైతే మిల్లర్లు త్వరగా ధాన్యాన్ని దింపుకునేలా చర్యలు చేపట్టడంలోనూ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఫ బియ్యం సరఫరాకు సరిపడా కేటాయించని లారీలు ఫ పదిహేను రోజులు గడిచినా తప్పని ఎదురుచూపులు ఫ ఇబ్బందుల్లో రేషన్ కార్డుదారులుమండలాల సంఖ్య 33రేషన్ షాపులు 950కార్డుదారులు 4,74,681 లబ్ధిదారులు 13 లక్షలు బుధవారం వరకు బియ్యం తీసుకున్నవారు 2,91,233రేషన్ అందని కార్డులు 1,83,448 -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
గట్టుప్పల్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన వల్ల పు మల్లేష్(37) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్లేష్ భార్య హేమలతతో అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మల్లేష్కు తెలియడంతో హేమలతను మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి మల్లేష్ అడ్డొస్తున్నాడని అతడిని అంతమొందించాలని అతడి భార్య హేమలత, ఆమె ప్రియుడు నవీన్ నిర్ణయించుకున్నారు. మద్యం తాగించి.. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మల్లేష్ నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్ పెట్టడానికి నవీన్ వచ్చాడు. అనంతరం వారిద్దరు కలిసి గ్రామంలో మద్యం తాగి తమ ఇళ్లకు వెళ్లారు. తిరిగి సాయంత్రం నవీన్ మల్లేష్ను పిలిచి ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ విషయాన్ని నవీన్ ఫోన్ ద్వారా హేమలతకు చెప్పాడు. రాత్రి 10.30 గంటలకు మల్లేష్ను నవీన్ బైక్పై ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో మల్లేష్ మంచంపై నిద్రకు ఉపక్రమించగానే నవీన్, హేమలత కలిసి టవల్తో మల్లేష్ ముఖంపై అదిమిపట్టి శ్వాస ఆడకుండా చేసి హతమార్చారు. మరుసటిరోజు తెల్లవారుజామున తన భర్త చనిపోయాడని హేమలత కేకలు వేస్తూ అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమలతను ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హేమలత, ఆమె ప్రియుడు నవీన్ కలిసి పథకం ప్రకారమే మల్లేష్ హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టుప్పల్ ఎస్ఐ వెంకట్రెడ్డి, ఏఎస్ఐ ఆర్. అంజయ్య, పోలీస్ సిబ్బంది వి. రమేశ్, సుదర్శన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిందితుల అరెస్ట్.. రిమాండ్కు తరలింపు వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
కంటైనర్ను ఢీకొట్టిన కారు.. భార్య మృతి
చివ్వెంల(సూర్యాపేట): ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టిన ఘటనలో భార్య మృతిచెందగా.. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన భృగుమళ్ల హరీష్, అతని భార్య కళ్యాణి (32) కారులో ఖమ్మంకు వెళ్తుండగా మార్గమధ్యలో చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణి తలకు, చాతిలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హరీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. భర్తకు గాయాలు -
వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ
నకిరేకల్ : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట చంద్రమ్మ గురువారం తన ఇంటి బయట కూర్చోని ఉండగా.. ఇద్దరు యవకులు ఆమె వద్దకు వచ్చి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కోని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సులో సీటు కోసం కొట్లాట యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. గురువారం ఉదయం 11గంటల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్కు చెందిన భక్తులు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో కొండ పైన బస్టాండ్లోకి బస్సు రావడంతో సీట్ల కోసం ప్రయాణికులు పోటీ పడ్డారు. ఈ సమయంలో మహిళా భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది వారిని అడ్డుకొని పంపించారు. -
ఆటో బోల్తా.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు వలిగొండ: ఆటో బోల్తాపడి ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలం అక్కంపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచెనపల్లికి చెందిన లాడే సుధాకర్ (40), లాడే అంజాజీ ఇద్దరు కలిసి వాహన బ్యాటరీల వ్యాపారం నిమిత్తం గురువారం ఆటోలో చౌటుప్పల్కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వలిగొండ మండలం అక్కంపల్లి వద్ద ఆటో బోల్తా పడడంతో ఆటో నడుపుతున్న సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంజాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, అంజాజీకి వైద్యం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డి చొరవతోనే..
● ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి చొరవతోనే హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో అందంగా, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు పోచంపల్లికి రావడం ద్వారా చేనేతకు మరింత వైభవం వస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ చేనేతను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, మిస్ వరల్డ్ పోచంపల్లి ప్రోగ్రాం ఇన్చార్జి లక్ష్మి, రాచకొండ సీపీ సుధీర్బాబు, తెలంగాణ టూరిజం జనరల్ మేనేజర్ మందడి ఉపేందర్రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, చింతకింది మల్లేశం, భువనగిరి డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏసీపీ మధుసూదన్రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్రావు, ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
యువకుడి ప్రాణం తీసిన చేపల వేట
కనగల్ : చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగర్జున్రెడ్డి(36) వ్యవసాయంతో పాటు మెటార్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పగిడిమర్రి గ్రామానికే చెందిన కొప్పుల ప్రవీణ్ బోరు మోటారు కాలిపోగా.. దానిని బయటకు తీసిన అనంతరం సమీపంలోనే ఉన్న నోములవారి కుంటలోకి నాగార్జున్రెడ్డి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు కుంటలోకి దిగిన కొన్ని క్షణాల్లోనే నాగర్జున్రెడ్డి అందులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా కుంటలో నాగార్జున్రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది 4గంటల పాటు శ్రమించి నాగార్జున్రెడ్డి మృతదేహన్ని కుంటలో నుంచి బయటకు తీశారు. కరెంట్ షాక్తో మృతిచెందాడా..?నాగర్జున్రెడ్డితో పాటు మరో ఐదుగురు యువకులు కూడా చేపల వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగర్జున్రెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడికి ఈత వచ్చని, చిన్న కుంటలో మునిగిపోయే అవకాశమే లేదని గ్రామస్తులు, బంధువులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే వారం క్రితం గ్రామ పరిధిలోని కుంటల్లో కరెంట్ సహాయంతో చేపలు పడితే రూ.10వేల జరిమానా విధిస్తామని డప్పు చాటింపు కూడా వేయించినట్లు మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి తెలిపారు. గ్రామంలో విషాధచాయలు..నాగర్జున్రెడ్డి మృతితో పగిడిమర్రి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నాగార్జున్రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి 3వ తరగతి చదివే కుమార్తె, 1వ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. నాగార్జున్రెడ్డి భార్య కోమలి ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందించలేదని పోలీసులు తెలిపారు. కుంటలో మునిగి మృతి కనగల్ మండలం పగిడిమర్రిలో ఘటన -
పోచంపల్లి జరూర్ ఆనా..
● కలెక్టర్ హనుమంతరావు భూదాన్పోచంపల్లి: తెలంగాణతో పాటు పోచంపల్లికి జరూర్ ఆనా అని కలెక్టర్ హనుమంతరావు సుందరీమణులను కోరారు. హంపి థియేటర్ జరిగిన ర్యాంప్వాక్ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేకమైన కళ అని, ఇది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. 2021లో యునెస్కో చేనేత ఉత్తమ హెరిటేజ్ విలేజ్గా పోచంపల్లి అంతర్జాతీయ అవార్డు పొందిందని గుర్తు చేశారు. భూదానోద్యమానికి శ్రీకారం చుట్టి లక్షలాది మంది పేదలకు భూదానం చేసిన గొప్ప గ్రామమని కొనియాడారు. భూదాన్పోచంపల్లికి సుందరీమణుల సందర్శనతో చేనేతకు మరింత గుర్తింపురావడమే కాకుండా చేనేత కళాకారులకు కూడ మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయని అన్నారు. చేనేత కళను సజీవంగా నిలుపుతున్న చేనేత కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. -
సౌదీఅరేబియాలో కోదాడ వాసి మృతి
కోదాడరూరల్: సౌదీఅరేబియాలో కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని కౌసర్నగర్కు చెందిన షేక్ తాజుద్దీన్(49) ఉపాధి కోసం పదేళ్ల కిందట సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడ దమామ్ పట్టణంలో నివాసముంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. నెల రోజుల క్రితం సౌదీఅరేబియాలో తనకు పరిచయం ఉన్న కపిల్ పేరు మీద తాజుద్దీన్ లైసెన్స్ తీసుకొని కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల తర్వాత షాపు లైసెన్స్ తన పేరు మీద ఉంది కావును షాపును తనకు అప్పగించి వెళ్లిపోవాలని కపిల్ తాజుద్దీన్ను బెదిరించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన తాజుద్దీన్ అనుమానాస్పదస్థితిలో కాలిపోయి చావుబతుకుల మధ్య ఉంటే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తాజుద్దీన్ మృతిచెందినట్లు అతడి స్నేహితులు ఫోన్ చేసి తాజుద్దీన్ కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తాజుద్దీన్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 3న అక్కడకు వెళ్లి..జనవరి 6న తాజుద్దీన్, అతడి భార్య షాజహాన్ కలిసి ఇండియాకు వచ్చారు. మార్చి 3న తిరిగి సౌదీఅరేబియాకు వెళ్లి రూ.10లక్షల అప్పులు తీసుకొచ్చి కూరగాయల షాపు పెట్టినట్లు తాజుద్దీన్ భార్య తెలిపారు. షాపు పెట్టిన తర్వాత కపిల్ షాపు తనకు అప్పగించాలని బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి జైలుశిక్ష చివ్వెంల(సూర్యాపేట): వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయ మూర్తి పి. లక్ష్మీశారద గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం దాచారం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్కు అదే మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామ శివారులో 14 గుంటల భూమి ఉంది. అందులో 2 గుంటల భూమిని 2005లో తుమ్మల పెన్పహాడ్ గ్రామానికే చెందిన సల్లగుండ్ల బజార్కు విక్రయించాడు. దాని పక్కనే మరో 3 గుంటల భూమిని 2020లో బోట్యా తండాకు చెందిన గుగులోతు బుజ్జ మ్మకు విక్రయించాడు. 2020 జూన్ 16న బుజ్జ మ్మకు విక్రయించిన భూమిని కొలిచేందుకు గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులను తీసుకుని వెళ్లాడు. భూమిని కొలుస్తుండగా.. పక్కనే భూమి ఉన్న సల్లగుండ్ల బజార్, అతడి భార్య యల్లమ్మ, కుమారుడు పవన్, అల్లుడు ఎర్ర సుమన్ అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నారు. తమకు విక్రయించిన భూమికి వాస్తు కోసం ఇంకా కొంత భూమి ఇవ్వాలని బొమ్మగాని శ్రీనివాస్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో నల్లగుండ్ల బజార్ బొమ్మగాని శ్రీనివాస్ గుండైపె బలంగా గుద్దడంతో శ్రీనివాస్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని అక్కడే ఉన్న పెద్దమనుషులు సూర్యాపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ విఠల్రెడ్డి సల్లగండ్ల బజార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపల్లి లింగయ్య వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడు సల్లగుండ్ల బజార్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. గుండెపోటుతో సీపీఎం నేత చిట్యాల బుచ్చిరెడ్డి మృతిచౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు చిట్యాల బుచ్చిరెడ్డి గుండెపోటుతో గురువారం మృతిచెందారు. రామన్నపేట తాలుకాలో సీపీఎం నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషిచేశారు. గీత కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. నక్సలైట్ల హిట్ లిస్ట్లో ఉన్నా కూడా ధైర్యంతో చౌటుప్పల్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం పంతంగి గ్రామంలో నిర్వహించనున్నట్లు సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి రత్నం శ్రీకాంత్ తెలిపారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డితో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండీ సలీం, భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ పాషా తదితరులు నివాళులర్పించారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయాలి
నార్కట్పల్లి : డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలం బి.వెల్లంల గ్రామంలో ఏర్పాటు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద డ్రైయినేజీ, విద్యుత్, తాగునీరు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని మొత్తం మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆస్పత్రిని తనిఖీ చేసి అక్కడి వైద్య సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, రోగులకు బెంచీలు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్కు సిబ్బంది వివరించడంతో తన నిధుల నుంచి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ వై,అశోక్రెడ్డి,. తహసీల్దార్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ విజయ్కుమార్, పలువురు అధికారులు,.సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కరువు నేలన జలసిరులు!
చెక్డ్యామ్లు, నీటి కుంటల్లో వర్షపు నీటి నిల్వ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటికి నిలకడ నేర్పితే కరువుఛాయలు దరిచేరవు. వాన నీటిని ఒడిసిపడితే జీవ వైవిధ్యం అలరారుతుంది. ఈ తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం, వరద, వృథా నీటిని నిల్వ చేస్తూ చెక్డ్యామ్లు, నీటి కుంటలు, కందకాలు నిర్మించడం ద్వారా ఏ కాలమైనా నీటికి ఢోకా ఉండడం లేదు. వీటి నిర్మాణంతో సాగునీటి సమస్య నుంచి రైతులు బయటపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పశుపక్ష్యాదులకు నిరంతరం నీరు దొరుకుతోంది. సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో ఆయా పల్లెలు కరువును జయించాయి. అష్టకష్టాల నుంచి గట్టెక్కి.. సూర్యాపేట మండలంలో గతంలో వేసవి ప్రారంభంలోనే ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తలాపున మూసీ నది ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క, పంటలు పండని పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. గత ప్రభుత్వం మూసీ నది కింద 9 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టి, ఆరింటిని పూర్తి చేసింది. టేకుమట్ల–2, రాయినిగూడెం–2, కాసారాబాద్–2 నిర్మాణం పూర్తి కాగా, ఝెడ్లపల్లి–1, కేటీ అన్నారం–1, కాసారాబాద్–1 నిర్మాణాలు పూర్తి కావొచ్చాయి. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలతో మండల పరిధిలోని భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు తాగునీటి సమస్య తగ్గిపోయింది. బోరు బావులు, ఊట బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటోంది. చెక్ డ్యామ్లలో నిల్వ ఉన్న నీటిని రైతులు మోటార్ల ద్వారా పొలాలకు తరలించుకుని పంటలు సాగుచేస్తున్నారు. చెక్ డ్యామ్లతో తీరిన నీటి సమస్య పెన్పహడ్ మండలంలో భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్డ్యామ్లు దోహదపడుతున్నాయి. మండలంలోని దోసపహాడ్, అనాజీపురం, నాగులపహాడ్ గ్రామాల పరిధిలోని మూసీ నదిపై ఆరు చెక్ డ్యామ్లు నిర్మించారు. వీటి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయ ఆధారిత బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రజలకు వేసవిలో తాగునీటి నీటి సరఫరాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ప్రతి వర్షపు చినుకు నీటిలో ఇంకేలా.. కరువు నేలలో జలాలను నిల్వ చేసి జీవం పోయడానికి పీఎం కృషి సంచాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకం కింద యాద్రాది భువనగిరి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని జనగాం, పుట్టపాక, వావిళ్లపల్లి, చిల్లాపురం, కొత్తగూడెం సహా 16 గ్రామాల్లో ఈ పథకాన్ని గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ ప్రతి వానచినుకు భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టారు. కొండలు, వాలు ప్రాంతాల్లో పైనుంచి వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చేలా చెక్డ్యామ్లు, ఊట చెరువులు నిర్మించారు. పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, కందకాల తవ్వకం చేపట్టారు. ఇప్పటి వరకు 68 పనులు పూర్తి చేశారు.శ్యామ్ప్రసాద్రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణ రిటైర్డ్ ఇంజనీర్ మేరెడ్డి శ్యామ్ ప్రసాద్రెడ్డి సూచనలతోనే నీటి సంరక్షణకు చర్యలు చేపట్టా. ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అర్థమయ్యేలా చెప్పారు. దాంతో 50 ఎకరాల చుట్టూ కందకాలు తవ్వించా. ఐదెకరాలకు ఒకటి చొప్పున నీటి గుంతలను తవ్వించా. అంతకు ముందు మా భూమిలో జియాలజిస్టులు బోర్లు పడవన్నారు. ఇప్పుడు అదే భూమిలో 3 బోర్లు వేశా. భూగర్భ జలాలు పెరిగి, నీరు బాగా పోస్తున్నాయి. – పాల్వాయి సత్యనారాయణరెడ్డి, చండూరు ఫ పెరుగుతున్న భూగర్భ జలాలు ఫ వేసవిలోనూ బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఫ తాగు, సాగునీటి సమస్యకు చెక్ ఫ నీటి సంరక్షణతో కరువును జయిస్తున్న పల్లెలు -
కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ
నల్లగొండ : కలెక్టరేట్లో రూ.40 కోట్ల వ్యయంతో 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి, ప్లస్ టు విధానంలో అదనపు బ్లాక్ నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని మౌలిక సదుపాయాలు, ఎలివేషన్, అత్యాధునిక డిజైన్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 250 సీట్ల సామర్థ్యం కలిగిన సమావేశ మందిరం సమీక్షలు, పెద్ద సమావేశాలకు సరిపోవడం లేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి దృష్టికి తీసుకుపోవడంతో అదనపు బ్లాక్ను మంజూరు చేయించారని తెలిపారు. నూతన అదనపు బ్లాకు నిర్మాణాన్ని పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్కుమార్, రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు శ్రీధర్రెడ్డి, ఫణిజా, గణేష్, జిల్లా రెవెన్యూ ఇన్చార్జి అధికారి వై.అశోక్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’కి విశేష స్పందన
గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఈనెల 5 నుంచి బుధవారం వరకు నిర్వహించిన రెవెనూ సదస్సుల్లో మొత్తం 1013 ధరఖాస్తులు వచ్చాయి. వాటిలో తెట్టెకుంట 1, అడివిబొల్లారం 8, మండలాపురం 5, నెల్లిబండ 4, చందంపల్లి 59, వల్లాభాపురం 3, పాలెం 56, తాటికల్ 42, గోరేంకలపల్లి 92, ఓగోడు 62, మంగళపల్లి 187, మర్రూర్ 41, చందుపట్ల 171, కడపర్తి 39, నకిరేకల్ 138, నోముల 105 దరఖాస్తులు వచ్చాయి. నకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నకిరేకల్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభించింది. ఈనెల 5 తేదీన ప్రారంభమైన ఈ సదస్సులు బుధవారం ముగిశాయి. ఈ సదస్సులో రైతులు వివిధ భూ సమస్యలపై 1,722 దరఖాస్తులు పంపిణీ చేయగా.. 1,013 మంది అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వీటిలో ప్రధానంగా మిస్సింగ్ సర్వేనంబర్, పీఓటీ, సాదాబైనామా తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను భూభారతి చట్టం ఆన్లైన్లో నమోదు చేశారు. వాటి విచారణ త్వరతగతిన పూర్తిచేసి జూన్ 1వ తేదీలోగా పరిష్కరించనున్నారు. కలెక్టర్ మానిటరింగ్.. భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నకిరేకల్ మండలాన్ని ఎంపిక చేసింది. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మండలాన్ని రెండు సెక్టార్లుగా విభజించారు. నకిరేకల్, కట్టంగూర్ తహసీల్దార్ల చెరో సెక్టార్కు అధికారులుగా నియమించి.. రెండు బృందాల ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 14వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రతి గ్రామంలో సాయంత్రం 4 గంటల వరకు అధికారులు అక్కడే ఉండి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సదస్సులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి మానిటరింగ్ చేశారు. పలు రెవెన్యూ సదస్సులో కలెక్టర్, ఆర్డీఓ స్వయంగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రైతులకు సహకరించేందుకు ఆయా గ్రామాల్లో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసి రెవెన్యూ సిబ్బంది దగ్గర ఉండి దరఖాస్తులను నింపి ప్రత్యేక పోర్టల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి జూన్ 1వ తేదీలోగా దరఖాస్తులు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించారు. ఫ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నకిరేకల్ మండలంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు ఫ మండల వ్యాప్తంగా భూ సమస్యలపై 1,013 దరఖాస్తులు ఫ జూన్ 1వ తేదీలోగా పరిష్కరించేలా ప్రణాళికదరఖాస్తుల విచారణ చేపడతాం మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేశాం. రైతులనుంచి ఎక్కువగా మిస్సింగ్ సర్వేనంబర్లు, సాధాబైనామా, భూముల విస్తీర్ణంలో మార్పులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసి.. వెంటనే విచారణ చేపడతాం. ఈ నెల 30వ తేదీలోగా అన్నింటినీ పరిష్కరిస్తాం. – జమీరుద్దీన్, తహసీల్దార్, నకిరేకల్ దరఖాస్తుల వివరాలు ఇలామిస్సింగ్ సర్వే నంబర్లు 479పెండింగ్ మ్యుటేషన్ 51డిజిటల్ సంతకం పెండింగ్ 12విస్తీర్ణంలో తేడాలు 66భూ వర్గీకరణ 26పేర్లలో తప్పుల సవరణ 09ప్రొహిబిటెడ్ ల్యాండ్ 04అసైన్డ్ల్యాండ్ 89ఇనాం భూములు 08పౌతి 29భూసేకరణ కింద 05ఇతర సమస్యలు 235మొత్తం 1,013 -
అందగత్తెలకు ఆతిథ్యం
పోచంపల్లికి 25 మంది అందాలభామలు ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే హాంఫి థియేటర్లో ప్రముఖ మోడల్స్చే నిర్వహించే ర్యాంప్ వాక్ను తిలకిస్తారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతి రూపొందించిన ఇండోవెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ కొనసాగనుంది. చేనేత ప్రాముఖ్యతను సుందరీమణులకు ప్రత్యేక యాంకర్స్ ద్వారా వివరిస్తారు. అలాగే పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్వరల్డ్ పోటీదారుల పర్యటనసాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలు పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు. సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు. ఫ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సుందరీమణులు ఫ టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియల పరిశీలన -
వాన నీటిని ఒడిసి పడుతున్న రైతు
వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చండూరు మండలానికి చెందిన రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి ప్రయత్నం అభినందనీయమే. తనకున్న భూమిలో ఆరేళ్ల కిందటే భూగర్భ జలాలను పెంపొందించేందుకు కందకాలు తవ్వించారు. నాలుగు ఎకరాల్లో ఫాం పాండ్లు, నీటిని నీటి గుంతలు తవ్వించారు. ఎండలు మండుతున్నా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నీటి నిల్వలు అలాగే ఉన్నాయి. ఆ నీటితోనే వ్యవసాయ క్షేత్రంలో మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం, నిమ్మ తోటలు, జొన్న చేను సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా టమాట, కర్బూజ, బూడిద గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నారు. అంతేకాదు వేప, జామాయిల్, కానుగ చెట్లను సైతం పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రం అంతా పచ్చదనంతో నిండిపోయింది. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల జాబితాపై విచారణ
నిడమనూరు : మండలంలోని నారమ్మగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఇటీవల స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్తో పాటు ఎంపీడీవో రమేష్, పంచాయతీ రాజ్ ఏఈ సాయిప్రసాద్ విచారించారు. నిబంధనల ప్రకారం, నాలుగు చక్రాల వాహనం, పక్కా ఇల్లు, వ్యవసాయ భూమి వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విలేజ్ పోలీస్ వ్యవస్థతో మెరుగైన సేవలు నల్లగొండ : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పైఅధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు, పోలీసులకు సత్సంబంధాలు ఏర్పడితే నేర నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. డ్రగ్స్తో వచ్చే అనర్థాలు, నేర నియంత్రణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించిన ఏడుగురు గ్రామ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. 29 నుంచి రైతులకు అవగాహనత్రిపురారం : విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 12వ వరకు జిల్లా వ్యాప్తంగా రైతులకు కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ఆధ్వర్యంలో పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని కేవీకే కంపాసాగర్ ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తన రకాలు, ఎంపిక వంటి అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
జేఎల్ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు చర్చలు
హుజూర్నగర్: విద్యుత్ సంస్థలోని 2023 బ్యాచ్ జేఎల్ఎం జీత వ్యత్యాసాన్ని సరిచేసేందుకు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం(టీఆర్వీకేఎస్) రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఎస్పీడీసీఎల్ కార్యదర్శి పి. కరెంట్రావు తెలిపారు. మంగళవారం హుజూర్నగర్ విద్యుత్ డివిజన్ ఆధ్వర్యంలో మే డే పక్షోత్సవాలలో భాగంగా డీఈ కార్యాలయం ముందు యూనియన్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ల కన్వెర్షన్ కోసం యూనియన్ కృషిచేస్తుందని అన్నారు. త్వరలో జరగబోయే సబ్ ఇంజనీర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా మల్టీపుల్ ఛాయిస్లో ఇచ్చే విధంగా యాజమాన్యంతో మాట్లాడతామని చెప్పారు. ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి. రమేష్బాబు, పి. మల్లికార్జున్, బి. విశ్వనాథచారి పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండ పట్టణంలో 11 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 5,203 మంది విద్యార్థులకు గాను 2,472 మంది బాలురు, 2,278 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. 453 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కోఆర్డినేటర్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. -
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
భువనగిరిటౌన్: డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను భువనగిరి పట్టణంలోని నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం పోలీసులు, బజరంగ్దళ్ నాయకులు పట్టుకున్నారు. ఏపీలోని కాకినాడ నుంచి డీసీఎంలో 16 గోవులను ఎక్కించి వాటి పైనుంచి కొబ్బరి పొట్టు కప్పి హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని చెక్పోస్ట్లు ఏర్పాటు చేయాలని, గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బజరంగ్దళ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నెమల నవీన్ కోరారు. సాంకేతిక కోర్సుల్లో ఉచిత శిక్షణభూదాన్పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో మేథా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 6 నెలల కాలవ్యవధి కల్గిన ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలార్సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సుకు ఐటీఐ లేదా ఏదేని డిప్లమా పాసై ఉండాలని అన్నారు. కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ అండ్ సీసీ టీవీ టెక్నిషియన్ కోర్సుకు పదవ తరగతి విద్యార్హత కల్గి ఉండాలని అన్నారు. అలాగే టైలరింగ్ ఎంబ్రాయిడరీ, జర్ధోజీ క్విల్ట్ బ్యాగుల తయారీ కోర్సుకు మాత్రం 8వ తరగతి పాసైన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్ వసతి కూడా కల్పించబడుతుందని అన్నారు. అంతేకాక శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. అయితే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మయస్సు కల్గి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 16న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్కు నేరుగా హాజరు కావలెయునని తెలిపారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. స్వర్ణగిరి క్షేత్రంలో వైభవంగా నిత్య కల్యాణంభువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో పద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి నిత్య కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, దీపాలంకరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
టెండర్ల దశలోనే.. సుందరీకరణ!
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025అనుమతి లేని స్కూళ్లలో పిల్లలను చేర్పించవద్దునల్లగొండ : ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో పిల్లలను చేర్చవద్దని డీఈఓ భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తల్లిదండ్రులకు సూచించారు. నల్లగొండలోని జయ హైస్కూల్, ఎలైట్ స్కూల్, లిటిల్ స్కాలర్స్ హైస్కూల్, వేదాంత్ హైస్కూల్స్కు ప్రభుత్వ అనుమతి లేదని ఈ పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని పేర్కొన్నారు. జూన్ నాటికి మొక్కలు సిద్ధం చేయాలినాంపల్లి : జూన్ నెల నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. నాంపల్లి మండలంలోని దామెర గ్రామంలో నర్సరీని, పెద్దాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్లో నిర్వహించే వనమహోత్సవం నాటికి మొక్కలు నాటేందుకు సిద్ధండా ఉండాలన్నారు. గ్రామాల్లో ఉపాధిహమీ కూలీలకు రోజూ రూ.307 కూలి వచ్చే విధంగా పనులను కల్పించాలని అధికారులు సూచించారు. పండ్ల తోటలను పెచుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి పోత్సహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఏపీడీ యామిని, ఇందిరా, ఎంపీడీఓ శర్మ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం వినోద్ తదితరులు ఉన్నారు. ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడపొద్దునల్లగొండ : ఫిట్నెస్ లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవని డీటీసీ ఎన్.వాణి హెచ్చరించారు. మంగళవారం ఆర్టీఏ కార్యాలయంలో స్కూల్ బస్ యజమానులు, డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 2011, జీఓ 35 ప్రకారం పాఠశాల, కళాశాలలకు వినియోగించే వాహనాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. బస్సుపై పాఠశాల పేరు, ఫోన్ నంబర్ ఉండాలని, డ్రైవరు, కండక్టర్లు యూనిఫాం ధరించాలని సూచించారు. విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత యజమానులదే అన్నారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంవీఐ లావణ్య, చంద్రశేఖర్, ఏఎంఈవై సతీష్, సోని ప్రియ, ఉషశ్రీ, చిరంజీవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడికి ఆకుపూజయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో చెరువుల సుందరీకరణ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కటకట ఉందనే ప్రచారం, గత ప్రభుత్వ హయాం నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు సరైన సమయంలో చెల్లింపులు జరపడం లేదనే కారణంగా కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న 9 చెరువులను రూ.34 కోట్లతో సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. చెరువుల వద్ద సుందరీకరణ చేపట్టడం ద్వారా పట్టణాల అభివృద్ధికి, ప్రజల ఆహ్లాదానికి ఉపయోగ పడనుంది. ఇందుకోసం ప్రజారోగ్య శాఖ కార్యాలయ అధికారులు ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. త్వరలోనే ఈఎన్సీ నుంచి అనుమతి తీసుకొని మరోసారి టెండర్లు పిలిచేందుకు సంబంధితశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. మూడోసారి అయినా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేనా అనే చర్చ లేకపోలేదు. తొమ్మిది చెరువుల సుందరీకరణ.. మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తరహాలో అంతటా చెరువులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని 9 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో రెండు చెరువుల చొప్పున మిగతా ఐదు మున్సిపాలిటీల్లో ఒక్కో చెరువును అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. కాగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. చిట్యాల మున్సిపాలిటీలో ఉన్న చిన్నది కాగా.. మిర్యాలగూడ పట్టణంలో 429 ఎకరాల పెద్ద చెరువును సుందరీకరించనున్నారు. చెరువు విస్తీర్ణం, కట్ట వెడల్పును బట్టి ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.34 కోట్లతో ప్రతిపాదనలు.. మున్సిపాలిటీలోని 9 చెరువులను అభివృద్ధి చేయడానికి ప్రజారోగ్య శాఖ అధికారులు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినా అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.34 కోట్లతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. అభివృద్ధిలో భాగంగా చెరువుల కట్టల వెడల్పు, గ్రీనరీ ఏర్పాటు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, బేంచీల ఏర్పాటు, గ్రీనరీ, లైటింగ్, పూల మొక్కల ఏర్పాటు, అంతా పచ్చగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ప్రజలు రోజూ అక్కడికి వచ్చి గడిపేందుకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించనున్నారు. నాగార్జునకొండను సందర్శించిన బౌద్ధ భిక్షువులునాగార్జునసాగర్: బెంగళూరు సారా బౌద్ధవిహార్కు చెందిన బౌద్ధ భిక్షువులు మంగళవారం నాగార్జునకొండను సందర్శించారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా నవాంగ్ జుంగ్నే బౌద్ధ గురువు ఆధ్వర్యంలో సాగర్కు వచ్చారు. ఈ బృందం మొదటగా బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టూరిజం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. బోధి వృక్షం కింద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. న్యూస్రీల్ ఆరేళ్లుగా.. అలాగే..!త్వరలోనే టెండర్లు పిలుస్తాం జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9 చెరువులను గుర్తించి సుందరీకరించడానికి టెండర్లు పిలిచాం. రూ.34 కోట్లతో చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించా. గతంలో టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలుస్తాం. – కందుకూరి వెంకటేశ్వర్లు, ప్రజారోగ్యశాఖ ఎస్ఈ సుందరీకరణ చేపట్టనున్న చెరువుల వివరాలు చెరువు మున్సిపాలిటీ నిధులు (రూ.కోట్లలో..) వల్లభరావు చెరువు నల్లగొండ 3.53మోతికుంట నల్లగొండ 0.61చిన్న చెరువు మిర్యాలగూడ 2.99పెద్ద చెరువు మిర్యాలగూడ 14.64బొమ్మరికుంట చిట్యాల 0.65శాగనకుంట చండూరు 2.64తుల్చమ్మకుంట దేవరకొండ 0.95రామసముద్రం హాలియా 5.95కలవోనికుంట నకిరేకల్ 1.87ఫ మున్సిపాలిటీల్లో 9 చెరువుల అభివృద్ధికి రూ.34 కోట్లతో ప్రణాళిక ఫ రెండుసార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు ఫ ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు ఆలస్యమే కారణం ఫ మరోసారి టెండర్లు పిలవనున్న ప్రజారోగ్య శాఖ ఫ సుందరీకరణ పూర్తయితే పట్టణ ప్రజలకు దక్కనున్న ఆహ్లాదం -
కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
తిప్పర్తి: నల్లగొండ కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి నిరుద్యోగ యువతను మోసం చేసిన ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను తిప్పర్తి పోలీస్ స్టేషన్లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్ నల్లగొండ కోర్టులో అడ్వకేట్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. అదే కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న గాజుల జ్యోతి, నసీర్ కలిసి కోర్టుకు వచ్చే నిరుద్యోగ యువతకు కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి 31 మంది నుంచి రూ.10.32లక్షలు వసూలు చేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన ఏపూరి హెబ్సిబా ఈ నెల 7వ తేదీన తిప్పర్తి పోలీస్ స్టేషన్లో వీరిద్దరిపై ఫిర్యాదు చేసింది. శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందుతులిద్దరిని మంగళవారం అదుపులో తీసుకున్నారు. వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో 4 కేసులు, నల్లగొండ వన్టౌన్లో 3 కేసులు మొత్తం 7 కేసులు నమొదయ్యాయి. వీరి నుంచి 2 సెల్ఫోన్లు, బైక్, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్, పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ సాయిప్రశాంత్, ఏఎస్ఐ లింగయ్య, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, రాజీవ్, రాంరెడ్డి, నాగరాజు, సూరిబాబు పాల్గొన్నారు. ఇద్దరి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు -
ఆకటు్టకోనున్న శిల్ప కళ
యాదగిరిగుట్ట : హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాలకు చెందిన 10మంది సుందరీమణులు గురువారం యాదగిరిగుట్టను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా నల్లరాతి శిల్పాలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న యాదగిరీశుడి ఆలయాన్ని అందాల భామలు పరిశీలించి ఇక్కడే ఫొటో షూట్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా డాక్యుమెంటరీ చిత్రీకరించి విశ్వ వ్యాప్తంగా యాదగిరి క్షేత్ర ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక భావనే..యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలో ఎటూ చూసినా అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయి. తూర్పు రాజగోపుర మహాద్వారం నుంచి ఆలయంలోని ప్రవేశించినప్పటి నుంచి సుందరీమణులను గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లనుంది. ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లే క్రమంలో మెట్లకు ఇరువైపులా గల శంకు చక్ర నామాలు, దశావతారాలు, హనుమంతుడు, గరుడ్మంతుడు, పంచనారసింహులు, రామానుజులు, యాదవ మహార్షి, ప్రహ్లాదుడు, మహా విష్ణువు, అష్టలక్ష్మి శిల్పాలతో ఆలయానికి ప్రత్యేక కళ వచ్చింది. మెట్లదారికి ఇరువైపులా చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇన్నర్, ఔటర్ ప్రాకారాల్లో ఏర్పాటు చేసిన యాలీ ఫిలర్లు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాల్లో పొందుపర్చిన దేవతామూర్తుల విగ్రహాలు, గర్భాలయం ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను పంచలోహ శిల్పాలు సుందరీమణులను ఆకట్టుకోనున్నాయి. ఆలయంలోని ప్రతి పిల్లర్కు ఒక్కో ఆళ్వారుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెరి ఆళ్వార్, పెగయ్ ఆళ్వార్, భూదత్ ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్, నంబి ఆళ్వార్, పే ఆళ్వార్, కులసేఖర్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తొండర పొడియా ఆళ్వార్, ఆండాల్ అమ్మవార్ల విగ్రహాలు, ఆళ్వార్ పిల్లర్ల పైన కాకతీయ శైలితో స్తంభాలను నెలకొల్పిన తీరు అందాల భామలను కనువిందు చేయనున్నాయి. రేపు యాదగిరిగుట్టకు రానున్న సుందరీమణులు -
దేశ వ్యాప్త సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు
నకిరేకల్: కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లోని ఓ ఫంక్షన్ హాల్ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలుచేయడం లేదన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రబాకర్, ఆయా సంఘాల నాయకులు బొజ్జ చినవెంకులు, వంటేపాక వేంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, సింగం రేణుక, ఉయ్యాల సైదులు, గోర్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మునుగోడు నుంచే విద్యుత్ సంస్కరణలు
చౌటుప్పల్ : నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం త్వరలోనే విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకురానుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఆయా సంస్కరణలను మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ ముష్రాఫ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.34 కోట్లు ఖర్చవుతాయని గుర్తించామని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్శాఖలో పనిచేసే అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని, ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలన్నారు. సీఎండీ ముష్రాఫ్ మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మారుస్తామని తెలిపారు. వ్యవసాయ డీపీఆర్లకు ఏబీ స్విచ్లు పెంచుతామన్నారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
కార్మిక రంగం బలోపేతానికి కృషి చేయాలి
నాంపల్లి: కార్మిక రంగం బలోపేతానికి కేంద్రం కృషిచేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మద్దతు ధర కల్పించేందుకు గాను చట్టం తేచ్చేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికే రూ.లక్ష కోట్లు కేటాయించిందని, డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసి డిండి ఎత్తిపోత పథకానికి నిధులు కేటాయించి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నం చేసిందన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎనుకున్నారు. మండల కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా సూదనబోయిన రమేష్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాగిపాణి ఆంజాచారి, రమేష్, జగన్, గిరి, రమా, కోరె సత్తయ్య, మహేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి -
నాణ్యమైన విత్తనాలు అందించాలి
నల్లగొండ టౌన్ : రైతులకు వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఎన్డీసీఎంఎస్లో పచ్చిరొట్ట విత్తనాల విక్రయాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. పిల్లి పెసర, జీలుగ, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకందారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ను టీఎన్జీవోస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బిజినెస్ మేనేజర్ నాగిల్ల మురళి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి జె.శేఖర్రెడ్డి, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
మిర్యాలగూడ టౌన్ : డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు త్వరలోనే బయోమైనింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాంనగర్ బంధం వద్ద ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డును పరిశుభ్రంగా ఉంచి పర్యటక కేంద్రంగా ఉండేలా చూడాలన్నారు. అదే విధంగా జడ్చర్ల–కోదాడ ప్రధాన రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు వెంటనే రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 9 మంది ఎన్ఎంఆర్లు ఉంటే వారిలో నలుగురు మృతి చెందారని, ఉన్న వారిని పర్మినెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల 31వ వరకు పొడిగించిందన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసుఫ్, ఆర్ఓ జ్ఞానేశ్వరీ, టీపీఎస్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, శంకర్, ఏఈ అనిల్, వినోద్, చరణ్ తేజ్, శ్వేతారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ -
ఎండల్లో హాయ్.. హాయ్..
సూర్యాపేట అర్బన్, నల్లగొండ టూటౌన్: వేసవి సెలవులను వృథా చేయకుండా చిన్నారులు ఏదో ఒక సాధనలో నిమగ్నమయ్యారు. కొందరు వేసవి క్రీడా శిబిరాలకు వెళ్లి తమకు ఇష్టమైన ఆటల్లో మెలకువలు నేర్చుకుంటుంటే, కొందరు అమ్మమ్మ వాళ్ల ఊళ్లకు చెరువులు, బావుల్లో ఈత నేర్చుకుంటున్నారు. పట్టణాల్లో ఉండే చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్చుకుంటూ వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్లో ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. యువకులు కూడా వేసవి తాపానికి తాళలేక సాయంత్రం వేళ స్విమ్మింగ్ పూల్కు వచ్చి ఈత కొడుతున్నారు. ఉదయం 30 నుంచి 40 మంది, సాయంత్రం 60 నుంచి 70 మంది పిల్లలు ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. గంటకు రూ.80 నుంచి రూ.100 చెల్లిస్తున్నారు. నెల రోజులకు అయితే ఒక్కొక్కరికి రూ.2,000 వరకు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు తీసుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రమయ్యేసరికి ఈత కొలను చిన్నారులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో గల స్విమ్మింగ్ పూల్లో సైతం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులు, చిన్నారులు వచ్చి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్నా ఆత్మరక్షణ కోసం సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటున్నాను. 15 రోజుల నుంచి ఇక్కడకు వస్తున్నాను. మొదట గాలి ట్యూబ్ సహాయంతో ఈత కొట్టాను. ప్రస్తుతం కొంచెం కొంచెంగా ట్యూబ్ లేకుండా ఈత కొట్టగలుగుతున్నా. – సూర్యతేజ్ ఎంతో సరదాగా ఉంది వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.. నేను 20 రోజులుగా స్విమ్మింగ్ పూల్కు వచ్చి మా నాన్న సహాయంతో ఈత నేర్చుకుంటున్నాను. ఈ వేసవి సెలవులు అయిపోయే లోపు ఈత నేర్చుకుంటా. ఎండ వేడికి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం భలే సరదాగా ఉంది. – వేదశ్రీఈత వల్ల ఎన్నో లాభాలు చిన్నపిల్లలకు ఈత నేర్పడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చెరువులు, బావుల దగ్గరికి వెళ్లినప్పుడు వాటిల్లో మునిగిపోకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఈతరాక అనేక మంది పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈత కొట్టే పిల్లలు శారీరకంగా కూడా ధృఢంగా ఉంటారు. పిల్లలకు ఈత నేర్పడం చాలా అవసరం. – లక్కరాజు ప్రవీణ్, స్నేహనగర్, సూర్యాపేటట్యూబ్లతో సాధన స్విమ్మింగ్ పూల్స్లో చిన్నారులు ట్యూబ్ల సహాయంతో ఈత సాధన చేస్తున్నారు. సూర్యాపేటలోని స్విమ్మింగ్ పూల్లో వీరికి శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు శిక్షకులను సైతం పూల్ నిర్వాహకులు నియమించారు. అదేవిధంగా ఇద్దరు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం పిల్లలు ఈత కొట్టే విధానాన్ని, ఎవరూ పూల్లో మునిగిపోకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా దుస్తులు మార్చుకోవడానికి నాలుగు గదులు కూడా ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ పూల్స్లో ఈత నేర్చుకుంటూ సరదాగా గడుపుతున్న చిన్నారులు ఆత్మరక్షణ కోసం పిల్లలకు ఈత నేర్పిస్తున్నామంటున్న తల్లిదండ్రులు -
అర్బన్ దరఖాస్తులు.. రూరల్ పరిధిలోకి!
నల్లగొండ టూటౌన్ : నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు నీలగిరి మున్సిపాలిటీకి చెందినవి నల్లగొండ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లాయి. నీలగిరి పట్టణానికి చెందిన 1200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లడంతో వారికి రుణాల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులకు చెందిన యువత రాజీవ్ యువ వికాసం పథకం కింద ఉపాధి కల్పన కోసం రుణం వస్తదనే ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. నీలగిరి మున్సిపల్ లాగిన్లో నమోదు చేసుకున్న వారు 5,626 మంది ఉన్నారు. ఎంపీడీఓ లాగిన్లో పడిన వారిని కలుపుకుంటే 6826 దరఖాస్తులు అవుతాయి. ఆన్లైన్లో తప్పుగా నమోదు.. రాజీవ్ యువ వికాసం కింద రూ.50 వేలు అయితే బ్యాంకుతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా మున్సిపల్ కమిషనర్లకు పంపించి లబ్ధిదారులకు చెక్ రూపం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది మంజూరైతే తిరిగి రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. రూ.లక్ష దాటితే బ్యాంకు ద్వారా రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రుణాల కోసం యువత మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంది. మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకునే సమయంలో జరిగిన తప్పుల వల్ల వారి దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లిపోయారు. దీని కారణంగా 1200 మందికి రాజీవ్యువ వికాసం కింద రుణం మంజూరయ్యే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వాటిని మున్సిపాలిటీకి బదిలీ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరినా వారి నుంచి స్పందన లేదు. ఇటు మున్సిపాలిటీ కానీ, అటు ఎంపీడీఓ కార్యాలయం అధికారులు గానీ దీని గురించి సీరియస్గా పట్టించుకోకపోవడంతో యువతకు రుణం మంజూరు కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయం చాలా మంది దరఖాస్తుదారులకు తెలియకపోవడంతో వారు రుణం వస్తదనే ఆశతోనే ఉన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులను మున్సిపాలిటీ లాగిన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ లాగిన్లోకి మార్పిస్తాం నల్లగొండ పట్టణానికి చెందిన యువత దరఖాస్తులు నల్లగొండ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లింది వాస్తవమే. ఎంపీడీఓతో మాట్లాడి వారి లాగిన్ నుంచి మున్సిపాలిటీ లాగిన్లోకి తీసుకువచ్చి అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తాం. – శ్రీనివాస్, మెప్మా టీఎంసీ ఫ 1200 మంది రాజీవ్ యువవికాసం దరఖాస్తుల మార్పు ఫ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్లినట్లు నిర్ధారణ ఫ వాటిని మార్చకుంటే యువతకు రుణం రానట్టే.. -
14 నుంచి ఎంజీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్టికెట్ లేదా నూతన హాల్టికెట్తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని తెలిపారు. కళాశాల గుర్తింపు కార్డు, ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సమ్మె విరమణరామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ 40 రోజులుగా చేపట్టిన సమ్మెను సోమవారం విరమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి.. డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. సమ్మె విరమించడంతో యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విషయంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలి కృతజ్ఞతలు తెలిపారు. రహదారి వెంట విద్యుత్ కాంతులు● సుందరీమణుల కోసం కాకుండా.. నిత్యం వెలిగేలా చూడాలంటున్న ప్రజలు పెద్దవూర : బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరీమణులు ప్రపంచ పర్యాటక ప్రదేశమైన నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శనకు సోమవారం వచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా మండల కేంద్రంలోని నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట డివైడర్ల పొడవునా సుమారు రూ.25 వేల వ్యయంతో రకరకాల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రోడ్డు వెంట పేరుకుపోయిన చెత్తాచెదారం, డివైడర్ల వెంట మొలిచిన పిచ్చిమొక్కలను పారిశుద్ద్య కార్మికుల చేత తొలగింపజేశారు. డివైడర్ల వెంట ప్రధాన రహదారి మధ్యలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలకు మరమ్మతు చేసి వెలిగించారు. ప్రపంచ సుందరీమణులు వచ్చినప్పుడే కాకుండా నిత్యం ప్రధాన రహదారి వెంట శుభ్రం చేసి విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని మండల కేంద్రంలో ప్రజలు అంటున్నారు. -
నకిలీ విత్తనాలపై నజర్
నల్లగొండ అగ్రికల్చర్ : నకిలీ పత్తి విత్తన అమ్మక వ్యాపారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్పోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఎస్పీ, వ్యవసాయ శాఖ అధికారి రెవెన్యూ అధికారి సభ్యులుగా డివిజన్ స్థాయిలో డీఎస్పీ, ఆర్డీఓ, ఏడీఏ సభ్యులుగా, మండల స్థాయిలో ఎస్ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి సభ్యులుగా కమిటీలను నియమించింది. ఈ కమిటీలు నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించనున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మిన, రవాణా చేసిన వారిపై కేసులను నమోదు చేసి చర్యలు తీసుకోనుంది. గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు.. జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటి అమ్మకాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏటా నిఘా పెట్టినా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు తమ అమ్మకాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసే రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నకిలీ విత్తనాల ఆటకట్టించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. విత్తన వ్యాపారుల అండదండలతో.. జిల్లాలోని ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన విత్తన వ్యాపారులు.. దళారులకు అండగా నిలిచి నకిలీ విత్తన వ్యాపారులకు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. ఆయా వ్యాపారులు తమ కంపెనీ బ్రాండెడ్ విత్తనాల అమ్మకం పేరుతో నకిలీ విత్తనాలను దళారుల ద్వారా రైతులకు అంటకట్టడంలో భాగస్వాములవుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వ్యాపార సంస్థలే ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్పోర్స్ కమిటీలు ఫ విత్తనాల అమ్మకంపై నిరంతరం నిఘా ఫ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ సూచన దళారులను నమ్మి మోసపోవద్దు దళారుల మాటలు నమ్మి రైతులు రైతులు మోసపోవద్దు. 450 గ్రాముల బ్రాండెడ్ కంపెనీ విత్తన ధర రూ.901 మాత్రమే. దాని కన్నా ఎక్కువ ధర చెల్లించవద్దు. విత్తనాలు కొన్న వెంటనే రశీదు తీసుకోవాలి. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వ్యవసాయాదికారులకు సమాచారం అందించాలి. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బ్రాండెడ్ కవర్లలో నింపి.. గ్రామాల్లో ఎరువులు, విత్తనాల వ్యాపారులు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, గుర్రంపోడు, హాలియా తదితర మండలాల్లో ఈ దందా కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లా బూత్నూరు, గద్వాల, ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల, మాచర్ల తదితర ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లుల నుంచి లూజ్ విత్తనాలు దళారులు కొనుగోలు చేసి వాటిని రంగురంగుల బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి బ్రాండెడ్ విత్తనాల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన జర్మినేషన్ లేని విత్తనాలను కూడా ఆ బ్రాండెడ్ కంపెనీ కవర్లలో ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. బీటీ 3, గ్లైసెల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించినా.. ఆ విత్తనాలను కూడా రైతులకు అంటగడుతున్నారు. -
మట్టపల్లిలో వైభవంగా తిరుకల్యాణోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారు జామున వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు,తలంబ్రాలను సమర్పించి నిండు వైశాఖ పౌర్ణమి వెన్నెలలో కల్యాణతంతు జరిపించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, అశ్వ వాహనాలపై అశేషభక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణమండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి యాదాద్రి కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తిలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్లు శ్రీస్వామివారికి సమర్పించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం కల్యాణమూర్తులకు శ్రీమన్నారాయణమూర్తి అలంకారంలో గరుడవాహన సేవను నిర్వహించారు. -
ఈఏపీసెట్లో ‘శ్రీచైతన్య’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం అభినందించి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో వి. కుషాల్ 28వ ర్యాంకు, వై. నిషాంత్ 61, డి. దుర్గా గుజిరి 222, ఏ. సాయితేజ 253, కె. విశావని వాగ్దేవి 301, బి. రిషిత 321, ఆర్. జోష్ణవ్ కుమార్ 334, కె. సాయిదివ్య వర్షిత 423, జి. సాయి ప్రణవి 491, కె. హాసిని 575, వి. ప్రణతి, కె.తేజస్విని 653, బి. ఈశ్వర్ గుప్తా 855, యు. వశిష్ఠ 908, బి. మనిశేషు 968, డి. శ్రీలేఖ 1195, పి. స్మైలికరెడ్డి 1262, కె. నిషాంత్రెడ్డి 1394, ఎల్. మనోహర్ 1422, జి. అలేఖ్య 1482వ ర్యాంకు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ బి. సాయిగీతిక, డీజీఎం సీహెచ్. చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ వర్మ, డీఎన్ జె. కృష్ణ, ఏజీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
గోమాత.. జాతీయ జెండాలతో గిరి ప్రదక్షిణ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయ కొండ చుట్టు ఆదివారం భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీస్వామి వారి జయంతి సందర్భంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, ధర్మం కోసం అంటూ గోసేవ ఫౌండేషన్ నిర్వాహకులు గోమాతతో పాటు జాతీయ జెండాలు, కాషాయం జెండాలతో భక్తులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. 5వేలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మెట్ల దారి మార్గంలో వెళ్లి శ్రీస్వామిని దర్శించుకున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎ.శరత్, ఈవో వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
సైన్యం పిలిస్తే.. వెళ్లడానికి సిద్ధం
పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాలి – నర్సింగ్ మార్క్, మాజీ సైనికుడునల్లగొండ : పాకిస్తాన్ మొదటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడటం భారత దళాలు వారికి బుద్ధి చెప్పడం, తోక ముడిచి వెనుదిరగడం పాకిస్తాన్కు అలవాటే. పాకిస్తాన్తో ఇప్పటికై నా తాడోపేడో తేల్చుకోవాలని అంటున్నారు మాజీ సైనికుడు, సెక్షన్ కమాండర్ నర్సింగ్ మార్క్. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్ మార్క్ 1984లో ఆర్మీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్లోని సావ్గర్లో ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకుని జమ్ముకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్, నేపాల్, కేరళ తదితర ప్రాంతాల్లో పని పని చేశారు. 2004లో రిటైర్ అయ్యారు. శత్రువు మీద గురి పెట్టడమే లక్ష్యం..చేతిలో తుపాకి ఎదురుగా ఉన్న శత్రువు మీద గురిపెట్టడం ఒకటే లక్ష్యంగా సైనికులు పోరాడుతారు. సైనికుడు లక్ష్యాన్ని చేధించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు. పోరాడి వీరమరణం పొందుతాడే తప్ప శత్రువు చేతికి చిక్కే పరిస్థితి తెచ్చుకోరు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యుద్ధంలో ‘జవాన్కు ఆఖరి గోలి ఆఖరి దుష్మన్’ అనే విధానం ఆఖరి తూటాతో శత్రువును నాశనం చేయడం.. అవకాశం లేకపోతే శత్రువుల చేతిలో చంపకుండా తనకు తానే కాల్చుకుని వీరమరణం పొందుతాడు తప్ప వెన్ను చూపడు. ఆ విధంగా ప్రతి సైనికుడు యుద్ధంలో పోరాడుతాడు. కార్గిల్ యుద్ధంలో సెక్షన్ కమాండర్గా పని చేశా..1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో నేను సెక్షన్ కమాండర్గా పని చేశా. హిమాలయాల్లో టైగర్ హిల్స్పై ఆరు నెలలు ఉన్నాం. మంచు పర్వతమిది. మంచినీళ్లు కూడా ఉండవు. మంచుని కరిగించుకుని తాగాలి. వంట చేసుకోవాలన్న అక్కడ ఉన్న మంచుగడ్డలను గిన్నెలో వేసి నీరుగా మార్చిన తర్వాతే వంట చేసుకోవాలి. ఒక్కోసారి తిండి లేకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైగర్ హిల్స్పై పైకి ఒకసారి వెళ్లామంటే ఆరు నెలలకు అవసరమైన అన్ని అహార పదార్థాలు, మెడిసిన్ తీసుకెళ్లాలి. అత్యవసరమైతే పైనుంచి హెలికాప్టర్లో వచ్చి పైనుంచి కిందకు వదులుతారు. సమాచార వ్యవస్థ కూడా అసలు ఉండదు. కార్గిల్ యుద్ధంలో శత్రువులు మా వైపు రాకుండా ముందే మైన్ ఎం14, ఎం16లను భూమిలో పాతిపెట్టేవాళ్లం. వెంట్రుక లాంటి వైర్లును అమర్చాం. అయితే శత్రువులు అటుగా ఆ మైన్లను దాటి వస్తే ఆ వైర్కు కాలు తగిలినా.. మైన్ మీద కాలు పెట్టినా అది పేలిపోతుంది. అలా శత్రువుల ఆట కట్టంచే వాళ్లం. మళ్లీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంపాకిస్తాన్తో మళ్లీ యుద్ధం జరిగిన సమయంలో.. నన్ను పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. నేను ట్రెయిన్డ్ జవాన్ను. ఎప్పుడైనా దేశం రక్షణ కోసం జరిగే యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంటాను. మాతో పాటు చాలా మంది మాజీ సైనికులు సిద్ధంగా ఉన్నారు.దేశసేవ చేయడం అదృష్టం – లక్క లింగారెడ్డి, మాజీ సైనికుడు పెద్దవూర : దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలి. అది అందరికీ రాదు అని చెబుతున్నారు ఇండియన్ ఆర్మీలో 19 ఏళ్ల పాటు దేశానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన లక్క లింగారెడ్డి. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన లింగారెడ్డి. తల్లింద్రులకు ఒక్క కుమారుడు. ఆర్మీలో చేరవద్దని తల్లిదండ్రులు ఎంత వద్దని వారించినా దేశానికి సేవ చేయాలన్న తలంపుతో 2003లో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబర్లో రిటైర్ అయ్యారు. 19 ఏళ్లు సైన్యంలో పనిచేశా..ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ)లో ట్రైనింగ్ చేసి 47 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్లో పోస్టింగ్కు వెళ్లా. తన సర్వీసులో ఆరున్నర సంవత్సరాలు జమ్మూ కశ్మీర్లో పనిచేశా. మూడు సంవత్సరాలు ఉగ్రవాదులను ఏరివేసే స్పెషల్ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్(25 రాష్ట్రీయ రైఫిల్స్)లో పనిచేశా. ఆ సమయంలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నా. 19ఏళ్లు సైన్యంలో పని చేసి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వచ్చిన సమయంలో గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు రెండు కిలోమీటర్ల వరకు ఎదురొచ్చి కుంకుమ దిద్ది, హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రెండు కిలోమీటర్లు పూలు చల్లుతూ బాణాసంచా కాల్చుతూ, నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఆ అనుభూతిని నేను జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ధైర్యంగా, విరోచితంగా, సాంకేతికతతో పోరాడుతోంది. యుద్ధం వల్ల దేశానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్లో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉంటాయి. యుద్ధ సమయంలో తన అవసరం ఉందని సైన్యం పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నా. దేశ సేవ చేసే అదృష్టం అందరికీ రాదు మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి‘ఆపరేషన్ సిందూర్తో భారత జవాన్లు గట్టిగా పోరాడుతున్నారు. ఎప్పుడు యుద్ధం జరిగినా సైన్యం పిలస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉంటాం. దేశరక్షణ కోసం ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తుంటాం. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావించాం. అది అందరికీ రాదని చెబుతున్నారు’ మాజీ సైనికులు నర్సింగ్ మార్క్, లక్క లింగారెడ్డి. ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వారు ‘సాక్షి’తో మాట్లాడారు. -
‘ఆదర్శ’లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు
సద్వినియోగం చేసుకోవాలి ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా విద్యనిందిస్తుంది. క్రమశిక్షణతో పాటు అనుభవం కలి గిన అధ్యాపకులతో నాణ్య మైన బోధన ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మమత, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కొర్లపహాడ్● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● 20వ తేదీ వరకు గడువు ● ఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ● ఒక్కో పాఠశాలకు 160 సీట్లుకేతేపల్లి, తిరుమలగిరి: ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఆదర్శ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 31 పాఠశాలలుఉమ్మడి జిల్లాలో 31 ఆదర్శ పాఠశాలలు ఉండగా.. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ గ్రామంలో మాత్రమే ఆదర్శ పాఠశాల ఉంది. ప్రతి పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున 160 సీట్లు భర్తీ చేస్తారు. ఈ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు బోధిస్తారు. ఎంపిక ప్రక్రియ ఇలా...పదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఎంపిక చేయనున్నారు. అల్పాదాయ వర్గాల వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నెల 26న దరఖాస్తులను పరిశీలించి ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ కూడా ఇస్తారు. బాలికలకు హాస్టల్ సౌకర్యంఆదర్శ పాఠశాలలో చదివే బాలికలకు హాస్టల్ వసతి ఉంది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మందికే ఈ అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం మూడు కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండే గ్రామాల నుంచి వచ్చే వారు మాత్రమే హాస్టళ్లలో ఉండేందుకు అర్హులు. వీరి కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్, నర్సును నియమించారు. -
శాటిలైట్ టోల్ వసూలు ఇప్పట్లో లేనట్లే..
చౌటుప్పల్ రూరల్: జాతీయ రహదారులపై టోల్ వసూలుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్ విధానంలో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్ టోల్ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్ స్థానంలో నావిగేషన్ చిప్ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్ జీపీఎస్ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. నావిగేషన్ ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చే వరకు వాయిదా పూర్తిస్థాయిలో అభివృద్ధికాని ఐఆర్ఎన్ఎస్ఎస్ టెక్నాలజీ -
జయ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు
సూర్యాపేటటౌన్: ఈఏపీసెట్ ఫలితాల్లో సూర్యాపేటలోని జయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం వెలువడిన ఎప్సెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన కె. ఉజ్వన్ 141వ ర్యాంకు, జి. తేజశ్రీ 266, సీహెచ్. హన్షితశ్రీ 695, టి. అమూల్య 913, బి. లాస్య 917, పి. అమిత్ సూర్య 1948, బి. శివమణి 2270, డి. జగదీష్ రాజు 2935, వై. ప్రదీప్ 3364, కె. సాయినందన్ 3977, జి. నవదీప్రెడ్డి 4003, సీహెచ్. కుశల్ రాజు 5044, సీహెచ్. అక్షయ భారతి 5583, కె. యామిని 5823, ఎం. హన్సిని 5843, వి. బిందుమాధవి 6002, ఎస్. నక్షత్ర 6630, కె. పవన్ కుమార్ 7280, జి. సాయిరాం 8325, ఆర్. ప్రియదర్శిని 8328, ఎం. సాద్విక 8361, సీహెచ్. వైశాలిని 8449, జె. కీర్తన 8989, ఎ. కిషోర్ 9502 ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను ప్రిన్సిపాల్, కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
సత్తాచాటిన ‘గౌతమి’ విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. కళాశాలకు చెందిన ఎండీ. ఉజైర్ 165వ ర్యాంకు, యాస్మిన్ 435, భవ్యశ్రీ 737, ఆఫియా సదాఫ్ 1133, వి. గాయత్రి 1361, బుష్రా 1588, సుసన్నా 2090, షైలా అలీఖాన్ 2267, సాయి నిఖిల 3228, శృతి 3522, ప్రేమ్చందర్ 4541, మీనాక్షి 5166, రాజారెడ్డి 5183, హితశ్రీ 5391, ఆవుల శివాని 6246, అజయ్ 6355, అంజలి 6365, దీపిక 6448, సాత్విక్రెడ్డి 6512, పోలగాని దీపిక 7064, దీక్షితారెడ్డి 7230, శ్రీనిధి 7522, కృష్ణచైతన్య 7682, ఇర్ఫానా తబస్సుమ్ 9778, తితీక్ష 10,504, బొడ్డుపల్లి లలిత 10,684, నవ్య 10,789 ర్యాంకులు సాధించారు. 61 మంది విద్యార్థులు 20వేల లోపు ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల 314 ర్యాంకు, ఎం. షైని 1306, అరిబా తబస్సుమ్ 1363, పి. సింధు 1847, నబీహా మహీన్ 2812, బి. భవాని 3755, అమాతుల్ ముజీబ్ షెజాన్ 4294, ఎస్. చరణ్ 4768, కె. సమీర 5075, కె. యశ్వంత్ 5728, సుహాన ఫిర్దోస్ 5960, ఎన్. సాయిమిత్ర 7055, శ్రీలక్ష్మి 7100, వి. దీక్షిత 7464, పి. హాసిని 7561, బి. శిరీష 8031, కె. బాలాజి 8379, నిఖిల్ 8653, ఎస్. శ్రీకాంత్, 8785, కె. హాసిని 9304, ఎల్. నితిన్సాయి 9681, కె. శ్రేయారెడ్డి 9888 ర్యాంకు సాధించారు. 15వేల లోపు ర్యాంకులు 72 మంది విద్యార్థులకు, 25వేల లోపు ర్యాంకులు 153 మంది విద్యార్థులు సాధించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు నరేంద్రబాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు. -
డిండి వాసికి 66వ ర్యాంకు
డిండి: డిండి మండల కేంద్రానికి చెందిన వంగాల కవిత, ప్రభాకర్రెడ్డి దంపతుల కుమారుడు వంగాల ప్రణీత్రెడ్డి ఆదివారం వెలువడిన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 66వ ర్యాంకు సాధించాడు. ప్రణీత్రెడ్డి హైదరాబాద్లోని మన్సూరాబాద్లో గల నారాయణ కళాశాలలో ఇంటర్ చదివాడు. వంగాల ప్రభాకర్రెడ్డి విద్యుత్ ఏఈగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏదో ఒక ప్రొడక్ట్ తయారుచేసి అతి తక్కువ ధరకు దేశ ప్రజలకు అందించి తన వంతు సమాజానికి ఉపయోగపడాలన్నదే లక్ష్యమని ప్రణీత్రెడ్డి తెలిపారు. ఈఏపీసెట్లో ప్రణీత్రెడ్డి మంచి ర్యాంకు సాధించిడం ఎంతో ఆనందంగా ఉందని అతడి తల్లిదండ్రులు కవిత, ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
సాగర్కు సుందరీమణులు
నేడు బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్వరల్డ్ పోటీదారుల బృందం టూర్ షెడ్యూల్ ఇలా.. ● మధ్యాహ్నం 1.00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరుతారు. ● 3 గంటలకు చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌజ్కు చేరుకుని 3.30 గంటల వరకు అక్కడ సేదదీరుతారు. ● 4.30కు నాగార్జునసాగర్ విజయ విహార్కు చేరుకుంటారు. ● సాయంత్రం 5 గంటల వరకు విజయవిహార్లో ఫ్రెష్ అప్ అవుతారు. ● 5.30 వరకు టీ, ప్రధాన ద్వారం వద్ద ఫొటో షూట్లో పాల్గొంటారు. ● 5.45 వరకు విజయ విహార్ నుంచి బుద్ధవనం చేరుకుంటారు. ● 6 గంటల వరకు అక్కడ ఫొటో సెషన్ ఉంటుంది. ● 6.10కి స్వాగత నృత్యం నడుమ మహాస్థూపం వద్దకు చేరుకుంటారు. ● 6.20 వరకు మహాస్థూపం విషేశాలను గైడెడ్ టూర్ శివనాగిరెడ్డి వారికి వివరిస్తారు. ● 6.30 వరకు బుద్ధశాసన వద్ద ప్రపంచ సుందరీమణుల ధ్యానం చేస్తారు. ● 6.40 నుంచి 6.50 వరకు బుద్ధవనంపై సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది. ● 6.50 నుంచి 7 గంటల వరకు జాతకవనంలో గడుపుతారు. ● రాత్రి 7 నుంచి 7.45 వరకు జాతకవనం వద్ద డిన్నర్ చేస్తారు. ● 7.45 నుంచి 8.45 వరకు వెల్లంకి గెస్ట్కు చేరుకుంటారు. ● 9 గంటల వరకు అక్కడ సేదతీరుతారు. ● 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. నాగార్జునసాగర్ : హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం సోమవారం నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించనుంది. వారి రాక సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ముందుగా వీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి చింతపల్లి సమీపంలో ఉన్న వెల్లంకి అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయవిహార్ చేరుకుంటారు. అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. ఈ సందర్భంగా సుమారు 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహాస్థూపంలో సుందరీమణుల ధాన్యం సుందరీమణులు మహాస్థూపంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి విశేషాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వారికి వివరిస్తారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం, తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతకవనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక అంతా నాగార్జునసాగర్లో ఆయా ప్రాంతాలను సిద్ధం చేసింది. బౌద్ధ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనం చారిత్రక ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజేసేలా ఏర్పాట్లు చేసింది. పపంచ సుందరీమణులు సేదదీరేందుకు నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి గృహాన్ని తీర్చిదిద్దింది. టైల్స్, బెడ్లు, కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసింది. బుద్ధవనం, విజయ విహార్ అతిథి గృహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సిద్ధం చేశారు. సుందరీమణులు ఇక్కడే డిన్నర్ చేయనున్నందున వారివారి దేశ సంప్రదాయాల మెనూ ప్రకారం హైదరాబాద్ నుంచే భోజనాలు తీసుకురానున్నారు.ఫ పర్యటనకు అంతా సిద్ధం చేసిన పర్యాటక శాఖ ఫ లంబాడా నృత్యంతో వారికి స్వాగతం ఫ విజయవిహార్లో విడిది.. బుద్ధవనంలో ధ్యానం చేసేందుకు ఏర్పాట్లు -
రేపటి నుంచి టీచర్లకువృత్యంతర శిక్షణ
నల్లగొండ : ఉపాధ్యాయులకు రేపటి నుంచి వృత్యంతర శిక్షణ నిర్వహించనున్నారు. మొదటి విడత శిక్షణ 13 నుంచి 17వ తేదీవరకు, రెండో విడత శిక్షణ 20 నుంచి 24 వరకు, మూడో విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ఇన్చార్జిలు, జిల్లా రీసోర్స్ పర్సన్ల సంసిద్ధత సమావేశం సోమవారం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు రోజూ ఉదయం 9.30 గంటలకు శిక్షణ తరగతులకు హాజరు కావాలని డీఈఓ భిక్షపతి కోరారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కాంటెంట్ ఎన్రిచ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, లైఫ్ స్కిల్లింగ్ అవుట్కమ్స్ తదితర విషయాలపై శిక్షణనిస్తారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్పెన్స్, డైట్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు డీఈఓ డైరెక్టర్గా, కోర్సు కోఆర్డినేటర్లుగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, క్వాలిటీ కోఆర్డినేటర్గా సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. బడి బాట కార్యక్రమం నిర్వహించే విధానంపై చర్చించి ఎన్రోల్మెంట్పై తగిన చర్యలు తీసుకునేలా శిక్షణలో తెలియజేస్తారు. ఇక.. మండలస్థాయిలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కవితా సంపుటి ఆవిష్కరణ రామగిరి (నల్లగొండ): తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలకు నల్లగొండ పుట్టినిల్లుగా నిలిచిందని సాహితీవేత్త మునాసు వెంకట్ అన్నారు. శీలం భద్రయ్య రచించిన ముస్తాదు కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భద్రయ్య చక్కని భావనా శక్తితో శిల్ప సౌందర్యం కలిగిన కవితలు రాశారని అభినందించారు. యోగా గురువు మాదగాని శంకరయ్య తొలి ప్రతి స్వీకరించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల ఆనంద్, మోత్కూరు నరహరి, తండు కృష్ణ కౌండిన్య, సాగర్ల సత్తయ్య, పొడిచేటి శంకర్, చిత్రకారులు బొల్లెద్దు కిశోర్కుమార్, కవులు నరసింహ, అరుణ జ్యోతి, రామకృష్ణ, యాదగిరి, రమేష్, గణేశ్, దాసరి శ్రీరాములు, భీమార్జున్రెడ్డి పాల్గొన్నారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి నల్లగొండ టౌన్ : యాదవులు రాజకీయ, విద్య, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని హైకోర్టు న్యాయవాది చలకాని వెంకన్నయాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యాదవభవన్లో యాదవ విద్యావంతుల వేదిక ఆద్వర్యంలో యాదవులకు నిర్వహించిన రాజకీయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు యాదవులను రాజకీయంగా అణచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిల్లి రామరాజు, చీర పంకజ్యాదవ్, గోపాలకృష్ణ, శ్రీనివాస్, ఎల్వీ యాదవ్, అన్ని వేణు, దుడుకు లక్ష్మీనారాయణ, రేణుక, అల్లి సుభాష్, నాగరాజు, నడ్డి బాలరాజు, అల్లి సైదులు, బాలరాజు, బి.రమాదేవి ఉన్నారు.