breaking news
Nalgonda District Latest News
-
హక్కుల పరిరక్షణకు ..
విద్యార్థుల హక్కుల పరిరక్షణకు శ్రద్ధ చూపాలని చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ సీత సూచించారు. నల్లగొండ జైలు తనిఖీనల్లగొండ జిల్లా కారాగారాన్ని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. మోత్కూరులో ‘సంగీత’ శిలలు మోత్కూరులో కొంత ఇద్దయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న నల్ల రాళ్లను కొడితే సంగీత స్వరం వినిపిస్తోంది.- 8లో27న మహా ధర్నా, ప్రదర్శనఫ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నల్లగొండ టౌన్ : తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆద్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న మహా ధర్న ప్రదర్శను విజయవంతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు పిలుపునిచ్చారు. నల్లగొండలో మంగళవారం సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జిల్లాలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ఆందోళనలో పాల్గొనాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన 64 దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తీసుకురావాలన్నారు. సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబరు 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో సంఘం నాయకులు వెంకట్రెడ్డి, వెంకన్న, రాంబాబు, రమేష్, జగదీశ్ చంద్ర, సంపత్కుమార్, ఏడుకొండలు, యశ్వంతరాజ్, జనార్ధన్రావు పాల్గొన్నారు. ఆపరేటర్ల విభాగాలు మార్పు -
గ్రామీణులకు భరోసా.. ఆరోగ్య మహిళా
పరీక్షలు, మందులు ఉచితం క్యాన్సర్, రక్తహీనత, మూత్రనాళ ఇన్స్ఫెక్షన్, గర్బాశయ ముఖ ద్వార క్యాన్సర్, రొమ్ము, నోటి క్యాన్సర్, కుటుంబ నియంత్రణ, మోనోపాజ్ నిర్వహణ, రుతుక్రమం, ఊబకాయం, బీపీ, షుగర్, తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా షుగుర్, బీపీతోపాటు క్యాన్సర్యేతర ఇతర జబ్బులుఉన్న వారికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఏమైన వ్యాధులు ఉన్నట్లు అనుమానం వస్తే వారిని జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు రెఫర్ చేసి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగా ఖరీదైన పరీక్షలు నిర్వహించి అక్కడ ప్రత్యేక వైద్యుల చేత వైద్యం అందించడం ద్వారా మహిళల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారు. నల్లగొండ టౌన్ : మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 11 పీహెచ్సీల్లో ప్రతి మంగళవారం కొనసాగుతోంది. మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి వ్యాధులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. 2023 మార్చి 8న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 1,43,750 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 1,33,862 మంది మహిళలకు ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసి 6,902 మందిని వివిధ రకాల క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు రెఫర్ చేశారు. చేసిన పరీక్షలు ఇలా.. పీహెచ్సీ ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ చింతపల్లి 11,300 11,207 1,498 డిండి 40,190 14,116 1,986 దామరచర్ల 9,734 9,707 2,332 నిడమనూరు 13,055 12,998 1,130 వేములపల్లి 13,299 13,342 986 చండూరు 11,547 11,523 1,395 కట్టంగూర్ 13,199 13,135 934 తిప్పర్తి 11,562 11,759 2,966 మాన్యంచెల్క 13,563 13,468 1,424 శాలిగౌరారం 9,762 9,856 2,681 మర్రిగూడ 12,651 12,550 2,066 బీపీ మండల్ జయంతినల్లగొండ టౌన్ : బీపీ మండల్ 109వ జయంతి సందర్భంగా నల్లగొండలో ఆయన విగ్రహానికి మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, అల్లి సుభాష్, గుండు వెంకటేశ్వర్లు, బక్కతట్ల వెంకన్న యాదవ్, పుట్టా వెంకన్న గౌడ్, ముప్పిడి మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు. బీసీ భవన్లోనల్లగొండలోని బీసీ భవన్లో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్, గుంటోజు గోవర్ధన్, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, పసుపులేటి సీతారాములు, నల్లమేకల మధుయాదవ్, తవడబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ 11 పీహెచ్సీల్లో ప్రతి మంగళవారం వైద్యం ఫ ఇప్పటి వరకు 1,33,862 మందికి క్యాన్సర్ పరీక్షలు ఫ 6,902 మంది క్యాన్సర్ అనుమానితులను జీజీహెచ్కు రెఫర్ -
విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి సారించాలి
నల్లగొండ : విద్యార్థుల చదువులు, ప్రవర్తనపై వార్డెన్లు, ఉపాధ్యాయులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు చెప్పారు. ఆయన మంగళవారం జిల్లా ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, ఇంజనీర్లతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు కనిపించినా వెంటనే గుర్తించి తగిన విధంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ససంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో మిగిలి ఉన్న పనులను టెండర్లు పిలిచి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు కూడా నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యుటీ డైరెక్టర్ శశికళ, బీసీ సంక్షేమ అధికారి సంజీవ, మైనార్టీ కార్పొరేషన్ అధికారి విజయేందర్రెడ్డి , పంచాయతీరాజ్ అధికారి గిరిధర్, మిషన్ భగీరథ డీఈ శాంతకుమారి పాల్గొన్నారు. సాగునీటి ప్రాజక్టుల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన సమయంలో ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొని మాట్లాడారు. పెండ్లిపాకల, చింతపల్లి, నెల్లికల్ కిష్టరాంపల్లి, దున్నపోతులగండి, ఉదయసముద్రం తదితర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూ సేకరణ చెల్లింపులకు ప్రభుత్వం నుంచి 371.82 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇందులో భూములు కోల్పోయిన రైతులకు రూ.181.43 కోట్లు చెల్లించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రాజక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఫ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలకు కలెక్టర్ సూచన -
ఫ ఉమ్మడి జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు లక్షా 91 వేలు ఫ ఆరేళ్లలో 29వేల లోపే రెగ్యులరైజ్
రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఒక్క నందికొండ మున్సిపాలిటీ మినహా మిగితా 18 మున్సిపాలిటీల నుంచి 1,91,187 మంది రూ.19.04 కోట్లు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో 57,554 మంది రూ.5.75 కోట్లు చెల్లించి దరఖాస్తు చేకున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన అప్పట్లో తలెత్తిన న్యాయ వివాదాల కారణంగా పెండింగ్లో పడింది. 2024లో ఇందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తరువాత రెండుసార్లు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి క్రమబద్దీకరణకు ఆదేశాలు జారీచేసింది.ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా, నందికొండ మినహా మిగితా మున్సిపాలిటీల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పొడగించింది. నవంబరు 30వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆలోగా ఎంతమేరకు పరిష్కరిస్తారన్నది వేచిచూడాల్సిందే. పరిశీనలో విఫలం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రజలు వాటిని క్రమబద్దీకరించుకునేందుకు ఆరేళ్ల కిందట ఒక్కొక్కరు రూ.1000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాలో దాదాపు 1.91 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. వారిలో చాలా మంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సకాలంలో అప్లోడ్ చేయలేదు. కొంత మంది మాత్రం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. ప్రస్తుతం వారంతా ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా (ఆన్లైన్లో) డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. అసలు ఎన్ని దర ఖాస్తుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి..? పత్రాలు సరిగ్గా లేనివి ఎన్ని?.. ఏయే పత్రాలను సమర్పించాలి.. ఫీజు చెల్లించినా రెగ్యులరైజేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడంలేదనే వివరాలను క్రోడీకరించి, ఆయా దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చే వ్యవస్థే లేకపోవడంతో ఎల్ఆర్ఎల్ గందరగోళంగా తయారైంది. ప్రాసెస్ చేసిందీ మూడింట ఒకటో వంతే... ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో 1,91,187 మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం మూడో వంతు దరఖాస్తులను మాత్రమే అధికారులు ఇప్పటివరకు ప్రాసెస్ చేయగలిగారు. వాటిల్లో 8వేల దరఖాస్తులను తిరస్కరించిన అధికారులు సరైన డాక్యుమెంట్స్ లేవని మరో 25 వేల దరఖాస్తులను పక్కన పెట్టారు. కేవలం 28,543 దరఖాస్తులను మాత్రమే పూర్తి స్థాయిలో పరిశీలించి ఫీజు చెల్లించాక క్రమబద్ధీకరణకు ఓకే చెప్పారు. మరో 32 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజులను చెల్లించి ఉన్నా వాటిని ఇంకా పరిష్కరించలేదు. నందికొండ మున్సిపాలిటీకి ఎల్ఆర్ఎస్ వర్తించదుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఫ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అడ్డంకులెన్నో.. ఫ ఆదాయం వస్తున్నా పట్టించుకోని పరిస్థితిలో యంత్రాంగం ఫ తాజాగా మరోసారి అవకాశం.. నవంబరు 30వరకు గడువు మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రోగ్రెస్ ఇదీ.. మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లించినవి రెగ్యులరైజ్డ్ పెండింగ్ నల్లగొండ 31281 – 7732 23549 నకిరేకల్ 785 – 522 263 మిర్యాలగూడ 14340 3274 2401 8665 హాలియా 14975 3913 2468 7594 దేవరకొండ 5188 554 331 4303 చిట్యాల 3273 557 229 2487 చండూరు 3750 703 295 2752 చౌటుప్పల్ 16664 – 2962 13702 మోత్కూరు 3812 – 869 2943 ఆలేరు 5108 1221 830 3057 యాదగిరిగుట్ట 12167 3768 745 7654 పోచంపల్లి 7840 2041 725 5074 భువనగిరి 14148 4852 2448 6848 సూర్యాపేట 36357 8149 4401 23807 కోదాడ 12548 2481 – 10067 హుజూర్నగర్ 4737 416 848 3473 నేరేడుచర్ల 3303 912 362 2029 తిరుమలగిరి 911 – 375 536 మొత్తం 191187 32842 28543 128803 -
పెన్షన్ బకాయి విడుదలకు ఉద్యమం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఆపరేటర్ల విభాగాలు మార్పు చేశారు. 12 మంది ఆపరేటర్లను విభాగాలు మారుస్తూ కమిషనర్ వంశీకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏళ్లుగా ఒకే విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను విభాగాలు మారుస్తూ ఈ నెల 24న సర్క్యులర్ జారీచేశారు. పరిపాలనలో ఇవన్నీ సాధారణమైనప్పటికీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకోవడంతో మున్సిపల్ కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. కొందరు ఆపరేటర్లు ఒకే విభాగంలో ఏళ్లుగా తిష్ట వేయడం ద్వారా పైరవీలకు తెరలేపారనే ఆరోపణలు వినిపించాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం కూడా వారికి బాగా కలిసొచ్చిందనే చర్చ ఉంది. ఆపరేటర్ల విభాగాలు మార్పు చేయాలని గతంలోనే చర్చ జరిగినా రాజకీయ కారణాలు, నాయకుల ఒత్తిడి కారణంగా అప్పట్లో అమలుకు నోచుకోలేదు. వివిధ విభాగాల్లో ఒకే చోట పనిచేయడం ద్వారా స్థానిక చోటా, మోటా నాయకులతో పరిచయాలు పెంచుకొని పైరవీ ద్వారా వచ్చిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆపరేటర్లు తమ పాత స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎలాగైనా పాత విభాగంలోనే ఉండాలని సంబంధిత ఆపరేటర్లు కార్పొరేటర్లను ఆశ్రయించినట్లు తెలిసింది. సంబంధిత కార్పొరేటర్ల ద్వారా స్థానచలనం కలగకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నల్లగొండ టౌన్ : నల్లగొండలోని పీఆర్టీయు భవన్లో మంగళవారం తెలంగాణ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పెన్షన్ బకాయిలు, వేతన సవరణ సంఘం, ఆరు విడతల కరవు భత్యం తదితర సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేయాలని తీర్మానించారు. ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 27న నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు కాటబత్తుల గణేష్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి బిక్షపతి, రాష్ట్ర నాయకులు తీగల శంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మేడి లింగయ్య, సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ముజాహిద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఫ కీలక నిర్ణయం తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఫ స్థానం మారకుండా కార్పొరేటర్లతో ఆపరేటర్ల పైరవీలు! ఫ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం -
బాలసదన్, శిశు గృహాల తనిఖీ
రామగిరి (నల్లగొండ) : జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి హిమబిందు మంగళవారం నల్లగొండలోని బాలసదన్, శిశుగృహాలను తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణ తీరును, అలాగే అక్కడ ఉన్నవారికి అందిస్తున్న ఆహారం ఇతర సౌకర్యాలను, వారు నిర్వహించే రికార్డులను ఆమె పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వారికి ఆమె చట్టపరమైన అంశాల గురించి అవగాహన కల్పించారు. గౌడ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక నల్లగొండ టౌన్ : గౌడ సంఘం నల్లగొండ జిల్లా నూతన కమిటీని మంగళవారం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు నకరికంటి కాశయ్య గౌడ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నకరికంటి కాశయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పుల్లెంల శ్రీనివాస్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా పొన్నం లక్ష్మయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి రవి గౌడ్, పుల్లెంల అచ్చాలు గౌడ్, వడ్డేపల్లి గోపాల్గౌడ్, ఆకునూరి నారాయణ గౌడ్, కొన్నే శంకర్ గౌడ్, సైదులు గౌడ్, జేరిపోతుల శంకర్ గౌడ్, ఇతగోని వెంకటేశ్వర్లు, సుర్గి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తా
మాట్లాడుతున్న రష్మీఠాకూర్, మగ్గంపై చీర నేసే విధానాన్ని పరిశీలిస్తున్న రష్మీఠాకూర్ చండూరు : చేనేత రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తానని జాతీయ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. సోమవారం ఆమె చండూరు మండల కేంద్రంలో చేనేత చీరల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కండేయ దేవాలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె చండూరులోని చేనేత కార్మికులతో సమావేశమై, వారి సమస్యలు, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలువురు కార్మికుల ఇళ్లను సందర్శించి, మగ్గం నేసే విధానాన్ని, చీరల తయారీ ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ గతంలో తాను అంతర్జాతీయ ర్యాంప్ వాక్లో ధరించిన ‘ఇక్కత్’ గౌను ఎంతో మంది దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. త్వరలోనే బ్రిటీష్ పార్లమెంట్లో జరగబోయే ఒక ప్రత్యేక సమావేశానికి హాజరవుతున్నానని, ఆ వేదికపై చండూరులో తయారైన ‘తేలియా రుమాల్’ విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతానని వెల్లడించారు. హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాసులు తయారు చేసిన వస్త్రాలను తిరుమల వేంకటేశ్వరస్వామి వారి అలంకరణకు ఉపయోగించడం చండూరు చేనేత రంగానికి దక్కిన గొప్ప గౌరవమని కొనియాడారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య, చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్న ధర్మేందర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య, పులిపాటి ప్రసన్న, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, రావిరాల నగేష్, గంజి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఫ జాతీయ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ ఫ చండూరులో చేనేత గృహాల సందర్శన -
వాన కురిసేనా.. మొక్క బతికేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వన మహోత్సవానికి మంగళవారం నుంచి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. జిల్లావ్యాప్తంగా సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 2026–27 సంవత్సరంలో మొత్తం 57.70 లక్షల మొక్కలు నాటేలా శాఖల వారీ లక్ష్యం నిర్దేశించింది. ఇప్పటి వరకు 13.18 లక్షలు మొక్కలు నాటగా, ఇంకా.. 44.52 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వర్షాలు ఎంత మేరకు కురుస్తాయి.. ఎంత మేరకు ఆ మొక్కలను బతికించుకోగలుతామన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఇంటికీ రెండు మొక్కలు వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు అందిచనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాల ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంచాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించారు. కార్యక్రమం రోజున మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్ తప్పనిసరి నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, టీజీ ఫారెస్ట్ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో మొక్క ఎక్కడ నాటారు, దాని సంరక్షణ ఎలా ఉంది అనే వివరాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. మొక్కల సంఖ్య కంటే వాటి మనుగడకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో మొక్కలు నాటేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆగస్టు 25 నుంచి ప్రారంభమయ్యే మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖలను ఆదేశించారు. నాటిన మొక్కలు బతికితేనే అసలు విజయం జిల్లా లక్ష్యంలో ఇప్పటికే 13.18 లక్షల మొక్కలను నాటిన ప్రభుత్వం మరో 21.08 లక్షల మొక్కలను పంపిణీ చేసింది. వాటితోపాటు మిగితా 23.44 లక్షల మొక్కలను పంపిణీ చేసి నాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ లకా్ష్య్న్ని పూర్తి చేయడం కంటే నాటిన మొక్కల మనుగడే ఇప్పుడు ప్రధాన సవాల్గా మారింది. ముఖ్యంగా తక్కువ ప్రగతి నమోదైన మండలాల్లో వేగం పెంచడంతో పాటు నీటి సదుపాయం, కంచెలు, సంరక్షణ, నిరంతర పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. మొక్క నాటడం ఒకరోజు కార్యక్రమం.. దాన్ని చెట్టుగా తీర్చిదిద్దడం మాత్రం నిరంతర బాధ్యత. హార్టికల్చర్లో వెనుకంజ మొక్కల నాటే కార్యక్రమంతో పాటు ఉద్యాన పంటల విస్తరణకు కూడా లకా్ష్య్లు నిర్దేశించారు. జిల్లాలో 2,800 ఎకరాల్లో హార్టికల్చర్ ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 613 ఎకరాలను గుర్తించగా, 554 ఎకరాల్లో పిట్టింగ్ పూర్తయింది. అయితే ఇప్పటివరకు 374 ఎకరాల్లో మాత్రమే ప్లాంటింగ్ చేపట్టారు. దీంతో లక్ష్యంలో 13.36 శాతం మాత్రమే ప్లాంటింగ్ ప్రగతి నమోదైంది. మండలాల వారీగా నాంపల్లి 60.87 శాతంతో ముందంజలో ఉంది. శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యం ఇలా.. నేటి నుంచి మరో విడత వనమహోత్సవం ఫ 57 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం ఫ శాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు ఫ వర్షం పడితేనే ముందుకు సాగనున్న కార్యక్రమం ఫ సెప్టెంబర్ చివరి నాటికి మాస్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు -
మా సారు.. మాకే కావాలి
తిప్పర్తి : మండలంలోని మామిడాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోవర్ధన్రెడ్డిని డిప్యూటేషన్పై జొన్నగడ్డలగూడెం పాఠశాలకు పంపారు. దీంతో ‘మా సారు.. మాకే కావాలి’ అని మామిడాల సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలను బంద్ చేశారు. పాఠశాలలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైదులు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు గోవర్ధన్రెడ్డి గ్రామంలో మైకు పట్టుకొని ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారని.. 21మంది కొత్తగా పాఠశాలలో చేరారని తెలిపారు. ఆ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై పంపించడం సరికాదన్నారు. ఈ విషయంపై ఎంఈఓ నర్సింహనాయక్ను వివరణ కోరగా.. జొన్నగడ్డలగూడెం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉండడం వల్ల మామిడాల నుంచి ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్పై పంపామన్నారు. తాత్కాలికంగా డిప్యూటేషన్ రద్దు చేసి.. గ్రామస్తుల ఆందోళన విషయాన్ని పైఅధికారులకు తెలియజేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయాలని మామిడాలలో ఆందోళన -
సాగర్ ఎడమ కాలువకు నీరివ్వాలి
నల్లగొండ : నాగార్జునసాగర్ నుంచి సాగర్ ఎడమ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేసి, దాని పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఐ(ఎం) దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన ఎండల కారణంగా అనేక నీటి వనరులు ఎండిపోయాయని, వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు బోర్ల ఆధారంగా వరి, మెట్ట పంటలు సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లో 534 అడుగుల వరకు నీరు ఉందని, 34,438 క్యూసెక్కుల వరద నీరు వస్తున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై కూడా ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తామనే విధానం కాకుండా, ప్రస్తుతం వస్తున్న నీటిని దామాషా పద్ధతిలో వినియోగించుకునేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, చినపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నిరసన
నల్లగొండ టూటౌన్ : కనగల్ మండల కేంద్రం ఎక్స్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ సోమవారం నల్లగొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దీనిపై ఎస్సీ కమిషన్కు లేఖ రాశామన్నారు. ఈ విషయంలో మంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, బీజేపీ నాయకులు మాదగాని శ్రీనివాస్గౌడ్, గోలి మధుసూదన్రెడ్డి, చింత ముత్యాల్రావు, లింగస్వామి, దూదల భిక్షంగౌడ్, పకీరు మోహన్రెడ్డి, పెరిక మునికుమార్, పెరిక నరసింహ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఉద్యోగులకు ‘ఫేస్ రికగ్నిషన్’
నల్లగొండ : కలెక్టరేట్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయినా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారుల సమావేశంలో మాట్లాడారు. అధికారి నుంచి వాచ్మన్ వరకు ప్రతి ఉద్యోగి ఈ యాప్లో నమోదు కావాలని, ఇకపై యాప్లో నమోదయ్యే హాజరు ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులు పాస్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో సామూహికంగా మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల అధి కారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ ఏడాది 57.70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రతిపాదనలు పంపాలి.. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో గుడిసెల స్థానంలో ఇళ్లను గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను వారంలోగా సిద్ధం చేసి మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డిని ఆదేశించారు. అన్ని శాఖలు ఇకపై టీ–ఫైబర్ నెట్వర్క్ను వినియోగించాలని సూచించారు. జిల్లా అధికారులు ప్రతి నెల 5వ తేదీలోగా టూర్ డైరీలు సమర్పించాలని, పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించి వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి.. వివిధ స్థాయిల్లో వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం సీఎం ప్రజావాణికి సంబంధించిన 28, మండల స్థాయిలో 190 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 58, ఇతర శాఖలకు 58.. మొత్తం 116 ఫిర్యాదులు వచ్చాయని విరించారు. సమావేవంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఆర్ఓ దశరథ్ ఉన్నారు. 27న గ్రామ, వార్డు సభలు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జరిగే గ్రామ, వార్డు సభలకు బీఎల్వోలు హాజరు కావాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా తప్పుగా నమోదైన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమలు ఫ హాజరు ఆధారంగానే జీతాలు, బిల్లుల మంజూరు ఫ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు.3న ఉద్యోగులకు ఎంపిక పోటీలునల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో వచ్చే నెలలో జరుగనున్న సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక పోటీలను సెప్టెంబర్ 3న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లుజిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, లాన్ టెన్నీస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా, ఖోఖో, బెస్ట్ ఫిజిక్ తదితర పోటీలు నిర్వహించి ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు. ‘యువ కనెక్ట్’కు ఎన్జీ కాలేజీ ఎంపికరామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానితో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ఈ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంజీ యూనివర్సీటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం రమణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన యువ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానితో సంభాషించే అవకాశం తమ కళాశాల విద్యార్థులకు లభించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మేరా భారత్ జిల్లా అధికారి గౌతంరెడ్డి, యువ కనెక్ట్ ఇన్చార్జి బొజ్జ అనిల్కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు నర్సింగ్ కోటయ్య, ఎం.వెంకట్రెడ్డి, కె.శివరాణి, ఆదే మల్లేశం, ఎం.సావిత్రి, సుల్తానా, కొండానాయక్ పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులురామగిరి(నల్లగొండ) : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం నల్లగొండ రీజియన్ పరిధిలోని 7 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆగస్టు 27న 28 అదనపు బస్సుల ద్వారా 44 ట్రిప్పులు, ఆగస్టు 28న 54 అదనపు బస్సుల ద్వారా 115 ట్రిప్పులు నడుపుతానమని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్సీసీకి ఎంజీయూ విద్యార్థుల ఎంపిక నల్లగొండ టూటౌన్ : ఎంజీయులో నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు ఎన్సీసీలో అవకాశం కల్పించేందుకు 31వ బెటాలియన్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంపిక పోటీలు నిర్వహించారు. బీటెక్ ఈసీఈ, సీఎస్ఈ విభాగాల విద్యార్థులకు మొదటగా దేహదారుడ్య, రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 80 మంది విద్యార్థులు హాజరు కాగా.. 42 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఎన్సీసీ అధికారి మచ్చేందర్ తెలిపారు. కార్యక్రమంలో 31వ బెటాలియన్ సుబేదార్ కొమ్ము మల్లయ్య, మలకప్ప, నీరజ్కుమార్ పాల్గొన్నారు. -
విదేశీ పర్యటనకు టీచర్లు
ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపిక పెద్దవూర : తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడానికి గాను జపాన్, సింగపూర్ దేశాల్లో విద్యా విధానాల అధ్యయనానికి వెళ్లే బృందంలో ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో జీహెచ్ఎం, ప్రిన్సిపాల్, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ విభాగాలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో జపాన్ దేశానికి నలుగురు, సింగపూర్కు ముగ్గురు చొప్పున వెళ్లనున్నారు. వీరిలో నలుగురు ఉపాధ్యాయుల బృందం వచ్చే నెల 5 నుంచి 12వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు జపాన్ దేశంలో పర్యటిస్తుంది. అలాగే మరో ముగ్గురు ఉపాధ్యాయులు గల రెండో బృందం ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్లో పర్యటించనుంది. రెండు బృందాలు ఎనిమిది రోజుల చొప్పున ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వనున్నాయి. జపాన్ వెళ్లే బృందంలో నలుగురు వీరే.. ● సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కర్విరాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తల్లూరి సాయి ఈశ్వరి. ● నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వరనగర్(మాల్) జెడ్పీహెచ్ఎస్కు చెందిన గెజిటెడ్ హెడ్మాస్టర్ అడపాల వాణి. ● సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ మారం పవిత్ర. ● సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం ఎంపీపీఎస్కు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్లు ఎంపికయ్యారు. సింగపూర్ పర్యటనకు వెళ్లే వారు.. ● యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి జెడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ ఆర్.శ్రీనివాస్. ● నల్లగొండ జిల్లా గుడిపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు తీగల శ్రీవిద్య. ● సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఎంపీపీఎస్ ఎస్జీటీ ఉపాధ్యాయురాలు ఉప్పు మంగతాయే ఎంపికయ్యారు. డాక్యుమెంట్ల సమర్పణ పూర్తి ఇప్పటికే జపాన్, సింగపూర్ దేశాల పర్యటనకు వెళ్లే ఉపాధ్యాయులందరి డాక్యుమెంట్ల సమర్పిణ పూర్తిచేశారు. సింగపూర్, జపాన్ దేశాలకు వెళ్లే బృందాల్లో రాష్ట్రం నుంచి 40 మంది ప్రతినిధులు ఉంటారు. వీరిలో 29 మంది చొప్పున ఉపాద్యాయులు, 11 మంది వివిధ హోదాలు గల అధికారులు, సాంకేతిక, వృత్తి విద్యా నిపుణులు ఉన్నారు. ఫ జపాన్కు నలుగురు.. సింగపూర్కు ముగ్గురు ఫ వచ్చేనెల 5 నుంచి 12 వరకు ఒక బృందం ఫ 12 నుంచి 19వ తేదీ వరకు మరో బృందం ఫ అక్కడి విద్యా విధానాల అధ్యయనానికి .. -
ఎందుకు పేలుతున్నయ్?
రేపటి నుంచి ఆటోలు బంద్ రామగిరి(నల్లగొండ): ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, బీఎమ్ఎస్, బీఆర్టీయూ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ సంఘాల ప్రతినిధులు శనివారం ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాహనాల కొనుగోలుపై 2శాతం సెస్ వసూలు చేసి, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ద్వారా భద్రత కల్పించాలి. ఆర్టీసీ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను విరమించుకోవాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసరాల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను సవరించాలని, ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్ల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే సొంత యాప్ను తీసుకురావాలని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న టూ వీలర్ టాక్సీలను నిషేధించాని డిమాండ్ చేశారు. రవాణా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సాక్షి యాదాద్రి, చౌటుప్పల్, చిట్యాల: రసాయన కంపెనీల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో భద్రతను గాలికివదిలేయడంతో రియాక్టర్లు పేలి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం , అధికారుల ఉదాసీనత వెరసి ఈ పరిశ్రమలు మృత్యువుకు వేదికలవుతున్నాయి. ఆరు నెలల కాలంలో జిల్లాలోని పరిశ్రమల్లో ఆరు ప్రమాదాలు చోటుచేసుకోగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం పరిశ్రమల్లోని డొల్లతనానికి నిదర్శనం. వరుస ఘటనలు జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా భువనగిరి, బీబీనగర్ పారిశ్రామిక వాడలతో పాటు యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల, ఆలే రు, బొమ్మలరామారం మండలాల్లో అధికంగా రసాయన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు వెదజల్లే జల, వాయు కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతుంటే తరుచూ జరుగుతున్న ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకొని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యాలు, అధికారులు విఫలమతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి చర్యల కారణంగానే కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు బలవుతున్నారు. నిర్వహణ లోపం.. కంపెనీల్లో గతంలో రసాయన వాసనలు, గ్యాస్ లీకేజీలు, వేడి పెరగడం, పరికరాల వైబ్రేషన్లు వంటి హెచ్చరికలు కనిపించినా వాటిని తేలికగా తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై కార్మికులు, స్థానికులు చేసిన ఫిర్యాదులపై అధికారుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. చిన్న అగ్ని ప్రమాదం, పీడనం పెరగడం, రియాక్టర్ ఆగిపోవడం, గ్యాస్ లీకేజీ, పెద్ద ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలు ఉన్నా యాజమాన్యాలు సకాలంలో స్పందించడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. నిర్వహణ లోపాలు, భద్రతా వ్యవస్థ వైఫల్యాలను అధికార యంత్రాంగం పట్టించుకోనందునే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీల్లో తనిఖీల సమయంలో అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. గత తనిఖీ నివేదికలు, షోకాజ్ నోటీసులు పరిశీలించి వదిలేస్తున్నారు. కార్మికులు, గ్రామస్తులు చేసిన ఫిర్యాదులను బుట్టుదాఖలు చేస్తున్నారు. రియాక్టర్ నిర్వహణ, మరమ్మతుల లాగ్బుక్ల తనిఖీలను నామమాత్రంగానే చేస్తున్నారు. ఉష్ణోగ్రత–పీడనం నమోదైన డేటా, ప్రమాదాలు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, అత్యవసర డ్రిల్ రికార్డులు పరిశీలించడంలేదు. ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు పోతున్నా బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. కంపెనీ సీజ్ చేయడం, ఉత్పత్తి నిలిపివేత, లైసెన్స్రద్దు, క్రిమినల్ కేసులు, బాధ్యుల వ్యక్తిగత జవాబుదారీతనం వంటి చర్యలు తీసుకోనందునే ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. రసాయన కంపెనీల్లో భద్రత కరువు ఫ తరచూ పేలుతున్న రియాక్టర్లుఫ ఆరు నెలల వ్యవధిలో ఆరు ప్రమాదాలు.. ఆరుగురు మృత్యువాత ఫ వరుస ప్రమాదాలతో పరిసర గ్రామాల ప్రజల్లో భయాందోళన ఫ పట్టింపులేని యాజమాన్యాలు ఫిబ్రవరి 13న చౌటుప్పల్ మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని బృందావన్ లేబోరేటరీస్ కంపెనీలో రియాక్టర్ పేలుడుతో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పెద్ద భవనాలు పూర్తిగా దెబ్బతినడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఫిబ్రవరి 20న భూదాన్పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని వీజె సాయి కెమికల్ కంపనీలో రియాక్టర్ పేలి ఖమ్మం జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన కెమిస్టు ధార పవన్ మృతిచెందాడు. ఏప్రిల్ 10న చిట్యాల మండలం బొంగోనిచెర్వులోని నోష్ ల్యాబ్లో రియాక్టర్ పేలుడులో ఇద్దరు గాయపడ్డారు. మే1న కూడా నోష్ ల్యాబ్లో రియాక్టర్ పేలుడులో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. జూలై 16న భూదాన్పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని హెజెలో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో రియాక్టర్ను శుభ్రం చేస్తుండగా విడుదలైన విషవాయువులను పీల్చి ఆంధ్రప్రదేశ్లోని సింగమల్లు మండలం ఉల్లిౖకైలు గ్రామానికి చెందిన ఆలమూరు కృష్ణారెడ్డి మృతి చెందాడు. ఆగస్టు 21న భూదాన్పోచంపల్లి మండలంలో ధోతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు ఉద్యోగులు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టౌన్: ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారుల నూతన కార్యవర్గాన్ని శనివారం నల్లగొండలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చైర్మన్గా గాయం శ్యామ్కుమార్, వైస్ చైర్మన్గా శ్రీనివాస్రెడ్డి, కోశాధికారిగా షాహిన్బేగం ఎన్నికయ్యారు. టీజీపీఆర్ఎల్ఏ రాష్ట్ర సెక్రటరీగా శ్రీనివాస్రామగిరి(నల్లగొండ): తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీగా నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు చినేని శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ఎన్నికపై ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
వేసిన తాళం వేసినట్లే..
గోదాములో ధాన్యం మాయం! చండూరు ఉదంతంతో.. జిల్లాలోని మిగతా మిల్లులకు 2025–26 వానాకాలం సీజన్, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం యధావిధిగా ఉందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే మిల్లుల్లో ఎంత దారిమళ్లిందన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 2024–25 యాసంగి సీజన్కు సంబంధించి ఇంకా 29,247 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. 2025–26 వానాకాలం సీజన్కు సంబంధించి 98,828 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్లో ఉండగా, యాసంగి సీజన్కు సంబంధించి 3,57,873 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. వీటి వసూలుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన ధాన్యం మొత్తం మిల్లుల్లో భద్రంగా ఉందా? లేదా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చండూరు వ్యవసాయ మార్కెట్లోని పౌర సరఫరాల శాఖకు అప్పగించిన గోదాములోని ఓ మిల్లర్కు కేటాయించిన ధాన్యం ఎలా దారిమళ్లిందనేది తెలియరావడం లేదు. వేసిన తాళం వేసినట్లే ఉండటం.. తన ధాన్యాన్ని దొంగిలించారని, పైగా దొంగిలించిన వ్యక్తి వద్ద స్థానిక నేతలు డబ్బులు వసూలు చేశారంటూ రైస్ మిల్లర్ పోలీసులను ఆశ్రయించడం.. రాత పూర్వకంగా ఫిర్యాదు లేకుండానే పోలీసులు డబ్బులు వసూలు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న చర్చ అనేక అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లోని కమీషన్ ఏజెంట్ ఒక్కరే అక్కడి ధాన్యాన్ని తరలించాడా.. ఆ ధాన్యం కేటాయింపు పొందిన మిల్లర్కు తెలియకుండానే ధాన్యాన్ని మళ్లించి యథావిధిగా తాళం వేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమీషన్ ఏజెంట్ మాత్రమే ఇది చేస్తే, స్థానిక నేతలు అడ్డుకొని అతని వద్ద డబ్బులు వసూలు చేస్తే.. రైస్ మిల్లర్ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా ఇతర మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లుల్లో స్థలం సరిపోక ఇతర గోదాముల్లో నిల్వ చేసిన సీఎంఆర్ ధాన్యం ఎంత మేరకు సేఫ్గా ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు మిల్లుల్లోని ధాన్యం నిల్వలపై తనిఖీలు చేస్తుండటంతో గతంలోనే మిల్లుల్లోని ధాన్యాన్ని అమ్ముకున్న వారి కోసం ఇక్కడి ధాన్యాన్ని తరలించారా.. అన్న అనుమనాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పటికే బయటపడుతున్న అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో ధాన్యం నిల్వలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం ఎంత? మిల్లర్లు సీఎంఆర్ రూపంలో ఇచ్చిన బియ్యం ఎంత.. ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనే వివరాలపై లెక్కలు తీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మిల్లులపైనా దాడులు చేశారు. తనిఖీలు చేపట్టి పెద్ద మొత్తంలో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని పలువురు మిల్లర్లు పెద్ద ఎత్తున ధాన్యం దారిమళ్లించినట్లు తేలింది. నల్లగొండలోని రెండు మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయగా, ఉండాల్సిన మేరకు ధాన్యం లేదని తేలింది. వారిపై కేసులను నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ 15 మిల్లుల్లో తనిఖీలు చేయగా, రూ.400 కోట్ల విలువైన ధాన్యం మళ్లించినట్లు తేలింది. యాదాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క రామన్నపేట మండలంలోని ఒక మిల్లులో ఇటీవల చేసిన దాడుల్లో రూ. 32 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.ఫ చండూరు గోదాములోని ధాన్యం దొంగిలించినట్లుగా పోలీసులకు మౌఖిక ఫిర్యాదు ఫ మిల్లర్కు తెలియకుండానే ధాన్యం దారిమళ్లిందా? ఫ ధాన్యం తరలిస్తుండగా కొందరు పట్టుకొని డబ్బులు వసూలు చేసినట్లు చర్చ ఫ డబ్బు వసూలు చేసిన స్థానిక నేతలు పోలీసుల అదుపులో..? -
రసాయన మోతాదు మించడంతోనే ప్రమాదం
భూదాన్పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి, సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన రణబోతు రాజశేఖర్రెడ్డి, ఖమ్మం జిల్లా చౌడారం గ్రామానికి చెందిన నాగనబోయిన నరేశ్కుమార్ ఉన్నారు. పేలుడుకు మానవ తప్పిదమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి 10 గంటలకు మూడో షిఫ్ట్ ప్రారంభమైన సమయంలో రసాయనాల పరిమాణం సరిగ్గా తెలియక లిక్విడ్ అమ్మోనియా, హైడ్రోజన్ పెరాకై ్సడ్లను మోతాదుకు మించి కలపడంతో ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించడానికి కారణమని అధికారులు గుర్తించారు. కూలెంట్ వ్యవస్థ వేడిని నియంత్రించలేకపోవడంతో ఒక రియాక్టర్ దెబ్బతిని, పక్కనే ఉన్న మరో రియాక్టర్ను ఢీకొన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో యూనిట్లో 120 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పైకప్పు రేకులు లేచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు కెమిస్ట్లు మృతిచెందారు. మరో 9 మంది చికిత్స పొందుతుండగా వీరిలో ఒకరు శనివారం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. చౌటుప్పల్, హయత్నగర్ ఫైర్స్టేషన్ నుంచి ఫైర్ఇంజన్ల సాయంతో నాలుగు గంటల పాటుశ్రమించి మంటలార్పారు. కంపెనీలో 362 మంది ఉద్యోగులు, కార్మికులు కంపెనీలో 362 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 8 గంటల చొప్పున మూడు షిఫ్ట్లలో పనిచేస్తుంటారు. కంపెనీలో ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల వారు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. -
చేదెక్కిన చక్కెర, బెల్లం
నల్లగొండ టౌన్: చక్కెర, బెల్లం ధరలు ఒక్కసారిగా మండిపోవడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడిచిన పది పదిహేను రోజుల్లోనే తీపి పదార్థాల ధరలు అమాంతం పెరిగాయి. పది రోజుల క్రితం కిలో రూ. 40 ఉన్న చక్కెర.. నేడు రూ.70కి చేరింది. అలాగే 20 రోజుల క్రితం కిలో రూ. 60 పలికిన బెల్లం.. ఇప్పుడు రూ. 80కి ఎగబాకింది. ప్రస్తుతం శ్రావణ మాసం, బోనాలు, వరలక్ష్మీ వ్రతాలతో పాటు వివా హాది శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చక్కెర, బెల్లం వాడకం భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గడం వల్లే ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కానీ, వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరతేనని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో అక్రమంగా నిల్వలు ఉంచి, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
టీచర్లకు నోటీసులు
నల్లగొండ : పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చేపట్టిన తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంపై జిల్లా విద్యాశాఖ కఠినంగా వ్యవహరించింది. కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరని 130 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేటాయించిన చోట విధుల్లో ఎందుకు చేరలేదో మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 167 మందికి సర్దుబాటు ఉత్తర్వులు.. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమున్న పాఠశాలలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జూలై 22న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 167 మంది ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లను వివిధ పాఠశాలలకు కేటాయించారు. వారిలో ఇప్పటివరకు 37 మంది ఉపాధ్యాయులు మాత్రమే తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరారు. మరో 130 మంది చేరలేదు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా విద్యాశాఖ అధికారి శుక్రవారం సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీసీఏ నిబంధనల ప్రకారం కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో ఎందుకు చేరలేదో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విధుల్లో చేరకపోవడానికి గల కారణాలను సమర్థించే ఆధారాలను కూడా వివరణతోపాటు సమర్పించాలని ఆదేశించారు. ఫ సర్దుబాటు చేసినా.. ఆయా పాఠశాలల్లో చేరని ఉపాధ్యాయులు ఫ 167 మందికి ఆర్డర్లు.. విధుల్లో చేరింది 37 మందే.. -
సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ లోక్యాతండాలో ఇంటింటికీ తిరిగి సమస్యలపై ఆరా త్రిపురారం : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గ్రామాలు, తాండాల్లో ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. త్రిపురారం మండలంలోని లోక్యాతండా గ్రామస్తులు ఇటీవల గ్రామాభివృద్ధి కోసం ఢిల్లీలోని ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. దీంతో ఎస్టీ కమిషన్ ఆదేశానుసారం కలెక్టర్ శుక్రవారం అన్ని శాఖల అదికారులతో కలిసి లోక్యాతండాలో గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెను గమణించిన కలెక్టర్ పూరి గుడిసెలోకి వెళ్లి తల్లి కూతురులతో మాట్లాడారు. గుడిసెల్లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో ముచ్చటించారు. కొత్తగా నిరించిన ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్లి బిల్లులు సకాలంలో ఆందాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల తగిన స్థాయిలో వర్షాలు కురవలేదని, జలాశయాల్లో సాగు నీటి నిల్వలు లేనందున రైతులు ఉన్న నీటి వనరులతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎస్టీ వర్గాల సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన నిధులు కేటాయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పంక్షేమ పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. వీఓ బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం సర్వే నిర్వహించి భూమి కేటాయించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈసందర్భంగా తండా వాసులు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నల్లాలు సక్రమంగా లేవని, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, కల్టెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి కాంతారావు, ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, విద్యుత్ ఏఈ బాలునాయక్, పీఆర్ఏఈ సతీష్, వైద్యాధికారి వనజ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఎస్పీకి కొండమల్లేపల్లి వాసుల కృతజ్ఞతలు
కొండమల్లేపల్లి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును చేధించిన జిల్లా పోలీసులకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, కాలనీవాసులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పలువురు నల్లగొండలో ఎస్పీ శరత్చంద్రపవార్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని, పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి భరోసా, నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసులో చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో త్వరితగతిన చార్జిషీట్ దాఖలు చేస్తామని వారితో చెప్పారు. అభ్యసనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలికట్టంగూర్ : ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పరిసరాలను, మధ్యాహ్న భోజనాన్ని, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల తరగతి స్థాయికి అనుగుణంగా కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపధ్యాయులు కృషి చేయాలన్నారు. గుణాత్మక విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయన వెంకట పాఠశాల ఎస్ఓ నీలాంబరి ఉన్నారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ కార్యవర్గంనల్లగొండ టౌన్ : జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గోపీనాథ్రెడ్డి, కోశాధికారిగా నవ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా వి.నరసింహారావు ఉపాధ్యక్షుడిగా కె.తిరుమలేష్, ప్రచార కార్యదర్శిగా డి.భాస్కర్, జాయింట్ సెక్రటరీగా మంజులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీకి నియామక పత్రాలను అందజేశారు. బీసీఐ చైర్మన్ రాజీనామా చేయాలి రామగిరి(నల్లగొండ) : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ, మనన్ కుమార్ మిశ్రా 14 సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్గా కొనసాగుతూ, అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు పందెనపల్లి బ్రహ్మచారి, నాయకులు డి.నర్సాజి, భీమగాని గణేష్, ఎన్.రాములు, పి.శేఖర్, దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్, సతీష్, నితీష్, రతన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ నియామకాలకు రాజకీయ అడ్డంకి?
ఫ ఇన్స్ట్రక్టర్లు, ఆయాల మెరిట్ జాబితా విడుదల ఫ నియామక ఉత్తర్వులు సైతం ఇచ్చినా.. అంతలోనే నిలిపివేత! ఫ చదువు చెప్పేవారు లేక నష్టపోతున్న చిన్నారులు నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించిన ప్రీప్రైమరీ సెక్షన్లకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం నిలిచిపోయింది. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 124 ప్రభుత్వ పాఠశాలలను ప్రీ ప్రైమరీ సెక్షన్ల కోసం విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈ 124 పాఠశాలలకు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్టర్, ఆయాలను నియమించేందుకు జూన్ 21న నోటిఫికేషన్ జారీ చేసి.. అర్హతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మెరిట్ జాబితా విడుదల చేసి.. ఆగస్టు 1న ఎంపికై న వారికి ఉత్తర్వులు ఇచ్చి సంబంధిత పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు. కానీ, అదే రోజు నియామక ప్రక్రియపై అనూహ్యంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎవరినీ పాఠశాలల్లో చేర్చుకోవద్దు.. ఇప్పటికే చేర్చుకున్నవారిని వెనక్కి పంపండి అంటూ అదో రోజు మధ్యాహ్నం మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సవ్యంగానే సాగిన నియామక ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమైన ప్రీ ప్రైమరీ విద్య అందించి.. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలను పెంచడంతోపాటు వాటిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను దశలవారీగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ప్రీ ప్రైమరీ సెక్షన్లలో బోధన కోసం ఇన్స్ట్రక్టర్లు, చిన్నారుల సంరక్షణకు ఆయాలను నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. 124 పాఠశాలలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారులు మెరిట్ జాబితాను రూపొందించి వెబ్సైట్లో ఉంచారు. అనంతరం ఆగస్టు 1న మెరిట్ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేసి.. ఎంపికై న అభ్యర్థులు సంబంధిత పాఠశాలల్లో చేరాలని సూచించారు. ఇంతవరకు ప్రక్రియ నిబంధనల ప్రకారమే సాగినట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లే కారణమా? నియామక ప్రక్రియ నిలిచిపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు సమాచారం లేకుండా తమ నియోజకవర్గ పరిధిలో నియామకాలు ఎలా చేపడతారంటూ జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ అంశంపై విద్యాశాఖ నుంచి స్పష్టమైన వివరణ వెలువడలేదు. కొన్నిచోట్ల విధుల్లో ఉన్నా.. సంతకాలు లేవు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలాంటి వివాదం లేని ప్రాంతాల్లో కొందరు ఎంపికై న ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే వారికి అధి కారికంగా హాజరు నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విధులు నిర్వహిస్తున్నా.. సంతకాలు మాత్రం చేయడం లేదని తెలుస్తోంది. ఉపాధ్యాయులపై భారం ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు ప్రత్యేకంగా బోధించాల్సిన సిబ్బంది లేకపోవడం, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోంది. నియామకాలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లోకూడా సందేహాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే.. ఈ సందిగ్ధతకు వీలైనంత త్వరగా తెరదించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోంది
పెద్దఅడిశర్లపల్లి : సాగునీరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఘనపురం స్టేజీ సమీపంలో ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ గేట్ వద్ద గల జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్కు నీరు రాకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా భారీగా నీటిని తరలిస్తోందన్నారు. సాగర్ నుంచి నీటిని విడుదల చేసి కుంటలు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బిల్యానాయక్, మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి, మాధవరావు, సర్పంచ్లు రాజశేఖర్రెడ్డి, శ్రీను, నగేష్, కిషన్, అర్వపల్లి నర్సింహ, యాదగిరి, పరమేశ్, నరేందర్నాయక్, సుధాకర్గౌడ్, శ్రీనునాయక్, దామోదర్, లోకేష్ తదితరులు ఉన్నారు. -
పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
డిండి : ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో చదువుతోపాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుదవారం డిండిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, డార్మెటరీ, వాష్ రూమ్స్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన రావడంతో అసంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాలోని చెత్తను ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా తరలించాలన్నారు. ఇటీవల పాఠశాల మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన రూ.26 లక్షలతో డ్రెనేజీ, తాగునీరు, లీకేజీ పైపులైన్ తదితర వంటి పెండింగ్ పనులను పూర్తి చేయాలని డీఈ శైలజకు సూచించారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మాత్రమే తెప్పించుకోవాలని, గడువు దాటిన సరుకులను వాదొద్దరని చెప్పారు. విద్యార్థినుల ఆత్మరక్షణకు కరాటే నేర్పించాలని ప్రిన్సిపాల్ శిరీషకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, ఎంపీడీఓ వేజన, సర్పంచ్ రవి తదితరులున్నారు. నోటీసులు జారీచేసి చర్యలు చేపట్టాలి నల్లగొండ : ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం మ్యాపింగ్ కానీ, జాబితాలో పేర్లు తేడా ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బి.సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం 33,818 అన్మ్యాపింగ్ 2,34,972 అనామలీస్ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ ప్రక్రియ చేపడతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ పాల్గొన్నారు. ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి నల్లగొండ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రిన్సిపాల్స్ కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన ఛాంబర్లో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూనాయక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఆయన సమావేశమై మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 9 కళాశాలలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరూ మధ్యలో చదువు మానేయకుండా చూడాలని, కనీసం 75శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులంతా తప్పకుండా ఉత్తీర్ణులు కావాలన్నారు. సెప్టెంబర్ నెలలో మరోసారి ఎఫ్ఎల్ఎన్ పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసింది
నల్లగొండ టూటౌన్ : అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్తో పాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి భూపాల్రెడ్డికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడితే కాంగ్రెస్ ప్రభుత్వం అదోగతి పాలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, నల్లగొండలో మంత్రిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్, దేప వెంకట్రెడ్డి, బోనగిరి దేవేందర్, నారబోయిన భిక్షం, తుమ్మల లింగస్వామి, దోటి శ్రీనివాస్, మేకల అరవింద్రెడ్డి, సల్వాది సైదులు, రేణుక, శంకర్, పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి -
సాగర్ నీటి విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని అన్నారం గ్రామ పరిధిలోని గద్దగూడతండాలో రైతులతో ఆయన మాట్లాడారు. ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయని, ఇంకా వర్షాలు కురిసే అవకశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నందున సాగర్కు నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీడబ్ల్యూసీలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు. సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా వరి సాగు కొనసాగుతుందని, వర్షాభావ పరిస్థితుల్లో చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో చేపట్టే ఉద్యమాలకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు. నల్లగొండలో నిర్వహించే జాతీయ రైతు మహాసభలను విజయవంతం చేసేందుకు రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్ రైతులు పాల్గొన్నారు. ఫ జూలకంటి రంగారెడ్డి -
స్వాతి నక్షత్ర పూజలు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు. - 8లోకొడుకు ఎదుగుదల చూడకుండానే..ఫ దారుణ హత్యకు గురైన కల్లు రూపారెడ్డి ఫ కొడుకు కోసమే సెలవు దినాల్లో హైదరాబాద్ పయనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : విద్యార్థి చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన నాగార్జున గ్రామర్ కాన్సెస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి కొడుకును ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తమకు వివాహమైన పదేళ్లకు కొడుకు జన్మించడంతో అపురూపంగా చూసుకుంటున్న ఆమె అతని ఎదుగుదలను చూడాలనుకున్నారు. కానీ, తన కోరిక తీరకుండానే తమ స్కూల్లో చదువుకునే విద్యార్థి చేతిలోనే హత్యకు గురయ్యారు. ప్రస్తుతం బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె కొడుకు అభినవ్రెడ్డి కోసమే ఆమె ఆదివారాలు, సెలవు దినాల్లో హైదరాబాద్ వెళతారు. ఇప్పుడు, తల్లిని కోల్పోయిన ఆ కొడుకు కన్నీరుమున్నీరు అవుతుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ నేపథ్యం ఇదీ.. కొండమల్లేపల్లి మండలంలోని పాతూరు ఆమె స్వగ్రామం. ఆమె చదువంతా కొండమల్లేపల్లి మండలంలోనే సాగింది. ఆమె బీఏ, బీఈడీ పూర్తి చేశారు. ఆమెకు 24 ఏళ్ల కిందట కల్లు రాజేందర్రెడ్డితో వివాహం జరిగింది. ఆమె భర్త రాజేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. రూపారెడ్డి 26 ఏళ్లుగా భాగస్వామ్యంలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ను నిర్వహిస్తున్నారు. వారికి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండడంతో కుమారుడు అక్కడే ఉండి చదువుకుంటున్నాడు. రూపారెడ్డి చివరిగా ఈనెల 7వ తేదీన పాఠశాలకు వెళ్లారు. ఆ తరువాత వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో హైదరాబాద్లోని కుమారుడి వద్దకు వెళ్లి వచ్చారు. 11వ తేదీన స్కూల్కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె అదే రోజు సాయంత్రం ఆమె దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన రూపారెడ్డి (ఫైల్) -
హౌసింగ్ ఏఈ తొలగింపు
● ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● విజిలెన్స్ విచారణలో వెల్లడైన వాస్తవాలుతిరుమలగిరి(సాగర్) : ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో తిరుమలగిరి(సాగర్) మండల గృహ నిర్మాణ శాఖ ఔట్సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) భుక్యా గోపిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈ గోపి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకున్నారని లబ్ధిదారులు రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ.. విజిలెన్స్ విచారణ చేపట్టింది. విచారణలో ఏఈ డబ్బులు తీసుకున్న విషయం నిజమని తేలడంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకుగాను భూక్యా గోపిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఫిర్యాదులను లబ్ధిదారులు తమకు గాని, లేదా టోల్ఫ్రీ నంబర్ 18004251442,18005995991 లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. సమాచారం ఇవ్వని అధికారికి జరిమానామిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వని మున్సిపల్ కార్యాలయ సమాచార అధికారికి సమాచార శాఖ కమిషనర్ మెహసిన్ పర్వీన్ రూ.6 వేలు జరిమానా విధించారు. 2025 ఆగస్టులో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో హరితహారం పనులపై కోరిన సమాచారం సదరు అధికారి ఇవ్వలేదు. దీంతో ఆయన కమిషన్ను ఆశ్రయించగా దరఖాస్తుదారుకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలను సైతం అమలు చేయకపోవడంతో రూ.6వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంతోపాటు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు యర్రమాద కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దురామగిరి (నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యను శక్తి శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగులు భోజన విరామ సమయంలో బుధవారం నిరసన తెలిపారు. ‘శక్తి వద్దు – పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య సాంకేతిక విద్యా వ్యవస్థలో కీలకమైన భాగమని, విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖ పరిధిలోకి తీసుకెళ్లే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అకాడమిక్ రికార్డుల డిజిటలైజేషన్నల్లగొండ టూటౌన్ : విద్యార్థుల అకాడమిక్ రికార్డుల డిజిటలైజేషన్ చేయడం ద్వారా సురక్షితగా ఉంటాయని ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో నిర్వహించిన అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ), ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్) అమలుపై ఒక రోజు రాష్ట్ర స్థాయి వర్క్స్ షాపును ప్రారంభించి మాట్లాడారు. యూనివర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలకు ఈ వర్క్ షాపు ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ఎంజీయూ పరీక్షల కంట్రోలర్ జి.ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఏపీఏఏఆర్ ఐడీల సృష్టి, డిజిలాకర్ ద్వారా అకాడమిక్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అంజిరెడ్డి, జోనల్ కో ఆర్డినేటర్ రవి, రోహిత్, లక్ష్మీప్రభ, ప్రవళిక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ఏఎమ్మార్పీకి నీటి విడుదల
తాగునీటి అవసరాలకే..గుర్రంపోడు : పానగల్ చెరువును నింపి తాగునీటి అవసరాలకు తీర్చేందుకుగాను ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నీటిని బుధవారం విడుదల చేశారు. ప్రస్తుతం పానగల్ ఉదయ సముద్రంలో 0.6 టీఎంసీల నీరు ఉండగా కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలనే ఉద్దేశంలో ప్రధానకాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పానగల్ చెరువు నీటి నిలువ సామర్ధ్యం 1.5 టీఎంసీలు కాగా 15 రోజుల పాటు నీటిని విడుదల చేయడం ద్వారా ఒక టీఎంసీ నీరు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏకేబీఆర్లోనూ సరిపడా నీటి నిల్వ ఉన్నందున అంతరాయం లేకుండా నీటి విడుదల చేసే అవకాశం ఉంది. తూముల వద్ద గట్టి నిఘా.. నీటి విడుదలకు ముందే తూములన్నింటీనీ పరిశీలించి షెట్టర్లను అధికారులు తనిఖీ చేశారు. లైనింగ్ పనుల యంత్రాలను కాల్వ నుంచి తొలగించారు. ఇటీవల తూముల నిఘాకు నియమించబడిన సిబ్బందినే తిరిగి భాద్యతలు తీసుకునేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి చౌర్యం జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు కాల్వకు మోటార్లు వేయడం, తూముల జోలికి వెళ్లడం లాంటి చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నారు. -
నగరాల అభివృద్ధికి ‘బెటర్ సిటీస్’
తెలంగాణ: నగరాల అభివృద్ధి, ప్రజల హక్కులు, యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జాతీయ యువజన కాంగ్రెస్ చేపట్టిన “బెటర్ సిటీస్’ ప్రచారానికి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శ్రీకారం చుట్టారు. “మేరా షహర్.. మేరా హక్’, “మెహనత్ కే హాత్’నినాదాలతో చేపట్టిన ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్ను గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలోని ఇందిరాభవన్లో ఆవిష్కరించారు.మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంతోపాటు నగరాల అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే “బెటర్ సిటీస్’ ప్రచారం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుమ్ముల మోహన్రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి కార్తీక్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు కె.వి.ఆర్. సతీష్, కంచర్ల ఆనంద్రెడ్డి పాల్గొన్నారు.భజరంగ్ అవార్డులు సాధించడం గర్వకారణంనల్లగొండ టౌన్: ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ సాక్షి ఫొటో జర్నలిస్టు కంది భజరంగ్ ప్రసాద్ జాతీయ రాష్ట్ర స్థాయిలో 84 అవార్డులు సాధించడం గర్వకారణమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.భజరంగ్కు కేక్ తినిపిస్తున్న మంత్రి కోమటిరెడ్డిప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అవార్డులు సాధించిన భజరంగ్ ప్రసాద్ను గురువారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కార్పొరేటర్లు అల్లి సుభాష్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాగుకు నీళ్లు బంద్
మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిస్థితి ఇదీ.. మొత్తం చెరువులు 16290–25 శాతం నీరున్నవి 102525 – 50 శాతం నీరున్నవి 37050 – 75 శాతం నీరున్నవి 14275 – 100 శాతం నీరున్నవి 92సాగర్ జలాశయంలో తగ్గిన నీటిమట్టంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : పంటల సాగుకు చుక్క నీరు ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీరు, నదుల ద్వారా వచ్చే కొద్ది పాటి నీరు తాగునీటికే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. నాగార్జునసాగర్తోపాటు ఇతర రిజర్వాయర్లలో ఉన్న నీటిని కేవలం తాగునీటికే వినియోగించాలని చెప్పేసింది. ఆకాశంలో మబ్బులు చూసి, వర్షాలు పడతాయన్న ఆశతో రైతులు పంటలు సాగుచేయవద్దని వెల్లడించింది. సూపర్ ఎల్నినో రూపంలో మరింతగా కరువు పరిస్థితులు ముంచుకువస్తున్నాయని, వర్షాధారంగానైనా.. రిజర్వాయర్ల కింద సాగుపై ఆశలు పెట్టుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ నీటిపారుదల శాఖ కింద నల్లగొండ జిల్లాలో 10,27,783 ఎకరాల ఆయకట్టు ఉంది. యాదాద్రి జిల్లాలో 3,38,836 ఎకరాల ఆయకట్టు ఉండగా, సూర్యాపేట జిల్లాలో 5,08,480 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయా భూములకు రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా ఈసారి సాగునీటిని ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్ల కింద కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేదని, ఇంకోవైపు భూగర్భ జలాలు అడిగంటిన నేపథ్యంలో పంటల సాగు ఇబ్బందిగా మారనుందని స్పష్టం చేసింది. వచ్చే నెలలో సూపర్ ఎల్నినో ప్రమాదం వచ్చే నెలలో సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలోని ఉన్న అన్ని రిజర్వాయర్లలో ఉన్న నీటిని వచ్చే ఏడాది జూనన్ వరకు నీటిని తాగునీటి అవసరాల కోసమే నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న నీటిని తాగునీటి కోసం, పశువుల కోసం వినియోగించాలని, పంటల కోసం ఏ ప్రాజెక్టు నుంచి కూడా నీరు వదలడం జరగదని పేర్కొంది. అయితే డిండి ప్రాజెక్టు కింద మిషనన్ భగీరథ నీటి సరఫరా లేనందున పాత డిండి ప్రాజెక్టు కింద మాత్రం 12,875 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటికి కోసం 40 టీఎంసీల నీరు అవసరం. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లోని నీరు కేవలం తాగునీటి కోసమే ఉపయోగిస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిండి మినహా మిగతా రిజర్వాయర్లలో నీటిని సాగునీటికి ఇవ్వడం కుదరదు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు అవే నీరు అవసరం అవుతాయి. ఒకవేళ ఎవరైనా రైతులు ప్రాజక్టుల కింద పంటలు వేసుకొని ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. రిజర్వాయర్ల నుంచి పంటలకు మాత్రం సాగునీరు వదిలిపెట్టడం కుదరదు. – శ్రీనివాస్రెడ్డి, జిల్లా నీటి పారుదల శాఖ సీఈ ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీలలో) ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ప్రస్తుతం నిల్వ నాగార్జునసాగర్ 312.05 163.880 ఏకేబీఆర్ 1.50 1.178 ఉదయసముద్రం 1.525 0.644 పెండ్లిపాకల 0.514 0.082 పెద్దదేవులపల్లి 0.848 0.342 డిండి 2.46 1.169ప్రకటించిన ప్రభుత్వం ఫ ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినోఫ వచ్చే నెలలో మరింతగా దుర్భర పరిస్థితులు ఫ 2027 జూన్ వరకు తాగునీటికే.. రిజర్వాయర్లలోని నీరు ఫ వర్షాలపై ఆశతో పంటలు సాగు చేయొద్దన్న ప్రభుత్వం -
ప్రాజెక్టుల భూ సేకరణ పనులు పూర్తిచేయాలి
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్లో ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలను త్వరితగతిన అందించేలా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందం ద్వారా పునరావాస ప్యాకేజీలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఆర్డీ మాధవి, ఆర్డీఓలు, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నీలగిరిని నంబర్ వన్గా తీర్చిదిద్దుతా
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.23.85 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, భూమిపూజ చేశారు. 3వ డివిజన్లో ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పానగల్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర చేపట్టనున్న వన్టైమ్ ఇంప్రూవ్మెంట్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ పట్టణానికి 24 గంటల తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల 83 కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారన్నారు. తాగునీటి అవసరాల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మరో రూ.300 కోట్లు తీసుకొచ్చినట్లు మంతిర వెల్లడించారు. డిసెంబర్ నాటికి పనులుపూర్తి చేస్తామని చెప్పారు. పట్టణ, పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళ సంఘాలకు అండగా ఉంటాం.. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రూ.3 కోట్లతో పెట్రోల్ పంపును ప్రారంభించామని, రూ.2 కోట్లతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా గోదాముల నిర్వహణ, రైస్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో రహదారులు, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వల్ల నల్లగొండ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్అండ్బీ ఎస్ఈ పున్నమోహన్, ఈఈ శ్రీధర్రెడ్డి, డీఈ గణేష్, ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్దార్ పరశురాం, డీటీడీఓ, ఏసీఎస్ డైరెక్టర్ నాగరత్నం, కార్పొరేటర్లు మల్లీశ్వరి, బొడ్డుపల్లి లక్ష్మి, కవిత, వేణు, స్వాతి, జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
గణిత నైపుణ్యాలను పెంపునకే ‘ఎఫ్ఎల్ఎన్’ శిక్షణ
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో 1–5 తరగతుల విద్యార్థుల్లో పునాది స్థాయి అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు ఇన్చార్జి కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో మాట్లాడారు. 2–5 తరగతుల విద్యార్థుల కోసం రోజువారీ పాఠ్య ప్రణాళికలు, నెలవారీ ఫోకస్ కాంపిటెన్సీలు, ఎగ్జిట్ స్లిప్ మూల్యాంకనాలను అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన చోట ఎన్రిచ్మెంట్, రెమిడియేషన్ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సుశీందర్రావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్యల బలోపేతానికి కృషిమిర్యాలగూడ : మహిళా సమాఖ్యల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూ పట్టణంలో మహిళా సమాఖ్యల సభ్యులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తోందన్నారు. వాటిల్లో త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తడకమళ్లలో బంకు ఏర్పాటు స్థలం పరిశీలన చేశామన్నారు. ప్రతి మండల సమాఖ్యకు ఒక ఆర్టీసీ బస్సు కేటాయించడగా జిల్లాలో 30 బస్సులు నడుస్తున్నాయన్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళా శక్తి పథకం కింద అమలు చేసే ప్రతి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శేషగిరిశర్మ, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవరావు, ఎంపీఓ రమేష్, ఏపీఎం దిలీప్కుమార్, ఏపీఓ సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే ‘ప్రజాబాట’చిట్యాల : గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా విద్యుత్ శాఖ రూరల్ సీఈ బాలస్వామి, ఎస్ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజాబాట కార్యక్రమంలో అధికారులు గుర్తించిన విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రజలు తెలిపిన సమస్యలను కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ డీఈ విద్యాసాగర్, నల్లగొండ రూరల్ సబ్–డివిజన్ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ రవీందర్రెడ్డి, వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ సరఫరాను పూర్తిగా అరికట్టాలి
నల్లగొండ : జిల్లాలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై మెడికల్ కాలేజీలు, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ప్రతి పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి చట్టప్రకారం జరిమానాలు విధించాలన్నారు. అనంతరం అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణం కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 29 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
విద్యార్థినుల వేధింపుల విషయంలో లెక్చరర్కు ఏబీవీపీ దేహశుద్ధి!
తెలంగాణ: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థినులను లెక్చరర్ భాస్కర్ గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది.దీంతో విద్యార్థినులను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు లెక్చరర్ను నిలదీశారు. ఈ క్రమంలో లెక్చరర్పై దాడి చేసి, కాలేజీ ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు చూస్తుండగానే అతనిని చితకబాదారు. లెక్చరర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం కాలేజీ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యార్థినుల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం, అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. -
పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించొద్దు
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సోమవారం నల్లగొండ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. జీఓ నంబర్ 97/2026లో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆనంద్ మహేంద్రా చైర్మన్గా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో నడుస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఏ.సైఫ్, మారుపాక కిరణ్, ఆదిల్, నందివర్ధన్ రాజు, గౌతమ్, శివాత్మిక, జయప్రకాష్, సాయి, సౌమ్య, అక్షయ, కావ్య, బన్ని, సహస్ర, యశస్వి తదితరులు పాల్గొన్నారు. ఫ నల్లగొండలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన -
సీనియర్లకు తగిన గుర్తింపు లేదు
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీల(పీఏసీ) సమావేశాలు సోమవారం భువనగిరిలో జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో సర్పై అప్రమత్తంగా ఉండడం, పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో పాటు మూడు జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, గుడిపాటి నర్సయ్య, పున్న కై లాష్, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. సీనియర్లకేదీ ప్రాధాన్యత పీఏసీ సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మీనాక్షినటరాజన్కు వివరించారు. ఇక్కడి సీనియర్ నాయకులకు, సుదీర్ఘకాలం సేవలందించిన వారికి ప్రభుత్వంలో, నామినేటెడ్ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా పదవులు ఇంకా భర్తీ చేయడం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. నామినేటేడ్ పదవుల కోసం జిల్లాల నుంచి ఇప్పటికే జాబితాలను అధిష్టానానికి పంపించామని, వారికి అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. మున్సిపల్ పాలకవర్గాల్లో గ్రూపులు కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు మధ్య సహకారం కొరవడిందనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మోత్కూరుతో పాటు పలు ప్రాంతాల్లో కౌన్సిలర్లు చైర్మన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల పురోగతిని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. పనిచేయకుంటే తప్పించాలి.. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని, ప్రజాభిప్రాయం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయని, సోషల్ మీడియా టీమ్లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీ పదవుల్లో ఉంటూ పనిచేయని వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని కూడా పలువురు అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం మంచిదే అయినప్పటికీ, కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో ప్రవర్తిస్తున్న తీరు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని కొందరు నాయకులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం (టిఫిన్) వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇంకా సరిగ్గా చేరలేదని, దీనిపై విస్త్రత ప్రచారం సాగాలన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి – మీనాక్షి, నటరాజన్ రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రజాప్రతినిధులకు మధ్య మెరుగైన సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న దక్షిణ తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలపై బీజేపీ పార్టీ దృష్టిసారించిందని, దీనిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పీఏసీ సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలపై సానుకూలంగా స్పందించిన నేతలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని, పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సర్ రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా ఎన్రోల్ చేయించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలి మున్సిపాలిటీల్లో వర్గపోరుతో తలనొప్పులు సమావేశంలో నాయకుల చర్చ పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలన్న మీనాక్షి నటరాజన్ బీజేపీతో జాగ్రత్త అవసరమని సూచన భువనగిరిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పీఏసీల సమావేశం -
ఓటర్లు 13,57,618
‘సర్’ ముసాయిదా జాబితాలో తగ్గిన 1,58,635 ఓట్లునియోజకవర్గాల వారీగా తగ్గిన ఓట్లు.. నియోజకవర్గం గతంలోఓట్లు ప్రస్తుత ఓట్లు తగ్గినవి దేవరకొండ 2,69,098 2,32,283 36,815 నాగార్జునసాగర్ 2,34,722 2,13,408 21,314 మిర్యాలగూడ 2,40,574 2,09,162 31,412 నల్లగొండ 2,49,571 2,17,681 31,890 మునుగోడు 2,63,757 2,46,722 17,035 నకిరేకల్ 2,58,531 2,38,362 20,169సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాలో (సర్) భాగంగా నల్లగొండ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. గతంలో నిర్వహించిన ఇంటింటి (హెచ్టూహెచ్) సర్వేకు ముందు జిల్లాలో 15,16,253 మంది ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో వారి సంఖ్య 13,57,618కు (89.54 శాతం) తగ్గింది. అంటే మొత్తం 1,58,635 మంది (10.46 శాతం) ఓటర్లు తగ్గారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కూడా ఎస్ఐఆర్–2026 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలను ధ్రువీకరించింది. ముసాయిదా జాబితాపై ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19వ తేదీన ప్రకటించనున్నారు. 32,517 మంది మృతి.. సర్ తుది నివేదిక ప్రకారం జిల్లాలో 1,58,635 మందిని ముసాయిదా జాబితాలో చేర్చలేని ఓటర్లుగా గుర్తించారు. అందులో 32,517 మంది మరణించిన వారు ఉన్నట్లుగా తేల్చారు. మరో 1,00,144 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా గుర్తించారు. ఇప్పటికే మరోచోట ఓటరుగా నమోదైన వారు 18,834 మంది ఉన్నారు. గైర్హాజరైన వారు 6,978 మంది, ఇతర కారణాలతో నమోదుకాని వారు 162 మంది ఉన్నారు. మొత్తంగా 2,34,970 మంది (17.31 శాతం) ఓటర్ల వివరాల్లో పొరపాట్లను సవరించినట్లు తేల్చారు. మునుగోడులోనే ఎక్కువ.. ప్రస్తుత ఓటర్లు ముసాయిదా జాబితా ప్రకారం మునుగోడు నియోజకవర్గంలో 2,46,722 మంది ఓటర్లు ఉండగా జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా నిలిచింది. తర్వాత దేవరకొండలో 2,32,283, నకిరేకల్లో 2,38,362, నల్లగొండలో 2,17,681, నాగార్జునసాగర్లో 2,13,408, మిర్యాలగూడలో 2,09,162 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే అధికం ముసాయిదా జాబితాలో 6,73,058 మంది పురుషులు, 6,84,488 మంది మహిళలు, 72 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 11,430 మంది అధికంగా ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 542 మంది ఉన్నారు. అందులో పురుషులు 515 మంది ఉండగా, మహిళలు 27 మంది ఉన్నారు. మొత్తంగా సర్ ప్రక్రియలో 40 శాతానికి పైగా 5,48,466 మంది సొంతంగా ఎన్యుమరేషన్ చేయించుకున్నారు. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదుకు ఫారం–6, ఓవర్సీస్ ఓటర్లకు ఫారం–6ఏ, పేరు తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం–7, చిరునామా మార్పు/వివరాల సవరణకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నవారు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అత్యధికంగా తగ్గింది దేవరకొండలోనే.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారు, ఇతర ప్రాంతాల్లోనే తమ ఓటు హక్కును నమోదు చేసుకున్న వారు, మరణించిన వారు.. ఇలా మొత్తంగా దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు తగ్గిపోయారు. ఆ తరువాత స్థానంలో నల్లగొండ, మిర్యాలగూడలో ఎక్కువ మంది ఓటర్లు తగ్గిపోయారు.ఫ గత జాబితాలో 15,16,253 మంది ఓటర్లు ఫ సర్ ప్రక్రియతో 10.46 శాతం ఓట్లు తగ్గుదల ఫ మరణించిన, శాశ్వతంగా తరలిపోయిన, డబుల్ ఓట్లే అధికం ఫ సెప్టెంబర్ 16 వరకు వినతులు, అభ్యంతరాల స్వీకరణనియోజకవర్గాల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల వివరాలు నియోజకవర్గం పీఎస్ పురుషులు మహిళలు ట్రాన్స్ మొత్తం జెండర్ దేవరకొండ 338 1,17,013 1,15,256 14 2,32,283 నాగార్జునసాగర్ 321 1,05,682 1,07,709 17 2,13,408 మిర్యాలగూడ 271 1,02,689 1,06,463 10 2,09,162 నల్లగొండ 292 1,06,313 1,11,343 25 2,17,681 మునుగోడు 327 1,23,119 1,23,602 01 2,46,722 నకిరేకల్ 312 1,18,242 1,20,115 05 2,38,362 మొత్తం 1861 6,73,058 6,84,488 72 13,57,618 సర్వీస్ ఓటర్లు మొత్తం 542 పురుషులు 515 సీ్త్రలు 27 వివిధ కారణాలతో రద్దయిన ఓట్ల వివరాలు.. నియోజకవర్గం చనిపోయిన శాశ్వత వేరేచోట గైర్హాజరు ఇతర మొత్తం ఓటర్లు వలస ఓటు కారణాలు దేవరకొండ 7451 21313 7629 395 27 36815 నాగార్జునసాగర్ 3572 14612 2429 700 1 21314 మిర్యాలగూడ 5386 20254 2385 3371 16 31412 నల్లగొండ 4745 23221 2716 1208 0 31890 మునుగోడు 4842 9040 1731 1304 118 17035 నకిరేకల్ 6521 11704 1944 0 0 20169 మొత్తం 1,58,635 32,517 1,00,144 18,834 6978 162 -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా మండల ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణికి మొత్తం 146 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 82, ఇతర శాఖలకు 64 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్వో దశరథ, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణితో ప్రజలకు ప్రయోజనం మండలస్థాయిలోనూ ప్రజావాణి నిర్వహిస్తుండడంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజావాణి జరుగుతుండగా, మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి అధికారులు ట్యాబ్ లింకింగ్ ద్వారా అనుసంధానం అవుతున్నారు. కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను కలెక్టర్ నేరుగా మండల స్థాయి అధికారులతో ట్యాబ్ లింకింగ్ కాన్ఫరెన్స్లో చర్చించి, అక్కడి నుంచే తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఐదుగురికి షోకాజ్ నోటీసులు నల్లగొండ : మండలస్థాయి ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని 33 మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి ప్రజావాణికి మొత్తం 759 మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా 754 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 190 ఫిర్యాదులు స్వీకరించారు. కట్టంగూర్లో ఒకరు, నిడమనూరులో ముగ్గురు, త్రిపురారంలో ఒకరు విధులకు గైర్హాజరయ్యారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. -
ఇళ్ల కేటాయింపుపై విచారణ జరపాలి
నల్లగొండ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని, నల్లగొండలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కలెక్టర్కు మెమోరాండం సమర్పించేందుకు పోలీసులు తొలుత వారిని అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అదనపు కలెక్టర్ వచ్చి వినతిపత్రం స్వీకరించేందుకు ప్రయత్నించినా నాయకులు నిరాకరించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రీవెన్స్ హాల్లోకి అనుమతించడంతో కలెక్టర్ చంద్రశేఖర్కు మెమోరాండం సమర్పించారు. తర్వాత కలెక్టర్ ఛాంబర్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్ కలెక్టర్ను కలిశారు. నల్లగొండ డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, డబ్బులు తీసుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నందున సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రునాయక్, మల్లికార్జున్రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య, రావుల శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, గోపగాని స్వాతి రాజశేఖర్, దండంపల్లి సత్తయ్య, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, రంజిత్, శ్రీనివాస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా -
ముంపులో ఉన్నా.. ఓటు అక్కడే!
మర్రిగూడ : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న నాలుగు గ్రామాలైన నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లితండాల్లో ఓటు అక్కడే ఉన్నాయి. నర్సిరెడ్డిగూడెంలో గతంలో 840 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 792 ఓట్లు, వెంకేపల్లి, వెంకేపల్లితండాలో 879 ఓట్లకుగాను 831, చర్లగూడెంలో 515ఓట్లకు గాను 457 ఓట్లు ఉన్నాయి. ఇక, నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, లక్ష్మణాపురం తండాలో గతంలో 749 ఓట్లు ఉండగా.. ఇప్పుడు 699 ఉన్నాయి. మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజలు ఊరును ఖాళీ చేసి సమీప గ్రామమైన శివన్నగూడెంలోనే అధిక సంఖ్యలో ఇళ్లు నిర్మించుకోని నివాసం ఉంటున్నారు. మిగతా ముంపు గ్రామాలు పాత గ్రామాల్లోనే కొనసాగుతున్నారు. ఇజ్రాయెల్లో ఉద్యోగాలకు దరఖాస్తులునల్లగొండ : తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్పవర్ కంపెని లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పరిధిలో ఇజ్రాయెల్లో గృహ ఆధారిత సంరక్షకుడు, సంరక్షకురాలి ఉద్యోగాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి పి.సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు, దరఖాస్తు చేసే విధానం, పూర్తి వివరాలకు 08355 24946 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా పోస్టర్ ఆవిష్కరణనల్లగొండ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల హక్కులు, బాధ్యతలు, విద్యుత్ సంస్థ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నిమ్మచెట్ల వెంకటయ్య, నాగేశ్వరరావు, నిరంజన్ అలీ, రాజు, నాయక్, ఎండీ.పర్వీజ్, నాగప్రసాద్, సమ్మిరెడ్డి, రాంబాబు, కోటి, భీమార్జున్రెడ్డి, కమల ప్రశాంతి, సునీత పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 36 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. -
అభివృద్ధిపై మంత్రి చర్చకు రావాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 27 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఎంత? రెండేళ్ల కరోనా కాలం మినహాయించి, తాను కేవలం మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఎంత? అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రికి.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్కీ డ్రా ద్వారా అర్హులైన పేదలను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపికలో భారీగా కమిషన్లు దండుకున్నారని, ఒక్కో ఇంటికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సుమారు రూ.1,500 కోట్లు తెచ్చి మెడికల్ కాలేజీ, ఐటీ హబ్, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో పాటు అనేక పనులు చేపట్టామన్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని, కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు. సీపీఎం కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కటికం సత్తయ్యగౌడ్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, చీర పంకజ్యాదవ్, రావుల శ్రీనివాస్రెడ్డి, దేప వెంకట్రెడ్డి, అయితగోని యాదయ్య, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి -
వృద్ధుల ఆశలపై నీళ్లు!
నల్లగొండ టూటౌన్ : ‘ఒక ఇంట్లో ఒకే పింఛన్ ఎందుకు.. మేము అధికారంలోకి వస్తే రెండు పింఛన్లు ఇస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల వరకు ఊరించి ఉసూరుమనిపించింది. చేయూత పథకంలో ఇచ్చే పింఛన్లలో వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయిచ్చింది. ఇప్పట్లో వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈనెల 31 వరకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి గడువు విధించింది. దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, తలసేమియా, డయాసిస్ తదితర వాటి కోసం కొత్త దరఖాస్తు నమూనాను కూడా విడుదల చేసింది. కానీ వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులు మాత్రం స్వీకరించడం లేదు. 58 ఏళ్లు నిండిన వారికే ఇస్తామని ప్రకటనలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పించన్లు ఇస్తామని చెప్పింది. అప్పట్లో కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా కొత్త పించన్లు మాత్రం ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ మొత్తం రూ.4 వేల వరకు పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీనిచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ ఇస్తామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటి వరకు కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.. కానీ, ఓఏపీ (ఓల్డ్ ఏజ్ పింఛన్) సైట్ మాత్రం ఓపెన్ చేయలేదు. దాంతో గత ప్రభుత్వం హయాం నుంచి ఎదురుచూస్తున్న వృద్ధుల ఆశలపై ప్రస్తుత ప్రభుత్వం నీళ్లు చల్లిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పింఛన్లకే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇప్పటి వరకు 1600 మంది దరఖాస్తులు ఆన్లైన్ చేశాం. వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అనుమతి వచ్చిన తరువాత వృద్ధుల దరఖాస్తులు స్వీకరిస్తాం. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ ఫ వృద్ధాప్య పింఛన్పై ఊరించి ఉసూరుమనిపించిన ప్రభుత్వం ఫ ఓఏపీ మినహా మిగతా వాటికి దరఖాస్తుల స్వీకరణ ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో మూలుగుతున్న వేల అప్లికేషన్లు ఫ అమలుకు నోచుకోని ఎన్నికల హామీ వృద్ధాప్య పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాలు, కార్పొరేషన్లో ఐదేళ్ల నుంచి చాలామంది నేరుగా దరఖాస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల నుంచి 30 వేల వరకు దరఖాస్తులు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వం సైట్ ఓపెన్ చేయకపోవడంతో ఆ దరఖాస్తులన్నీ ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకోని సర్కార్ మరో కొత్త నమూనా దరఖాస్తు తయారు చేసి దాంట్లో అసలు వృద్ధాప్య అనే పదం చేర్చలేదు. వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికార యంత్రాంగం వాటిని మినహాయించి మిగతా వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా ఇప్పటి వరకు వచ్చిన 1600 మంది దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేశారు. -
ప్రజల చెంతకు ప్రజావాణి
మిర్యాలగూడ టౌన్ : ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రజల ముంగిటికే చేర్చడమే లక్ష్యంగా పాలనను వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలకే పరిమితమైన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకపై మండల స్థాయికి విస్తరిస్తూ ప్రణాళికా శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 4ను జారీ చేసింది. మండల స్థాయిలోనే ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. మండల కేంద్రంలోనే వినతులను స్వీకరిస్తుండటంతో ప్రజలకు దూరబారంతో పాటు సమయం, ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. నోడల్ అధికారిగా ఎంపీడీఓ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మండల ప్రజావాణికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని శాఖల అధికారుల హాజరు తప్పనిసరి ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, విద్యాశాఖ, అటవీశాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, అధికారులతో పాటు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, విద్యుత్ శాఖ, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఫిర్యాదులను స్వీకరించాలి. పోర్టల్లో నమోదు.. మండల ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేస్తారు. దీనికోసం కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయంతో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, అర్జీదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును వెంటనే అందజేస్తారు. దీనిద్వారా బాధితులు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. దివ్యాంగులు, మహిళలకు ప్రాధాన్యం ప్రజావాణి కేంద్రాల వద్ద తాగునీరు, సీటింగ్, నీడ, హెల్త్ డెస్క్, వీల్ చైర్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలతో వచ్చే వారికి ఫిర్యాదులు సమర్పించడంలో మొదటి ప్రాధాన్యమిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుండటంతో, చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే తిప్పలు సామాన్య ప్రజలకు తప్పనున్నాయి. ఫ నేటి నుంచి ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ ఫ అన్ని శాఖల మండల అధికారుల హాజరు తప్పనిసరి ఫ ప్రజావాణి పోర్టల్లో దరఖాస్తుల నమోదు -
విశిష్ట బోధకుడు.. శ్రీనివాస్
రామగిరి (నల్లగొండ) : కూరెళ్ల శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తికి, తన కళాత్మకతను జోడిస్తూ మరింత వన్నె తెచ్చిన విశిష్ట బోధకుడని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు, విద్యావేత ఎంవి.గోనారెడ్డి అన్నారు. ప్రముఖ చిత్రకారుడు, రిటైర్డ్ హెచ్ఎం కూరెళ్ల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ అభినందన సభ నల్లగొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కవి కృష్ణకౌండిన్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూరెళ్ల శ్రీనివాస్ ఆర్టిస్టిక్ జీవితంపై ముద్రించిన కళా శ్రీనివాసమ్ అనే పుస్తకాన్ని గోనారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీనివాస్ ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శంగా కొనసాగుతూనే.. సామాజిక ఇతివృత్తాల్లో కళాకారుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివన్నారు. ఎక్కడా ఏ చిత్ర ప్రదర్శన జరిగినా కూరెళ్ల గీసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు. అనంతరం కూరెళ్ల శ్రీనివాస్ – శైలజ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బెల్లి యాదయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, రఘువీర్ప్రతాప్, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, భూతం ముత్యాలు, నర్రా ప్రవీణ్రెడ్డి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కుకుడాల గోవర్దన్, వడ్డేపల్లి వెంకటేశం, బండారు శంకర్, పెందోట సోము, సాగర్ల సత్తయ్య, పందిరి శ్యాంసుందర్, దాసరి శ్రీరాములు, బరిగేల శ్రవణ్ కూమర్, బూరుగు గోపికృష్ణ, తరునోజు భీష్మా చారి, చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అసెనా పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ పీఏసీ కీలక భేటీ
సాక్షి, యాదాద్రి: నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) కీలక సమావేశం సోమవారం భువనగిరిలోని వివేరా హోటల్లో జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం సాధించడం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి ప్రతి జిల్లా నుంచి 20 మంది పీఏసీ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. చర్చించే అంశాలివే.. ఉమ్మడి జిల్లాలో సర్వే ప్రక్రియ, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. ముఖ్యంగా నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పరిష్కరించడంపై దృష్టి సారించనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను సమీక్షించడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఒకే వేదికపైకి వస్తుండటంతో ఈ పీఏసీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల సమావేశం ఫ హాజరుకానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డి జిల్లాల వారీగా పీఏసీ సమావేశాల షెడ్యూల్ ఇలా.. ఉదయం 11 నుంచి 12 వరకు: సూర్యాపేట జిల్లా మధ్యాహ్నం 12 నుంచి 1:00 వరకు: యాదాద్రి భువనగిరి జిల్లా మధ్యాహ్నం 1:00 నుంచి 2 వరకు : నల్లగొండ జిల్లా -
ఫుట్బాల్ ట్రయల్స్కు ముగ్గురు క్రీడాకారులు
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జి.శివమణి, బి.దత్తు, ఎన్.చరణ్ తేజ్ లను పంపించామని ఉమ్మడి జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతమైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి చేయూతనిచ్చి జాతీయస్థాయి క్రీడాకారులగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఎమ్మార్పీ కాల్వలో తవ్వకాలుకనగల్ : మండల పరిధిలోని శాబ్దుల్లాపురం ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో కొందరు గుంతలు తవ్వుతున్నారు. తమ నీటి అవసరాలు తీర్చుకునేందుకు ప్రధాన కాలువలోకి జేసీబీలను పంపి తవ్వకాలు చేపట్టారు. ఒకవైపు ప్రభుత్వం రూ.కోట్ల వ్యయంతో ప్రధాన కాలువకు లైనింగ్ వేస్తుండగా ఇక్కడ మాత్రం జేసీబీలతో ఐదు నుంచి పది అడుగుల మేర అక్రమ తవ్వకాలు జరపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువలో తవ్వకాలు చేపట్టడంతో భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు సంబంధిత జేసీబీ ఓనర్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు. -
రైతులు కొత్తగా వరిసాగు చేయొద్దు
నల్లగొండ టౌన్ : నాగార్జునసాగర్పై ఆధారపడి కొత్తగా వరి నాట్లు వేయవద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలో వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో అవసరానికి మించి ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని, వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. బోర్ల సంఖ్య పెరగడంతో భూగర్భ జలాల వినియోగం కూడా అధికమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని, భవిష్యత్లో భూగర్భ జలాలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వరి సాగుకు అధికంగా నీరు, రసాయన ఎరువులు అవసరమవుతాయని, వరి విస్తీర్ణాన్ని తగ్గించడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవచ్చన్నారు. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసే రైతు కనీసం రెండు ఎకరాల్లో పప్పు దినుసులు, నూనెగింజలు లేదా ఇతర మెట్ట పంటలు సాగు చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరిబండి ప్రసాదరావు, నంద్యాల నరసింహారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం పాల్గొన్నారు. ఫ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య -
అభివృద్ధిలో అగ్రగామి
వివాహిత దారుణ హత్య పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. వియత్నాం బుద్ధ విగ్రహం నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో వియత్నాం దేశానికి చెందిన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోజాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ సత్యం, కలెక్టర్, ఎస్పీ సీపీఎం నాయకుల అరెస్ట్పై ఖండననల్లగొండ టౌన్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తారనే అపోహతో, సీఐటీయూ, సీపీఎం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజా స్వామ్య హక్కులను కాలరాయడమేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించాలనే ఉద్దే శం తమకు లేదని, కేవలం ప్రజల హక్కులు, సమస్యలపై ప్రశ్నిస్తున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలినల్లగొండ టూటౌన్ : నల్లగొండ నుంచి ముశంపల్లి వెళ్లే రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోతెపాక సాంబయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణ శివారులో రోడ్డు పనులు పరిశీలించి మాట్లాడారు. మంత్రి వెంకట్రెడ్డి రోడ్డు పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా ఇంతవరకు పనులు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపుగా డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించాలని కోరారు. నృసింహ క్షేత్రంలో నిత్య కల్యాణ వేడుకయాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘నల్లగొండ నా ఊపిరి. మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి.. జిల్లాను ప్రగతి బాటలో ముందుంచడానికినా నా ప్రాణాలైనా అడ్డుపెడతా’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ‘అధికారం శాశ్వతం కాదు. ప్రజల కోసం చేసిన పోరాటం మాత్రమే శాశ్వతం. ప్రజల కోసం చేసిన త్యాగమే చరిత్రలో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మహిళలకు ‘మహాలక్ష్మి’ అండ మహాలక్ష్మి పథకం కింద మహిళలు, ట్రాన్న్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 8.73 కోట్ల ఉచిత ప్రయాణాలకు రూ.408.20 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. వానాకాలం సీజన్లో జిల్లాలో 5,35,253 మంది రైతులకు ఎకరాకు రూ.715 కోట్ల రైతు భరోసా సొమ్ము ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబీమా కింద 1,143 మంది కుటుంబాలకు రూ.57.15 కోట్లు అందించామన్నారు. నిరుపేదల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 5,42,194 కుటుంబాలకు 28,953 మెట్రిక్ టన్నుల నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో 81,279 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో 1,55,114 కొత్త పేర్లు నమోదు చేశామని చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళా శక్తికి పెద్దపీట కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటిన్ ఏర్పాటు చేశామని, రూ.2.5 కోట్లతో ‘నీలగిరి మహిళా మార్ట్’ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. గంధంవారిగూడెంలో 1.20 ఎకరాల్లో రూ.3.50 కోట్లతో మహిళా శక్తి పెట్రోల్ పంపును ప్రారంభిస్తున్నామని చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో 5 ఎకరాల చొప్పున రైస్ మిల్లుల స్థాపనకు భూములను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. విద్యుదుత్పత్తిలో ముందడుగు యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్్లో నాలుగు యూనిట్లలో రోజుకు 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఐదో యూనిట్ను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 30 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించి 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ఎస్ఎల్బీసీ హై లెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.442 కోట్లు, లో లెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.44.22 కోట్లు మంజూరు చేశామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.1,800 కోట్లు మంజూరు చేశామని, పనులు కొనసాగుతున్నాయన్నారు. నల్లగొండ : పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో గొల్లగూడ శివారు కలెక్టరేట్ వెనుకభాగంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం ఆయన ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలివేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను రూ.35 కోట్లతో పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇళ్లు పొందిన 552 కుటుంబాలకు అవసరాల కోసం తన సొంత నిధుల నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్లో ఇంకా ఇళ్లు రాని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో నివాసితుల సౌకర్యార్థం రేషన్ షాపు, సూపర్ బజార్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇళ్లు రాని అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తాను బతికున్నంతకాలం ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని, తనకు చేతనైనంతవరకు పేదలకు సాయం చేస్తానని చెప్పారు. ఎంపీ రఘువీర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవర్, మేయర్ బుర్రి చైతన్య, ఎమ్మెల్సీ శంకర్నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ పరుశురాం, కార్పొరేటర్ జ్ఞానేశ్వరి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, గృహ నిర్మాణ అధికారి డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇంటిని ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, లబ్ధిదారులుపంటల సాగు ఇలా.. పంట సాగు ఎకరాల్లో పత్తి 6,02,000 వరి 4,38,762 జొన్న 207 కంది 11,240 పెసర 14,221 మినుము 5,599 ఆముదం 33 వేరుశనగ 65 ఇతర పంటలు 110జిల్లాలో 38,403 మంది పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందగా రూ.119.11 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో అదనంగా 100 పడకల భవనం రూ.14.60 కోట్లతో పూర్తయిందన్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక లాప్రోస్కోపీ యూనిట్ను అందుబాటులోకి తెచ్చామ, నకిరేకల్ వైద్యశాలను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసి ప్రారంభానికి సిద్ధం చేశామని తెలిపారు. ఫ అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం ఫ విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నాం ఫ నీలగిరిలో మహిళ మార్ట్ ఏర్పాటు చేస్తున్నాం ఫ నియోజకవర్గానికి ఒక మహిళ శక్తి పెట్రోల్ బంక్ ఫ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
బడి బస్సా.. మృత్యు శకటమా!
నల్లగొండ, భువనగిరి: అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారుల నవ్వులు ఆ ఇళ్లలో శాశ్వతంగా దూరమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల కాసుల కక్కుర్తి, అలసత్వం.. డ్రైవర్ల నిర్లక్ష్యం.. వెరసి పసిప్రాణాలను మృతి ఒడికి చేరుస్తున్నాయి. గత జూన్ 27న భువనగిరి మండలం వడపర్తిలో బడి నుంచి ఇంటి వద్దకు బస్సులో వచ్చిన పెద్ద కుమారుడిని తీసుకెళ్లేందు తల్లి వెంట వచ్చిన చిన్నకుమారుడు అదే బస్సుకింద మృతిచెందగా.. తాజాగా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో అక్కను సాగనంపేందుకు బస్సు వద్దకు వెళ్లిన 21 నెలల పసిపాప అభిజ్ఞతార అదే స్కూల్ బస్సు చక్రాల కింద నలిగిపోవడం ప్రతీ ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. రెండు నెలల వ్యవధిలో కళ్లెదుటే తమ బిడ్డలు విగతజీవులుగా మారుతుంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. గతేడాది నల్లగొండలో.. గతేడాది సెప్టెంబర్ 4న కనగల్ మండలం తొరగల్ గ్రామానికి చెందిన బాలిక (5) నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువతోంది. పాఠశాలకు వెళ్లి.. బస్సు దిగిన తర్వాత.. మరో చిన్నారితో కలిసి వెళ్తుండగా.. గమ నించని స్కూల్ బస్ డ్రైవర్ బస్సును కదలించడంతో చక్రాల కిందపడి అక్కడిక్కడే మృతిచెందింది. నిబంధనలు గాలికి.. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతను యాజమాన్యాలు గాలికి వదిలివేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా యాజామాన్యాలు పట్టించుకోవడం లేదు. పలు స్కూల్ బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి.తనిఖీ సమయాలలో కొంత నిబంధనలు పాటిస్తున్నా పూర్తి స్థాయిలో భద్రత చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు స్కూల్ బస్సుల్లో ఇనుప గ్రిల్స్ కనబడడంలేదు. అగ్ని ప్రమాదల నివారణ చర్యలు తీసుకోవడంలేదు. నామా మాత్రంగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు ఉంటున్నాయి. వాహనాలకు కనీస ఫిట్నెస్ పరీక్షలు చేయించకపోవడం, అనుభవజ్ఞు లైన డ్రైవర్లను పెట్టుకోకపోవడం.. అన్నింటికీ మించి చిన్నారులను సురక్షితంగా ఎక్కించి, దించేందుకు బస్సుల్లో కేర్ టేకర్ (అటెండర్) లేకపోవడం వల్లే పసిమొగ్గలు ఇలా చక్రాల కింద నలిగిపోతున్నాయి.ఫ పసిప్రాణాలను బలిగొంటున్న ప్రైవేట్ స్కూళ్ల నిర్లక్ష్యం ఫ కన్నవారికి తీరని కడుపుకోత స్కూల్ బస్సు నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 15 ఏళ్ల వరకు మాత్రమే బస్సు నడపాలి వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి డ్రైవర్కు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి డ్రైవర్ 60 సంవత్సరాల వయస్సు పైబడి ఉండకూడదు బస్సులో విధిగా అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి బస్సు ఎక్కే డోర్ వద్ద గ్రిల్స్ ఏర్పాటు చేయాలి బస్సులో అటెండర్ ఉండాలి బస్ ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్ బార్ ఏర్పాటు చేయాలి విద్యార్థులు బస్సు ఎక్కెందుకు ప్రవేశద్వారం వద్ద మెట్టు అనుకూలంగా ఉండాలి 360 డిగ్రీల కోణంలో కనబడేలా అద్దాలు ఉండాలి -
నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని రేషన్ కార్డుదారులకు శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల జారీరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్డుల జారీని ప్రారంభిచనుండగా, జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతులు మీదుగా కలెక్టరేట్లోని ఉదయాధిత్య భవన్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించనుంది. జిల్లాలో 5,41,043 కార్డులు జిల్లాలో 1,051 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా మంజూరు చేసిన వాటితో కలుపుకొని 5,41,043 రేషన్కార్డులు ఉన్నాయి. వారందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్డులను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏటీఎం కార్డు తరహాలో ఇప్పటి వరకు కాగితంపై ఉన్న రేషన్ కార్డులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను రూపొందించింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ డిజిటల్ కార్డులను చినగకుండా, తడిసిపోకుండా భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుపై కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల పేర్లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను ముద్రించారు. క్యూఆర్ కోడ్తో పూర్తి సమాచారం స్మార్ట్ రేషన్ కార్డులో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను పొందుపరిచారు. రేషన్ దుకాణంలో కార్డును స్కాన్ చేయగానే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ 5.41 లక్షల మందికి కార్డుల పంపిణీ ఫ ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన ఫ క్యూఆర్ కోడ్తో పూర్తి వివరాలు నియోజకవర్గాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డుల లెక్క నియోజకవర్గం రేషన్ షాపులు స్మార్ట్ కార్డులు నల్లగొండ 137 85,745 మునుగోడు 118 60,552 తుంగతుర్తి 31 16,409 నకిరేకల్ 143 83,589 మిర్యాలగూడ 179 1,01,526 నాగార్జునసాగర్ 203 93,126 దేవరకొండ 240 1,00,096 -
నీలగిరి పట్టణంలో విస్తృత తనిఖీలు
నల్లగొండ : స్వాతంత్య్ర వేడుకల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా శుక్రవారం నల్లగొండ పట్టణంలో నాకాబందీ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. స్వాతంత్య్ర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని స్థాయిల్లో సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. బాధితులకు అండగా భరోసా కేంద్రాలు మహిళలు, బాలికలు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి భరోసా కేంద్రాలు అండగా ఉంటున్నాయని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని భరోసా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీస్ అధికారులు.. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్చార్జి ఎస్ఐ అమ్రీన్, ఎస్ఐ గౌస్, ఏఎస్ఐ అబేదా, శ్రీనివాస్, భరోసా కేంద్రం కోర్డినేటర్ నళిని, సిబ్బంది పాల్గొన్నారు. ఫ స్వాతంత్య్ర దినోత్సవం వేళ నాకాబందీ -
సాగునీరివ్వకుంటే డ్యాంను ముట్టడిస్తాం
ఫ నీటి అక్రమ తరలింపును ఆపాలి ఫ మాజీఎమ్మెల్యే భాస్కర్రావు మిర్యాలగూడ : ప్రస్తుత వానాకాలం సీజన్కు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించకుంటే రైతులను సమీకరించి సాగర్ డ్యాంను ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు చేరిందని తెలిపారు. ఈ దశలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి సాగర్కు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో నిర్ణయించిన ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి, నీటి నిల్వ కోసమేనని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సాగర్కు నీరు విడుదల చేయాలన్నారు. కానీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నేతలకు సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, హతీరాం, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, యూసుఫ్, ఇలియాస్, పాచ్చునాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయ న ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ వేడుకలకు పోలీస్ శాఖ అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. 18న ప్లేస్మెంట్ డ్రైవ్ నల్లగొండ : ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ పాత కళాశాలలో వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు, ట్రైనింగ్కు ప్లేస్మెంట్ డ్రైవ్ (జాబ్ ఫెయిర్), అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో మేళాకు హాజరు కావాలని కోరారు. సాగునీరిచ్చి రైతులను ఆదుకోవాలిఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ : శ్రీశైలం ప్రాజెక్టుకు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఈ వానాకాలం పంటలకు సాగునీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ మండలం గోపసముద్రం తండా, ఉట్లపల్లి గ్రామాల్లో వరినాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పంపుతున్నారని అన్నారు. డ్యాములన్నీ నిండిన తరువాతనే సాగర్కు నీటిని విడుదల చేస్తామనడం అన్యాయమన్నారు. నవంబర్లో నల్లగొండలో జరిగే జాతీయ రైతు సంఘం మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, మట్టారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. యూనిఫాం అందించాలినల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలోని డీఈఓ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ నాణ్యమైన యూని ఫాం అందించకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్నాటి యాదగిరి, అనంత నాగరాజుగౌడ్, కొంపల్లి రామన్నగౌడ్, సతీష్, నాగరాజు, మహేష్, శివ, పృథ్వీరాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
ధాన్యం డబ్బులు చెల్లించాలని ధర్నా
చిట్యాల : తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సీజన్లో భాగంగా ఈ ఏడాది మే నెలలో గుండ్రాంపల్లి పీఏసీఎస్ ద్వారా సుంకెనపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించినట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్ సిబ్బందితో పాటు రైస్మిల్లర్స్ కుమ్మకై ్క ధాన్యం విక్రయించిన 70 మందికి ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి రూ.60 వేల వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తక్కువగా జమ చేశారని వాపోయారు. కొనుగోలు సమయంలోనూ క్వింటాకు ఐదు నుంచి ఏడు కిలోల చొప్పున తరుగు తీశారని అయినప్పటికీ తమకు రావాల్సిన పెండింగ్ డబ్బులను జమ చేయడంలేదన్నారు. గుండ్రాంపల్లి పీఏసీఎస్ పరిధిలో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని వెంటనే సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తనకు రావాల్సిన రూ.29,550 గురించి ప్రశ్నిస్తే పీఏసీఎస్ అధికారులు స్పందిస్తలేరని రైతు బల్గూరి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పీఏసీఎస్ సీఈఓ రాజమల్లు మాట్లాడుతూ రైతులు విక్రయించిన ధాన్యం మేరకు ట్రక్ సీట్స్ ఆధారంగానే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోయగూర నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ బాతరాజు రవీంధర్, యాకారి నరేందర్, బీమీడీ మహేందర్రెడ్డి, అంబాల నర్సింహ, గుడ్డేటి శ్రీశైలం, కక్కిరేణి భిక్షం, ఆవుల మహేష్, ఆవుల అయిలయ్య, ఆవుల బాలరాజు, నరేష్, వెంకటేశం, బాలయ్య పాల్గొన్నారు. -
విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి
నల్లగొండ టూటౌన్ : స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు దేశభక్తిని పెంపొదించుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఎంజీయూలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పతాకం, తెలంగాణ స్వాతంత్య్ర పోరాట యోధులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర వహించాలన్నారు. ఈ ఎగ్జిబిషన్లో స్వామి రామానంద తీర్థ, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, రాంజీ గోండు, కొమురం భీమ్, దేవులపల్లి వెంకటేశ్వర్రావు తదితర సమరయోధుల వివరాలు పొందుపరిచారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు వీసీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి. కోటేశ్వర్రావు, కె. అంజిరెడ్డి, జె. సురేష్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మచ్చేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
రైతులు వరిసాగు చేసి నష్టపోవద్దు
తిప్పర్తి : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండడంతోపాటు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సమయం ముగియనుండడంతో జిల్లాలోని రైతులు వరిసాగు చేసి నష్టపోవద్దని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ఆయన గురువారం తిప్పర్తి శివారులో వరిసాగుకు సిద్ధమవుతున్న రైతులతో మాట్లాడి అవగాహన కల్పించారు. వరిపంట సాగుకు నీటి అవకాశాలే లేవని, అలాంటప్పుడు వరి ఎందుకు వేస్తున్నారని రైతులను ప్రశ్నించారు. ఆరుతడి పంటలు వేసుకుంటే నష్టం లేకుండా ఆదాయం వస్తుందన్నారు. సెప్టెంబర్ చివరి వరకు ఆరుతడి పంటలు వేసుకోవచ్చన్నారు. చౌడు భూముల్లో మినుములు, పెసర వంటి పంటలు వేసుకవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల్లో యూరియా దొరికేలా చూడాలని రైతులు కలెక్టర్ను కోరగా కలెక్టర్ స్పందించి వెంటనే ఇండెంట్ పంపాలని డీఏఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయేందర్రెడ్డి, ఏఓ సన్నిరాజు, గిరిరాజు, శ్రీనివాస్, ఏఈఓ సంతోషి, రైతులు మొహన్, పరుశురాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నీలగిరిలో రోజంతా తాగునీటి సరఫరా
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో ఇంటింటికి 24/7 తాగునీటిని సరఫరా చేయడానికి ముందడుగు పడింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద నిధులు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపానదలు పంపించింది. ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసి పంపించారు. నగరంలో ఇంటింటికి 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు రూ.296.70 కోట్లు అవసరమని ప్రతిపానదలు రూపొందించారు. కొంత కాలంగా పెరిగిన నీలగిరి నగర జనాభా, రానున్న రోజుల్లో పెరగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డీపీఆర్ తయారు చేశారు. నగర ప్రాధాన్యత, నగరంలో ఉన్న నీటి వనరులు తదితర వాటిని డీపీఆర్లో జోడించారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నీలగిరి నగరంలోని ఇంటింటికి 24 గంటల పాటు తాగునీటిని అందించనున్నారు. 2053 నాటికి 4.19 లక్షల జనాభా.. 2011 తరువాత నగరం శరవేగంగా పెరుగుతూ వస్తోంది. నగరంలో ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా నెలకొల్పబడడం, పిల్లల చదువుల కోసం జిల్లా నలుమూలల నుంచి నగరానికి ప్రజలు వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లల చదువుతోపాటు ఉపాధి కోసం సైతం వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నారు. దాంతో నగర విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా భారీగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,65,328 జనాభా ఉండగా, 2025 నాటికి 2,40,885కు చేరిందని ప్రతిపాదించారు. ఈ లెక్కన 2038 నాటికి 3,11,611, 2053 నాటికి 4,19,387 జనాభా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనల్లో చూపించారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని 2038లో 49.49 ఎంఎల్డీ, 2053లో 66.61 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా నగరానికి పక్కనే ఉయద సముద్రం ఉండడంతో అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా నగరంలోని అన్ని కాలనీలు తాగునీటిని అందించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఎక్కడైనా పైప్లైన్ లేకున్నా అక్కడ కొత్త డిస్ట్రిబ్యూటర్ లైన్ వేసి తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు మంజూరైతే 2050 నాటికి నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.రూ.297 కోట్లతో ప్రతిపాదనలుఫ కేంద్రానికి డీపీఆర్ అందజేత ఫ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన ఫ నిధులొస్తే 2050 నాటికి తాగునీటి ఇబ్బందులుండవ్ -
రూపారెడ్డి హత్య కేసు త్వరలోనే ఛేదిస్తాం
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తు కొలిక్కి వస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. గురువారం ఆయన హత్య జరిగిన రూపారెడ్డి ఇంటిని పరిశీలించి, కేసు దర్యాప్తు పురోగతిని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కేసును ఛేదించేందుకు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని, 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 20 నిమిషాల్లోనే ఘాతుకం.. హత్య కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్యకు ముందు నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి రూపారెడ్డి ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం 5.41 గంటలకు ఇంటి వెనుక ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన నిందితుడు.. 20 నిమిషాల వ్యవధిలోనే హత్య చేసి తిరిగి గోడ దూకి ఎరుపు రంగు కారులో పరారైనట్లు అను మానిస్తున్నారు. నిందితుడు రూపారెడ్డి బ్యాగులో నుంచి సుమారు రూ.2లక్షల నగదు అపహరించినట్లు పోలీసులు నిర్దారించారు. అయితే, హత్యకు పాల్పడిన నిందితుడు ఒకరా, లేక ఇద్దరా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. నిందితుడి వయస్సు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి ీససీ ఫుటేజ్ ఆధారంగా ముమ్మర దర్యాప్తుసాధారణంగా సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే రూపారెడ్డి, హత్య జరిగిన రోజు మాత్రం సాయంత్రం 5.25 గంటలకే ఇంటికి చేరుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెను కలిసేందుకు ఎవరో వస్తున్న విషయం ముందే తెలిసి ఇంటికి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, హత్య జరిగిన ఇంట్లో రెండు టీ కప్పులను గుర్తించడం.. నిందితుడు రూపారెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తే కావచ్చన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఎరుపు రంగు కారులో పరారైన నిందితుడు.. హత్యకు ఉపయోగించిన గ్లౌ జులను మార్గమధ్యలో చింతచెట్టు తండా వద్ద పా రేసినట్లు పోలీసులు గుర్తించారు. -
ఇరిగేషన్ శాఖ భూములు మళ్లీ సర్వే
డిండి : మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ భూముల్లో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నత, స్థానిక అధికారులు గురువారం సర్వే ప్రారంభించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, 2009లో అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిండి గ్రామపంచాయతీ పరిధిలో 950 మంది రైతుల పేర్ల మీద ఉన్న దాదాపు 480 ఎకరాల వ్యవసాయ భూమి ఇరిగేషన్ శాఖ పేరిట మార్పు జరిగింది. నాటి నుంచి ఆ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నా.. భూములపై క్రయవిక్రయాల హక్కులు లేకపోవడంతో పాటు, ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందడం లేదు. దాదాపు పదిహేనేళ్లుగా భూములపై హక్కు కోల్పోయిన రైతులు.. తిరిగి తమకు పట్టాలిప్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎట్టకేలకు తాజాగా సర్వే ప్రక్రియ ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయొద్దు
రామగిరి (నల్లగొండ) : రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్షియేటివ్స్ డిపార్ట్మెంట్ (శక్తి శాఖ)లో విలీనం చేయొద్దని, ఆ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సిబ్బంది అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సాంకేతిక విద్యాభివృద్ధికి పాలిటెక్నిక్ వ్యవస్థ మూలస్తంభమని, దీనిని శక్తి శాఖలో కలపడం వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఈ విలీనం అమలైతే ఉద్యోగుల సేవా నిబంధనలు, పదోన్నతులు, బదిలీలు, భవిష్యత్ ఉద్యోగ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపక, ఉద్యోగ సంఘాలతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాతే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని, ఆ లోగా పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి
మునుగోడు : ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతీ, యువకులకే ఉద్యోగాలు ఇవ్వాలని, అందుకోసం యువత ఉద్యమించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం మునుగోడులో నిర్వహించిన ఏఐవైఎఫ్ 15వ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్, రాజకీయాలను శాసించే శిక్తి సామర్థ్యాలు యువతలోనే ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత సంక్షేమానికి ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగ సమస్యని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేందర్ మాట్లాడుతూ నీట్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ సభలో తిరిపారి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, ఆర్.అంజాచారి, నలపరాజు రామలింగయ్య, చాపల శ్రీను, సతీష్ కుమార్, భీమనపల్లి రమేష్, బుర్రి శేఖర్, జిల్లా యాదగిరి, ముదిగొండ మురళీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
పథకాలు పక్కాగా అమలు కావాలి
రామగిరి(నల్లగొండ) : షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కమిషన్ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీ భూసమస్యలు, దాడులు, కేసులు, ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించాలని, ఇతర పనులకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులు మిగిలితే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధి, ఎస్డీఎఫ్ నిధులను రిజర్వేషన్ ప్రకారమే కేటాయించాలని ఆదేశించారు. దాడుల కేసుల్లో పురోగతి ఉండాలి..ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో జాప్యం లేకుండా శిక్షల శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన రూ.1.89 కోట్ల పరిహారంతో పాటు కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల నిధులు త్వరలోనే వచ్చేలా చూస్తామని తెలిపారు. నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను తొలగించకుండా కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్ దర్శనం నర్సింహకు గన్మెన్ భద్రతను పునరుద్ధరించాలని ఎస్పీని కోరారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ నియామకాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్కు చెప్పారు. గుడితాండా పునరావాస కేంద్రం పరిహారం రాని 130 మందికి, చండూరు మండలం అంగడిపేటకు చెందిన మేకల బుచ్చమ్మ ఇంటి వివాదంపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్ మాట్లాడుతూ దాడుల కేసుల పరిష్కారం, డ్రగ్స్ అరికట్టడంలో జిల్లా యంత్రాంగం కృషిని అభినందించారు. భూసమస్యలలో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అరికట్టాలని, తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడాలని, శూన్యపహాడ్ గణేష్పహాడ్ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు, ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జిల్లాలో ప్రస్తుతం 54 కేసులు విచారణలో ఉన్నాయని, 6 కేసుల్లో కోర్టు ద్వారా శిక్షలు ఖరారయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ప్రేమకరణ్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ ఉద్యోగాల్లో రూల్ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఫ ఎంజీయూలో నియామకాలపై విచారణ జరపాలి ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ఫిర్యాదు చేద్దామంటే.. ఫోన్ నంబర్ పనిచేయట్లే!
నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరైనా సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించే బోర్డుపై ఉన్న ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బోర్డుపై అప్పటి సూపరింటెండెంట్ ఫోన్ నంబరే ఉంచారు. అది ఇప్పుడు పని చేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సమస్యపై కలెక్టరేట్ టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే.. ఆసుపత్రి సూపరింటెండెంట్ను సంప్రదించాలని సూచిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కానీ, ఆ నంబర్ పనిచేయకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నీరుగారిపోతోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ నల్లగొండ -
బుల్లెట్ ట్రైన్ కారిడార్లో నకిరేకల్ను చేర్చాలి
నకిరేకల్ : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ను చేర్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్కు బదులుగా గతంలో ప్రతిపాదించిన ఎన్హెచ్–65 రహదారి వెంట కారిడార్ వచ్చేలా పరిశీలించాలని కోరారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అధిక జనాభా ఉన్న ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి దృష్టికి తెచ్చారు. 65వ నంబర్ జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేస్తే నకిరేకల్తో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. ఫ కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి -
వద్దన్నా.. వరిసాగే!
2,87,634 ఎకరాల్లో ఆరుతడి పంటల లక్ష్యం.. వేసింది 32,243 ఎకరాల్లోనే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో పరిమిత నీటి లభ్యత, భూగర్భ జలాల తగ్గుదల.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో 2,87,634 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ధేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 32,243 ఎకరాల్లోనే ఆరుతడి పంటలు సాగయ్యాయి. అంటే నిర్దేశించిన లక్ష్యంలో సుమారు 11.20 శాతం మాత్రమే సాధించినట్లయింది. దీంతో ఆరుతడి పంటల సాగు లక్ష్యం కాగితాలకే పరిమితమవుతోంది. మరోవైపు వరిసాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాకు దగ్గరగా జిల్లాలో రైతులు వరి సాగు చేస్తుండడంతో వర్షాలు కురవకపోతే పంటలను కాపాడుకునేదెలా అని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నీటి వినియోగం తగ్గించాలని.. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగుకు అధికంగా నీరు అవసరమవుతుండటంతో వీలైనంత మేర ఇతర పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. అయితే వరికి మార్కెట్ ఉండటం, సాగు పద్ధతిపై రైతులకు అనుభవం ఉండటం, గతంలో మంచి దిగుబడులు రావడం వంటి కారణాలతో రైతులు వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 4,38,762 ఎకరాల్లో వరి సాగైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆరుతడి పంటల సాగు లక్ష్యంతో పోలిస్తే వరి విస్తీర్ణం భారీగా ఉండటం వ్యవసాయ శాఖకు సవాల్గా మారింది. గతేడాది వానాకాలంలో జిల్లాలో 5,34,523 ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుత వానాకాలంలో 95,761 ఎకరాల్లో మాత్రమే వరి సాగు తగ్గింది. ఇక పత్తి విస్తీర్ణం పెద్ద ఎత్తున 6,01,195 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని 12,02,051 ఎకరాల సాగు అంచనాలో ఇప్పటివరకు 10,72,311 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. నీటి భద్రతపై ప్రభావం వరి సాగు విస్తీర్ణం పెరగడంతో నీటి వినియోగం కూడా అధికమయ్యే అవకాశం ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే చెరువులు, ప్రాజెక్టులు, బోర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో యాసంగి సీజన్లో నీటి లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన పెంచడం సవాలే.. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించడం వ్యవసాయ శాఖకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఆరుతడి పంటలతో తక్కువ నీటితో సాగు చేయడమే కాకుండా పంటల మార్పిడి, భూసార పరిరక్షణ, సాగు వ్యయాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతులకు ఆయా పంటలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దతు ధర, కొనుగోలు భరోసా కల్పిస్తేనే ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్తి చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అత్యధికంగా వరి సాగైన మండలాలు.. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఇలా.. పంట సాగు లక్ష్యం సాగైంది కందులు 58,176 11,240 పెసర 28,800 14,221 కూరగాయలు 14,976 5,599 పచ్చజొన్న 14,400 207 తొల్లజొన్న –– 565 నువ్వులు 86,400 11 ఉలవలు 14,400 74 బొబ్బర 57,024 110 ఆముదం 13,824 33 వేరుశనగ –– 65 చెరుకు –– 40 జూట్ –– 78 ఫ నిర్దేశిత లక్ష్యంలో 11.20 శాతమే సాగు.. ఫ ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకోని రైతులు ఫ వ్యవసాయశాఖ అంచనాలకు దగ్గరగా వరిసాగు ఫ ఇప్పటికే 4,38,762 ఎకరాల్లో నాట్లునల్లగొండ మిర్యాలగూడ కనగల్ తిప్పర్తి మాడ్గులపల్లి నిడమనూరు త్రిపురారం కట్టంగూర్ కేతేపల్లి నార్కట్పల్లి వేములపల్లి -
లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమవాస్య సందర్భంగా నిద్రచేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. పూజల్లో ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, ఆలయ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్బాబు, దేవాలయ డైరెక్టర్లు పాల్గొన్నారు. గట్టు పైన నిద్ర చేస్తున్న భక్తులు -
ఐకాన్ హాస్పిటల్కు నోటీసులు
నల్లగొండ టౌన్ : నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఆస్పత్రిలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, రోగి చనిపోయే దశలో పక్కనే ఉన్న ప్రభుత్వ జనరల్ ఆప్పత్రికి తరలిస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మంగళవారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐకాన్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ రోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఐకాన్ ఆసుపత్రిలో ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహించినట్లు డీఎంహెచ్ఓ కె.రాహుల్ తెలిపారు. మూడేళ్ల కాలంలో ఈ ఆస్పత్రిలో191 మరణాలు సంభవించినట్లు ఫిర్యాదులు రావడంతో వారికి సంబంధించిన కేస్ షీట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా ఆసుపత్రి అనుమతి సమయంలో పేర్కొన్న వైద్యులు గాకుండా ఇతర వైద్యులు ఉన్నారని.. వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయలేనది పేర్కొన్నారు. ఆస్పత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నామని.. పూర్తి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము నిబంధనల ప్రకారమే ఆసుపత్రి నిర్వహిస్తున్నామని నిబంధనలకు విరుద్దంగా ఎక్కడ వ్యవహరించడం లేదు. అధిక ఫీజులు వసూలు చేయడం లేదని, కావాలని కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారు. – డాక్టర్ ప్రదీప్, ఐకాన్ ఆసుపత్రి డైరెక్టర్ -
దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నల్లగొండ టూటౌన్ : యువ ఇంజనీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో బుధవారం ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన యువ ఇంజనీర్లు ద్వారా నవ భారత నిర్మాణం సాగాలన్నారు. దేశం సేవారంగం నుంచి ఉత్పత్తి ఎకనామీగా రూపాంతరం చెందడానికి యువ ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరమని చెప్పారు. సామాజిక సంక్లిష్టతలను ఆకలింపు చేసుకొని పరిష్కారం కోసం పరిశోధనలు చేసినప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమని తెలిపారు. ఇటీవల ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జర్మనీ, స్విజర్లాండ్ పర్యటనలో సాంకేతికతను జోడించి ముందుకు సాగడం ద్వారా భారత్ విశ్వగురువుగా మారడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు.. కోర్సులు, నైపుణ్యాల వృద్ధి, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ హరీష్కుమార్, అధ్యాపకులు సంధ్యారాణి, సుధారాణి, జయంతి, ప్రొఫెసర్ సాంబశివరావు, రఘుమారావు, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్
కట్టంగూర్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కట్టంగూర్లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, సైన్స్ల్యాబ్, పరిసరాలను, విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కాముల శ్యామలశేఖర్ మండలకేంద్రంలో నెలకొన్న మంచినీటి, లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విద్యుత్ శాఖ ఏఈలకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణనిడమనూరు : మండలంలోని ఎర్రబెల్లి పంచాయతీ నిధుల వినియోగంపై డీఎల్పీఓ రాఘవరావు బుధవారం విచారణ చేపట్టారు. రికార్డులను సీజ్ చేసి తీసుకవెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని స్థానికుడు లకుమాల మధు ఆరోపణల నేపథ్యంలో ఎర్రబెల్లి పంచాయతీ పాలకవర్గం, స్థానికులు సమక్షంలో ప్రాథమికంగా రికార్డులను స్వాధీనం చేసుకొని రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. పంచాయతీ రికార్డులు పరిశీలించి నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టరుకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐతగోని మధు, ఉప సర్పంచ్ నవీన్కుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు షహీరాసుల్తాన్, మురళీనాయక్, స్థానికులు ఉన్నారు. విద్యార్థులకు దిక్సూచి.. ఏఐఎస్ఎఫ్నల్లగొండ టౌన్ : విద్యార్థులకు దిక్సూచి ఏఐఎస్ఎఫ్ అని ఆ సంఘం మాజీ నాయకుడు మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండలో ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బరిగల వెంకటేష్, ముదిగొండ మురళీకృష్ణ, సూర్య తేజ, శ్రీకాంత్, అరవింద్, మనోహర్, తేజ, సాయి, అరుణ్ పాల్గొన్నారు. టిప్పర్లు, డంపర్లకు లోడ్ కవర్ తప్పనిసరి నల్లగొండ : వాహనదారుల భద్రత, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిప్పర్లు, డంపర్లకు ఆటోమేటిక్ లోడ్ కవర్ వ్యవస్థను తప్పనిసరి చేయనున్నట్లు నల్లగొండ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2027 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలని పేర్కొన్నారు. టిప్పర్లు, డంపర్ల యజమానులు, డ్రైవర్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని పేర్కొన్నారు. -
చేప పిల్లలకు టెండర్లు
ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ఆన్లైన్లో టెండర్లు పిలిచింది. ఈనెల 17వ తేదీన టెండర్లు తెరుస్తారు. జిల్లాలో నిండిన చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పోయడానికి చర్యలు తీసుకుంటాం. – సుకీర్తన, మత్స్యశాఖ జిల్లా అధికారి నల్లగొండ టూటౌన్ : మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఉచిత చేప పిల్లల సరఫరా ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉన్న ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. జిల్లాకు 5.98 కోట్లు చేప పిల్లలు కావాలని మత్స్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించడంతో టెండర్లు పిలిచారు. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు టెండర్ దాఖాలు చేశారు. ఈనెల 17వ తేదీన టెండర్లను ఓపెన్ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1167 ఉన్నాయి. చెరువులు, జలశయాల్లో మత్స్యకార సొసైటీల ద్వారా చేప పిల్లలను వదలనున్నారు. జిల్లాలో 257 మత్స్య సొసైటీలు.. జిల్లా వ్యాప్తంగా 257 వరకు మత్స్య పారిశ్రామిక సహాకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 27 వేల మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 60 వేల మందికి పైగా ఉచిత చేప పిల్లల ద్వారా జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఉచిత చేప పిల్లల పథకం వల్ల పేద మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. పెద్ద రిజర్వాయర్లు అయిన నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, అయిటిపాముల, కనగల్ జలశయాల్లో కూడా ఉచిత చేప పిల్లలను వదలడం ద్వారా వేలాది మందికి ప్రయోజనం చేకురనుంది. ఆలస్యంగా టెండర్లు.. ఉచిత చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అక్రమాల కారణంగా ఈ పథకంపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే. చేప పిల్లల లెక్కింపులో అక్రమాలు, నాణ్యమైన పిల్లలు పంపిణీ చేయని కారణంగా మత్స్యకారులకు పెద్దగా ప్రయోజనం చేకూరడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేప పిల్లల కోసం సొసైటీలకు నేరుగా నగదు పంపిణీ చేయాలని డిమాండ్ వస్తుండడంతో ప్రభుత్వం ఈ ఏడాది ఆలస్యంగా చేప పిల్లల పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఉచిత చేప పిల్లల టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను సరఫరా చేయడకుండా మత్స్యకారులను మోసం చేస్తున్న విషయాలు పలుసార్లు బయట పడిన విషయం తెలిసిందే. సకాలంలో చేప పిల్లలు పంపిణీ జరుగకపోవడం, పంపిణీ చేసినా చేప పిల్లలు నాణ్యత లేని కారణంగా బరువు పెరగకపోవడంతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. దాంతో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో టెండర్ల ప్రక్రియ కూడా జాప్యం జరిగింది. ఈనెల 17న టెండర్లు విప్పనుండగా టెక్నికల్ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ ఎట్టకేలకు టెండర్లు పిలిచిన సర్కార్ ఫ 17న తెరుచుకోనున్న టెండర్లు ఫ జిల్లాకు రానున్న 5.98 కోట్ల చేప పిల్లలు -
దివ్యాంగుడికి ఎంత కష్టం
ఫ నల్లగొండ రైల్వేస్టేషన్లో వసతుల లేమి రామగిరి(నల్లగొండ) : నల్లగొండ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. స్టేషన్కు వచ్చే అనారోగ్య బాధితులు, దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నల్లగొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచి నడవలేని స్థితిలో ఉన్న ఓ బాధితుడిని.. సహాయకుడు తన వీపుపై మోసుకుంటూ బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పేరుతో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, అత్యవసర వేళల్లో రోగులకు, వృద్ధులకు కనీస పరికరాలు అందకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని కోరారు. -
నోటీసులపై గుడితండాప్రజల అభ్యంతరం
కొండమల్లేపల్లి : పెండ్లిపాకల జలాశయం సామర్థ్యం పెంపు వల్ల ముంపునకు గురవుతున్న మండలంలోని గుడితండాకు చెందిన సుమారు 404 కుటుంబాల వారు నిరాశ్రయులవుతున్నారు. ఈ క్రమంలో ఇళ్లను ఖాళీ చేయాలని, అందుకు ప్రభుత్వం నుంచి మంజూరైన నగదు చెల్లింపుల కోసం మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా నుంచి వచ్చిన అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసు పత్రంపై తేదీ జూలై 31, 2026 అని ఉండడంతో పాటు ఏడు రోజుల్లోపు మాత్రమే అభ్యంతరాలు తెలుపుకునే వీలుండడంతో.. ఆగస్టు 11 తేదీతో నోటీసులు జారీ చేయాలని తండావాసులు పలువురు అధికారులను కోరారు. అలా కుదరదని మీరు సంతకం చేసేచోట ఆగస్టు 11, 2026 అని రాసుకొమ్మని సూచించడంతో అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తమకు ఇష్టం లేని చోట పునరావాసం కల్పించడం సరికాదని, తాము గిరిజనులమని అధికారులు తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలావతిని వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు తాము వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నేడు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాకనల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బుధవారం నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీలపై దాడులు, ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ అమలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. -
బీజేపీని గద్దె దించే వరకు పోరాడుతాం
దేవరకొండ : దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు సీపీఐ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు. మంగళవారం దేవరకొండ మండలంలో కొనసాగిన సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. గడిచిన 12 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పేపర్లు లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్రెడ్డి, రమావత్ అంజయ్యనాయక్, పల్లె నర్సింహ, తూం బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, సుదర్శన్రెడ్డి, కనకాచారి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటయ్య, రామాంజనేయులు, శైలేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు.. సొంతూరిలోనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాల్లోని పట్టణాల్లో, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓట్లు ఉన్నా, మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణాల్లో పలువురి ఓట్లు నమోదు చేయించి కొందరు నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందారు. రెండోచోట్లా ఓట్లు ఉన్నవారిలో చాలా మంది.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) సొంత గ్రామాల్లోనే ఓట్లు హక్కు ఉంచుకునేందుకు మొగ్గుచూపారు. గ్రామంలోనే ఎన్యుమరేషన్ చేయించుకున్నారు. దీంతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. దీంతో అధికారులు లెక్కలు తేల్చారు. జిల్లా వ్యాప్తంగా 1,58,635 మంది ఓట్లు రద్దు కానున్నాయి. అయితే ఇందులో చనిపోయిన వారు, వలస వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. 89.54 శాతం ఎన్యుమరేషన్ మొత్తంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 15,16,253 మంది ఓటర్లు ఉండగా, 13,57,618 మంది (89.54 శాతం) తమ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతో డిజిటలైజ్ చేశారు. 1,58,635 మంది (10.46 శాతం) ఎనుమరేషన్ పత్రాలను అందజేయకపోవడంతో వారి ఓట్లు రద్దు కానున్నాయి. నల్లగొండ పట్టణంలోనే అత్యధికంగా రద్దు జిల్లాలోని పట్టణాలు, మున్సిపాలిటీలు, మండలాల వారీగా చూస్తే నల్లగొండలోనే అత్యధికంగా ఓట్లు రద్దు కానున్నాయి. నల్లగొండ పట్టణంలో 1,74,912 ఓటర్లు ఉండగా, అందులో 1,48,981 మంది (85.17 శాతం) ఓటర్లు పట్టణంలోనే తమ ఓటు ఉండేలా ఎన్యుమరేషన్ చేయించుకున్నారు. 25,931 మంది (14.83 శాతం) ఓటర్లు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కు ఉండేలా నమోదు చేసుకున్నారు. అందులోనూ కొంత మంది చనిపోయిన వారు ఉండగా, మరికొంత మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు ఉన్నారు. రెండో స్థానంలో మిర్యాలగూడ ఓట్లు రద్దు కానున్న పట్టణాల్లో మిర్యాలగూడ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 1,48,822 మంది ఓటర్లు ఉండగా, 1,25,315 మంది ఓటర్లు పట్టణంలో ఓటు ఉండేలా ఎన్యుమరేషన్ చేయించుకున్నారు. 23,507 మంది మిర్యాలగూడ పట్టణంలో ఉండే ఓటు హక్కును వదులుకున్నారు. దేవరకొండలో 10,424 మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారు. ఆ తరువాత స్థానాల్లో చౌటుప్పల్, చిట్యాల, హాలియా, చండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే నందికొండ మున్సిపాలిటీ పెద్దవూర మండలం కిందే ఉండటంతో ప్రత్యేకంగా లెక్కలు తేల్చలేదు. అక్కడ పెద్దవూర మండలం, నందికొండ మున్సిపాలిటీ కలుపుకొని మొత్తంగా 6,855 ఓట్లు రద్దు కానున్నాయి. డిండి మండలంలో అత్యధికంగా గల్లంతు మండలాల పరంగా చూస్తే డిండి మండలంలో అత్యధికంగా ఓట్లు రద్దు కానున్నాయి. డిండి మండలంలో 6,200 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయలేదు. దీంతో వారు ఓట్లు రద్దు కానున్నాయి. ఇక ఆ తరువాత చింతపల్లి మండలంలో 5119 మంది ఓట్లు, కొండమల్లేపల్లిలో 4,744 మంది ఓట్లు, చందంపేటలో 4,203 మంది ఓట్లు, దామరచర్లలో 4,504 మంది ఓట్లు, నార్కట్పల్లిలో 3845 మంది ఓట్లు రద్దు కానున్నాయి.మండలాల వారీగా సర్ ఎన్యుమరేషన్ వివరాలు.. మండలం ఓటర్లు డిజిటలైజ్డ్ శాతం డిజిటలైజ్కానివారు శాతం చందంపేట 30981 26778 86.43 4203 13.57 చింతపల్లి 45727 40608 88.81 5119 11.19 గుడిపల్లి 12371 11342 91.68 1029 8.32 గుండ్లపల్లి (డిండి) 41908 35708 85.21 6200 14.79 కొండమల్లేపల్లి 29984 25240 84.18 4744 15.82 నేరెడుగొమ్ము 20383 18026 88.44 2357 11.56 పీఏపల్లి 27880 25141 90.18 2739 9.82 గుర్రంపోడు 38134 35286 92.53 2848 7.47 నిడమనూరు 35731 32969 92.27 2762 7.73 పెద్దవూర 46347 39492 85.21 6855 14.79 తిరుమలగిరిసాగర్ 34226 31981 93.44 2245 6.56 త్రిపురారం 36239 33035 91.16 3204 8.84 అడవిదేవులపల్లి 14740 13563 92.01 1177 7.99 దామరచర్ల 41029 36525 89.02 4504 10.98 మాడుగులపల్లి 30446 28509 93.63 1937 6.37 వేములపల్లి 20613 19446 94.34 1167 5.66 కనగల్ 37139 34461 92.79 2678 7.21 తిప్పర్తి 30101 27434 91.14 2667 8.86 గట్టుప్పల్ 15651 14764 94.33 887 5.67 మర్రిగూడ 30503 28492 93.41 2011 6.59 మునుగోడు 38443 35870 93.31 2573 6.69 నాంపల్లి 36748 33460 91.05 3288 8.95 కట్టంగూరు 37612 35624 94.71 1988 5.29 కేతేపల్లి 31361 28902 92.16 2459 7.84 నార్కట్పల్లి 44091 40246 91.28 3845 8.72 మున్సిపాలిటీతోపాటు ఆ పరిధిలోని మండలంలో ఎన్యుమరేషన్ వివరాలు.. మున్సిపాలిటీ ఓటర్లు డిజిటలైజ్డ్ శాతం డిజిటలైజ్ కానివారు శాతం నల్లగొండ 174912 148981 85.17 25931 14.83 మిర్యాలగూడ 148822 125315 84.20 23507 15.80 దేవరకొండ 59864 49440 82.59 10424 17.41 నకిరేకల్ 51946 46914 90.31 5032 9.69 చండూరు 35724 33720 94.39 2004 5.61 చిట్యాల 48249 44770 92.79 3479 7.21 హాలియా 36388 33254 91.39 3134 8.61ఫ మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు పట్టణాల్లోనూ నమోదు ఫ ఇప్పుడు గ్రామాల్లోనే ఓటు ఉండేలా ఎన్యుమరేషన్ ఫ జిల్లా వ్యాప్తంగా రద్దు కానున్న 1.58 లక్షలు ఓట్లు ఫ వీటిలో మున్సిపాలిటీ కేంద్రాల్లోనే అత్యధికం -
1,00,114 మంది ఓటర్లు వలస
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వని 1,58,635 మందిలో 1,00,114 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళినట్లు తేలింది. మరో 32,517 మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. 18,834 మంది ఇతర ప్రాంతాల్లో ఎన్రోల్ చేసుకోగా, 6,978 మంది అసలే ఎన్రోల్ చేసుకోలేదు. వివిధ కారణాలతో ఎన్రోల్ కాని వారు మరో 192 మంది ఉన్నారు. మరోవైపు మొత్తం ఓటర్లు 15,16,253 మందిలో 13,57,607 మంది (మ్యాపింగ్ కాని వారితో కలిపి) ఎన్యుమరేషన్ చేయించుకున్నారు. అందులో 7,75,323 మంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్రోల్ చేసుకోగా, 5,48,466 మంది సొంతంగా ఎన్రోల్ చేసుకున్నట్లు అధికారులు తేల్చారు. ఇక మ్యాపింగ్ కాని వారు మరో 33,818 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా వివరాలు ఇలా.. ● దేవరకొండ నియోజకవర్గంలో 36,815 మంది ఎన్యుమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో 7,451 మర చిన వారు, 21,313 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 7,629 మంది వేరే ప్రాంతంలో ఎనన్రోల్ చేసుకున్నారు. 395 మంది ఎన్రోల్ చేసుకోకపోగాపోగా, 27 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు. ● నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 21,314 మంది ఎన్యుమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో 3,572 మరణించిన వారు, 14,612 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,429 మంది వేరే ప్రాంతంలో ఎన్రోల్ చేసుకున్నారు. 700 మంది ఎన్రోల్ చేసుకోకపోగాపోగా, ఒక్కరు ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు. ● మిర్యాలగూడ నియోజకవర్గంలో 31,412 మంది ఎన్యుమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో 5,386 మరణించిన వారు, 20,254 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,385 మంది వేరే ప్రాంతంలో ఎన్రోల్ చేసుకున్నారు. 3371 మంది ఎన్రోల్ చేసుకోకపోగాపోగా, 16 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు. ● నల్లగొండ నియోజకవర్గంలో 31,890 మంది ఎన్యుమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో 4,745 మర ణించిన వారు, 23,221 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 2,716 మంది వేరే ప్రాంతంలో ఎన్రోల్ చేసుకున్నారు. 1,208 మంది ఎన్రోల్ చేసుకోలేదు. ● మునుగోడు నియోజకవర్గంలో17,035 మంది ఎన్యుమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో4,842 మరణించిన వారు, 9,040 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 1,731 మంది వేరే ప్రాంతంలో ఎన్రోల్ చేసుకున్నారు. 1,304 మంది ఎన్రోల్ చేసుకోకపోగాపోగా, 119 మంది ఇతర కారణాలతో దూరంగా ఉన్నారు. ● నకిరేకల్ నియోజకవర్గంలో 20,169 మంది ఎన్యూమరేషన్ చేయించుకోని వారుంటే, అందులో 6,521 మరణించిన వారు, 11,704 మంది శాశ్వతంగా వెళ్లిపోయినవారు, 1,944 మంది వేరే ప్రాంతంలో ఎన్రోల్ చేసుకున్నారు. -
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది
నార్కట్పల్లి, శాలిగౌరారం : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలనే డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు దిగిన ఆ పార్టీ నాయకులు మేడబోయిన శ్రీనివాస్, బిల్లకంటి శ్రీకాంత్, నడింపల్లి శ్రవణ్కుమార్, మునుకుంట్ల గణేశ్, పాలకూరి రమేశ్ను మంగళవారం నార్కట్పల్లి పోలీసులు దీక్షాస్థలి వద్ద అరెస్ట్ చేసి మొదటగా చిట్యాల పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి శాలిగౌరారం స్టేషన్కు తీసుకువచ్చారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న వర్షిత్రెడ్డి శాలిగౌరారం స్టేషన్కు చేరుకొని ఎస్సై బాబుతో పాటు అరెస్ట్ అయిన నాయకులతో మాట్లాడారు. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను పూచీకత్తు లేకుండా విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట వర్షిత్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందని, పోలీసులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారన్నారు. మంగళవారం సాయంత్రం నార్కట్పల్లిలో రాస్తారోకో చేసి.. దీక్ష చేస్తున్న కార్యర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి నకిరేకంటి మొగులయ్య, సూర్యాపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ జమ్ము రమేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, నాయకులు అక్కెనపల్లి సైదులు, బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి -
ఎంజీయూలో పీజీ తరగతులు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీజీ మూడవ సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 శాతం హాజరు లేని విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని, ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు విధిగా తరగతులకు హాజరు కావాలని సూచించారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా వెంకటయ్యనల్లగొండ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండకు చెందిన నిమ్మచెట్ల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ వెంకటయ్యను ఎంపిక చేసింది. ప్రస్తుతం వెంకటయ్య నల్లగొండ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 1104 యూనియన్లో ఆయన సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వెంకటయ్య 2008 నుంచి యూని యన్ బాధ్యతల్లో ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై వెంకటయ్య యూని యన్ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వెంకటయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. యాగాలు చేయడం కాదు.. వాటా కోసం పోరాడాలి మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం వర్షాల కోసం యాగాలు చేయడం కంటే.. రావాల్సిన నీటి వాటా కోసం కోసం పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను వివరించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలంలో 182టీఎంసీల నీరు చేరిందన్నారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్కు 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పంపుతున్నారని అన్నారు. అక్కడి రిజార్వాయర్లు నిండిన తర్వాతే నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తామనడం అన్యాయమన్నారు. ప్రస్తుతం సాగర్లో ఉన్న నీటిని కాల్వలకు వదలడం వల్ల భూగర్భజలా లు పెరిగి పంటలకు ఉపయోగపడుతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వానాకాలం సాగుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో మిల్లు నడవకపోతే అందులో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాదిని కోల్పోవడమే కాక బియ్యం ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. సమావేశంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశురాములు, బావండ్ల పాండు పాల్గొన్నారు. -
వరుణుడు కరుణించి రైతులు మురవాలని పూజలు
25 కిలోలు.. రూ.1900 నాణ్యమైన పాత సన్న బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,750 నుంచి రూ.1,900 వరకు పలుకుతోంది. మరింత అభివృద్ధి చేయాలి కాంగ్రెస్ పాలనలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోనాగార్జునసాగర్ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో.. సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు. 11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు విజయవిహార్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది. కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛరణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు వీక్షించేలా ఎల్ఈడీ తెరలు యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. పూజల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుందూరు జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, మందుల సామేలు, మురళీనాయక్, రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, దేవాదాయ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భవానీశంకర్ పాల్గొన్నారు. ఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు. వరుణయాగం సాగిందిలా..పెద్దవూర : వేకువజామున 4.05 గంటలకు గోపూజతో మహా వరుణయాగం ప్రారంభమైది. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్యెల్యే పద్మావతి దంపతులు యాగం ప్రారంభం నుంచి యాగ క్రతువులో పాల్గొన్నారు. 4.45 గంటలకు శాంతి మంత్ర పఠనం గావించారు. 6.30 గంటల వరకు విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచకం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, అఖండ దీపారాధనలు చేశారు. 6.30 నుంచి 9 గంటల వరకు అంకురారోహణం, చతుర్ మండల స్థాపనాలు, సర్వదాభద్ర మండల స్థాపనలు చేశారు. 11.45 గంటల వరకు అన్ని దేవాలయాల రుత్వికులతో లక్ష వరుణ జపాలు, లక్ష రుశ్యశృంగ జపం, క్షీరతర్ఫణం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేద పండితులతో చతుర్వేద పారాయణం, శాతానువాక, వారానువాక పారాయణం నిర్వహించారు. 3.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు యాగశాల వద్దకు వచ్చారు. 3.25 గంటలకు పూర్ణాహుతి సమర్పణ, హారతి. 3.46 గంటలకు యాదాద్రి దేవస్థానం సిద్దాంతి సత్యనారాయణ శర్మ ప్రసంగంతో మహా వరుణయాగం ముగిసింది. -
విశిష్ట మహిళా రత్న అవార్డుకు శివలీల ఎంపిక
కనగల్ : మండల కేంద్రానికి చెందిన మదర్థెరిసా అవార్డు గ్రహీత డాక్టర్ కంబాల శివలీల విశిష్ట మహిళారత్న బెస్ట్ సర్వీస్ అవార్డు – 2026కు ఎంపికయ్యారు. తన న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను తేజోద్భావం సేవ ట్రస్ట్ చైర్మన్ కె.గాయత్రి గుర్తించి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేశారు. ఈ అవార్డును ఆగస్టు 14వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని పెద్దకాకానిలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. అవార్డుకు ఎంపికై న కంబాల శివలీలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో శ్రీరామ్కు స్వర్ణంమిర్యాలగూడ టౌన్ : హనుమకొండలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి 12వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో దామరచర్ల మండలం బొత్తలపాలెం మోడల్ స్కూల్ విద్యార్థి ఆర్.శ్రీరామ్ ప్రతిభ కనబరిచాడు. లాంగ్ జంప్ విభాగంలో 6.55 ఫీట్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీరామ్ను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోతురాజు నరహరి, ఉపాధ్యాయులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలినాంపల్లి: కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నాంపల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సీపీఐ ప్రజాచైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వస్తోందన్నారు. సెప్టెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లిలో సీపీఐలో చేరిన పలువురికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆర్.అంజయ్యచారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, చెల్లం పాండురంగారావు, జగన్, ముదిగొండ మురళీకృష్ణ, వెంకటయ్య, పల్లె సైదులు, సత్తయ్య, నేరెళ్ల సైదులు, గిరి స్వామి, రేవెల్లి సర్పంచ్ బట్టు శ్రీను, కానుగుల మహేష్, మోగుదాల సైదమ్మ, బుషిపాక యాదయ్య, వంగూరి సాయిలు, పల్లేటి దశరథ, చెన్నోజు వెంకటాచారి పాల్గొన్నారు. రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగ విరుద్ధంనల్లగొండ టౌన్ : మతం పేరుతో దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని యూడీసీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంసన్, పెదమాము డేవిడ్రాజు అన్నారు. సోమవారం నల్లగొండలో వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆగస్టు 10వ తేదీని దళిత క్రైస్తవుల బ్లాక్ డేగా ప్రకటించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులందరికీ సమానంగా రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్రిస్టఫర్, ఆదిమల్ల ప్రభుదాస్, దుబ్బ ఎబినేజరు, రాజు, దుబ్బసి ప్రేమ్కుమార్, ఎలీషా, ప్రవీణ్, వరకుమార్, లంక ఎలీషా, దుబ్బ డేవిడ్, మద్దెల చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
1,59,280 ఓట్లు గల్లంతే!
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 13,56,973 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 89.50 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. మరో 1,59,280 ఫారాలు.. అంటే 10.50 శాతం డిజిటలైజేషన్కు నోచుకోలేదు. డిజిటలైజ్ కాని 1,59,280 ఫారాల భవితవ్యం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓట్లు తొలగిపోతాయని తెలుస్తోంది. 1,714 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పూర్తి.. జిల్లాలో మొత్తం 1,812 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 1,714 పోలింగ్ స్టేషన్లలో 100 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు మొత్తం జిల్లాస్థాయిలో 1,59,280 ఫారాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రోగ్రెస్ రిపోర్టు వెల్లడించింది. యూఈఎఫ్గా నమోదు ఇంటింటి సర్వే సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మృతి చెందినవారు లేదా అందుబాటులో లేని ఓటర్ల కారణంగా ఏయే ఇళ్లకు, వ్యక్తులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదో, ఇచ్చిన ఫారాలు తిరిగి రాలేదో.. ఆ వివరాలను ఎన్నికల యంత్రాంగం యూఈ ఎఫ్గా కింద లెక్కించింది. ఈ జాబితాలో 1,59,280 ఓట్లు ఉన్నా యి. ఈ ఓట్లకు సంబంధించిన కారణా లు తదుపరి పరిశీలనలో తేలనున్నాయి. ఫ ముగిసిన సర్ ప్రక్రియ.. ఫ 15.16 లక్షల ఓటర్లలో 13.56 లక్షల ఫారాల డిజిటలైజ్ ఫ 10.50 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పెండింగ్ జిల్లాలో సర్ ప్రక్రియ ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు డిజిటలైజ్ శాతం పెండింగ్ దేవరకొండ 2,69,098 2,32,197 86.29 36,901 నాగార్జునసాగర్ 2,34,722 2,13,407 90.92 21,315 మిర్యాలగూడ 2,40,574 2,09,003 86.88 31,571 నల్లగొండ 2,49,571 2,17,494 87.15 32,077 మునుగోడు 2,63,757 2,46,509 93.46 17,248 నకిరేకల్ 2,58,531 2,38,363 92.20 20,168 మొత్తం 15,16,253 13,56,973 89.50 1,59,280 -
యునాని.. ఎప్పుడు కూలునోనని!
మాడుగులపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ యునాని వైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనని అక్కడ వైద్యసేవలు పొందుతున్న రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిత్యం బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో గడుపుతున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని తొలగించి కొత్త భవ నం నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. పైకప్పునకు కర్రలే ఆసరా.. మాడుగులపల్లిలోని ప్రభుత్వ యునాని వైద్యశాలలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సంబంధిత వైద్య విధానంలో ఆమోదం పొందిన మందులను రోగులకు అందిస్తున్నారు. అయితే, వైద్యం అందించాల్సిన భవనం పరిస్థితే అత్యంత దయనీయంగా మారింది. ఐదు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా మిద్దె గదులతో ఈ భవనాన్ని నిర్మించారు. కాలక్రమేణా సరైన నిర్వహణ లేకపోవడంతో గోడలు, పైకప్పు బలహీనంగా మారాయి. ప్రస్తుతం భవనం పైకప్పు, గోడల నుంచి ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపడుతున్నాయి. పైకప్పు కూలకుండా అడుగడుగునా కర్రలతో ఆసరా ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు విద్యుత్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వర్షమొస్తే నరకయాతనే.. వర్షం వచ్చిన సమయంలో భవనం లోపలికి నీరు చేరుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రజలు సైతం భవ నం పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నా రు. మరోవైపు రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే.. ముందుగా సురక్షితమైన భవనం, అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి రాకముందే అధికారులు స్పందించి శిథిల భవనాన్ని వెంటనే ఖాళీ చేయించి, ప్రత్యామ్నాయంగా సురక్షితమైన భవనంలోకి ఆస్పత్రిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనలో రోగులు, వైద్య సిబ్బంది ఫ కర్రల సాయంతో నిలబడ్డ పైకప్పు ఫ మాడుగులపల్లిలో శిథిలావస్థకు చేరుకున్న భవనం -
రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరాహార దీక్ష
నార్కట్పల్లి : మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య నూకల వెంకటనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి స్పందించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని.. లేకుంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నడింపల్లి శ్రవణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మునుకుంట్ల గణేశ్, మండల ప్రధాన కార్యదర్శి బిల్లకంటి శ్రీకాంత్, పాలకూరి రమేష్, కొరివి శంకర్, పసునూరి సంపత్, తరాల శ్రీనివాస్, పాల్వాయి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అనంతరం నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, నలపరాజు సైదులు, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, కొండా అనురాధ, కొండ వెంకన్న, అద్దంకి నరసింహ, గంజి రాజేష్, కత్తుల యాదయ్య, సుంకరబోయిన వెంకన్న, సాగర్ల మల్లయ్య, నర్సిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డితో రాష్ట్రానికి అరిష్టం
హాలియా : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. వ్యవసాయానికి 18 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసగించాడని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి నెలకొందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కాశీకి వెళ్లి గంగా నదిలో పుణ్యస్నానం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ వచ్చి వరుణయాగంలో పాల్గొనాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రధాన సెంటర్లో గంటకు పైగా రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విషయం తెలుసుకున్న హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ అక్కడికి చేరుకుని భగత్తో మాట్లాడారు. విద్యుత్ సక్రమంగా అందేలా ఆ శాఖ అధికారులతో మాట్లాడతామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫ విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని హాలియాలో రాస్తారోకో -
బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలి
దేవరకొండ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమించిన బహుజన వీరుడు పండుగ సాయన్న 166వ జయంతిని జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బహుజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వర రావు, భాస్కరాచారి, వెంకటేష్, భిక్షమయ్య, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలిమర్రిగూడ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలను మరింత బలోపేతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీపుజాత, బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి హక్కుల కోసం ఐక్యంగా పోరాడేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వాటి పరిష్కారం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, బుడిజపాక జగన్, చెల్లం పాండురంగారావు, ఆకుల రఘుమయ్య, ఎరుకల నిరంజన్, జక్కలి అంజయ్య, కొట్టాల సర్పంచ్ కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, సత్యం, కొట్టం యాదయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు
నల్లగొండ : ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల నుంచి నీరు ఇచ్చే పరిస్థితి లేదని.. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్స్టోరేజ్లో ఉందని.. శ్రీశైలం నుంచి నీరు వచ్చినప్పటికీ సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదని.. అందువల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా ఉండాలన్నారు. 1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి వేయాలి జిల్లాలో పంట మార్పిడిలో భాగంగా ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేశారని తెలిపారు. దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో ఆరుతడి పంటలు వేయించాలని అధికారులను ఆదేశించారు. రెండు పంటలు వరి వేస్తే భూములు సారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటలు పండించాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు 5 వేల యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అధికారులు కోరగా, తక్షణమే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 15లోగా ఆరుతడి పంటలు వేయాలి : కలెక్టర్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 15 వరకు మాత్రమే ఆరుతడి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, మార్కెట్ చైర్మన్లు శేఖర్రెడ్డి, జూకూరి రమేష్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. శ్రీశైలం డెడ్స్టోరేజ్లో ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ నుంచి సాగునీరు అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 9 వేల ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న ఓవర్లోడ్ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన విద్యుత్ సామగ్రిని తెప్పిస్తామన్నారు. ఫ సాగర్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే.. ఫ కష్టకాలంలో రైతులకు అధికారులు అండాగా ఉండాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ఎండిన వాగు.. తేలిన మోటార్లు
పెద్దవూర : ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పెద్దవూర ‘పెద్దవాగు’ పూర్తిగా ఎండిపోయింది. నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టే ఈ వాగు.. గుర్రంపోడ్, పీఏపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోకి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ వాగు నిత్యం నీటితో కళకళలాడుతూ ఉండేది. దీంతో రైతులు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. పానగల్లు చెరువు తాగునీటి అవసరాల కోసం పదిహేను రోజులుగా ఏఎమ్మార్పీ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఈ వాగులో కొద్దిపాటి జలాలు ప్రవహించాయి. ఆ నీటిని చూసి కొందరు రైతులు మోటార్లతో వరినాట్లు వేయగా, మరికొందరు నాట్లకు సిద్ధమయ్యారు. కానీ, ప్రస్తుతం వాగు పూర్తిగా ఎండిపోయి మోటార్లు బయటకు తేలడంతో నాట్లు వేసిన పంటలు సైతం ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్టుగూడెం వంతెన వద్ద వాగు ఎండిపోవడంతో తేలిన మోటార్లు -
యాగాలతో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులు ఎందుకు?
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పెద్దవూర: యాగాలతో వర్షాలు కురిస్తే కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టడం ఎందుకని.. నెలకు రెండు యాగాలు చేస్తే సరిపోతుంది కదా అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పెద్దవూరలో నిర్వహించిన సీపీఎం నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ జలాశయంలో పేరుకుపోయిన పూడికను తీసివేస్తే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. నికర జలాలను ఎలా వాడుకోవాలో చూడాలని, యాగాలు కాదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండున్నర ఏళ్ల పాలనలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన జరిగే జైల్భరోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, ఎండీ.సలీం, కొండేటి శ్రీను, కె.ఆనంద్, మహేష్, వరలక్ష్మి, రాములు, దుబ్బ రామచంద్రయ్య, శ్రీను, కోటేష్, వెంకటయ్య, రవినాయక్, కృష్ణ, బషీర్, మల్లయ్య, శ్రీనివాస్రెడ్డి, గురువయ్య, నాగార్జున, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు కురవాలని యాగం
నాగార్జునసాగర్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులకు మేలు కోరుతూ ప్రభుత్వం వరుణయాగానికి శ్రీకారం చుట్టిందని సాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి చేపట్టే వరుణయాగం ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని.. వరుణయాగంతో వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారన్న విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. సాగర్లో ఏర్పాట్లను పరిశీలిన ఎమ్మెల్యే జైవీర్రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ -
వర్గీకరణతో మాలలకు అన్యాయం
నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు, మాల అనుబంధ కులాలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. ఎస్సీ రోస్టర్ విధానాన్ని సవరించకపోతే ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామన్నారు. నల్లగొండలోని క్లాక్టవర్ వద్ద మాలమహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు అధ్యక్షతన నిర్వహించిన మహా ధర్నాలో పిల్లి సుధాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్–3లోని మాల, అనుబంధ కులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించుకునేందుకు మాలలు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కొండబాబు, జిల్లా అధ్యక్షుడు బోగరి విజయ్, నల్లవెల్లి నల్లల కనకరాజు, మేడి అంజయ్య, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, సర్వే సార్, గోరేటి రమేష్, కట్ట వినయ్, చింతమల్ల విజయ్కుమార్, వల్లం రవి, రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, మణెమ్మ, రావుల శ్రీనివాస్, గాజుల భాస్కర్ పాల్గొన్నారు. ఫ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ -
సమస్యలపై పోరాటమే బీజేపీ లక్ష్యం
చండూరు : ప్రజా సమస్యలపై పోరాడడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి అన్నారు. శనివారం చండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను స్థానిక ఎమ్మెల్యేలు.. బీజేపీ సర్పంచ్లు, కౌన్సిలర్లకు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పనిచేయాలని లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త ప్రజాక్షేత్రంలో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అదికారంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, భూతరాజు శ్రీహరి, దోనూరి వీరారెడ్డి, కర్నాటి ధనుంజయ, కోమటి వీరేశం, బొమ్మరబోయిన రాజు, జక్కల రాజు, సోమ నరసింహ, వరికుప్పల గిరి, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ సంస్కృతికి చేనేత ప్రతీక
నల్లగొండ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో చేనేతకు శతాబ్దాల చరిత్ర ఉందని, ఇది కేవలం వ్యాపార వృత్తి మాత్రమే కాకుండా సూక్ష్మ నైపుణ్యం, ఓర్పు, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన గొప్ప కళ అన్నారు. ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్న చేయూత పింఛన్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు, నేతన్నలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సంఘం చైర్మన్ రాపోలు దత్త గణేష్, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ప్రసాద్, యాదగిరి, శ్రీనివాస్, గంజి మురళి, సత్యనారాయణ, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు. -
అధ్యాపకులు నిరంతరం నేర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : మారుతున్న విద్యారంగానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం నేర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వారం రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి, బోధనా ప్రక్రియలో సాంకేతికతను అనుసందానం చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని కోరారు. విద్యారంగంలో వేగంగా వస్తున్న మార్పులను గమనించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రశాంతి, ఢిల్లీ నుంచి ఫ్రొఫెసర్ శంకర్, ప్రొఫెసర్ అమిత్, డాక్టర్ ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీగా శ్రీనివాస్రెడ్డినల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీగా మిర్యాలగూడ బకల్వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నామి రెడ్డి శ్రీనివాస్రెడ్డిని నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి పి.సుశీందర్రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి విమల పదవికాలం ముగియడంతో శ్రీనివాస్రెడ్డిని నియమించామని, ఈయన నియామకం రెండు సంవత్సరాలు పాటు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. యూడీసీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికరామగిరి(నల్లగొండ): యునైటెడ్ దళిత క్రిస్టియన్స్ ఫెడరేషన్ (యూడీసీఎఫ్) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా డిఐ.సామ్సన్, ఉపాధ్యక్షుడిగా జేపీ సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా పి.డేవిడ్రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.ఎబినేజర్, సలహాదారుగా పి.జేమ్స్, కోశాధికారిగా ఆదిమల్ల ప్రభుదాసును, పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటంమిర్యాలగూడ : ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటినే అమలు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రాజెక్టులను పట్టించుకోకుండా అంతర్గత గొడవలతో సమయం వృథా చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈనెల 10న చేపట్టే జైల్ భరోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, వినోద్నాయక్, శశిధర్రెడ్డి, వరలక్ష్మి, మల్లు గౌతంరెడ్డి, పాండు, ఎర్రనాయక్, సైదులు, అరుణ, నాగమణి, గోవర్ధన, సైదమ్మ ఉన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
చండూరు : ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్రను శుక్రవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి.. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర విధానాల వల్ల పేద ,మధ్య తరగతి ప్రజలపైన తీవ్ర భారం పడుతోందని, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న చైతన్య యాత్రలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, మాజీ సర్పంచ్లు బోయపల్లి భిక్షమయ్య, బోయపల్లి జంగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగల వెంకటేశ్, కర్నాటి వెంకటేశం, తిప్పర్తి రాములు, జగన్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
న్యాయస్థానంలో ఆటల పోటీలు
రామగిరి (నల్లగొండ) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని (ఆగస్టు 15) పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. రోజువారీ విధినిర్వహణ, కేసుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పోటీల అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు, జడ్జి సాయి సేరణ్ తేజ్ ఇతర సిబ్బందితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సతీష్కుమార్, అశోక్కుమార్, గేమ్స్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ఐలేష్, మందడి నగేష్, జనిగల రాములు, గిరి లింగయ్యగౌడ్, కీసర శ్రీనివాస్రెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, ప్రసాద్, నవీన్, నిఖిల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
కుంటలో అడ్డగోలుగా తవ్వకం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో దర్వేశిపురం వెళ్లే దారిలో ప్రధాన రహదారి వెంట ఉన్న కుంటలో మట్టి తవ్వకం అడ్డగోలుగా సాగుతోంది. రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలు కుంట స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. మట్టి తవ్వకానికి ఇరిగేషన్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ, సదరు కాంట్రాక్టర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. కుంటలో దాదాపు 20 ఫీట్ల లోతు వరకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ముగిసిన వృత్యంతర శిక్షణ
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రభుత్వ అర్థశాస్త్ర అధ్యాపకులకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారం ముగిసింది. రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ షేక్ జానీ పాషా, డీఆర్పీ గోలి సైదులు ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుధారాణి బోధనాభ్యసన సామగ్రి, పటాల రూపకల్పనలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ శిక్షణ అధ్యాపకుల నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తుందని మాస్టర్ ట్రైనర్ షేక్ జానీ పాషా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్, ప్రిన్సిపాల్ మెరుగు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీ ఎంపిక వివాదాస్పదం!
నల్లగొండ టూటౌన్ : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేయడంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీని ఎంపిక చేయకుండా.. టెండర్ తెరిచి కొన్ని ఏజెన్సీలను తిరస్కరించిన తరువాత మళ్లీ ధ్రువపత్రాలు సమర్పించాలని 20 రోజుల పాటు గడువు పొడిగించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై సమాధానాలు చెప్పకుండా సంబంధిత అధికారులు నీళ్లు నములుతున్నారు. గడువు పొడగింపు ఉద్దేశం వెనుక వారికి అనుకూలమైన ఏజెన్సీ కోసం యూనివర్సిటీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీ అధికారుల తీరు, అక్రమాలపై కొందరు ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ఎంపిక కోసం నోటిఫికేషన్.. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేయడానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు జూన్ 18వ తేదీన టెండర్ కం నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్ వేయడానికి జూన్ 27వ చివరి గడువు.. కాగా 10 మంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వారు టెండర్లు దాఖలు చేశారు. ఆగస్టు 4వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తామని టెండర్ దాఖలు చేసిన వారికి యూనివర్సిటీ అధికారులు 3వ తేదీన సమాచారం ఇచ్చారు. మొత్తం 10 మంది టెండర్లు వేయగా అందులో ధ్రువపత్రాలు సరిగా లేవని ముగ్గురి టెండర్లను యూనివర్సిటీ అధికారులు తిరస్కరించారు. మిగిలిన ఏడుగురిలో ఆరుగురు జీఎస్టీకి సంబంధించిన పత్రం పెట్టకపోవడంతో వారికి కూడా అర్హత లేదని సంబంధిత అధికారులు తేల్చేశారు. మిగిలిన ఆ ఒక్క ఏజెన్సీకి అన్ని ధ్రువపత్రాలు ఉన్నట్లు తేల్చారు. కానీ ఆ ఏజెన్సీకి టెండర్ ఇవ్వలేదు. దీని వెనుక మంత్రాంగం నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరనే ప్రశ్నలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారిని సన్మానర్గంలో నడిపించాలన్సిన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తీరు మార్చుకోకపోతే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ అర్హత లేదని పలు టెండర్లు తిరస్కరించి.. మళ్లీ గడువు పొడిగింపు ఫ అనుకూల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం అడ్డదారులు ఫ ఎంజీ యూనివర్సిటీలో మారని అధికారుల తీరుయూనివర్సిటీ అధికారులు పెట్టిన నిబంధనలను వారే ఉల్లంఘించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్ ఓపెన్ చేసిన తరువాత ధ్రువపత్రాలు సమర్పించాలని గడువు పొడిగించడం చట్ట విరుద్ధం. నిబంధనల ప్రకారం నాకే టెండర్ ఇవ్వాలి. కొందరు అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం మంచిదికాదు. – చిక్కుళ్ల శంకరయ్య, శ్రీరామలింగేశ్వర మ్యాన్పవర్ సప్లయర్స్ -
చేనేత రంగాన్ని ఆదరించాలి
నల్లగొండ టూటౌన్ : స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రాముఖ్యత సంతరించుకున్న చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి హైదరాబాద్ రోడ్డులోని రాఘవేంద్ర కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమానికి ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని, ఆ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేలా ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ గోవిందయ్య, కర్నాటి వెంకటేశం, దుడుకు లక్ష్మీనారాయణ, గంజి మురళి, దత్తగణేష్, పి.సత్యనారాయణ, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం
రామగిరి (నల్లగొండ) : సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అదనపు డీజీపీ) సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ బెటాలియన్లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, క్రమశిక్షణ, ఆధునికీకరణ, శిక్షణ అనే నాలుగు ప్రధాన సూత్రాలతో బెటాలియన్లు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 12వ బెటాలియన్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన బెటాలియన్గా రూపుదిద్దుకోవాలన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి, వారి కోసం మెరుగైన వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. కమాండెంట్ కె.వీరయ్య ఆధ్వర్యంలో బెటాలియన్లో ఏర్పాటు చేసిన నూతన ధోబీ రూమ్, ఆధునికీకరించిన యూనిట్ హాస్పిటల్, జిమ్, ఓపెన్ జిమ్, లైబ్రరీ, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, మినరల్ వాటర్ ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే రూమ్ను ఆయన పారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, టి.సురేష్ బాబు, ఏఓ దయాకర్, మినిస్టీరియల్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ -
గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, గీతన్నల చైతన్య బస్సుయాత్ర రథసారథులు ఎంవీ.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గీత కార్మికులల ఉపాధి, సంక్షేమం.. వృత్తి ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ అమరుల యాదిలో పేరుతో చేపట్టిన గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం నకిరేకల్కు చేరుకుంది. ఆ సందర్భంగా స్థానిక మెయిన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గీత కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న గీత కార్మికుల ఎక్స్గ్రేషియా రూ.20 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ఈ యాత్రకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చౌగోని సీతారాములు, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్గౌడ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు పోటిచేటి వీరయ్య, గుడుగుంట్ల బుచ్చిరాములు, ఆ సంఘం నాయకులు ఎరుకలి అంజయ్య, దోరేపల్లి ఎల్లయ్య, అంతగి వెంకటయ్య, గుండగోని జంగయ్య, వెంకట్, నర్సింగ్ జానయ్య, పోలగాని వెంకన్న, తండు సుధాకర్, అంతటి రాములు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండకు చేరిన చైతన్య యాత్ర నల్లగొండ టౌన్ : గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం సాయంత్రం నకిరేకల్ నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆ సందర్భంగా ఆ సంఘం నాయకులు గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, వెంకటేశ్వర్లు -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి
నల్లగొండ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఈ నెలతో పాటు సెప్టెంబర్ తొలి వారంలోనూ తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణను నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో అడవి పందులు, ఇతర వన్యప్రాణుల ఇబ్బందులు తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాంజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. రాత్రి సమయంలో నిలిపే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, హెచ్చరిక లైట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించాలన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఆక్రమణలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
2028 మార్చి వరకు ఎంఎంటీఎస్ పనులు
సాక్షి, యాదాద్రి: ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పనులను 2028 మార్చి 28 నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు వెల్లడించారు. గురువారం జిల్లాలోని యాదాద్రి(రాయగిరి) రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ పథకంలో భాగంగా యాదాద్రి స్టేషన్ వద్ద కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్, రాయగిరి రైల్వే స్టేషన్లో విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంట జరిగే అదనపు ట్రాక్ నిర్మాణ పనులు నెమ్మదిగా చేస్తామన్నారు. భవిష్యత్తులో కాజీపేట వరకు ఫోర్ లేన్, ట్రాక్ పనులు కూడా చేపడతామని స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట భక్తులను దృష్టిలో ఉంచుకుని రాయగిరి వద్ద అన్ని హంగులతో యాదాద్రి స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ యాదాద్రి స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు యాదాద్రి స్టేషన్లో వర్షం నీరు స్టేషన్ రూప్ పై నుంచి చుక్కలుగా పడడం చూసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు -
వినికిడి లోపం సర్టిఫికెట్లపై వేట!
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వినికిడి వైకల్యం పేరుతో నకిలీ లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పెన్షన్లు పొందుతున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక సోషల్ ఆడిట్కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో హైరిస్క్గా గుర్తించిన లబ్ధిదారులపై వైద్యపరమైన పునఃపరిశీలన నిర్వహించి, నిజమైన అర్హులకే పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50 మందికి మళ్లీ పరీక్షలు ఈ ప్రత్యేక పరిశీలనలో భాగంగా నల్లగొండ జిల్లాలో వినికిడి లోపం ఆధారంగా దివ్యాంగ పెన్షన్ పొందుతున్న 50 మంది హైరిస్క్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వైకల్య ధ్రువీకరణ పత్రాలు, వైద్య నివేదికలు, పెన్షన్ అర్హతలను మరోసారి పరిశీలించనున్నారు. అర్హతలేని వారు వికలాంగు పెన్షన్ పొందకుండా చర్యలు తీసుకోనున్నారు. బెరా పరీక్షే తుది ఆధారం రీవెరిఫికేషన్లో భాగంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్రేయిన్స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ (బెరా) పరికరంతో వినికిడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నివేదిక ఆధారంగానే వినికిడి వైకల్యం శాతాన్ని నిర్ధారించి, దివ్యాంగ పెన్షన్కు అర్హత ఉందా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నల్లగొండతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల లబ్ధిదారులకు కూడా ఇదే కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. 31లోగా ప్రక్రియ పూర్తి జిల్లాలో ఎంపిక చేసిన 50 మంది లబ్ధిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పునఃపరీక్షలు పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా అక్రమాలను అడ్డుకుని సంక్షేమ ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిట్ చేపట్టారు. ఫ దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలను అరికట్టేలా ప్రభుత్వం నిర్ణయంఫ 50 మంది లబ్ధిదారులపై సోషల్ ఆడిట్ ఫ ఈ నెలాఖరులోగా రీవెరిఫికేషన్ పూర్తికి ఆదేశాలు -
ఎంజీయూ సెక్యూరిటీ ఆఫీసర్ పదవీ కాలం పెంపు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బేగ్ పదవీకాలం ఏడాది పాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బేగ్ 2027 జూలై 16వ తేదీ వరకు విధుల్లో కొనసాగనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి మునుగోడు : పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతాను గురువారం మునుగోడులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను, తిరిపారి వెంకటేశ్వర్లు, బి.లాలు, గోసుకొండ లింగయ్య, ఈదులకంటి కై లాష్ గౌడ్, గట్టుపల్లి నర్సిరెడ్డి, ముత్తయ్య పాల్గొన్నారు. కేంద్రమంత్రి రాజీనామా అన్ని వర్గాల విజయంచండూరు : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం చండూరులో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మృతి చెందిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో తీవ్రవాదులు ఉన్నారని అమిత్ షా అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, నాయకులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనుంజయ, ముత్తులింగం, కర్నాటి సుధాకర్, లింగయ్య, లింగస్వామి, శ్రీను, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మూసీకి 2,183 క్యూసెక్కుల వరద కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
చిరస్మరణీయులు జయశంకర్, గద్దర్
నల్లగొండ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేర్లు ప్రపంచం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. వారి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి వారి ఆకాంక్షను సాకారం చేయడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించారన్నారు. తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినప్పుడే జయశంకర్ ఆశయాలు నెరవేరినట్లవుతాయన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ఊపిరిపోశారని కొనియాడారు. సొరంగం పూర్తయితే డెడ్స్టోరేజీ నుంచీ నీరు ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రాహ్మణవెల్లెంల వరకు సాగునీరు రప్పించి నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. కరువు పరిస్థితిలో కూడా శ్రీశైలం డెడ్స్టోరేజీ నుంచి ఎస్ఎల్బీసీ ద్వారా నీరందేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్అలీ పాల్గొన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో వేర్వేరుగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, సమాచార శాఖ సహాయ సంచాలకుడు యు.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రామగిరి(నల్లగొండ) : ప్రజలు, యువత, విద్యార్థులు అందరం కలిసి మాదక ద్రవ్య సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరాలు మారేకొద్దీ పిల్లల ఆట పాటలు, వ్యసనాలు కూడా మారుతున్నాయని చెప్పారు. ఇప్పుడు మందు, సిగరెట్తో పాటు సామాజిక మాధ్యమాల వ్యసనం, డిజిటల్ వ్యసనం, డ్రగ్స్ వినియోగం పెరిగిందన్నారు. ఒకప్పుడు డబ్బున్న వారికి మాత్రమే డ్రగ్స్ అందుబాటులో ఉండేవని, ఇప్పుడు కిరాణాషాపులో కూడా దొరుకుతున్నాయని ఇందుకు వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టు పక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకొమ్మని బలవంతపెట్టినా, అమ్మినా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2047 భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ముందు డ్రగ్స్ను దూరం పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఇలాంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్ను ఆవిష్కరించారు. ఏఎస్పీ రమేష్ విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, నల్లగొండ ఇన్చార్జి రాజయోగి ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్ఓ కె.రాహుల్, జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్.మదన్మోహన్, ఎన్జీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్, మోనిక, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సుధాకర్, వెంకట్రెడ్డి, అనిల్కుమార్, కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, శిరీష పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఏఐకేఎస్ మహాసభలను జయప్రదం చేయండి
మిర్యాలగూడ : నల్లగొండలోనవంబర్ 18, 19, 20, 21 తేదీల్లో జరిగే 36వ ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్లో ఆయన ఇంటింటికి వెళ్లి మహాసభల కరపత్రాన్ని అందించి మాట్లాడారు. ఈ మహాసభలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతు ఉద్యమ నాయకులు వస్తారని, వారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చర్చించబోయే విషయాలు భవిష్యత్లో రైతు హక్కుల సాధనకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, కందుకూరి రమేష్, నాగరాజు, సైదాచారి, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయాలి
నల్లగొండ : ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎత్తిపోతల పథకాల భూసేకరణ, చెల్లింపులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పెండ్లిపాకల రిజర్వాయర్కు సంబంధించి ఎస్డీసీ యూనిట్ –1 కింద ప్రక్రియను త్వరితగతిన చేపట్టి చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులపై దృష్టి సారించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాల కింద సేకరించిన భూముల రికార్డులను అన్నిస్థాయిలో భద్రపరచాలన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిష్టారాంపల్లి, అంబాభవాని ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, స్పెషల్ కలెక్టర్ రమాదేవి, ఆర్డీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పేస్కేల్.. పోరుబాట
గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న తమకు పే స్కేల్ అమలు చేయడం ద్వారా న్యాయం చేయాలి. సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా జీవో జారీ చేయాలి. పేస్కేల్.. మా 20 ఏళ్ల ఆకాంక్ష. దాన్ని నెరవేర్చి ఆదుకోవాలి. – నర్సింహాచారి, వీబీజీ రాంజీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నల్లగొండ : గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వీబీ జీ రాంజీ (గత ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు పే స్కేల్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జూలై 27 నుంచి విధులకు హాజరవుతూనే పెన్డౌన్, కంప్యూటర్ షట్డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా శాఖకు సేవలందిస్తున్న తమకు ఇప్పటికీ పే స్కేల్ అమలు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివక్ష.. 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా వివిధ హోదాల్లో ఎంపికై న ఉపాధి హామీ ఉద్యోగులు 20 ఏళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని డీఆర్డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పే స్కేల్ అమలు చేసింది. కానీ ఉపాధి హామీ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ పే స్కేల్ వర్తింపజేయకపోవడం వివక్షకు నిదర్శనమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నెరవేరని హామీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. 2024 ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రకటన జీవో రూపంలో వెలువడకపోవడంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులు.. ఉద్యోగులు విధులకు హాజరవుతూనే పెన్డౌన్, కంప్యూటర్ షట్డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జాప్యమవుతున్నాయి. వన మహోత్సవం కార్యక్రమాల అమలు మందగించింది. జలసిరి కార్యక్రమం నిర్వహణపై కూడా సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగం తగ్గిందని అధికారులు అంటున్నారు. చర్చలపై ఆశలు.. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 6న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తే ఉద్యమం విరమించే అవకాశం ఉందని, ఒకవేళ విఫలమైతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో వీబీజీ రాంజీ ఉద్యోగులు ఇలా.. ఏపీఓలు 25 ఈసీలు 26 టీఏలు 136 సీవోలు 64 హెచ్ఆర్ మేనేజర్ 1 ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 సీడీసీఎల్ ఆర్సీలు 2 మొత్తం 255 సమ్మెలో వీబీజీ రాంజీ ఉద్యోగులు ఫ జూలై 27 నుంచి ‘పెన్డౌన్ – షట్డౌన్’ ఫ 6న కమిషనర్తో చర్చలు.. ఫ విఫలమైతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక -
6.2 మి.మీ సగటు వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 6.2 మిల్లీమీటర్లు సగటు వర్షం కురిసింది. కనగల్ 32.5 మిల్లీమీటర్లు, చండూరు 30.7, దామరచర్ల 20.7, నిడమనూరు 18.0, మునుగోడు 16.6, త్రిపురారంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షాలు పత్తి చేలకు జీవం పోసినట్లు అయ్యింది. ఆరుతడి పంటలు సాగుచేయాలికొండమల్లేపల్లి : రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ సూచించారు. మంగళవారం కొండమల్లేపల్లి కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాలని సూచించారు. అనంతరం చింతచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని పూల్సింగ్తండాలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి శేఖర్, శ్రీలక్ష్మి, రవినాయక్, జానకిరాములు రైతులు ఉన్నారు. శిక్షణతో వ్యాపార అభివృద్ధినల్లగొండ : గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి శిక్షణ వేదికగా పని చేస్తుందని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని టీటీడీసీ జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఓరియంటేషన్ అండ్ ప్లానింగ్ వర్క్షాప్లో కాయన మాట్లాడారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అమలు చేస్తున్న ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ శిక్షణపై ఆయన వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి వారు మార్కెట్లో నిలదొక్కుకునేలా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ ఎం.శ్రవణ్కుమార్, ఎం.మాధవి, సునీత, వీరయ్య, డీపీఎంలు రామలింగయ్య, శ్రీనివాస్, సోమయ్య, భాషపాక చంద్రశేఖర్, మధుసూదన్రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. 7న హైదరాబాద్లో ధర్నానల్లగొండ : హైదరాబాద్లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సుధాకర్రెడ్డి కోరారు. నల్లగొండలోని స్వాతంత్య్ర సమరయోధుల భవన్లో మంగళవారం పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. ఆరు విడతలుగా రావాల్సిన డీఏ, డీఆర్లను ఇవ్వాలని, మార్చి 2024 నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, జంగయ్య, పాండరీ, దుర్గయ్య పాల్గొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలిమాడుగులపల్లి : సహకార బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా సహకార బ్యాంక్ ఈఓ శంకర్రావు, జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ జివి.రమేష్, నాబార్డ్ డీడీఎం వినయ్కుమార్, కోఆపరేటీవ్ బ్యాంకు ప్రతినిధి కృష్ణలత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మాడుగులపల్లి, కుక్కడం గొర్రెల కాపరులు, పాడి రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాడి పరిశ్రమ అభివృద్ధి, లాభసాటి గొర్రెలు, మేకల కొనుగోలు, వాటి నిర్వహణకు అందించే రుణాలపై అవగాహన కల్పించారు. పశుగ్రాసం పెంపకం, పశువుల ఆరోగ్య సంరక్షణ, ఆధునిక పద్ధతుల అమలుతో పశుసంపదను అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉరిబండి శ్రీనివాస్యాదవ్, సైదులుయాదవ్, సర్పంచ్ అరూరి నరేష్, పశువైద్యాధికారి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లలో 12 మంది కమిషనర్లు మారారు!
నేను సోమవారమే విధుల్లో చేరారు. అవినీతి ఆరోపణల విషయం నాకేమీ తెలియదు. వస్తున్న ఫిర్యాదులపై తగు విచారణ జరిపిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తా. – కోటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్, నందికొండ నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో వరుస వివాదాలు, తరచూ కమిషనర్ల బదిలీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై వస్తున్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన ఆరేళ్ల కాలంలోనే ఏకంగా 12 మంది కమిషనర్లు మారడం ఇక్కడి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో ఆది నుంచి అక్రమాలే.. మున్సిపాలిటీ ప్రారంభ దశ నుంచే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కొందరు కౌన్సిలర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరిట భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవే తరహా అక్రమాలు పునరావృతమవుతున్నాయి. గతంలో కమిషనర్గా పనిచేసిన దండు శ్రీను, పారిశుద్ధ్య కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నిధుల్లో సుమారు రూ.12 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది ఒత్తిడితో అందులో కొంత మొత్తం తిరిగి జమ చేసినప్పటికీ, పూర్తిస్థాయి విచారణ నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకే పోస్టులో ఇద్దరు ఉద్యోగులు.. తాజాగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సైదులు కేవలం 57 రోజుల వ్యవధిలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 27న చింతలపాలెంకు చెందిన మండాది కాశయ్యకు కంప్యూటర్ ఆపరేటర్గా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నెల కూడా గడవకముందే జూలై 24న కాశయ్యను విధులనుంచి తప్పుకోవాలని మౌఖికంగా ఆదేశించి, అదే పోస్టులో అశోక్రెడ్డి అనే వ్యక్తిని కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయనే విధులు నిర్వహిస్తున్నారు. వివాదాస్పదమైన నియామకం ఈ పోస్టు వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే పోస్టులో పనిచేసిన ధనావత్ సురేష్ రూ.3 లక్షల లంచం ఇచ్చి చేరాడని, ఆయన రాజీనామా చేసే సమయంలో కాశయ్య నుంచి రూ.1 లక్ష తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాాశయ్య నియామకం వేళ.. ఆయన ఇచ్చిన రూ.లక్షతో కలిపి కమిషనర్, కొందరు స్థానిక నాయకులకు రూ.5 లక్షల వరకు ముట్టినట్లు చర్చ నడుస్తోంది. అంతలోనే కాశయ్యను తొలగించి అశోక్రెడ్డిని నియమించడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు నీళ్లు! సాధారణంగా మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్ నియామకాలను ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీ ద్వారా, కలెక్టర్ ఆమోదంతో చేపడతారు. వేతనాలు కూడా సదరు ఏజెన్సీ ద్వారానే చెల్లిస్తారు. కానీ, ఏజెన్సీ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనరే నేరుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫ ఒకే పోస్టుకు నెల రోజుల వ్యవధిలో ఇద్దరి నియామకం ఫ రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఫ బాధ్యతలు స్వీకరించిన 57 రోజులకే కమిషనర్ బదిలీనందికొండ మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జోక్యంతో కమిషనర్ సైదులను హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయానికి బదిలీ చేసినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవినీతి జరిగినట్లు ఆరోపణలు, అవుట్ సోర్సింగ్ నియామకాలు, పీఎఫ్ నిధుల దుర్వినియోగం, ఒకే పోస్టులో ఇద్దరికి ఉద్యోగం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
నిడమనూరు : వర్షాభావాన్ని ఆసరా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్కో అక్రమార్కులపై చర్యల్లో భాగంగా మరో ఇద్దరిపై వేటు పడింది. ముకుందాపురం సెక్షన్లో తుమ్మడం ఆర్టిజన్గా విధులు నిర్వహిస్తున్న మదనాచారి(రాము) జూనియర్ లైనమన్ నాగయ్య సస్పెన్షన్ చేస్తూ మిర్యాలగూడ డీఈ శ్రీనివాసచారి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టర్లపై చర్యలు ఉండేనా..! విద్యుత్ అధికారులకు అక్రమాలకు విద్యుత్ కాంట్రాక్టర్ల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిడమనూరు మండలంలో 26 మందికిపైగా కాంట్రాక్టర్లు ఉండగా.. ముగ్గురు, నలుగురికి మాత్రమే కాంట్రాక్టు పనులను ఇస్తున్నారని తెలిసింది. గతేడాది ముప్పారం వద్ద ఒక విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడి మృతికి కారణమైన లైన్మన్కు మూడు రోజులకే పోస్టింగ్ తెచ్చుకున్నారని.. ఇలా కాంట్రాక్టర్ల జోక్యంపై కూడా చర్యల తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రుద్రమదేవి శిలాశాసనం సందర్శననకిరేకల్ : మండలంలోని చందుపట్లలో రుద్రమదేవి విగ్రహం పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక వివేకానంద యువజన మండలి సభ్యులు వినతి మేరకు రాణి రుద్రమదేవి శిలా శాసనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సివిల్ ఇంజనీర్ శివం కంబోజ్, డిప్యూటీ మేనేజర్ ఆళ్ల కృష్ణరావు, సీనియర్ అసోసియేట్ గోశిక సాయికుమార్ సోమవారం సందర్శించారు. అధికారుల బృందం సోమవారం సందర్శించింది. శాసనంతో పాటు విగ్రహన్ని పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. వారి వెంట సర్పంచ్ లతావెంకటాచారి, కోటేష్, శంకర్ తదితరులు ఉన్నారు. -
భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంతోపాటు ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకుని న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాలకు చెందిన వైటీపీఎస్ భూబాధిత కుటుంబాలు సోమవారం ప్లాంట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. భూబాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, 270 మంది గిరిజన రైతు కుటుంబాలు ఉపాధి అవకాశాలు వస్తాయనే ఆశతో తమ పంట పొలాలను ప్లాంట్కు ఇచ్చారని తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వినోద్నాయక్, దయానంద్, పాపానాయక్, జానకిరాంరెడ్డి, భూబాధితులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
క్యాష్ లెస్.. పేపర్ లెస్..
నీలగిరి కార్పొరేషన్లో సేవలు ఇక సులభతరంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో క్యాష్లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేసేందుకు కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు తదితర వాటిని పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఏ ఒక్క సెక్షన్లో కూడా నగదు రూపంలో డబ్బులు తీసుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించడంతో పూర్తిస్థాయిలో డిజిటల్ లావాదేవీలు అమలు చేస్తున్నారు. సీఎస్సీతో పెరగనున్న జవాబుదారీతనం.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇక నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి అధికారుల కోసం తిరగకుండా సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) తీసుకువచ్చారు. దీనిని అమలు చేయడం ద్వారా అధికారులు, సిబ్బందిలో జవాబు దారీతనం పెరగనుంది. నగర ప్రజలు భవన అనుమతులు, వీధి దీపాలు, రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సమస్య తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు నేరుకు ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు విభాగాల్లో దరఖాస్తులు ఇస్తూ వచ్చారు. ఇక నుంచి సిటిజన్ సర్వీస్ సెంటర్లో ఫిర్యాదు ఇస్తే.. అక్కడ వెంటనే ఆన్లైన్ చేసి సంబంధిత విభాగాల వారికి పంపాల్సి ఉంటుంది. ఆ సమస్యను సంబంధిత సెక్షన్ అధికారి పరిష్కరించి సీఎస్సీ లాగిన్కు పంపుతారు. దీనిని సీఎస్సీ నిర్వాహకుడు ఫిర్యాదుదారుడి సెల్కు మెసేజ్ వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు తిరగకుండా జనం ఒక్కచోట ఫిర్యాదు చేస్తే చాలు సమస్యకు పరిష్కారం చూపుతారు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేమో వివరంగా ఫిర్యాదుదారుడికి రాత పూర్వకంగా తెలియజేస్తారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో క్యాష్ లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేయడం ద్వారా నగర ప్రజలకు పారదర్శకమైన సేవలు అందనున్నాయి. చిల్లర సమస్యకు చెక్ నగదు రూపంలో పన్నులు వసూలు చేయడం ద్వారా కొన్ని సార్లు మున్సిపల్ సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది వచ్చినప్పుడు నోట్లను సరిగా లెక్కించకపోవడం, ఒక్కోసారి తక్కువ డబ్బు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో సిబ్బంది జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పడనుంది. చిల్లర సమస్యకు సైతం ఇబ్బంది లేకుండా పోతుంది. ఫ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం ఫ ప్రతీ ఫిర్యాదు ఆన్లైన్ -
తగ్గిన వరి.. పుంజుకున్న పత్తి
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా పడిపోగా, పత్తి పంట మాత్రం కొంత ఊరటనిచ్చే స్థాయిలో ముందుకు సాగుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జూన్లో కురిసిన చినుకులతో రైతులు ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. అయితే, జూలై నెల మొత్తం తీవ్ర లోటు వర్షపాతం నమోదు కావడంతో వరి నాట్లు ముందుకు సాగలేదు. భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు తగ్గడం, నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల లేకపోవడం వరి సాగును దెబ్బతీసింది. వరి సాగు డీలా.. పత్తికే మొగ్గు! వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ సీజన్లో మొత్తం 12 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో వరి 5,46,165, పత్తి 6,47,689 ఎకరాల్లో సాగవుతుందని భావించారు. కానీ ఎల్నినో ప్రభావం, ఎండల వల్ల పరిస్థితి మారింది. ఇటీవల కురిసిన అడపాదడపా చిరుజల్లులతో ప్రస్తుతం 3,15,182 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడిని తట్టుకునే పత్తి పంటను రైతులు ఎక్కువగా ఆశ్రయించారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 5,97,677 ఎకరాలకు చేరుకుని అంచనాలకు దగ్గర్లో నిలిచింది. కంది, పెసర, మినుము పంటలతో కలిపి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 9,27,855 ఎకరాల్లో సాగు నమోదైంది. జిల్లా అంతటా వేసిన పత్తి చేలు ఇటీవల కురిసిన చిరుజల్లులకు మంచిగా పెరుగుతున్నాయి. నెలలో రెండుమూడు వర్షాలు కరిస్తే పత్తికి డోకా ఉండదు. రైతులకు అశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నీటి లభ్యత లేని రైతులు అరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలు. ఉల్లోజు వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఫ వర్షాభావంతో తలకిందులైన వానాకాలం సాగు అంచనాలు ఫ ఎండిపోతున్న బోర్లు.. ప్రాజెక్టుల నుంచి రాని సాగునీరు ఫ పత్తికి ప్రాణం పోసిన చిరుజల్లులు -
ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలవద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రీవెన్స్లో రెవెన్యూ శాఖకు 81, ఇతర అధికారులకు 57.. మొత్తం 138 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వివిద శాఖల అధికారులతో సమీక్షించార. మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలన తనిఖీ చేసిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
6 నుంచి ప్రజా చైతన్య యాత్రలు
నల్లగొండ టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లందుకుకల్పించేందుకు సీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నిర్ణిత గడువులోగా వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు ఉజ్జిని రత్నాకర్రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, నల్పరాజు రామలింగయ్య, పల్లా దేవేందర్రెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, అంజాచారి, బంటు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
5 నుంచి బీటెక్ తరగతులు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం, పీజీ మూడో సెమిస్టర్ తరగతులు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు శాతం నియమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరు కావాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన అంశాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది బాధితులు వినతులు అందజేశారు. సంబంధిత పోలీస్ అధికారులు ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని వివిధ విభాగాల్లో 2024–25, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్డీ నోటిఫికేషన్ను అడ్మిషన్స్ డైరెక్టర్ ఆకుల రవి సోమవారం విడుదల చేశారు. కామర్స్లో 1, ఇంజనీరింగ్, టెక్నాలజీలో 13, బిజినెస్ మేనేజ్మెంట్లో 18, బయో కెమిస్ట్రీలో 5, కెమిస్టీలో 31, మ్యాథ్స్లో 8, ఎకనామిక్స్లో 6, ఇంగ్లిష్లో 2 భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఎంజీ యూనివర్సిటీలో సంప్రదించాలని సూచించారు. ప్రొఫెసర్ బెల్లి యాదయ్యకు సన్మానంనకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫసర్ డాక్టర్ బెల్లి యాదయ్యను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నాగు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి బెల్లి యాదయ్య అంచలంచెలుగా ఎదిగారని చెప్పారు. కార్యక్రమంలో ప్రవీణ్రెడ్డి, జి.శ్రీనివాస్, హరిత, ఉపేందర్, రవీందర్, ఉదయ్కుమార్, సుభాషిణి, వెంకన్న, సుదర్శన్, వెంకట్రెడ్డి, కార్తిక్ పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్లునకిరేకల్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించిందని మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకు వెంకటనారాయణ తెలిపారు. నకిరేకల్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.23 కోట్లు కేటాయించడం ద్వారా మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. ఈ నిధులు మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి ప్రత్యేక చొరవతోనే సీఎం రేవంత్రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి, సాదుల నర్సయ్య, సూర శంకర్, మాదాసు చంద్రశేఖర్, వెంకన్న, లక్ష్మీవెంకటయ్య, అజయ్కుమార్, వీరయ్య, కోట్ల సైదులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం
పామాయిల్ క్రషింగ్ యూనిట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇతర నిర్మాణ పనులన్నింటినీ మిషనరీ బిగింపు పనులన్నింటినీ త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చి నుంచి పామాయిల్ క్రషింగ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనివల్ల పామాయిల్ తోటలు ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. – యాదగిరి, డీజీఎం ప్లాంటేషన్ తెలంగాణ యూనిట్ నల్లగొండ అగ్రికల్చర్: అనుముల మండలం యాచారం గ్రామంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయిల్ పామ్ క్రషింగ్ యూనిట్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు. రైతులకు తప్పనున్న కష్టాలు.. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగవుతుండగా, ప్రస్తుతం అవి కాపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంత రైతులు తమ పామాయిల్ గెలలను విజయవాడ సమీపంలోని అంబాపురం ఫ్యాక్టరీకి తరలించి విక్రయించాల్సి వచ్చేది. యాచారంలో ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతుల రవాణా వ్యయం, కష్టాలు తప్పుతాయి. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. భూముల ధరల కారణంగా కొంత జాప్యం జరిగింది. అయితే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పతంజలి సంస్థపై ఒత్తిడి తీసుకురావడంతో రెండు నెలల క్రితం పనులు తిరిగి ఊపందుకున్నాయి. పాసెసింగ్ యంత్రాలు వచ్చాయి వచ్చే ఏడాది మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెసింగ్ ప్రారంభించాలని కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం గల ఈ యూనిట్ సివిల్ పనులను సంస్థ ముమ్మరం చేసింది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రాసెసింగ్కు సంబంధించిన యంత్రాలు సైట్కు చేరుకున్నాయి. త్వరలోనే మిషనరీ బిగింపు పనులు చేపట్టనున్నారు. టన్ను ధర రూ. 23,700 ప్రస్తుతం మార్కెట్లో పామాయిల్ గెలకు టన్నుకు రూ.23,700 వరకు పలుకుతోంది. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పామాయిల్ తోటల నుంచి దాదాపు పదివేల టన్నుల దిగుబడి వస్తోందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఐదు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని జిల్లా ఉద్యానవన శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వ రాయితీలు అందించడం, స్థానికంగానే ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుండటంతో రైతులు సైతం ఈ సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఈ క్రషింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయితే యాచారం, పరిసర గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సన్నద్ధమవుతోంది. కొనసాగుతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రాసెసింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిఫ రూ.100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల్లో ఏర్పాటు ఫ గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఫ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి.. ఫ పామాయిల్ రైతులకు తప్పనున్న రవాణా కష్టాలు -
నిజమైన సే్నహితులు కరువయ్యారా..!
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా చిలుకూరు గ్రామ పరిధిలో బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతిచెందారు. దోస్త్.. మేరా దోస్త్ఐదుగురి అరెస్టు చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ తెలిపారు.- 8లోఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి నెట్వర్క్: రక్తసంబంధం కాకపోయినా.. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే ఆత్మబంధువే స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహానికి హద్దులుండవు. అవసరమైనప్పుడు ముందుడి నడిపించడమే కాకుండా వెనకుండి వెన్నుతట్టి నడిపించేవాడే స్నేహితుడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ హితుడు తప్పకుండా ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్నేహితుడి ప్రాధ్యాతను గుర్తిస్తూ.. ఆ బంధాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఐదు ముఖ్యపట్టణాల్లో వివిధ వయస్సులున్న 200 మంది అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. దీనిలో పలు ఆసక్తికలిగిన అంశాలు వెలుగు చూశాయి. స్నేహితుల దినోత్సవ సాక్షిగా నేడు నిజమైన స్నేహితులు కువయ్యారనే అభిప్రాయం కాస్తా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల ఎంపికలో డబ్బుకు, చదువుకన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనించదగ్గవ విషయం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో స్నేహితులతో గడిపే సమయం తక్కువైందని సాయంత్రం కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే స్నేహితులు కనుమరగయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 1. నేటి రోజుల్లో నిజమైన స్నేహితులున్నారని మీరు భావిస్తున్నారా? 2. స్నేహితుల ఎంపికలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు..? 61 వ్యక్తిత్వానికిలేరుఅవును 903. స్నేహితుల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారా? 49ఫ స్నేహితుల ఎంపికలో వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఫ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కలుసుకోవడం తక్కువే.. ఫ ‘సాక్షి’ సర్వేలో వెల్లడి చదువుకు -
న్యాయమూర్తి చొరవతో వితంతువుకు పింఛన్
దేవరకొండ : దేవరకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి అనిత చొరవతో ఓ నిరుపేద వితంతువుకు ఎట్టకేలకు పింఛన్ మంజూరైంది. పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన దంపతులు పోలగోని అచ్చమ్మ, కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. అచ్చమ్మ భర్త ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అచ్చమ్మ పేరిట ఎలాంటి భూమి లేదు. వితంతు పింఛన్ కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో గతేడాది ఆమె దేవరకొండ కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. దరఖాస్తును పరిశీలించిన న్యాయమూర్తి అనిత.. ఆమెను అర్హురాలిగా గుర్తించి, పింఛన్ మంజూరు చేయాలని పీఏపల్లి ఎంపీడీఓ ద్వారా కలెక్టర్కు ప్రత్యేక సిఫార్సు (స్పెషల్ రిక్వెస్ట్) చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అచ్చమ్మకు పెన్షన్ మంజూరు చేశారు. శనివారం దేవరకొండ కోర్టు ఆవరణలో అచ్చమ్మకు పోస్టాఫీస్ పింఛన్ బుక్ను జడ్జి అందజేశారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని జడ్జి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీఎస్ హరీష్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి ఉమామహేష్, వనం జగదీష్, న్యాయవాదులు శ్రీనివాస్రెడ్డి, అశోక్గౌడ్, రమేష్, రియాజుద్దీన్, రాములు, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
మర్రిగూడ: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ఘటన మర్రిగూడ మండలంలోని ఖుదాబాక్షపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంత మల్లేష్ పంచాయతీ కార్యదర్శి ప్రసన్నబాబు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి గ్రామ కంఠానికి చెందిన 188 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి ప్రసన్నబాబు తన సంతకం ఫోర్జరీ చేయడంపై శనివారం మర్రిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. సర్వేకు సహకరించాలి మునుగోడు: ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు చేపట్టిన భూ రీసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో చేపడుతున్న రీసర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై రీసర్వేతో కలిగే లాభాలను వివరించారు. రీసర్వే తో ప్రతి రైతు భూమికి హద్దులు పక్కాగా నిర్ణయించబడతాయన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైతే కొనేళ్ల కాలంగా కబ్జా కలిగి సాగుచేసుకుంటున్నారో వారికే హక్కులు దక్కుతాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తికి పక్కాగా హద్దులు నిర్ణయించబడతాయన్నారు. సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, ఆర్ఐ వంశీప్రసాద్, సర్వేయర్ అరుణజ్యోతి, జీపీఓ లింగయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మరమ్మతులు చేపట్టాలి డిండి: మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–1 లో పెచ్చులూడిన ప్రదేశమంతా వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పనులు పూర్తయ్యేంత వరకు విద్యార్థులను ఇతర భవనానికి మార్చాలని జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి శనివారం దేవరకొండ సీడీపీఓకు ఆదేశాలు జారీ చేశారు. ‘శిథిల భవనం.. భయం భయం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా సంక్షేమ అధికారులు స్పందించారు. డిండిలోని అంగన్వాడీ కేంద్రం – 1 భవనానికి మరమ్మతులు చేపట్టడంతోపాటు దర్గా బజారులో అద్దె భవనంలో కొనసాగుతున్న మరో అంగన్వాడీ కేంద్ర నూతన భవన ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఇంజనీర్తో సమన్యయం చేసుకుని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మూసీకి 1203 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం ఎగువ నుంచి మూసీకి 1203 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు వెయ్యి క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో రావడం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. శనివారం సాయంత్రం నీటిమట్టం 638.30 అడుగులకు చేరుకుంది. పంటల సాగు కోసం మూసీ కుడి, ఎడమ కాల్వకు 325 క్యూసెక్కుల చొప్పున మొత్తం 650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.84 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
ఉపయోగపడని ఆక్సిజన్ ప్లాంట్
దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో సగటున రోజకు 600 వందల మంది రాగా, జూలైలో ఏడెనిమిది వందలు పెరిగింది. కరోనా సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ వినియోగంలో లేకుండాపోయింది. ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రకాల ఇంక్షన్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదని రోగులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రిలోనూ రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో 5825 మంది రోగులు ఆసుపత్రికి రాగా, జూలైలో 6826 మంది ఆసుపత్రికి వచ్చారు. -
రెండేళ్లలో ‘ఎస్ఎల్బీసీ’ పూర్తిచేస్తాం
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తిప్పర్తి: రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం పనులు పూర్తి చేసి, జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం తిప్పర్తి మండలంలోని పజ్జూరు, యర్రగడ్డలగూడెం, వెంకటాద్రిపాలెం, ఇండ్లూరు, మామిడాల, గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పజ్జూరు గ్రామంలో రూ.30కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యర్రగడ్డలగూడెంలో విద్యుత్, డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో రూ.3కోట్లతో సబ్స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు. బోర్లు వేయిస్తామని, డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వెంకటాద్రిపాలెంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇండ్లూరులో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మామిడాలలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్కర ణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ గిరిధర్, ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్, ఈఈ శ్రీధర్రెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. కలసికట్టుగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి రామగిరి (నల్లగొండ): కలసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం పావురాలగూడెంలో రూ.1.35 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చిన్న సూరారం మహిళా సంఘాలకు రూ.3 కోట్లు, పెద్ద సూరారానికి రూ. 2.5 కోట్లు, చందనపల్లి సంఘాలకు రూ. 1.5 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్న సూరారం – పెద్ద సూరారం గ్రామాల మధ్య గోదాం లేదా రైస్ మిల్లు నిర్మాణం కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పావురాలగూడెంలో చౌకధరల దుకాణాన్ని మంజూరు చేస్తూ, తక్షణమే డీలర్ను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ పాల్గొన్నారు. -
మిర్యాలగూడ ఆస్పత్రిలో సమస్యలెన్నో..
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి గతంలో 250 నుంచి 300 వచ్చే రోగుల సంఖ్య ప్రస్తుతం 400కు పైగా చేరింది. వైద్యులు సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన కొందరు వైద్యులు 12గంటలు కూడా కాకముందే బయట ఉన్న తమ ప్రైవేటు క్ల్టినిక్లకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో 20 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏరియా ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం లేదు. ఆస్పత్రిలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉంది. ఓపీ సమీపంలో ఉండే వాష్రూంలో దుర్గంధం వెదజల్లుతోంది. రోగులకు వడ్డించే అన్నం మొనూ ప్రకారం ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. నాకు జ్వరం, జలుబు ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందేమో చూసేందుకు ఎక్స్రే తీయించాలని చెప్పారు. కానీ, ఆసుపత్రిలో ఎక్స్ రే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక బయట ప్రైవేట్ ల్యాబ్లోనే డబ్బులు పెట్టి తీయించుకోవాల్సి వచ్చింది. – కోరె లక్ష్మమ్మ, కత్తాల్గూడ, నల్లగొండ -
మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
దేవరకొండ : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం కొండభీమనపల్లి రైతువేదికలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాల రికార్డులు, లెక్కలను ప్రతి నెలా అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. సభ్యులు తీసుకున్న రుణాల రికవరీ, బ్యాంకు లింకేజీల చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రగతి వివరాలను ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేయాలని, సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రావణ్, ఆర్ఎం శ్రీలేఖ, డీపీఎంలు రామలింగయ్య, మోహన్రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు. -
ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ : చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు ముద్ర రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ముద్ర పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగతంగా, సంఘాలుగా లేదా క్లస్టర్ల రూపంలో కూడా ఈ రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేనేత కళాకారుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చండూరు మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం చేనేత రంగ సమస్యలను కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, చేనేత సహాయ సంచాలకుడు గోవిందయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
రక్తశుద్ధికి యాతన
అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని డయాలసిస్ పడకలునల్లగొండ టౌన్ : మారుతున్న జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కోసం రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగుల సంఖ్య పెరగడంతో అవి సరిపోవడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ చేస్తున్నా.. కొందరు వెయిటింగ్లోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. 726 మంది రోగులకు నాలుగు షిఫ్టుల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కొందరికి ప్రతి రోజూ, మరికొందరికి రెండు మూడు రోజులకు, ఇంకొందరికి వారంలో రెండు సార్లు, వారానికి ఒక సారి చొప్పున డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది రోగులు డయాలసిస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఆ కేంద్రంలో ప్రస్తుతం డయాలసిస్ పొందే రోగి చనిపోతేనే వెయిటింగ్లో ఉన్న వారికి డయాలసిస్ చేసే పరిస్థితి ఉంది. వెయిటింగ్ లేకుండా డయాలసిస్ చేయాలంటే ఆయా కేంద్రాల్లో పడకల స్థాయిని, మిషన్లను పెంచాల్సిందే. ఆర్థికంగా భారం మూత్రపిండాలు చెడిపోయిన వారికి తప్పని సరిగా డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ది చేయాల్సి ఉంటుంది. కానీ డిమాండ్ మేరకు పడకలు లేని కారణంగా డయాలసిస్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి చేయించుకుంటున్నారు. దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం రోగుల డిమాండ్కు తగ్గట్టుగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.డయాలసిస్ కేంద్రాల సేవలు ఇలా.. ఆస్పత్రి పడకలు రోగులు వెయిటింగ్ జీజీహెచ్ 15 135 0 దేవరకొండ 5 50 10 మిర్యాలగూడ 10 92 0 నాగార్జునసాగర్ 5 40 0 మర్రిగూడ 5 30 0 సూర్యాపేట 7 60 0 హుజూర్నగర్ 9 80 0 కోదాడ 5 52 10 చౌటుప్పల్ 5 50 0 భువనగిరి 8 90 0 రామన్నపేట 5 47 0 ఫ పెరుగుతున్న రోగుల సంఖ్య ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ద్వారా డయాలసిస్ ఉమ్మడి జిల్లాలో ఉన్న డయాలసిస్ కేంద్రాల ద్వారా 24 గంటలు పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నాం. ఎక్కడా రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని సేవలను అందజేస్తున్నాం. – మహ్మద్ అఖిల్, డయాలసిస్ కేంద్రాల ఉమ్మడి జిల్లా మేనేజర్ -
నేడు, రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి ప్రజలను కలుస్తారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులతో సమీక్షించనున్నారు. శాఖాపురంలో వైద్యశిబిరంనిడమనూరు : మండలంలో శాఖాపురంలో అధికారులు శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది జ్వర పీడితులు వైద్యం పొందారు. 17 మందికి సాదారణ రక్త పరీక్షలు నిర్వహించి, అనుమానిత 3 రక్త నమూనాలను నల్లగొండ ల్యాబ్కు పంపించారు. 150 ఇళ్లలో ఆశ కార్యకర్తలు జ్వర సర్వే చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిలని డీఎల్పీఓ రాఘవరావును డీపీఓ ఆదేశించారు. శనివారం డీఎల్పీఓ గ్రామంలో పర్యటించి మురుగు కాల్వల పూడికతీత, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదులు, సర్పంచ్ చేకూరి సూర్యానారాయణ స్థానికులు ఉన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వాలు విఫలండిండి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర మహాసభలో ఉపాధి, విద్య, వైద్యం, యువత హక్కులపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెపాపరు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎనమల, బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, కనకాచారి, శైలేష్, ప్రేమ్కుమార్ వినయ్, కళ్యాణ్ పాల్గొన్నారు. పోస్టాఫీస్ల ద్వారా మెరుగైన సేవలు చిట్యాల : తపాల శాఖలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు వేగవంతమైన సేవలను అందించాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్(సీపీఎంజీ) డీఎస్వీఆర్.మూర్తి సూచించారు. చిట్యాల పోస్టాఫీస్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్మాస్టర్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు చేరవేసేలా బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు పనిచేయాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అందుగుల మల్లయ్య నామినీ అందుగుల రోహిణమ్మకు తపాల శాఖ ద్వారా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ పోస్టాఫీసుల సూపరిండెండెంట్ నరేంద్రబాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ జేనేద్రకాంత్, సునిల్కుమార్, రాజశేఖర్, రమేష్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగింది నల్లగొండ : ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడం, జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయానికి రోజుకు 14 నుంచి 16 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పెద్దఎత్తున కొత్త బోరు బావులు తవ్వడంతో విద్యుత్ లైన్లపై అదనపు లోడ్ పడుతోందని.. అక్కడక్కడా తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖ పరంగా ఎలాంటి తప్పిదం, నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. -
మూసీకి 965 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండడంతో మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ఏడాది జూలై మాసంలో మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 642 (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) అడుగులకు చేరడంతో అధికారులు ఆయకట్టులో పంటల సాగుకు 20 రోజుల కిత్రం నీటిని విడుదల చేశారు. అయితే నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేకపోవడంతో పాటు, కాల్వలకు నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం 638 అడుగులకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మూసీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 324 క్యూసెక్కుల చొప్పున మొత్తం 648 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 2.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యూరియా అమ్మలేం
గట్టుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లు యూరియా బుకింగ్ నిలిపేశాయి. పీఏసీఎస్లకు యూరియా రవాణా చార్జీల చెల్లింపు నిలిపివేస్తున్నట్లు తాజాగా (జూలై 14న) మార్క్ఫెడ్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంతో పీఏసీఎస్లకు నష్టం వస్తుందని.. యూరియా అమ్మలేమని పదిరోజులుగా జిల్లా వ్యాప్తంగా 43 పీఏసీఎస్లు బుకింగ్ నిలిపి వేశాయి. 14న మార్కెఫెడ్ నుంచి ఉత్తర్వులు యూరియా దిగుమతికి అవసరమైన రవాణా చార్జీలను ఇప్పటి వరకు మార్క్ఫెడ్ చెల్లిస్తోంది. యూరియా దిగుమతి రవాణా చార్జీలను మీరే భరించాలని జూలై 14న మార్క్ఫెడ్ నుంచి సహకార సంఘాలకు ఉత్తర్వులు అందాయి. రవాణా చార్జీలు భరించి మార్క్ఫెడ్ నుంచి యూరియా తీసుకుని ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రూ.లక్షల్లో వచ్చే నష్టం మేం భరించలేమని సహకార సంఘాల సీఈఓలు అంటున్నారు. ఇప్పటికే చండూరు, మర్రిగూడెం, మునుగోడు ప్రాంతాలకు చెందిన సహకార సంఘాలు యూరియా బుకింగ్ బంద్ చేశాయి. రైతులకు ఇబ్బందులు రెండు, మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతోరైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి చేలలో గుంటకలు తోలుకుని.. యూరియా పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా.. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పంటలకు సమయానికి యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.ఫ పీఏసీఎస్లపై రవాణా చార్జీల భారం మోపిన మార్క్ఫెడ్ ఫ నష్టపోతామంటున్న సీఈఓలు ఫ యూరియా బుకింగ్ నిలిపివేసిన సొసైటీలు మార్క్ఫెడ్ నుంచి యూరియా బస్తా రూ.252.43(కంపెనీల బట్టీ ఎక్కువ, తగ్గుదల)కు లభ్యమవుతుంది. రవాణా చార్జీలను మార్క్ఫెడ్ భరిస్తుంది. దీంతో పీఏసీఎస్లు రైతులకు (ఎమ్మార్పీకి) రూ.267కు విక్రయిస్తున్నాయి. ఇందులో లారీ నుంచి యూరియా (450 బస్తాలు) దిగుమతికి హమాలీ చార్జీ(బస్తాకు రూ.10 చొప్పున)4,500 ఖర్చవుతాయి. లారీ యూరియా రూ.267కు విక్రయిస్తే పీఏసీఎస్కు రూ.2,056.50 మిగులుతాయి. ప్రస్తుతం రవాణా చార్జీలు రద్దుతో మార్క్ఫెడ్ నుంచి సహకార సంఘాలకు యూరియా దిగుమతి చేసినందుకుగాను లారీ ట్రాన్స్ఫోర్ట్ చార్జీ రూ.20 వేలు (దూరాన్ని బట్టి మారుతుంది) అంటే ప్రతి లారీ యూరియా ఎమ్మార్పీకి అమ్మితే పీఏసీఎస్లకు రూ.17,943.50 నష్టం వస్తుంది. -
శిథిల భవనం.. భయం భయం
డిండి : మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గ్రామాల్లో అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిండి మండలంలో మొత్తం 73 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 32 కేంద్రాలు సొంత భవనాల్లో.. 14 కేంద్రాలు అద్దెలో, మరో 27 కేంద్రాలు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మొత్తం 1,303 మంది పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్వాడీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిండిలోని ఎంఆర్సీ భవనం సమీపంలో అంగన్వాడీ భవనం పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా పూర్తి కాలేదు. సింగరాజుపల్లిలో మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. శిథిల భవనాల్లో నడిచే కేంద్రాల్లో సిబ్బంది భయం భయంగా గడుపుతున్నారు. -
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
అద్దె భవనాల్లో, శిథి లావస్థకు చేరిన ఇళ్లలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. – చంద్రకళ, సీడీపీఓ, దేవరకొండ డిండిలోని ఎంఆర్సీ భవనం సమీపంలో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు దాటింది. ఇంకా పూర్తి కాలేదు. అధి కారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – సత్యవాణి, అంగన్వాడీ టీచర్, డిండి -
ఆ ఊర్లకు 25 ఏళ్లకు బస్సొచ్చింది
హాలియా: అనుముల మండలంలోని ఐదు గ్రా మాలకు గురువారం ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. మండలంలోని హజారిగూడెం, నాయుడుపాలెం, చల్మారెడ్డిగూడెం, కొట్టాల, సూరేపల్లి గ్రామాలకు 25 ఏళ్ల క్రితం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అనంతరం నుంచి బస్సు రావడం లేదు. దీంతో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పలు గ్రామాల సర్పంచ్లు సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి దేవరకొండ బస్ డిపో మేనేజర్ విజయకుమార్తో మాట్లాడడంతో సూరేపల్లి నుంచి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ గ్రామాలకు బస్సు రావడంతో ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అనుముల మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ యాదవ్, డిపో మేనేజర్ విజయకుమార్, నాయకులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
గోరింటా పండిందిఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్: బెంగళూరులో ఆగస్టు 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు కోరారు. గురువారం నల్ల గొండలో మహా సభల పోస్టర్ ఆవిష్కరించి మా ట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం మనుమ య సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొల్లేటి రమేష్, గుంటోజు వెంకటాచారిని సన్మానించారు. కార్యక్రమంలో కాసోజు విశ్వనాథం, కంది సూర్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్, చిక్కుళ్ల రాములు, నకిరేకంటి కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, జెల్లా ఆదినారాయణ, కె.సత్యనారాయణ, కాసోజు శంకరాచారి, జంగాచారి, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.‘సర్’ను పకడ్బందీగా చేపట్టాలిఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మిర్యాలగూడ : మూడు రోజులే గడువు ఉన్నందున ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, నల్లగొండ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్చార్జి బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సర్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్నేత, కే.శ్రీనివాస్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇన్చార్జి షబ్బీర్అలీ, నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. అర్హులంతా ఓటు హక్కు పొందాలి దేవరకొండ: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, పార్లమెంట్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం దేవరకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సర్పై డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్తో కలిసి కాంగ్రెస్ శ్రేణులకు నిర్వహించిన సమావేశంలో వారు మాట్ల్లాడారు. సమావేశంలో మార్కెట్ చైర్పర్సన్ జమునమాధవరెడ్డి, ఎంఏ సిరాజ్ఖాన్, పున్న శైలజ వెంకటేష్, వెంకటయ్య, వేణుధర్రెడ్డి, సర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.నల్లగొండ: భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారంహైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్ రూమ్లో సమాచారం అందించేందుకు ఫోన్ నంబర్ 18004251442ను అందుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి, డీఆర్ఓఆర్ దశరథ, సీపీఓ శ్రీనివాస్ నాయక్, డీఏఓ వినోద్ కుమార్, ఉద్యానశాఖ అధికారి టి.శేఖర్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు నిడమనూరు : ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటల సాగు మేలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. గురువారం ఆయన నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో కంది పంట సాగు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను కలెక్టర్ విన్నవించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు భూ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్, ఏడీఏ సరిత, వ్యవసాయాధికారి మునికృష్ణయ్య, ఏఈ కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
తేలనున్న ట్రేడ్స్ లైసెన్స్ లెక్క
ఫ నగరంలో భారీగా పెరిగిన వ్యాపార సముదాయాలు ఫ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ట్రేడ్ లైసెన్స్లు ఫ వివరాల సేకరణలో వార్డు ఆఫీసర్లు నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో ఇటీవల కాలంలో కార్పొరేట్ మాల్స్, కాలనీల్లో వాణిజ్య వ్యాపార దుకాణాలు, హాస్పిటల్స్ భారీగా పెరిగినాయి. హైదరాబాద్ నగరం నుంచి కార్పొరేట్ మాల్స్ నీలగిరి నగరానికి భారీగా తరలిరావడంతో ప్రధాన రహదారుల వెంట సాధారణ వ్యాపార దుకాణాలు కాలనీల్లోకి మార్చారు. మాల్స్, హాస్పిటల్స్ భారీగా వెలియడంతో కిరాయి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతో అంత కిరాయి చెల్లించలేని స్థానిక వ్యాపారులు కాలనీల్లోకి దుకాణాలను మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు. దాంతో నీలగిరి నగరంలో వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగానే పెరిగినట్లు తెలుస్తున్నా రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల కొత్తగా వచ్చిన కార్పొరేషన్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్పై నజర్ పెట్టడంతో లెక్కల్లో తక్కువ ఉన్నట్లు తేలింది. దాంతో ట్రేడ్ లైసెన్స్పై పక్కా వివరాలు సేకరించాలని నిర్ణయించారు. డివిజన్ల వారీగా వివరాల సేకరణ నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ మాల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, దుకాణాలు, కాలనీల్లో ఉన్న వాణిజ్య వ్యాపార దుకాణాలు తదితర వాటి వివరాలను వార్డు ఆఫీసర్ల ద్వారా సేకరిస్తున్నారు. వారం రోజుల పాటు అన్ని డివిజన్లలో వ్యాపార దుకాణాలను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ వివరాలు కూడా తీసుకుంటారు. డివిజన్లో ఎన్ని వాణిజ్య వ్యాపార దుకాణాలు ఉన్నాయి, ఎన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి, ఉంటే ఎలాంటి వ్యాపారం, దానికి ట్రేడ్ రుసుం ఎంత వేశారనే వివరాలను వార్డు ఆఫీసర్లు సేకరించనున్నారు. ప్రస్తుతం 2,600 వరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నట్లు వివరాలు ఉన్నాయి. డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్నందున వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో వాణిజ్య దుకాణాల సంఖ్య ఎక్కువగా పెరిగితే మున్సిపల్ కార్పొరేషన్కు ఆదాయం కూడా భారీగా సమకూరనుంది. నగరంలో వాణిజ్య దుకా ణాల వివరాలు సేకరించా లని నిర్ణయించాం. ట్రేడ్ లైసెన్స్ దుకాణాలను గుర్తించడానికి డివిజన్ల వారీగా వివరాలు సేకరిస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ లేనివి గుర్తించి లైసెన్స్ జారీ చేస్తాం. ప్రతి వ్యాపారి కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. – వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పడని అడ్డుకట్ట
సాక్షి ప్రతినిది, నల్లగొండ : రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. 2022–26 యాసంగి సీజన్కు సంబంధించి ఆ ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఆరు మిల్లులు బియ్యం ఇవ్వకుండా వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. అధికారుల ప్రత్యక్ష తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. వారికి నోటీసులు ఇచ్చినా కూడా బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు. మిల్లులో ధాన్యం నిల్వ కూడా లేకపోవడంతో అధికారులు ఆరుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో కొందరు జైలుకు కూడా వెళ్లారు. అయినా మరికొందరు మిల్లర్లు అదే బాటలో ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టిన వానాకాలం ధాన్యం వానాకాలం–2025–26 సీజన్కు సంబంధించి సీఎంఆర్ సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి పంపండం లేదు. కావాలనే మిల్లర్లు జాప్యం చేస్తుండటంతో అనుమానం వచ్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల సంయుక్తంగా జిల్లాలోని మూడు రైస్ మిల్లుల్లో అకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యం కంటే భారీగా నిల్వలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మూడు మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ● డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రికార్డుల ప్రకారం ధాన్యం లేదు. ఉండాల్సిన ధాన్యం కంటే 4790 క్వింటాళ్ల ధాన్యం తక్కువగాా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ● కనగల్ మండలం పర్వతగిరిలోని వెంకటసాయి రైస్ మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1405 క్వింటాళ్ల ధాన్యం లోటు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆ మిల్లు యజమానిపైన అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ● చింతపల్లి మండలం నర్సర్లపల్లి గ్రామంలోఉన్న వెంకటసాయి రైస్ మిల్లులో కూడా విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఉండాల్సిన ధాన్యంతో పోల్చి చూస్తే 1,113 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫ ధాన్యం మింగిన వారిని జైలుకు పంపుతున్నా.. కొందరి మిల్లర్లలో కానరాని మార్పు ఫ జిల్లాలోని మూడు మిల్లులపై క్రిమినల్ కేసులు ఫ అక్రమాలు తేల్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు రైస్ మిల్లర్ల తీరు మారడం లేదు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వకుండా.. ధాన్యం పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఇంకా కొందరు మిల్లర్లలో మార్పు రావడం లేదు. తాజాగా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసి మూడు మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉన్నందున ఎప్పటికప్పుడు మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
సమాజంలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీ
నల్లగొండ: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. ఆయన ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో పోలీసు అధికారులు ఏఎస్ఐ ఎన్.ప్రభాకర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.మోహన్రావు, హెడ్ కానిస్టేబుల్ ఎండి.హిదాయత్ అలీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఆర్ఐ సంతోష్, ఆర్ఎస్ఐ జంగయ్య, జయరాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యంకట్టంగూర్ : వర్షపు నీటి ఒడిసి పట్టేలా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యతతో చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి ఎంపీడీఓ, ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశమై మాట్లాడారు. తెలంగాణ జలసిరి జల సంచయ్, జన భాగీదారి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియ, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం, మెడికల్ క్యాంపును పరిశీలించారు. 108 అంబులెన్స్లో మందులు, రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను, కేసుల వివరాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అంజన్రెడ్డి, వైద్యాధికారి జమున, జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రదీప్కుమార్, కస్తూర్బా విద్యాలయం ఎస్ఓ నీలాంబరి, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఓ కడెం రాంమోహన్, అంబులెన్స్ సిబ్బంది మహేష్, గాలిబ్, ఈఎంటీ శ్రీనివాస్, శివాని ఉన్నారు. వీబీజీ రామ్జీ పనులు వేగవంతం చేయాలిరామగిరి(నల్లగొండ): వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి సూచించారు. నల్లగొండ మండలం పెద్ద సూరారంలో గురువారం ఆయన పర్యటించారు. జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మొక్కలు నాటా రు. వీబీజీ రామ్జీ పనులపై గ్రామస్తులతో చర్చించారు. ఆయన వెంట ఎంపీఓ షేక్ ఇస్మాయిల్, కార్యదర్శి అనిల్కుమార్ ఉన్నారు. అబార్షన్ కిట్లు నిల్వ ఉంచిన మెడికల్ ఏజెన్సీ సీజ్నల్లగొండ టౌన్: నల్లగొండలోని ప్రకాశం బజార్లో శ్రీలక్ష్మీ మెడికల్ ఏజెన్సీలో గురువారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా 113 అబార్షన్ కిట్లు నిల్వ ఉంచినందుకు అధికారులు వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వీటన్నింటిని పరీక్షల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపినట్టు తెలి పారు. కార్యక్రమంలో ఏడీ వి.రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల కోసమే ఆర్బాటాలు
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామంటు ప్రభుత్వం ఆర్బాటం చేస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నకిరేకల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండగ సందర్భంగా గతేడాది వచ్చిన చీరలను నకిరేకల్లో ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని.. అవీ కూడా కేవలం సమబావన సంఘాల మహిళలకు యూనిఫాం మాదిరిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అంతటా ఇందిరమ్మ ఇళ్లు వస్తే నకిరేకల్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తన హయాంలో 100 పడకల వైద్యశాల భవనాన్ని పూర్తిచేస్తే ప్రజలకు అందుబాటులోకి తేవడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అమృత్ స్కీం కింద గతంలో నిధులు తేస్తే.. ఆ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారన్నారు. చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతుంటే.. కనీసం వాటిని నింపాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. సమావేశంలో మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, గుండగోని జంగయ్యగౌడ్, పేర్ల క్రిష్ణకాంత్, పెండెం సదానందం, గుర్రం గణేష్, పల్లె విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
విదేశీ ఒప్పందాలతో వ్యవసాయం దివాలా
మిర్యాలగూడ : విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దెబ్బతిని రైతాంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఎంసీపీఐయూ పొలిట్బ్యూరో సభ్యుడు వల్లెపు ఉపేందర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకోని దేశ వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. వస్కుల సైదమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మోర్తాల చందర్రావు, నార్ల చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, వనం సుధాకర్, కుంభం సుకన్య, గోనె కుమారస్వామి, రమేష్, సాంబయ్య, హంసారెడ్డి, బాబు, అరుణ్కుమార్, తిరుపతి, వెంకన్న, రవి, నర్సయ్య, రాగసుధ, అనిల్కుమార్, గడ్డం, మురళి, దానయ్య, వెంకటేష్, కాశి, సాగర్, రవీందర్, సావిత్రి, సంధ్య, రాజేష్నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యుడు ఉపేందర్రెడ్డి -
‘మధ్యాహ్నం’పై ధరల భారం
మార్కెట్లో పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచాలి. ప్రభుత్వమే అన్నిరకాల సరుకులు సరఫరా చేస్తే ఏజెన్సీలపై భారం పడకుండా ఉంటుంది. ప్రతి నెలా జీతాలు, బిల్లులు చెల్లించాలి. – పద్మ, మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకురాలుఫ మార్కెట్ రేట్లకు అనుగుణంగా చార్జీలు పెంచని ప్రభుత్వం ఫ అప్పుల పాలవుతున్నామని ఏజెన్సీ నిర్వాహకుల ఆవేదననల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీలపై ఆర్థికభారం పడుతోంది. మార్కెట్లో ధరలకు ప్రభుత్వం చెల్లించే మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంటోంది. దాంతో తాము అప్పుల పాలవుతున్నామని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగన ధరలతో పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్డు కూడా పెట్టలేకపోతున్నామని చెబుతున్నారు. 77,422 మంది విద్యార్థులు.. జిల్లా వ్యాప్తంగా 1230 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 77,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠ శాలల్లో మొత్తం 1,230 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఓ నిర్వాహకురాలితో పాటు హెల్పర్లు ఇద్దరు చొప్పున వంట చేస్తూ మధ్యాహ్న భోజనం అందజేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. నిర్వాహకులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం ఇస్తోంది. బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తూ.. ఖర్చులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 లు, 6,7,8వ తరగతి వారికి రూ.10.17, 9, 10వ తరగతి వారికి రూ.13.17 చొప్పున ఇస్తోంది. ప్రస్తుత ధరలు చూస్తే ఈ మొత్తం వారికి మాత్రం పరిపోవడం లేదు. వారానికి మూడు గుడ్లు.. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారంలో మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి నెలకు 12 గుడ్లు పెట్టాల్సి ఉంది. జిల్లాలోని 77,422 మంది విద్యార్థులకు ఒక్క నెలకు 9 లక్షల 29 వేలు గుడ్లు వడ్డించాలి. ప్రభుత్వం ఇస్తున్న గుడ్డుకు ఇస్తున్న ధర రూ.6 లు, కాగా మార్కెట్లో ధర రూ.8లు ఉంది. దాంతో ఏజెన్సీ నిర్వాహకులపై అదనంగా నెలకు రూ.18,58,128 అదనపు భారం పడుతోంది. పెరుగుతున్న ధరలతో సతమతం.. కొంతకాలంగా మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు మండిపడుతున్నాయి. వంట గ్యాస్, కూరగాయలు, నూనె ధరలు మండిపోతుండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో కార్మికులు, ఏజెన్సీ ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం మెనూ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలి
రామగిరి(నల్లగొండ) : ప్రతి విద్యార్థి ఆశించిన స్థాయిలో అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని డీఈఓ సుశీందర్రావు అన్నారు. చర్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో నల్లగొండ మండల ఎస్టీజీ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజైన బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నూతన బోధనా పద్ధతులను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె.అరుంధతి, ఆర్పీలు శ్రీనివాస్, నాగయ్య, క్రాంతి, రవి, ఉమ తదితరులు పాల్గొన్నారు. నిడమనూరు : అర్హులు ఓటుహక్కు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు కృషిచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్నేత అన్నారు. బుధవారం నిడమనూరు మార్కెట్లో కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. నిడమనూరు మండలంలో 35,731 ఓటర్లు ఉండగా, 33,137 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ దరఖాస్తులు డిజిటలైజ్ అయ్యాయని పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్కుమార్ డీసీసీ అధ్యక్షుడు కై లాష్నేతకు తెలిపారు. 91 శాతం ఎన్యుమరేషన్ డిజిటలైజ్ చేయడానికి సహకరించిన బీఎల్ఏలను కై లాస్ నేత అభినందించారు. కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ నిడమనూరు మండల అధ్యక్షుడు నర్సింగ్ విజయ్కుమార్, మార్కెట్ చైర్మన్ సత్యం, పార్టీ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగుల శీను, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు బుర్రి వెంకన్నయాదవ్, నాయకులు కృష్ణ, నరేష్, పోలె రవి ఉన్నారు. సినారె సాహిత్యం.. నైతిక విలువల దీపికరామగిరి (నల్లగొండ) : ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం నైతిక విలువలతో కూడుకున్నదని, సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కౌండిన్య అన్నారు. బుధవారం నల్లగొండ ఎన్జీ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలను, సృజనాత్మక రచనల విశిష్టతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. సినారె రాసిన పాటలను స్వయంగా పాడి వినిపించి అలరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ సినారె మాటా పాట రెండూ తెలుగు జాతిని పరవశింపజేశాయని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల తెలుగు శాఖాధిపతి శ్రీధర్, అధ్యాపకులు సైదులు, భూపాల్, అంజయ్య పాల్గొన్నారు. -
ముంపు బాధితులకు అండగా ఉంటాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ మర్రిగూడ : మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలో ముంపు బాధితులు సొంతంగా నిర్మించుకున్న గృహాలను పరిశీలించారు. రిజర్వాయర్ ముంపునకు గురైన మొత్తం 287 కుటుంబాలకు గాను ప్రభుత్వం గతంలో చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే చింతపల్లి వద్ద కేటాయించిన ప్లాట్లకు నంబర్ల కేటాయింపు, స్థలాల అప్పగింతలో ఆలస్యం కావడంతో 54 మంది బాధితులు శివన్నగూడెం వద్ద ఒక ప్రైవేట్ వెంచర్లో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వెంచర్లో ఇండ్లు నిర్మించుకున్నందున తమకు ఇందిరమ్మ గృహాల కింద ఇచ్చే రూ.5 లక్షల సాయాన్ని మంజూరు చేయాలని కోరారు. ఆర్అండ్ఆర్ సమస్యలను తీర్చాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాదస్పద భూమి విషయాన్ని 10 నుంచి 15రోజుల్లో అవార్డు పూర్తి చేసి, మిగిలిన 32 మందికి కూడా ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ శ్రీదేవి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జి.చినమునయ్య, సర్పంచ్ రాపోలు యాదగిరి తదితరులు ఉన్నారు. -
అంచనాలు తప్పిన సాగు
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్ ఆరంభమై 50 రోజులు దాటినా జిల్లాలో చెరువులు, కుంటలు నిండే స్థాయిలో వర్షాలు కురవలేదు. కేవలం చిరుజల్లులు, ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముసురుతో కూడిన వానలు మాత్రమే వచ్చాయి. దీంతో వానాకాలం సాగు కష్టతరంగా మారింది. జూన్మాసంలో కురుసిన ముసురు వర్షాలకు రైతులు పత్తిగింజలు పెట్టుకున్నారు. అవి మొలకెత్తిన నాటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు వాడుపడుతున్నాయి. మరోవైపు గత వానాకాలంలో ఈ నెలాఖరు వరకు 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా ఈసారి 81,123 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. 13,336 ఎకరాల్లో వరినార్లు పోసుకున్నారు. 6,78,750 ఎకరాల్లోనే పంటలు.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో వివిధ సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో వరి 5,46,165 ఎకరాల్లో పత్తి 6,47,689 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 12 లక్షల ఎకరాల వరకు సాగవుతాయని లెక్కలు వేసింది. కానీ, వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో కేవలం 81,123 ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా పత్తి 5,79,283 ఎకరాల్లో, జొన్న 11, కంది 2224, పెసర 64, వేరుశనగ 7, ఆముదం 12 ఎకరాల్లో సాగు చేశారు. పత్తిని రైతులు అంచనాకు కొంత తక్కువ సాగు చేసినప్పటికీ వర్షాలు లేక ఎదుగుదల తగ్గిపోయింది. వర్షాలు కురిస్తే గుంటకలు తోలి ఎరువులు పెడితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. 15 మండలాల్లో లోటు వర్షం.. జిల్లాలో ఇప్పటి వరకు 15 మండలాల్లో లోటు వర్షం కురిసింది. జూలై మాసంలో ఇప్పటి వరకు 109.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 49.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 11 మండలాల్లో సాధారణ వర్షం నమోదవగా.. శాలిగౌరారం, నకిరేకల్, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, మిర్యాలగూడ, తిరుమలగిరి సాగర్, పీఏ పల్లి, నేరేడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో లోటు వర్షం కురిసింది. కేతేపల్లి మండలంలో దుర్భిక్ష పరిస్థితి నెలకొనగా చిట్యాల, దామరచర్ల, అడవిదేవులపల్లి, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో అధిక వర్షం కురిసింది. పరిస్థితి ఇలాగే ఉంటే వేసిన పంటలు కూడా చేతికి వస్తాయో రాదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్ మొత్తం వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు ఆరుతడి మాత్రమే సాగు చేసుకోవాలి. కంది, పెసర, మినుము, నువ్వులు వంటి మెట్ట పంటలను సాగు చేసుకుంటే మంచిది. విత్తనాలు అందబాటులో ఉన్నాయి. – వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఫ ఎల్నినోతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఫ 15 మండలాల్లో లోటు వర్షం ఫ వాడిపోతున్న పత్తి చేలు.. 90 వేల ఎకరాలు దాటని వరి నాట్లు -
నాలుగు బుట్టల్లో..
చెత్త సేకరణ.. ఫ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కేంద్రం అడుగులు ఫ ముందుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఫ ఆగస్టు నుంచి నూతన విధానం అమలు మిర్యాలగూడ : పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకుగాను ఇక నుంచి నాలుగు రకాల బుట్టల్లో చెత్త సేకరించనున్నారు. అన్ని వ్యర్థాలు ఒకేచోట ఉండడం, డంపింగ్ యార్డులో తగులబెట్టడంతో విషవాయువులు ప్రబలి సమీప ప్రాంతాల వారు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ –2026కు అనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటికి నాలుగు బుట్టలు అందజేయనున్నారు. చెత్తను తడి, పొడి, శానిటరి వేస్ట్, ప్రమాదకరమైన వ్యర్థాలుగా విభజించి నాలుగు బుట్టల్లో సేకరించనున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, 869 గ్రామపంచాయతీలో కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు బుట్టల ప్రతిపాదనతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలుగనుంది. పర్యావరణాన్ని కాపాడేలా.. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రస్తుతం తడి, పొడి చెత్త కలిపి ఇవ్వడంతో పర్యావరణానికి హాని కలుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు బుట్టల ద్వారా ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త, శానిటరీ, ఎలక్ట్రికల్ వ్యర్థాలు, హానికర చెత్తను సేకరించిన అనంతరం డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడి చెత్తను స్క్రాప్ డీలర్లకు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీ, పంచాయతీకి వినియోగించనున్నారు. శానిటరి వ్యర్థాలను ప్రజలకు దూరంగా డంప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. హనికరమైన వ్యర్థాలను ప్రత్యేక విధానంలో పారబోయనున్నారు. చెత్త సేకరణకు సైతం మున్సిపాలిటీ వాహనాలు నాలుగు భాగాలుగా చేసి ఆ వ్యర్థాలను అందులో వేసుకుని డంపింగ్యార్డుకు తరలిస్తారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు.. పట్టణాల్లో, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకుగాను ప్రథమంగా ఒక వారం పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటివారంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్లాస్టిక్ కవర్లను తగ్గించేందుకు ఇంటి నుంచే గన్ని బ్యాగులు, టిఫిన్ బాక్స్ల ద్వారా మాంసం, టిఫిన్లు తదితర గృహ అవసరాల నిమిత్తం అందులోనే తీసుకురావాలి. గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ప్లేట్లు, గ్లాస్లకు బదులుగా స్టీల్ ప్లేట్లు జగ్గులు, గ్లాస్లు వాడాలని అవగాహన కల్పిస్తారు. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త అయిన వంటింటి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, ఆహార అవశేషాలు, పూలు, టీ, కాఫీ పొడులు (వీటిని కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు) నీలం బుట్టలో పొడి చొత్త అయిన ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహ పదార్థాలు (వీటిని రీసైక్లింగ్కు పంపిస్తారు) ఎరుపు రంగు బుట్టలో శానిటరి ప్యాడ్లు, డైపర్లు, వైద్య చికిత్సకు వాడిన వస్తువులు, వీటిని పేపర్తో కప్పి ఇవ్వాలి. (వీటిని సురక్షితంగా నాశనం చేస్తారు) నలుపు రంగు బుట్టలో రసాయనాలు, హానికర వ్యర్థాలైన బల్బులు, బ్యాటరీలు, మందులు, ఈ– వేస్ట్, పంచ్ స్ప్రేలు, పెయింట్లు తదితరాలు (వీటిని ప్రత్యేక విధానంలో పారబోస్తారు) -
‘రిజిస్ట్రీ’కి రైతుల వెనుకడుగు
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రిజిస్ట్రీ ప్రారంభించి 14 నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు 70 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డులో 11 అంకెల యూనిక్ ఐడీ కేటాయించనుంది. కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పని సరి జిల్లాలో 5,68,711 మంది రైతులకు గాను.. 3,90,786 మంది రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఇంకా 1,77,925 మంది రైతులు నమోదు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్కార్డ్, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. భవిష్యత్లో ఎరువులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ నెల 31 వరకు గడువు ఉన్నందున రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ కోరుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్తో ప్రయోజనాలు.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. దీంతో రైతుల భూముల వివరాలు, నేల స్వభావం, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలు ఇలా రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. వివరాలన్నీ ఆధార్కార్డుతో అనుసంధానం చేస్తుండడంతో ఒక్క క్లిక్తో రైతుల వివరాలు చూసే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ 70 శాతమే.. ఫ ప్రభుత్వ పథకాలు అందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి ఫ 31తో ముగియనున్న గడువు ఫార్మర్ రిజిస్ట్రీ వివరాలుమొత్తం రైతులు 5,68,711 మంది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నవారు 3,90,786 చేసుకోనివారు 1,77,925


