breaking news
Nalgonda District Latest News
-
యాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఇన్చార్జి ఈఓ రవినాయక్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు. తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి చౌటుప్పల్ రూరల్: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పీపల్పహాడ్ గ్రామంలో శని వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీపల్పహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పులనగారి వెంకటేశం(55) రోజుమాదిరిగానే శనివారం కూడా కల్లు గీసేందుకు గ్రామ పరిధిలోని తాటిచెట్టు ఎక్కుతుండగా.. కాలు జారి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు గమనించి పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశం మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రాగీరు కిష్టయ్య కోరారు. చికిత్స పొందుతూ.. తుంగతుర్తి : తాటిచెట్టుపై నుంచి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గీత కార్మికుడు శనివారం మృతిచెందాడు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గూడ వెంకన్న(48) ఈ ఏడాది మే నెలలో ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన వెంకన్న.. శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడిమిర్యాలగూడ అర్బన్: వ్యభిచార గృహంపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ వన్టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న రమావత్ విజయ, ఆమె కుమారుడు రమావత్ వినోద్రాథోడ్ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి మహిళను, విటుడిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1500 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక యాక్టీవా వాహనం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి
గరిడేపల్లి: ఆహార భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందు కోసం రైతులకు ఉపయోగపడేలా అనేక పథకాలను, సబ్సిడీలను అందిస్తుందని నాబార్డ్ డీడీఎం డి. రవీందర్నాయక్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపర్చడం, రైతులకు సులభతర రుణాల కల్పన మొదలైన అంశాలతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంతో పాటు పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ను శనివారం ప్రారంభించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి నాబార్డ్ డీడీఎం రవీందర్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు కూడా ఒకే పంటపై ఆధారపకుండా కూరగాయలు, పండ్ల మొక్కలు, పెరటి కోళ్లు, పశువులు, చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డివిజన్ ఏడీఏ రమేష్బాబు, హుజూర్నగర్ ఏడీఏ రవినాయక్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డి. నరేష్, కేవీకే శాస్త్రవేత్తలు డి. నరేష్, సీహెచ్. నరేష్, ఎ. కిరణ్, ఎన్. సుగంధి, కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎ. నరేష్, వెటర్నరీ ఆఫీసర్ ఈ. కిరణ్, మండల వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్, సందీప్, అనిల్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇప్కో కంపెనీ ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్లు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి మృతిసూర్యాపేటటౌన్: బైక్ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామానికి చెందిన వంటిపులి నర్సింహరావు(40) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీలో పనిచేస్తూ కుడకుడలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శనివారం ఉదయం బైక్పై కంపెనీకి వెళ్తుండగా కొత్త వ్యవసాయ మార్కెట్ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగానే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సింహరావు బైక్ను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య మైసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఫ నాబార్డ్ డీడీఎం రవీందర్నాయక్ -
సాగర్ బీసీ గురుకులంలో మెడికల్ క్యాంపు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం 25వ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి, గురుకుల విద్యాలయాల సెక్రటరీ బి. సైదులు హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తాను చదువుకున్న పాఠశాల కావడంతో సైదులు తన గురువులను, స్నేహితులను, జూనియర్లను కలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న వైద్యుల సేవలను అభినందించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాస స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బోధనానోపకరణాలు ఉండేలా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా కృషి చేయాలని ఆర్సీఓ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్కు సూచించారు. సాగర్లో డిగ్రీ కళాశాల కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు నిడమనూరులో తాత్కాలికంగా తరగతులు కొనసాగించి, అనంతరం ఇక్కడకు మారస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రెడ్డి, చిట్ల చక్రపాణి, శివాజీ, సైదులు, కొత్తపల్లి నితీష్, సరిత, హెల్త్ సూపర్వైజర్ రజిని, పీఈటీ నర్సింహ, పీడీ అరుణజ్యోతి, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ హాజరైన పూర్వ విద్యార్థి, గురుకుల విద్యాలయాల సెక్రటరీ సైదులు -
రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి
రామగిరి(నల్లగొండ) : బీసీ రిజర్వేషన్ల అమలుకు రాజకీయ పార్టీలు చిత్తశుద్ధీతో పనిచేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్రెడ్డి, గుండెబోయిన నాగేశ్వరరావుయాదవ్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన సబ్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై జీఓ 9కి మద్దతుగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైకోర్టులో ఇంప్లిడ్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం కాకుండా బీసీల ఆశయాల కోసం పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు తోట నరసింహాచారి, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.క్రాంతి కుమార్, కిరణ్, జగన్నాథం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్య కిరణం.. సూర్యాధనంజయ్
తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రవాహాన్ని సృష్టించారు ఆచార్య సూర్యాధనంజయ్. జానపద గిరిజన సాహిత్యాన్ని శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, బంజారా సమాజపు స్వరాన్ని తెలుగు సాహిత్యంలో ప్రతిధ్వనింపజేసిన ప్రథమ మహిళా పండితురాలు ఆమె. జీవితమంతా సాహిత్యం, సమాజం, సంస్కృతి ఈ మూడింటి మధ్యే గడుపుతున్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి ఆమె వైస్ ఛాన్స్లర్గా పనిచేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి వీసీగా నియమితులైన తొలి మహిళ ఆచార్య సూర్యాధనంజయ్. ఫ బంజార సాహిత్యంపై తెలుగులో ఆమెదే తొలి పీహెచ్డీ ఫ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా విధులు ఫ ఐదు జాతీయ, 24 రాష్ట్ర స్థాయి అవార్డులు ఆమె సొంతం ఫ మారుమూల తండా నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన గిరిజన మహిళ -
తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం
మోటకొండూర్: ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడడంతో యువకుడి బ్రెయిన్ డెడ్ కాగా.. అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాలు.. మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గంధమల్ల సైదులు(27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 2న దసరా పండుగ రోజు సాయంత్రం గ్రామంలో జమ్మికి వెళ్లి తిరిగి తన బైక్పై ఇంటికి వస్తుండగా.. అదుపుతప్పి కంకర రాళ్లపై పడ్డాడు. దీంతో అతడి తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సైదులు మృతి చెందాడు. సైదులు తల్లిదండ్రులు లక్ష్మి, రాములుకు జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు అవయవదానంపై అవగాహన కల్పించటంతో వారు అతడి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు సైదులు శరీరం నుంచి 2 కిడ్నీలు, 2 కార్నియాస్, కాలేయం, గుండెను సేకరించి మరో ఆరుగురికి అమర్చినట్లు జీవన్దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైదులు భౌతికకాయాన్ని శనివారం గ్రామానికి తీసుకురాగా ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున ర్యాలీ తీసి అంత్యక్రియలు నిర్వహించారు. ఫ బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు దానం చేసిన తల్లిదండ్రులు -
కటకటాల్లోకి నాయక్
నల్లగొండ : అధిక వడ్డీ ఆశచూపి తన ఏజెంట్ల ద్వారా వందలాది మంది వద్ద రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన రమావత్ బాలాజీనాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్రపవార్ కేసు వివరాలు వెల్లడించారు. పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామం పలుగుతండాకు చెందిన రమావత్ బాలాజీనాయక్ 2020లో ఐస్క్రీమ్ పార్లర్ వ్యాపారం కోసం బంధువుల వద్ద రూ.5 లక్షలు రూ.2 వడ్డీతో అప్పుగా తీసుకుని వ్యాపారం చేసి నష్టపోయాడు. తర్వాత రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించి రూ.2 వడ్డీకి ఎక్కడా డబ్బులు దొరక్కపోవడంతో రూ.6 వడ్డీ ఇస్తానని ఆశచూపి అదే గ్రామానికి చెందిన పలువురి నుంచి రూ.10 లక్షలు, రూ.5 లక్షలు వడ్డీకి తీసుకుని.. వారికి క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు. కొంత మంది ఏజెంట్లను నియమించుకుని.. తండాలు, గ్రామాల్లో నూటికి రూ.10 వడ్డీ చెల్లిస్తానని డబ్బులు తీసుకుని వారికి ప్రామిసరి నోట్లు రాసిచ్చాడు. తీసుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఖరీదైన కార్లు, విల్లాలు కొని జనాలను నమ్మించాడు. నల్లగొండలో ఐటీ హబ్ తనదేనని, హైదరాబాద్లో వెంచర్లు చూపించి తనవేనని జనాలను నమ్మబలికాడు. 111 వైన్ షాపులకు టెండర్లు.. అప్పులు చేస్తూ రెండేళ్ల క్రితం జరిగిన వైన్స్ టెండర్లలో జిల్లాలో 111 షాపులకు టెండర్లు వేయగా.. ఒక్కషాపు మాత్రమే దక్కింది. డిపాజిట్ల కోసమే రూ.రెండున్నర కోట్లు ఖర్చు చేశాడు. స్టాక్ మార్కెట్లోనూ ఇంట్రా డే ట్రేడింగ్ (ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్)చేసి రూ.12.15 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆర్బీఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. మూడేళ్ల పాటు వడ్డీ ఇవ్వడంతో నమ్మిన జనం జనాల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్న బాలాజీనాయక్ వారికి మూడేళ్లకు పైగా వడ్డీ చెల్లించాడు. అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు.. మళ్లీ కొత్త వారి వద్ద అప్పులు చేశాడు. ఆరు నెలలుగా వడ్డీ ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వారు బాలాజీనాయక్ను నిలదీస్తుండడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో బాలాజీనాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు.. నిందితుడు బాలాజీనాయక్పై డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతని బంధువులు, బినామీల పేరున ఎలాంటి ఆస్తులు ఉన్నాయనేది విచారణ చేస్తామని వివరించారు. బాలాజీనాయక్ను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అతని సెల్ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. అతనికి 4 కార్లు ఉండగా.. ఒక పర్చునార్కారు, స్కార్పియో సీజ్ చేశామని, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, మిర్యాలగూడ, హయత్నగర్, నేరేడుచర్ల, పలు తండాల్లో ఇళ్లు, దామరచర్ల, వద్దిపట్లలో వ్యవసాయ భూములకు సంబంధించి రాసిచ్చిన ప్రామిసరి నోట్లు 36, 7 సెల్పోన్లు స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఎవరైనా.. ఎంత మొత్తం ఇచ్చారో.. ఆ వివరాలతో పీఏపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాటిని కోర్టుకు సమర్పిస్తామని, డబ్బులు ఇచ్చిన వారికి చట్టపరంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఏఎస్పీలు రమేష్, మౌనిక పాల్గొన్నారు. బాలాజీపై 12 మంది ఫిర్యాదుపెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై శనివారం గుడిపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితులు ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. ఫ అధిక వడ్డీ ఆశ చూపి రూ.కోట్లు తీసుకుని మోసం బాలాజీనాయక్ అరెస్టు ఫ డిపాజిట్ యాక్టు కింద కేసు నమోదు ఫ వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ -
ప్రతిభ చాటితే భవిష్యత్తుకు ఉపకారం
తిరుమలగిరి( తుంగతుర్తి): చురుకుదనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టున్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం(ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కీం కింద ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.6వేల చొప్పున 9, 10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల్లో కలిపి రూ.24వేలు అందించేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనానని రెండింతలు చేసింది. ఏటా ఇచ్చే మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. అంటే నాలుగేళ్లకు కలిపి విద్యార్థులు రూ.48వేలు అందుకోనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 23న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. చొరవ చూపితే ఎంతో లబ్ధి ఈ స్కీం గురించి సరైన ప్రచారం లేకపోవడం ఫలితంగా విద్యార్థులు ఎక్కువగా లబ్ధి పొందడం లేదు. 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు పొంది, తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50లక్షల లోపు కలిగి ఉన్న వారంతా అర్హులు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయ, కుల, నివాసం ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఈ పరీక్ష రాసేందుకు ముందుకు రావడం లేదని, ఉపాధ్యాయులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఉపకార వేతనం రెట్టింపు కావడం, నోటిఫికేషన్ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముంది. రాత పరీక్ష ఇలా.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 3 గంటల పాటు రెండు విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో వెర్బల్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 ప్రశ్నలు(90 మార్కులు) ఇస్తారు. ఇందులో గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంపై ప్రశ్నలు ఉంటాయి. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్పై ప్రశ్నలు అడుగుతారు. ఫ ఈ నెల 14వ తేదీ వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తునకు గడువు ఫ ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ -
నేడు రాంరెడ్డి దామోదర్రెడ్డి సంతాప సభ
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి సంతాప సభను తుంగతుర్తి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంతర్రెడ్డి హాజరవుతున్నట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని శనివారం ఎస్పీ పరిశీలించారు. అనంతరం దామోదర్రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డితో కలిసి సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓ వేణుమాధవ్, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ తుంగతుర్తికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
ముగిసిన తైక్వాండో పోటీలు
ఫ జాతీయ స్థాయికి ఎంపికై న వారిలో నల్లగొండ బాలిక నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–14 ఎస్జీఎఫ్ తైక్వాండో టోర్నీ శనివారం ముగిసింది. బాలబాలికలకు వివిధ కేటగిరీల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించారు. పోటీల్లో మనస్విని(నిజామాబాద్), జువేరియా కుల్సుమ్(నల్లగొండ), సమన్విత(రంగారెడ్డి), కతిజాఫాతిమా(నిజామాబాద్), మగేశ్ మెహరిన్(రంగారెడ్డి), హారిక(రంగారెడ్డి), సమీక్ష(రంగారెడ్డి), టి.వైష్ణవి(హైదరాబాద్) బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు ఈ నెల 28 నుంచి నాగాలాండ్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగమణి పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో ఏఎస్సై బలవన్మరణం సూర్యాపేటటౌన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం పోలీస్స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపగాని సత్యనారాయణగౌడ్(53) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివి ఎన్క్లేవ్ టౌన్షిప్లో నివాసముంటున్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బెడ్రూంలో ఫ్యాన్కు ఉరివేసుకొన్నారు. ఆత్మహత్య వార్తతో సహచరుల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై సత్యనారాయణగౌడ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. పురుగుల మందు తాగి.. గుండాల: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండల కేంద్రానికి చెందిన శ్రీరాముల ఉప్పలయ్య(57) హైదరాబాద్లో నివాసముంటూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8న ఇంట్లో గొడవ పడి స్వగ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి.. కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి చిన్న కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. తేజంరెడ్డి తెలిపారు. బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలుభువనగిరిటౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. వివరాలు.. యాకూబ్ అనే వ్యక్తి బైక్పై భువనగిరి పట్టణంలోని పహాడీనగర్ నుంచి జగదేవ్పూర్ చౌరస్తాకు వస్తుండగా.. ఆర్కే ఆస్పత్రి వద్దకు రాగానే వెనుక నుంచి కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యాకూబ్ను స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్దతు ధర పొందాలి
రామగిరి(నల్లగొండ), నకిరేకల్: నాణ్యతాప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర క్వింటాకు రూ.2,389 పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం ఆమె నల్లగొండ మండలం అర్జాలబావి, నకిరేకల్ మండలం తాటికల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తాలు, మట్టిపెడ్డలు లేకుండా ధాన్యాన్ని తేవాలన్నారు. ఆమె వెంట డీసీఓ పత్యానాయక్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, నకిరేకల్ తహసీల్దార్ యాదగిరి, ఏడీఏ జానిమియా, పీఏసీఎస్ సీఈఓ జగన్రెడ్డి ఉన్నారు. -
ఆస్తి పన్ను వసూలుకు రెడ్ నోటీసులు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 45 వేల వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి. వీటన్నింటికి ఏడాది ఆస్తి పన్ను డిమాండ్ రూ.18 కోట్లు ఉంది. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు రూ.7.50 కోట్లు వసూలు కాగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా మిగతావి వసూలు చేయాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లించేందుకు భవనాల యజమానులు ఆసక్తి చూపించడంలేదు. దీపావళి పండుగ ఉండడంతో ఈ నెలలో కూడా ఆస్తిపన్ను వసూలు కష్టమేనని తెలుస్తోంది. అయితే పాత బకాయిలు, ఈ ఏడాది ఆస్తి పన్ను కలిపి మొత్తంగా రూ.31కోట్లకు పైగానే వసూలు కావల్సి ఉంది. రానున్న ఆరు నెలల కాలంలో నెలకు రూ.5 కోట్లకుపైగా లక్ష్యంగా పెట్టుకొని వసూలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు.. నీలగిరి పట్టణంలో భవనాల యజమానులు కొందరు ఆస్తి పన్ను సక్రమంగా చెల్లించకుండా మొండికేస్తున్నారు. ఒక్కో భవనానికి కొందరు రూ.లక్షల్లో బకాయిలు పడ్డారు. దాంతో పాత బకాయిలే పట్టణంలో రూ.20 కోట్లకు పైగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పాత బకాయిల వసూలు కోసం మున్సిపల్ సిబ్బంది వెళ్లగానే సంబంధిత భవనాల యజమానులు స్థానిక రాజకీయ నాయకులు నుంచి ఫోన్లు చేయించి ఆస్తి పన్ను చెల్లించకుండా జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. దాంతో కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ ఆస్తి పన్ను పడ్డ వారిలో 500 మందిని గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలపై రెడ్ నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దాంతో ఆ దిశగా మున్సిపల్ సిబ్బంది ముందుకు పోయేందుకు ఎక్కువ బకాయి ఉన్న జాబితా సిద్దం చేసే పనిలో పడ్డారు. రెడ్ నోటీసుల జారీ తరువాత కూడా బకాయి పన్ను చెల్లించకుంటే ఆస్తులను కూడా జప్తు చేయాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తోంది.ప్రత్యేకాధికారి పాలన కావడంతో సిబ్బంది రాజకీయ నాయకుల ఫోన్లను పట్టించుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. బకాయిలపై ఫోకస్ పెడితే 90 శాతం వరకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. ఫ నీలగిరి మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ఫ ఇప్పటికే 500 మంది బకాయిదారుల గుర్తింపు ఫ పాత బకాయిలు రూ.20 కోట్లకుపైనే పెండింగ్ ఫ ఈ ఏడాది వసూలు కావాల్సిన పన్ను రూ.11 కోట్లు పాత బకాయిలు ఎక్కువగా ఉండి చెల్లించని 500 మందిని గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేశాం. పన్ను బకాయిలు వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. పన్ను చెల్లించని బకాయిదారుల ఆస్తులను చట్ట ప్రకారం జప్తు చేస్తాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ -
టెన్త్లో వందశాతం ఫలితాలు సాధించాలి
కేతేపల్లి, కట్టంగూర్: ప్రభుత్వ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) బి.భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ఆయన కేతేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. తరగతిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులు చదవటం, రాయటం అంశాలలో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆయన మాట్లాడారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య,, కేతేపల్లి జెడ్పీహెచ్ఎస్ కేతేపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం వంటెపాక రఘు, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం అశ్విని, చెర్వుఅన్నారం హెచ్ఎం కందాల రమ, పీఎస్ హెచ్ఎం భీమయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరహరి, పుల్లయ్య, నాగేష్ తదితరులు ఉన్నారు. ఫ డీఈఓ భిక్షపతి -
గురుకుల ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీసులు
నల్లగొండ: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్ఎల్బీసీ కాలనీలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్కు కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కలెక్టర్ ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాఠశాలలో భోజనం చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి భోజనం కోసం బయటకు వెళ్లారు. దీంతోపాటు పాఠశాలలో అపరిశుభ్రత నెలకొని ఉండడం నిర్వహణ సరిగా లేకపోవడం, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. నిధులు సరిపడా విడుదలవుతున్నా సౌకర్యాలు లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీఓలు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం కాసేపు విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు చెప్పారు. ఆమె వెంట నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు. ఫ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొరడా ఫ మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక -
చెర్వుగట్టు ఆదాయం రూ.40.46 లక్షలు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీలను శుక్రవారం లెక్కించారు. 85 రోజులకు సంబంధించి రూ.40,46,640 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్కుమార్ తెలిపారు. అలాగే అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ.50,844 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో నల్లగొండ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజ్యలక్ష్మి, నరేష్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంటైనర్ ఢీకొని హోంగార్డు దుర్మరణం
రామన్నపేట: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుఝామున రామన్నపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్రాచారి(35) రామన్నపేట పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం తెల్లవారుఝామున రామన్నపేట సుభాష్ సెంటర్లో అతడు మరో కానిస్టేబుల్తో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉపేంద్రాచారి భువనగిరి నుంచి చిట్యాల వైపు వెళ్తున్న కంటైనర్ను ఆపే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో హోంగార్డును ఢీ కొట్టింది. దీంతో అతడి తలభాగం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డును ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన కంటైనర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉపేంద్రాచారి మృతితో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. హోంగార్డుకు ప్రముఖుల నివాళివిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు కూరెళ్ల ఉపేంద్రాచారి మృతదేహాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, అడిషనల్ ఎస్పీ వినోద్కుమార్, అడ్మిన్ ఆర్ఐ శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా హోంగార్డు సంక్షేమ నిధి నుంచి తక్షణ సాయంగా రూ.10వేలు, భువనగిరి హెడ్క్వార్టర్స్ తరపున రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీపీ సుధీర్బాబుకు ఫోన్చేసి ఉపేంద్రాచారి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఉపేంద్రాచారి మృతదేహాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగరాజు సందర్శించి నివాళులర్పించారు. -
‘నెల్లికల్లు’ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: సాగర తీరంలోని బండలక్వారీ సమీపంలో మూడేళ్ల క్రితం మొదలైన నెల్లికల్లు ఎత్తిపోతల పనులు తిరిగి కొనసాగుతున్నాయి. ఆరునెలల్లో ఒక పంపుతోనైనా నీరు పోయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. గత రెండేళ్లుగా జూలై నుంచి సుమారుగా డిసెంబర్ వరకు జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలోనే ఉండటంతో పనులకు కొంతమేర అంతరాయం కలిగింది. జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టిన సమయంలో పనులు జోరందుకుంటున్నాయి. జలాశయంలో 510 అడుగుల నీరు ఉన్నప్పుడు జలాశయ తీరంలో ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకునే ప్రాంతంలో నీరుండదు. అందుకుగాను జలాశఽయ తీరంలో ప్రత్యేకంగా బావిని 35మీటర్ల లోతు తవ్వారు. జలాశయం లోపలి నుంచి అప్రోచ్ కెనాల్స్ను సుమారుగా 300 మీటర్లకు పైచిలుకే తవ్వడం పూర్తయింది. జలాశయంలోని నీరు బావిలోకి రాకుండా ఉండేందుకు బావి చుట్టూ కాంటూర్ బండ్ ఏర్పాటు చేశారు. బావిలోకి నీటి ఊట రాకుండా దరులకు కాంక్రీట్ చేశారు. దానిలో పంప్హౌస్ల ఏర్పాటు కోసం స్లాబులు వేసేందుకు సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. జలాఽశయంలో నీరుండటంతో పంప్హౌస్లోకి నీటి జాలు వచ్చి చేరుతుందని, దీంతో నిత్యం డీవాటరింగ్ చేయాల్సి ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. కొనసాగుతున్న పైప్లైన్ పనులుసాగర తీరం నుంచి ఎర్రచెరువు వరకు పైప్లైన్ పనులు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఎర్ర చెరువుతండా నుంచి ఇరువైపులా పైపులైన్ వేస్తున్నారు. ఒక పైప్లైన్ గోడుమడక వైపు వెళ్తుండగా.. మరో పైప్లైన్ యల్లాపురం తండా వైపు వెళ్లనుంది. కొన్ని చోట్ల ఫారెస్ట్ అంతరాయం ఉండటంతో వాటికి క్లియరెన్స్లు కూడా వచ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు. 24వేల ఎకరాలకు నీరందించే లక్ష్యం సాగర్డ్యాం నిర్మాణ సమయంలోనే జలాశయ తీరప్రాంతానికి సాగు నీరు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. 70 ఏళ్లుగా ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వచ్చారు. జలాశయం తీరప్రాంతంలో నెల్లికల్లు లిఫ్ట్ ఏరా్పాటు చేసి వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి తీసుకురావడంతోపాటు తాగునీరు ఇవ్వాలని ఈ ప్రాంత రైతులు, గిరిజనులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోదాడలో నిర్వహించిన పార్టీ మీటింగ్లో నెల్లికల్లు లిఫ్ట్కు రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021 ఫిబ్రవరి 10న నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. సాగర్ జలాశయతీరం గిరిజన తండాల్లోని 24వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో లిఫ్ట్ పనులు ప్రారంభమయ్యాయి. కొనసాగుతున్న పంప్హౌస్ స్లాబ్ సెంట్రింగ్ పనులు ఆరునెలల్లో ఒక పంపుతోనైనా నీరు పోయించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు -
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం
నల్లగొండ టూటౌన్: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యాదాద్రి జోనల్ సంరక్షణ అధికారి శివాల రాంబాబు అన్నారు. గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో రీజనల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ – 2025 క్రీడాపోటీలను ఆయన క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, ఏటీఆర్ సర్కిల్ సంరక్షణ అధికారి సునీల్ ఇరామత్, నల్లగొండ డీఎఫ్ఓ పెట్ల రాజశేఖర్, ఎఫ్డీఓ నాగభూషణం, ఎఫ్ఆర్ఓ వీరేంద్రబాబు, భువనగిరి, జోగులాంబ గద్వాల, నల్లగొండ సర్కిల్కు సంబంధించిన తొమ్మిది జిల్లాల ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసీల్దార్
చిట్యాల: ల్యాండ్ మ్యుటేషన్, ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇచ్చేందుకుగాను నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ గగులోతు కృష్ణ ఓ రియల్ ఎస్టేట్స్ సంస్థ ద్వారా లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి రెవెన్యూ పరిధిలోని 172 సర్వే నంబర్కు సంబంధించి ల్యాండ్ మ్యుటేషన్, 167 సర్వే నంబర్పై ఇన్స్పెక్షన్ రిపోర్టు కోసం మెస్సర్స్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇటీవల తహసీల్దార్ గగులోతు కృష్ణను ఆశ్రయించింది. ఇందుకుగాను తహసీల్దార్ రూ.10లక్షలు డిమాండ్ చేయగా.. సంస్థ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందస్తుగా రూ.2లక్షలను ప్రైవేటు వ్యక్తి గట్టు రమేష్కు ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఈ విషయంపై సంస్థ ప్రతినిధులు ఫోన్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం సంస్థ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయం బయట రమేష్కు రూ.2లక్షలను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు రికవరీ చేయడంతోపాటు, రమేష్ను, తహసీల్దార్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్లోని తహసీల్దార్కు చెందిన ఇంటిలో కూడా సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనింగ్ విషయంలోనూ ఆరోపణలు తహసీల్దార్ కృష్ణపై మైనింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో తహసీల్దార్ కృష్ణ చిట్యాల మండలానికి వచ్చారు. వెలిమినేడు, పెద్దకాపర్తి పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేసిన షెడ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని పేర్కొంటూ వాటిని కూల్చివేయించి ఆస్తినష్టం కలిగించారని చిన్నకాపర్తికి చెందిన బోయపల్లి శ్రీనివాస్ తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ల్యాండ్ మ్యుటేషన్, ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇచ్చేందుకు రూ.10లక్షలు డిమాండ్ రూ.2లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
‘మిరప’లో తెగుళ్లను నివారిద్దాం
పెద్దవూర: ప్రస్తుతం మిరప చేలు పక్వ దశలో ఉన్నాయి. అనేక చీడపీడలు వ్యాపించి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శిలీంద్రాలు, పురుగులు, సూక్ష్మధాతువు లోపాలు ఉన్నట్లు దీనికి తోడు నల్లతామర పురుగులు వ్యాప్తి ఉంది. కొమ్మ ఎండు, కాయకుళ్లు, బూడిద తెగుళ్లు, కాయతొలిచే పురుగుల వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో నాణ్యత తగ్గి తాలుకాయలు ఏర్పడి మార్కెట్లో ఆశించిన మద్దతు ధర లభించదు. అందుకు గాను మిరప పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించి కాపాడుకోవాలని ఉద్యానవన క్లస్టర్ అధికారి మురళి రైతులకు సూచిస్తున్నారు. కొమ్మ ఎండు, కాయకుళ్లు..మిరప పైరు పూత దశ నుంచి కాయ దశకు వచ్చే సమయాల్లో కొమ్మ ఎండు తెగులు, కాయ కుళ్లు, తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి కారణంగా కొమ్మ, కాయపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి ప్రభావంతో కొమ్మలు పైనుంచి కింది వరకు ఎండిపోతాయి. కాయ సహజ రంగును కోల్పోతుంది. నివారణ చర్యలుఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ ప్రొఫికానజోల్, లేదా 100 మి.లీ. డైఫెన్ కొనజోల్, లేదా 200 గ్రాముల ఫైరాక్సీ స్ట్రోబిన్ను కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగుళ్లుచలి, తేమ వంటి వాతావరణం మార్పులతో బూడిద తెగులు సోకుతుంది. ఈ తెగుళ్లను కలిగించే శిలీంధ్రంతో ఆకు కింది భాగంలో బూడిద రంగులో తెల్లటి పొడి ఏర్పడుతుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. నివారణఎకరాకు 200 లీటర్ల నీటిలో 300 గ్రాముల గంధకం, లేదా 200 మి.లీ.ల డైనోకాప్, లేదా బెలటాన్, లేదా అజాక్సీస్ట్రోబిన్లను కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటర్ నీటిలో 200 మి.లీ. ట్రైౖ డిమార్ఫ్ కలిపి పిచికారీ చేయొచ్చు. కాయ తొలిచే పురుగుకాయ తొలిచే పురుగు కాయలను రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినడం వల్ల కాయ రాలిపోవడం లేదా కాయ పరిమాణం తగ్గి నాణ్యత, దిగుబడి కోల్పోతుంది. నివారణ లీటర్ నీటిలో 1.5 గ్రాముల అసిఫేట్, లేదా ఒక మి.లీ నుపులురాన్, లేదా 0.3 మి.లీ.ల రైనాక్సీఫైర్, లేదా 0.3 గ్రాముల ప్లూబెండమైడ్ను కలిపి పిచికారీ చేయాలి. జింకు లోపంభాస్వరం ఎక్కువగా వాడితే జింకులోపం కనిపిస్తుంది. ఆకుల కనుపుల మధ్య పసుపు పచ్చ రంగులోకి మారి రాలిపోతుంది. నివారణజింకులోపం నివారణకు లీటర్ నీటిలో 2 గ్రాముల చీలేటెడ్ జింక్ను కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.పక్షికన్ను మచ్చ తెగులుతేమతో కూడిన చల్లటి వాతావరణంలో మిరప ఆకులపై సర్కోస్పోరా, ఆల్టర్నేరియా మచ్చలు ఆశిస్తాయి. సర్కోస్పోరా ఆశిస్తే పక్షికన్ను ఆకారం గల మచ్చలు ఏర్పడతాయి. ఈ ప్రభావంతో పంటలో నాణ్యత, రంగు తగ్గుతాయి. నివారణ200లీటర్ల నీటిలో 200 మి.లీ.ల ప్రొపికోనజోల్ను కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవాలి. లేదా 100మి.లీ.ల డైఫెన్కొనజోల్ను కలిపి పిచికారీ చేయాలి. -
ఎడమకాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల: మునగాల మండల పరిధిలోని బరాఖత్గూడెం శివారులో గురువారం సాగర్ ఎడమకాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలిపారు. అతడి వయస్సు 40–45ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. మృతదేహం ఆచూకీ నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచామని, వివరాలకు 87126 86048, 96666 92085 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు. భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట.. భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆకుపచ్చ–నలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం మునగాల: మండలంలోని కృష్ణానగర్ గ్రామ శివారులో గల సాగర్ ఎడమకాలువ(పాలేరు)లో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో లభ్యమైంది. నడిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందని భుక్యా బాబునాయక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. అదే రోజు సాయంత్రం స్నానమాచరించేందుకు మిగతా మాలధారులతో కలిసి సాగర్ ఎడమకాలువ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేస్తుండగా భుక్యా బాబునాయక్ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. గురువారం పాలేరు జలాశయంలో అతడి మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు భుక్యా భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడిగూడెం పోలీసుల కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తిప్పర్తి: తిప్పర్తి మండలంలోని రాయినిగూడెం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. సుమారు 50సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈనెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్వతిపురం వరకు టికెట్ తీసుకున్నాడని, మిగిలిన ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ అదృశ్యం నడిగూడెం : పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ ఈ నెల 7న అదృశ్యమైంది. స్థానిక ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన పఠాన్ జానిబేగం (38) ఈనెల 7న తమ గ్రామానికి చెందిన తోటి కూలీలతో కలిసి ఆటోలో ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాంతంలో పత్తి తీసేందుకు వెళ్లింది. తర్వాత జానిబేగం ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త పఠాన్ జాఫర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దుర్గాదేవి ఉత్సవాల లక్కీడ్రా విజేతకు ప్లాట్ రిజిస్ట్రేషన్
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలంలోని గౌస్కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గాకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ శరన్నవ రాత్రోత్సవాలను పురస్కరించుకొని లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ నెల 3న నిర్వహించిన డ్రాలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రూపాని రాజుకు 150 గజాల ప్లాట్ వరించింది. దాంతో గురువారం ఆ విజేతకు చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో 150 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసి నిర్వాకులు డాక్యుమెంట్స్ అందజేశారు. ఈసందర్భంగా రాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశివరామ దుర్గాకమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రమోద్రెడ్డి, వెదిరె రాజిరెడ్డి, మర్రి నితిన్రెడ్డి, కళ్లెం రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
వరద ఉధృతికి కూలిన పేరూర్ బ్రిడ్జి
హాలియా : ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని పేరూర్ బ్రిడ్జి కూలిపోయింది. సోమ సముద్రం చెరువు ఉధృతంగా ప్రవహించడంతో గురువారం రాత్రి వరద తాకిడికి సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. అనుముల మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు ఈ వంతెన గుండా రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన కొట్టుకుపోవడంతో పేరూర్ గ్రామంతో పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా, ఆంజనేయ తండా గ్రామాలకు చెందిన ప్రజలు తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం గుండా హాలియాకు తమ ప్రయాణాలు కొనసాగించాల్సి వస్తోంది. స్థానిక ఎస్ఐ సాయి ప్రశాంత్ తన సిబ్బందితో కూలిన వంతెనను పరిశీలించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రహదారి సమస్యను పరిష్కరించడానికి హాలియా నుంచి రెండు వరుసల రహదారి తో పాటు నూతన వంతెన నిర్మాణానికి సుమారు రూ.కోటితో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. -
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఆరా
నల్లగొండ, రామగిరి(నల్లగొండ): నల్లగొండ కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమావేశమయ్యారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల నోటిఫికేషన్, నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కగా అమలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అనంతరం ఆమె నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను జిల్లా కలెక్టర్ ఆమెకు వివరించారు. మొదటి విడతగా నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 18 మండలాలు, 196 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు విధులను ప్రారంభించాయన్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ ద్వారా భద్రతా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఆమెకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రాజ్కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు కనగల్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని స్థానిక ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం వారు కనగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బందికి వారు పలు సూచనలు చేశారు. మొదటి రోజు జీ.యడవల్లి ఎంపీటీసీ స్థానానికి ఒక్కటే నామినేషన్ వచ్చిందని అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి కె.సుమలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారివెంట జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ కె.వెంకయ్య, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, నల్లగొండ ఆర్టీఓ వై.అశోక్రెడ్డి ఉన్నారు. ఫ కలెక్టర్తో చర్చించిన స్థానిక ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి -
బాలాజీ అరెస్ట్కు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధిక వడ్డీకి ఆశ పడి మోసపోయిన వారి ఆందోళనలు ఓవైపు.. డబ్బులు ఇచ్చినా సకాలంలో తమకు తిరిగి చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న పలుగుతండా వాసి ఘటన మరోవైపు.. వెరసీ బాలాజీ నాయక్పై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశచూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యకు యత్నించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎష్ట్టాబ్లిష్మెంట్ యాక్ట్ –1999 ప్రకారంతోపాటు ప్రజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన బాలాజీ నాయక్ను అరెస్టు చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు అతని పేరున ఏమేం ఆస్తులు ఉన్నాయి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలను సేకరించి, వాటిని జప్తు చేయాలని రెవెన్యూ శాఖను కోరారు. దీంతో వారు రంగంలోకి దిగారు. దేవరకొండ ప్రజల పేరుతో గతంలోనే ఫిర్యాదు అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేశాడంటూ బాలాజీ నాయక్పై గత జూన్లోనే దేవరకొండ ప్రజల పేరుతో ఒక ఫిర్యాదు వచ్చింది. వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అతన్ని పిలిపించి విచారణ జరిపారు. మూడు నెలల్లో చెల్లిస్తానని చెప్పడంతో వదిలేశారు. ఈనెల 7న పలుగుతండాకు చెందిన సరియా తాను ఇచ్చిన రూ.20 లక్షల డబ్బులను బాలాజీ తిరిగి ఇవ్వడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నించి చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఇది తెలిసిగ్రామానికి చెందిన బాధితులు గ్రామంలోని బాలాజీ నాయక్ ఇంటిపై దాడికి దిగారు. ఇంటిముందున్న కారును తగులబెట్టారు. మరోవైపు బుధవారం మిర్యాలగూడ, నేరడుచర్లలోని అతని బంధువుల ఇళ్ల ముందు ఆందోళనకు దిగారు. తాజాగా గురువారం లోక్యా అనే వ్యక్తి కూడా పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు బాలాజీ నాయక్ను అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆత్మహత్యలు సరికాదు పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీ బాధితులు ఆత్మహత్యకు పాల్పడడం సరికాదని గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు సూచించారు. బాధితులెవరూ ఆందోళన చెందొద్దని, నేరుగా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశచూపి నమ్మించాడు. రూ.వందకు రూ.10 నుంచి రూ.16ల వరకు వడ్డీ ఇస్తానని నమ్మబలికి వారి నుంచి రూ.వందల కోట్లు వసూలు చేశాడు. ముందుగా బంధువుల వద్ద అప్పులు తీసుకొని, వారికి ప్రతీనెల వడ్డీ చెల్లించాడు. అది ఆ నోటా ఈ నోటా గ్రామం, మండలం, జిల్లానే కాదు ఇతర జిల్లాలకు వ్యాపించింది. దీంతో అధిక వడ్డీ కోసం అనేక మంది తమ ఇళ్లు, భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి మరీ అతనికి అప్పులు ఇచ్చారు. మొదట్లో తనతోపాటు ఒకరిద్దరిని మాత్రమే కలుపుకొని అధిక వడ్డీ పేరుతో దందా ప్రారంభించి, ఆ తరువాత 15 మంది ఏజెంట్లను నియమించుకొని మరీ కొనసాగించాడు. ఇలా దేవరకొండ, నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్తోపాటు, రంగారెడ్డి జిల్లాలోనూ వసూళ్లు చేశారు. 16 బ్యాంకు అకౌంట్ల ద్వారా వేల మంది నుంచి రూ.వందల కోట్ల దందా కొనసాగించాడు. అయితే మొదట్లో అప్పులు ఇచ్చిన వారికి వడ్డీ చెప్పినట్లుగానే చెల్లించినా, అసలు ఇవ్వకపోవడంతో ఆందోళన మొదలైంది. దీంతో దేవరకొండ ప్రాంత పబ్లిక్ ఫ్రాడ్ అవేర్నెస్ గ్రూపు పేరుతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి గత జూన్ నెలలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఎస్పీ శరత్చంద్ర పవార్కు కలెక్టర్ పంపించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. ఇక అప్పటి నుంచి బాలాజీ నాయక్ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మంగళవారం సరియా ఆత్మహత్య చేసుకోగా, గురువారం మరొకరు ఆత్మహత్యకు యత్నించగా, అతనికి అప్పులు ఇచ్చిన మిగితా వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫ అధిక వడ్డీ ఆశచూపి అమాయకుల నుంచిరూ.కోట్లు కొట్టేసిన బాలాజీ నాయక్ ఫ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన ఫ అప్పు ఇచ్చిన వారిలో ఒకరి ఆత్మహత్య నేపథ్యంలో కేసు నమోదు ఫ ఆస్తులు జప్తు చేసేలా రెవెన్యూ శాఖకు పోలీసుల లేఖ -
ఆకట్టుకున్న సైన్స్ డ్రామా పోటీలు
నల్లగొండ: నల్లగొండలోని డైట్ కళాశాలలో గురువారం నిర్వహించిన సైన్స్ డ్రామా పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను డీఈఓ భిక్షపతి ప్రారంభించి మాట్లాడుతూ సైన్స్ డ్రామాలు శాస్త్ర సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళతాయన్నారు. సైన్స్లో మహిళల పాత్ర, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, పరిశుభ్రత, గ్రీన్టెక్నాలజి అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు ఆలోచింపజేశాయి. ఈ పోటీల్లో ఆర్పీ రోడ్డులోని ప్రభుత్వ బాలికల పాఠశాల నల్లగొండ ప్రథమ స్థానం, సెయింట్ ఆన్స్ హైస్కూల్ నకిరేకల్కు ద్వితీయ స్థానం, టీజీఎస్డబ్ల్యూఆర్ఈస్ బాలి కల స్కూల్ నకిరేకల్ 3వ స్థానం పొందాయి. విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వేణుగోపాల్, సాదియా పరహిన్, తస్లీమ్ ఫాతిమా, వనం లక్ష్మీపతి పాల్గొన్నారు. బహుమతులు అందజేస్తున్న డీఈఓ భిక్షపతి ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు -
ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మి మద్దతు పొందాలి
నల్లగొండ: ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లోని రైతులు తమ ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వివిధ విభాగాల సిబ్బందికి గురువారం నల్లగొండలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు ధాన్యం పోసిన వెంటనే వారి పేరు, సీరియల్ బుక్లో రిజిస్టర్ చేసి వారికి సీరియల్ నంబర్ ఇవ్వాలన్నారు. రైతుల నుంచి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుల జిరాక్స్లు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం తెచిచ గ్రేడ్–ఏకు రూ.2,389, సాధారణ గ్రేడ్కు రూ.2369, సన్న ధాన్యానికి అదనంగా రూ.500 పొందాలన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు 32 క్వింటాళ్ల వరి ధాన్యం మాత్రమే కొనాలన్నారు. హమాలీ చార్జి ప్రభుత్వ ధర ప్రకారం క్వింటాకు రూ.45 మాత్రమే రైతుల నుంచి ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రవణ్కుమార్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, వీరయ్య, బి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. సంతకాల సేకరణ విజయవంతం చేయాలినల్లగొండ: బీజేపీ చేస్తున్న ఓటు చోర్పై చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలోని 31వ వార్డులో ఓటు చోర్పై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గురి శ్రీనివాస్రెడ్డితో కలిసి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర, గుజరాత్లో కూడా బీజేపీ ఓట్ చోర్కు పాల్పడిందని విమర్శించారు. ఈనెల 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మనిమద్దె సుమన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికకనగల్: మండల కేంద్రంలోని అక్కినపల్లి వెంకటేశ్వరరావు మెమోరియల్ ప్రభుత్వ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఆవుల వైష్ణవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ థామసయ్య గురువారం మాట్లాడుతూ ఈ నెల 8న భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందని తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మహబూబాబాద్, నర్సంపేటలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–19 కబడ్డీ పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు. గరిష్టస్థాయి వద్ద నిలకడగా సాగర్ నీటిమట్టం నాగార్జునసాగర్: సాగర్ జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 83,775 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 34,063 క్యూసెక్కులు మొత్తం 66,463 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలకు 17,317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు నీటిని నిలిపివేశారు. సాగర్ జలాశయం ప్రస్తుతం పూర్తిస్థా యి నీటిమట్టమైన 590 అడుగులు(312.0450 టీఎంసీల) వద్ద నిలకడగా ఉంది. -
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్నారు. అంతకు ముందు ఘణపురం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్గూరి వల్లపురెడ్డి, మునగాల అంజిరెడ్డి, అర్వపల్లి నర్సింహ, మాద సుధాకర్గౌడ్, రాయినబోయిన శ్రీను, ఎర్ర యాదగిరి, శేఖర్, కోటి, నరేష్, సైదులు పాల్గొన్నారు. -
పత్తి అమ్మకం.. ఇక సులువు
గుర్రంపోడు : పత్తి అమ్మకానికి ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్తో పత్తి అమ్మకాలు చేపట్టేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సన్నద్ధమవుతోంది. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్పై వ్యవసాయాధికారులకు బుధవారం శిక్షణ ఇచ్చింది. వీరు క్లస్టర్ల వారీగా రైతులకు కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పిస్తారు. రైతులు పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే అండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆయా తేదీల్లో ఖాళీలను బట్టి స్లాట్ బుకింగ్ చేసుకుని తమ దిగుబడులను ఆయా సీసీఐ కేంద్రాలైన మిల్లులకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ విధానం వల్ల కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన అవసరం లేకపోవడంతోపాటు, కేంద్రాల వద్ద ట్రాక్టర్లు, లారీల రద్దీ ఉండి రహదారులపై ట్రాఫిక్ జామ్ల సమస్యకు కూడా చెక్ పడనుంది. స్లాట్ బుకింగ్ ఇలా.. ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్లి కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత భాష ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులు తమ మాతృభాషను ఎంచుకోవచ్చు. హోమ్ పేజీలో క్లిక్ చేసే బుకింగ్ ఫామ్ తెరుచుకుంటుంది. ఈ ఫారమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోబడిన వివరాలు ఉంటాయి. జిల్లా, మార్కెట్, అంచనా వేసిన దిగుబడిని క్వింటాళ్లలో నమోదు చేయాలి. ఇంకా మిగులు పరిమాణం అంచనా కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత మూడు రోజుల వరకు తేదీల్లో స్లాట్ సమయం, ఎన్ని స్లాట్లు ఉన్నాయో, మిల్లు సామర్థ్యం వివరాలు చూపుతుంది. తెరిచిఉన్న స్లాట్ను బుక్ చేసి నిర్ధారణ చేస్తే ఐడీతో స్లాట్ విజయవంతంగా బుక్ చేసినట్లు సందేశం చూపుతుంది. హోమ్ పేజీలో స్లాట్ బుకింగ్ తేదీ, సమయం, మిల్లు వివరాలు కనిపిస్తాయి. స్లాట్ను రద్దు చేయాలనుకుంటే యాప్లో కారణం నమోదు చేసి రద్దు చేసుకునే వీలు కూడా ఉంది. ఆ తర్వాత లాగ్ అవుట్ కావాలి. స్లాట్ బుకింగ్పై క్లస్టర్ల వారీగా రైతులకు అధికారులు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. ఫ కపాస్ కిసాన్ యాప్ ద్వారానే స్లాట్ బుకింగ్ విధానం అమలు ఫ చెల్లింపు వివరాలూ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఫ కేంద్రాల వద్ద రైతుల పడిగాపులకు చెక్ పత్తి రైతులకు అవగాహన కల్పించాలి ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : పత్తి కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా ‘కపాస్ కిసాన్ యాప్’పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్లగొండలోని ఉదయదిత్య భవన్లో ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కపాస్ కిసాన్ యాప్పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు పత్తి అమ్మేందుకు ఆన్లైన్లో తప్పుగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడతారని.. అలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.8,100 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 8 నుంచి 12 శాతం తేమ మించకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, ఉమ్మడి జిల్లా (నల్లగొండ, భువనగిరి, యాదాద్రి) వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉర్సుకు వేళాయే..
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉర్సు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం స్థానిక మదీనా మసీదు నుంచి గంధం ఊరేగింపుతో ఉర్సు ప్రారంభమవుతుంది. 10న దీపాలంకరణ, 11న ఖవ్వాలిలో ఉర్సు మురుస్తుంది. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఫ మూడు రోజులు ఉత్సవాలు ఫ నేడు గంధం ఊరేగింపు -
ధాన్యం కొనుగోళ్లు షురూ
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతులు తొందరపడి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులు, మిల్లర్లకు అమ్ముకోవద్దు. కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్నందున నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని పలు చోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలు కాగా, మరికొన్ని చోట్ల వరి కోత పూర్తి చేసుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించారు. అక్కడే ధాన్యాన్ని ఆరపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొత్తం 375 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం 50 కేంద్రాల్లో (25 ఐకేపీ, 24 పీఏసీఎస్) కొనుగోళ్లు షూరు అయ్యాయి. తిప్పర్తి మండలం కేంద్రం, మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించి రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నిర్ధేశిత తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 375 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలో మొత్తం 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 203 కేంద్రాలను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుంటే ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,389, బి గ్రేడ్ రకానికి రూ.2,369 ఇస్తారు. ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. ధాన్యం కొనుగోలుకు 1.57కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 74 లక్షల గన్నీ బ్యాగ్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2,56,665 ఎకరాల్లో సాధారణ రకం, 2,70,131 ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 6,83,802 మెట్రిక్ టన్నులు సాధారణ రకం, 6,60,465 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం దిగుబడి రానుంది. అందులో రైతులు సొంత అవసరాలకు వినియోగించే ధాన్యం 2,40,250 మెట్రిక్ టన్నులు, మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 మెట్రిక్ టన్నులుపోగా, అమ్మకానికి 6,30,981 మెట్రిక్ మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. అందులో సాధారణ రకం (దొడ్డు ధాన్యం) 4,65,657 మెట్రిక్ టన్నులు, సన్న రకం 1,65,324 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్పించాల్సిన సదుపాయాలు, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో 40 వరకు టార్పాలిన్లు, నాలుగైదు వేయింగ్ స్కేల్ మిషన్లు, రెండు చొప్పున మాయిచ్చర్ (తేమ శాతం తేల్చే) మీటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన గోనె సంచులను సమకూర్చాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన సదుపాయాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సన్న ధాన్యం క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తున్నందునా ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కనిపించని సౌకర్యాలు.. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ధాన్యం వచ్చిన వెంటనే నాణ్యతను పరిశీలించి కాంటా వేసి ఎగుమతి చేయాల్సి ఉన్నా.. కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యపు రాశులు నిల్వ ఉండడంతో నాణ్యతను పరిశీలించడం, కాంటాలు వేయడంలో ఆలస్యం అవుతోంది. దాని వల్ల రైతులు ధాన్యం రాశుల వద్దనే రాత్రింబవళ్లు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. అంతేకాకుండా కేంద్రాల వద్ద మంచినీరు, టెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు.ఫ ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తున్న ధాన్యం ఫ 375 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం ఫ 50 చోట్ల కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు ఫ తిప్పర్తి, మాడుగులపల్లిలో కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్ ఫ 6.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం -
అధిక వడ్డీ బాధితుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి: అధిక వడ్డీ ఆశ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుతండాకు చెందిన రమావత్ సరియా(37) 20ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో కలిసి మిర్యాలగూడకు వలస వెళ్లాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన డబ్బుతో పాటు తన బంధువుల వద్ద అప్పుగా తీసుకున్న సుమారు రూ.కోటి పలుగుతండాకు చెందిన బాలాజీకి అధిక వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఇటీవలి కాలంలో బాలాజీ డబ్బులు ఇవ్వడంలేదని తెలుసుకున్న బంధువులు తమ డబ్బులు తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సరియా గత మూడు నెలలుగా బాలాజీ చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బంధువుల వద్ద మాట పోతుందని మనస్తాపానికి గురై సోమవారం మిర్యాలగూడలోని తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రిలో తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరియా మృతితో పలుగుతండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవరకొండ ఏఎస్పీ మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆఫ్రికా నత్తల నివారణ ఇలా..
గుర్రంపోడు : గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో ఉద్యానవన అధికారుల, శాస్త్రవేత్తల బృందం బుధవారం ఉద్యానవన పంటలను పరిశీలించి తోటలకు హాని కల్గిస్తున్న నత్తలను ఆఫ్రికా నత్తలుగా గుర్తించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి కె.సుబాషిణి, మల్లేపల్లి ఉద్యాన పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్త రాజాగౌడ్, ప్రాంతీయ ఉద్యానవనశాఖాధికారి కె.మురళితో కూడిన బృందం ఆఫ్రికా నత్తల ప్రభావాన్ని పరిశీలించి తగు నివారణ చర్యలను సూచించింది. ఆఫ్రికా నత్తలు వందేళ్ల క్రితమే భారతదేశానికి వలస వచ్చాయని, మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నాయని అన్నారు. కేరళ, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుంచి శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను దిగుమతి చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి ఆఫ్రికా నత్తలు వచ్చాయని గమనించామని తెలిపారు. ఆఫ్రికా నత్తలు జులై నుంచి ఫిభ్రవరి వరకు గుడ్లను ఒక్కో నత్త 400 గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయని అన్నారు. ఒక్కో ఆప్రికా నత్త తమ జీవితకాలమైన ఐదేళ్లలో 1200 వరకు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. బొప్పాయి, అరటి, జామ, ఆయిల్ ఫామ్ తదితర పండ్లతోటలతోపాటు కూరగాయల పంటలను నాశనం చేస్తాయన్నారు. నివారణ చర్యలు చేపట్టాలి ఆఫ్రికా నత్తల నివారణకు ఒక కిలో ఉప్పును నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయని తెలిపారు. ఆకర్షణ ఎర ఏర్పాటులో భాగంగా 10 కిలోల వరి తవుడుకు, ఒక కిలో బెల్లం , ఒక లీటరు ఆముదం మరియు ఒక కిలో ధయోడికార్స్ గుళికలు లేదా ఎసిఫేట్ లేదా క్లోరోఫైరిఫాస్ కలిపి చిన్న ఉండలుగా చేసి ఈ ఉండలను బొప్పాయి, క్యాబేజీ ఆకుల కింద ఉంచితే ఆఫ్రికా నత్తలు తిని చనిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అనంతరం వీటిని ఉప్పు ద్రావణంలో వేయాలని, వారానికి రెండు, మూడు రోజుల పాటు 15 రోజుల వరకు ఇలా చేయాలని సూచించారు. నత్తలు ఏరివేసే సమయంలో చేతికి గ్లౌజులు తప్పనిసరి ధరించాలన్నారు. 2 గ్రాముల కాపర్ సల్పేట్, 2 గ్రాముల పెర్రస్ సల్పేట్ ఒక లీటరు నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేస్తే 70 శాతం నత్తలు కింత పడిపోతాయని, వీటిని ఏరి కాల్చి వేయలన్నారు. 2 గ్రాముల మెటల్డిహైడ్ 2.5 గుళికలు భూమి పైన మరియు చెట్ల మొదళ్లలో ఎరగా చల్లాలని అన్నారు. పండ్లతోటల్లో కలుపు, చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని , మొక్కలను ఒత్తుగా దగ్గరగా వేసుకోకూడదని, రాత్రిళ్లు నీరు పారించవద్దని చెప్పారు. తోటల్లో కోళ్లు, బాతులు పెంచుకోవాలని సూచించారు. బీరకాయను తినేస్తున్న ఆరఫ్రికా నత్త పిట్టలగూడెంలో ఆఫ్రికా నత్తలను పరిశీలిస్తున్న ఉద్యానవన అధికారి, శాస్త్రవేత్తల బృందంఫ ఉద్యానవన అధికారులు, శాస్త్రవేత్తల సూచన -
సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కోమరాజు కరుణాకర్(27) అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. రాజస్తాన్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 6న పగిడిపల్లి–భువనగిరి రైలు మార్గంలో రైలు కింద పడి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. బుధవారం నిర్వహించిన కరుణాకర్ అంత్యక్రియలకు సైనికాధికారులు హాజరై గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జాతీయపతాకాన్ని కరుణాకర్ తల్లి లక్ష్మికి అందజేశారు. కరుణాకర్ తండ్రి వెంకటేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తూ 28ఏళ్ల క్రితమే మృతిచెందాడు. అనంతరం కరుణాకర్ తల్లి లక్ష్మి స్వీపర్గా పనిచేస్తూ ఏకై క కుమారుడిని కష్టపడి చదివించింది. కరుణాకర్కు కొంతకాలం క్రితం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం గ్రామానికి చెందిన లతతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
హాలియా ఎస్బీఐ శాఖలో అగ్ని ప్రమాదం
హాలియా: హాలియా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి బ్యాంకులో ఉన్న అలారం మోగింది. దీంతో వాచ్మెన్ గమనించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. స్థానికులు ఫైర్ స్టేషన్కు, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ఎస్ఐ సాయిప్రశాంత్ తమ సిబ్బందితో బ్యాంకు వద్దకు చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ కాలిబూడిదయ్యాయి. బ్యాంకు మేనేజర్ మోహన్ని వివరణ కోరగా.. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు గుర్తించామని, ఈ ఘటనపై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమైన డాక్యూమెంట్లకు ఏమీ కాలేదని, ఒక కంప్యూటర్, రెండు ఏసీలు, కొంత ఫర్నీచర్ మాత్రం కాలిపోయిందని తెలిపారు. ప్రమాదంపై ఆరా.. బ్యాంకులో జరిగిన ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు, బ్యాంకులో తాకట్టు పెట్టిన షూరిటీ పత్రాలు, బంగారం, నగదు తదితర వివరాలపై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ప్రమాద వివరాలను తెలుసుకునేందుకు ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అధికారులు రానున్నట్లు తెలిసింది. ఎస్ఐ సాయి ప్రశాంత్, అగ్నిమాపక అధికారులు బ్యాంకు అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఫ షార్ట్ సర్క్యూట్తో ఫర్నీచర్, కంప్యూటర్లు, ఏసీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధం -
చేనేత రుణమాఫీ ఏమాయే..!
భూదాన్పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 13 నెలలవుతున్నా నేటికీ అమలుకు నోచుకోకవడ్డీ భారం పెరుగుతుందని నేతన్నలు వాపోతున్నారు. రుణమాఫీకి జీఓ జారీ చేసినా.. రుణమాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఎన్ఐహెచ్టీ) ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేయడం, ఎన్నికల కోడ్ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఏడు నెలల క్రితం అసలు, వడ్డీ కలుపుకుని రూ.లక్ష లోపు ఉన్న వ్యక్తిగత చేనేత రుణాలను మాఫీ చేస్తూ జీఓ నంబర్ 56ను జారీ చేసింది. 2025–26 బడ్జెట్ నుంచి రూ.33 కోట్లు మంజూరు చేస్తూ నాలుగు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అపెరల్ ఎక్స్పోర్ట్ పార్కుల కమిషనర్కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు చెల్లించేందుకు అధికారాలు ఇచ్చారు. నేటికీ ఆమోదించని రాష్ట్ర కమిటీ రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించకపోవడంతో రుణమాఫీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో చేనేత కార్మికులు తీసుకున్న రుణాల వివరాలను చేనేత, జౌళి శాఖ ఏడీలు బ్యాంకుల వారీగా జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్న డీసీసీబీ సీఈఓ, చేనేత శాఖ ఆర్డీడీ, లీడ్బ్యాంకు మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారులు ఆమోదించారు. అనంతరం ఆగస్టులో రుణమాఫీ అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించారు. కొన్ని జిల్లాల నుంచి జాబితాలు రాష్ట్రస్థాయి కమిటీకి అందని కారణంగా రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతోందని తెలిసింది. అప్పు చేసి చెల్లించి.. రూ.లక్ష పైన రుణాలు తీసుకున్న వారు ఆ పై మొత్తాన్ని జూలై నెలాఖరులోగా చెల్లిస్తే వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పడంతో చాలా మంది అప్పులు చేసి, బంగారం కుదవపెట్టి రుణాలు చెల్లించారు. రుణమాఫీ అమలు కాక కార్మికుల ఖాతాల్లోంచి మూడు నెలల వడ్డీ కట్ చేసుకున్నారు. మరోవైపు బయట తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.ఫ రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని 13 నెలల క్రితం ప్రకటించిన ప్రభుత్వం ఫ నాలుగు నెలల కిత్రం జీఓ జారీ ఫ నేటికీ అమలుకు నోచుకోని పథకం ఫ ఇబ్బందుల్లో చేనేత కార్మికులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. యాదాద్రి జిల్లాలో వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికులకు రూ.19.25 కోట్ల రుణమాఫీ జరుగనుంది. అలాగే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 423 మంది చేనేత కార్మికులకు రూ.4కోట్ల రుణమాఫీ లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,803 మందికి రూ.23.25 కోట్ల మేర రుణమాఫీ కానుంది. 2015లో స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.50 వేలు లోన్ తీసుకున్నాను. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తం రూ.75వేలు బకాయి ఉంది. ఇంకా చేనేత రుణమాఫీ కాలేదు. వెంటనే నేత కార్మికులకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలి. – మిర్యాల వెంకటేశం, చేనేత కార్మికుడు, భూదాన్పోచంపల్లి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి ఏడాది గడిచిపోయింది. తక్షణమే చేనేత రుణమాఫీ చేయాలి. చేనేత రుణమాఫీ, నేతన్న భరోసా, చేనేతపై జీరో జీఎస్టీ తదితర సమస్యలపై చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పోచంపల్లిలో అఖిలపక్షాలతో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. – కర్నాటి పురుషోత్తం, చేనేత జన సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 2,380 మంది చేనేత కార్మికుల జాబితాను ఆగస్టులోనే రాష్ట్రస్థాయి కమిటీకి పంపించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. – శ్రీనివాసరావు, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ ఈ ఫొటోలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు గుండు ప్రవీణ్. రెండేళ్ల క్రితం స్థానిక కెనరా బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణం తీసుకున్నాడు. నెలానెలా కిస్తీలు చెల్లిస్తూ వస్తుండగా.. చివరగా రూ.1.23లక్షలు బకాయి పడ్డాడు. రూ.లక్ష లోపు చేనేత రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బంగారం అమ్మి పై రూ.23,500 బ్యాంకులో చెల్లించాడు. కానీ ఇప్పటివరకు మిగతా రూ.లక్ష, రుణమాఫీ కాలేదు. దీంతో మూడు నెలల వడ్డీ కింద అతని ఖాతా నుంచి రూ.3వేలు కట్ చేశారు. -
వడ్డీ వ్యాపారి సోదరి ఇంటి వద్ద బాధితుల ఆందోళన
నేరేడుచర్ల : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన రమావత్ బాలాజీనాయక్ సోదరి నేరేడుచర్లలో నివాసం ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న బాధితులు బుధవారం ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన వడ్డీ వ్యాపారీ రమావత్ బాలాజీనాయక్ రూ.10 నుంచి రూ.16 వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించలేదు. ఆ నగదుతో తన సోదరి పేరుతో నేరేడుచర్లలో ఇల్లు కొనుగోలు చేశాడని తెలుసుకున్న బాధితులు ఆమె ఇంటిపై దాడికి యత్నించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఆస్తులను ధ్వంసం చేయడం సరైంది కాదని చెప్పి బాధితులను తిరిగి పంపించారు. -
కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యం
మిర్యాలగూడ అర్బన్: ఏడాది వయస్సున్న కుమార్తెతో కలిసి మహిళ అదృశ్యమైంది. మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీలో లావూరి వెన్నెల తన భర్త వినోద్తో కలిసి నివాసముంటోంది. వీరికి ఏడాది వయస్సున్న పాప ఉంది. ఈ నెల 4న వినోద్ పని నిమిత్తం వేరే ఊరికెళ్లగా.. అదే రోజు ఉదయం 9గంటల సమయంలో వెన్నెల తన కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వినోద్ ఎంత వెతికినా వెన్నెల ఆచూకీ లభించకపోవడంతో బుధవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 95021 52452 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతుమునగాల: అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు. ఈ ఘటన మునగాల మండలం కృష్ణానగర్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ గ్రామానికి చెందిన బుక్యా బాబునాయిక్(42) బుధవారం అయ్యప్ప మాల స్వీకరించాడు. సాయంత్రం స్నానం చేసేందుకు గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువకు మరికొందరు అయ్యప్ప మాలధారులతో కలసి వెళ్లాడు. స్నానం చేసే క్రమంలో బాబునాయిక్ ప్రమాదవశాత్తు జారి ఎడమ కాలువలో మునిగిపోయాడు. అతడికి ఈత వచ్చినప్పటికీ వరద తాకిడికి కొట్టుకుపోయాడు. బాబునాయిక్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయ్యప్ప మాలధారులు, బాబునాయిక్ కుటుంబ సభ్యులు నడిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాళం వేసిన ఇంట్లో చోరీఫ ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ మఠంపల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రంలో నివాసముంటున్న ఆదూరి మర్రెడ్డి అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం హైదరాబాద్లో వెళ్లాడు. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. చోరీ జరిగిన విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న మర్రెడ్డి బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. బాబు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. -
ఆరు గ్యారంటీల పేరిట మోసం చేశారు
నకిరేకల్: ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలతో కూడిన బాకీ కార్డులను బుధవారం నకిరేకల్ మెయిన్ సెంటర్లో ప్రజలకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ మర్చిపోయిన హమీలను గుర్తుచేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు బాకీ కార్డులను తీసుకొచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, నాయకులు సోమయాదగిరి, గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, గోర్ల వీరయ్య, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్రెడ్డి, దైద పరమేషం, యానాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
హత్యాచారం కేసులో ఇద్దరికి రిమాండ్
రామగిరి(నల్లగొండ): ఇంటర్ విద్యార్థినిపై హత్యాచారం కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం జీకే అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ(21) ప్రేమ పేరుతో ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. గత మూడు నెలలుగా ఇన్స్ట్రాగాం ద్వారా ఆమెతో చాటింగ్ చేశాడు. సదరు విద్యార్థిని మంగళవారం ఇంటి నుంచి కాలేజీకి బయల్దేరి నల్లగొండకు వచ్చింది. నల్లగొండ పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద వేచి చూస్తున్న విద్యార్థిని వద్దకు గడ్డం కృష్ణ బైక్పై వచ్చి ఆమెను తన స్నేహితుడైన నల్లగొండ మండలం రసూల్పుర గ్రామానికి చెందిన బచ్చలకూరి మధు(19) రూమ్కి తీసుకెళ్లాడు. కృష్ణ, ఆ విద్యార్థిని రూమ్లో ఉండగా.. మధు బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కృష్ణ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. వెంటనే కృష్ణ రూమ్కి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా కృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే రోజు సాయంత్రం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో కృష్ణ లొంగిపోయాడు. కృష్ణ ఇచ్చిన సమాచారం ఆధారంగా అతడి స్నేహితుడు మధును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కృష్ణ, మధుపై పోలీసులు అత్యాచారం, హత్య, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ విధించి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో టూటౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు పాల్గొన్నారు. -
ఒకే రోజు గుండెపోటుతో ముగ్గురు నాయకులు మృతి
కోదాడ రూరల్ : కోదాడ నియోజకవర్గంలో ఒకే రోజు ముగ్గురు రాజకీయ నాయకుల గుండెపోటు మరణాలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. కోదాడ పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆళ్ల భాగ్యరాజ్(34) మంగళవారం జ్వరం బారినపడి ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. రాత్రి పడుకున్న తర్వాత బుధవారం తెల్లవారుజామున భార్య లేపగా ఎలాంటి కదలికలు లేకుండా ఉన్నాడు. వైద్యుడిని పిలిపించి చూడగా గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. అదేవిధంగా నడిగూడెం మండలం బృందావనపురానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మండవ అంతయ్య(81) బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో వేణుగోపాలపురం వెళ్లాడు. అక్కడ ఓ నాయకుడి ఇంటి వద్ద స్థానిక సంస్థల అభ్యర్థిత్వంపై చర్చిస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు, కోదాడకు తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. చిలుకూరు మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు దొడ్డా సురేష్బాబు(54) బుధవారం సాయంత్రం కోదాడ పట్టణానికి వచ్చి స్నేహితులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మృతిచెందారు. సురేష్బాబు(ఫైల్)అంతయ్య (ఫైల్) భాగ్యరాజ్ (ఫైల్) ఫ కోదాడ నియోజకవర్గంలో విషాదం -
చంపుతామని బెదిరించిన ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామానికి చెందిన బొర్ర సైదమ్మ తన ఇంటి ముందు నిలబడి ఉండగా.. అదే గ్రామానికి చెందిన గుండ్లపల్లి నవీన్, గుండ్లపల్లి సాయికుమార్, చందుపట్ల సందీప్కుమార్, బొర్ర అభిషేక్, పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి అర్జున్ కారులో ఆమె వద్దకు వచ్చారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నవీన్తో పాటు మిగతా వారు కారులో నుంచి తల్వార్ తిప్పుకుంటూ బయటకు దిగి సైదమ్మతో పాటు ఆమె కుమారుడు, మారపల్లి సతీష్, మోదాల నాగయ్యను బూతులు తిడుతూ చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు సైదమ్మ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తనను బెదిరించిన వారిపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి కారుతో పాటు తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ రిమాండ్కు తరలింపు -
ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్
నల్లగొండ : ఉపాధ్యాయులను టెట్ భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్డు ఇటీవల ఇచ్చిన తీర్పు మెజార్టీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని, లేదంటే ఉద్యోగం వదులు కోవాలని తీర్పు వెలువరించడం భిన్న వాదనలకు తెరలేపుతోంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా , పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పని సరి చేయండంతో విధుల్లో ఉన్న టీచర్లలో టెన్షన్ మొదలైంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్న వారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. జిల్లాలో 5461 మంది ఉపాధ్యాయులు జిల్లాలో మొత్తం 5461 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో 2,064 మంది ఎస్జీటీలు ఉండగా 3,397 మంది స్కూల్ అసిస్టెంట్స్, సమాన కేడర్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. 2010 నుంచి టెట్ను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2017లో ఒకసారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు డీఎస్సీల్లో ఉపాధ్యాయులగా నియమితులైన సుమారు 1,500 మంది టెట్లో అర్హత సాధించారు. రెండేళ్ల కింద ఎన్సీటీఈ ఉపాధ్యాయులందరికీ టెట్ అర్హత ఉండాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు అర్హత సాధించారు. ఇంకా దాదాపు 3 వేలకు పైగా మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. జూనియర్లకు ప్రయోజనం జిల్లాలో ఏడాది వ్యవధిలో 220 మందికి పైగా ఉపాధ్యాయులు టెట్ అర్హత లేకున్నా జీహెచ్ఎంలుగా, పీఎస్హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో తర్వాత జరగబోయే పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది. దీంతో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. ఐదేళ్లలో పదవీ విరమణ ఉంటే ఓకే.. విద్యాశాఖ సంవత్సరానికి రెండు పర్యాయాలు టెట్ నిర్వహిస్తుంది. ఉపాధ్యాయులు రెండేళ్ల కాల పరిమితిలో నాలుగు టెట్లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిబంధన ఉంది. పదోన్నతి పొందాలన్నా టెట్ అర్హత సాధించాల్సిందే. అయితే.. ఐదేళ్ల పాటు పదవీ విరమణ అయ్యే వారికి కోర్టు సడలింపు ఇచ్చింది. వారు టెట్ రాయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ పదవీకాలం ఉన్నవారు కచ్చితంగా రెండేళ్లలో టెట్ పాస్ కావాల్సిందే. ఫ రెండేళ్లలో అర్హత సాధించాలనిసుప్రీం కోర్టు తీర్పు ఫ ఉద్యోగంలో ఉండాలన్నా.. పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరి.. ఫ ఆందోళనలో సీనియర్లు.. స్వాగతిస్తున్న జూనియర్లు 2010 తర్వాత నిర్వహించిన డీఎస్సీల్లో ప్రభుత్వం ఎస్జీటీ ఉద్యోగానికి కేవలం టీటీసీ ఉన్నవారినే అర్హులుగా గుర్తించింది. బీఈడీ ఉన్న వారిని కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. కానీ 2010 కంటే ముందు నిర్వహించిన డీఎస్సీల్లో మాత్రం టీటీసీ ఉన్నవారు ఎస్జీటీ ఉద్యోగానికి మాత్రమే అర్హులు, బీఈడీ ఉంటే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలకూ అర్హత ఉండేది. దీంతో అప్పట్లో బీఈడీ ఉన్న వారు చాలా మంది ఎస్జీటీలుగా ఎంపికై ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారు టెట్ రాయాలంటే పేపర్–1 (టీటీసీ అర్హత ఉన్నవారికి), పేపర్–2 (బీఈడీ అర్హత ఉన్న వారికి) ఏది రాయాలో తేల్చని పరిస్థితి. ఎస్జీటీలుగా పనిచేస్తూ బీఈడీ అర్హత ఉంటే.. టెట్ అప్లికేషన్లో కేవలం పేపర్–2 మాత్రమే చూపిస్తుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉపాధ్యాయులకు టెట్ మినహాంపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్వూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
రైతులను ముంచిన వాన
నల్లగొండ అగ్రికల్చర్ : అతివృష్టి కారణంగా జిల్లా రైతులు ఆగమవుతున్నారు. ఈ సీజన్లో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా 5,64,585 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి ఏరే సమయంలో అంటే 20 రోజుల నుంచి రెండు మూడు రోజులకోసారి జిల్లా అంతటా వర్షాలు కురిసాయి. దీంతో పత్తి చేలు ఎర్రబారి తెగుళ్ల బారిన పడ్డాయి. అదే విధంగా చేతికొచ్చిన పత్తితో పాటు, పత్తి పగిలిన కాయలు కూడా నల్లబారి నేల రాలాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తిచేలు చనిపోతున్నాయి. ఇక, నాన్ఆయకట్టు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నెలవాలుతున్నాయి. చేలలో నీళ్లు నిలిచి మొలకెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల వరి కోతలకు ఎక్కువ ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు మండలాల్లో అత్యధిక వర్షం జిల్లా అంతటా వానాకాలం సీజన్లో సాధారణ వర్షం కంటే అత్యధికంగా వర్షం కురిసింది. జూన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షం 526.6 మిల్లీమీటర్లుకగా.. 670.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పీఏపల్లి, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో అత్యధిక వర్షం కురవగా.. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, తిప్పర్తి, కనగల్, మర్రిగూడ, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, తిరుమలగిరిసాగర్, పెద్దవూర కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి మండలాల్లో అధిక వర్షం కురిసింది. కేతెపల్లి, నల్లగొండ, మునుగోడు, చండూరు, నాంపల్లి, అనుముల హాలియా, నిడమనూరు, త్రిపురారం, మాడుగుపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, నేరెడుగొమ్ము, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 30.5 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా కనగల్లో 115.3మిల్లీమీటర్లు, నిడమనూరులో 84.1, అనుముల హాలియాలో 73.0 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. తిప్పర్తి 51.2, నాంపల్లి 30.5, త్రిపురారం 30.6, మాడుగులపల్లి 34.0, అడవిదేవులపల్లి 43.6, తిరుమలగిరిసాగర్ 55.2, పెద్దవూర 63.2, కొండమల్లేపల్లి 42.2, దేవరకొండ 35.2, గుండ్లపల్లి 37.2, చందంపేటలో 34.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫ వరుస వర్షాలతో పత్తి, వరి పంటలకు నష్టం ఫ నల్లబారిన పత్తి, నేలవాలుతున్న వరి ఫ దిగుబడులు సగానికి పడిపోయే ప్రమాదం ఎక్కువ వర్షాలు కురడంతో పత్తిచేను పూర్తిగా దెబ్బతిన్నది. పత్తి, కాయలు నల్లగా మారాయి. చేనుకూడా తెగుళ్లు వచ్చి ఎండిపోతోంది. ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా రానట్లుంది. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. – చిమట భిక్షమయ్య రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్ సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. గత నెల వరకు ఏపుగా ఉన్న పత్తి చేలు అధిక వర్షాలతో దెబ్బ తినడంతో దిగుబడి సగం తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తంగా పత్తి ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చేలు దెబ్బతినడంతో ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేకుండాపోయింది. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
మాడుగులపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో రైతులు సాగు చేసిన వరి పొలాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు రైస్ మిల్లర్లను, మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నందున రైతులు ధాన్యంలో తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో, 17శాతం తేమ ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఓ ఎం.శివరాంకుమార్, ఏఈఓ వేణుగోపాల్, రైతులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ -
పీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు
డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి నిత్యం వచ్చే రోగుల వివరాలు, విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో నెలకొన్న పలు సమస్యలను మండల వైద్యాధికారి హరికృష్ణ కలెక్టర్కు తెలియజేశారు. అనంతరం ఇటీవల స్థానిక ఐటీఐలో ప్రారంభించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఆమె పరిశీలించారు. వర్షాలకు రేకుల పైకప్పు నుంచి వర్షపు నీరు లీకేజీ అవుతుందని ప్రిన్సిపాల్ రాధాకృష్ణ కలెక్టర్కు వివరించారు. మండల పరిధిలోని కందుకూర్ గ్రామ శివారులోని వాగులో వర్షాల కారణంగా దెబ్బతిన్న మిషన్ భగీరథ పైపులైన్ను కలెక్టర్ పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మిషన్ భగీరథ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులున్నారు. -
మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్టులోకి 5,854 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 5,376 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 532 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 49 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రం వరకు 644.05 అడుగులు (4.21 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
మునుగోడు : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. దీంతో అనేక మంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య, నాయకులు భవనం మధసూదన్రెడ్డి, బోడిగె అశోక్గౌడ్, పుల్కరం సైదులు, బండారి యాదయ్య, అక్కెనపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన దసరా
మిర్యాలగూడ టౌన్ : దసరా పండుగ వేళ ఆర్టీసీకి ఆదాయం కలిసొచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం వారం రోజులపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, నార్కట్పల్లి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ద్వారా ఆర్టీసీ అధికారులు మొత్తం 597 అదనపు బస్సులను నడిపించారు. నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోలలో పండుగకు ముందు.. పండుగ తరువాత మొత్తం 33,99,804 కిలోమీటర్ల మేర బస్సులను తిప్పగా రూ.1,65,78,605 వరకు ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చింది.తిరుగు ప్రయాణంలో కిక్కిరిసిన బస్సులుదసరా పండుగ ముగియడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పట్టణాల బాట పట్టడంతో అన్ని డిపోల్లోని ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దసరా పండుగ మరుసటి రోజు నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సులు ప్రతిరోజు ప్రయాణికులతో నిండిపోయాయి. అదేవిధంగా పండుగకు ముందు మూడు రోజులపాటు.. పండుగ తరువాత నాలుగు రోజులపాటు రద్దీగా ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలోని డీఎంలు, అసిస్టెంట్ డీఎంల పర్యవేక్షణలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బస్సులను నడిపించారు.పండుగ ముందు.. ఆ తర్వాత..దసరా పండుగకు నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడిపించగా.. రీజియన్కు రూ.కోటి 65లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఆదాయంలో సూర్యాపేట డిపో ప్రథమ స్థానంలో ఉండగా.. యాదగిరిగుట్ట డిపో రెండో స్థానం, మూడో స్థానంలో మిర్యాలగూడ డిపో నిలిచింది. దసరా పండుగకు ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజుల్లో రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా రూ.కోటి 65 లక్షల వరకు అదనపు ఆదాయం వచ్చింది.డిపోలు అదనపు బస్సులు అదనపు ఆదాయందేవరకొండ 60 14,95,942నల్లగొండ 65 9,63,574నార్కట్పల్లి 48 15,48,815మిర్యాలగూడ 69 23,19,230యాదగిరిగుట్ట 133 33,78,701కోదాడ 92 21,55,178సూర్యాపేట 130 47,17,165బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణికులుఅదనపు ఆదాయం రూ.1.65 కోట్లుప్రథమ స్థానంలో సూర్యాపేట డిపోనల్లగొండ రీజియన్ పరిధిలో ఏడు డిపోల నుంచి 597 అదనపు బస్సులను నడిపించాం. ప్రయాణికుల రద్దీని బట్టి ఉద్యోగులు, కార్మికులు పనిచేశారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేశారు. అందరి కృషి వల్లనే రీజియన్కు రూ.కోటి 65లక్షల 78 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది.– కొణతం జానిరెడ్డి, ఆర్ఎం నల్లగొండ -
నిజాయితీకి నిలువుటద్దం జీఎస్రెడ్డి
కోదాడ: నిజాయితీకి నిలువుటద్దం.. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత.. తన ఆస్తిని సైతం ఫణంగా పెట్టి ప్రజలకు ఖర్చుచేసిన గొప్ప వ్యక్తి ఉమ్మడి నల్ల గొండ జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ గోపు శౌరిరెడ్డి (జీఎస్రెడ్డి). మంగళవారం జీఎస్రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ‘పల్లె సీమల ప్రగతికి నా వంతు కృషి చేయాలన్నదే నా సంకల్పం. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నా.. అవసరమైతే నా ఆస్తులను ఖర్చుచేస్తా.. నా కుటుంబ సభ్యులెవరూ నా సంపాదన మీద ఆధారపడకూడదన్నదే నా అభిమతం’. 1952వ సంవత్సరంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గోపు శౌరిరెడ్డి(జీఎస్రెడ్డి) తన సన్నిహితులతో అన్న మాటలవి. అన్న మాటలకు కట్టుబడి నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా.. తనకున్న 60 ఎకరాల భూమిని రాజకీయాల్లో పోగొట్టుకుని తన నలుగురు కుమారులు వేరుపడున్న సమయంలో ఒక్కొక్కరికి రూ.40 వేల అప్పు పంచిన నేత ఆయన. జిల్లా పరిషత్ తొలి చైర్మన్గా..ఉమ్మడి నల్లగొండ మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా, మూడు విడతలు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా జీఎస్రెడ్డి సేవలందించారు. మఠంపల్లి గ్రామానికి చెందిన గోపు శౌరిరెడ్డి 1917లో జన్మించారు. ఆయనను జీఎస్.రెడ్డి అంటేనే గుర్తిస్తారు. ఆయన అసలు పేరు నూటికి 90 మందికి తెలియదంటే ఆశ్చర్యపోక తప్పదు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన జీఎస్.రెడ్డి 1941–46 మధ్య కాలంలో సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాలలో ఉపాధ్యాయడిగా పనిచేశారు. ఆ తరువాత 1947–50 వరకు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1952లో హుజూర్నగర్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1962లోఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికై న ఆయన.. 1965 వరకు పదవిలో కొనసాగారు. ఈ సమయంలోనే కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రహదారులు వేయించారు. మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే వేములూరి ప్రాజెక్ట్ను నిర్మించారు. ప్రస్తుత నల్లగొండ జెడ్పీ భవన స్ధలం, హుజూర్నగర్లో పంచాయతీ స్థలాలు ఆయన హయంలో సేకరించినవే. జిల్లాలో 80కి పైగా హైస్కూళ్లు ఏర్పాటు చేశారు. మూడు విడతలు ఎంపీగా.. జెడ్పీ చైర్మన్గా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన పనితీరును గుర్తించి తొలిసారి మిర్యాలగూడ ఎంపీ స్థానం నుంచి పార్లమెంట్కు పోటీకి నిలిపింది. తొలిసారి 1967–71 వరకు, రెండోసారి 1971–75 వరకు, మూడోసారి 1980–84వరకు ఆయన ఎంపీగా సేవలందించారు. క్యాథలిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జీఎస్.రెడ్డి.. 1965వ సంవత్సరంలో మదర్ థెరిస్సాను నల్లగొండకు రప్పించి అనేక సేవా కార్యాక్రమాల్లో పాల్గొనేలా చేశారు. నాటితరం నేత.. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత ఉమ్మడి జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ జీఎస్రెడ్డి నేడు జీఎస్రెడ్డి వర్ధంతిజీఎస్రెడ్డి వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టిన జీఎస్రెడ్డి.. 1986 అక్టోబర్ 7వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళుతుండగా సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు పెద్ద కుమారుడు రాయపురెడ్డి, మనవడు అభినయ్రెడ్డి మృతి చెందారు. ఆయనకు నలు గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు, రాజారెడ్డి, మూడో కుమారుడు ప్రతాపరెడ్డి ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమారుడు బాలిరెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. జీఎస్రెడ్డి సేవలకు గుర్తుగా హుజూర్నగర్ ప్రధాన రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
బిల్లులిస్తేనే బడిలోకి..
నల్లగొండ : బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించిన బిల్లులు రావడం లేదని నల్లగొండలోని ఆల్ఫా స్కూల్ యాజమాన్యం సోమవారం విద్యార్థులను బడిలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు చాలా సేపు పాఠశాల ఎదుట వేచి ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను తీసుకుని.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి మూడు సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రావడం లేదన్నారు. ఆందోళన చేస్తున్న సమయంలో కలెక్టరేట్ నుంచి బయటికి వస్తున్న కలెక్టర్ను కలిసి తమ పిల్లల భవిష్యత్ను కాపాడాలని తల్లిదండ్రులు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మా ట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లు, హాస్టళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారు అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తీక్, మామిడి జగన్, స్వామి, గాదె నర్సింహ, శోభన్, సాహితి, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బిల్లులు ఇవ్వలేదని విద్యార్థులను అనుమతించని ఆల్ఫా స్కూల్ యాజమాన్యం ఫ కలెక్టర్ను కలిసి మొర పెట్టుకున్న తల్లిదండ్రులు -
యూరియా కోసం రాత్రంతా పోలీస్స్టేషన్లోనే..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఒక్క బస్తా యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు నిద్రహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడలేక నీరసించిపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికి యూరియా బస్తా చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. కొత్తగా ఏర్పడిన తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి ప్రత్యేకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) లేదు. దీంతో ఇక్కడి రైతులకు హాలియాలోని కొత్తపల్లి సహకార సంఘం వద్దనే యూరియా పంపిణీ చేశారు. రెండు మండలాల రైతులు ఒకే కేంద్రం వద్దకు వస్తుండటంతో అధిక సంఖ్యలో బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు గత కొద్ది రోజులుగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డుతో పాటు డొక్కలబావి తండాలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసి యూరియాను పంపిణీ చేస్తున్నారు. పోలీస్స్టేషన్ కూడా సబ్మార్కెట్ యార్డులో ఉంది. పది రోజులుగా యూరియా పంపిణీ జరగలేదు. సోమవారం వ్యవసాయ సబ్మార్కెట్ యార్డులో యూరియా పంపిణీ చేస్తారని ముందస్తు సమాచారం తెలుసుకున్న రైతులు ఆదివారం రాత్రి వందల సంఖ్యలో సబ్మార్కెట్ యార్డుకు తరలివచ్చారు. ఆదివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి కొంత మంది రైతులు పోలీస్స్టేషన్లోకి వెళ్లి తలదాచుకోగా, కొందరు రైతులు బయటి చెట్ల కిందనే తలదాచుకున్నారు. దీంతో రాత్రి మొత్తం నిద్రహారాలు మాని నిరీక్షించారు. సోమవారం మండల కేంద్రానికి 440 బస్తాలు మాత్రమే రాగా ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయినప్పటికీ రైతులందరికి యూరియా అందలేదు. -
కేంద్రాలకు ధాన్యం.. కొనుగోళ్లకు కలగని మోక్షం
తిప్పర్తి : వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. నాన్ ఆయకట్టులో ముందస్తుగా నాట్లు వేసిన పొలాలు ప్రస్తుతం చేతికి రావడంతో రైతులు కోతలు కోసి ధాన్యాన్ని సమీపంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం.. వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో పలువురు రైతులు ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మిల్లర్లు క్వింటా ధాన్యం రూ.1700 వరకే అడుగుతున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. -
జొన్నలకు డిమాండ్
నల్లగొండ అగ్రికల్చర్ : జొన్నలకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. వరి అన్నం తినడం మానేసి జొన్న అన్నం, జొన్న రొట్టెలకు జనం అలవాటు పడుతున్నారు. పూర్వం పేదలు ఎక్కువగా జొన్నలతో చేసిన ఆహారం తినేవారు. వరి అన్నం పండుగ రోజుల్లోనే వండుకునేవారు. కానీ, ప్రస్తుతం షుగర్ బాధితులు పెరుగుతున్నారు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే జొన్నరొట్టె గానీ, జొన్న అన్నంగానీ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో జనం జొన్న రొట్టె, జొన్న అన్నం తినేందుకు మొగ్గు చూపుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా జిల్లాలో జొన్నసాగు లేకపోవడంతో మార్కెట్లో బియ్యం కంటే.. జొన్నల రేటు ఎక్కువగా ఉంది. తగ్గుతున్న జొన్న సాగు జిల్లాలో పది సంవత్సరాలుగా జొన్న సాగు గణనీయగా తగ్గుతోంది. గతంలో దేవరకొండ, చండూరు డివిజన్లలో రైతులు పెద్ద ఎత్తున జొన్న, సజ్జ పంటలను సాగుచేసే వారు. కానీ జిల్లాలో సాగునీటి వనరులు పెరిగిపోవడంతో రైతులు వరి, పత్తి పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో గతంలో వేలాది ఎకరాల్లో సాగైన జొన్న పంట ఇప్పుడు వందలు, పదుల ఎకరాలకు తగ్గింది. జొన్న వినియోగం ఎక్కువ కావడం, సాగు తగ్గిపోయిన కారణంగా వ్యాపారులు కర్నాటక రాష్ట్రం నుంచి జొన్నలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. జొన్నల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రైతులు జొన్న సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జొన్న రొట్టెలతో ఉపాధి.. జనం జొన్నతో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విధుల వెంట జొన్న రొట్టెలు తయారు చేసి విక్రయించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఒక్కో జొన్న రొట్టెను రూ.10 నుంచి రూ.15 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా గిరిజన మహిళలు జొన్న రొట్టెలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. 2017 నుంచి జిల్లాలో జొన్న సాగు ఇలా (ఎకరాల్లో..) సంవత్సరం జొన్న 2017 409 2018 302 2019 678 2020 175 2021 47 2022 56 2023 76 2024 49 2025 156 ఫ జొన్నలతో చేసిన పదార్థాలు తినేందుకు షుగర్ వ్యాధిగ్రస్తుల మొగ్గు ఫ మార్కెట్లో బియ్యం కంటే.. జొన్నలకే ఎక్కువ రేటు ఫ జిల్లాలో ఏటా తగ్గుతున్న జొన్న సాగు జిల్లాలో మెట్టపంటలైన సజ్జ, జొన్న పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మా ర్కెట్లో జొన్నలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జొన్న సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. బియ్యం కంటే జొన్నలకు రేటు ఎక్కువగా ఉంది. రైతులు జొన్న సాగు చేస్తే లాభాలు పొందవచ్చు. – పాల్వాయి శ్రవన్కుమార్, డీఏఓ -
బాక్సింగ్ సెలక్షన్ పోటీలు
మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాక్సింగ్ సెలక్షన్ పోటీలు మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో గల బాక్సింగ్ కోచింగ్ సెంటర్లో సోమవారం జరిగాయి. అండర్ –14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని కోరారు. గెలుపు ఓటమిలు సహజమని సెలక్ట్ కాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 మంది ఈ పోటీలకు హాజరు కాగా అండర్–14 బాలుర విభాగంలో ఎండీ.యూసుఫ్, ఉమామహేశ్వర్రెడ్డి, సూర్యవర్మ, లోకేష్, రెహమాన్, ముజాహిద్ రెహమాన్, అండర్–17 బాలుర విభాగంలో రూపక్ రామ్, నవదీప్, శివ, నిపాన్, ఆరిఫ్, ఎన్.శివ, సాయిసిద్దార్థ, అబ్ధుల్ రెహమాన్, హరినాద్, ఎండీ.తౌసిఫ్, దేవా, నాగరాజు, తరుణ్, అండర్–17 బాలికల విభాగంలో లేఖనమాల్య, భుష్రా, సాయిప్రసన్న, నిహారిక, ప్రిన్సి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, శోభారాణి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పంగా సైదులు, బాల్తి వెంకటరత్నం, షమీమ్ అక్తర్, నాగలక్ష్మి, రవీందర్, సురేందర్రెడ్డి, సావిత్రి, జనార్దన్రెడ్డి, అష్రఫ్ అహ్మద్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిర్యాలగూడలో నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్
మిర్యాలగూడ అర్బన్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో సోమవారం నిలిచిపోయింది. సోమవారం హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ మిర్యాలగూడ సమీపంలోకి రాగానే ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫాం–1 లో రైలును నిలిపివేశారు. స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు రామన్నపేట రైల్వేస్టేషన్ నుంచి మరో రైలు ఇంజన్ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. గంటన్నర తరువాత వచ్చిన రైలు ఇంజన్ సహాయంతో రైలు బయలు దేరింది. గంటన్నర సమయం మిర్యాలగూడలో రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు రైలు కదలడంతో ఊపిరి పిల్చుకున్నారు. మూసీకి పెరిగిన వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం 2,248 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 8,761 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను పైకెత్తి 7,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 533 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644.15 అడుగుల(గరిష్ట నీటిమట్టం 645 అడుగుల) వద్ద స్థిరంగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలినల్లగొండ టూటౌన్ : స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి మండలం నుంచి మూడు పేర్లను జిల్లా కార్యాలయానికి పంపాలని.. ఆ పేర్లను ఈ నెల 8న నల్లగొండకు వస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్కు అందిస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు బొగరి అనిల్ కుమార్, గోలి మధుసూదన్రెడ్డి, వీరేల్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పోతెపాక సాంబయ్య, మంగళపల్లి కిషన్, బాకి నరసింహ, వెంకట్రెడ్డి, కొత్తపల్లి వెంకట్, రుక్మగౌడ్, పంజాల యాదగిరి, నాగరాజ్గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలిగుర్రంపోడు : సెలవుల అనంతరం విద్యార్థుల హాజరును రెండురోజుల్లో వందశాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతి అన్నారు. సోమవారం గుర్రంపోడులోని కేజీబీవీ, పిట్టలగూడెం ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. కేజీబీవీలో సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థునులను రప్పించేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని సిబ్బందికి సూచించారు. కేజీబీవీలో వంట గది, స్టోర్రూమ్ను పరిశీలించి ఎస్ఓ విజయశ్రీకి సూచనలు చేశారు. పిట్టలగూడెం పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు అద్దంకి సునీల్కుమార్, నర్సింహ ఉన్నారు. -
హామీని వెంటనే నెరవేర్చిన కలెక్టర్
త్రిపురారం : మండల కేంద్రంలోని రాజీవ్ కాలనీలో ఎస్టీ మినీ గురుకులాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భారతీ విద్యార్థులు హస్టల్లో నేల పైన నిద్రించాల్సి వస్తోందని కలెక్టర్కు వివరించారు. హాస్టల్ మొత్తం కలియదిరిగిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చిటించారు. విద్యార్థుల సౌకర్యార్థం 100 పరుపులను అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఉదయం ఇచ్చిన హామీ ప్రకారం సాయంత్రానికి పాఠశాలకు 100 పరుపులు పంపించారు. దీంతో మండల అధికారులు కలెక్టర్ పంపించిన 100 పరుపులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంఈఓ రమావత్ రవినాయక్, హెచ్ఎం భారతీ, సిబ్బంది ఉన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి జ్వరాలు ప్రబలుతున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె ఆస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు, మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది సమయ పాలన పటించాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల వైద్యాధికారి మాళోతు సంజయ్ ఉన్నారు.ఫ విద్యార్థులకు 100 పరుపులు పంపిణీ -
దేవరకొండ డిపోకు 90 ఏళ్లు
దేవరకొండ : దేవరకొండ డిపో ఏర్పాటు చేసి 90ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం డిపో ఆవరణలో ఉద్యోగులు, కార్మికుల సమక్షంలో డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలంలో 1936 అక్టోబర్ 6న దేవరకొండ డిపోగా ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవరకొండ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వారి ఆదరణ చూరగొన్నట్లు తెలిపారు. డిపో ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో ఉత్తమ సేవలు అందిస్తూ దేవరకొండ డిపో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమంలో ఏడీఎం పడాల సైదులు, ఎంఎఫ్ కృష్ణయ్య, టీఐ దీప్లాల్, పాపరాజు, సమద్, ఉద్యోగులు, కార్మికులున్నారు. -
మానసిక వ్యాధితో యువకుడు ఆత్మహత్య
వలిగొండ : మానసిక వ్యాధితో బాధపడుతూ గడ్డి మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని ముద్దాపురం పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూరెడ్డి అనిల్రెడ్డి (23) అనే యువకుడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి ఆత్మకూర్ ఎం మండలంలోని మేనమామ ఇంటి వద్ద ఉంటున్నాడు. పక్కనే ముద్దాపురం శివారులో ఉన్న ఎరువుల దుకాణంలో పనిచేస్తూ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తాను పనిచేస్తున్న ఎరువుల దుకాణంలో గడ్డి మందు తెచ్చుకుని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. భార్యతో గొడవపడి.. అర్వపల్లి: భార్యతో గొడవపడి సంచారజాతికి చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం సమీపంలోని గుట్టపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కోటపేట గ్రామానికి చెందిన పూసల భద్రి(45) కొద్దిరోజులుగా తిరుమలగిరిలో ఉంటూ గ్రామాలు తిరిగి దిష్టిబొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన బైక్పై సీతారాంపురం సమీపంలోని గుట్టపైకి వెళ్లి లుంగీతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈట సైదులు తెలిపారు. -
నిజాయితీ చాటుకున్న ఆరీ్టసీ సిబ్బంది
నకిరేకల్ : ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికులు పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికులకు అప్పగించారు. వివరాలు.. కోదాడ ప్రాంతం నుంచి ఇద్దరు మహిళా ప్రయాణికులు నకిరేకల్కు వస్తున్నారు. సూర్యాపేట వరకు వచ్చాక సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్లో నల్లగొండకు వెళుతున్న టీఎస్ 4064 నంబర్ గల బస్సును సోమవారం మధ్యాహ్నం ఎక్కారు. ఈ క్రమంలో తమ సీటులో లక్ష రూపాయలు నగదు ఉన్న బ్యాగ్, మరో చేయి సంచిని సీటులో పెట్టి అత్యవసరంగా బస్సు దిగారు. అనంతరం ఆ ఇద్దరు ప్రయాణికులు తిరిగి బస్ కోసం రాగా అప్పటికే వెళ్లిపోయంది. సదరు ప్రయాణికులు అక్కడే బస్టాండ్లో ఉన్న కంట్రోలర్కు సమాచారం అందజేశారు. ఆయన ఫోన్ ద్వారా నకిరేకల్లో ఉన్న ఆర్టీసీ కంట్రోలర్ మన్నాన్కు సమాచారం అందించారు. నకిరేకల్ కంట్రోలర్ మన్నాన్.. కండక్టర్ నకిరేకల్ వాసి నోముల సత్తయ్యకు ఫోన్ చేసి ప్రయాణికులు బస్సు సీటులో ఉంచిన బ్యాగ్ను భద్రపరచమని సమాచారం అందించారు. బ్యాగ్ మిస్ అయిన ప్రయాణికులు కూడా నకిరేకల్లో ఉంటున్న వారి బంధువులకు సమాచారం అందించారు. కండక్టర్ సత్తయ్య బ్యాగ్ను భద్రపరిచి పోగొట్టుకున్న వారి బంధువులకు నకిరేకల్లో అప్పగించారు. బ్యాగ్ మిస్ అయినవారు నకిరేకల్కు మరో బస్లో వచ్చి తీసుకున్నారు. -
‘సీఎంఆర్ఎఫ్’ నిందితుల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మేళ్లచెర్వు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. హుజూర్నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసిన పెండెం వెంకటేశ్వర్లు, ప్రైవేట్ పీఏగా పనిచేసిన పులిందిండి ఓంకార్.. 2023 సంవత్సరం కంటే ముందు మంజూరైన మొత్తం రూ.34,58,400 విలువ గల 51 చెక్కులు అసలైన లబ్ధిదారులకు అందించకుండా లబ్ధిదారుల పేర్లకు దగ్గరగా ఉన్న వ్యక్తులను గుర్తించి అక్రమాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై మంజూరైన మొత్తాన్ని కాజేయాలనే దురుద్దేశంతో, చెక్కులపై ఉన్న అసలు లబ్ధిదారుల పేర్లకు దగ్గరగా ఉన్న ఇతరులను వీరు ఎంచుకున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు సహకారంతో నకిలీ లబ్ధిదారుల అకౌంట్లలో ఈ చెక్కులను జమ చేయించి, డబ్బులు డ్రా చేశారు. నకిలీ వ్యక్తులకు కొంత కమీషన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని పంచుకున్నారు. అయితే మేళ్లచెర్వుకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పక్షవాతం రావడంతో 2023లో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. చెక్కు వచ్చినప్పటికీ రాలేదని పక్కదారి పట్టించారు. ఇటీవల తన పేరు మీద వచ్చిన చెక్కును మరొకరు డ్రా చేసుకున్నట్లు తెలియడంతో మేళ్లచెర్వు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేరం మాజీ ఎమ్మెల్యేకు తెలియకుండా క్యాంప్ కార్యాలయంలోని ప్రైవేట్ వ్యక్తులు తమ స్వలాభం కోసం పాల్పడినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుల నుంచి పోలీసులు రూ.7.30లక్షల నగదు, 44 వాడని చెక్కులు, 6 సెల్ ఫోన్లు, 6 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.34,58,400 విలువ గల 51 చెక్కులు ఆధీనంలో పెట్టుకుని వీటిలో రూ.9.50లక్షల విలువగల 7 చెక్కులు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు . దుర్వినియోగానికి గురైన రూ. 9.50 లక్షలలో బాధితుడికి రూ.2 లక్షల 25వేలు ఇచ్చాక మిగిలిన రూ.7,30లక్షల నగదును నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పెండెం వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పీఏ పులిందిండి ఓంకార్తోపాటు నకిలీ లబ్ధిదారులు మాదాసు వెంకటేశ్వర్లు, మట్టపల్లి సైదులు, గొట్టుముక్కల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సైదులు, బెల్లంకొండ పద్మలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ వ్యక్తుల అకౌంట్లలోకి రూ. 9.50 లక్షలు జమ 8 మంది నిందితుల అరెస్ట్ రూ.7.30 లక్షల నగదు, 44 చెక్కులు స్వాధీనం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూలు జిల్లా వంగూరు మండలం చారగొండకు చెందిన కొట్ర శివ(29) ద్విచక్ర వాహనంపై మరో మహిళతో కలిసి దేవరకొండ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కొండభీమనపల్లి వద్దకు రాగానే దేవరకొండ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శివ, మహిళ కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి వివరాలు సేకరించారు. మృతదేహాలను దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నల్లగొండ: టాస్క్ఫోర్స్ పోలీసుల సమాచారం మేరకు వ్యభిచార గృహంపై నల్లగొండ వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు విటులు, ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తి, ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వివరాలు.. సోమవారం నల్లగొండ పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. కొన్ని నెలలుగా ఆ ఇల్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
సంస్థాన్ నారాయణపురం: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు అందోజు బీష్మా( రాజుచారి) తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపాక గ్రామంలోని బంధువులు ఇంట్లో శుభకార్యం ఉండడంతో బీష్మా( రాజుచారి) కుంటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రాత్రి సమయంలో దుండగులు గేట్ తాళం పగులగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ తాళం రాలేదు. దీంతో ఇంటి పక్కన సందులో నుంచి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళం పగులగొట్టకుండా స్క్రూలు తొలగించారు. బీరువాలోని 12 తులాలు బంగారు వస్తువులు (చైన్లు, రింగ్లు, ఇతర వస్తువులు), అరకేజీ వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు చోరీ చేశారు. బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడవేశారు. సోమవారం బీష్మా ఇంటికి వచ్చేసరికి గేట్ తాళం వంగి ఉండడం, ప్రధాన ఇంటి ద్వారం తాళం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ మధుసూదన్రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐ జగన్ పరిశీలించారు. క్లూస్ టీం క్లూస్తో వివరాలు సేకరించినారు. గ్రామంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. -
జాతీయ రహదారిపై కొనసాగిన రద్దీ
చౌటుప్పల్ : జాతీయ రహదారిపై వాహనాల రద్దీ సోమవారం సైతం కొనసాగింది. దసరా పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో 65వ నంబర్ హైవేపై హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. సాధారణ రోజుల్లో సుమారుగా 35 వేల నుంచి 40వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, సోమవారం అదనంగా మరో 20 వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అంచనా. చౌటుప్పల్ పట్టణంలో నెలకొన్న రద్దీని నియంత్రించేందుకు జంక్షన్లను మూసివేశారు. బస్టాండ్లోకి ఆర్టీసీ బస్సులను సైతం అనుమతించలేదు. ప్రత్యేక పోలీసులను రంగంలోకి దింపారు. సాయంత్రం వరకు బారులుదీరిన వాహనాలు.. ఆ తర్వాత తగ్గాయి. హైవేపై రద్దీ కారణంగా కొంతమంది వాహనదారులు సర్వీస్రోడ్ల మీదుగా మళ్లించడంతో అవిసైతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి. పంతంగి టోల్ప్లాజా వద్ద .. చౌటుప్పల్ రూరల్: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్కు ప్రజలు వస్తుండంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ కొనసాగింది. సుమారు 6 కిమీల వరకు పంతంగి టోల్ప్లాజా నుంచి చౌటుప్పల్ వరకు భారీగా వాహనాలు బారులుదీరాయి. ఈ క్రమంలో నల్లగొండ నుంచి హైదరాబాద్కు ఆస్పత్రికి వెళ్తున్న ఓ అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. అంకిరెడ్డిగూడెం నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు సైడ్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అంబులెన్స్ కూడా నెమ్మదిగా ముందుకు సాగింది. పంతంగి టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను 10 విండోలు ఓపెన్ చేసి పంపించారు. ఫాస్టాగ్ పని చేయని వాహనాలకు ఫొటో తీసుకుని పంపించారు. చిట్యాల వద్ద హైవేపై..చిట్యాల: విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ నగరం వైపునకు చిట్యాల పట్టణంలో హైవే మీదుగా వాహనాల రద్దీ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. చిట్యాల పట్టణంతోపాటు పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైవేపై ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్న కారణంగా సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. చిట్యాల పట్టణ ప్రజలు హైవే రోడ్డును దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఆన్లైన్ విధానం
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద మిర్యాలగూడ : అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్న చెక్పోస్టులను తొలగించి ఆన్లైన్ విధానంలో పన్ను వసూలు చేయనున్నారు. ఆఫ్లైన్ విధానంలో పన్నుల వసూలులో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణాశాఖ చెక్పోస్టులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా చెక్పోస్టుల వద్ద ఆన్లైన్ విధానంలో పన్ను వసూలుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రవాణా శాఖ అధికారులు తాత్కాలికంగా చెక్పోస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా చెక్పోస్టుల వద్ద ఆన్లైన్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ విధానం అమలైతే వాహనదారులు తాత్కాలిక, పర్మినెంట్ ట్యాక్స్లను ఆన్లైన్లో చెల్లించి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్పోస్టులు ఏర్పాటు కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ సమీపంలోని నల్లబండగూడెం వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే తదితర వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ చెక్పోస్టుల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం తాత్కాలికంగా చెక్పోస్టుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణాశాఖ చెక్పోస్టులను ఎత్తివేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా చెక్పోస్టుల వద్ద ఆన్లైన్ విధానంలో పన్ను వసూలుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రవాణా శాఖ అధికారులు తాత్కాలికంగా చెక్పోస్టులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ వసూళ్లపై అనుమానాలు.. చెక్పోస్ట్ను తొలగిస్తుండడంతో ఆన్లైన్ ద్వారా వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వాహనదారులు పన్ను చెల్లించకుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించడంతోపాటు అనుమతులు లేకుండా తిరిగే వాహనదారులను గుర్తించి సరైన చర్యలు తీసుకున్నప్పుడే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పర్యవేక్షణ చేసేందుకు వాహనాలతోపాటు సిబ్బంది కూడా అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేర స్క్వాడ్ బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆన్లైన్ పన్ను వసూలు చేయనున్న నేపథ్యంతో వాహనదారులకు అవగాహన కల్పించేలా.. చెక్పోస్టుల వద్ద ఇంగ్లిషు, తెలుగు, హిందీ భాషాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో టెంపరరీ పర్మిట్, వాలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్ను ఏవిధంగా చేసుకోవాలో ఆ ఫ్లెక్సీలో వివరించారు. ప్రతి వాహనదారుడు ఆన్లైన్లో వాహనాల వివరాలను నమోదు చేసుకొని అనుమతి పొందాలని సూచిస్తున్నారు. ఫ పన్ను చెల్లించిన వాహనాలకే ప్రవేశం ఫ అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై కేసులు ఫ నూతన విధానంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీల ఏర్పాటు ఫ ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల చెక్పోస్టులు ఆన్లైన్ పన్ను వసూలుకు కోసం ప్రభుత్వం వాహన యాప్ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అమలులో భాగంగా సరిహద్దు వద్ద రవాణాశాఖ ఏఎన్పీఆర్ (ఆటో నెంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ – ఎన్ఫోర్స్మెంట్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను గుర్తించేలా దానికి వాహన యాప్ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాల తెలుస్తాయి. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వాహనదారులు నిర్ధేశించిన వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మొబైల్ టీమ్లు వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తాయి. -
కృష్ణారెడ్డి ఆత్మీయ అభినందన సభ
రామగిరి (నల్లగొండ): మానవీయ స్ప్రహతో కూడిన కవిత్వం రాయడం బైరెడ్డి కృష్ణారెడ్డికే సాధ్యమని సాహితీవేత్త కె.కనకాచారి అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో నిర్వహించిన కృష్ణారెడ్డి ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. కవిత్వంలో కృష్ణారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఈ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశామన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆర్తి పేరుతో కవిత్వ సంపుటలు వెలువరిస్తూ కృష్ణారెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. అనంతరం కృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి, పెరుమాళ్ళ ఆనంద్, మునాసు వెంకట్, తండు కృష్ణకౌండిన్య, కోమటి మధుసూదన్, మాదగాని శంకరయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, ఎలికట్టె శంకర్రావు, హిమవంతరెడ్డి, బండారు శంకర్, సాగర్ల సత్తయ్య, భీమార్జున్రెడ్డి, దాసరి శ్రీరాములు, డాక్టర్ మేక ఉమారెడ్డి, గంటెకంపు గణేష్, డా.దైద రవి, సంధ్య, అంబటి వెంకన్న, దేవులపల్లి రామచంద్రయ్య, డాక్టర్ చింతోజు మల్లికార్జునచారి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రైతులకు ఊరట
నల్లగొండ అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు ఊరట లభించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండేది. దీంతో రైతులపై పెద్ద ఎత్తున భారం పడేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 5 శాతానికి తగ్గించడంతో వ్యవసాయ పరికరాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం రైతులకు కాస్త మేలు జరగనుంది. ఇప్పటి వరకు 1400 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనుంది. గత యాసంగిలోనే పథకాన్ని ప్రారంభించినప్పటికీ మార్చిలో బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల నిధులు రాలేదు. ఈసారి ముందస్తుగానే ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పరికరాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1400 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అక్టోబరు చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పరికరాలను అందించనున్నారు. సబ్సిడీపై పరికరాల అందజేత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో.. ప్రభుత్వానికి వ్యవయాయ యాంత్రీకరణ పరికరాలు సరఫరా చేసే కంపెనీలు కూడా రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేయనున్నారు. యాంత్రీకరణ దరఖాస్తులను స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు.. యూనిట్ల రేట్లను సవరిస్తున్నారు. దీంతో ఈ పథకంలో రైతులపై కూడా ఆర్థికభారం తగ్గనుంది. 15 రకాల పరికరాలు.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 15 రకాల పరికరాలు ఉన్నాయి. వాటిలో రోటోవేటర్, ఎండీ ప్లగ్, కల్టివేటర్, డిస్క్యారో, కేజీవీల్, పండ్ పర్మార్, రోడో పడ్లర్, పవర్ టిల్లర్, సీడ్ ఫ్రం పర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్పేయర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రే, పవర్ వీడర్, బ్రష్కటర్, స్ట్రాబేలర్స్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై అందించనున్నారు. జీఎస్టీ సవరించడంతో వీటి ధరలు కూడా తగ్గనున్నాయి. ఫ జీఎస్టీ తగ్గింపుతో దిగివస్తున్న వ్యవసాయ పరికరాల రేట్లు ఫ యాంత్రీకరణ పథకానికి రేట్లు సవరిస్తున్న అధికారులు ఫ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఫ ఈ నెలాఖరు నాటికి రైతులకు అందనున్న పరికరాలు -
బీమా ఉద్యోగుల పోరాట ఫలితమే జీఎస్టీ రద్దు
నల్లగొండ టౌన్: బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగులు సంఘం పోరాట ఫలితమే అని సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.రఘు అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన ఐసీఈయూ నల్లగొండ 1,2, ఎల్ఐసీ శాఖల సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు ఎన్నో ఆందోళనలు చేశామన్నారు. ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఐసీఈయూ డివిజన్ కోశాధికారి జావీద్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ళ బాలస్వామి, గడ్డం నవీన్దాస్, బి.రాములుయాదవ్, బెల్లంకొండ కన్నయ్య, వెంకన్న, పోలె లింగయ్య, వేముల కృష్ణయ్య, వేముల శ్రీను, గౌరు శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరెడ్డి, శ్యాంబాబు, నరేందర్రెడ్డి, రావుల వీరయ్య, నలపరాజు సైదులు, దారం వెంకన్న, బి.రామలింగం పాల్గొన్నారు. -
గుర్తింపు పొందిన పార్టీలు 12
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి 12 రాజకీయ పార్టీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచే ఆయా అభ్యర్థులకు పార్టీలు బీ ఫారాలు అందజేస్తాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీలకు స్థానిక ఓటర్ల జాబితా ముద్రించి అందించేందుకు జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్ జాబితాను ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీ, జనసేన, ఎంఐఎంలకు మాత్రమే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందిస్తే వారికి పార్టీల గుర్తులు దక్కనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే వారికి ఇతర గుర్తులు కేటాయించనున్నారు. ముమ్మరంగా ఎన్నికల ప్రక్రియ జిల్లాలో 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 1,957 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5,30,860 మంది పురుషులు, 5,42,589 మంది మహిళలు, 57 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, వారి విగ్రహాలకు ముసుగులు వేశారు. కాగా.. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించే తీర్పు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలు : 353 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు : 33పోలింగ్ కేంద్రాలు : 1,957మొత్తం ఓట్లు : 10,73,506ఫ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు ఫ ఆయా పార్టీలకు ఓటర్ల జాబితా అందించేందుకు ఏర్పాట్లు -
హిందూ సంఘటనతోనే రక్షణ
నల్లగొండ టూటౌన్ : హిందూ సంఘటన దేశానికి రక్షణ అని హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ఆర్ఎస్ఎస్ నల్లగొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్య అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియం నుంచి నాగార్జున కళాశాల వరకు పద సంచలన్ (ర్యాలీ) నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధికి హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఇటికాల కృష్ణయ్య, దోసపాటి శ్రీనివాస్, కాసం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్డే రద్దు
నల్లగొండ: స్థానిక సంస్థలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని.. అప్పటి వరకు జిల్లా పోలీస్ కార్యాలయానికి బాధితులు రావద్దని పేర్కొన్నారు. సాగర్లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారంతా ఆంధ్రా ప్రాంతం నుంచి హైద్రాబాద్, తదితర పట్టణాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న సాగర్ అందాలను తిలకించారు. సాగర్డ్యాం దిగువన నదీతీరం వెంట, లాంచీ స్టేషన్, బుద్ధవనం, కొత్తబ్రిడ్జి, అనుపు, ఎత్తిపోతల తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. వాహనాలు ఎక్కువగా నిలపడంతో కొత్తబ్రిడ్జి వద్ద ట్రాఫిక్ స్తంభించింది. మూసీకి 2,248 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గింది. మూసీ రిజర్వాయర్కు పదిహేను రోజుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పైగా వచ్చిన ఇన్ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తిన అధికారులు 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రం వరకు 643.80 అడుగుల(4.15 టీఎంసీలు)వద్ద నీరుంది. నూతన కార్యవర్గం ఎన్నిక రామగిరి(నల్లగొండ): ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్ట్మెన్, ఎంటీఎస్ 42 వార్షిక మహాసభ ఆదివారం నల్లగొండ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల యాదయ్య కార్యదర్శిగా కే కృష్ణయ్య ఎన్నికయ్యారు. ఫైనాన్సియల్ సెక్రెటరీగా సత్యనారాయణ ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏఐపీఈయూ పోస్ట్మెన్, ఎంటీఎస్ కార్యదర్శి ఏం. మధుసూదన్రావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాట్యమయూరాలు భువనగిరి: రాయగిరి మినీ శిల్పారామంలో సెప్టెంబర్ 29 నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాలు అదివారం ముగిశాయి. చివరి రోజు హైదరాబాద్కు చెందిన తుమ్మాటి ప్రణవి శిష్యబృందం కళాకారులు కూచిపూడి నృత్యంలో అలరించారు. సెలవు దినం కావడంతో యాదగిరిశీడి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో మినీశిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. చెరువులో బోటు షికారు చేసి, పార్కులో ఆహ్లాదంగా గడిపారు. కార్యక్రమంలో కళాకారిణులు అంజని, కీర్తన, సహస్ర, ప్రదీక్ష, రితిక, సాన్వి, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
జోహార్.. ఆర్డీఆర్
సూర్యాపేట : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి (ఆర్డీఆర్) మరణవార్త విని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈనెల 2వ తేదీ రాత్రి 10.10 గంటలకు దామోదర్రెడ్డి మృతిచెందిన విషయం విదితమే. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపులి లాంటి దామన్నకు ఎవరూ సాటిరారని, దేవుడు తమకు అన్యాయం చేసి మా నాయకున్ని తీసుకెళ్లాడని దుఃఖించారు. జోహార్ దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల సందర్శనార్థం రెడ్హౌస్కు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్లో నివాళులర్పించిన అనంతరం రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో శుక్రవారం సూర్యాపేటలోని రెడ్హౌస్కు తీసుకొచ్చారు. తమ అభిమాన నాయకున్ని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు వేలాది మందిగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా తరలివచ్చారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాళాల వద్ద మధ్యాహ్నం 3గంటల నుంచే ప్రజలు వేచిచూశారు. మరికొందరు రెడ్హౌస్ వద్ద బారులుదీరారు. సాయంత్రం 5.15 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంది. దామోదర్రెడ్డి పార్థివదేహం ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ముందుభాగంలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి కూర్చుని తన తండ్రిని చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ నుంచి పాతబస్టాండ్, పోస్టాఫీస్ సెంటర్, వాణిజ్య భవన్ సెంటర్ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్తబస్టాండ్ నుంచి ర్యాలీగా పార్థివదేహాన్ని రెడ్హౌస్కు తీసుకెళ్లారు. ఇందులో వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. శక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా రెడ్హౌస్లో దామన్న పార్థివదేహాన్ని ప్రజలు , అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందర్శించి కడసారి తమ అభిమాన నాయకున్ని చూసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో తుంగతుర్తికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్డీఆర్ గడీ పక్కనే పామాయిల్ తోటలో మహా ప్రస్థానం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్లు అంత్యక్రియల కోసం చేపట్టిన పనులను పర్యవేక్షించారు. సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వేదాపు వెంకయ్య, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఫ తుంగతుర్తికి చేరిన రాంరెడ్డి దామోదర్రెడ్డి పార్థివదేహం ఫ అంతకుముందు సూర్యాపేటలో భారీ ర్యాలీ ఫ రెడ్హౌస్లో మంత్రి సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, జైవీర్రెడ్డి, ప్రముఖుల నివాళి ఫ కన్నీటి పర్యంతమైన పార్టీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఫ నేడు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు -
ప్రముఖుల నివాళి
సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో దామోదర్రెడ్డి పార్థివదేహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, జూలకంటి రంగారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, దోసపాటి గోపాల్, వివిధ పార్టీల నాయకులు చెరుకు సుధాకర్, బడుగుల లింగయ్య యాదవ్, పిట్ట రాంరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి తదితరులు నివాళులర్పించారు. వీరి వెంట సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సమన్వయ కమిటీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవు సర్వోత్తమ్రెడ్డి వెంటే ఉన్నారు. -
ఖైదీలు గాంధీ బాటలో నడవాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : ఖైదీ గాంధీ బాటలో నడిచి.. సమాజానికి ఆదర్శంగా మారాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జైలు గోడలు ఖైదీల శరీరాన్ని బంధిస్తాయని.. వారి మనస్సును కాదన్నారు. గతంలో తప్పులు జరిగాయని.. భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని ఖైదీలకు సూచించారు. జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేశ్, ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ సౌందర్య, ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్దార్ పరశురామ్, జైలర్ బాలకృష్ణ, వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం నల్లగొండ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ సెప్టెంబర్ 21న ప్రకటించిన దసరా సెలవులు శుక్రవారంతో ముగిశాయి. శనివారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆదివారాలు మినహాయిస్తే పండుగ సెలవులు 11 రోజులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా నేటినుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతనల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన అయ్యిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కటికం సత్తయ్య గౌడ్, కొండూరు సత్యనారాయణ, దేప వెంకటరెడ్డి, గాదె రాంరెడ్డి, కృష్ణార్జునరెడ్డి, బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య, పంతంగి శ్రీనాథ్, కొప్పోలు విమలమ్మ, పెరిక కరుణ్ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి మఠంపల్లి: మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద పవిత్ర కృష్ణానదికి శుక్రవారం రాత్రి అర్చకులు హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో మంగళ వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్కు తరలించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయ ప్రవేశం గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
కాంగ్రెస్ కసరత్తు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికపై నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంత నెలకొంది. జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అభ్యర్థులను ఎవరన్న దానిపై ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఈనెల 6వ తేదీ నాటికి పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్, ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సాధించారు. నలగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా, సూర్యాపేట చైర్మన్ పదవి బీసీకి, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే జెడ్పీ చైర్మన్ పదవి ఆశించే నేతలు సులభంగా గెలిచే జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు. జెడ్పీ పీఠం దక్కేదెవరికో..? ● నల్లగొండ జెడ్పీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఈసారి చైర్మన్ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఈ అయిదు స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ఎస్టీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. అందులో అడవిదేవులపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, దామరచర్ల, తిరుమలగిరిసాగర్ స్థానాల్లో ఎస్టీ మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్ పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె కనుక వద్దంటే ఆమె కుమారుడు స్కైలాబ్నాయక్ సతీమణిని బరిలో దింపుతారన్న చర్చ జరుగుతోంది. అయితే ఆమె ప్రభుత్వ అధికారి అయినందున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ● సూర్యాపేట జిల్లా జెడ్పీ పీఠం బీసీలకు రిజర్వు కావడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఈ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టినా మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియల తరువాత దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. అయితే బీసీలకు రిజర్వు చేసిన గరిడేపల్లి, కోదాడ, నడిగూడెం, పెన్పహాడ్, నాగారం, బీసీ మహిళలకు కేటాయించిన ఆత్మకూరు(ఎస్), చింతలపాలెం, మేళ్లచెరువు, నేరేడుచర్ల, సూర్యాపేట, జనరల్ మహిళలకు కేటాయించిన అర్వపల్లి, మఠంపల్లి, జనరల్ స్థానాలైన చిలుకూరు, చివ్వెంల, పాలకీడు స్థానాల్లో పోటీచేసి గెలిచే బీసీ నాయకులకు చైర్మన్ పదవి దక్కనుంది. ● యాదాద్రి–భువనగిరి జిల్లా పరిషత్ స్థానం బీసీ మహిళలకు కేటాయించారు. దీంతో ఇక్కడ బీసీలకు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాలతో పాటు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లో బీసీ మహిళలు ఎవరైనా పోటీ చేసి గెలుపొందితే వారిలో ఒకరికి జెడ్పీ చైర్పర్సన్ అయ్యేందుకు అవకాశం దక్కనుంది. బీసీ మహిళలకు కేటాయించిన ఆలేరు, ఆత్మకూరు (ఎం), చౌటుప్పల్తో పాటు బీసీలకు కేటాయించిన అడ్డగూడూరు, భూదాన్పోచంపల్లి, గుండాల వలిగొండ జడ్పీటీసీ స్థానాలతో పాటుగా, జనరల్ మహిళలకు కేటాయించిన భువనగిరి, మోటకొండూరు, తుర్కపల్లి, జనరల్ కేటగిరీలో ఉన్న బీబీనగర్, సంస్థాన్ నారాయణపురం, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ మహిళలు పోటీచేసే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆశావహులు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికల మూడ్లోకి వచ్చేసారు. పోటీ చేయాలనుకునే వారంతా తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు ఆయా పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఫ జెడ్పీటీసీ సభ్యులు, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతల దృష్టి ఫ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిలో జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కోసం అన్వేషణ ఫ నల్లగొండలో ఎస్టీ మహిళ ఎంపికపై ఉత్కంత ఫ పోటీచేసే యోచనలో రాగ్యానాయక్ సతీమణి లేదంటే కోడలు -
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతల స్వీకరణ
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ (2025–27) నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి–1 (ప్రధాన కార్యదర్శి)గా వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడిగా గోళ్ల రామ్శేఖర్, కార్యదర్శి–2గా పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారిగా గందె రాముతోపాటు పది మంది డైరెక్టర్లు గౌరు శంకర్, నీలా పాపారావు, రాయిని శ్రీనివాస్, పోతుగంటి కృష్ణ, మలిగిరెడ్డి మాధవరెడ్డి, కొమ్మన పట్టాభిరామ్, గుంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని రైస్ మిల్లర్స్, బంధువులు, స్నేహితులు, శాలువాలలు, పూమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మిల్లర్స్ మాజీ ఉపాధ్యక్షుడు గంట సంతోష్రెడ్డి, డాక్టర్ బండారు కుశలయ్య, రంజిత్, కర్నాటి లక్ష్మీనారాయణ, రంగా శ్రీధర్, రేపాల అంతయ్య, మాశెట్టి శ్రీనివాస్, రవికుమార్, రమేష్, నాగరాజు పాల్గొన్నారు. -
కోతకొచ్చిన వరిపంట
ఫ నాన్ ఆయకట్టు మండలాల్లో కోతలు షురూ ఫ ముందస్తుగా సాగుచేసిన పంటకోత పనుల్లో అన్నదాతలు ఫ దసరా పండుగ తర్వాత ఊపందుకోనున్న కోతలు ఫ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల కసరత్తు మూడెకరాల్లో సాగుచేసిన వరిపొలమంతా ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎర్రబారి నేలవాలి పోయింది. దాన్ని కోత మిషన్తో కోయించాల్సి వస్తోంది. ఈసారి కోత ఖర్చు రెండింతలు అయ్యే అవకాశం ఉంది. –కె వెంకన్న, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం నాన్ ఆయకట్టులో వరికోతలు ప్రారంభమయ్యాయి. దసరా పండుగ తర్వాత కోతలు ఊపందుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల వరిచేలు నేల వాలాయి. దీంతో ఈసారి కోతల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారినల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5.05లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో నాన్ఆయట్టు ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. అయితే నాన్ ఆయకట్టులో జూన్ మొదటి వారంలోనే బోరుబావుల కింద వరినార్లు పోసుకున్న రైతులు జూలైలో నాట్లు వేసుకున్నారు. ఈ సారి జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. ఫలితంగా నాన్ఆయకట్టులో పెద్ద ఎత్తున వరినాట్లు వేసుకున్నారు. దొడ్డురకంతోపాటు సన్నాలను కూడా రైతులు సాగు చేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరిచేలు నేలవాలిపోయాయి. మరికొన్ని చోట్ల చీడపీడలు సోకి ఎర్రబారాయి. ముందస్తుగా సాగుచేసిన వరిచేలను మూడు రోజుల నుంచి కోస్తుండగా దసరా పండుగ తరువాత వరికోతలు ఊపందుకోనున్నట్టు తెలుస్తోంది. రైతులపై ఆర్థికభారం అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరిచేలు నేలవాలాయి. ఆ వరిచేలను కోయాలంటే టైర్ మిషన్లు కాకుండా చైన్ మిషన్లతో కోయాల్సి వస్తోంది. దీంతో సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉండడంతో గంటలకు రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున మిషన్లకు చెల్లించాల్సి రావడం, ఎకరాకు సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున వరికోతకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు రైతులు భరించాల్సి ఉంటుంది. దీంతో తమపై అదనపు ఆర్థికభారం పడనుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి అంచనా 11 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎకరాకు సగటున 23 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంటున్నారు. అయితే జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతంలో మూడు రోజులుగా వరికోతలు ప్రారంభం కానుండడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా అధికారులు.. వ్యవసాయ శాఖ, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు, వసతుల కల్పనపై చర్చించారు. వానాకాలం వరిసాగు వివరాలు.. (ఎకరాల్లో..) జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 5,05,560 నాన్ ఆయకట్టులో 3,00,000 దిగుబడి అంచనా (మెట్రిక్ టన్నులు) 11,62,788 -
అర్వపల్లిలో పూజలు చేశాకే ఎన్నికల ప్రచారం
అర్వపల్లి: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఇలవేల్పు దైవం. దామోదర్రెడ్డి అత్త ఉప్పునూతల కౌసల్యాదేవి పూర్వీకులు అప్పట్లో 750 ఎకరాల భూమిని అర్వపల్లి ఆలయానికి దానం చేశారు. దామోదర్రెడ్డి తుంగతుర్తి, సూర్యాపేట రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారి బీఫామ్తో ఇక్కడి ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడి ఆలయంలో స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కల్యాణోత్సవానికి దామోదర్రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపిస్తారు. వారి కుటుంబం ఏ మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఇక్కడి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసి పనులు ప్రారంభిస్తారు. 1985కు ముందు తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉండేది. ఆర్డీఆర్ ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రతి గ్రామంలో రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించారు. గోదావరి జలాలు తీసుకువచ్చి కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. – దరూరి యోగానందచారి, డీసీసీ ఉపాధ్యక్షుడు 40 ఏళ్లుగా నేను దామోదర్రెడ్డి వెంటే ఉన్నా. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ఆయన బాగోగులు చూసుకునేవాడిని. ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. తుంగతుర్తిలో శాశ్వతంగా ఉండటానికి ఏడాది కిందట గడీని మరమ్మతు చేయించుకొని ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఆయన గుర్తులు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటకీ మరిచిపోలేరు. – పెండెం రామ్మూర్తి, సీనియర్ నాయకుడు -
చికిత్స పొందుతూ మహిళ మృతి
డిండి: బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న మహిళ శుక్రవారం మృతి చెందింది. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల కేంద్రానికి చెందిన ఈరటి ఆంజనేయులు, ఈరటి అంజనమ్మ(30) దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అంజనమ్మ మూడవ సంతానంలో భాగంగా గర్భిణి కావడంతో డెలివరీ నిమిత్తం గత నెల 6న నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు డెలివరీ కావడంతో పాప పుట్టింది. అంజనమ్మకు రక్తం తక్కువగా ఉండడంతో వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించారు. గంట తర్వాత అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనమ్మ శుక్రవారం మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కల్వకుర్తి ఆస్పత్రిలోని వైధ్యుల నిర్లక్ష్యం కారణంగానే అంజనమ్మ మృతి చెందినందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
నీటిసంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి
కనగల్: మండలంలోని పగిడిమర్రి గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పగిడిమర్రికి చెందిన ఇటికాల రామలింగం – శ్రీలత కుమారుడు హర్షద్ రామ్(3) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో బొమ్మలతో ఆడుకుంటుండగా బొమ్మ నీటి సంపులో పడింది. దానిని బయటకు తీసే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు కొద్దిసేపటి తర్వాత బయటకి రాగా కుమారుడు నీటిసంపులో పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిమిర్యాలగూడ అర్బన్: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. టూ టౌన్ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్చౌక్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న 48 ఏళ్ల వ్యక్తిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్ సాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. అతడు కొద్ది రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 87126 70150, 99664 98185 నంబర్లను సంప్రదించాలని కోరారు. 6న హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ధర్నాభువనగిరి: రీజినల్ రింగ్రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఈ నెల 6న హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ కోరారు. శుక్రవారం భువనగిరిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన అలైన్మెంట్ కాకుండా 28 కిలోమీటర్లు కుదించడం వల్ల వరి, పత్తి పంటలు పండించే సారవంతమైన భూములు రైతులు కోల్పోతున్నారన్నారు. సాగుకు యోగ్యం కాని భూములు తీసుకోవాలని చట్టం చెబుతున్నా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్న వర్గాలను కాపాడేందుకు అలైన్మెంట్ మార్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కొండమడుగు నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, పెంటయ్య, కృష్ణారెడ్డి, స్వామి, నర్సింహ, చంద్రారెడ్డి, యాదగిరి, యాదిరెడ్డి, జయరాములు పాల్గొన్నారు. -
దామన్న యాదిలో..
తుంగతుర్తిలో 9 ఎకరాల్లో విశాలమైన ప్రాచీన గడి ఉంది. దామోదర్రెడ్డి ఇందులోనే ఉండేవారు. గడి చుట్టూ ప్రహరీ నిర్మించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. గడి చుట్టూ పామాయిల్ తోటలు, పండ్ల తోటలు సాగు చేసేవారు. ఈ మధ్య కాలంలోనే గడిని ఆధునీకరించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయన మార్కెట్లోకి వచ్చిన కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు. ట్రాక్టర్లు, జిప్సీలు, వ్యాన్లపై ఎక్కువ మక్కువ ఉండేది. ఏ ఒక్క వాహనాన్ని అమ్మకుండానే గడి ముందు ఉంచారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రికార్డు సృష్టించిన వ్యక్తి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి. ఖమ్మం జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఆయన తుంగతుర్తికి చెందిన ఉప్పునూతల కౌసల్యాదేవి రెండవ కుమార్తె వరూధిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిర పడ్డారు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీదే ఆధిపత్యం ఉండేది. దామోదర్రెడ్డి కమ్యూనిస్టుల ఆదిపత్యాన్ని తగ్గించి వరుసగా 1985, 1989, 2004లో గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో జిల్లాలో 11 నియోజకవర్గాలలో టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్థులు గెలుపొందగా దామోదరరెడ్డి ఒక్కరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. 1992లో నెదురుమల్లి జనార్దన్రెడ్డి, 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రుల హయాంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అధునాతన పంటల సాగుపై ఆసక్తి మాజీ మంత్రి దామోదర్రెడ్డికి పశు సంపద, వ్యవసాయం అంటే చాలా ఆసక్తి. తుంగతుర్తిలోని 130 ఎకరాల్లో అల్లనేరేడు, సపోట, మామిడి, పామాయిల్ తోటలు వేశారు. అలాగే కూరగాయల సాగు చేశారు. ఈ ప్రాంత రైతులకు నూతన పంటలపై అవగాహన కల్పించి వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేవారు. అదేవిధంగా ఎడ్ల గిత్తలను పెంచి వాటికి శిక్షణ ఇప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే ఎడ్ల పందెంలో పోటీ చేయించేవారు. రాంరెడ్డి బ్రదర్స్ ఎడ్ల గిత్తలకు మంచి పేరు ఉండేది. ఎడ్ల గిత్తల స్పెర్మ్తో మేలు జాతి పశువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా వివిధ దేశాల నుంచి శునకాలను తీసుకువచ్చి శిక్షణ ఇప్పించి పోటీల్లో ఉంచేవారు. వ్యవసాయమంటే మక్కువ దామోదర్రెడ్డికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే సాకుతో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు శంకుస్థాపన చేసి వదిలేశారు. 1999లో అప్పటి సీఎల్పీ నేత పి.జనార్దన్రెడ్డితో కలిసి దామోదర్రెడ్డి శిలా ఫలకం వద్ద రక్తతర్పణం చేశారు. అలాగే వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే శిలాఫలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జల యజ్ఞంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు నిధులు కేటాయింపజేసి కాల్వ పనులు పూర్తి చేయించారు. 2009లో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా గోదావరి జలాలను విడుదల చేయించారు. ఈ కాల్వల ద్వారా జిల్లాకు వందల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ఉండేవారు. ప్రచారం జరిగిన ప్రతిరోజు చేతికి లెదర్ బ్యాగ్ ఉండేది. ఆయన ఇది తనకు సెంటిమెంట్గా భావించేవారు. ప్రచారంలో పార్టీ ముఖ్య నాయకులను, ప్రజలను కలిసే సమయంలో ఈ బ్యాగ్ ఉండడంతో ప్రజలంతా బ్యాగ్ను ఆసక్తిగా చూసేవారు. అందులో ఏం ఉందోనని చర్చించుకునేవారు. కొందరు డబ్బులు ఉండి ఉంటాయని.. మరికొందరు పిస్టల్ ఉంటుందని చర్చించుకునేవారు. ఫ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంరెడ్డి దామోదర్రెడ్డి ఫ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి -
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట రూరల్: ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. తన స్వగ్రామమైన యాదగిరి గుట్ట మండలం సైదాపురంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తరువాత వాహన పూజలో పాల్గొన్నారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీరిదిద్దుతానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు సుఖంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల అనిత, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా పూర్ణాహుతి నిర్వహించి, కలశోద్వాసన పూజ జరిపించారు. సాయంత్రం 5.30గంటలకు విజయదశమి వేడుక, శమీ పూజతో ఉత్సవాలు ముగించారు. -
శ్రీనివాసాచారికి దసరా పురస్కారం
రామగిరి(నల్లగొండ): విజయదశమి పర్వదినం సందర్భంగా విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే దసరా పురస్కారం – 2025కు నల్లగొండకు చెందిన తెలుగు అధ్యాపకుడు ఇడికోజు శ్రీనివాసాచారి ఎంపికయ్యారు. అక్టోబర్ 5న హైదరాబాద్లో జరిగే దసరా పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు భాష, జానపద అధ్యయనం, సాహిత్య సమీక్ష, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ఆయనకు అవార్డు అందజేయనున్నారు. -
యాదగిరీశుడి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి విజయదశమి సందర్భంగా గురువారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చక బృందం ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ రవి నాయక్ లడ్డూప్రసాదం అందజేశారు. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని జరిపించారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. స్వర్ణగిరీశుడికి సూర్యప్రభ వాహన సేవభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, స్వామి వారికి పద్మావతి అమ్మవార్లకు నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం పెద్ద శేషవాహన సేవ, పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిపించారు. అంతకు ముందు స్వామి వారికి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి నవకలశ పంచామృతభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాలుభువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలేరుకు చెందిన డ్యాన్స్ టీచర్ దుర్గారావు ఆధ్వర్యంలో కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. -
నాణ్యమైన సేవలు అందిస్తాం
నల్లగొండ, రామగిరి(నల్లగొండ): బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం అన్నారు. బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పానగల్ రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ప్రజలకు చవక, నమ్మదగిన సేవలను అందిస్తూ బీఎస్ఎన్ఎల్ ముందంజలో ఉందని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్టీటీహెచ్ ప్యాకేజీలు రూ.299, రూ.399లో భాగంగా వినియోగదారులకు ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, టీవీ ఛానల్స్, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్ఏ సత్యనారాయణ, ఏజీఎం సుబ్బారావు, శాంతికుమారి, రాములు, సురేందర్, వెంకన్న, నరేందర్, జీవన్కుమార్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
పెద్దఅడిశర్లపల్లి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఉపాధి హామీ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్లో నర్సరీని పరిశీలింశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ తర్వాత తిరుమలగిరి(నాగార్జునసాగర్) మండలం అల్వాల గ్రామంలోని నర్సరీ పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటేందుకు ఐదుఫీట్ల పొడవు గల మొక్కలను వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచలను చేశారు. ఆయన వెంట పీఏపల్లి ఎంపీడీ చంద్రమౌళి, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం నాగలీల, ఈసీ దశరధరెడ్డి, తిరుమలగిరి సాగర్ మండల ఏపీఓ శ్రీను, ఏపీఎం రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సైదానాయక్, శ్రీరాములు ఉన్నారు. టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీకేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద బుధవారం వాహనాల రద్దీ కొనసాగింది. గురువారం దసరా పండుగ కావడంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీ నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్ప్లాజా వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఫాస్టాగ్ చిప్ను రెండు, మూడు సెకన్లలోనే స్కాన్ అయ్యేలా స్కానర్లను అప్డేట్ చేశారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నప్పటికీ టోల్ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. నేత్రపర్వంగా గజవాహన సేవ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలో భాగంగా గజవాహన సేవ నేత్రపర్వంగా చేపట్టారు. బుధవారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళ అర్చన జరిపించారు. -
ఆ గ్రామాల్లో దసరా ప్రత్యేకం
రాజాపేట : దసరా పండుగను రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలామంది హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ పండుగ రోజు స్వగ్రామానికి విచ్చేసి వేడుకల్లో పాల్గొంటారు. రాజుల కాలం నుంచి గ్రామానికి చెందిన ఠాకూర్ వంశస్తులు దుర్గామాతకు నవరాత్రులు పూజలు నిర్వహించి 9వ రోజు ఆయుధపూజ నిర్వహిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి గుర్రం(సిరిమల్లె) వంశీయులతో కలిసి డప్పువాయిద్యాలతో గడికోటలోని మైసమ్మ దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ లు చేస్తారు. అనంతరం జాతీయ జెండాను చేతబూని తల్వార్లతో ప్రదర్శన నిర్వహిస్తూ జమ్మి కోసం బయల్దేరుతారు. గ్రామం శివారులోని సంఘమేశ్వరస్వామి దేవాలయం వరకు చేరుకుని జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. పూర్వం మాత్రం ఠాకూర్ వంశానికి చెందిన సత్యనారాయణసింగ్ తనకున్న లైసెన్స్ గన్ భుజానికి వేసుకుని ఊరేగింపుగా వెళ్లి శమిపూజ తర్వాత గన్తో రెండుమార్లు తూర్పుదిక్కు గాలిలోకి పేల్చిన అ నంతరం ప్రజలు జమ్మి తీసుకునేవారు. ఠాకూర్ సత్యనారాయణసింగ్ 1994 వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో, రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో ప్రతి ఏడాది దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు గ్రామస్తులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాజాపేట మండల కేంద్రంలో ఠాకూర్ వంశస్తులు జాతీయ జెండా, తల్వార్లతో ర్యాలీగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. రామన్నపేట: రాన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో దసరా రోజు జాతీయ జెండాను ఎగురవేస్తారు. గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కచ్చీరు వద్ద జాతీయ జెండాను ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పటేల్ వంశస్థులు పండుగ రోజు తెల్లవారుజామున పాత జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఉదయం 10గంటల సమయంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి కొత్త జెండా కర్రకు అలంకరణ చేసి కొత్త తాడుతో జాతీయ జెండాను ఎగర వేయడం జరుగుతుంది. జాతీయ పతాకావిష్కరణలో గ్రామస్తులంతా పాల్గొంటారు. జమ్మిచెట్టు వద్దకు పూజకు వెళ్లే సమయంలో అక్కడే పూజలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు, కులపెద్దలకు కంకణాలు అందజేస్తారు. జమ్మిచెట్టు నుంచి జాతీయజెండా వద్దకు తిరిగి వచ్చి ఒకరికొకరు జమ్మి పెట్టుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అదేవిధంగా నిధానపల్లిలో బురుజుపైన, నీర్నెముల, శోభనాద్రిపురం, సిరిపురం గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.ప్రత్యేకంగా ఠాకూర్ వంశస్తులుదసరా రోజు జాతీయ జెండా ఆవిష్కరణ -
నేడే విజయదశమి
రామగిరి(నల్లగొండ): దసరా వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆలయాలు, ప్రధాన కూడళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. ప్రధానంగా దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత. దుకాణాలలో కోలాహలం జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లోని దుకాణాలు, వివిధ మార్కెట్లు కొనుగోలుదారులతో కోలహలంగా మారాయి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో బైకులు, ఎలక్ట్రికల్, వస్త్ర, ఫుట్వేర్, లేడీస్ ఎంపోరియం, పూలు, పండ్లు, కూరగాయల దుకాణాలు రాత్రి పొద్దుపోయే వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి. రహదారులపై వాహనాల రద్దీ నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హాలియా వంటి పట్టణాల్లో జాతీయ రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. షాపింగ్ చేసేందుకు ప్రజలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణాల్లో ట్రాఫిక్ నెలకొంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనం కావడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. రావణ దహనానికి భారీ కటౌట్లు చాలామంది దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేదా సహజంగా ఉన్న జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దీంట్లో భాగంగా నిర్వహించి రావణ దహనానికి భారీ కటౌట్లు సిద్ధం చేసుకున్నారు. ఫ దసరా ఉత్సవాలకు సిద్ధమైన ప్రజలు ఫ సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు ఫ రద్దీగా బస్టాండ్లు, రహదారులు ఫ శమీ పూజ, రావణ దహనానికి ఏర్పాట్లు -
మద్యం, మాంసం దుకాణాలు బంద్
నల్లగొండ టూటౌన్: ఈ సారి దసరా (విజయదశమి) పండుగపై గాంధీ జయంతి ప్రభావం పడనుంది. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి జరుపుకునే పెద్ద పండుగ దసరా. ఆడపడుచులు, కొత్త అల్లుళ్లతోపాటు దగ్గరి బంధువులను పిలిచి ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. తెలంగాణలో పండుగ ఏదైనా ముక్క, చుక్క ఉండాల్సిందే. ఈ సారి దసరా పండుగ రోజే జాతిపిత మాహాత్మాగాంధీ జయంతి రావడంతో ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు మూసివేయాలని మున్సిపల్, ఎకై ్సజ్ శాఖల అధికారులు నోటీస్లు జారీచేశారు. దాంతో పండుగ పూట మందు, మాంసం, చికెన్ విక్రయాలు బంద్ కానున్నాయి. దీంతో పండుగ రోజు కొత్త అల్లుళ్లకు పప్పు, కూరగాయల వంటలతోనే సరిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని అందరూ చర్చించుకుంటున్నారు. దుకాణాల మూసివేతకు నోటీసులు జారీ మామూలు రోజుల్లోనే ముక్క, చుక్క లేనిదే ముద్దదిగదని మద్యం, మాంసం ప్రియులకు ఈ సారి దసరా కిక్కు లేకుండా పోసింది. ఆ రోజే గాంధీ జయంతి రావడంతో మాంసం, మధ్యం దుకాణాలు, రెస్టారెంట్లు, హోటల్స్ మూసి వేయాలని మున్సిపల్ అధికారులు రెండు రోజుల ముందుగానే నోటీస్లు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో చుక్క, ముక్కకు ఎక్కడికి వెళ్లాలనే మీ మాంసలో ఉన్నారు జనం. అయితే దసరా పంగుడ రోజు కొన్ని వేల టన్నుల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. గ్రామాల్లో యాట (మటన్) మాంసం లేని ఇల్లు ఉండదు. అలాగే మద్యం దుకాణాల్లో రోజంతా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగే పండుగ ఇది. ఈ సారి దసరా పండుగ, గాంధీ జయంతి రెండు ఒకేరోజు రావడంతో భారీ ఎత్తున జరిగే మద్యం, మాంసం విక్రయాలపై ప్రభావం పడనుంది. ఫ దసరా పండుగ రోజే గాంధీ జయంతి రావడంతో విక్రయాలు నిలిపివేత ఫ ఆయా దుకాణాలు మూసేయాలని ఎకై ్సజ్, మున్సిపల్ శాఖల ఆదేశాలు ఫ ఇప్పటికే దుకాణదారులకు నోటీసులు జారీ ఫ చుక్క, ముక్కపై జనంలో సందిగ్ధం ఈ సారి దసరా పండుగ రోజు గాంధీ జయంతి వచ్చిన నేపథ్యంలో మాంసం, మద్యం దుకా ణాలు మూసివేయాలి. హోటల్స్, రెస్టారెంట్స్, మాంసం వ్యాపారులకు విక్రయాలు జరుపవద్దని నోటీసులు జారీ చేశాం. దుకాణాలు తెరిస్తే చర్యల్లో భాగంగా జరిమానా విధిస్తాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
సాగర్కు తగ్గుముఖం పట్టిన వరద
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి సాగర్ ప్రాజెక్టుకు 4,14,188 క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది. అంతే నీటిని సాగర్ జలాశయం నుంచి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3,61,322 క్యూసెక్యులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 33,536, మొత్తం 3,94,858 క్యూసెక్యుల నీటిని దిగువకు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువ, ఏఎంఆర్పీ, వరద కాలువలకు 19,330 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. -
జిల్లా స్థాయి సాహితీ పోటీలు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకు చెందిన సాహితీవేత్త గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా జిల్లా స్థాయి సాహితీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఎండీ.హసేనా తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన అంశాలపై వ్యాస రచన, కవితలు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీలోపు తమ వ్యాసాలు, కవితలు, పాటలను telanganasahithinlg 2024 @gmail.comకు మెయిల్ పంపించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9848228004 నెంబర్ను సంప్రదించాలన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన అమ్రాబాద్ సీసీఎఫ్నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని మంగళవారం అమ్రాబాద్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్(సీసీఎఫ్) సునీల్ హిరామత్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూప వనం, మహాస్థూపం అంతర్భాగంలోని ధాన్య మందిరాన్ని సందర్శించి ధ్యానం చేశారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రు బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. అనంతరం వీరు సాగర్ జలాశయంలో లాంచీలో విహరించారు. వీరితో పాటు ఒడిశాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు చెందిన మరో అధికారి విశ్వనాథ్ నీల్ అన్వార్ కూడా ఉన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను, సాగర్ వివరాలను వివరించారు. వారి వెంట ఎఫ్డీఓ సంగీత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రమేష్, రవీందర్ ఉన్నారు. వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీ కళాపీఠం ఏర్పాటు రామగిరి(నల్లగొండ): గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి సాహితీ కళాపీఠాన్ని మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షుడిగా డా.బెల్లి యాదయ్య, గౌరవ సలహాదారులుగా పూజర్ల శంభయ్య, గింజల నరసింహారెడ్డి, అధ్యక్షుడిగా తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మామిడి లింగస్వామి, ఉపాధ్యక్షుడిగా కుంచె నగేష్, కోశాధికారిగా సారంగి వెంకన్న, సంయుక్త కార్యదర్శిగా ముక్కామల జానకిరామ్లను ఎన్నుకున్నారు. వారితోపాటు నలుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని శిక్షించాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును విచక్షణ రహితంగా కొట్టిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని కఠినంగా శిక్షించాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ అన్నారు. మంగవారం వారు తండాకు చేరుకుని బాధితుడు సాయిసిద్ధును పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు సాయిసిద్ధును దారుణంగా కొట్టారని, దీంతో నడవలేని స్థితిలో ఉన్నాడని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పోలీసులు చట్టానికి అతీతంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. గిరిజన యువకుడు సాయిసిద్ధును హింసించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు అతనికి సహకరించిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తాళ్ల రోహిత్, దిలీప్కుమార్, వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ, సభ్యులు గురవయ్య, వెంకటరమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ మానవహక్కుల వేదిక బృందం -
రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని తెలంగాణ జెన్కో ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(సీఈ) మంగేష్నాయక్ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్ కంట్రోల్ రూమ్లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్ పవర్హౌస్ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు.ఫ ఏడాది టార్గెట్ ఆరు నెలల్లోనే పూర్తి -
పలు గ్రామాల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు కరువు
● అడవిదేవులపల్లి మండలంలోని జిలకరకుంటతండా గ్రామ పంచాయతీ గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఆ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఒక్కటే ఉంది. ● గోన్యతండా గతంలో ఎస్టీ మహిళ కాగా ఈ సారి బీసీ జనరల్ రిజర్వు అయింది. అక్కడ కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ● ముదిమాణిక్యం గతంలో జనరల్ మహిళ కాగా ఈ సారి ఎస్టీ జనరల్గా రిజర్వేషన్ అయింది. ఈ గ్రామంలో రెండు మాత్రమే ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. ● దామరచర్ల మండలంలోని తూర్పుతండా బీసీలకు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ ఒక్క కుటుంబమే ఉంది. ● మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 1925 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం బానోతు శాంతి, బోడ నవీన్ అనే ఎస్టీలకు మాత్రమే ఓట్లు ఉన్నాయి. ● గజలాపురం గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉంది. అయితే ఇక్కడ ఎస్టీలకు రెండు వార్డులు కేటాయించారు. ● పెద్దవూర మండలంలో పులిచర్ల గ్రామపంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు ఇక్కడ ఎస్టీలకు సంబంధించి ఐదు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ● చందంపేట మండలంలోని గుంటిపల్లి బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ బీసీ కుటుంబం ఒక్కటే ఉంది. మరో కుటుంబంలో భర్త బీసీ, భార్య ఎస్టీ ఉన్నారు. ● దేవరకొండ మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయింది. అయితే అక్కడ బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు. ● వెంకటితండా బీసీ జనరల్కు రిజర్వు అయింది. అయితే అక్కడ మూడే బీసీ ఓట్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. పేరూర్ గ్రామ పంచాయతీలో 792 మంది ఓటర్లలో ఒకే ఒక్క ఎస్టీ పురుషుడికే ఓటు హక్కు ఉంది. అయితే ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ రిజర్వు అయింది. దీంతో అభ్యర్థేలేని పరిస్థితి నెలకొంది. ఫ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్లే కాదు వార్డుల్లోనూ సభ్యుల్లేరు.. ఫ పలుచోట్ల ఒకటీ రెండు కుటుంబాల వారికే దక్కిన రిజర్వేషన్ ఫ గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని సర్పంచ్ పదవులు బీసీలకు రిజర్వు ఫ ఇంకొన్ని చోట్ల ఒకరే అభ్యర్థి ఉండడంతో ఏకగ్రీవానికి అవకాశం ఫ కొన్ని గ్రామాల్లో ఎస్సీలకు అసలు ఒక్క సీటూ రిజర్వు కాలే..సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతోపాటు వార్డు సభ్యుల కొరత కూడా నెలకొంది. దీంతో అభ్యర్థుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వెతుకులాటలో పడ్డాయి. కొన్నిచోట్ల ఒకటీ రెండు కుటుంబాలే ఉన్నా, వారికే ఆ స్థానాలు రిజర్వు అయ్యారు. దీంతో అక్కడ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా, అక్కడ బీసీ అభ్యర్థులే లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది. అభ్యర్థులే లేకుండా ఎలా ముందుకు వెళతారన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. మరికొన్ని మండలాల్లో ఎస్సీలకు ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ అసలు అభ్యర్థులు లేరు.. దామరచర్ల మండలంలో జైత్రాంతండా, బాండావత్తండా, గోన్యతండా, బాలాజీనగర్తండా, మాన్తండా, నూనావత్తండాలే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఈ తండాల్లో బీసీ ఓటర్లే లేరు. అక్కడ సర్పంచ్ పదవి నామినేషన్ వేసే వారే లేకుండాపోయారు. అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండా గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ జనరల్కు రిజర్వు అయింది. అక్కడ ఒక్క బీసీ కూడా లేరు. తిరుమలగిరి(సాగర్) మండలంలో చింతలపాలెం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్గా రిజర్వు అయింది. అయితే అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయింది ఇక్కడ బీసీ కుటుంబాలు ఒక్కటీ లేవు. 2011లో ఒక కుటుంబం ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అక్కడ లేదు. ఎస్సీలకు ఒక్క వార్డూ కేటాయించలే.. మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో 881 మంది ఓట్లు ఉండగా అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు. వార్డుల్లో ఎస్టీలకు 3, బీసీలకు 4, జనరల్కు ఒక స్థానం కేటాయించగా గ్రామంలో ఎక్కువగా ఉన్న మాల, మాదిగ సామాజికవర్గం కుటుంబాలు ఉన్నప్పటికీ ఎస్సీలకు రిజర్వేషన్లో స్థానం కల్పించలేదు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో పది వార్డులు ఉండగా బీసీలకు నాలుగు వార్డులు కేటాయించగా నాలుగు వార్డులు ఎస్టీ, రెండు జనరల్ స్థానాలు కేటాయించారు. పది వార్డుల్లో ఒక్క స్థానం కూడా ఎస్సీలకు కేటాయించలేదు. గ్రామం మొత్తంలో ఇద్దరే ఎస్టీ ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విధులకు నియమించిన ఉద్యోగుల పూర్తి డేటాను వెంటనే సమర్పించాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డీఈఓ భిక్షపతిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. పొరపాట్లకు తావివ్వ వద్దని గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు శాఖల ద్వారా నిర్వహించే ఇతర పనులను జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆయా నోడల్ అధికారులు చేయాల్సిన విధులు, కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ సిబ్బంది నియామకం వంటి పనులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో తప్పులు జరగొద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి తప్పలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓ హాండ్ బుక్ను చదవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని పేర్కొన్నారు. కేటాయించిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, లేనిపక్షంలో ఎన్నికల నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శిక్షణ అధికారి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, తదితర అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తున్నామని.. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ, రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో ఎన్నికల హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, మాధవరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సిందూరంపాటు పాలతో మన్యసూక్త పారాయణములతో అభిషేకం జరిపారు. అనంతరం సుగంధం వెదజల్లే ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఇక ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. -
రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించాలి
నల్లగొండ: ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ కమీషన్ను వెంటనే ఇప్పించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తమకు రావాల్సిన కమీషన్ ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు నాగరాజు పులిచింతల సత్తిరెడ్డి, పగిళ్ల వెంకటేశ్వర్లు, బొల్లా వేణుగోపాలరావు, సముద్రాల యాదయ్య గౌడ్, జనార్దన్, వివిధ ప్రాంతాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ: పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసులను ఆదేశించారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో 25మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేవించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
మోగిన స్థానిక నగారా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ను జారీ చేయనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాతీయ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. ఆ తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించనుంది. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి విడతలో 18 మండలాల్లో ఎన్నికలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ చేసి, 23న ఎన్నికలను నిర్వహించనుంది. రెండో విడతలో 15 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 13న నోటిఫికేషన్ జారీ చేసి, 27న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. డివిజన్ల వారీగా పల్లెపోరు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో అక్టోబర్ 31న ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే నెల 17వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోఎన్నికలకు వచ్చే నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 4వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 8వ తేదీన ఎన్నికలను నిర్వహించనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనుంది. 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీలు జిల్లాలో 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను 1,957 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనుంది. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 196 ఎంపీటీసీ స్థానాలకు 483 గ్రామాలు, 4,152 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకోసం 516 ప్రాంతాల్లో 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ డివిజన్లలోని 157 ఎంపీటీసీ స్థానాలకు 386 గ్రామాలు, 3,342 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకు 419 ప్రాంతాల్లో 858 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. 869 గ్రామాలు.. 7,494 వార్డులు జిల్లాలో 33 మండలాల పరిధిలోని 869 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లోని 318 గ్రామాలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయి. రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలకు చెందిన 282 గ్రామాలు, 2,418 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాలకు చెందిన 269 గ్రామాలు, 2,206 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. దాదాపు సగం సర్పంచ్ స్థానాలు బీసీలకే.. జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా గిరిజనులకు కేటాయించినవి పోగా మిగితా 755 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం దాదాపు సగం సర్పంచ్ పదవులు బీసీలకు లభించనున్నాయి. 147 స్థానాలు పూర్తిగా బీసీ మహిళలకు కేటాయించగా, 163 బీసీ జనరల్కు కేటాయించారు. ఇలా మొత్తంగా 310 సర్పంచ్ స్థానాలు, 2,638 వార్డులు బీసీలకు దక్కనున్నాయి. 114 గిరిజన గ్రామ పంచాయతీలు తండాలుగా మార్చిన 114 గిరిజన గ్రామ పంచాయతీలన్నీ వారికే రిజర్వు అయ్యాయి. వాటిల్లో 856 వార్డులు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలతోపాటు రిజర్వేషన్ల కోటా మేరకు అదనంగా మరో 78 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. వాటి పరిధిలోని 577 వార్డులు గిరిజనులకే దక్కనున్నాయి. దీంతో ఈసారి మొత్తంగా గిరిజన సర్పంచ్ల సంఖ్య 192కు చేరనుండగా, 1,433 వార్డుల సభ్యులు గిరిజనులే ఉండనున్నాయి. ఇక ఎస్సీలకు 153 సర్పంచ్ స్థానాలు, 1,281 వార్డులు లభించనున్నాయి. అన్ రిజర్వుడ్ కేటగిరీలో 214 పంచాయతీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.73 లక్షల మంది 10,73,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5,30,860 మంది పురుషులు, 5,42,589 మంది మహిళలు, 57 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. పార్టీ గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులపైనే నిర్వహించనున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మాదిరిగానే బ్యాలెట్ పేపర్లపై కూడా ‘నోటా’ గుర్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. గంట భోజన విరామం తర్వాత పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, విజేతలను ప్రకటిస్తారు. మరునాడు ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఫ వచ్చే నెల 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఫ నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఫ వచ్చే నెల 31, నవంబర్ 4, 8న పంచాయతీలకు.. ఫ పోలింగ్ రోజు సాయంత్రమే ఫలితాలు ఫ అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల వివరాలు.. డివిజన్ పంచాయతీలు పోలింగ్ కేంద్రాలు నల్లగొండ 214 1,946 చండూరు 104 924 రెండోవిడతలో.. మిర్యాలగూడ 282 2,418 మూడో విడతలో దేవరకొండ 269 2,206 తొలి విడత ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు.. ఎంపీటీసీలు గ్రామాలు వార్డులు పోలింగ్కేంద్రాలు 196 483 4,152 1,099 రెండు విడతలో.. 353 869 7,494 1,957 ఎంపీటీసీ స్థానాలు 353 పంచాయతీ వార్డులు 7,494 మొత్తం పోలింగ్స్టేషన్లు 1957 పోలింగ్బాక్స్లు: 9,996 పోలింగ్ సిబ్బంది పీవోలు 2,348, ఓపీవో 10,982 అధికారులు: జెడ్పీటీసీ ఆర్వోలు 39, ఎంపీటీసీ ఆర్వోలు 140, ఏఆర్వోలు 140 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 652 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 304 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 18 -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే సీపీఎం శ్రేణులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని తక్షణమే వాటిని సవరించాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేశాం
నల్లగొండ: ఇచ్చిన హామీలు అమలు చేశామని, బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ శంకర్నాయక్ బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ను విడుదలచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఐదు సంవత్సరాల వడ్డీ బాకీ, నిరుద్యోగులకు నెలకు రూ.3000 బాకీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాకీలు పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీష్రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలన్నారు. తిప్పర్తిలో ఆరు గ్యారంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్లో చర్చకు రావాలని జగదీష్రెడ్డికి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సూర్యాపేట సీటు కూడా దక్కదన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, చీదేటి వెంకట్రెడ్డి, షబ్బీర్ బాబా, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కొప్పు నవీన్గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంజి, పెరికె చిట్టి, విజయ్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలి ఫ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ -
స్థానిక ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ను నిర్వహించారు. దీనికి హాజరైన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత నల్లగొండ, దేవరకొండ డివిజన్లకు సంబంధించి 18 మండలాలు, రెండవ విడతన చండూరు, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించి 15 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నల్లగొండ, చండూరు డివిజన్లలో 318 గ్రామపంచాయతీలు, రెండవ విడత మిర్యాలగూడ డివిజన్లలో 282 గ్రామపంచాయతీలు, మూడవ విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు 996 బ్యాలెట్ బాక్స్లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికలపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈనెల 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓలు వై.అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి, ఆర్టీఓ లావణ్య అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
22 ఏళ్లు దేశ రక్షణలో..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ వేలాద్రి కుమారుడు రవి 22 ఏళ్లు దేశ రక్షణలో ఆర్మీ జవాన్గా సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2003లో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఎంపికయ్యారు. మహరాష్ట్రలోని హేమనగర్లో శిక్షణ పొంది 2005లో ఆర్మీ జవాన్గా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచలప్రదేశ్లో పనిచేశారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో కూడా ఆయన పాల్గొని దేశానికి సేవలందించారు. ప్రస్తుతం అహ్మదానగర్లో పనిచేస్తున్న ఆయన మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. దసరా రోజు అభినందన సభ..రవి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్న సందర్బంగా అక్టోబన్ 2న దసరా రోజు చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అభినందన సభ నిర్వహించేందుకు గ్రామ యువత, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు పదవీ విరమణ పొందనున్న చిలుకూరుకు చెందిన ఆర్మీ జవాన్ -
యాదగిరీశుడి సేవలో పాదరాజ మఠం పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ ముల్బాగల్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠ అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్టలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు యాదగిరిగుట్ట: దసరా పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద సోమవారం రాత్రి బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరి క్షేత్రానికి భక్తులు వస్తుండటంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు. -
భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం
భువనగిరి: భువనగిరి పట్టణంలో సోమవారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తన దగ్గర రూ.11వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని వేడుకున్నాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన నంబర్కు రూ.11వేలు ఫోన్ పే చేయగా.. అతడు రూ.11వేల నగదును నాగేంద్రబాబుకు ఇచ్చాడు. అనంతరం నాగేంద్రబాబు నోట్లను పరిశీలించగా.. అవి దొంగ నోట్లని అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
హత్య కేసులో పది మంది అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్ది లింగస్వామికి, చారగండ్ల శివకుమార్కు ఐదేళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్పై హత్యాయత్నం చేసిన పెద్ది లింగస్వామిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగండ్ల శివకుమార్, పెద్ది లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో పెద్ది లింగస్వామి తన స్నేహితులు మాతంగి మధు, మరికొంత మందితో కలిసి శివకుమార్ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం శివకుమార్కు మాతంగి మధుతో ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ వద్దకు పిలిపించాడు. శివకుమార్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10గంటల సమయంలో మందు తాగుతుండగా.. పెద్ది లింగస్వామి, అతడి స్నేహితుడు మాతంగి మధు, మరికొందరు కలిసి మారణాయుధాలతో శివకుమార్ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కాగా హత్యకు గురైన శివకుమార్తో పాటు నిందితులపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు.. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రీ మధు, పెద్ది లింగస్వామి, సీతారాంపురానికి చెందిన చెవుల నరేష్, జేజేనగర్కు చెందిన జక్కి సతీష్, కేసారం గ్రామానికి చెందిన భాషపంగుల సతీష్, సూర రామచంద్రు, తాళ్లగడ్డకు చెందిన నేరెళ్ల శ్రీరాములు, అన్నాదురైనగర్కు చెందిన గువ్వల తరుణ్కుమార్, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేష్, ఇందిరమ్మ కాలనీకి చెందిన జెల్లా ఉదయ్కుమార్ అరెస్టయ్యారు. జేజేనగర్కు చెందిన జక్కి అనిల్, కృష్ణటాకీస్ దగ్గర గల వర్రె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. రిమాండ్కు తరలింపు పరారీలో మరో ఇద్దరు -
మదర్ డెయిరీకి రూ.50 కోట్లు కేటాయించాలి
సాక్షి,యాదాద్రి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా మారిన మదర్ డెయిరీని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఏడాది కాలంలో మదర్ డెయిరీ అప్పుల పాలైనట్లు బీఆర్ఎస్ నాయకుడు గొంగిడి మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మదర్ డెయిరీని దివాలా దిశకు చేర్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు వేలాది మంది రైతులు, డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో పదేళ్లలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. మదర్ డెయిరీని ఎన్డీడీబీ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే అప్పుల కింద బ్యాంకు వాళ్లే లాకౌట్ చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసి, బ్యాంకును నమ్మించడానికి అప్పులకు కూడా ఇన్కం టాక్స్ కట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. డైరక్టర్ల ఎన్నికల్లో పొత్తు ధర్మం తప్పింది గొంగిడి మహేందర్రెడ్డే అన్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని అదనంగా పోటీలో నిలబెట్టి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అదనంగా రంగంలో దిగితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బులు ఇచ్చి, పాల చైర్మన్లకు ఫోన్లు చేసిన గొంగిడి మహేందర్రెడ్డి నైతికవిలువలు మర్చిపోయాడన్నారు. గత బీఆర్ఎస్ పాలకవర్గాల బాధ్యతారాహిత్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహులు, కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి విజ్ఞప్తి -
స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చన, అక్షరాభ్యాసం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుమందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. విద్యాలక్ష్మి అమ్మవారి వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న అర్చకులు -
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం.. మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. మట్టపల్లి క్షేత్రం వద్ద..మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు -
అతివలకు ఆరోగ్య భరోసా
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు, యువతులు, బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిబిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. రక్త పరీక్ష నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. – పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ, నల్లగొండ నల్లగొండ టౌన్: ఒక కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే ఆ ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉండాలని అంతా చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో మహిళలు, యువతులు, బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) అనే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పీహెచ్సీలో మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వైద్య శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు నిర్వహించనున్నారు. మొత్తం 13 వైద్య బృందాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఆరోగ్య పరీక్షలు, అవగాహన.. సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతుంటారు. దీంతో ఈ వైద్య శిబిరాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, దంత, రక్తహీనత, సీ్త్ర వ్యాధి సమస్యలు, క్యాన్సర్, గుండె, కిషోర బాలికలు, కౌమార దశలో వచ్చే సమస్యలపై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల్లో గైనకాలజి, ఈఎన్టీ, డర్మటాలజి, సైకియాట్రి, జనరల్ పిజిషియన్, దంత సంబంధిత వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తున్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోదక టీకాలు వేస్తున్నారు. క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫ పీహెచ్సీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఫ అక్టోబరు 2వ తేదీ వరకు నిర్వహణ ఫ అన్ని రకాల వైద్య పరీక్షలు.. ఉచితంగా మందులు అందజేత -
హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్
తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు గాలికొదిలేసిందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం తిప్పర్తి మండలం కేంద్రంలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని చూస్తోందని.. దానివల్ల నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఆ విషయంపై ఇక్కడ ఉన్న అధికార పార్టీకి సోయిలేదని.. బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్లగొండ జిల్లా రైతులతో కలిసి చలో అల్మట్టి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇరిగేషన్ మంత్రికి ఆల్మట్టిపై సోయిలేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నీళ్ల గురించి అవగాహన లేదని విమర్శించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారని.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు కందుల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వర్రావు, లొడంగి గోవర్ధన్, సిరసవాడ సైదులు, బైరగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫ తిప్పర్తిలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ -
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం 2025– 27 ఎన్నిక ఆదివారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి –1గా వెంకటరమణచౌదరి(బాబి), కార్యదర్శి–2గా పొలిశెట్టి ధనుంజయలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 90 ఓటర్లు కాగా ఉపాధ్యక్ష పదవి కోసం మాశెట్టి శ్రీనివాస్, గోళ్ల రామశేఖర్ పోటీపడగా మాశెట్టి శ్రీనివాస్కు 15ఓట్లు, రామశేఖర్కు 69ఓట్లు వచ్చాయి. దీంతో రామశేఖర్ విజయం సాధించారు. కోశాధికారి పదవికి చిల్లంచర్ల శ్రీనివాస్, గందె రాము పోటీ పడగా శ్రీనివాస్కు 42ఓట్లు, రాముకు 44ఓట్లు వచ్చాయి. దీంతో రాము విజయం సాధించారు. పది డైరక్టర్ల పదవులకు 30 నామినేషన్లు రాగా డ్రా పద్ధతిలో పది మందిని ఎంపిక చేశారు. డైరెక్టర్లుగా గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి రవీందర్ ప్రకటించారు. నూతన పాలకవర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు చిల్లంచర్ల విజయ్కుమార్, మంచుకొండ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఫ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శిగా వెంకటరమణచౌదరి ఏకగ్రీవం ఫ మిగతా స్థానాలకు ఎన్నికలు -
బస్టాండ్కు మరమ్మతు చేయాలి
మిర్యాలగూడ : ఆర్టీసీ బస్టాండ్కు మరమ్మతు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన బస్టాండ్ను తనిఖీ చేశారు. బస్టాండ్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. బస్టాండ్లో పెచ్చులు ఊడిన చోట త్వరితగతిన మరమ్మతు పనులు చేయాలన్నారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో గౌడ సంఘం భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, ఉదయ్భాస్కర్గౌడ్, చౌగాని వెంకన్నగౌడ్, గురుమూర్తి, పెద్ది శ్రీనివాస్గౌడ్, జెర్రిపోతుల రాములుగౌడ్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఫ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
వాడపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజనుడు సాయిసిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్పీని ఆదేశించారు. ఆదివారం ఆయన దామరచర్ల మండలం కొత్తపేటతండాకు వెళ్లి బాధితుడు సాయిసిద్ధును పరామర్శించి మాట్లాడారు. సాయిసిద్ధును అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం, థర్డ్ డిగ్రీని ప్రయోగించడం తగదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచే చేను మేసిన తీరుగా ఉందన్నారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని.. కొట్టాల్సిన అవసరం లేదని, కొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈ విషయమై ఎస్సీ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్తో ఇప్పటికే మాట్లాడానని.. సీఎంతో కూడా మాట్లాడుతానని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఆయన వెంట ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాథోడ్ రాంబాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, డీఎస్పీ రాజశేఖర్రాజు, తహసీల్దార్ జవహర్లాల్ తదితరులు ఉన్నారు. ఫ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య -
పానగల్లు ఆలయాలను అభివృద్ధి చేస్తాం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుడు, ప్రొఫెసర్ కుతాడి అర్జునరావు అన్నారు. ఆదివారం ఆయన పానగల్లోని ఆలయాలను, మ్యూజియంను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి పురావస్తు శాఖ రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. భక్తులు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలిసేలా సైన్బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలయ గోడలపై ఉన్న వైట్వాష్ను వెంటనే శుభ్రం చేసి, శిల్ప సంపద, చరిత్ర భక్తులు, పర్యాటకులు తెలుసుకునేలా చూడాలని సూచించారు. ఆలయ చరిత్ర వివరించడానికి ఒక టూరిస్ట్ గైడ్ను నియమించాలన్నారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియం తనిఖీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ పి.నాగరాజు, ఎన్.నర్సింగ్ నాయక్, డాక్టర్ హమ్మద్ షరీఫ్, డాక్టర్ కిషోర్, పల్రెడ్డి వెంకట్రెడ్డి, గుండగోని యాదయ్య, కొడిదల ఎల్లయ్య, గుండగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రేషన్ డీలర్ల బైక్ ర్యాలీ
నల్లగొండ : రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన కమిషన్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సోమవారం నల్లగొండలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైక్ ర్యాలీ ఎన్జీ కాలేచి నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రేషన్ డీలర్లు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూిసీ రిజర్వాయర్కు వరద కొనసాగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఇన్ఫ్లో తగ్గింది. శనివారం 39 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ఆదివారం 20,936 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ఆరు క్రస్ట్గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 11,231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 185 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బీసీ రిజర్వేషన్లకు సీపీఐ మద్దతు చిట్యాల : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సీపీఐ మద్దతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపధికను 42 శాతం రిజర్వేషన్ అమలు ప్రక్రియకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా.. కొందరు కోర్టుకు వెళ్లడం తగదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలకు అనుకూలంగానే ట్రిపుల్ ఆర్ అలాయిమెంట్ మార్చారని ఆరోపించారు. చిట్యాల మండలంలో అక్రమంగా మైనింగ్పై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్కుమార్, బొడిగె సైదులుగౌడ్, అక్బర్, జిల్లా సత్యం, షరీఫ్, జిల్లా యాదయ్య, మునుకుంట్ల నాగయ్య, బాలరాజు, లింగయ్య పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో కోలాహలం యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పర్వాలు, భక్తజన సందోహంతో యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టో త్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి వారికి వెండిజోడు సేవోత్సవం నిర్వహించి భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
సినిమా సెట్టింగ్లా దుర్గాదేవి మండపం
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం సినిమా సెట్టింగ్ను తలపిస్తోంది. మండపం బయట శివపార్వతులు, నందీశ్వరుడి విగ్రహాలతో పాటు మండపం సెట్టింగ్ పైన పలు దేవతా విగ్రహాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అదేవిధంగా ఈ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులు భక్తులకు లక్కీ డ్రా ఆఫర్లు పెట్టారు. రూ.201 చెల్లించి కూపన్ కొనుగోలు చేసిన భక్తులకు అక్టోబర్ 3న నిర్వహించే బంపర్ డ్రాలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా కలర్ టీవీ, మూడో బహుమతిగా కుక్కర్ ఓవన్, నాల్గవ బహుమతిగా 3 గ్రాముల సిల్వల్ కాయిన్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
వేల్స్లో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట రూరల్: యునైటెడ్ కింగ్డమ్లోని వేల్స్ రాజధాని కార్డిఫ్ నగరంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ కార్డిఫ్ హిందూ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చకులు కిరణ్కుమార్చార్యులు, దోర్బాల భాస్కర్శర్మ బృందం పాల్గొన్నారు. ఈ కల్యాణోత్సవంలో డాక్టర్ వెలగపూడి బాపూజీరావు, అన్నపూర్ణ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
సంతానం కలగడం లేదని వివాహిత ఆత్మహత్య
యాదగిరిగుట్ట రూరల్: సంతానం కలగడం లేదని మనోవేదనకు గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం యాదగిరిగుట్ట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరుకు చెందిన గుంటెకాపుల అశ్విని (30)కి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కళ్లెపల్లి రాఘవేందర్తో 2015లో వివాహం జరిగింది. వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా వారికి సంతానం కలుగలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంతానం కోసం డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు గురైన అశ్విని గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో వంగపల్లిలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అశ్వినిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గుంటెకాపుల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్కు ఉత్తమ అవార్డు రామగిరి: ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో నల్లగొండ సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్కు ఉత్తమ ఫొటో జర్నలిస్ట్గా అవార్డు లభించింది. ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మోదుకూరు వేమన సాహిత్య వికాస భవనంలో ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింగారెడ్డి మెల్కియార్, అకాడమీ చైర్మన్ సుధాకర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ గడ్డం రాయప్ప, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి చేతులమీదుగా భజరంగ్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. -
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామానికి చెందిన మోర్తాల రాంనర్సిరెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. రాంనర్సిరెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి శేఖర్రెడ్డి మృతిచెందగా.. పట్టుదలతో చదివి గ్రూప్–2, 3 ఉద్యోగాలు సాధించారు. అంతేకాకుండా హైకోర్టు అసిస్టెంట్ ఫలితాల్లో కూడా మెరిట్ పొంది ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు పొందిన రాంనర్సిరెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఏఎస్ఓగా పంచాయతీ కార్యదర్శి..చివ్వెంల : మండల పరిధిలోని రాజుతండా గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అంగోతు నరేష్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 717 ర్యాంకు సాధించి ఏఎస్ఓగా ఎంపికయ్యాడు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన నరేష్ 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ఉత్తీర్ణత సాధించి ఏఎస్ఓగా ఎంపిక కావడం పట్ల తండావాసులు, సహ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎస్టీ విభాగంలో రాష్ట్రస్థాయి 16వ ర్యాంకు సాధించినట్లు నరేష్ తెలిపాడు.నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో శాలిగౌరారం మండలంలోని మా దారం కలాన్ గ్రామానికి చెందిన కె.హరిప్రీత్ రెడ్డి కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించాడు. గతంలో ఆయన గ్రూప్–4 ఉద్యోగం సాధించి చిట్యాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–2 రాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం పట్ల ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. కొందరు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా గ్రూప్స్కు సన్నద్ధమవుతూ విజయం సాధించగా.. మరికొందరు ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు.జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంపీఓగా..కార్యదర్శి నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా..భూదాన్పోచంపల్లి : గ్రూప్–2 ఫలితాలలో భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కంచర్ల రాజశేఖర్రెడ్డి సచివాలయం సాధారణ పరిపాలన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి మండలంలోని జలాల్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రాజశేఖర్రెడ్డిది స్వస్థలం చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామం. తండ్రి లారీ డ్రైవర్ కాగా, తల్లి గృహిణి. స్థానికంగా జెడ్పీ హైస్కూల్ ఎస్సెస్సీ, చౌటుప్పల్లో ఇంటర్, నేతాజీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. గ్రూప్ –2 ఫలితాలలో అసిస్టెంట్ సెక్షన్ఆఫీసర్గా ఉద్యోగం సాధించడం పట్ల ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మాజిద్, సూపరిండెంట్ సత్యనారాయణ, తల్లిదండ్రులు, తోటి పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం మైనవారిగూడెం గ్రామానికి చెందిన మైనం సుధాకర్, నాగమణి దంపతుల కుమారుడు మైనం అశోక్ ఆదివారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో మండల పంచాయతీ ఆఫీసర్(ఎంపీఓ)గా ఎంపికయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అశోక్ గతంలో గ్రూప్–4కు ఎంపికై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్–3లో కూడా ఉద్యోగం సాఽధించారు. ఇంకా ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని అశోక్ తెలిపారు. ఆయను తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.అసిస్టెంట్ రిజిస్ట్రార్గా హరిప్రీత్రెడ్డి -
చికిత్స పొందుతూ మృతి
మోత్కూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన చేకూరి మల్లేషం భార్య విజయనిర్మల అలియాస్ మమత(48) ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో ఆరెగూడెం వస్తుండగా.. భువనగిరి మండలం కుమ్మరిగూడెం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మమతను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దవూర: భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలం తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన నక్క రాములు, అతడి సోదరికి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామయ్య సోదరి కుమారులైన రామలింగయ్య, శంకరయ్య రామయ్యతో పాటు అతడి భార్య లక్ష్మిపై దాడి చేశారు. దీంతో వారిద్దరి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పెద్దవూర పోలీసులు పేర్కొన్నారు.గాయపడిన రామయ్య, లక్ష్మి వృద్ధ దంపతులకు గాయాలు -
విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట: సమాజంలోని విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా పక్షోత్సవంలో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను, రాజకీయ రంగంలో దివ్యాంగుల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన డాక్టర్ ఎన్. అశోక్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం, బుద్ధ గ్రంథాలయంను కాసం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అనేక మంది విశిష్ట వ్యక్తులు, ప్రాంతాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. ఆయన వెంట నాయకులు నకిరేకంటి మొగులయ్య, మడూరి ప్రభాకర్రావు, మైల నర్సింహ, శాగ చంద్రశేఖర్రెడ్డి, మండల వెంకన్న, తాటిపాముల శివకృష్ణ, వనం అంజయ్య, బండ మధుకర్రెడ్డి, నకిరేకంటి మహేష్, చెరుపల్లి శ్రవన్, మొగిలి రమేష్, గూడెల్లి దామోదర్, గంజి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు -
అభివృద్ధి పథంలో సంఘమిత్ర బ్యాంకు
నల్లగొండ టౌన్: సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బ్యాంకు ఫౌండర్ అండ్ చైర్మన్ సంగం రామకృష్ణ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బ్యాంకు 54వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998లో స్థాపించబడిన సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుల సేవే పరమావధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతుందన్నారు. 983 మంది వాటాదారులతో రూ.160.35 లక్షల వాటా ధనం కలిగి ఉన్నట్లు తెలిపారు. 3138 మంది ఖాతాదారులతో రూ.90.82 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 4395 మందికి రూ.80 కోట్ల మేర వివిధ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తం వ్యాపారం రూ.170.82 కోట్లకు పైబడి ఉందన్నారు. రూ.1.8 కోట్లతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ సన్నిదానం చక్రపాణి, డైరెక్టర్లు పున చండికేశ్వర్, కొంగరి భిక్షం, గుండ్ల అంజిరెడ్డి, బండ భిక్షంరెడ్డి, ఎర్రమల లక్ష్మీనర్సు, చెరుపల్లి పద్మ, వీరవల్లి భవాని, చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
18 గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల
మేళ్లచెరువు : ఎగువన ఉన్న నాగార్జున సాగర్తోపాటు మూసీ ప్రాజెక్టులు, టెయిల్పాండ్ గేట్లు ఎత్తడంతో చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. ఆదివారం రాత్రి వరకు 6,00,685 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో 18 గేట్లను 4 నుంచి 5 మీటర్ల మేర పైకెత్తి అవుట్ఫ్లోగా 6,08,541 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. -
మార్కెట్కు దసరా జోష్
గత నెలతో పోల్చితే ఈ నెలలో కార్ల విక్రయాలు బాగా పెరిగాయి. జీఎస్టీ రేట్ల మా ర్పు, దసరా పండుగ రెండూ కలిసి వచ్చాయి. జీఎస్టీ తగ్గించడంతో ఒక కారుపై సుమారు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు రేట్లు తగ్గాయి. – పి.క్రాంతికిరణ్, హుండాయ్ జనరల్ మేనేజర్ రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్ : దసరా పండుగ వేళ వివిధ వ్యాపార మార్కెట్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్లను కుదించి తాజాగా కొత్త సంస్కరణలు తేవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు పండుగ సందర్భంగా వివిధ షోరూమ్లు, షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కొత్త వస్త్రాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేసేందుకు వినియోగదారుల ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో పండుగ అమ్మకాలు జోరందుకున్నారు. జీఎస్టీలో రెండు స్లాబ్లు.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు చిరు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబ్లు అమలులో ఉండగా తాజా సంస్కరణలతో 5, 18 శాతం వరకు ఒకటి, 40 శాతం వరకు రెండో స్లాబ్గా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కార్లు, టీవీలు, బైక్లు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. ధరల తగ్గుదల ఇలా.. జీఎస్టీ కొత్త స్లాబ్లు అమలులోకి రావడంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీల ధరలు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగి వచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ జీఎస్టీ 5శాతానికి మారడంతో రూ.200 నుంచి రూ.400 వరకు ధరలు తగ్గాయి. ద్విచక్ర వాహనాలపై ఇప్పటి వరకు 28 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 18 శాతం స్లాబ్కు మార్చడంతో 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో బైక్ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇక జీఎస్టీ మార్పుతో చిన్న కార్ల రేట్లు తగ్గించగా, భారీ కార్లు, లగ్జరీ వాహనాలపై పెంచింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో చిన్న కార్ల ధరలు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు తగ్గాయి. ఎలక్ట్రికల్ వాహనాలకు 5 శాతం పాత జీఎస్టీనే కొనసాగుతోంది. రేట్లు తగ్గడంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈసారి వాహనాల కొనుగోలు పెరిగిందని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు.. దసరా పండుగ వేళ వివిధ షాపింగ్ మాల్స్, ఆన్లైన్ స్టోర్స్ అన్నీ స్పెషల్ క్యాష్బ్యాక్ వంటి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఫ్యామిలీ షాపింగ్, పండుగ డెకరేషన్ కోసం కొత్త ఐటెమ్స్కు డిమాండ్ బాగా పెరిగింది. మొబైల్స్ను ఆన్లైన్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ షాపింగ్తో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. కాస్త ఉపశమనమే.. జీఎస్టీ సంస్కరణలతో కుక్కర్లు, టీవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు సైతం వాటిని సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభించింది. ఈ మార్పు చిరు ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మాత్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఫ జీఎస్టీ స్లాబ్ల కుదింపుతో కాస్త తగ్గిన ధరలు ఫ ఊపందుకున్న వ్యాపారాలు ఫ పండుగ ఆఫర్లతో పెరిగిన వాహన కొనుగోళ్లు ఫ తగ్గిన ధరలతో చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట -
మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పోతున్న వరదనీరు భీమారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద కేతేపల్లి : నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మది క్రస్ట్గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంతవాగు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా శనివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్లోకి 41,324 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 643.70 అడుగుల వద్ద నీరు ఉంది. మూసీకి ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎనిమిది అడుగులు, ఒక గేటును ఆరు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 44,547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమారం వద్ద నిలిచిన రాకపోకలు.. మూసీ ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తడంతో కేతేపల్లి మండలం భీమారం–సూర్యాపేట మధ్య భీమారం శివారులో మూసీవాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన వరదనీటిలో మునిగిపోయింది. వంతెన మీదుగా నాలుగు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మిర్యాలగూడ నుండిచి వయా భీమారం మీదుగా సూర్యాపేటకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సూర్యాపేట – మిర్యాలగూడ పట్టణాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను అధికారులు వయా ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల మీదుగా దారి మళ్లించారు. వంతెనపైకి వాహనాలు వెళ్లకుండా కేతేపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు పికెట్ ఏర్పాటు చేశారు. వంతెనపై వరద ప్రవాహాన్ని తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ సతీష్ పరిశీలించారు.ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత -
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
రామగిరి(నల్లగొండ) : ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 69 మంది లబ్ధిదారులకు శనివారం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు గుడిసెల్లో నివాసం ఉండొద్దని.. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్నామన్నారు. అన్నారెడ్డిగూడెం గ్రామానికి 17 ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, రంగులు వేసుకోవాలని, దీపావళిలోపు గృహప్రవేశాలు చేయాలని, ఇందుకుగాను ప్రతి ఇంటికి తన వంతుగా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అన్నారెడ్డిగూడెం నుంచి తొరగల్లు వరకు రూ.2 కోట్లతో రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.5 లక్షల 4 వేలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయించామన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ పీపీ రాజ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆఫీజ్ ఖాన్, తహసీల్దార్ పరశురాం, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రైతుల భూములు లాక్కోవద్దు
నల్లగొండ టౌన్ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కోల్పోతే పరిహారం ఏం ఇస్తారో ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. అందుకే భూమిని ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పారు. రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరి కాదన్నారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కొండ అనురాధ, రైతులు పాల్గొన్నారు. -
నేడు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ప్రతి రెండేండ్లకోసారి సెప్టెంబర్ చివరి ఆదివారం పాలకవర్గానికి ఎన్నిక నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. 2025–27 నూతన కార్యవర్గ ఎన్నికల్లో 90 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి –1, 2, కోశాధికారి పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 10గంటలకు మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఎన్నికల అధికారిగా కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్ వ్యవహరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల నామినేషన్ల ప్రక్రియ, మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 3గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏ స్థానానికి ఎవరెవరు పోటీ చేస్తారో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మహిళలంతా సంఘాల్లో చేరాలినకిరేకల్ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందురు వారంతా స్వయం సహాయక సంఘాల్లో చేరాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్రెడ్డి సూచించారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని నర్సరీని శనివారం ఆయన సందర్శించారు. నర్సరీ నిర్వహణ బాగుండడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, వన సేవక్ రాజేష్ను సన్మానించారు. ఆయన వెంట ఏపీడీ లక్ష్మీ నర్సింహ, ఏపీఓ రమణయ్య, టీఏలు స్వాతి, రమణ, యాదగిరి, రాధా, కృష్ణ ఉన్నారు. మదర్ డెయిరీ డైరెక్టర్గా మూడోసారి.. చిట్యాల : మదర్ డెయిరీ డైరెక్టర్గా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన కర్నాటి జయశ్రీ మూడోసారి విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా హయాత్నగర్లోని మదర్ డెయిరీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మహిళ కోటా స్థానానికి ఆమె డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సొసైటీ అధ్యక్షులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారుకనగల్ : మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్రెడ్డి, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమారాచార్యులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా గృహప్రవేశాలు
కనగల్ : మండల పరిధిలోని తెలకంటిగూడెంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామానికి 107 ఇళ్లు మంజూరు కాగా.. 10 ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో గృహ ప్రవేశం చేశారని మంత్రి తెలిపారు. తేలకంటిగూడెం గ్రామానికి వారం, పది రోజుల్లో రేషన్దుకాణం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తేలకంటిగూడెం నుంచి ధర్వేశిపురం కలిపే రహదారి వరకు తారు రోడ్డును రూ.25 కోట్లతో మంజూరు చేశామన్నారు. గ్రామంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ సుమలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, గుండెబోయిన భిక్షం, బోగారి రాంబాబు, బిల్లపాటి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు ఒక్క టెండర్
నల్లగొండ : మద్యం దుకాణాలకు టెండర్దాఖలు ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు శుక్రవారం ఒక టెండర్ దాఖలయ్యింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని 45వ షాపునకు ఒక టెండర్ వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా ఎస్సీలకు 14, ఎస్టీలకు 4, గౌడ సామాజిక వర్గానికి 34 షాపులను కేటాయించారని.. వాటికి ఆయా కులస్తులు కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నల్లగొండకు నేడు మంత్రి కోమటిరెడ్డి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9గంటలకు మంత్రి క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 11గంటలకు ఏటీసీ సెంటర్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నల్లగొండలోని అశోక గార్డెన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందిస్తారు. 1.30 గంటలకు కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అవార్డు అభినందనీయంనల్లగొండ : జల సంచయ్ జల్ బాగిదారి (జేఎస్జేబీ) జాతీయ అవార్డుల్లో దక్షిణ భారత జోన్లో టాప్ 3 స్థానాలు తెలంగాణ రాష్ట్రం కై వసం చేసుకోవడం, నల్లగొండ జిల్లాకు అవార్డు రావడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకు విజయం అందించిన అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఏఎమ్మార్పీ డీఈగా మహేష్కుమార్నల్లగొండ : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) డివిజన్–6 డివిజనల్ ఇంజనీర్గా మహేష్కుమార్ శుక్రవారం నల్లగొండలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. -
తెలంగాణ వీరవనిత.. చాకలి ఐలమ్మ
నల్లగొండ : తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సాగర్ రోడ్డులో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, చొల్లేటి ప్రభాకర్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ, బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి రాజ్కుమార్, బీసీ సంఘాల నాయకులు కొండూరు సత్యనారాయణ, రామరాజు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో మదర్ డెయిరీ మంటలు!
సాక్షి, యాదాద్రి: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికలు కాంగ్రెస్లో చిచ్చు రగిల్చాయి. మూడు డైరెక్టర్ల స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్నేహపూర్వక పొత్తు కుదర్చుకోవడంతో అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు చోట్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్తో పొత్తు ఎందుకని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకున్ని మీరు ఏ విధంగా గెలిపిస్తారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల అయిలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఎమ్మెల్యే సామేల్కు ఫోన్ చేసి విషయంపై వాకబు చేశారు. అయితే పోటీలో ఉన్న మోతె పూలమ్మ, పిచ్చిరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీస్ చర్చనీయాంశంగా మారింది. పిచ్చిరెడ్డి సైతం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. 308 మంది పాల చైర్మన్లు మూడు డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 308 మంది పాలసొసైటీ చైర్మన్లు ఓటింగ్లో పాల్గొంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ చైర్మన్లను శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సమీపంలోకి క్యాంపులకు తరలించారు. శనివారం ఉదయం క్యాంప్ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఒక మహిళ, రెండు జనరల్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మహిళ, ఒక జనరల్ డైరెక్టర్ స్థానాలకు కాంగ్రెస్, ఒక డైరెక్టర్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ గెలిచేలా ఇరు పార్టీల నాయకులు ఒప్పందం చేసుకున్నారు. పోటీలో ఉన్నదీ వీరే.. కర్నాటి జయశ్రీ, గంట్ల రాధిక, మోతె పూలమ్మ, సూధగాని విజయ, కుంచాల ప్రవీణ్రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, శీలం వెంకటనర్సింహారెడ్డి, సందిల భాస్కర్ గౌడ్. మూడు డైరెక్టర్ల స్థానాలకు నేడు ఎన్నికలు ఫ స్నేహపూర్వక పొత్తు కుదర్చుకున్న అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఫ కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్కు ఒకటి ఫ పొత్తుపై తుంగతుర్తి ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి పాడి రైతుల భవిష్యత్ కోసమే బీఆర్ఎస్తో పొత్తుకు దిగినట్లు చైర్మన్ గుడిపాటి చెబుతున్నారు. నార్మాక్స్ను ఎన్డీడీబీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈనెల జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఎన్డీడీబీకీ అప్పగిస్తూ పాలక వర్గం తీర్మానం చేసి ఇవ్వాల్సి ఉంది. పాలకవర్గంలో బీఆర్ఎస్ డైరక్టర్లు ఉన్నారు. అయితే తమకు ఒక స్థానం ఇస్తే తీర్మానంలో సహకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్కు ఒక స్థానం కేటాయించినట్లు చైర్మన్ సాక్షితో చెప్పారు. -
ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై శుక్రవారం ఉదయాదిత్య భవన్లో స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని, తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం జారీచేసిన హ్యాండ్బుక్ను, నియమ, నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, టీఏ, డీఏ చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, డాక్టర్ రమేష్, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జోరు వాన.. పారిన వరద
ఫ పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదునల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, పొంగిపొర్లడంతో పాటు పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పంట పొలాలకు, పత్తి చేలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 52.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా తిరుమలగిరిసాగర్లో 12.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వర్షపాతం ఇలా.. త్రిపురారం మండలంలో 97.1మిల్లీమీటర్లు, పెద్దవూర 86.4, అడవిదేవులపల్లి 83.2, మిర్యాలగూడ 79.9, అనుముల హాలియా 79.8, చిట్యాల 26.8, నార్కట్పల్లి 27.3, కట్టంగూర్ 34.7, శాలిగౌరారం 20.2, నకిరేకల్ 35.1, కేతేపల్లి 23.4, తిప్పర్తి 53.3, నల్లగొండ 45.3, కనగల్ 58.0, మునుగోడు 43.7, చండూరు 53.0, మర్రిగూడ 38.3, చింతపల్లి 24.0, నాంపల్లి 36.4, గుర్రంపోడు 59.2, నిడమనూరు 55.4, మాడ్గులపల్లి 61.5, వేములపల్లి 74.5, దామరచర్ల 52.1, పీఏపల్లి 57.3, నేరడుగొమ్ము 39.3, కొండమల్లేపల్లి 59.9, దేవరకొండ, 30.6, గుండ్లపల్లి 34.6, చందంపేట 39.5, గట్టుప్పల్ 26.5, గుడిపల్లి 63.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పొంగిన వాగులు పెద్దవూర: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండలం నుంచి ప్రవహించే పెద్దవాగు పొంగి పొర్లింది. పెద్దవూర, పోతునూరు, సంగారం, నాయినివానికుంట, చింతపల్లి, శిర్సనగండ్ల, వెల్మగూడెం తదితర గ్రామాలలోని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. పలు కల్వర్టు పైనుంచి వరద పొంగిపొర్లడంతో వాహనదారులకు ఇబ్బంది పడ్డారు.తిరుమలగిరి సాగర్ : వరి చేల మీదుగా ప్రవహిస్తున్న వరద పెద్దవూర : అలుగు పోస్తున్న పెద్దవూర చెరువు మూసీ తొమ్మిది గేట్లు ఎత్తివేత కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉండటంతో శుక్రవారం రాత్రి అధికారులు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తారు. హైదరాబాద్లోని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో అక్కడి అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదిలారు. వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన మూసీ అధికారులు ఏడు క్రస్ట్గేట్లను 2 అడుగులు, 2 క్రస్టు గేట్లను 3 అడుగులు(మొత్తం 9గేట్లు) పైకెత్తి 13వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 644 మేర అడుగుల మేర నీరు ఉందని అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి: మూసీ గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని మూసీ తీర ప్రాంతం వెంట ఉన్న 41 గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ సూర్యాపేట డివిజన్–1 ఈఈ వెంకటరమణ సూచించారు. మూసీ వాగు వెంట మోటార్లు అమర్చుకుని వ్యవసాయం చేసుకునే వారు వాటిని తొలగించి ఎగువ ప్రాంతాలకు తరలించుకోవాలన్నారు. గొర్రెల, పశువుల కాపర్లు, రైతులు, జాలర్లు మూసీ వాగులోకి వెళ్లవద్దని సూచించారు. -
ప్రభుత్వానికి ధన్యవాదాలు
బీసీలు రిజర్వేషన్ల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కామారెడ్డి ప్రకటనకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ తేవడం హర్షించదగ్గ విషయం. ఆ జీఓ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ఎవరూ కోర్టుకు వెళ్లకముందే షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. – చక్రహరి రామరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు -
నేలవాలుతున్న వరిచేలు
ఫ అధిక వర్షంతో వాలిపోతున్న పొలాలు ఫ నాన్ఆయకట్టులో కోత దశకు వచ్చిన చేలు ఫ పొలంలోనే వర్షం నీటిలో తడుస్తున్న గింజలు ఫ గింజలు మొలకెత్తే ప్రమాదముందని రైతుల్లో ఆందోళన నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అధిక వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో వరిచేలు నేలవాలుతున్నాయి. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 5,05160 ఎకరాల్లో వరిసాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతాలైన దేవరకొండ, నల్లగొండ, చండూరు, మునుగోడు వ్యవసాయ డివిజన్లలో జూన్, జూలై మాసాల్లో వరినాట్లు వేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వరిచేలు గింజలు ఎర్రబారి కోత దశకు వచ్చాయి. ఈ తరుణంలో పదిహేను రోజులుగా వరుసగా వర్షాలు కురవడంతో వేలాది ఎకరాల్లో వరిచేలు పూర్తిగా అడ్డంపడి నేలవావాలినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరికోత మిషన్లు వెళ్లేందుకు వీలుకాక.. చేలు నేలవారి వర్షం నీటిలో తడుస్తుండడంతో వరి గింజలు మొలకెత్తే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. వరికోతలు కోయాలంటే నీరు నిలిచి ఉండడంతో పొలాల్లోకి మిషన్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నేలవాలిన వరిని కోయాలంటే చైన్ మిషన్ ద్వారా కోయించాల్సి ఉంటుంది. చైన్ మిషన్తో కోయించాలంటే గంటకు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని దీంతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబారిన వరిచేను వర్షాల కారణంగా పూర్తిగా అడ్డంపడిపోయింది. పొలంలో నీరు నిలిచిన కారణంగా వరిగింజలు మొలకెత్తుతాయని భయంగా ఉంది. కోయాలన్నా మిషన్ పొలంలోకి వెళ్లే పరిస్థితి లేదు. – జానపాటి రాజేంద్రప్రసాద్, రైతు గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
భూభారతి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నల్లగొండ: రెవెన్యూ సదస్సులు, భూభారతిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్స్ భూములు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్టీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
యూరియా కష్టాలు తీర్చాలని రాస్తారోకో
అడవిదేవులపల్లి : యూరియా కష్టాలు తొలగించాలని కోరుతూ గురువారం అడవిదేవులపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక మిర్యాలగూడ ప్రధాన రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా యూరియా కోసం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు వస్తున్నా అందరికీ దొరకడం లేదని వాపోయారు. ఇప్పటికై నా మండల రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. టోకెన్ల కోసం తెల్లవారుజామునుంచే బారులు త్రిపురారం : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. వరిపైరుకు యూరియా వేసే అదును దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం త్రిపురారం పీఏసీఎస్కు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు టోకెన్ల కోసం స్థానిక రైతు వేదిక వద్ద ఉదయం 4 గంటల నుంచే క్యూకట్టారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సమక్షంలో టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం యూరియా పంపిణీ చేయగా అందని చాలా మంది రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. త్రిపురారం : రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం బారులుదీరిన రైతులు అడవిదేవులపల్లి : రాస్తారోకో చేస్తున్న రైతులు -
జల సంరక్షణలో జాతీయ అవార్డు
నల్లగొండ : జల సంరక్షణ– ప్రజల భాగస్వామ్యం (జల్ సంచయ్ ఔర్ జన్ భాగీదారీ) పథకాన్ని పక్కాగా అమలు పర్చినందుకు నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. మన జిల్లాతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు జాతీయ అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా ఇందులో నల్లగొండ ఉండడం విశేషం. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. నీటి సంరక్షణ కోసం జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కేంద్రం నిధులతో చెక్ డ్యాములు, పాంపాండ్స్, ఇంకుడు గుంతలు, ఫిష్ పాండ్స్, గుట్టలపై కందకాలు, పార్కులేషన్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినందుకు ఈ అవార్డు దక్కింది. జాతీయ అవార్డు సాధించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా జిల్లాల అధికారులు, ప్రజలను అభినందించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాకు ఇలాంటి అవార్డు రావడం మొదటిసారి అని, ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
మద్యం టెండర్లకు నోటిఫికేషన్
నల్లగొండ: రెండేళ్ల పాటు కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో జిల్లా కలెక్టర్ మద్యం షాపులను కేటాయించనున్నారు. జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉండగా నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ పద్ధతిన ఎస్సీలకు 14, ఎస్టీలకు 4, గౌడలకు 34 షాపులను కేటాయించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు సమక్షంలో గురువారం కలెక్టరేట్లో డ్రా తీశారు. ఎవరికి ఏయే షాపులు అనేది శుక్రవారం ప్రకటించనున్నారు. నేటి నుంచి దరఖాస్తులు నూతన మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ కేటాయించనున్నారు. రెండేళ్ల పాటు దుకాణాలకు లైసెన్స్ కొత్త మద్యం దుకాణాలకు రెండేళ్ల పాటు లైసెన్స్లు ఇవ్వనున్నారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారంతా డిసెంబర్ 1 నుంచి వాటిని తెరవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాల పరిమితి గడువు ఉండనుంది. ఈ సారి పెరిగిన టెండర్ ఫీజు టెండర్లో పాల్గొనేవారు రూ.3 లక్షలు టెండర్ దరఖాస్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచింది. ఎన్ని దుకాణాలకు టెండర్లు వేస్తే ఒక్కోదానికి రూ.3 లక్షల చొప్పున డీడీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ మూడు చోట్ల ఉండనుంది. నల్లగొండలోని రామగిరిలో గల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో, హైదరాబాద్ నాంపల్లిలోని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫ రెండేళ్ల కాల పరిమితికి విడుదల చేసిన ప్రభుత్వం ఫ నేటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఫ అక్టోబర్ 23 డ్రా పద్ధతిన దుకాణాల కేటాయింపు ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించిన కలెక్టర్ ఫ ఈ సారి టెండర్ ఫీజు రూ.3లక్షలు ఫ డిసెంబర్ 1న ప్రారంభించనున్న కొత్త వైన్స్ కొత్త మద్యం దుకాణాల కోసం ఒక్కొక్కరు ఎన్నింటికై నా టెండర్లు వేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రాలో ఒక్కరికే ఎన్ని దుకాణాలు వెళ్లినా కేటాయించబడతాయి. నల్లగొండలో 2 చోట్ల, హైదరాబాద్లో నాంపల్లి కమిషనర్ కార్యాలయంలో టెండర్ల స్వీకరణ ఉంటుంది. హైదరాబాద్లో ఉండేవారు అక్కడే టెండర్ దాఖలు చేయవచ్చు. –బి.సంతోష్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
ఓటు చోర్పై నేటి నుంచి సంతకాల సేకరణ
నల్లగొండ: బీజేపీ ఓటు చోర్పై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి కాంగ్రెస్ ఆధ్యర్యంలో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు చోర్పై ఏఐసీసీ నేత రాహుల్గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అక్కడ ఓటు చోర్కి పాల్పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఓటు చోర్పై అన్ని గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాలు, అభిప్రాయ సేకరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు
నల్లగొండ: రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లాకు 4.65 లక్షల సంచులు కేటటాయించి మండల స్థాయి గోదాములకు పంపించింది. ఈ సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు అక్టోబర్ 1 నుంచి రేషన్ తోపాటు అందజేయనున్నారు. రేషన్ కార్డుపై అందరికీ సన్న బియ్యం–ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదంతో ఈ సంచులను ప్రభుత్వం తయారు చేయించింది.సీసీ కెమెరాలతోనే భద్రతగుర్రంపోడు : సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత పక్కాగా ఉంటుందని, ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల అవాఛంనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. అంతకుముందు ఎస్పీ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక, సీఐ నవీన్కుమార్, ఎస్ఐ పసుపులేటి మధు తదితరులు ఉన్నారు.30 వరకు చేయూత పింఛన్ల పంపిణీనల్లగొండ: జిల్లాలో చేయూత పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైందని, ఈ నెల 30 తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తామని డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు వారి పరిధిలోని పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.16 చిల్లరతో సహా పింఛన్ మొత్తం అడిగి తీసుకోవాలని కోరారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రామకృష్ణనల్లగొండ టౌన్ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నల్లగొండ పట్టణానికి చెందిన మేడే రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, అధ్యక్షుడు యానం విజయ్కుమార్తోపాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 586.70 అడుగులు ఇన్ఫ్లో : 2,93,744క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 2,73,169 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,130 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 9,019 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : నిల్ ఏఎమ్మార్పీకి : 2,400 క్యూసెక్కులు వరద కాల్వకు : 300 క్యూసెక్కులు- 10లో -
ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోరా..
ఫ మెడికల్ కళాశాల ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన ఫ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వేడుకోలు నల్లగొండ టౌన్ : ఏజెన్సీ నిర్వాహకులు తమకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని నల్లగొండ మెడికల్ కళాశాలలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి విధులను బహిష్కరించి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు. వీరు చేపట్టిన ధర్నా గురువారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు నారబోయిన ప్రశాంత్, రాజు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలలో తాము విధులు నిర్వహిస్తున్నామని, అయినా నెలనెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జీతా లే కాకుండా ఆరు నెలలుగా ఏజెన్సీ నిర్వాహకులు తమకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేయడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి దసరాకు తమ నాలుగు నెలల వేతనాలను ఇప్పించాలని వేడుకుంటున్నారు. కార్యక్రమంలో మఽధుమురళి, అండాలు, చంద్రమ్మ, మంగమ్మ పాల్గొన్నారు. -
నర్సరీ పరిశీలన
నాంపల్లి : మండలంలోని తుంగపాడ్ గ్రామంలో నర్సరీని డీఆర్డీఓ శేఖర్రెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కలు మంచిగా ఉండడంతో నిర్వాహకులను అభినందించారు. గ్రామంలో రైతు మల్లయ్య మునగ తోటను పరిశీలించారు. సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మార్కెటింగ్ సౌకర్యం ఉన్నందున రైతులు మునగ తోటలు ఎక్కువగా వేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం శోభారాణి, లింగయ్య, భాస్కర్, నాగయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల భద్రతకు చట్టం తేవాలినకిరేకల్ : న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి కోరారు. నకిరేకల్లో న్యాయవాది కొండ యాదగిరి కార్యాలయంలో బుధవారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ యాదగిరి, సీనియర్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, బచ్చుపల్లి ప్రకాష్రావు, ఎండీ హఫీజ్, మంగ సైదులు, నూక మల్లేష్, రాజు, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ, హస్తం.. దోస్తీ!
సాక్షి, యాదాద్రి: మదర్ డెయిరీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఒక్కటయ్యాయి. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బద్ద శత్రువులుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. బరిలో తొమ్మిది మంది ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాల్లో మరోసారి తుంగతుర్తి నియోజకవర్గానికి రెండు, నకిరేకల్కు ఒకటి దక్కింది. ఈసారి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు అవకాశం లభించలేదు. మూడు డైరెక్టర్ల స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు మొత్తం తొమ్మిది మంది బరిలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులను బుజ్జగించి పనిలో రెండు పార్టీలు ప్రయత్నిస్తుండగా తాము తప్పుకునేది లేదని వారు పట్టుబడుతున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే నకిరేకల్ నియోజకవర్గానికి దక్కిన మహిళా డైరెక్టర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నలుగురు పోటీ పడుతున్నారు. గంట్ల రాధిక, కర్నాటి జయశ్రీ, మోతె పూలమ్మ, సూధగాని విజయ నామినేషన్దాఖలు చేశారు. వారికి ఎన్నికల అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. వీరిలో భువనగిరి ఎంపీ, నకిరేకల్ ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. గుంట్ల రాధికకు ఎంపీ చామలకిరణ్కుమార్రెడ్డి మద్దతు ఇస్తుండగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కర్నాటి జయశ్రీకి డైరెక్టర్ కోసం పట్టుబడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతు లభిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రెండు స్థానాలకు ఐదుగురు పోటీ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెండు జనరల్ డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మంచాల ప్రవీణ్రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, ఽశీలం వెంకట నర్సింహారెడ్డి, సందిల భాస్కర్గౌడ్ పోటీలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ తరఫున మంచాల ప్రవీణ్రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్తో కుదిరిన ఒప్పందం మేరకు బీఆర్ఎస్కు ఒక డైరెక్టర్ స్థానాన్ని కాంగ్రెస్ ఒదులుకుంది. మోత్కూరుకు చెందిన రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి పేరును బీఆర్ఎస్ సూచించింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ జోక్యంతో లక్ష్మీనరసింహారెడ్డి పేరు ఖాయం చేశారు. బీఆర్ఎస్ తరఫున ఆలేరు నియోజకవర్గం నుంచి సందిల భాస్కర్గౌడ్ కోసం ఆ పార్టీ నాయకత్వం చివరి వరకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అయినప్పటికి భాస్కర్ బరిలో ఉన్నారు. ఆలేరు, భువనగిరి పరిధిలో అత్యధిక ఓట్లు అత్యధికంగా ఓట్లు ఉన్న ఆలేరు, భువనగిరి నియోజవర్గాల నుంచి తమకు లబ్ది ఓటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడొకరుచెప్పారు. వ్యతిరేకంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని మదర్ డైయిరీ చైర్మన్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో డైరెక్టర్ స్థానాలకు నామినేషన్న్ వేసిన వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఉపసంహరణ గడువు ముగిసి గుర్తుల కేటాయింపు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ముగ్గురు పేర్లు రెండు పార్టీల ప్రతినిధులు ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు ఒప్పందం కుదిరితే పార్టీ నిర్ణయం మేరకు విత్డ్రా జరిగేది. ఇప్పుడు ఉపసంహరించుకోవడానికి వీలులేక వారంతా పోటీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ స్థానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోటాపోటీగా క్యాంపులు నిర్వహించాయి. అయితే చివరికి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి కూడా పోటీకి రెండు పార్టీలు సిద్ధపడ్డాయి. దీంతో పూర్తిస్థాయిలో విత్ డ్రాల కోసం ప్రయత్నించలేదు. అయితే ఓటింగ్కంటే ముందే పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. మదర్ డెయిరీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ఫ మూడు డైరెక్టర్ స్థానాల పంపకం ఫ కాంగ్రెస్ మద్దతుదారులకు రెండు, బీఆర్ఎస్ మద్దతుదారులకు ఒకటి ఫ 27వ తేదీన పోలింగ్ ఫ బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు మదర్డైయిరీ పాలకవర్గం డైరెక్టర్ల స్థానాలకు ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పార్టీలు పాల సొసైటీ చైర్మన్లను 26వ తేదీన క్యాంపునకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. పాల సొసైటీల్లో వివిధ పార్టీలకు చెందిన చైర్మన్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు కాకుండా పోటీలో ఉన్న మరో ఆరుగు అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్న పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డి పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇంకా మోతె పూలమ్మ, శీలం వెంకట నర్సింహరెడ్డి బరిలో ఉన్నారు. -
జెడ్పీ చైర్మన్ పీఠం ఎస్సీ రిజర్వ్?
నల్లగొండ : నల్లగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేశారు. రొటేషన్ పద్ధతిలో ఈసారి నల్లగొండ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీపీతో పాటు ఎంపీటీసీల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. అదే విధంగా పంచాయతీ, వార్డుల వారీ రిజర్వేషన్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్ జాబితాను జెడ్పీ అధికారులు కలెక్టర్కు అందజేశారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల జాబితాను బుధవారం ఆర్డీఓలు సీల్డ్ కవర్లో కలెక్టర్కు సమర్పించారు. ఆయా జాబితాను ఆమోదం నిమిత్తం కలెక్టర్ ప్రభుత్వానికి పంపనున్నారు. పెరిగిన బీసీ స్థానాలు మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేయగా.. బుధవారం ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 33 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో ఎస్సీ, ఎస్టీలకు పాత పద్ధతిలోనే (ఎస్సీలకు 6, ఎస్టీలకు 5) రిజర్వేషన్ చేశారు. బీసీలకు మాత్రం గతంలో 4 స్థానాలు ఉండగా.. ఈసారి 42 శాతం రిజర్వేషన్ ప్రకారం అవి 14 స్థానాలకు పెరగనున్నాయి. దీంతో బీసీలకు అదనంగా 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలు దక్కనున్నాయి. 16 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు వారికి దక్కుతాయి. మిగిలిన సీట్లు అన్ రిజర్వుడు కేటగిరిగా పరిగణిస్తారు. బీసీలకు 148 ఎంపీటీసీలు రిజర్వ్ బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు అవుతుండటంతో ఎంపీటీసీ స్థానాలు కూడా బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వ్ అయ్యాయి. గత 2019 ఎన్నికల్లో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో ఎస్టీలకు 52, ఎస్సీలకు 61, బీసీలకు 50 సీట్లు కేటాయించి 186 సీట్లు అన్ రిజర్వుడుగా ప్రకటించారు. ఇప్పుడు 4 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దాంతో ఎంపీటీసీల సంఖ్య 353కు చేరింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథావిదిగానే ఉంటాయి. బీసీలకు మాత్రం 148 స్థానాలు దక్కనున్నాయి. అంటే గతంలో కంటే 98 సీట్లు బీసీలకు అధికంగా రిజర్వ్ కానున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా జిల్లా స్థాయిలో ఖరాారు చేసి.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. జీఓ విడుదలయ్యే వరకు ఈ వివరాలను గోప్యంగా ఉంచనున్నారు. ఫ ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఫ కలెక్టర్ వద్దకు చేరిన జాబితాలు ఫ ప్రభుత్వం నుంచి జీఓ వచ్చాక ప్రకటించే అవకాశం ఫ రాష్ట్రస్థాయిలోనే జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్