breaking news
Nalgonda District Latest News
-
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అప్పగింత
నల్లగొండ: నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి మంగళవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ జి. రమేష్ తిరిగి అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఐఆర్ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఫోన్ బ్లాక్ చేసి పోలీసులు త్వరగా ఫోన్ను కనిపెట్టే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సీఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు గోపాల్రావు, వెంకటనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు నృసింహుడి కల్యాణం
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి జరగనుంది. రాత్రి 9గంటలకు గజ వాహనంపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడ వీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడ వీధిలోని కల్యాణ వేదికకు చేరుకుంటారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, రుత్వికులు, పారాయణికులు కల్యాణ వేడుకను ప్రారంభిస్తారు. సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తారు. ఈ కల్యాణోత్సవానికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర మాడ వీధిలోని కల్యాణ మండపాన్ని పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు, వీఐపీలు కల్యాణాన్ని తిలకించేలా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో, బస్టాండ్ ఏరియాలో ఎల్ఈడీ స్క్రీన్లతో కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణోత్సవానికి గవర్నర్, మంత్రులు..కల్యాణోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పలువురు ఐఏఎస్ అధికారులు రానున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సైతం స్వామివారి కల్యాణానికి వచ్చే అవకాశాలున్నాయని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదని ఆలయాధికారులు పేర్కొన్నారు. -
వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి శ్రీలక్ష్మీ దేవితో నారసింహుని కల్యాణోత్సవంలో భాగంగా పెళ్లిచూపుల తతంగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై స్వామిని, ముత్యాల పల్లకీపై అమ్మవారిని అలంకరించి ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు రాజగోపురం ముందు గల మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టి, అమ్మవారిని తూర్పు ముఖంగా అధిష్ఠించారు. కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు బుధవారం రాత్రి 9.45గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందని.. సరిగ్గా సింహ లగ్నంలో స్వామివారు అమ్మవారిని పరిణయమాడుతారని వెల్లడించారు. జగన్మోహిని అలంకారంలో స్వామివారు.. మంగళవారం ఉదయం జగన్మోహిని అవతారంలో స్వామివారిని అలంకరించి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు హోమాది పూజలు, పారాయణాలు నిర్వహించారు. ఆలయంలో నేడు.. బుధవారం ఉదయం 10గంటలకు శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, అదేవిధంగా రాత్రి గజవాహన సేవ, 9.45గంటలకు తిరుకల్యాణోత్సవం జరిపించనున్నారు. జగన్మోహిని అలంకారంలో యాదగిరీశుడి దర్శనం -
పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు
స్వామివారికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. మంగళవారం రాత్రి టీటీడీ నుంచి ఏఈఓ రత్నం ఆధ్వర్యంలో అధికారులు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వయంభూలను దర్శించుకుని ముఖ మండపంలో ఈఓ భవానీ శంకర్కు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారులు గజం నర్మద, నరేంద్ర రెండు ఇక్కత్ కంచిపట్టు చీరలు, పట్టు పంచె, మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా ప్యాట్నీ సెంటర్ నిర్వాహకులు 8 పట్టుచీరలు, 5 పట్టు పంచెలు అందజేశారు. -
న్యాయం చేయాలని ఆందోళన
చిట్యాల : మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు(శివనేనిగూడెం)కు చెందిన ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ చిట్యాల పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మంగళవారం చిట్యాల పోలీస్స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులు రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ వెంకటయ్య ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో నిరసన తెలుపుతున్న వారు ఆందోళన విరమించారు. ఈ రాస్తారోకోతో కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నకిరేకల్ : ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మొండివారి కాలనీలో నివాసముంటున్న నాగిళ్ల నాగరాజు(30)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఈ నెల 22న నాగరాజు ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి నాగరాజును నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. నాగరాజు సోదరుడి కూమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరిబాబు తెలిపారు. మాంజా తగిలి నెమలి మృతి మర్రిగూడ : మండలంలోని బట్లపల్లి గ్రామంలో చైనా మాంజా కాళ్లకు చుట్టుకొని నెమలి మృతిచెందింది. మంగళవారం మండల పశువైద్యాధికారి సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బట్లపల్లి గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్దకు ఆహారం కోసం వచ్చిన నెమలి కాళ్లకు మాంజా చుట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేష్ ఘటనా స్థలానికి చేరుకొని నెమలిని పరిశీలించారు. నెమలికి పోస్టుమార్టం చేసి ఖననం చేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు. సెల్ఫోన్ చార్జర్ వైరు విషయమై ఘర్షణ ● అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కత్తిపోటుకొండమల్లేపల్లి : సెల్ఫోన్ చార్జర్ వైరు విషయమై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని అమరావతి వైన్స్ వద్దకు సోమవారం రాత్రి బోడ అశోక్, అనిమళ్ల అనిల్ మద్యం తాగేందుకు వచ్చారు. గతంలో వచ్చినప్పుడు తన వద్ద తీసుకున్న సెల్ఫోన్ చార్జర్ వైరును తిరిగి ఇవ్వమని వైన్స్లో పనిచేస్తున్న మల్లికంటి అనిల్ వారిని అడిగాడు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో బోడ అశోక్, అనిమళ్ల అనిల్ సోడా సీసాలతో మల్లికంటి అనిల్పై దాడి చేశారు. దీంతో మల్లికంటి అనిల్ కోపోద్రిక్తుడై కత్తితో తిరిగి ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పగిళ్ల సన్నీ మెడకు కత్తి తగిలి గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సన్నీ మెడకు 14 కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి 9 మందిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. -
అప్పులు చేసి.. చైన్ స్నాచర్గా మారి
నకిరేకల్ : ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్లు చేస్తున్న వ్యక్తిని నల్ల గొండ జిల్లా కేతేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నకిరేకల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. గత నెల 24న అర్ధరాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా సమీపంలోని అరిటాకు భోజనం హోటల్ వద్ద భోజనం కోసం ఆగింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కన్మతరెడ్డి విజయలక్ష్మి భోజనం చేసి బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 40 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కోని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం రాత్రి కేతేపల్లి మండలం చీకటిగూడెం శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బైక్పై అటుగా వస్తున్న ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన తాడేపల్లి మధు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా చైన్ స్నాచింగ్లు చేస్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. మధు ట్రావెల్స్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని, తన స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకుని అప్పుల పాలై, అప్పులు తీర్చేందుకు చోరీలు చేస్తున్నట్లు ఏఎస్పీ రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే కొర్లపహాడ్ టోల్ప్లాజా సమీపంలో అరిటాకు భోజనం హోటల్ వద్ద బస్సు ఎక్కుతున్న విజయలక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడని, ఆ పుస్తెలతాడును కరిగించి బంగారం ముద్ద చేయించినట్లు వివరించారు. అదేవిధంగా మరోసారి కేతేపల్లి శివారులోని సాయికృష్ణ హోటల్ దగ్గర మరో చైన్ స్నాచింగ్ చేసి హైదరాబాద్కు వెళ్లి బైక్పై వస్తుండగా.. కేతేపల్లి పోలీసులకు చిక్కాడని ఏఎస్పీ రమేష్ వివరించారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు చిక్కిన దొంగ 40 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం -
పూజల పేరిట బంగారు ఆభరణాలు మాయం
మిర్యాలగూడ అర్బన్: దొంగ బాబా అవతారమెత్తి ప్రజలను నమ్మించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న వ్యక్తిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కోన వినోద్కుమార్ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను చేసే పనితో డబ్బులు సరిగా రాక.. దొంగ బాబా అవతారమెత్తాడు. అనారోగ్యంతో బాధపడే పిల్లల కాళ్లకు కడియాలు వేసి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో క్షుద్రపూజలు, మంత్రాలు చేసి ప్రజల నుంచి బంగారం, నగదును కాజేయడం ప్రారంభించాడు. మిర్యాలగూడ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన అడావత్ శిరీష, గోవింద్ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న తమ పిల్లల కాళ్లకు కడియాలు వేయించారు. ఓ రోజు గోవింద్ ఇంటికి వచ్చిన వినోద్కుమార్ గోవింద్ వైపు చూసి ‘నీకు ప్రాణహాని ఉంది.. ఆయుష్షు పెరగాలంలే క్షుద్రపూజలు చేసి అమ్మవారికి ముడుపు కట్టాలి’ అని భయపెట్టాడు. ఇది నమ్మిన గోవింద్ దంపతులు తమ వద్ద ఉన్న 5.7 తులాల బంగారు నగలను ముడుపు కట్టేందుకు వినోద్కు అప్పగించారు. ముడుపు గుడ్డలో కట్టిన బంగారాన్ని 41రోజుల వరకు విప్పొద్దని వినోద్కుమార్ వారికి చెప్పాడు. అలా చేస్తే ఆయుష్షు పెరగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం వరిస్తుందని నమ్మించి.. ఇంట్లోనే పూజలు మొదలు పెట్టాడు. పూజలు చేసే సమయంలో గోవింద్ దంపతులను కళ్లు మూసుకోవాలని చెప్పి సినీఫక్కీలో గుడ్డలో కట్టిన బంగారాన్ని కాజేసి దాని స్థానంలో ఇతర వస్తువులను అందులో పెట్టాడు. అంతేకాకుండా పూజలు చేసినందుకు రూ.13,200 ఫోన్పే చేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 41 రోజుల తర్వాత గోవిండ్ దంపతులు ముడుపు విప్పి చూస్తే బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మేళ్లచెరువు, నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో, నూతనకల్ మండలంలోని పెద్దనెమలి గ్రామంలో ఇదేవిధంగా బంగారం కాజేసి బ్యాంకులో గోల్డ్లోన్ తీసుకొని జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. దొంగ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలింపు -
వదిన గొంతు కోసిన మరిది
మోత్కూరు : భూ తగాదాలో వదినపై మరిది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన బొంత నర్సింహ, అతడి తమ్ముడు అశోక్కు కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. 6 నెలల క్రితం నర్సింహ అనారోగ్యంతో మృతిచెందాడు. నర్సింహ పేరిట ఉన్న భూమిలో తనకు వాటా వస్తుందని అతడి భార్య లక్ష్మి అలియాస్ వెంకటమ్మతో అశోక్ తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో లక్ష్మి ఇంటిపై మరిది అశోక్ దాడి చేసి ఇంట్లోని సామగ్రి అంతా ధ్వంసం చేశాడు. దీంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కాగా మంగళవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుండగా.. అశోక్ తన దగ్గరి బంధువులైన ముగ్గురు వ్యక్తుల సహాయంతో కొబ్బరి బోండాల కత్తితో వదిన లక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పారిపోయారు. అతి కష్టం మీద లక్ష్మి మెడకు టవల్ చుట్టుకొని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. ఆమెను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు అశోక్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. భూతగాదాలతో ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు బాధితురాలి పరిస్థితి విషమం -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆత్మకూరు(ఎం) : హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఇటీవల నిర్వహించిన 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా జూడో మరియు రెజ్లింగ్ పోటీల్లో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేటకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు కమ్మంపాటి మహేందర్, బి. రాజశేఖర్, కమ్మంపాటి ప్రశాంత్ పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి మహేందర్ జూడో 66 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్ 67 కేజీల విభాగంలో కాంస్య పతకం, వుషూలో ద్వితీయ బహుమతి సాధించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న బి. రాజశేఖర్ జూడో 90 కేజీల విభాగంలో బంగారు పతథకం గెలుచుకున్నారు. గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కమ్మంపాటి ప్రశాంత్ జూడో 73 కేజీల విభాగంలో ద్వితీయ బహుమతి, రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రశాంత్, రాజశేఖర్, మహేందర్ను కోచ్ కమ్మంపాటి సోమరాజు, గ్రామస్తులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● ఎస్పీ శరత్చంద్ర పవార్ గుర్రంపోడు : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం గుర్రంపోడులో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిచారు. రోడ్డు ప్రమాదాలు.. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెంట్ ధరించడం తప్పనిసరి అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్కుమార్, గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న, రిటైర్డ్ సీఐ అంజయ్య, సర్పంచ్ జాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ.. సమస్యలపై తక్షణ విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన వియత్నాం బౌద్ధులునాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని వియత్నాం దేశానికి చెందిన 41మంది బౌద్ధ భిక్షవులు సోమవారం సందర్శించింది. హైదరాబాద్లో బౌద్ధుల సమావేశానికి హాజరైన వారు సాగర్ బుద్ధవనానికి వచ్చారు. బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. బుద్ధచరిత వనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను వీక్షించారు. మహాస్థూపంలో ధ్యానం చేశారు. వారికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర కండువాలు కప్పి, బుద్ధుడి చరత్రను తెలిపే బ్రోచర్లను అందజేశారు. అనంతరం వారు లాంచీల్లో వెళ్లి నాగార్జునకొండలోని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. వ్యాస రచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభరామగిరి(నల్లగొండ ) : హైదరాబాద్ ఏవీ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల్లో నల్లగొండ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచనట్లు తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల ప్రమాదాలు అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిని ఎంజీ యూనివర్సిటీ విద్యార్థిని పి.హేమలత, సి.శివకుమార్, డిగ్రీ విద్యార్థులు పి.నిశ్చల, వి.సుజాత, నందిని, ఎస్.నాగలక్ష్మికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, కుకుడాల గోవర్ధన్, సి.అనిత, ఏబూసి నరసింహ, హసేన, దాసరి శ్రీరాములు పాల్గొన్నారు. -
సారూ.. సమస్యలు తీర్చరూ..
ఫ గ్రీవెన్స్డేలో కలెక్టర్కు సమస్యలు విన్నవించిన ప్రజలు ఫ కలెక్టరేట్కు భారీగా వచ్చిన ఫిర్యాదుదారులు నల్లగొండ : సారూ.. మా సమస్యలు తీర్చండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్ చంద్రశేఖర్కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో గ్రీవెన్స్డే నిర్వహించారు. పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు. గ్రీవెన్స్డేలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదుదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. -
నీటి వనరులపై నివేదిక ఇవ్వండి
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ –163 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లాలో 45 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు రాయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. నల్లగొండ : నీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించి ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, మున్సిపల్, సర్వే, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. చెరువులు, కుంటలు, కాల్వల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ పరిధి లోని ప్రతి వాటర్బాడీకి సంబంధించిన పూర్తి మ్యాప్, సర్వే నంబర్లు, ఎఫ్టీఎల్ పరిమితులు, బఫర్ జోన్ వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమి త్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. గడవులోగా పనులు పూర్తిచేయాలి నల్లగొండ : ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న మూత్రశాలలు, అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, పాఠశాల ప్రహరి గోడల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలలు, మహాత్మ జ్యోతీరావు ఫూలే పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎర్రబెల్లి ఆలయానికి దేవరపెట్టె
నిడమనూరు : ఎర్రబెల్లి లింగమంతులస్వామి జాతరలో ప్రధాన ఘట్టం దేవరపెట్టరాక, దిష్టిపూజ సోమవారం నిర్వహించారు. ఎర్రబెల్లి జాతర వచ్చేనెల 7 నుంచి నాలుగు రోజులపాటు సాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవరపెట్టను మాడ్గులపల్లి మండలం గోపాలపురం నుంచి యాదవులు(ఎర్రబెల్లి గ్రామ పూర్వికులు) నల్లబోతు, పడాల, బోడే వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆదివారం రాత్రి ఎర్రబెల్లి గ్రామానికి తీసుకొచ్చారు. దేవరపెట్టతో వస్తున్న యాదవులకు ఎర్రబెల్లి వాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవరపెట్టను ఎర్రబెల్లి గట్ట వద్ద ఆలయానికి చేర్చారు. గుట్ట చుట్టు దిష్టిపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు జీవాలను బలిచ్చారు. కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మన్నెం వెంకన్న, సర్చంచ్ ఐతగోని మధు, బీజేపీ నాయకుడు మన్నెం రంజిత్యాదవ్, పెద్ద సంఖ్యలో యాదవులు, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫ గట్టుపైన దిష్టిపూజ నిర్వహించిన యాదవ పూజారులు ఫ మార్చి 7 నుంచి నాలుగు రోజులపాటు జాతర -
సంత్ సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
నల్లగొండ టౌన్ : నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహరాజ్ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్సేవాలాల్ మహరాజ్ 267వ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో సంత్సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భోగ్ బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్సేవాలాల్ మహరాజ్ లంబాడా, గిరిజన జాతిలోని మూఢనమ్మకాలను పారదోలి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సంత్సేవాలాల్ స్ఫూర్తితో రూపొందించిన రాజ్యాంగం, హక్కులు, ప్రభుత్వ పథకాలు పేదలకు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందన్నారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ సంత్సేవాలాల్ మహరాజ్ సేవా, ధర్మం, సమభావనలను బోధించిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్నాయక్, చత్రునాయక్, సకృనాయక్, నర్సింహ, అడిషనల్ ఎస్పీ రమేష్, డిప్యూటీ మేయర్ ఆష్రఫ్, పరుశరాం, కార్పొరేటర్లు దీప్లానాయక్, నాగార్జున, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సీఎంఆర్ ధాన్యం మాయంపై ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు
సీఎంకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేతనార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లిలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్రెడ్డి మనుమరాలు (కొడుకు కుమార్తె) వివాహం ఈ నెల 25న హైదరాబాద్లో జరగనుంది. సోమవారం కోమటిరెడ్డి మోహన్రెడ్డి తన సోదరుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. తన మనుమరాలి వివాహానికి రావాలని మోహన్రెడ్డి సీఎంను కోరారు. ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్ లాగ్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి సోమవారం తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఎంజీయూలో నైపుణ్యాభివృద్ధి కోర్సునల్లగొండ టౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో వినూత్నంగా వివిధ క్రీడాంశాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కోర్సును ప్రవేశ పెట్టినట్లు వ్యాయామ అధ్యపకులు మురళి, వై.శ్రీనివాస్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ప్రధాన క్రీడాంశాలు, వాటి విధివిధానాలు పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు వాలీబాల్పై అవగాహన కల్పనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ను అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎట్టకేలకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో ఏడు మిల్లులు వేలం వేసిన సీఎంఆర్ బియ్యాన్ని దారి మళ్లించాయని, ఈ విషయం తమ తనిఖీల్లో నిర్ధారణ అయిందని, ఆయా మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ పోలీస్స్టేషన్లలో పౌరసరఫరాల సంస్థ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై పోలీసు శాఖ దృష్టి సారించింది. భారతీయ న్యాయ సంహిత 316 (2), 316(5), 318 (3), ఎషెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయా మిల్లర్లు అంతా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయా మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేసి వారి ఆస్తులను జప్తు చేస్తామని, జరిగిన నష్టాన్ని వసూలు చేస్తామని పౌరసరఫరాల విభాగం వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. 2022–23 సంవత్సరంలో సీఎంఆర్ కోసం జిల్లాలోని మిల్లులకు జిల్లా పౌరసరఫరాల విభాగం ధాన్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా చిట్యాల మండలంలోని వరలక్ష్మి పార్బాయిల్డ్ మిల్లు, కేతేపల్లిలోని చాముండేశ్వరి పార్బాయిల్డ్, మనుగోడులోని మరళీ మనోహర్ ఆగ్రోఫుడ్స్, నల్లగొండలోని రామ్లక్ష్మణ్, కనకమహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ మిల్లులకు కూడా ధాన్యం ఇచ్చింది. అయితే ఆ మిల్లులు ఇంతవరకు సీఎంఆర్ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఏడాది కిందట ప్రభుత్వం మిల్లుల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని వేలం వేసింది. దానిని కొనుగోలు చేసిన వారికి ధాన్యం ఇవ్వాల్సి ఉంది. ధాన్యం లేకపోతే దాని విలువ ప్రకారం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ ఏడు మిల్లులకు ఇచ్చిన 5,89,533 క్వింటాళ్ల ధాన్యానికి రూ.191.13 కోట్లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. అయినా.. ముడుపుల బాగోతంలో కొందరు అధికారులు అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. 5,89,533 క్వింటాళ్లు మాయం.. నల్లగొండ జిల్లాలోని ఆ ఏడు మిల్లుల్లో 5,89,533 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్లు తేలింది. గత ఏడాదే ఈ అక్రమాలను తేల్చినా ఇంతవరకు చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. చిన్న తప్పు జరిగితే గగ్గోలు పెట్టే అధికారులు ఏకంగా ఏడు మిల్లులు రూ.191.13 కోట్ల విలువైన ధాన్యం అమ్ముకున్నా పట్టించుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేనా! ధాన్యం ఎగ్గొట్టిన మిల్లర్లపై జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. మరోవైపు ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామని జిల్లా పౌర సరఫరాల విభాగం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఆయా మిల్లులపై పోలీసులు నమోదు చేసే క్రిమినల్ కేసులకే పరిమితం అవుతుందా? ఆచరణలో ఆర్ఆర్ యాక్ట్ను అమలు చేస్తుందా? చూడాలి.ఫ మిల్లర్లపై చర్యలకు మూడేళ్లుగా అధికారుల మీనమేషాలు ఫ పలుమార్లు కథనాలను ప్రచురించిన ‘సాక్షి’ ఫ అయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన యంత్రాంగం ఫ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో చలనం ఫ ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామంటున్న అఽధికారులుజిల్లాలో 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని మాయం చేయడంపై గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్పటి పౌరసరఫరాల కమిషనర్ విచారణకు ఆదేశించారు. అప్పట్లో మిల్లుల్లో తనిఖీలు చేపట్టి, అక్రమాలు నిజమేనని అధికారుల తనిఖీ బృందాలు తేల్చాయి. అయినా చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారు. జిల్లాలో మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు, అక్రమాలను తేల్చిన వైనం, అయినా మిల్లర్ల బుకాయింపుపై ‘సాక్షి’ దిన పత్రిక ప్రత్యేక కథనాలను ప్రచురించింది. తాజాగా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ పెట్టాలని స్పష్టం చేయడంతో జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు సోమవారం వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మిల్లుల్లో కనిపించకుండా పోయిన ధాన్యం, కేసుల వివరాలు.. పోలీస్ స్టేషన్ మిల్లుపేరు ధాన్యం విలువ (క్వింటాళ్లలో) (రూ.కోట్లలో) చిట్యాల వరలక్ష్మి పార్బాయిల్డ్ 59,538 19.33 కేతేపల్లి చాముండేశ్వరి పార్బాయిల్డ్ 1,39,670 45.36 మునుగోడు మరళీ మనోహర్ ఆగ్రోఫుడ్స్ 4,500 1.46 నల్లగొండ టూటౌన్ రామ్లక్ష్మణ్ 78,110 25.36 నల్లగొండ టూటౌన్ కనకమహాలక్ష్మి 80,260 26.06 నల్లగొండ రూరల్ సుమాంజలి 67,662 21.97 నల్లగొండ రూరల్ గౌతమి ఇండస్ట్రీస్ 1,59,803 51.89 -
మాతా, శిశువుకు భరోసాగా..
నల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు మాతా శిశువులకు భరోసాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడంతో జిల్లాలో ఎనిమిదేళ్లుగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాటు సరైన వైద్యం, పౌష్టికాహారం అందకపోవడం, రక్తహీనత కారణంగా జిల్లాలో మాతా శిశు మరణాలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహహారం అందించడంతో పాటు సకాలంలో వ్యాధి నిరోదక టీకాలను అందిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక వైద్యులతో వైద్యం చేయిస్తుండడంతో ఏటేటా మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులను ప్రభుత్వం నియమించింది. అత్యాధునిక వైద్య పరీక్షల కోసం పరికరాలను సమకూర్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలతో గర్భిణులు, నవ జాత శిశువులకు అవసరమైన విభాగాలను ఏర్పాటు చేసింది. ఐసీయూ, కేఎంసీ వంటి విభాగాలను అందుబాటులో ఉంచడంతో గత కొన్నేళ్లుగా మాతా శిశు మరణాలు తగ్గుతున్నాయి. గర్భిణుల నమోదు నుంచి పర్యవేక్షణ.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ఓ మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి తల్లీబిడ్డను ఇంటికి చేర్చే వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గర్భిణులకు సేవలందిస్తున్నారు. నెలలు నిండగానే 102 వాహనాన్ని రప్పించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు అయిన తర్వాత తల్లీబిడ్దలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. వాట్సప్ గ్రూప్లో వివరాలు.. జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, మర్రిగూడ ఆసుపత్రులకు ప్రసవాల కోసం వెళ్లిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అత్యవసర చికిత్సల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీహెచ్ వాట్సప్ గ్రూప్ల్లో గర్భిణుల ఆరోగ్య సమస్య, అందించాల్సిన చికిత్స వివరాలను నమోదు చేస్తారు. ఆ గ్రూప్లో ఉన్న సంబంధిత వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై గర్భిణి వచ్చిన వెంటనే సకాలంలో చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తుండడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి. గర్భిణులు కూడా పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వైద్యులు చెప్పే సూచనలు పాటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకోవడం వల్ల మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సంవత్సరం శిశు మాత 2018–19 335 14 2019–20 395 18 2020–21 329 08 2021–22 310 26 2022–23 317 13 2023–24 216 12 2024–25 169 07 2025–26 జనవరి 72 09 ఫ వైద్యారోగ్య శాఖ వినూత్న కార్యక్రమాలు ఫ ఏటేటా తగ్గుతున్న తల్లిబిడ్డల మరణాల రేటు ఫ గర్భం దాల్చిన మహిళ ప్రసవించే వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందడమే కారణం -
ప్రభుత్వ భూమిలో చెట్ల నరికివేత
పెద్దవూర : ప్రైవేటు భూములు, బహిరంగ ప్రదేశాల్లో ఒక చెట్టును నరకాలంటేనే అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటింది ప్రభుత్వ భూ మిలో ఎవరి అనుమతులు తీసుకోకుండా వందల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఈ ఘటన పెద్దవూర మండలం కోమటికుంటతండాపరిధిలోని కేంద్ర ప్రభుత్వ భూమిలో ఆదివారం వెలుగుచూసింది. తండాలోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ)యూరేనియం క్యాంపు భూమిలో పదేళ్ల క్రితం వందల సంఖ్యలో మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిని అక్రమార్కులు మూడు రోజులుగా నరికివేస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు. రఏటా రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కింద మొక్కలను నాటుతుంటే ఇలా నరకడం ఏంటని స్థానికులు అంటున్నారు. అమలుకు నోచుకోని వాల్టా చట్టం ప్రభుత్వ అటవీ సంపదను కాపాడటానికి తీసుకొచ్చిన వాల్టా చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. చెట్లను నరికివేయాలంటే కనీసం గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతినైనా తీసుకోవాలి. అలాంటిది.. ఎవరి అనుమతి లేకుండా వందల సంఖ్యలో చెట్లను ఎలా నరికివేస్తారని కోమటికుంటతండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ చెట్లు ఎందుకు నరుకుతున్నారో అర్థంకాని పరిస్థితి. ఈ విషయాన్ని ఎవరికై నా ఫిర్యాదు చేద్దామన్నా ఇక్కడ ఎవరూ ఉండరని స్థానికులు చెబుతున్నారు. ఫ కోమటికుంటతండాలో అక్రమార్కుల నిర్వాకం ఫ కేంద్ర ప్రభుత్వ స్థలంలో అనుమతుల్లేకుండా నరికివేత ఫ ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికుల ఆరోపణ -
మురళీకృష్ణుడిగా నారసింహుడు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించి పల్లకీపై అధిష్టింపజేసి మాడ వీధిలో ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి వేద పారాయణం పఠించారు. అనంతరం మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయాధికారులు, అర్చకులు, పారాయణీకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో నేడు..వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ నిర్వహించనున్నారు. పొన్న వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు -
చెట్టు పట్టాలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంమర్రిగూడ : మండలంలోని ఖుదాబక్షపల్లిలో పేద రైతులకు సంబంధించిన చెట్టు పట్టాల సమస్య గురించి శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం ఖుదాబాక్షపల్లి గ్రామంలో నిర్వహించిన సీపీఐ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖుదాబక్షపల్లిలో 70ఏళ్ల క్రితం గుట్ట ప్రాంతంలో పేద రైతులకు ఇచ్చిన చెట్టు పట్టాలను రద్దుచేయకుండా పోరాడుతానన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అనంతరం రాంరెడ్డిపల్లి పరిధిలోని తానేదార్పల్లికి చెందిన సీపీఐ కార్యదర్శి కర్నాటి అంజయ్య తల్లి చంద్రమ్మ ఇటీవల మృతిచెందగా ఎమ్మెల్సీ ఆ గ్రామానికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, మేతరి యాదయ్య, పొట్ట అశోక్, గిరి ముత్తయ్య, ఎరుకల నిరంజన్గౌడ్, అబ్బనగోని కృష్ణయ్య, జాల చంద్రయ్య, పాముల రమేష్, అడమయ్య, కొమురయ్య పాల్గొన్నారు. -
బుద్ధవనం సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు
నాగార్జునసాగర్: దక్షిణ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన విద్యా సాంస్కృతిక ప్రతినిధుల బృందం సభ్యులు కాంగ్సుంగ్, చోయ్ సేంగహో, మిన్ క్యేయోంగ్వూ, కవన్ జిన్ వోక్, శేషు, చిరాగ్ జలది తదితరులు ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. హైదరాబాద్లో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వీరు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధచరిత వనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనాలను సందర్శించారు. స్థూప వనంలో నిర్మించిన దక్షిణ కొరియా మహాస్థూపాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు వారిని ఘనంగా సత్కరించారు. బుద్ధవనంలో చేపట్టబోయే నూతన నిర్మాణాల గురించి వారికి తెలిపారు. వారి వెంట స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గరిడేపల్లి : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో నిర్మించిన సంఘం భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి నేటికీ పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ వయసులో వారు తిరిగే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని నిర్మించిన సంఘం మండల కమిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, సభ్యులు వెంకటమ్మ, చంద్రయ్య, బొట్ల రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, వేరేపెళ్లి శ్రీనివాసరావు, కోటయ్య పాల్గొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్ దర్గా
మర్రిగూడ (చింతపల్లి) : మత సామరస్యానికి ప్రతీక సయ్యద్ హజరత్ అబ్బాస్ దర్గా అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలోని దర్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారిని దర్గా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలిండియా వాలీబాల్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక కనగల్ : కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే ఆలిండియా 74వ పోలీస్ జాతీయ వాలీబాల్ క్లస్టర్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున కనగల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న నిమ్మ బేబీశాలిని ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన స్టేట్ ఫోర్త్ సమ్మిట్ సైబరాబాద్ వాలీబాల్ మహిళా విభాగం పోటీల్లో బేబీశాలిని పాల్గొని ఎంపికై ంది. ఈమె స్వగ్రామం చింతపల్లి మండలం వింజమూరు. జాతీయ పోటీలకు ఎంపికై న బేబీ శాలినిని చండూరు సీఐ కె.ఆదిరెడ్డి, కనగల్ ఎస్ఐ రాజీవ్రెడ్డి అభినందించారు. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలినల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి కార్మికుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులుగా పనిచేస్తున్న వారు నేటికీ శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా కార్మికులకు జీతభత్యాల అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 28న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వరంగల్లో జరగనున్న సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వనాథులు లెనిన్, యాదగిరి, ిసీహెచ్.నిర్మల, పి.ఎల్లమ్మ, పద్మ, రామేశ్వరమ్మ, అన్నపు లింగస్వామి, సందీప్, మధు, సబిత, నిర్మల, ఉషమ్మ, యాదమ్మ పాల్గొన్నారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. -
రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు
నకిరేకల్: అక్రమంగా మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారని రైతులపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం గొల్లగూడెం శివారులోని భూపతి కుంటను ఆదివారం చిరుమర్తి లింగయ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూపతి కుంటలో నెల రోజులుగా రోడ్డు పని పేరుతో ఇక్కడి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని భారీగా మట్టిని అక్రమంగా తరలించారని ఆరోపించారు. తాజాగా ఇక్కడ రైతులు కుంట సమీపంలో తమ పట్టా భూముల్లో మట్టిని తీస్తుండగా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు సందర్శించి కుంట భూమిలో తవ్వకాలు చేస్తున్నారని వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. భూపతి కుంటలో వారు చేస్తున్న మట్టి దందాను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ఒత్తిడితో బీఆర్ఎస్కు చెందిన రైతులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, కట్టంగూర్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తలారి బలరాం, నాయకులు సూదిని జానకీరెడ్డి, యానాల లింగారెడ్డి, జీడిపల్లి శేఖర్రెడ్డి ఉన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
నల్లగొండ టౌన్: పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్ల గొండ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన లాలిత్య స్కిన్ అండ్ లేజర్ ఆస్పత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదవారికి, మధ్యతరగతి రోగులకు మెరుగైన చికిత్స అందించి అవసరమైనంత మేరకు మందులు అందించినప్పుడే ఆస్పత్రులు ప్రజాదరణ పొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యుటీ మేయర్ అష్రాఫ్ అలీ, బుర్రి శ్రీనివాస్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, డాక్టర్లు లాలిత్య శశాంక్, గౌరిశ్రీ, హరినాథ్, సాయిలావణ్య, రవిశంకర్ కన్నా, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ ప్రారంభం
నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ వెంచర్ను ఆదివారం సింగర్ మధుప్రియ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామకృష్ణ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో అత్యున్నత ప్రమాణాలతో పీఆర్కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్క్లేవ్ వెంచర్ రూపుదిద్దుకుందని అన్నారు. ఈ వెంచర్లో ప్లాట్లు, గృహాలు ప్రజలు కొనుగోలు చేసి తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. వెంచర్ నిర్వాహకుడు బాలాజీనాయక్ మాట్లాడుతూ.. ఈ వెంచర్ డీటీసీపీ, రెరా వంటి అన్నిరకాల అనుమతులు పొందిందన్నారు. విశాలమైన రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఉన్నాయని, ఆహ్లాదకర వాతావరణంలో కొనుగోలుదారులకు నచ్చినట్లుగా ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. సింగర్ మధుప్రియ పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ పి. రామకృష్ణారెడ్డి, బొజ్జ శంకర్, శ్రీధర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రేగట్టె నవీన్కుమార్రెడ్డి, అనంతరెడ్డి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
3,300 ఇళ్లు రదు్ద!
నల్లగొండ : పేదవాడి సొంతింటి కలపై నిబంధనల నీలినీడలు ముసురుకుంటున్నాయి. దీంతో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. ఒకవైపు పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, మరోవైపు ప్రభుత్వ కఠిన నిబంధనలతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లో పడ్డారు. ఫలితంగా, ఇళ్లు మంజూరైనా పునాది రాయి వేయని (ముగ్గు పోయని) సుమారు 3,300 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆ స్థానాల్లో అర్హులైన కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇళ్ల కేటాయింపు ఇలా.. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజక వర్గాలకు మొత్తం 19,625 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు రెండు విడతల్లో అధికారులు 17,247 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విడతల్లో మంజూరైన ఇళ్లలో ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి రెండో విడతలో ఇళ్ల స్థలం కూడా లేనివారికి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి మంజూరు పత్రాలను అందించారు. అందని ‘బేస్మెంట్’ చేయూత ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నప్పటికీ, ప్రాథమిక స్థాయిలోనే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేస్మెంట్ నిర్మించుకోవడానికే సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక పేదలు పనులు మొదలుపెట్టలేకపోతున్నారు. దీనికితోడు 600 చదరపు అడుగులలోపు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయనే నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. ఉమ్మడి కుటుంబాల అవసరాల దృష్ట్యా కొంత పెద్దగా నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి ఈ నిబంధనలు శాపంగా మారాయి. నిబంధనలు అడ్డురావడంతో మంజూరైన ఇళ్లను చాలా మంది వదిలేసుకున్నారు. నిర్మాణ దశల్లో ఉన్నవి 13 వేలకుపైనే.. జిల్లాకు కేటాయించిన ఇళ్లు 19,625 ఇప్పటి వరకు మంజూరైనవి 17,247ఫ ఆర్థిక భారంతో వెనకడుగు వేస్తున్న పేదలు ఫ కొత్త లబ్ధిదారుల వేటలో యంత్రాంగం ఫ ఇంటి నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారుల వేడుకోలు ప్రస్తుతం సిమెంట్, స్టీలు, ఇసుక ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వ సాయం రూ.5 లక్షలు ఉంటే, ఒక సాధారణ ఇంటి నిర్మాణానికి కనీసం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. పెరుగుతున్న భారంతో పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచి, నిబంధనలు సడలించి పేదల సొంతింటి కలను సాకారం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కొందరు లబ్ధిదారులు తమ పేరు జాబితాలో రాగానే, ఉత్సాహంతో ముందే అప్పులు చేసి బేస్మెంట్లు నిర్మించుకున్నారు. అయితే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ‘పాత నిర్మాణాలకు నిధులు ఇవ్వలేం’ అని తేల్చి చెబుతుండడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నల్లగొండ మండలం నర్సింగ్బట్లకు చెందిన శేఖర్ అనే లబ్ధిదారుడు లక్ష రూపాయలు వెచ్చించి బేస్మెంట్ నిర్మించుకున్నా, నిబంధనల వల్ల పైసా అందలేదు. దీంతో చేసేదేమీ లేక అప్పులు చేసి సొంతంగానే పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. -
స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఆత్మకూర్(ఎస్)మండలానికి చెందిన విద్యార్థి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన ఎస్. శ్రీనాథ్ గతేడాది ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూల్లో 6వ తరగతి చదివాడు. ఈ విద్యాసంవత్సరం 7వ తరగతిలో హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు బదిలీ అయ్యాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం స్కూల్లో శ్రీనాథ్ ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పాఠశాల సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి చేరుకొని శ్రీనాథ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
బైక్ను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
మఠంపల్లి: ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్కు గుర్తుతెలియని వ్యక్తుల నిప్పుపెట్టడంతో కాలిబూడిదైంది. ఈ ఘటన మఠంపల్లి మండలం లాలితండాలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఆదివారం బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లాలితండాకు చెందిన వార్డు సభ్యుడు భూక్యా కమల్నాయక్ తన బైక్ను శనివారం రాత్రి ఇంటి పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆదివారం ఉదయం బైక్ తగలబడినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. బాబు తెలిపారు. లారీ ఢీకొని కారు బోల్తాదేవరకొండ: లారీ ఢీకొని కారు పల్టీ కొట్టిన ఘటన దేవరకొండ పట్టణ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట గ్రామానికి కంభంపాటి ఇందిర, కంభంపాటి కుందన ఆదివారం డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసి తమ బాబాయి కిరణ్ కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో దేవరకొండ పట్టణ శివారులోని ఉప్పువాగు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. బైక్పై నుంచి పడి యువకుడి మృతికొడకండ్ల : బైక్పై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల శివారులో తిరుమలగిరి మండలం వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగింది. స్థానిక ఎస్ఐ చింత రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ(38) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని నిమిత్తం శనివారం బైక్పై వెలిశాల గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అదే తండాకు చెందిన గుగులోత్ శంకర్ బైక్పై వెలిశాల హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అతడికి అడ్డురావడంతో నెహ్రూ బైక్పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతిదేవరకొండ : ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం దేవరకొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మడమడక గ్రామ జీపీఓగా పనిచేస్తున్న ఇరిగి శంకర్ కుమారుడు అన్మోల్(11) పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తండ్రి శంకర్తో కలిసి బాలుడు ముదిగొండ రోడ్డులో వాకింగ్కు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలోని బావిలో పడి అన్మోల్ మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
రీకౌంటింగ్కు హైకోర్టు ఆదేశం
మిర్యాలగూడ టౌన్ : గణేష్పహాడ్ గ్రామ పంచాయతీ ఓట్లకు సంబంధించి త్వరగా రీకౌంటింగ్ జరిపించాలంటూ మిర్యాలగూడ కోర్టును తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలం గణేష్పహాడ్ సర్పంచ్ పదవికి రాత్ర సుక్యనాయక్, రాత్ర రమేష్నాయక్ పోటీ చేయగా గతేడాది డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో రమేష్నాయక్కు 477 ఓట్లు రాగా తన ప్రత్యర్థి అయిన సుక్యనాయక్కు 476 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్కోటు తేడాతో రమేష్ నాయక్ గెలు పొందారు. దీంతో కౌంటింగ్పై తనకు అనుమానంగా ఉందని, రీకౌంటింగ్ జరపాలంటూ రాత్ర సుక్యనాయక్ ఎన్నికల అధికారులను కోరినప్పటికి వారు స్పందించలేదు. దీంతో ఆయన మిర్యాలగూడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్కోర్టులో (ఈఎల్ఈసీవోపీ/02/2025) కేసు వేశాడు. ఈ కోర్టు కూడా త్వరగా తేల్చడం లేదని భావించిన సుక్యనాయక్ 2026 జనవరి 20న హైకోర్టు(సీఆర్పీ/219/2026)ను ఆశ్రయించాడు. దీంతో ిపిటిషనర్ తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది జి.కరుణాకర్రెడ్డి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి త్వరగా గణేష్పహాడ్ పంచాయతీకి సంబంధించిన ఓట్లు రీకౌంటింగ్ చేయాలంటూ మిర్యాలగూడ కోర్టును ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి గుర్రంపోడు : ఉపాధ్యాయులు బోధనాభ్యాస సామగ్రిని విరివిగా వినియోగించి విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యేలా విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బి.భిక్షపతి అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగించాలన్నారు. అనంతరం నడికూడ ప్రాథమిక పాఠశాలలో రూ.5 లక్షల వ్యయంతో తాగునీరు, ఇతర వసతులు కల్పించిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్కు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్ధార్ కరుణశ్రీ, ఎంఈఓ నోముల యాదగిరి, రిసోర్స్ పర్సన్లు, అన్ని పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విద్యాసదస్సుకు అలీ బేగ్ పరిశోధన పత్రంనల్లగొండ టూటౌన్ : టర్కీలో జూన్ 24 నుంచి 28 వరకు జరగనున్న మూడవ అంతర్జాతీయ ఆరోగ్య, వ్యా యామ విద్యా సదస్సులో మహా త్మాగాంధీ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ మీర్జా రాజా అలీబేగ్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. డాక్టర్ అలీ ‘ప్లే విత్ ఇన్ సేఫ్ బౌండరీస్ ఎంపవరింగ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ త్రూ స్ట్రాటజిక్ సెక్యూరిటీ ప్లానింగ్’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనను ఇస్టాంబుల్ నగరంలో జరిగే సదస్సులో సమర్పిస్తారు. యూనివర్సిటీల్లో సెక్యూరిటీ పాత్ర, స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన అంశాలపై తాను ఈ పరిశోధన చేసినట్లు అలీ బేగ్ తెలిపారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిరామగిరి (నల్లగొండ) : పోస్టర్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సంతోష్కుమార్ నరహరి అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం నర్సింగ్భట్ల పోస్ట్ ఆఫీస్లో జరిగిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ స్కీంలపై గ్రామస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, సర్పంచ్ జాకీరా, ఉప సర్పంచ్ అనసూర్య, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తాజుద్దీన్, బి.నర్సింహ, ఎం.శ్రీనివాస్, జి.దుర్గా భవానీ, వి.మేఘన, బి.లావణ్య, జె.కొండారెడ్డి, ఎండి.ఫయాజ్, హెచ్. విద్యాసాగర్, డి.సింధులహరి, యాదయ్య, యూసఫ్, గణేష్, పర్వీన్, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
నల్లగొండ : జిల్లాలో సహజ, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో టూరిజంపై నిర్వహించిన సమావేశంలో పచ్చల, ఛాయాసోమేశ్వర, పాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, లతీఫ్ సాహెబ్, కాపురాల గుట్టలపైకి రోప్వే ఏర్పాటు, డిండి ప్రాజెక్టు వద్ద బోటింగ్ సదుపాయాల విస్తరణ, దేవరచర్ల శివాలయం, కాచరాజుపల్లి ఏలేశ్వరం, ఏకేబీఆర్, అజ్జలాపురం జలపాతం, అలాగే నెల్లికల్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయమై సమీక్షించారు. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక యువతకు గైడ్స్, హోం స్టేలు, ఫుడ్ కోర్టులు, హస్తకళల విక్రయ కేంద్రాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎస్పీ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, బుద్ధవనం ఇన్చార్జి శ్యాంసుందర్, టూరిజం, అటవీ, ఆర్కియాలజీ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రగతికి సహకరించాలి పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని రంగాల్లో మాత్రమే పారిశ్రామిక సంస్థలు, ఇతరులు సీఎస్ఆర్ నిధులు అందజేయడం వల్ల ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని, అలా కాకుండా జిల్లా మొత్తంగా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. ఈ విషయమై ఇటీవలే సీఎస్ ఆర్ జిలా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, పారిశ్రామిక సంస్థల ప్రతిని ధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నిమిషం నిబంధన లేదు
డిండి సేఫ్టీ పనులపై నెలాఖరులోగా నివేదికనల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తి వేసింది. నిమిషం నిబంధన కారణంగా గతంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయలేక నష్టపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ నిబంధనను ఎత్తి వేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) దస్రూ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన సాక్షి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు మొత్తం 45 కేంద్రాలు కేటాయించడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మాటల్లోనే.. 25న పరీక్షలు ప్రారంభం ఈ నెల 25 నుంచి వచ్చే నెల మార్చి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్ధులు జనరల్ కేటగిరీలో 11,802, ఒకేషనల్ 2,117 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 11,733 మంది జనరల్, 2,248 మంది ఒకేషనల్ విభాగాల విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు కమిటీలు, ప్రత్యేక బృందాలు పరీక్షల నిర్వహణకోసం డీఈసీ కమిటీతోపాటు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా, డీఐఈఓ కన్వీనర్గా, ఎస్పీ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లతోపాటు మరో ఇద్దరి ప్రిన్సిపాళ్లతో డీఈసీ కమిటీని ఏర్పాటు చేశాం. పరీక్షల పర్యవేక్షణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు.. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాం. తాగునీటితోపాటు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటారు. ఒక్కో సెంటర్లో మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ నిఘాలో పరీక్షలు కొసాగుతాయి. జిల్లాకు వచ్చిన ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. పోలీస్ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను పరీక్ష రోజు కేంద్రాలకు తరలిస్తాం. పరీక్ష ముగసిన తరువాత ఎస్కార్ట్ బందోబస్తు నడమ తరలిస్తాం. జిల్లా అంతటా పరీక్ష కేంద్రాల వద్ద 44 సెక్షన్ అమలులో ఉంటుంది. పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. ఈయన రొమ్ముల రాంబాబు. మాడ్గులపల్లి మండలం పూసలపాడుకు చెందిన ఈయన ఫర్టిలైజర్ యాప్తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సెల్ఫోన్లో యూరియా బుక్ చేసుకుందామని ఓపెన్ చేసిన ఆరు సెకన్లలోపే స్టాక్ లేదని చూపిస్తోందని అంటున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దెబ్బతిని నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లాలో వీరే కాదు.. ఈ యాసంగి సీజన్లో వరిసాగు చేసిన రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మునుగోడుకు చెందిన ఈ రైతు పేరు మధుసూదన్రెడ్డి. తనకు చదువు రాదని, యూరియా ఎలా బుక్ చేసుకోవాలని వాపోతున్నారు. ఎవరితోనైనా చేయిద్దామంటే యాప్లో యూనియా లేనట్లుగా చూపిస్తోందని చెబుతున్నారు. యూరియా కోసం ఆత్మహత్య చేసుకోవాలా? అని ప్రశ్నిస్తూ శుక్రవారం స్థానికంగా ఓ ఫర్టిలైజర్ షాపు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.ఈయన చిలుక ప్రతాప్రెడ్డి. ఈయనది త్రిపురారం మండలం జీఅన్నారం గ్రామం. 20 రోజుల నుంచి యూరియా బుక్ చేస్తున్నా దొరకడం లేదంటున్నారు. అసలు మండలానికి యూరియా వస్తుందో రావడంలేదో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు. వరిపొలం పొట్ట దళకు వచ్చే సమయంలో యూరియా దొరక్క వేయకపోతే పంట పండుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రైతులకు యూరియాను అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫర్టిలైజర్ యాప్లో యూరియా బుక్ చేసుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైతుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేక, ఫోన్లు ఉన్నా చదువురాని వారు బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ కేంద్రాల్లోకి వెళ్లి, లేదా మరెవరితోనైనా బుక్ చేయిద్దామని వెళ్లి యాప్ను ఓపెన్ చేసిచూస్తే యూరియా స్టాక్ లేనట్లే చూపుతోంది. ఎప్పు డు చూసినా యూరియా బుక్ కావడం లేదని, తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో జీరో చూపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను అధిగమించాలని.. గత వానాకాలం సీజన్లో తలెత్తిన ఇబ్బందులను అఽధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ను తెచ్చింది. సీజన్ ఆరంభంలో నాన్ ఆయకట్టులో ఎలాగోలా రైతులు ఫర్టిలైజర్ యాప్లో యూరియాను బుక్ చేసుకుంటే ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. ఆ తరువాత 15 రోజులకు మళ్లీ బుక్ చేసుకుందామంటే దొరకడం లేదని వాపోతున్నారు. మరోవైపు ఆయకట్టు ప్రాంతంలోనూ గత నెలలో నాట్లు వేసిన రైతులు యూ రియా కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవసరం మేరకు రాని యూరియా జిల్లాలో యాసంగి సీజన్లో 5.45 లక్షల ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ఈ సీజన్లో 74,955 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే జిల్లాలో గత వానాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ నుంచి ఇప్పటివరకు జిల్లాకు 64,797 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం దొరకడం లేదు. ఇష్టానుసారంగా కేటాయింపులు సహకార సంఘాలకు, డీలర్లకు యూరియాను మార్క్ఫెడ్ కేటాయిస్తుంది. అందులో సంఘాలకు 60 శాతం, డీలర్లకు 40 శాతం ఇస్తారు. మార్క్ఫెడ్ అధికారులు ఆ 40 శాతం యూరియాను వారికి అనుకూలంగా ఉన్న డీలర్లకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యారియా అలాట్ కాగానే ఆయా డీలర్లు తమ రెగ్యులర్ రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వడం, మరోవైపు డీలర్లే రైతుల పేరుతో బుక్ చేస్తున్నారు. దీంతో మిగతా రైతులకు యూరియా దొరకడం లేదు.ఫ సీడీఎస్ఈ కమిటీ చెర్మన్ రామరాజు ఫ ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరు అయ్యేందుకు 5 నిమిషాలు సడలింపు ఫ 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఫ 45 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఫ జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 27,714 మంది విద్యార్థులు ‘సాక్షి’తో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూ రైతులు యూరియా కోసం సెల్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుక్ చేద్దామనుకున్న ప్రతిసారి జీరో స్టాక్ చూపిస్తోంది. జిల్లాలో గురువారం 2502 బస్తాలు ఉన్నట్లు చూపినా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఏ మండలంలో కూడా యూరియా లేదు. శుక్రవారం అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడే మిగితా నియోజవకర్గాల్లోని మండలాల్లో చూసినా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఫ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్తో రైతుల ఆగచాట్లు ఫ ఎప్పుడు ఓపెన్ చేసినా ఆన్లైన్లో కనిపించని స్టాక్ ఫ స్మార్ట్ఫోన్లు లేక, బుక్ చేసుకోవడం తెలియక చాలామంది తిప్పలు ఫ యూరియా అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలం ఫ యాసంగి సీజన్ వరికి అదును దాటుతోందని కర్షకుల ఆవేదన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాం. విద్యార్ధులు ఎవరైనా దివ్యాంగులు (బ్లైండ్) ఉంటే వారికి బదులుగా మరొకరు పరీక్ష రాసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవాలి. హాల్టికెట్లు ఇప్పటికే కళాశాలలకు చేరాయి. ఎవరైనా ప్రైవేటు కళాశాల వారు హాల్టికెట్లు ఇవ్వకుంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిమీద ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. -
పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలి
పెద్దఅడిశర్లపల్లి : యారియా యాప్ను రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. యూరియా కొనుగోలు కోసం ప్రవేశపెట్టిన యాప్ వద్దంటూ గురువారం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తానన్న రూ.15 వేల రైతు భరోసాను ప్రభుత్వం ఎగవేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి, సర్పంచ్లు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్, సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. -
సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు
ఫ రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్కు సంబంధించిన సన్నాల బోనస్ రూ.71.47 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం గురువారం జమ చేసింది. ఐదు నెలలుగా రైతులు సన్నాల బోనస్ కోసం నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధరతోపాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. వానాకాలం సీజన్కు సబంధించి జిల్లా వ్యాప్తంగా 31,416 మంది రైతుల నుంచి 1.48 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిచింది. ఇందుకుగాను రూ.355.18 కోట్లు చెల్లించింది. అందులో బోనస్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.74.33 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 1,42,942 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి 30,262 మంది రైతుల ఖాతాల్లో రూ.71.47 కోట్ల బోనస్ను జమ చేసింది. ఇంకా 5,732 మెట్రిక్ టన్నులకు గాను 1,154 మంది రైతులకు రూ.2.86 కోట్ల బోనస్ డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఎట్టకేలకు బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలుమునుగోడు : మండలంలోని రత్తిపల్లి, కల్వలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం జిల్లా స్థాయి అకడమిక్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిసరాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ఉపాధ్యాయులెవరైనా వినూత్నంగా బోధన చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా నోడల్ అధికారి టి.వెంకటరత్నం, బి.జైపాల్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు నర్సిరెడ్డి, గోనె మోహన్రావు, ఉపాధ్యాయులు ఆయేషా, సల్లానా, లక్ష్మీప్రసాద్, సీఆర్పీ నాగరాజు పాల్గొన్నారు. 22న గురుకుల ప్రవేశ పరీక్షనకిరేకల్ : గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి వీటీజీ సెట్–26 పరీక్ష ఈ నెల 22న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జె.శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 12,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్, ధ్రువీకరణ పత్రాలతో ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుకోవాలని సూచించారు. లింగ నిర్ధారణ.. చట్ట విరుద్దంనల్లగొండ టౌన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్లో పీసీఅండ్ పీఎన్డీటీ చట్టం–1994, నియమాలు–1996 అమలుపై నిర్వహించిన జిల్లా సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుదల వల్ల లింగ నిర్ధారణ, లింగ వివక్షను అరికట్టే ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలు.. చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అవసరమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల ఫైళ్లను సమీక్షించి, చట్టబద్ధ అర్హతలు ఉన్న కేంద్రాలకు మాత్రమే ఆమోదం తెలపాలన్నారు. గర్భ నిరోధక మాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ల్లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ చట్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ గైనకాలజిస్ట్ కట్టాజ్యోతి, నల్లగొండ వైద్య నిపుణులు డాక్టర్ సుచరిత, గైనకాలజీస్ట్ దీప, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కృష్ణకుమారి, ఎన్జీఓ గీత పాల్గొన్నారు. . -
న్యాయవాది ఇంటిపై దాడి అమానుషం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి న్యాయవాది జి.నరేష్ నివాసంలో ఆయన భార్యపై, చిన్న కూతురిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం అమానుష చర్య అని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్ అన్నారు. దాడిని ఖండిస్తూ గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాదిని హత్య చేయడం, హైదరాబాద్లో మరో న్యాయవాదిపై హత్యాయత్నం, ఇప్పుడు నల్లగొండలో జరిగిన దాడి ఇవన్నీ న్యాయవాదుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్.ఠాగూర్, జె.భాస్కర్రెడ్డి, ఎం.నాగిరెడ్డి, టి.కిషోర్కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జీఎన్ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి.అశోక్ కుమార్, మేక యాదగిరిరెడ్డి, ఎం.ప్రమీల, ఎన్.భాగ్యమ్మ, టి.వరుణశ్రీ, ఎ.వెంకట్రెడ్డి, కొండ శ్రీనివాస్, బి.మధు, ముక్కెర శ్రీని వాస్, కామేష్, ఎంవి.రమేష్, సల్లా నరేష్, బి.సైదులు, బి.స్వామినాథ్తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
గుర్రంపోడు, కొండమల్లేపల్లి : సేంద్రియ, జీవన ఎరువులు వినియోగిస్తూ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం ఆమె.. కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు కట్టెబోయిన శ్రీనివాస్ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అలాగే జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సేంద్రియ, జీవన పద్ధతుల్లో పంట సాగు వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని, కొందరు రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేవలం 143 మంది ఉద్యానవన అధికారులు మాత్రమే ఉన్నారని, క్షేత్రస్ధాయిలో రైతులకు మరింతగా సేవలందించేందుకు వలంటీర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందన్నారు. జిల్లాలోని బత్తాయి రైతులు మార్కెటింగ్ సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు తీరుస్తామన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు శిక్షణ ఇప్పించాలి : ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ (వీసీ) రాజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2011లో లక్షపైగా ఎకరాల్లో బత్తాయి పంట సాగైతే ఇప్పుడు 41వేల ఎకరాలకు పడిపోయిందని గుర్తు చేశారు. విచక్షణారహితంగా పురుగుల మందు వాడకుండా సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి మిగతా వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఆయా సమావేశాల్లో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్కుమార్, నాబార్డు సీజీఎం ఆరిఫ్, డీడీఎం వినయ్కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రాజాగౌడ్, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, అధికారులు పి.అనంతరెడ్డి, హెచ్ఓ మురళి, ఏఓ కె.మాధవరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఫ గుర్రంపోడు, కొండమల్లేపల్లిలో బత్తాయి క్షేత్రాల సందర్శన ఫ ఆయా చోట్ల రైతులతో సమావేశాలు -
నేరస్తుల పనిపడతాయ్..
నల్లగొండ : జిల్లా పోలీసు విభాగానికి రెండు పేలుడు పదార్థాలను గుర్తించే స్నిఫర్ (బిట్టు, చింటూ) శునకాలు, నేరస్తుల జాడను పసిగట్టే ఒక ట్రాకర్ (సోను) శునకం నూతనంగా చేరినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అనంతరం డాగ్ హ్యాండ్లర్లు (కానిస్టేబుళ్లు) ఫకృద్దీన్, సతీష్, దుర్గాప్రసాద్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శునకాలు హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో గల పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, (ఐఐటీఏ)లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్నాయన్నారు. పేలుడు పదార్థాలు (ఎక్స్ప్లోజివ్స్) గుర్తింపు, అనుమానాస్పద వస్తువుల తనిఖీ, నేరస్తుల అడుగుజాడల గుర్తింపు, గందరగోళ పరిస్థితుల్లో విధి నిర్వహణ వంటి అంశాలలో శునకాలకు శిక్షణ ఇచ్చారన్నారు. దొంగతనాలు, హత్య కేసుల విచారణలో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వీఐపీల పర్యటనలు, భారీ ప్రజాసభలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో ముందస్తుగా తనిఖీలు నిర్వహించడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. అనుమానాస్పద బ్యాగులు, వాహనాలు, భవనాల ప్రాంగణాలలో ఎక్స్ప్లోజివ్స్ గుర్తింపులో ఇవి ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాయని వివరించారు. నూతనంగా చేరిన ఈ శునకాలతో జిల్లా పోలీసు విభాగం మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తుందన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద విషయాలను వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. ఫ నూతనంగా మూడు స్నిఫర్, ట్రాకర్ శునకాలు ఫ భద్రతా విభాగానికి మరింత బలం చేకూరిందన్న జిల్లా ఎస్పీ -
పార్కులను మోడల్గా తీర్చిదిద్దుతాం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నగరంలోని పార్కులను మోడల్గా తీర్చిదిద్ది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న పార్కులకు దీటుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 38, 41 డివిజన్లలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఆయన.. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్, తాగునీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని.. శానిటేషన్ మెరుగు పరిచేందుకు ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. నగరంలో రౌడీయిజం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, కమిషనర్ శరత్చంద్ర, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్లు కేసాని వేణుగోపాల్రెడ్డి, బోయినపల్లి వేదశ్రీ శ్రీనివాస్, బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పదేళ్లలో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్ పది సంవత్సరాల్లో నల్లగొండ ఇండస్ట్రియల్ హబ్గా తయారు కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్కుల అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అమరావతి మీదుగా బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రూ.20 వేల కోట్లతో చేపడుతున్నారని, ఆ హైవే వెంటే బుల్లెట్ ట్రైన్ కూడా వేయబోతున్నారని, దీంతో నల్లగొండ జిల్లా భవిష్యత్లో ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుందన్నారు. రెండేళ్లలోనే నల్లగొండలో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నల్లగొండలో కాలుష్యం బారిన పడకుండా పార్కులను అభివృద్ధి చేసి గ్రీనరీని పెంచాలని నిర్ణయించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్ను సూపర్ స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీలగిరిలో పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
పంటల సర్వేకు వలంటీర్లు
నల్లగొండ అగ్రికల్చర్ : పంటల డిజిటల్ సర్వే కోసం వలంటీర్లను నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి.. జిల్లా వ్యవసాయ శాఖకు ఉత్తర్వులను జారీ చేశారు. వ్యవసాయ డిగ్రీ, డిప్లొమో, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని నియమించాలని వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ)లకు ఆదేశాలు ఇచ్చింది. వలంటీర్లు ఆయా గ్రామాలకు చెందిన స్థానికులై ఉండాలని అందులో పేర్కొంది. 45 రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహించలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల నమోదును ప్రైవేట్ వలంటీర్ల ద్వారా చేయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. శిక్షణ అనంతరం సర్వే.. జిల్లా వ్యాప్తంగా 140 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే కెడస్ట్రల్ మ్యాప్ (భూభారతి మ్యాప్) కలిగి ఉన్న 495 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే పోర్టల్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతోపాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగి ఉన్న వారిని ఈ నెల 20వ తేదీ వరకు వలంటీర్లుగా నియమించి అనంతరం వారికి ఒకటి రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి నెలాఖరు వరకు సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయ శాఖ యోచిస్తోంది. 5.66 లక్షల ఎకరాల్లో సాగు.. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 5.66 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 5.44 లక్షల ఎకరాలు, వేరుశనగ ఇతర పంటల సాగు మరో 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంటలను పూర్తి స్థాయిలో వలంటీర్ల డిజిటల్ సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఈ నెల 20 వరకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తికా గానే వారికి శిక్షణ ఇస్తాం. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోనే యాసంగి పంటల సాగుపై డిజిటల్ సర్వేను ప్రారంభించనున్నాం. ఇప్పటికే కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామకంపై ఇప్పటికే దృష్టి సారించారు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓఫ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం ఫ ఏఈఓలకు ఎంపిక బాధ్యతలు ఫ ఉత్తర్వులు జారీచేసిన వ్యవసాయ శాఖ ఫ ఇప్పటికే నియామక ప్రక్రియ షురూ.. ఫ నెలాఖరులో సర్వే ప్రారంభించే అవకాశం వ్యవసాయ క్లస్టర్లు 140 రెవెన్యూ గ్రామాలు 564 భూభారతి మ్యాప్ కలిగిన గ్రామాలు 495 జిల్లాలో 5.66 లక్షల పంటల సాగు ఎకరాలుఒక్కో నమోదుకు ఏడు రూపాయలు.. ఎంపికై న వలంటీర్లకు మొబైల్ యాప్ ద్వారా వారికి పంటల నమోదుపై జిల్లా వ్యవసాయ శాఖ శిక్షణ ఇవ్వనుంది. పంటల డిజిటల్ సర్వే చేసే వలంటీర్లకు ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం ఏడు రూపాయల చొప్పున చెల్లించనుంది. డిజిటల్ సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు చేశారు, రైతు ఫోన్ నంబర్ను డిజిటల్ సర్వేలో నమోదు చేయనున్నారు. -
పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని వినతి
నల్లగొండ టౌన్ : మొబైల్ యాప్ ద్వారా యూ రియా పంపిణీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని కోరుతూ రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ చంద్రశేఖర్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు వివరించారు. అనేక మంది రైతులకు స్మార్ట్ ఫో న్లు లేవని, ఉన్న రైతులకు యాప్పై అవగాహన లేదన్నారు. యాప్ నిబంధనలు తీసి వేసి రైతులకు ఎప్పటిలా పాత పద్ధతిలో యూరియా అందించాలని కోరారు. లేకపోతే పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్పై అవగాహననల్లగొండ టౌన్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని దీప్తి గ్రూప్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థినులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్పీవీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ జయకుమారి, లెక్చరర్లు పాల్గొన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలినల్లగొండ : పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజినీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను వారు ప్రారంభించి మాట్లాడారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పైచదువులకు వెళ్లడానికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఖమ్మంపాటి శంకర్, మమత, కిరణ్, అశోక్రెడ్డి, ఆకారపు నరేష్, తారాసింగ్, రమ్య, శ్రీకాంత్, అక్బర్, అజయ్, భరత్, విఘ్నేష్, కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, రమేష్, బుడిగ వెంకటేష్, మారుపాక కిరణ్, స్పందన, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసంనల్లగొండ టూటౌన్ : ఆంగ్ల భాష పరిజ్ఞానంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఆయన బుధవారం నల్లగొండలోని ఎంజీయూలో ఇంగ్లిష్ లాంగ్వెజ్ ట్రైనింగ్ సెంటర్కు ఇన్చార్జి డైరెక్టర్గా దండా రవీందర్రెడ్డికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల పరిజ్ఞానంతో విద్యార్థులు మెరుగైన అవకాశాలను అందుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆంగ్ల విభాగ అధిపతి అరుణప్రియ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల అంజిరెడ్డి పాల్గొన్నారు. పాఠశాలల తనిఖీచండూరు : చండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాఽధికారి బొల్లారం భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. చండూరులోని జిల్లా పరిషత్ పాఠశాల, కేజీబీవీ, చండూరు ప్రాథమిక పాఽఠశాలలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు గుణాత్మక విద్యను బోధిందించాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగించి విషయ బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. కేజీబీవీలో బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆహార పదార్థాలను, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. -
ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లుగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఇంటర్ కీలకమని ఈ దశలో భవిష్యత్ నిర్ణయమవుతుందని తెలిపారు. భవిష్యత్లో కృత్రిమ మేధ రంగంలో విస్త్రత అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ విద్యార్థులకు అందిస్తామన్నారు. కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తానని ఆదివారంలోగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని కమిషనర్కు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ పాల్గొన్నారు -
శివన్నగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మర్రిగూడ : శివన్నగూడెం రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చొరవతో మంజూరైన 54 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ పీడీ రాజ్కుమార్ బుధవారం శివన్నగూడెంలో పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు ఇప్పటివరకు తమకు ఎలాంటి ఇంటి బిల్లులు అందలేదని ఆయన పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి బిల్లులు అందేలా చూస్తానని పీడీ వారికి భరోసా కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూన ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట డీఈ అబ్దుల్వాజిద్, ఎంపీడీఓ జి.చినమునయ్య, ఏఈ ఈశ్వర్ తదితరులు ఉన్నారు. -
సాగర్డ్యాం భద్రతపై ఇంటెలిజెన్స్ సమీక్ష
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై మంగళవారం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు. సాగర్లోని విజయవిహార్ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాజెక్టు భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన అదనపు భద్రత చర్యలపై చర్చించారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు, సీసీ కెమెరాల నిఘా బలోపేతం, సందర్శకుల నియంత్రణ వంటి అంశాలపై ప్రధానంగా సమీక్ష సాగినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్వహణ, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించినట్లు సమాచారం. అనంతరం అధికారులు జెన్కో కార్యాలయంలో విద్యుదుత్పత్తి విభాగానికి సంబంధించిన భద్రత, నిర్వహణలపై కూడా సమీక్షించారు. సమీక్ష సమావేశం అనంతరం పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. డ్యాం సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షలో ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ హీరాలాల్నాయుడు, సీఐ సునీల్కుమార్, ఈఈ సీతారాం, డీఈ అశోక్, భద్రత అధికారి శ్రీనివాసరావు, ఏఈలు సత్యనారాయణ, విజయ్ ఉన్నారు. -
ఘనంగా కేసీఆర్ జన్మదినం
నల్లగొండ టూటౌన్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కేక్ కట్చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అకుంఠిత దీక్షతో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, మాలె శరణ్యారెడ్డి, చెరుకు సుధాకర్, చీర పంకజ్యాదవ్, నిరంజన్వలి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, కరీంపాషా, కంచనపల్లి రవీందర్రావు, బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, మారగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీయూ విద్యార్థులకు వీసీ అభినందన
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పలువురు విద్యారుథలను అభినందించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్లోని తెలుగు శాఖకు చెందిన విద్యార్థులు లింగరాజు, నవ్య యూజీసీ నిర్వహించిన జాతీయ అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచారు. శ్రీధర్, అంజి, జగన్, ఎస్కె.సనా, ప్రశాంత్, మల్లేపల్లి, మమత పీహెచ్డీలో ప్రవేశం పొందడానికి అర్హత సాధించారు. 21వ శతాబ్దపు సీ్త్రల సాహిత్యం సమాలోచన అనే అంశంపై కర్నూల్లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పత్ర సమర్పణ చేసిన విద్యార్థులు మంద స్నేహిత, ధరంసోత్ లలిత, ఏపీలో నిర్వహించే అంతర్జాతీయ రచయితల మహాసభలకు కాట్రావత్ గణేష్ ఎంపికయ్యారు. వీరిని వీసీ అభినందించి.. సాహిత్య, సృజన రంగాల్లో నిరంతరం కృషి చేస్తూ విశ్వవిద్యాలయానికి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో అరుణ ప్రియ, మ్యాతరి ఆనంద్, మద్దిరాల సత్యనారాయణరెడ్డి, అనితకుమారి, అనిల్కుమార్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలినల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కష్టపడేతత్వం అలవర్చుకోవాలినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు మొదటి నుంచే కష్టపడేతత్వం అలవరుచుకోవాలని నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. ఫుట్బాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, నెట్బాల్ క్రీడలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్ఓ అక్బర్అలీ, బొమ్మపాల గిరిబాబు, పుల్లయ్య, బయన్న, కిరణ్ కుమార్ ఉన్నారు. యూరియా అందుబాటులో ఉందిమిర్యాలగూడ : జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు సంబందిత 13బీ లేదా వన్ బీ జిరాక్స్ కాపీలను, ఆధార్ లేకుండా సాగుచేసే వాళ్లు గ్రామ పరిపాలన అధికారి, ఏఈఓలను సంప్రదించి ఆన్లైన్ చేసుకుని యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, ఏఓ రుషేంద్రమణి, ఏఈఓ పార్వతి, సైదులు, సీఈఓ వెంకట్రెడ్డి, రైతులు శ్యాంసుందర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
పాలనలో దక్షత చూపాలి
నల్లగొండ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదకు అందించేందుకు పాలనలో దక్షతను చూపాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రొబేషనరీ గ్రూప్–1 అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. నల్లగొండ అతిపెద్ద జిల్లా అని, 566 రెవెన్యూ గ్రామాలు, 869 గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు. అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్పై నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేసి భవిష్యత్లో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ శిక్షణ భవిష్యత్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఎంసీహెచ్ఆర్డీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. నల్లగొండ : పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్ ఎస్డీఎస్, ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజిషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని విభాగాల వారీగా పరిశీలించి, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపులు వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సౌర విద్యుత్కు రూ. 944 కోట్లు మంజూరు
హాలియా : తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 944 కోట్లను కేటాయించిందని టీజీఎస్పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ వెల్లడించారు. మంగళవారం హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సౌర విద్యుత్ వినియోగంపై అధికారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 81 గ్రామాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామని, మొదటగా కొండారెడ్డిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అనుముల గ్రామాన్ని సోలార్ విద్యుదీకరణకు ఎంపిక చేశామని, దానికి గృహ జ్యోతి విద్యుత్ వినియోగదారులకు రెండు కిలో వాట్స్ సోలార్ ప్యానల్ బిగిస్తామని చెప్పారు. అనుముల మండలంలో 605 మంది విద్యుత్ వినియోగదారులకు ఈపథకం వర్తించనుందన్నారు. 7.5 కిలో మీటర్ల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అమర్చనున్నామని చెప్పారు. అనుముల గ్రామానికి పూర్తిస్థాయి సౌర విద్యుత్ను అందించేందుకుగాను రూ.44.94 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, టీఎస్ రెడ్కో అధికారి అనిలా, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్లు చంద్రశేఖర్రెడ్డి, అంకతి సత్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌనీ రాజా రమేష్యాదవ్, ఏడీఈ తిరుపతయ్య, ఏఈ ధనుంజయ, పాండురంగ తదితరులు ఉన్నారు. అధికారులతో సమీక్ష నల్లగొండ : నల్లగొండలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో టీజీఎస్పీడీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ సమీక్షించారు. అనుముల, కంగాల్, ముదిగొండ గ్రామాల్లో సుమారు 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.97.39 కోట్లు వ్యయం చేయనున్నాన్నారు. మోడల్ సోలార్ గ్రామాలపై మార్గదర్శకాలు వివరించారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీఫారూఖీ -
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి లక్షపుష్పార్చన నిర్వహించారు. అమావాస్య రాత్రి నిద్ర చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ పూజలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్ఐ విష్ణుమూర్తి గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా.. ఏకశిఖరవాసుడిగా.. పంచనారసింహుడిగా.. స్తంభోద్భవుడిగా.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన ఫాల్గుణ శుద్ధ ద్వాదశి శనివారం రోజున శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం, సంప్రదాయ రీతిలో ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయానికి తాత్కాలికంగా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు. విష్వక్సేన ఆరాధనతో.. యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10గంటలకు శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, ఈ నెల 28వ తేదీన ఉదయం శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 24న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం , 25న తిరు కల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. 11 రోజులు ఆర్జిత సేవలు రద్దు.. బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయంలో భక్తులచే నిర్వహించే వివిధ ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. 24 నుంచి 26 వరకు భక్తులచే సాయంత్రం నిర్వహించే సహస్రనామార్చనలు, భోగములు రద్దు చేశారు. 27న నిర్వహించే లక్ష పుష్పార్చన పూజలను సైతం నిలిపివేస్తారు. 27 నుంచి 28వ తేదీ వరకు భక్తులచే జరిపించే అభిషేకం, అర్చనలు రద్దు చేశారు.నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు ఫ 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం ఫ 28న శృంగార డోలోత్సవంతో ముగింపు -
స్మార్ట్ సిటీపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో స్మార్ట్ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. మరుసటి రోజు మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెల్లవారుజాము 4 గంటల నుంచే నగరంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం బజార్లో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చేందుకు దగ్గరుండి డివైడర్లను తొలగింపజేశారు. గుట్టలు ఎక్కి పరిశీలన మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజాము 4 గంటలకే లతీఫ్సాహెబ్గుట్ట, బ్రహ్మంగారిగుట్ట పైకెక్కి పట్టణ వ్యూను పరిశీలించారు. ఆ తర్వాత మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు పోలీసులతో ప్రకాశంబజార్ చేరుకున్నారు. ప్రకాశంబజార్లోని డివైడర్ మధ్యలో చిరు వ్యాపారం చేయడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన డివైడర్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీలను రప్పించి అక్కడే ఉండి డివైడర్లను తొలగించడంతో పాటు మట్టిని వెంటనే తొలగించి సాయంత్రంలోగా రోడ్డును వేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ వ్యాపారం చేసుకునే వారికి పక్కనే ఉన్న పాత కలెక్టరేట్ స్థలాన్ని ఇవ్వాలని సూచించారు. దీంతో అధికారులు వెంటనే ప్రకాశంబజార్ ఎక్బాల్ మీనార్ నుంచి మైసయ్య విగ్రహం వరకు ఉన్న డివైడర్లను తొలగించారు. ప్రకాశంబజార్లో తొలగించిన డివైడర్ల స్థానంలో యథావిధిగా రోడ్డు వేస్తున్నారు. రూ.20 కోట్లతో అండర్గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టు ప్రకాశంబజార్ ఎక్బార్ మీనార్ నుంచి డివైడర్ తొలగించిన ప్రాంతం గుండా మైసయ్య విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా గొల్లగూడ అవుట్డోర్ స్టేడియం వరకు రూ.20 కోట్లతో అండర్గ్రౌండ్ కేబుల్ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారి ఖాదర్ వద్ద రూ.30 వేలు పెట్టి పండ్లు కొనుగోలు చేసి అక్కడ పంపిణీ చేశారు. రోడ్డు వెడల్పు వల్ల రద్దీ తగ్గుతుందన్నారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగనీయమని.. వారిని కాపాడుకునే బాధ్యత తనదేనని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ప్రకాశం బజారులో డివైడర్ను తొలగిస్తున్న జేసీబీ, డివైడర్ తొలగించిన చోట వేస్తున్న రోడ్డుప్రకాశం బజారులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ తాను పేదల మనిషినని, చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా వారు వ్యాపారం చేసుకునేలా పాత కలెక్టరేట్లో స్థలం కేటాయిస్తున్నామని చెప్పారు. చిరు వ్యాపారులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 70 మంది చిరు వ్యాపారులు డివైడర్పై వ్యాపారం నిర్వహిస్తున్నారని వారికి 50 నుంచి 100 గజాల స్థలం కేటాయిస్తున్నామన్నారు. ప్రకాశంబజార్ నల్లగొండకు గుండెకాయ లాంటిదని, అక్కడ వ్యాపారం పెరగడంతో పాటు రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్నయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పాత కలెక్టరేట్లో ఉన్న డీసీఎం వాహనాల పార్కింగ్ను మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫ నీలగిరిలో తెల్లవారుజామున 4 గంటల నుంచే మంత్రి కోమటిరెడ్డి పర్యటన ఫ ప్రకాశం బజారులో డివైడర్ను దగ్గరుండి కూల్చి వేయించిన మంత్రి ఫ చిరు వ్యాపారులకు పాత కలెక్టరేట్ స్థలం కేటాయించాలని ఆదేశాలు ఫ నగర పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటిరోజే విస్తరణ పనులకు శ్రీకారం -
చెట్ల పొదల్లో నవజాత శిశువు
కోదాడ రూరల్ : ఆడబిడ్డ భారం అనుకున్నారో.. లేక మరేదో కారణమో తెలియదు కానీ ఓ నవజాత శిశువును చెట్ల పొదల్లో వదిలి పేగుబంధం తెచ్చుకుంది ఓ తల్లి. ఈ అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుడిబండ గ్రామానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలంలో కూలీలు కలుపు తీసేందుకు వెళ్లగా రోడ్డుకు కొద్దిదూరంలో చెట్ల పొదల్లోనుంచి ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. వారు ఎదురుగా ఉన్న ఇంటి వారితో కలిసి అక్కడకు వెళ్లి చూడగా నుదిటిపై స్వల్పగాయంతో ఓ ఆడశిశువు కనిపించింది. వారు ఆ శిశువును దగ్గరకు తీసుకొని పాలుపట్టించి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. గ్రామ కార్యదర్శికి, ఐసీడీఎస్, వైద్య సిబ్బందికి విషయాన్ని తెలిపి అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ శిశవును చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు శిశువు జన్మించి 24 గంటలు అవుతుందని నుదిటిపై ఉన్న గాయాన్ని బట్టి చూస్తే మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో అక్కడ వదిలి ఉండవచ్చని, శిశువు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. నుదిటిపై గాయం, పొట్టపై చారలు ఉండటంతో రెండు రోజుల వైద్య చికిత్సకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నల్లగొండలోని శిశుగృహలో అప్పగిస్తామని ఐసీడీఎస్ నిర్వాహకులు తెలిపారు. కుక్కలు తిరిగే ప్రదేశంలో వదిలి.. పసికందును వదిలివెళ్లిన ప్రదేశంలో పదుల సంఖ్యలో కుక్కలు తిరుగుతుంటాయి. గ్రామ శివారు కావడంతో చికెన్ వ్యర్థాలతో పాటు గ్రామంలోని చెత్తాచెదారం కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు వెంటనే పడేస్తుంటారు. వాటిని తీనేందుకు అక్కడ కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డుపై వెళ్లే వారివెంట కూడపడుతుంటాయి. అలాంటి ప్రదేశంలోనే ఆ పసికందును వదిలి వెళ్లారని కుక్కలు చూస్తే దారుణం జరిగేదని గ్రామస్తులు అంటున్నారు. ఫ ఆడ శిశువును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఫ కోదాడ మండలం గుడిబండ శివారులో ఘటన -
అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్య
నిడమనూరు : అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరుకు చెందిన పసుపులేటి కొండలు(45) తన భార్యతో కలిసి హాలియాలో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. హోటల్ నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హాలియాలోని హోటల్ నుంచి నిడమనూరులోని ఇంటికి వచ్చిన కొండలు రాత్రి ఇంటి లోపల పడుకున్నాడు. తమ్ముడు శ్రీనివాస్ ఇంటి బయట నిద్రించాడు. తెల్లవారుజామున శ్రీనివాస్ తన అన్న కొండలును హోటల్కు వెళ్లవా అన్న అంటూ నిద్ర లేపగా కొంచెం సేపు పడుకుని పోతానని సమాధానం చెప్పాడు. అనంతరం శ్రీనివాస్ తెల్లవారుజామున సుమారు 5గంటల సమయంలో మరోసారి కొండలును లేపడానికి వెళ్లగా అప్పటికే కొండలు ఇంటిలోని ఇనుప పైపుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య రమణ ఫిర్యాదుతో ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, పదేళ్లలోపు వయస్సు గల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి కోదాడ రూరల్ : చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ చెరువులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన వంగవీటి జయకృష్ణ(40) హైదరాబాద్లోని ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట ఇంటికి వచ్చిన అతను మంగళవారం ఉదయం బయటకు వెళ్తున్నాని చెప్పి చెరువులో శవమై తేలాడు. గేదెల కాపారులు గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బటయకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి గొంతుపై కత్తిగాట్లు ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతుడు గత కొంతకాలంగా మానసిక ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. పురుగుల మందు తాగిన యువకుడు మృతి డిండి : పరుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం డిండిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం చండూరు మండలం శ్యామలపల్లికి చెందిన ఎన్.శ్రీశైలం(30)కు డిండికి చెందిన గిరమోని సంధ్యారాణితో వివాహమైంది. నాలుగేళ్లుగా శ్రీశైలం డిండిలోని ఓ రైస్ మిల్లులో మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి శ్రీశైలం తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. దీంతో ఈనెల 16న శ్రీశైలం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య సంధ్యారాణి కుటుంబ సభ్యులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి తీసుకపోగా అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీశైలంను హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అతడు మృతి చెందాడు. భార్య సంఽంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పామని ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
జేఈఈ మెయిన్స్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేట టౌన్ : జేఈఈ మెయిన్స్–2026 పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాలకు చెందిన 23 మంది విద్యార్థులు ఆలిండియా స్థాయిలో 90, ఆపైన పర్సంటైల్స్ సాధించారని కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం జయ జూనియర్ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. కళాశాలకు చెందిన జి.శ్రీనిక 99.39 పర్సంటైల్స్, ఎం.రితిన్శెట్టి 99.23, సీహెచ్.శివకుమార్ 99.09, ఎన్.సాయిరిత్విక్ 98.84, ఎస్కె.నేహ 98.57, ఎస్.అషువర్థన్రెడ్డి 98.42, ఎండి.హాదియ 96.96, జి.వంశీ 96.09, జి.హర్షిత 95.92, వి.గౌతమ్కుమార్ 95.71, డి.సిరి 95.39, బి.నవనీత 94.07, ఎం.హర్షిత 93.95, ఎం.నవ్యశ్రీ 93.91, ఆర్.మేఘరాజ్ 93.61, వై.హరీనశర్మ 92.48, ఎన్.హారిని 91.92, జి.మనోవర్షిత 91.90, బి.జ్ఞానసాయి 91.50, పి.అభివన్రెడ్డి 90.95, ఎ.నాగనక్షత్ర 90.63, కె.శ్లేష్మ 99.01, సీహెచ్.తరుణ్తేజ్ 90.02తో పాటు 23 మంది విద్యార్థులు 90 పైన పర్సంటైల సాధించినట్ట చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్తోపాటు డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నాటి భక్తోత్సవాలే.. నేటి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతంత్య్రానికి ముందే స్థానికులు మూడ్రోజులుగా భక్త్త్సోవాలు నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. శ్రీస్వామి వారిపై నమ్మకంతో భక్తులు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పూర్వం కాలంలో ఘాట్ రోడ్డు లేక, మెట్లదారి కూడా అంతంతే ఉండటంతో భక్తోత్సవాలకు వచ్చే భక్తులు కొండ ఎక్కేందుకు నానా ఇక్కట్లు పడేవారు. అయితే ఈ ప్రాంత వాసులు శ్రీస్వామిని ఆరాధించేందుకు ఎలాగో కొండెక్కేవారట. ఉత్సవాలు జరిపేందుకు ఉత్సాహాన్ని కనబర్చేవారని పూర్వీకులు చెబుతారు. ఈ క్రమంలో అప్పట్లో తొలుత మూడు రోజులు ఉత్సవాలను నిర్వహించారు. కీకారణ్యం, వసతులు లేని కాలంలో (సుమారు 1895) ప్రాంతంలో ఆ ఉత్సవాలు జరిగాయి. అప్పట్లో భక్తులు నిర్వహించవారు కాబట్టి.. వాటిని భక్తోత్సవాలనేవారు. కొన్నేళ్లు గడిచాక ఐదు రోజులకు పెంచారు. అయితే మార్గశిర మాసంలో ఆ సంబురాలు జరిగేవి. ఆ కాలంలో శ్రీస్వామి ఉత్సవాలు జరపడం సబబుకాదంటూ అప్పట్లోనే పూజారులు కొందరు ఫాల్గుణ మాసంలో 11 రోజుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పట్లోనే హైదరాబాద్, మహబూబ్నగర్, మహారాష్ట్ర, వరంగల్ వంటి ప్రాంతాలకు చెందిన భక్తులు అధికంగా ఈ క్షేత్రానికి వచ్చేవారని పాతతరం వారు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక అప్పటి ఆలయ కమిటీ పెద్దలు ఆచార్యులతో సంప్రదించి 1955లో 11 రోజుల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి శ్రీస్వామి బ్రహ్మోత్సవాలు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఎందరినో ప్రముఖులను స్వాగతిస్తున్నారు. యాదగిరిగుట్ట : యాదవ మహర్షి ఘోర తపస్సుతో యాదగిరిగుట్టలోని కొండ గుహల్లో వెలసిన పంచనారసింహుడి క్షేత్రం దినాదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు కింకారణ్యం గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు నిత్యం పూజలు చేస్తుండే వారు. హైదరాబాద్ వాస్తవ్యులు రాజామోతీలాల్ 1920లో శ్రీస్వామికి ఆగమశాస్త్రం ప్రకారం పూజాది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి క్షేత్రం అభివృద్ధికి బాటలు వేశారని చరిత్రకారులు చెబుతారు. ఆ తరువాత ప్రభుత్వాల తోడ్పాటుతో క్షేత్రం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రి క్షేత్రాన్ని కనీవిని వెరుగని రీతిలో ఆలయ పునర్నిర్మాణం చేసి 2022 మార్చి 28న ప్రధానాలయాన్ని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన కార్యక్రమం చేయించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో గతేడాది క్షేత్రంలోని విమాన గోపురానికి 65 కిలోల బంగారంతో తాపడం చేసి శ్రీస్వామి వారికి అంకితమిచ్చారు. ఫ పూర్వ కాలంలో మూడు రోజులే ఉత్సవాల నిర్వహణ ఫ 1955 నుంచి 11 రోజుల ఉత్సవాలకు శ్రీకారం -
నారసింహుడికి సమర్పించే పట్టు వస్త్రాల పరిశీలన
భూదాన్పోచంపల్లి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించనున్న పట్టు వస్త్రాలను మంగళవారం యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పట్టు వస్త్రాలను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు. రెండు పట్టుచీరలు, పట్టుపంచెలు.. పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఏటా శ్రీలక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అమ్మవారికి తంగేడుపూల రంగు, ప్యాక బంగారువర్ణం, ముద్దమందారం డిజైన్లో వంకాయ రంగు కలిగిన అంచు, జరీ బార్డర్ పాన్పటోలా కాంబినేషన్ చీర, మరొక చీర గులాబీలో ఎరుపురంగు బాడీలో తీగతో కూడిన మల్లెపూల డిజైన్, వంకాయ అంచు, జరీ బార్డర్లో కొత్త కాంబినేషన్లో రెండు చీరలను తయారు చేశామని అన్నారు. స్వామివారికి సమర్పించేందుకు రెండు పట్టు పంచెలు, రెండు శాలువాలను 15 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో మగ్గంపై తయారు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు భోగ నర్సింహ, అంకం మురళి, ప్రధానకార్యదర్శి భారత బాలరత్నం, సహాయ కార్యదర్శి కడవేరు చంద్రమౌళి, కోశాధికారి సంగెం చంద్రయ్య, సభ్యులు గంజి అంజయ్య, గుండు పాండు, కర్నాటి అంజమ్మ, తడక యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి..
హాలియా : పెద్దవూర మండలం బట్టుగూడెంలో శివరాత్రి ఉత్సవాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని వస్తూ రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. ఈ సంఘటన హాలియా పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ సతీష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల వెంకటయ్య (50), పిట్టల మల్లమ్మ (45) ఇరువురు భార్యభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరి వివాహాలు కావడంతో మూడేళ్ల క్రితం అనుముల మండలం కొట్టాల గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. గ్రామంలో తమ పేర ఉన్న రెండు ఎకరాలకుతోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దవూర మండలం బట్టుగూడెంలో జరిగిన శివరాత్రి ఉత్సవాలను చూసేందుకు మంగళవారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు టీవీఎస్ వాహనంపై వెళ్లారు. శివాలయంలో స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం ఈ దంపతులు సాయంత్రం కొట్టాలకు బయలుదేరారు. మార్గమధ్యలో హాలియా సమీపంలోని ఎడమ కాల్వ బ్రిడ్జిపై వీరి ద్విచక్ర వాహనాన్ని పెద్దవూర నుంచి హాలియా వైపు వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. వాహనంపై నుంచి భార్యభర్తలు ఇరువురు రోడ్డుపై పడడంతో లారీ డ్రైవర్ చూసుకోకుండా వారి మీదనుంచి లారీని పోనిచ్చాడు. దీంతో భార్యభర్తల ఇద్దరి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్రెడ్డి, పోలీస్ సిబ్బందితో ఘటన స్థలం వద్దకు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సాగర్ కమలానెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కట్టంగూర్ శివారులో జార్ఖండ్ వాసి మృతికట్టంగూర్ : కట్టంగూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లా జార్గో మండలం దానుముండా గ్రామానికి చెందిన బెలాసి సాధికా ముండా(26) తన భార్య బెలాసి కుమారితో కలిసి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు ఈ నెల 16 మధ్యాహ్నం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కట్టంగూర్ గ్రామ శివారులోకి రాగానే సాధికా ముండా బస్సు డ్రైవర్ వద్దకు వెళ్లి మూత్రం పోసివస్తానని చెప్పి కిందికి దిగి బస్సు వెనకవైపునకు వెళ్లి రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం కంటెనయిర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం టైర్ల కింద పడిన సాధికా ముండా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడికి అదే గ్రామానికి చెందిన కుమారితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కాగా మృతుడు ఆరేళ్లుగా చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య బెలాసి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ఫ శివాలయానికి వెళ్లివస్తున్న భార్యభర్తలను ఢీకొట్టిన లారీ ఫ అక్కడికక్కడే మృతిచెందిన దంపతులు ఫ హాలియా పట్టణంలో ఘటన -
క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్ ఆపి..
చిట్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను చూసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వారి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి–65పై మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శాలిగౌరారం మండలం బైరవునిబండకు చెందిన రమేష్ తన వ్యక్తిగత పనిమీద చిట్యాల మండలం గుండ్రాంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలోని హోటల్లో టిఫిన్ చేసిన అనంతరం హైవే దాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్ అనే యువకుడు బైక్పై హైదరాబాద్ వైపునకు వెళ్తూ ప్రమాదవశాత్తు రమేష్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో క్షతగాత్రులయిన రమేష్, వెంకట్ రహదారిపైనే పడి ఉన్నారు. ఇదే సమయంలో నల్లగొండలో పర్యటన ముగించుకుని తన కాన్వాయ్తో హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గమనించి క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి వారిని చికిత్స నిమిత్తం చౌట్టుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రితోపాటు ఆయన గన్మెన్లు రహదారిపై ట్రాఫిక్జామ్ కాకుండా క్లీయర్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఫ గుండ్రాంపల్లిలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి ఫ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించి ఆస్పత్రికి తరలించిన మంత్రి -
ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
● ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే జట్టుపెద్దవూర: మండలంలోని చింతపల్లిలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తా
సంస్థాన్ నారాయణపురం : రాచకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. రాచకొండలో రాచప్ప సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాచకొండ పర్యాటక ఉత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాచకొండ తవ్వకాల్లో బయల్పడిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే దంపతులు జల, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాచకొండ పర్యాటక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల క్రితం రాజధానిగా వెలుగొందిన రాచకొండ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికి సహకారమందిస్తానన్నారు. రాచకొండ అభివృద్ధికి కృషిచేస్తున్న రాచప్ప సమితిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్చందర్రెడ్డి, సర్పంచ్లు కాట్రోతు లక్ష్మీసాగర్, కవితరఘు, జర్పుల జగన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరెంటోతు శ్రీనునాయక్, మందుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, ఎనుముల శంకర్రెడ్డి, రాచప్ప సమితి ఆధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, కడారి అంజిరెడ్డి పాల్గొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
ఓటు వేయలేదని బెదిరింపులు
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డులో కొందరు తమకు ఓట్లు వేయలేదంటూ ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు, వారి మద్దతుదారులు స్థానిక అర్బన్ కాలనీకి చెందిన ఓటర్ల ఇంటి ముందు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఏలే భువనేశ్వరి విజయం సాధించింది. స్వల్ప తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఓట్ల లెక్కింపు జరిగిన రోజు రాత్రి నుంచి గెలుపొందిన అభ్యర్థి మద్దతుదారులపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి తమకు ఓటు వేయని వారి ఇళ్ల ముందు బీరు సీసాలు పగులగొట్టడంతో పాటు తామిచ్చిన చీరలు, నగదు, ఇతర వస్తువులు తిరిగి ఇవ్వాలంటూ హెచ్చరించారు. దీంతో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన చీరలను తీసుకొచ్చి వీధుల్లో కుప్పగా పోశారు. ఈ మేరకు అర్బన్ కాలనీ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనరసయ్య తెలిపారు. పద్మశాలీలే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు, బెదిరింపులను నియంత్రించాలని పద్మశాలీ సంఘం నాయకులు పోలీసులను కోరారు. ఓటర్ల ఇళ్ల ముందు బీరు సీసాలు పగలగొట్టిన ఓడిపోయిన అభ్యర్థుల అనుచరులు వారిచ్చిన చీరలు, ఇతర వస్తువులను రోడ్డుపై పడేసిన ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు -
మార్మోగిన శివనామస్మరణ
నార్కట్పల్లి : మహాశివరాత్రి సందర్భంగా ఆది వారం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. అనుమానాస్పదంగా ఆలయంలో సంచరించే వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచులు నేతగాని కృష్ణ, ఉప్పల వెంకట్రెడ్డి, యేల్లేందుల లింగస్వామి, నాయకులు వడ్డే భూపాల్రెడ్డి, వరాల రమేష్, రేగట్టే నవీన్రెడ్డి, గడుసు శశిధర్రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, పశుపతి, ప్రజ్ఞాపురం సత్తి, సంపత్, లింగస్వామి, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా చెర్వుగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు కిటకిటలాడి క్యూలైన్లు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులు -
టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం
మోటకొండూరు: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ పరిధిలోని శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. కంపెనీలో నత్రజని శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. అయితే ఈ కంపెనీని తమ గ్రామం నుంచి తరలించాలని కాటేపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి 2025 డిసెంబర్ 29న తాత్కాలిక అనుమతి లభించింది. కానీ 2025 డిసెంబర్ 18నే కంపెనీ యాజమాన్యం అక్రమంగా ట్రయల్స్ ప్రారంభించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత్కాలిక అనుమతి గడువు కూడా ఫిబ్రవరి 3తో ముగిసిందని, ప్రస్తుతం కంపెనీ నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని, ఒకవేళ ఉంటే బహిరంగంగా చూపించాలని గ్రామస్తులు సవాల్ చేస్తున్నారు. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్లగొండ రీజినల్ ఆఫీసర్ పరిశ్రమను సందర్శించి అన్ని నిబంధనలు పాటిస్తున్నారని నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ అక్కడ నత్రజని శుద్ధి వ్యవస్థ పనులు జరుగుతూనే ఉన్నాయి. పీసీబీ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాటేపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ పరిశ్రమపై గ్రామ పంచాయతీ అధికారులు, ఎమ్మార్వో, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఆందోళనలు.. శ్రీజీ టైర్ల రీసైక్లింగ్ కంపెనీతో పాటు మరో టైర్ల కంపెనీల ద్వారా వెలువడే పొగ, కాలుష్యంతో పరిసర ప్రాంతంలోని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలోనూ గ్రామస్తులు ఆందోళన చేశారు. కంపెనీ కాటేపల్లి నుంచి తరలించాలని లేదా మూసివేయాలని జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఈ అగ్నిప్రమాదం పెద్దగై ఉంటే పక్కనే ఉన్న ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీకి మంటలు నష్టం భారీ ఎత్తున ఉండేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్ముకున్న దట్టమైన పొగ పరిశ్రమను తరలించాలని కాటేపల్లి గ్రామస్తుల డిమాండ్ -
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పేరు ఖరారు
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆది వారం ప్రకటించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ నేరుగా హైదరాబాద్ నుంచి రానున్నారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ ఎంపీ.. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్రెడ్డి పేరు నమోదు చేసుకున్నారు. సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చైర్మన్గా కొణతం చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్కుమార్రెడ్డిని ప్రకటించిన మంత్రి ఉత్తమ్ -
సామిల్లు నిర్వహణ నుంచి చైర్పర్సన్గా..
ఆలేరు: నిన్నమొన్నటి వరకు ఆమె తన భర్తతో కలిసి సామిల్లు(కట్టకోత మిషన్) నిర్వహించేది. పెద్దగా రాజకీయ నేపథ్యం కూడా లేదు. కానీ మున్సిపల్ ఎన్నికల రూపంలో అదృష్టం కలిసొచ్చి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఆమెను వరించింది. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్గా బీజన బాలమణి పగ్గాలు చేపట్టనున్నారు. 7వ వార్డు నుంచి బాలమణి కౌన్సిలర్గా విజయం సాధించగా.. ఆమెతో పాటు ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ రావడం, చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో బాలమణిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో సోమవారం బాలమణి చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాలమణి కుటుంబ నేపథ్యం ఇదీ..బాలమణి రాజాపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకుంది. ఆలేరుకు చెందిన బీజన భాస్కర్తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్, సాయితేజ ఉన్నారు. భర్త భాస్కర్తో కలిసి ఆమె సామిల్లు వ్యాపారం నిర్వహిస్తుందిది. బాలమణి భర్త భాస్కర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సోదరుడు బీర్ల శంకర్కు స్వయానా సడ్డకుడు. ఆలేరు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ బాలమణి -
అభిషేక ప్రియుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి, ప్రథమ ప్రాకార మండపంలోని మహా శివుడికి ఉదయం భక్తులచే అభిషేకాలు జరిపించిన పూజారులు.. రాత్రి లింగోద్భవ కాలంలో శత రుద్రాభిషేకం జరిపించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విశేష పూజలు జరిపారు. బ్రాహ్మణోత్తములచే నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు నిర్వహించారు. మహాశివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ప్రధానార్చకులు, పారాయణీకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కొండపైన ప్రధాన శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస్య దీక్షలను విరమించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. సాయంత్రం శివాలయం మాడ వీధుల్లో యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి సేవా సమితి, గుండ్లపల్లికి చెందిన వీరప్రతాప మారుతి భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. అనంతరం బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రిచే శివ పురాణ ప్రవచనం జరిపించారు. కుమారి జ్యోతి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఒగ్గు శ్రీను బృందంచే ఒగ్గు కథ భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది. -
టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన స్కూటీ.. ఒకరు మృతి
చౌటుప్పల్ : టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ముస్కు మోహన్రెడ్డి(66) కుటుంబంతో కలిసి పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి 11.30గంటల ప్రాంతంలో తిరిగి చౌటుప్పల్కు వస్తున్నాడు. ఈ క్రమంలో తంగడపల్లి దాటిన తర్వాత ఎర్ర స్థూపం వద్దకు రాగానే.. లింగారెడ్డిగూడేనికి చెందిన తొర్పునూరి చందు స్కూటీపై వెనుక నుంచి వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టాడు. దీంతో టీవీఎస్ ఎక్సెల్పై నుంచి మోహన్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లైంగిక దాడి కేసులో వ్యక్తి రిమాండ్మర్రిగూడ: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వివరాలు.. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి దేవరకొండ కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు రిమాండ్కు తరలించినట్లు నాంపలి సీఐ డి. రాజు, ఎస్ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు. -
మేరీమాత పుణ్యక్షేత్రం దైవ సంకల్పం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేయడం దైవ సంకల్పమని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ ధమన్కుమార్ అన్నారు. ఆదివారం శుభవార్త చర్చికి వచ్చిన ఆయనకు మఠంపల్లిలో స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి, క్రైస్తవులు, చర్చికమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏప్రిల్లో జరిగే చర్చి వార్షికోత్సవాల నుంచి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందని బిషప్ ప్రకటించారు. అనంతరం ఆయన చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. క్రైస్తవులకు సత్ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, మర్రెడ్డి, బాలరెడ్డి, బాలశౌరిరెడ్డి, అర్లారెడ్డి, మాజీ సర్పంచ్ స్రవంతికిషోర్రెడ్డి, లూర్థుమారెడ్డి, బ్రదర్ వినోద్రెడ్డి, సిస్టర్ రూబీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చర్చి కమిటీ పెద్దలు ఆంథోనిరెడ్డి, జార్జిరెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, బాలరెడ్డి, కాకుమాను జోసెఫ్, తుమ్మా జోసెఫ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ బిషప్ ధమన్కుమార్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటన -
ఫాంపాండ్లో మునిగి విద్యార్థి మృతి
● మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ ● భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనభువనగిరిటౌన్: మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వసతి గృహం సమీపంలోని ఫాంపాండ్లో ఈత కొట్టేందుకు వెళ్లి అందులో మునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం రాయపురం గ్రామానికి చెందిన ఆంథోనిరాజు, దీపారాణి దంపతుల కుమారుడు బాలఆకాష్(16), మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ భువనగిరి శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం ఉదయం పాఠశాల వసతి గృహం నుంచి వారిద్దరు బయటకు వెళ్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఫాంపాండ్లో స్నానం చేసేందుకు దిగారు. లోతు అంచనా వేయలేక, ఈత రాకపోవడంతో బాలఆకాష్ ఫాంపాండ్లో మునిగిపోయాడు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ వెంటనే పాఠశాలకు వచ్చిన సిబ్బందికి విషయం చెప్పాడు. సిబ్బంది వెళ్లేసరికి అప్పటికే బాలఆకాష్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఫాంపాండ్ నుంచి బయటకు తీసి భువనగిరి ఏరియా ఆస్పత్రిక తరలించారు. మరో విద్యార్థి రహమత్ అలీఖాన్ అస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్ష రాసి వస్తాడనుకున్నాం.. తమ కుమారుడు బాలఆకాష్ మరికొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాసి ఇంటికి వస్తాడని అనుకున్నామని.. కానీ ఇలా విగతజీవిగా ఇంటికి తీసుకెళ్తామని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని బాలఆకాష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు పోస్టుమార్టం చేయకూడదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. జీఓ సవరించకుండా రేషనలైజేషన్ సరికాదు సూర్యాపేటటౌన్ : జీఓ నంబర్ 25ను సవరించకుండా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేయడం సరికాదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్రావు అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం శాసీ్త్రయం కాదని, ప్రభుత్వం రకరకాల జీఓలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తోందని అన్నారు. విద్యారంగంలోకి కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ప్రతి గ్రామంలో పాఠశాలలతో పాటు ప్రతి తరగతికి ఒక గది, ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ శాఖను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డేగల జనార్దన్, అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా యోగానంద చారిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి రవిచంద్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రామ నరసయ్య, వీరయ్య, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వేణు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు
పెద్దవూర : మండలంలోని చింతపల్లి గ్రామంలో దున్న ఇద్దాస్ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్లడ్ లైట్ల వెలుతురులో లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 15 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బహుమతులను అందించి మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు, ద్వితీయ బహుమతిని రూ.80వేలను అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ హర్యానా జట్టు, తృతీయ బహుమతి రూ.60వేలు చింతపల్లి మిషన్ ఢిల్లీ జట్టు, నాలుగవ బహుమతి రూ.50వేలు కర్నాటక జట్టు, ఐదవ బహుమతి రూ.40వేలు తెలంగాణ, ఆరో బహుమతి రూ.30వేలు ఉత్తరప్రదేశ్ జట్లు గెల్చుకున్నాయి. వీరికి నగదుతో పాటు షీల్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జటావత్ రవినాయక్, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ షేక్ అబ్బాస్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూలోకరావు, జి.కర్తయ్య, ది మిషన్ కట్టెబోయిన ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రథమ బహుమతిని కై వసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే జట్టు -
హెచ్పీవీ టీకాలు ఎప్పుడో..!
ప్రభుత్వం నుంచి హెచ్పీవీ టీకాలు సరఫరా కాగానే బాలికలకు వాటిని వేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాం. టీకాలు రాగానే వేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్వో, నల్లగొండ నల్లగొండ టౌన్ : మహిళలను వేధిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు యుక్త వయసు అమ్మాయిలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏటా వేలాది మంది యుక్త వయసు అమ్మాయిల నుంచి వృద్ధాప్యంలో ఉన్న మహిళలను క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. రొమ్ము, గర్బాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. ఈ నేపధ్యంలో క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోదించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు యుక్త వయసు గల బాలికలకు (14 –15) టీకాలు వేయాలని సంకల్పించాయి. అందులో బాగంగా జిల్లాలో జనవరి మొదటి వారం నుంచి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాలను వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు హెచ్పీవీ టీకాలను వేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. కానీ ఇప్పటి వరకు జిల్లాకు హెచ్పీవీ టీకాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు. 20 వేల మంది అర్హులు.. హెచ్పీవీ టీకాలకు జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న కిషోర బాలికలు (14–15 సంవత్సరాల) 20 వేల మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. టీకాలను ప్రభుత్వం సరఫరా చేసిన వెంటనే వీరందరికి టీకాలను వేయనున్నారు. ఫ యుక్త వయసు అమ్మాయిలకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం ఫ జిల్లాలో 20 వేల మంది అర్హుల గుర్తింపు ఫ టీకాల సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్లో జాప్యం -
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నిత్య పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించి, సహస్త్ర నామార్చన పూజను జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిపించారు. సాయంత్రం జోడు సేవను ఊరేగించారు. -
ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపునకు కృషి
రామగిరి(నల్లగొండ ): పానగల్లు ఛాయా సోమేశ్వరాలయానికి అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శివరాత్రి సందర్భంగా నల్లగొండ సమీపంలోని పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను దర్శించుకున్నారు. ఛాయా సోమేశ్వరాలయంలో శివ పార్వతుల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శివుడికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అద్భుత శైలిలో 11వ శతాబ్దంలో నిర్మించిన పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం శివ లింగంపై నిరంతరం పడే ఛాయ ఎంతో విశిష్టత కలిగిందన్నారు. రామప్ప దేవాలయం మాదిరిగా చారిత్రక సంపద అని పేర్కొన్నారు. సంస్కృతిని పెంపొందిస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం యునెస్కో గుర్తింపునకు అర్హత కలిగి ఉందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి, సంబంధిత శాఖ కేంద్ర మంత్రిని కోరుతానన్నారు. నిత్యం భక్తులు దర్శించుకునేలా అన్ని వసతులు కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు ఉండబోవని, బడ్జెట్ తర్వాతే ఉంటాయని స్పష్టం చేశారు. కార్పొరేషన్ విజయం బాధ్యత పెంచింది నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయం మాపై బాధ్యత మరితం పెంచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నీలగిరి కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయన్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. 48 డివిజన్లలో ప్రజల సమస్యలు, డ్రెయినేజీ, మంచి నీటి వసతి, పార్కుల అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. మాపై నమ్మకంతో గెలిపించిన పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మొక్కలు నాటిచేందుకు కలెక్టర్.. హార్టికల్చర్ అధికారులతో చర్చిస్తున్నారని చెప్పారు. చందనపల్లి డంపింగ్ యార్డును మరో మూడు నాలుగు నెలల్లో వేరే చోటకి మారుస్తామన్నారు. ఫ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన మంత్రి, కార్పొరేటర్లునల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కార్పొరేటర్లను క్యాంపు కోసం హైదరాబాద్లోని శామీర్పేటలో గల ఓ రిసార్ట్కు తరలించిన విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం కీసరగుట్టలోని శివాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి రిసార్ట్కు వెళ్లారు. సోమవారం అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి రానున్నారు. -
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి
ముగిసిన ఎడ్ల పందేలుచిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర, శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ఎడ్ల పందేలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఏడు కొండలు, బండ్ల ప్రశాంతి కోటయ్య పాల్గొన్నారు. మేళ్లచెరువులో.. మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఆదివారం జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పందేలను కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఐరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి ప్రారంభించారు. -
నేడు పుర పట్టాభిషేకం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్, మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఉదయం 10 గంటలకు గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల ఎన్నికల అబ్జర్వర్తో పాటు ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కార్పొరేషన్తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంపుల్లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా సోమవారం నేరుగా ఎన్నికల సమావేశాలకు హాజరు కానున్నారు. సోమవారం ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు నిర్వహించనున్నారు. మేయర్గా బుర్రి చైతన్య ఎన్నిక లాంఛనమే నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 27 డివిజన్లలో విజయం సాధించింది. మేయర్ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 25 కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఎన్నికలకు ముందుగానే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి పేరును ప్రకటించడం, పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో సోమవారం మేయర్గా ఆమెను కార్పొరేటర్లంతా ఎన్నుకోనున్నారు. ఎంఐఎంలో చేరిన మొయిన్ 26వ డివిజన్కు చెందిన మాజీ కౌన్సిలర్ మొయిన్ ఈ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి టికెట్ ఆశించారు. ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో అదే డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన తల్లి గౌషియాను పోటీలో నిలిపారు. ఆమె విజయం సాధించారు. కాగా, ఆదివారం మొయిన్ హైదరాబాద్లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో తిరిగి ఆ పార్టీలోనే చేరారు. ఎమ్మెల్యేలు చెప్పిన వారికే.. జిల్లాల్లోని మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారమే చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించనున్నారు. వారినే ఎన్నుకోవాలని కౌన్సిలర్లకు చెప్పనున్నారు. మున్సిపాలిటీల్లో సస్పెన్స్ ● దేవరకొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక లాంఛనమే కానుంది. చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు నుంచి పోటీ చేసిన గెలిచిన పున్న శైలజ వెంకటేష్ పేరును ఎన్నికలకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. దీంతో సోమవారం ఆమెను ఛైర్పర్సన్గా కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. వైస్ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారన్నది తేలలేదు. సోమవారం ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే బాలునాయక్ వైస్ చైర్మన్ పేరును ప్రకటించనున్నారు. ● చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా 12వ వార్డు కౌన్సిలర్ పందిరి గీత పేరు ఖరారైనట్లు తెలిసింది. చైర్మన్తోపాటు వైస్ చైర్మన్ పేర్లను ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే వీరేశం చెప్పనున్నారు. ● చండూరు మున్సిపల్ చైర్మన్గా ఆరో వార్డు కౌన్సిలర్ కోడి శ్రీనివాసులు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ● మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎవరిని చేయాలన్న విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించారు. అయితే పేర్లను ప్రకటించలేదు. సోమవారం ఎన్నిక సమయంలో వారి పేర్లను ప్రకటించనున్నారు. నల్లగొండలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కమిషనర్ నీలగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో నలుగురు విజయం సాధించారు. అయితే అందులో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 30కి చేరింది. 18వ డివిజన్లో విజయం సాఽధించిన ఆలకుంట్ల ఝాన్సీరాణి నాగరత్నంరాజు, 42వ డివిజన్లో విజయం సాధించిన అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్, 11వ డివిజన్లో విజయం సాధించిన పాలకూరి సుమలత సంతోష్ ఆదివారం మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. దీంతో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లే. సోమవారం జరిగే మేయర్ ఎన్నికల్లో వారు కాంగ్రెస్కు మద్దతు తెలుపనున్నారు. ఫ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఫ 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఫ ఎన్నికల అబ్జర్వర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు ఫ క్యాంపుల నుంచి నేరుగా సమావేశాలకు హాజరు కానున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫ ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు నిర్వహణ -
నీలగిరిలో 37 మంది కొత్త వారే..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లకు గాను 37 మంది కొత్త అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 27 మంది కార్పొరేటర్లలో 17 మంది మంది తొలిసారి గెలిచారు. అదే విధంగా బీఆర్ఎస్ గెలిచిన 9 మందిలో 8 మంది మొదటిసారి విజయం సాధించారు. బీజేపీ నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు సైతం మొదటిసారి గెలిచారు. ఏఐఎఫ్బీ సింహం గుర్తుపై గెలిచిన నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, ఇండిపెండింట్లు ఇద్దరు కూడా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజేతలుగా నిలిచిన వారే. కార్పొరేషన్లోని 48 డివిజన్లలో 37 మంది కొత్త వారు కాగా, గతంలో గెలిచి అనుభవం ఉన్న వారు 11 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కాంగ్రెస్లో 10 మంది, బీఆర్ఎస్ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తంగా 37 మంది తొలిసారి ఎన్నికల్లో గెలిచి కార్పొరేషన్లో అడుగు పెడుతున్నారు. -
శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనం నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం నిర్వహించనున్నారు. -
బీజేపీ సీనియర్లకు భంగపాటు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకులకు భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఆశించే నాయకులు సైతం వారి డివిజన్లను గెలుపించుకోలేకపోయారు. 48 డివిజన్లకు గాను 45 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావుతో సైతం నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్లో సభ పెట్టించారు. కానీ 45 డివిజన్లకు గాను కేవలం నాలుగింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఆరు స్థానాలు ఉండగా, ప్రస్తుతం రెండు తగ్గిపోయాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి సొంత తమ్ముడు హర్షిత్రెడ్డిని 10వ డివిజన్ నుంచి బరిలో నిలిపినా గెలుపించుకోలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎఫ్బీ నుంచి సింహం గుర్తుతో పోటీ చేసి ఓటమి చెందిన పిల్లి రామరాజు యాదవ్ పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 8వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన సతీమణి పిల్లి సత్యవతిని గెలుపించుకోలేకపోయారు. మరో సీనియర్ నేత గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, బండారు ప్రసాద్, వీరెళ్లి చంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు సైతం వారు నివాసం ఉండే సొంత డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసినట్లు చర్చ సాగుతోంది. ఫ నల్లగొండ కార్పొరేషన్లో వికసించని కమలం -
ఫ మా తుఝే సలాం
మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు నల్లగొండ : శివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శివయ్య అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆ పరమేశ్వరుడు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ పవిత్ర లింగోద్భవ కాలం అందరికీ ప్రశాంతతను చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాలకు వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. 16న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 16న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాగర్ను సందర్శించిన కలెక్టర్నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ను శని వారం కలెక్టర్ చంద్రశేఖర్.. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బుద్ధవనంలోని మ హాస్తూపం, స్తూపపార్కు తదితర ప్రాంతాలను వీక్షించారు. వీరికి పర్యాటక శాఖ గైడ్ సత్యనారా యణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనం వివరాలను తెలియజేశారు. ఆయన వెంట పెద్దవూర ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. హెచ్పీవీ టీకాపై అవగాహననల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం 150 మంది ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. అదేవిధంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ స్క్రీనింగ్పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వసంతకుమారి, రాజేశ్వరి, రమేష్, రాజిరెడ్డి, రమణారెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి వసంత్, పృథ్వీరాజ్, సరిత, అశ్విని, లావణ్య, శ్రీతి, మౌనిక పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో ఆశావహులు అధికంగానే..
● చండూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా రుషిపాక వాసు, కలిమికొండ పారిజాత, భూతరాజు దశరథ పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి జెల్లా ధనమ్మ కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ● మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందు చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ప్రస్తుతం నూకల వేణుగోపాల్రెడ్డి సతీమణి నూకల కవిత, గుడిపాటి నవీన్ సతీమణి శిరీష, చిలుకూరు బాలు సతీమణి సుధ, వెంకటేష్ తల్లి శ్రీదేవి చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ కానున్నారు. ● హాలియా మున్సిపాలిటీలో చింతల చంద్రారెడ్డి, కుందూరు వెంకట్రెడ్డి, గౌని రాజా రమేష్యాదవ్ మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో మంతనాలు చేస్తున్నారు. వీరిలో ఒకరు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. వైస్ చైర్మన్గా చెరుపల్లి ముత్యాలు పేరును ప్రకటించే అవకాశం ఉంది. ● చిట్యాల మున్సిపాలిటీలో జనరల్ మహిళకు కేటాయించినందున పందిరి గీతా రమేష్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. వైస్ చైర్మన్ పదవి బీసీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది. ● దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు వెళ్లారు. చైర్మన్ అభ్యర్థిగా పున్న శైలజా వెంకటేష్ను నామినేషన్లకు ముందుగానే ఎమ్మెల్యే బాలునాయక్ ప్రకటించారు. ఆమె ఎంపిక లాంఛనమే కానుంది. వైస్ చైర్మన్ పదవికి మైనార్టీ వర్గం నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. వారిలో ఎవరికి దక్కుతుందనే దానిపై చర్చ సాగుతోంది. ● నందికొండ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంతవరకు ప్రకటించలేదు. ఆదివారం మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్యే జైవీర్రెడ్డి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బాల్య వివాహాల రహిత భారత్గా తీర్చిదిద్దాలి
మిర్యాలగూడ టౌన్ : బాల్య వివాహాల రహిత భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణయ్య అన్నారు. ‘బాల్య వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడలోని మైనార్టీ గురులకు, మిర్యాలగూడ మండలం అవంతీపురం జంగాల కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలంతా చదువులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలంటే చదువే ఆయుధమన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ కుమారీ, గౌరీ శంకర్, వెంకన్న, రమణి, సర్పంచ్ సుజాత సురేష్, నాగమణి, రాధిక, శ్రీదేవి, దారం మల్లేష్యాదవ్, సువర్ణ, వసుమతి, అంజలిదేవి, సుజిత తదితరులున్నారు. -
అట్రాసిటి కేసులో ఐదుగురికి జైలు
కులం పేరుతో దూషించిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. - 10లోఉమ్మడి జిల్లాలో పార్టీల వారీగా సాధించిన సీట్లు మున్సిపాలిటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు మొత్తం నల్లగొండ కార్పొరేషన్ 27 9 4 8 48 చండూరు 6 3 0 1 10 చిట్యాల 9 2 0 1 12 దేవరకొండ 11 6 1 2 20 హాలియా 11 1 0 0 12 మిర్యాలగూడ 31 14 1 2 48 నందికొండ 11 1 0 0 12 హుజూర్నగర్ 19 4 0 5 28 కోదాడ 26 3 0 6 35 నేరేడుచర్ల 9 5 0 1 15 సూర్యాపేట 31 11 1 5 48 తిరుమలగిరి 5 10 0 0 15 ఆలేరు 7 3 2 0 12 భువనగిరి 22 4 4 5 35 చౌటుప్పల్ 13 3 3 1 20 మోత్కూరు 8 3 0 1 12 పోచంపల్లి 6 5 1 1 13 యాదగిరిగుట్ట 8 1 2 1 12 -
కౌంటింగ్ విధులు ముగించుకుని వెళ్తుండగా..
ఫ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం రామగిరి(నల్లగొండ): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ డ్యూటీకి హాజరై వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ మండలం చందనపల్లి వద్ద జరిగింది. నకిరేకల్కు చెందిన షేక్ తయ్యుబ్(34) మునుగోడు పోలీస్ స్టేషల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ డ్యూటీ నిమిత్తం శుక్రవారం నల్లగొండకు వచ్చాడు. విధులు ముగించుకుని బైక్పై నకిరేకల్ వెళ్తుండగా నల్లగొండ మండలం చందనపల్లి వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం తయ్యుబ్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి కేతేపల్లి: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బత్తుల సతీష్రెడ్డి(30) వ్యవసాయంతో పాటు ట్రాక్టర్లు, వరికోత మిషన్ల డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కసాగిస్తున్నాడు. తనకు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన సతీష్రెడ్డి ఈ నెల 3న కేతేపల్లి నుంచి కొత్తపేటకు వెళ్లే దారిలో శ్మశానవాటిక సమీపంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సతీష్ను సూర్యాపేట ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సతీష్రెడ్డికి తల్లి, సోదరి ఉన్నారు. మృతుడి తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సతీష్ మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లు కేతేపల్లి హెడ్ కానిస్టేబుల్ వి. అనిల్రెడ్డి తెలిపారు. -
నీలగిరి కార్పొరేషన్ సహా.. 16 మున్సిపాలిటీలు హస్తగతం
ఫ కబడ్డీ.. కబడ్డీప్రత్యేక అలంకారంలో రేణుకా ఎల్లమ్మశనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202616న సీఎం కప్ జిల్లాస్థాయి చెస్ పోటీలునల్లగొండ టూటౌన్ : సీఎం కప్ జిల్లా స్థాయి చెస్ పోటీలు ఈ నెల 16న నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో బాల, బాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బాలురు 568, బాలికలు 207 మంది పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు సీఎం కప్ రిజిస్ట్రేషన్ ఫారం, ఆధార్ కార్డు, సొంత చెస్ సెట్తో హాజరు కావాలని సూచించారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఉంటుందని, ఆలస్యంగా వచ్చే క్రీడాకారులను అనుమతించమని తెలిపారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తారని వెల్లడించారు. 16వ తేదీ నుంచి ప్రజావాణినల్లగొండ : మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు సోమవారం ప్రజావాణికి హాజరై వా రి ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి పనితీరుకు ప్రజలు పట్టంనల్లగొండ : సీఎం రేవంత్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు జనామోదం లభించిందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాలపై తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలనలో అమలు అవుతున్న సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న బీజేపీ, బీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. సమావేశంలో జిల్లాపెల్లి పరమేష్, ఎండీ.ముంతాజ్ అలీ, రాంబాబు నాయుడు, చింతమల్ల వెంకటయ్య, రేవిందర్రెడ్డి, పగిళ్ల రాజు, గౌతమ్ పాల్గొనారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యచిట్యాల: చిట్యాల–రామన్నపేట రైల్వే మార్గంలో గురువారం రాత్రి రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు నల్లగొండ రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. లోకో పైలెట్ గుర్తించి నల్లగొండ రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు రైల్వే ఎస్ఐ వివరించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉంటాయని, బూడిద రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం వెలువడిని మున్సిపల్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని నీలగిరి కార్పొరేషన్తో పాటు 16 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం తిరుమలగిరి మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితమైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ నెల 16వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నల్లగొండ కార్పొరేషన్గా ఏర్పడిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డిని పేరును మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆయన అనుకున్నన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకపోయినా మేయర్ స్థానానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ను కాంగ్రెస్ దాటింది. నల్లగొండ మొదటి మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. ప్రత్యేక ప్రణాళికతో మంత్రి ఉత్తమ్.. సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్ని తానై కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా రెబల్స్ను బుజ్జగించడానికి ఆయనే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి మాట్లాడారు. గట్టి పోటీ ఉన్నవార్డుల్లో మంత్రి స్వయంగా ప్రచారం చేశారు. దీంతో ఆ మూడు మున్సిపాలిటీల్లో అనుకున్న పలితాలను సాధించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ నేతలతో సమన్వయంతో వ్యవహరించారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి చుక్కెదురు సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వ్యూహం ఫలించలేదు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ వరకు అన్నీ తానై వ్యవహరించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పీఠాన్ని కై వసం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించారు. పోలింగ్ పూర్తయిన వెంటనే మున్సిపాలిటీలో అధిక స్థానాలు వస్తాయని ధీమాతో ముందస్తుగా తమ అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఫలితాలు మాత్రం తలకిందులయ్యాయి. ఎక్కడ దెబ్బతిన్నాం.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీల అంచనాలు తలకిందులు అయ్యాయి. తాము గెలుస్తామనుకున్న డివిజన్లు, వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు పోల్ మేనేజ్మెంట్ విషయంలోనే తీవ్రంగా దెబ్బతిన్నామన్న అంచనాకు వచ్చారు. నల్లగొండ కార్పొరేషన్తోపాటు సూర్యాపేట, మిర్యాలగూడ భువనగిరి వంటి మున్సిపాలిటీల్లో తాము తీవ్రంగా నష్టపోవడానికి గల కారణాలను అంచనా వేసుకుంటున్నారు. అయితే.. నల్లగొండ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలుపొందినా.. కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకున్న స్థానాలు లభించలేదు. 32 స్థానాలకు పైగా గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నా.. 27 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీట్లు దక్కనివారు ఏఐఎఫ్బీ నుంచి నలుగురు, స్వతంత్రులుగా ఇద్దరు గెలుపొందారు. ప్రచారంలో అలాంటి వారిని పట్టించుకోకపోవడం కూడా తమకు మైనస్ అయిందనే భావనలో ఉన్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది స్వతంత్రులు, ఐదుగురు ఏఐఎఫ్బీ నుంచి విజయగం సాధించడం గమనార్హం. నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్గా ఏర్పడిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. 27 డివిజన్లలో గెలుపొంది కార్పొరేషన్లో హస్తం పార్టీ సత్తా చాటింది. మొత్తం 48 డివిజన్లకు గాను కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఏఐఎఫ్బీ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 2 రెండు చొప్పున గెలుచుకున్నాయి. ముందు నుంచి నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని అందరూ భావించిన విషయం తెలిసిందే. 48 డివిజన్లు ఉండగా మేయర్ కై వసం చేసుకోవాలంటే 25 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 27 స్థానాల్లో గెలవడంతో ఏ పార్టీ అవసరం లేకుండానే మేయర్, డిప్యూటి మేయర్ పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. బీఆర్ఎస్, బీజేపీకి గతం కంటే తగ్గిన స్థానాలు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావించిన బీఆర్ఎస్, బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బీజేపీ 4 స్థానాలతో సరిపెట్టుకుంది. గతంలో బీఆర్ఎస్ 20 స్థానాల్లో గెలవగా, ఇప్పుడు 9 స్థానాలకు పరిమితమై 11 స్థానాలు కోల్పోయింది. బీజేపీ గతంలో 6 స్థానాలు గెలుపొందగా నాలుగు స్థానాల్లో గెలిచి రెండు స్థానాలు కోల్పోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు గెలవగా ఇప్పుడు అదనంగా 7 స్థానాలు పెంచుకొని 27 స్థానాల్లో పట్టు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. 21వ డివిజన్లో ఇబ్రహీం సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 1,381 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 38వ డివిజన్ నుంచి బోయినపల్లి వేదశ్రీ 1,163 ఓట్ల మెజార్టీ సాధించి సత్తా చాటారు. ఈ రెండు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నీలగిరిపై కాంగ్రెస్ జెండాఫ 27 డివిజన్లలో గెలిచిన హస్తం పార్టీ ఫ సింగిల్ డిజిట్కు పరిమితమైన బీఆర్ఎస్, బీజేపీ మండలంలోని ఊట్కూరు గ్రామంలోని సర్వే నంబర్ 451లో తవ్వకాలు చేపడుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చింది. వెంటనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పంపి, విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. – కృష్ణయ్య, తహసీల్దార్ నిడమనూరు : ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండటంతో.. ఇదే అదునుగా భావించిన మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించారు. నిడమనూరు మండలంలోని ఊట్కూరులో సర్వేనంబర్ 451లో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుల పేరు మీద భూమి ఉంది. దాని పక్కనే పలుగు (ప్రభుత్వ భూమి ఏనెకర్ర) ఉంది. ఆ భూమిని అక్రమించేందుకు మట్టి అమ్మకందారులతో కలిసి వారం రోజులుగా ఆ పలుగును తవ్వుతున్నారు. విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య.. వెంటనే విచారించాలని ఆర్ఐని ఆదేశించారు. ఆర్ఐ ఈశ్వర్ అది ప్రభుత్వ భూమి అని చెప్పడంతో, చేసేదేమీ లేక మట్టి తవ్వుతున్న జేసీబీ, టిప్పర్లను తీసుకొని మట్టి వ్యాపారులు వెళ్లిపోయారు. దాడులు చేస్తున్నా ఆగని దందా.. నిడమనూరు మండలంలో గతంలోనూ మట్టి అమ్మకం దారులు మట్టి తవ్వకాలు చేపట్టగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి జేసీబీని, మూడు టిప్పర్లను పట్టుకొని మైనింగ్, రెవెన్యూ శాఖ ద్వారా కేసులు పెట్టించారు. మట్టి తవ్వకం ముఠాలు ఆదివారం, అధికారుల సెలవు దినాల్లో మండలంలోని పలు చోట్ల మట్టి తవ్వకాలు చేపడుతున్నాయి. అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. ప్రభుత్వ భూమిని గుర్తించాలంటున్న స్థానికులు మండలంలోని ఊట్కూరులో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తోంది. అందుకోసం రైతుల నుంచి భూమి తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రామంలోని ప్రభుత్వ భూమిని గుర్తిస్తే.. పాఠశాల కోసం భూమి ఇస్తున్న రైతులకు ఈ ప్రభుత్వ భూమి ఇవ్వొచ్చని స్థానికులు అంటున్నారు.ఊట్కూరులో సర్వే నంబర్ 451లో మట్టి తవ్వకాలుకాపర్ వైరు దొంగల అరెస్ట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీచేస్తున్న దొంగలను చివ్వెంల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫ ముందుండి గెలిపించిన ఇద్దరు మంత్రులు ఫ ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ ఫ సూర్యాపేటలో ఫలించని మాజీ మంత్రి వ్యూహం ఫ 16న కొలువుదీరనున్న పాలకవర్గాలు -
వైభవంగా ధ్వజారోహణం
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో ఆలయ సిద్ధాంతి, ఆల య ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకులు, పురోహితుల సమక్షంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలను జరుగుతున్నాయి. ఆలయ మండపంలో నిత్య హవనం, శివ పంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపంతో పాటు వివిధ పారాయణాలు చేశారు. భేరీ పూజ, దేవతాహ్వానం... శివాలయంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరమ శివుడి వాహనమైన నందీశ్వర చిత్రమైన ధ్వజ పటాన్ని అర్చించి, ఆయా ఉపచారములను చేపట్టారు. అనంతరం ధ్వజ స్తంభంపై అలంకరించారు. అనంతరం భేరీ పూజ, దేవతాహ్వానం చేపట్టారు. అగ్ని ప్రతిష్ఠ.. శివరాత్రి మహోత్సవాలకు వేంచేసిన సకల దేవతలకు అగ్ని ముఖంగా హవిస్సులు అందించి పంచ సూక్త హవనములు, మూలమంత్ర జములతో దశాంక తర్పణాదులు చేపట్టి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను హోమ మండపంలో చేపట్టారు. ఆయా వేడుకల్లో ఈవో భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ అర్చకులు, అధికారులు, యాజ్ఞీకులు పాల్గొన్నారు. ఫ రెండో రోజుకు చేరిన శివరాత్రి ఉత్సవాలు -
రీకౌంటింగ్ కోసం ఆందోళన
ఫ నల్లగొండలోని కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీఛార్జి నల్లగొండ : మున్సిపల్ కార్పొరేషన్లో శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా 14వ డివిజన్ ఓట్లను రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, భూపాల్రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగగా.. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. 14వ డివిజన్లో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు సైదిరెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తన అనుచరులతో కౌంటింగ్ కేంద్రం వద్దకు బయల్దేరారు. అయితే భూపాల్రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి రాకుండా ఐటీ హబ్ వద్దనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులకు, భూపాల్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయగా.. పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. భూపాల్రెడ్డితో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి మాట్లాడి ఈ ఘటనపై రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయాలని చెప్పి వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. -
ఒక్క ఓటుతో విజయం
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. వార్డులో మొత్తం 2241 ఓట్లు ఉండగా 1716 పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంపల్లి వినోద్కు 836 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులుకు 837 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ అభ్యర్ధన మేరకు అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా ఓట్లలో తేడా లేక పోవడంతో సైదులు ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. -
కాంగ్రెస్కే పట్టణం
● నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 48 డివిజన్లుండగా 27 డివిజన్లలో కాంగ్రెస్, 9 డివిజన్లలో బీఆర్ఎస్, 4 డివిజన్లలో బీజేపీ, 2 డివిజన్లలో ఎంఐఎం, 4 డివిజన్లలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) అభ్యర్థులు, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మేయర్ స్థానం కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ● మిర్యాలగూడలో కాంగ్రెస్ 31 వార్డుల్లో, బీఆర్ఎస్ 14, బీజేపీ 1 వార్డు దక్కించుకోగా ఏఐఎఫ్బీ నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు విజయం సాధించారు. కాంగ్రెస్ మిర్యాలగూడ మున్సిపాలిటీలో జెండా ఎగురవేయనుంది. ● దేవరకొండ మున్సిపాలిటీలో 11 వార్డుల్లో కాంగ్రెస్, 6 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో బీజేపీ, 2 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ● చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3 వార్డుల్లో, సీపీఐ ఒక వార్డు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకే చైర్మన్ పదవి దక్కనుంది. ● హాలియా మున్సిపాలిటీలో 11 వార్డుల్లో కాంగ్రెస్, 1 వార్డులో బీఆర్ఎస్ గెలుపొందాయి. హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ● నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 11 వార్డుల్లో, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకుంది. ఇక్కడ పూర్తి మెజార్టీ కాంగ్రెస్ సాధించింది. ● చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, స్వతంత్ర అభ్యర్థులు 1 స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. ● సూర్యాపేటలో కాంగ్రెస్ 31 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 11 స్థానాలకు పరిమితమైంది. ఒక వార్డులో బీజేపీ, 5 వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. ● కోదాడలో 35 స్థానాలు ఉంటే అత్యధికంగా 26 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అక్కడ బీఆర్ఎస్ 3 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. ● నేరేడుచర్లలో 9 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీఆర్ఎస్, జనసేన 1 స్థానంలో గెలిచింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచింది. ● హుజూర్నగర్లో 19 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందాయి. సీపీఐ, సీపీఎంలు ఒక్కో స్థానంలో గెలుపొందగా ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచి చైర్మన్ స్థానం కై వసం చేసుకోనుంది. ● తిరుమలగిరి మున్సిపాలిటీల్లో 15 స్థానాలు ఉండగా.. 10 స్థానాల్లో బీఆర్ఎస్, 5 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీనే చైర్మన్ పీఠం దక్కించుకోనుంది. ● భువనగిరిలో కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకుంది. బీఆర్ఎస్ 4, బీజేపీ 4, స్వతంత్రులు 5 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాదించింది. ● పోచంపల్లిలో మొత్తం 13 స్థానాలకు కాంగ్రెస్ 6 వార్డులు, బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలిచింది. బీజేపీ ఒక వార్డులో, స్వతంత్రులు ఒక వార్డులో గెలిచారు. స్వతంత్ర అభ్యర్ధి కాంగ్రెస్కు మద్దతు తెలుపడంతో అంతా క్యాంపునకు వెళ్లారు. దీంతో పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్కు దక్కనుంది. ● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 సీపీఎం అభ్యర్ధి విజయం సాధించారు. కాంగ్రెస్ మున్సిపాలిటీని కై వసం చేసుకుంది. ● ఆలేరులో కాంగ్రెస్ 7 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ 3, బీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. 7 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం దక్కించుకోనుంది. ● చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలువగా, బీఆర్ఎస్ 3, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించగా సీపీఎం 1 స్థానానికి పరిమితమైంది. ఇక్కడ 13 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ● మోత్కూరు మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా.. 8 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో బీఆర్ఎస్, ఒక స్థానంలో స్వతంత్రులు గెలిచారు. ఎనిమిదింట్లో గెలిచి కాంగ్రెస్ చైర్మన్ స్థానం దక్కించుకోనుంది. -
ఉన్నత విద్యావంతుల గెలుపు
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసిన ఉన్నత విద్యావంతులు విజయం సాధించారు. సాగర్కు చెందిన మంద గౌతమి ఎమ్మెస్సీ బీఈడీ చేసి ప్రభుత్వ గురుకుల విద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆమె 4వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలలో ఆమె భర్త మంద రఘువీర్ ఇదే వార్డునుంచిగెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 12వ వార్డుకు చెందిన మానస స్వర్ణ ఎంఏ, బీఈడీ చేశారు. ఆమె గత ఎన్నికలలో ఇదే వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఈ సారి విజయం సాధించారు. వీరిద్దరూ మున్సిపల్ చైర్పర్సన్ రేస్లో ఉన్నారు. -
హ్యాట్రిక్ గెలుపు
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీలోని 19వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తాళ్ల శ్రీధర్గౌడ్ 211 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆయన 2014, 2020లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మూడుసార్లు శ్రీధర్గౌడ్కి ఏసీ గుర్తే కేటాయించటం విశేషం. నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ నుంచి 40వ డివిజన్లో బొడ్డుపల్లి లక్ష్మి, 30వ డివిజన్ నుంచి మారగోని నవీన్కుమార్ విజయం సాధించారు. వారిద్దరికీ ఇది హ్యాట్రిక్ విజయం. బొడ్డుపల్లి లక్ష్మి ఇప్పటికే రెండుసార్లు గెలుపొందగా.. నవీన్కుమార్ ఒక సారి బీఆర్ఎస్ నుంచి, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి వరుసగా విజయం సాధించారు. -
ఓటరు తీర్పు ఎటువైపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ఆయా రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అభ్యర్థులు కూడా ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా జరిగిన పోలింగ్ వివరాలను ముందేసుకుని ఎన్ని ఓట్లు తేడాతో బయటపడతామనే అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల క్రమ సంఖ్యల వారీగా ఎందరు ఓటేశారు..? ఎందరు గైర్హాజరయ్యారు ? ఓట్లేసిన వారిలో తమ వారెవరు..? ఎదుటి పక్షానికి చెందిన వారెవరు అంటూ లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. ఎవరి ధీమా వారిదే.. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 78.09 శాతం ఓట్లు పోలయ్యాయి. ఏ వార్డు తీసుకున్నా 75 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అధికంగా ద్విముఖ పోరే.. కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ సైతం ఉండడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తంగా పరిశీలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడ్డాయని పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తంగా 162 వార్డులకు గాను హాలియాలో ఒక వార్డు ఏకగ్రీవంగా కావడంతో 161 వార్డులకు పోలింగ్ జరిగింది. నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో 48 చొప్పున డివిజన్లు, వార్డులు ఉండగా, దేవరకొండలో 20 వార్డులు, చండూరులో 10 వార్డులు కాగా, చిట్యాల, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో 12 చొప్పున వార్డులు ఉన్నాయి. గెలుపు అంచనాలో కాంగ్రెస్ అన్ని స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఽపూర్తి ధీమాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ.. అన్నిచోట్ల గట్టిపోటీ ఇచ్చామని, తమకూ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొంటోంది. బీజేపీ కూడా ఈసారి తమకు గతంలో కంటే అధిక స్థానాల్లో గెలుపొందుతామన్న ధీమాలో ఉండగా ఎంఐఎం, పార్వర్డు బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కూడా కొందరు గెలుపు మాదే అంటున్నారు. ఒక వార్డులో 2,500 ఓట్లు ఉన్నాయని అనుకుంటే.. అందులో కనీసం 2,200 ఓట్లు పోలైతే.. త్రిముఖ పోటీ ఉన్నచోట అభ్యర్థి విజయానికి కనీసం 750 ఓట్లు వస్తే చాలు. ద్విముఖ పోటీ ఉన్నచోట అయితే 1,100 ఓట్లకు ఒక్కటి ఎక్కువ వచ్చినా గెలుస్తామని భావిస్తున్నారు. వార్డులో పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని పోల్ అయ్యి ఉంటాయి, తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందో అంచనాలు కట్టేందుకు కుస్తీ పడుతున్నారు. మేయర్ పీఠం కాంగ్రెస్కే..? కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోని వార్డుల సంఖ్యలో యాభై శాతం ప్లస్ ఒక సీటు అదనంగా వచ్చిన పార్టీ మేయర్/చైర్మన్ పీఠాలు కై వసం చేసుకునే వీలుంది. ఒకవేళ యాభై శాతం సీట్ల మేరకు ఒకటి రెండు తక్కువ సీట్లు వచ్చినా.. అధికార పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు అందుబాటులో ఉండడం అదనపు బలం కానుంది. ఈ సమీకరణతోనే అన్నిచోట్లా తామే మేయర్/చైర్మన్ పీఠాలు దక్కించుకుంటామని కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది. నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు 25 సీట్లు వచ్చిన పార్టీకే మేయర్ పీఠం దక్కనుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 30కి పైగా డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యుల అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపారదర్శకంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముతోపాటు సాగర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద గోదాం, మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం మార్కెట్ యార్డులో, నల్లగొండలోని సాగర్ రోడ్డులో ఉన్న నిడమనూరు బాలికల గురుకులంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపోల్స్లో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. ఫ ఫలితాల అంచనాల్లో అభ్యర్థులు ఫ కార్పొరేషన్ మేయర్ పీఠం తమదేనంటున్న కాంగ్రెస్ ఫ మున్సిపాలిటీల్లోనూ అనుకూలమేనంటూ ప్రకటనలు ఫ గెలుపుపై ధీమాతో ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్న అభ్యర్థులు -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి
పెద్దవూర : పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా గిరిజన సహాయ అభివృద్ధి అధికారి(ఏటీడీఓ) ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల్లోని గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పెద్దవూర మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్లో నిర్వహించిన మోటీవేషనల్ (ప్రేరణ), కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సక్సెస్ అనేది ఒక్కరోజుతో వచ్చేది కాదని, అది నిరంతర సాధనతోనే సాధ్యమన్నారు. మీరు చేయాల్సిన పనిని తప్పులేకుండా శ్రద్ధతో చేయండి ఫలితం అదే వస్తుందన్నారు. పదవ తరగతి పూర్తయ్యాక ఏయే కోర్సులు ఉంటాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డీవీ.నాయక్, మోటీవేటర్ రవికుమార్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డీ.బాలోజీ, వార్డెన్లు కొల్లు బాలకృష్ణ, అహల్య, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్, జైపాల్, ఆర్పీలు కూన్రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండి.షబ్బీర్, రాములు, దూద్యానాయక్ పాల్గొన్నారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో 15 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు ఇతర సిబ్బందితో కలిపి సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి ఇంక్ బాటిల్స్, పెన్నులు, మార్కర్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, పర్సులతోపాటు అనుమతి లేని సామగ్రి తీసుకురావొద్దన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడం వంటి కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అవంతీపురంలో కౌంటింగ్ కేంద్రం పరిశీలన మిర్యాలగూడ : మండలంలోని అవంతీపురం మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం ఎస్పీ శరత్చంద్రపవార్ పరిశీలించారు. కేంద్రంలో మాక్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్రాజు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నేడే పుర కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం (ఈ నెల 13వ తేదీన) జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అనంతరం మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూడు కేంద్రాల్లో కౌంటింగ్ నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావి వేర్హౌసింగ్ కార్పొరేషన్ గోదా ములో జరగనుంది. అలాగే మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మిర్యాలగూడలోని అవంతీపురం మార్కెట్ యార్డులో జరుగనుంది. ఇక, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నల్లగొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న నిడమనూరు గురుకుల పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరిచి ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెటు బాక్సులను తెచ్చి టేబుళ్ల్లపై ఉంచుతారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా వార్డుల్లోని బ్యాలెట్ పేపర్లను పోలింగ్ స్టేషన్ల వారీగా ఇనిషియల్ కౌంటింగ్ చేస్తారు. పోలింగ్ జరిగిన రోజు బ్యాలెట్ పేపర్ల లెక్క, బ్యాలెట్ బాక్సులు తెరిచిన తరువాత అన్ని బ్యాలెట్ పేపర్లు ఉన్నాయా లేదా? అన్నది సరిచూస్తారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్గా కట్టి ఒక డ్రమ్ములో వేస్తారు. ఐదు మున్సిపాలిటీల ఫలితాలు 2గంటల వ్యవధిలోనే.. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో వార్డులు కేవలం 20లోపే ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 2 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయితే 2 గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 10గంటల లోపే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఉదయం 11.30 వరకు నల్లగొండ, మిర్యాలగూడ తుది ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మొదట పోస్టల్ బ్యాలెట్, ఇనిషియల్ ఓట్ల కౌంటింగ్తోపాటు బండిల్స్ కట్టే ప్రక్రియ 9 గంటల వరకు పూర్తికానుంది. ఆ తర్వాత ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. దాదాపు 3 వేలలోపే ఒక్కో వార్డులో ఓటర్లున్నారు. కొన్ని డివిజన్లు, వార్డుల్లో మాత్రమే 3 వేల పైచిలుకు ఓటర్లున్నారు. అత్యధికంగా ఉన్న వార్డులున్న నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఉదయం 11.30 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయి తుది ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ టేబుళ్లు నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపుకు 49, దేవరకొండకు 20, చండూరుకు 10, చిట్యాలకు 12, నందికొండకు 12, హాలియా 11 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లను ఒక్కో రౌండ్లోనే లెక్కించనున్నారు. తేలనున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం ఫ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం ఫ కౌంటింగ్కు మూడు కేంద్రాలు ఫ ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్ల చొప్పున ఫ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫ ఉదయం 11.30 గంటల వరకు తుది ఫలితాలు జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల్లో ఓట్ల లెక్కింపునకు వార్డుకో టేబుల్ను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల్లో 2,500కుపైగా ఓట్లు ఉంటే 2 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్పై ఓట్ల లెక్కింపునకు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 55 మంది రిటర్నింగ్ అధికారులతోపాటు ఒక్కో రిటర్నింగ్ అధికారికి ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. -
వంతెనలు.. మృత్యుమార్గాలు
నిడమనూరు : మండల పరిధిలో నాగార్జున సాగర్ ఎడమకాల్వపై నిర్మించిన వంతెనలు (బ్రిడ్జిలు) మృత్యుమార్గాలుగా మారాయి. బ్రిడ్జిల వెంట రెయిలింగ్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముకుందాపురం వద్ద ఓ కారు కాల్వలో పడిన ఘటనలో దంపతుల ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు నేరుగా కాల్వలోకి ఉండటం, బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు వెంట బారికేడ్లు, కాల్వలోకి వెళ్లకుండా రాతి స్తంభాలు లేకపోవడంతో కాల్వలోకి కారు దూసుకెళ్లిందని ఘటన స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు నిర్ధారించారు. నాలుగు చోట్ల బ్రిడ్జిలు ఉన్నా.. సాగర్ ఎడమకాల్వపై నిడమనూరు మండలంలోని 28 కిలోమీటర్ వద్ద ముప్పారం, 32.5 కిలోమీటర్ వద్ద వేంపాడు, బొకమంతలపహాడ్, ముకుందాపురం గ్రామాల వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిలపై కొంతమేర మాత్రమే ఇనుప రెయిలింగ్ ఉండగా అప్రోచ్ రోడ్డు కాల్వ వెంట కొంతదూరం రెయిలింగ్ లేకపోవడంతో రోడ్డంతా కాల్వలోకి వెళ్లేలా ఉంటుంది. దీంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రాత్రి వేళల్లో కానీ, వేంపాడు, ముప్పారం గ్రామాలకు వెళ్లాలంటే మూలమలుపు వెంటనే కాల్వ కనిపిస్తోంది. 3 మీటర్ల పరిధిలో చిన్నగా బ్రిడ్జి కనిపిస్తోంది. బ్రిడ్జికి అప్రోచ్గా కొంత ఇనుప కంచె కానీ, గోడ నిర్మించాల్సి ఉంది. అయితే సాగర్ ఆధునీకరణ పనులు చేపడుతున్నప్పుడు బ్రిడ్జిల వెంట ఉన్న రాతి స్తంభాలు, బారికేడ్లను పూర్తిగా తొలగించారు. పనులు పూర్తయిన అనంతరం రక్షణ గోడలుకానీ బారికేడ్లు నిర్మించలేదు. అసంపూర్తి పనులు కూడా చేపట్టలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగతున్నాయి. ఇప్పటికై నా ఎన్ఎస్పీ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనల వద్ద ఇనుప కంచె కానీ రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పారం, వేంపాడు, ముకుందాపుర, బొకమంతలపహాడ్ వద్ద సాగర్ ఎడమకాల్వపై ఉన్న బ్రిడ్జిల వెంట రక్షణ గోడలు నిర్మించాలి. ముప్పా రం బ్రిడ్జి మీదుగా, ఊట్కూరు, సోమవారిగూడెం, ముప్పారం, నందికొండవారిగూడెం గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ప్రమాదాల నేపథ్యంలో రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. రక్షణ గోడలు నిర్మించాలి. – కేశబోయిన జానయ్య, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఊట్కూరు వేంపాడు, గుంటిపల్లి, ఎర్రబెల్లికి వెళ్లాలంటే వేంపాడు వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళలో పలు గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి వద్దకు రాగానే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వేంపాడు కాల్వ వెంట రోడ్డు మూలమలుపు ఉండటంతో దూరంగా ఉన్నప్పుడే కాల్వను, బ్రిడ్జిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్తోపాటు సూచికలు ఏర్పాటుచేయాలి. – మల్లికంటి కోటయ్య, రైతు, వేంపాడు ఫ ప్రమాదకరంగా సాగర్ ఎడమకాల్వపై బ్రిడ్జిలు ఫ కాల్వ ఆధునీకరణ పనుల్లో దెబ్బతిన్న రక్షణ గోడలు ఫ తాజాగా ముకుందాపురం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు ఫ ఈ ఘటనలో దంపతుల మృత్యువాత ఫ బ్రిడ్జిలపై రెయిలింగ్ ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు -
బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 161 డివిజన్లు / వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది.ఈనెల 13వ తేదీన (శుక్రవారం) కౌంటింగ్ అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లు మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. నల్లగొండ కార్పొరేషన్కు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్జాలబావిలోని వేర్ హౌజింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించి భద్రపరిచారు. దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్ఎల్బీసీలోని నిడమనూరు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ భద్రపరిచారు. మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడంతో ఈ మూడు మున్సిపాలిటీల బ్యాలెట్ బాక్సులను అక్కడకు తరలించి స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. పటిష్ట భద్రత.. జిల్లాలోని 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13వ తేదీన జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 473 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 13వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. స్ట్రాంగ్ రూమ్లకు తరలిన బాక్సులు మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు -
నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్దే..
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి చరిత్ర సృష్టించబోతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి కార్పొరేషన్ ఎన్నిక కావడంతో ప్రతి వార్డులో ప్రచారానికి వెళ్లానని.. అక్కడ పేదలకు ఎన్నో హామీలిచ్చానని తెలిపారు. ప్రతి డివిజన్లో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ప్రత్యేక రూమ్ను ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు స్వీకరించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండలో బొట్టుగూడ హైస్కూల్ తరహాలో మిగతా 18 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా విధానం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన దగ్గరకు వస్తే.. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తానని తెలిపారు. మేయర్ ఎన్నిక తర్వాత నల్లగొండ కార్పొరేషన్లో 100 ఎకారల భూమిని సేకరించి దేవరకొండ రోడ్డులో 4 వేలు, నార్కట్పల్లి రోడ్డులో 4 వేల ఇందిరమ్మ ఇళ్లను 75 గజాల్లో కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని చరిత్ర సృష్టిస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజుర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. నేటి బంద్కు కాంగ్రెస్ మద్దతునల్లగొండ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడితే గుణపాఠం తప్పదు ● మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డిమిర్యాలగూడ : అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తగిన గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో ఎన్నికల సమయం ముసిగిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్, జమీల్, చాంద్పాషాపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జావిద్, ఆయన అనుచరులు కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. బాధితులు చికిత్స పొందుతుంటే వారిని హతమార్చాలని ఆస్పత్రిలోకి వచ్చి మరుణాయుధాలతో మరోసారి దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడులపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన జావిద్, ఆయన అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా 20వ వార్డులో దొంగ ఓట్లు వేయించారని, దీనిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నందుకు పోలీసులు సమక్షంలోనే వారిపై దాడులకు పాల్పడ్డారని, ఈ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిదార్థ, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, హతీరాం, మెసిన్అలీ, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పాలుట్ల బాబయ్య, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, పోకల రాజు తదితరులు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఓపీఓల నిరసనమిర్యాలగూడ టౌన్ : పీఓలు, ఏపీఓల మాదిరిగానే తమకు కూడా రూ.1300 పారితోషికం ఇవ్వాలని కోరుతూ బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోగల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఓపీఓలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాము కూడా పీఓలు, ఏపీఓల మాదిరిగానే రెండు రోజులుగా విధులు నిర్వహించామని తమకు రూ.1000 పారితోషికం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.ఈ విషయంపై మున్సిపల్ కమిషన ర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఓపీఓలకు రూ. వెయ్యి చొప్పున ఇచ్చామని, ఒక వేళ కలెక్టర్ ఆదేశిస్తే మరో రూ.300 పంపిస్తామని స్పష్టం చేశారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
తిప్పర్తిలో రాస్తారోకో చేస్తున్న రైతులుతిప్పర్తి : అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా అందించాలని కోరుతూ బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతు యాప్ ద్వారా యూరియా సరఫరా చేయడం ద్వారా సామాన్య రైతులకు అందడం లేదని, యాప్ గురించి తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లో అప్డేట్ చేసిన క్షణాల్లో యూరియా అయిపోతుందని, పెద్ద రైతుల కోసమే యూరియా యూప్ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. యాప్ను రద్దు చేసి నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ రైతుల వద్దకు చేరుకుని అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. -
కాంగ్రెస్దే ఘన విజయం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సామాన్యులకు సన్న బియ్యం అందిచండంతో పాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను 100శాతం అమలు చేస్తుందని అన్నారు. 1994 నుంచి.. మంత్రి ఉత్తమ్ 1994లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్ దంపతులు కోదాడలోని నయానగర్లో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఆమె ఇంటికి తాళం లేకపోవడంతో ఇంటిపక్క వారు గమనించి లక్ష్మమ్మకు సమాచారం అందించారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉంచిన తులం బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి సామగ్రి మెత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇళ్ల వారు వచ్చి చూస్తేగానీ ఏమేమి చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుంది. -
మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా
నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి. – దబ్బెటి వరుణ్ సాయి, మోత్కూరు ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నేను తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాను. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందాలి. – దబ్బెటి నేహ, జామచెట్లబావి, మోత్కూరు -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చిట్టంకుంట గ్రామంలో జరిగే బంధువుల శుభకార్యానికి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అంతకు ముందు భీముడు కుటుంబ సభ్యులు వేడి నీటి కోసం ఇంట్లోని బాత్రూంలో కరంట్ హీటర్ పెట్టి మర్చి పోయి వెళ్లారు. దాంతో బకిట్లోని నీరు అతిగా వేడి కావడంతో హీటర్ కాలిపోయి బాత్రూంతోపాటు బెడ్రూంలో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వారి ఇంట్లోంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫర్నీచర్తో పాటు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. -
మిర్యాలగూడలో ఘర్షణలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి. 29వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి డబ్బికార్ మల్లేష్ తరఫున షేక్ మస్తాన్న్, షేక్ జమీన్, షేక్ బడేమియా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన వారిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జావెద్, అతడి సోదరులు అనుచరులతో కలిసి ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీంతో మస్తాన్ తలకు గాయమై స్పృహ కోల్పోయాడు జమీన్, బడేమియాకు గాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తనయుడు నల్లమోతు సిద్దార్ధ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో జావెద్ అనుచరులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని.. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శిస్తున్న నల్లమోతు సిద్దార్ధపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మస్తాన్, జమీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మరో మూడు వార్డుల్లో ఘర్షణలు.. అదేవిధంగా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 32వ వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. 20వ వార్డు రెడ్డీకాలనీలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంటుగా కూర్చున్న అశోక్పై ఆ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి భర్త దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే ఫిర్యాదు చేశాం.. 29వ వార్డులో ఘర్షణలు జరిగే ఆస్కారం ఉందని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తాను ముందుగానే ఫిర్యాదు చేశానని సీపీఎం అభ్యర్ధి డబ్బికార్ మల్లేష్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జావెద్పై గతంలో పలు కేసులు ఉన్నాయని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని, తన ఫిర్యాదుపై స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ 29వ వార్డులో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ వర్గీయుల దాడి ఫ పోలీసుల లాఠీచార్జి ఫ ముగ్గురికి గాయాలు ఫ మరికొన్ని వార్డుల్లో చెదురుమదురు ఘటనలుఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో గాయపడి నల్లగొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసిహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్ధార్థతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, సీపీఎం కొన్ని చోట్లా కలసి పనిచేశాయని, మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకే కాంగ్రెస్ గుండాలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి ప్రయత్నం చేసారని, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్లను ఆక్రమించే యత్నం చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. మిర్యాలగూడలో జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. -
ఫ ఓటెయ్.. చికెన్ తీసుకో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా చికెన్ షాపులకు వెళ్లి టోకెన్ ఇచ్చి చికెన్ తీసుకున్నారు. దాంతో చికెన్ షాపులు కిటకిటలాడాయి. షాపుల నిర్వాహకులు ముందుగానే కోళ్లను తెప్పించుకొని, టోకెన్తో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేసి చికెన్ అందించారు. -
డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అందిస్తాం
ఫ టీజీఎస్పీడీసీఎల్ శివాజీ నల్లగొండ : వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆయన మంగళవారం నల్లగొండలోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్కు ఎలాంటి కొరత లేదన్నారు. ఈ నెల చివరి నాటికి 7 సబ్స్టేషన్ల అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పరికరాల కొరత ఉన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారి మాటల్లో వాస్తవం లేదన్నారు. 450 కిలోమీటర్ల వైర్ అందుబాటులో ఉండటంతో పాటు డీపీఆర్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికతో విద్యుత్ శాఖ ముందుకు పోతుందన్నారు. సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈటీ రాజునాయక్, డీఈ ప్రసాద్, స్టోర్ ఏడీ శంకరయ్య, పాల్గొన్నారు. ఎంజీయూలో ముగిసిన వర్క్షాప్నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ 8వ సెమిస్టర్, ఎంసీఏ 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, యూజర్ ఇంటర్ ఫేస్ టూ ల్స్, సైడ్ డెవలప్మెంట్ టూల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు స్వయంగా పరీక్షించి, ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం సాధ్యమవుతుందని సీ ఎస్సీ విభాగం అధిపతి ఎం.జయంతి తెలి పారు. కార్యక్రమంలో సీవీఎస్సార్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సాగర్, కోఆర్డినేటర్ జ్యోతిరాణి పాల్గొన్నారు. నిజాయితీ పరులను ఎన్నుకోండి : జూలకంటిమిర్యాలగూడ : మున్సిపాలిటీలో ఎన్నికల్లో నిజాయితీ పరులను, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధనబలంతో వచ్చే అవకాశవాదులను, అవినీతిపరులు ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాల ఆశ చూపి ఓట్లు పదవులు పొందేందుకు ముందుకు వస్తున్నారని.. అలాంటి వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రెండేండ్ల కాలంలో పట్టణంలో అభివృద్ధి జరగలేదని, కేవలం కాలయాపన చేస్తూ కాలం గడిపారని అన్నారు. తమ హయాంలో రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రెనేజీ పనులు చురుకుగా సాగాయని.. ఇప్పుడు ఏ అభివృద్ధీ జరగలేదని విమర్శించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి గోదాములో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. పోలింగ్ రోజున ఉదయం 6.45 గంటలకు ఏజెంట్ల ఎదుట బ్యాలెట్ బాక్స్ను తెరవాలన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు, జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరుగుతుందన్నారు. 3,09,097 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికలకు 2855 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేసేలా అవగాహన కల్పించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్కు సంబంధించి ఆర్జాలబావి గోదాములో, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్ఎల్బీసీ సమీపంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
మార్చి నాటికి ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు
చిట్యాల : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మార్చినాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు స్వప్న, సంతోష, కళమ్మతో మాట్లాడారు. బిల్లుల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల, సత్యనారాయణతో మాట్లాడారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుందని అంతకుమించి అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేసుకొని ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయిన వెంటనే మరుగుదొడ్డి నిర్మాణానికి బుక్ చేయించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయించాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ జయలక్ష్మి, ఏఈ ప్రీతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ కాటం వెంకటేశం ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన నార్కట్పల్లి : మండలంలోని జువ్విగూడెం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, దాసరిగూడెం, ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ మంగళవారం పరిశీలించారు. ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, సర్పంచ్ చింత అనిల్కుమార్, హౌసింగ్ ఏఈ ఇందు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ విపి.గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డబుల్బెడ్ రూమ్ గృహ సముదాయాల్లో కరెంటు, తాగునీరు, డ్రెనేజీ, అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాకే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి నల్లగొండలోని కలెక్టరేట్ వెనక గొల్లగూడెం వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రోజూ బడికి రావాలి
మర్రిగూడ : విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కోరుతూ మర్రిగూడ మండలంలోని దామెరబీమనపల్లి పాథమిక పాఠశాల హెచ్ఎం లచ్చిరాం వారం రోజు లుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి వారిని పాఠశాలకు తీసుకెళ్తున్నారు. మంగళవారం ఓ విద్యార్థి పొలం పనులు చేస్తుండగా తెలుసుకుని వారి పొలానికి వెళ్లి విద్యార్థిని పాఠశాలకు తీసుకొచ్చారు. విద్యార్థులు పొలం బాట కాదు.. బడి బాట పట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఎస్.వెంకట్కుమార్ ఉన్నారు. -
పోలింగ్కు పకడ్బందీ భద్రత
నల్లగొండ : మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఎలాంటి నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది, 5 ప్లాటూన్ల టీజీఎస్పీ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. 164 వార్డుల్లో 473 పోలింగ్ స్టేషన్లలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని.. ఆయా చోట్ల అదనపు బలగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 333 మందిని బైండోవర్ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. నల్లగొండలో విస్తృత తనిఖీలు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాత్రి పట్టణంలో విస్తత తనిఖీలు నిర్వహించారు. నల్లగొండలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చేపట్టిన తనిఖీలను ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యవేక్షించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిళ్ల మద్యం, 64 చీరలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఆయకట్టుకు నీరిస్తున్నా.. నిండుకుండే!
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నుంచి ఆయకట్టులో పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నా.. ప్రాజెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోకు సమానంగా నిత్యం ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం తగ్గడం లేదు. మూసీ ప్రాజెక్టు ఎగువన ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలు తమ అవసరాల కోసం వినియోగించిన నీరంతా నేరుగా మూసీకి చేరుతోంది. దీంతో పాటు మూసీ నది తీరం వెంట ఉన్న వలిగొండ, రామన్నపేట, శాలిగౌరారం మండలాల్లో సాగు చేసిన వరి పొలాల నుంచి జాలు కూడా మూసీకి వస్తోంది. ఇలా రోజూ 250 నుంచి 500 క్యూసెక్కుల నీరు మూసీ రిజర్వాయర్లో చేరుతోంది. ఆయకట్టుకు సాగునీరు.. మూసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 35 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటలు పూర్తయ్యే వరకు నీటిని విడుదల చేశారు. అప్పటికీ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో(645 అడుగులు) నీటిమట్టం ఉండటంతో యాసంగి సీజన్లో పంటల సాగుకు మొదటి విడతగా గత డిసెంబర్ 15న నెల రోజుల పాటు, రెండవ విడతలో 15 రోజుల పాటు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు రోజూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 641అడుగుల (3.39 టీఎంసీలు) నీరు ఉంది. ఫ నిత్యం నీటితో కళకళలాడుతున్న మూసీ రిజర్వాయర్ ఫ ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో -
మున్సిపల్ బరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి
మిర్యాలగూడ: రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత మల్లు స్వరాజ్యం మనవరాలు మల్లు మధులత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు గౌతమ్రెడ్డి కోడలు అయిన మధులత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు. తన అమ్మమ్మ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని, తనను గెలిపిస్తే 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆమె చెప్పారు. -
అచ్చం వైఎస్సార్ లాగే..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐనాల శ్రీనివాస్ సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణతో జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆయన అచ్చం వైఎస్సార్ హావ భావాలు ప్రదర్శిస్తుండడంతో జూనియర్ వైఎస్సార్గా పేరుపొందాడు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్లు, సభలు జరిగినా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. -
సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి మున్సి పాలిటీలోని జడ్పీహెచ్ఎస్, సీతావానిగూడెం, నారాయణగిరి, ముక్తాపూర్, రేవనపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే గదులను శుభ్రం చేస్తున్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లోని గుర్తులు స్పష్టంగా కన్పించేలా అన్ని పోలింగ్ కేంద్రాలలోని కంపార్ట్మెంట్ పైన లైట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి తెలిపారు. -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో గల్లంతైన తల్లం పుల్లయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు, నిడమనూరు పోలీసులు, పుల్లయ్య కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన స్థలం నుంచి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు ఎడమ కాల్వ తూముల వద్ద వెతుకుతున్నారు. గాలింపు చర్యలను నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ ఉప్పు సురేష్, ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మాసత్యం పర్యవేక్షించారు. లభ్యంకాని పుల్లయ్య ఆచూకీ -
వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ
భూదాన్పోచంపల్లి: సంతానం లేని వారికి వైద్యం చేస్తానని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి మహిళ నుంచి 4 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం భూదాన్పోచంపల్లి పట్టణంలోని గాంధీనగర్లో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత, రాజ్కుమార్ దంపతులకు వివాహమై ఐదేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. బైక్పై హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సోమవారం రాజ్కుమార్ ఇంటి వద్దకు వచ్చి సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామని నమ్మించాడు. ఇందుకు రూ.12వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇది నమ్మిన రాజ్కుమార్ దంపతులు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరక సదరు వ్యక్తి మొదట రాజ్కుమార్ ఒంటికి నూనె లాంటి పదార్థాన్ని పూసి అతడిని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ప్రణీతకు కూడా మెడ భాగంలో నూనె పూస్తూ పుస్తెలతాడును తీయమని చెప్పడంతో ఆమె తీసి మంచం పైన పెట్టింది. అనంతరం ఆమెను కూడా స్నానం చేసి రమ్మని చెప్పాడు. ప్రణీత స్నానానికి వెళ్లగానే మంచంపై ఉంచిన పుస్తెలతాడు సదరు వ్యక్తి తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ప్రణీత స్నానం చేసి వచ్చి చూడగా ఆ వ్యక్తి లేడు, పుస్తెలతాడు కన్పించలేదు. వెంటనే తేరుకొని భర్త రాజ్కుమార్ ఆమె చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్ నంబర్ను పరిశీలించగా ట్రూ కాలర్లో అతడి పేరు వెంకటేశ్వర్రావు అని, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాగా వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉంటే సంతానం లేనివారికి వైద్యం చేస్తామంటూ ఇటీవల పోచంపల్లిలో పలువురి వద్ద వేల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్లు తెలిసింది. -
ఆడపిల్లలకు వరాల జల్లు
చిట్యాల : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులోని పోటీచేస్తున్న కౌన్సిలర్ ఆభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లలకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించారు. 9వ వార్డులో ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.10,116, ఆడపిల్ల పుడితే రూ.5,116 అందిస్తానని ఆ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆగు అశోక్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్ల పుడితే రూ.11,116, ఆడపిల్ల పెళ్లికి రూ.15,116 అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రబోయిన సమతా శ్రీకాంత్ తన వార్డులో ఆడపిల్లపు పుట్టిన, ఆడపిల్ల పెళ్లి చేసినా రూ.10,116 అందిస్తానని హామీనిచ్చారు. 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మనగోటి శ్రీను వార్డు ప్రజలు శుభకార్యాలు జరుపుకొంటే ఫంక్షన్హాల్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు శేఖర్ తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు వార్డులో అడపిల్ల పెళ్లికి రూ.10వేలు అందిస్తామని హామీ ఇచ్చాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన కూరెళ్ల లింగస్వామి తన వార్డులో ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లింగస్వామి భార్య జ్యోతి ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 నజరానా ఇస్తామని ప్రకటించారు.ఫ మున్సిపల్ అభ్యర్థుల హామీలు -
సెల్ఫోన్కు అనుమతి లేదు
భువనగిరిటౌన్ : ఓటు వేసేందుకు వెళ్లే వారు సెల్ఫోన్ను బయట ఉన్న అధికారికి ఇచ్చి వెళ్లాలి. ఒక వేళ సెల్ఫోన్ తీసుకెళ్లి ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే నేరంగా పరిగణిస్తారు. ఓటు వేస్తూ సెల్ఫీ తీసినట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే అతడిని బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో సదరు వ్యక్తి వేసిన ఓటు పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు వేయ డానికి 18 ఏళ్లుకు పైగా ఉన్న సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. అతడి ఓటును బహిరంగ పర్చనని సహాయకుడు నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
వార్డు సమస్యలను గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు కోరారు. వేదిక రూపొందించిన కరపత్రాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట వారు ఆవిష్కరించారు. అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి, సమాజ మార్పు కోసం పాటుపడాలని సూచించారు. ప్రజలు ఈ కరపత్రాన్ని వార్డు నుంచి పోటీ చేసే వారికి అందించి అందుకు సంబంధించిన హామీలు పొందాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.భద్రయ్య, కరీం, సుభాని, ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు సెలవు
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని విద్యా సంస్థలన్నింటికీ ఈనెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలకు 10, 11 తేదీల్లో సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఓ పక్క అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో పక్క సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అందిస్తున్నాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని అదే తరహాలో మున్సిపాలిటీల్లో కూడా విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని, ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. సమావేశంలో జిల్లేపల్లి పరమేష్, ఎండీ.ముంతాజ్ అలీ, భవ్యతేజ్రెడ్డి, గౌతమ్, రవీందర్రెడ్డి, పగిల్లరాజు, శరత్, జస్వంత్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి
చిట్యాల : ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో రుద్రవరం యాదయ్య, రెండో వార్డు అభ్యర్థి షబనా అజీమ్, తొమ్మిదో వార్డు అభ్యర్థి ఆగు అశోక్ తరఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసేవారిని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీలో నిలిపామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు, అసంపూర్తి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రెండున్నరేళ్లుగా చిట్యాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా మోసపూరిత హామీలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో దూదిమెట్ల సత్తయ్య, అర్రూరి శ్రీశైలం, కన్నెబోయిన శ్రీశైలం, చిత్రగంటి ప్రవీణ్, రుద్రవరం సునీల్, నర్రా భిక్షంరెడ్డి పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మదర్ డెయిరీలో కుంభకోణం
ఫ పాలుపోయకుండానే రూ. 9.50 లక్షలు బిల్లు కై ్లమ్ ఫ జీఎం, మేనేజర్, సూపర్వైజర్ సస్పెన్షన్ సాక్షి, యాదాద్రి : పాలు పోయకుండానే రూ.9.50 లక్షల మేర బిల్లులు డ్రా చేసిన వ్యవహారంలో మదర్ డెయిరీ జనరల్ మేనేజర్ కృష్ణ, భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ దశరథ, ప్రాసెసర్ పరమేశ్వర్రెడ్డిలు సస్పెండ్ అయ్యారు. మూతపడిన పాల కేంద్రాలలో పాలు పోసినట్లుగా దొంగబిల్లులు సృష్టించారు. పాలు పోయకుండానే భువనగిరి చిల్లింగ్ సెంటర్ నుంచి చెల్లింపుల కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల్లో రూ.9.50 లక్షల మేర బిల్లులు మదర్ డెయిరీకి పంపించారు. మూతపడిన పాల కేంద్రాలు చాడ, ముత్తిరెడ్డిగూడెం, నమాత్పల్లి, సూరేపల్లి, ఏంబాయి సొసైటీల పేరుతో దొంగ బిల్లులు సృష్టించారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు డ్రా చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించనందున సెప్టెంబర్ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ స్కాంలో అప్పటి మదర్ డెయిరీ ఎండీ అయిన ప్రస్తుత జనరల్ మేనేజర్ కృష్ణ, భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ దశరథ, ప్రాసెసింగ్ సూపర్ వైజర్ పరమేశ్వర్రెడ్డిల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణకు ఆదేశించినట్లు మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి చెప్పారు. ఈ స్కాంపై పూర్తి విచారణ జరిపి దోషులను గుర్తించి రైతులకు న్యాయం చేస్తామని చైర్మన్ చెప్పారు. -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
చండూరు : ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. చండూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు పలు సూచనలు చేశారు. బ్లూ ప్రింట్పై పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేసిన బ్యాగులను విప్పి పరిశీలించారు. మెటీరియల్ సరిపోతుందా లేదా చూసుకుని అదనంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించే అంశంపై చర్చించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీదేవి, ఎంపీడీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మల్లేషం, మాస్టర్ ట్రైనర్ మాదగోని వెంకటేశం తదితరులు ఉన్నారు. -
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సన్నద్ధతపై సోమవారం సాయంత్రం ఆయన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్బీ, బీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బందికి అందించాలని సూచించారు. పీఓలు పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా గమనించాలని, మున్సిపల్ కమిషనర్లు కమ్యునికేషన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాదారణ పరిశీలకులు జి. రమేష్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ పూర్తిగా తనిఖీ చేసుకొని సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. 90 శాతం ఓటింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది చివరి ర్యాండమైజేషన్ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలింగ్ నిర్వహణకు గాను మొత్తం 475 పోలింగ్ కేంద్రాలలో 20 శాతం రిజర్వ్ కలుపుకొని సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 571 మంది పీఓలు, 571 మంది ఏపీఓలు, 1,713 మంది ఓపీఓలు మొత్తం 2,855 మందికి ఈ ర్యాండమైజేషన్లో పోలింగ్ విధులను కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
16వ డివిజన్ అభివృద్ధి బాధ్యత నాదే..
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 16వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెరిక స్వాతిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ అభివృద్ధి బాధ్యత నాది అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 16వ డివిజన్లో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే డివిజన్లోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం నుంచి వందల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉండి, ప్రజల మధ్య ఉన్న అభ్యర్థి గెలుపుతోనే డివిజన్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్రెడ్డి, వినాయకరాజు పాల్గొన్నారు. -
తెలంగాణ రాజకీయాలను మునుగోడు శాసిస్తుంది
చండూరు : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మునుగోడు గడ్డ శాసించే రోజు వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ‘నాకు పదవిపై వ్యామోహం లేదు. రాజగోపాల్రెడ్డి ఏం చేస్తాడో అని రాష్ట్రం మొత్తం మునుగోడు వైపు చూస్తోంది.గత ప్రభుత్వంలో నా రాజీనామా వల్ల నాకు అన్యాయం జరిగినా.. మునుగోడుకు న్యాయం జరిగింది. నా రాజీనామాతో అప్పటి కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చాను’ అని అన్నారు. సోమవారం ఆయన చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల సభలో మాట్లాడారు. ప్రజలు మీది ఏ ఊరు అంటే గతంలో నల్లగొండ అని చెప్పే వాళ్లు. ఇప్పుడు మాది మునుగోడు అని చెప్పుకునే స్థాయికి తెచ్చానని అన్నారు. చండూరు మున్సిపాలిటీలో కనీసం నివాస స్థలం లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలం ఇస్తానని, ప్రభుత్వం స్ధలం ఉన్నా లేకున్నా సొంతంగా కొనైనా వారికి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ రాని వృద్ధులకు.. ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు తానే నెలకు 2వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ రూ.5వేలు ఇవ్వాలని రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు.డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు..మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దని, డబ్బులు పెట్టిన వ్యక్తి దగ్గరికి పనికి పోతే పుణ్యానికి ఓటు వేశావా అని ఎదురు ప్రశ్నిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులతో వస్తున్నారు మోసపోవద్దని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం శ్రీనివాస్రెడ్డి, అనంత చంద్రశేఖర్, గిరిబాబు, కోడి శ్రీనివాసులు, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో కాంగ్రెస్కు పట్టం కట్టండి
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నల్లగొండలోని 14, 15, 16, 17, 3 డివిజన్లలో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడారు. చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్కు పట్టం కడితే.. నల్లగొండ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలన్ని పేదలకు అందించడమే నా ధ్యేయమన్నారు. నల్లగొండలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేయడంతో పాటు 24 గంటలు తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే హైదరాబాద్ తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో అంగన్వాడీ భవనాలు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బొట్టుగూడ తరహాలో అబివృద్ధి చేసి పేదలకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అన్ని రంగాల్లో అబివృదిద్ధ జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, పాశం రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బొజ్జ శంకర్, పెరిక నాగరాజు, అశ్విని పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మీ ఓటు నన్ను మేయర్ను చేస్తుంది
ఫ 38వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉంది ఫ నా భర్త శ్రీనివాస్రెడ్డి ఇక్కడ నుంచి మూడు సార్లు కౌన్సిలర్గా గెలిచారు ఫ నన్ను కూడా ఆదరించి గెలిపించాలి ఫ మంత్రి సహకారంతో కార్పొరేషన్ను అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి నల్లగొండ : ‘నల్లగొండలోని 32వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది. నా భర్త బుర్రి శ్రీనివాస్రెడ్డిని మూడు పర్యాయాలు గెలిపించారు. ఆయన మున్సిపల్ చైర్మన్గానూ పనిచేశారు. ప్రస్తుతం ఈ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. మీరు వేసే ఓటు నన్ను మేయర్ను చేస్తుంది’ అని కాంగ్రెస్ పార్టీ 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నల్లగొండను స్మార్ట్ సిటీగా చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి కంకణ బద్ధులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద రూ.216 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 11 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. 24 గంటలు కృష్ణా జలాలు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు సాగుతున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, బస్టాండ్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు, డీఈఓ ఆీఫీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు బీటీ రోడ్లు, పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి రూ.900 కోట్లతో రింగు రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ఐదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీ ప్రారంభించాం. రూ.100 కోట్లతో ముశంపల్లి రోడ్డును అభివృద్ధి చేసుకుంటున్నాం. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సెంటర్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులు చేపట్టారు. నల్లగొండకు తలమానికం అయిన లతీప్సాబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు రూ.140 కోట్లతో ఘాట్రోడ్డు పనులు జరుగుతున్నాయి. రూ.150 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తున్నాం. నన్ను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు జవాబు దారీగా పని చేస్తా. 32వ డివిజన్ను పట్టణంలోనే మరింత అందంగా తీర్చిదిద్దుతా. మంత్రి సహకారంతో ఒక మహిళగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. కార్పొరేషన్ కావడం నిజంగా అదృష్టం. తద్వార కేంద్రం నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. నల్లగొండకు కొండంత అండగా కోమటిరెడ్డి ఉన్నాడు. పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు సహకరించాలి. -
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ప్రకృతి, వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల గుండా నెల రోజులుగా చేపడుతున్న ప్రకృతి విజ్ఞానయాత్ర సోమవారం ఎంజీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంజీ సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి హేతుబద్ధమైన వైజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, లోతైన పరిశీలన, సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా తయారై దేశసేవలో భాగస్వాములు కావాలని కోరారు. కవి, వాగ్దేయకారుడు జయరాజ్ మాట్లాడుతూ మానావళి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిపై అవగాహన కలిగి ఉండాలని, మొక్కలు నాటడం తమ బాధ్యతగా బావించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు రమేష్, గంజి ఈశ్వరలింగం, సురేష్కుమార్, స్వరాజ్యం, ఎం.వెంకటరమణారెడ్డి, సురేష్రెడ్డి, షరీఫ్, కిరణ్, రమేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యం
మిర్యాలగూడ టౌన్ : ఆరు గ్యారంటీ పథకాలను ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నర ఏళ్లుగా చేసిన అభివృద్ధి శూన్యం అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 3వ వార్డు తాళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి వై.పద్మ, సీపీఎం బలపరిచిన 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గుడిసె జానకమ్మను గెలిపించాలని కోరారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప.. ప్రస్తుతం ఏ పనీ జరగలేదన్నారు. సీపీఎం, బీఆర్ఎస్ మిత్రపక్షాలను గెలిపిస్తేనే వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలమోతు సిద్దార్థ, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రమేష్, ఇస్మాయిల్, నర్సింగ్, ఖరీం, బంటు ఈదయ్య, రీయాజ్, నాగులు, నాగేందర్, ముభీన్, జాంగీర్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అండగా నిలవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్రెడ్డికి మద్దతుగా ఏఆర్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 6వ డివిజన్కు అధిక నిధులు ఇచ్చి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. సునంద కర్నాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఏఆర్నగర్, శాంతినగర్ కాలనీల అభివృద్ధి తాను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ల్యాబ్ సర్వీస్ ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ రోగులకు వైద్య పరీక్షల కోసం ఓపీ విబాగం పక్కనే ప్రత్యేక ల్యాబ్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలోనే అవుట్ పేషెంట్స్ రక్త, మూత్ర పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి త్వరగా పరీక్షల రిపోర్టును అందించనున్నారు. దీంతో వారికి సమయం ఆదా కావడంతో పాటు వెంటనే సరైన చికిత్సలు అందించే అవకాశం ఉంది. ప్రత్యేక ల్యాబ్ సర్వీసును సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపీ విభాగంతో పాటు క్యాజువాలిటీలో కూడా మెడికో లీగల్ కేసుల కోసం ప్రత్యేకమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నప్రభ, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రత్న, రజని, డాక్టర్ మహేష్, స్పందన, తార, సునీత, శ్రీలత, సాగర్ పాల్గొన్నారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చుపెద్దవూర : కసి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని గర్ల్స్ చైల్డ్ ఎంపర్మెంట్ మోటివేటషన్ స్పీకర్, ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గంజి భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం పెద్దవూర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మోటివేషనల్ స్కిల్స్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మేధావులంతా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రయత్నం ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. ప్రతి పుస్తకంలోనూ ఏదో ఒక విషయం ఉంటుందని, పుస్తకాన్ని మించిన నేస్తం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ తరి రాములు, ఉపాధ్యాయులు రమాదేవి, కృష్ణయ్య, రాములు, భాస్కర్, వాలియా, దూదియా, ఇంధుమతి, అరవింద్రెడ్డి, పద్మావతి, చంద్రమణి, లలిత, జానమ్మ, హైమావతి, సీఆర్పీ వెంకటయ్య పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు.. ప్రయోగాల కేంద్రాలునల్లగొండ టూటౌన్ : సమాజ హితమైన ప్రయోగాల కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు తయారు కావాలని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వృక్షశాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి నెలలో ‘ఆరోగ్యవంతమైన భూమండలం కొరకు జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై ఎంజీ యూనివర్సిటీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రేమ్సాగర్, మాధురి, వసంత, అన్నపూర్ణ, ఆర్ఎస్ బుట్టి, శివరాం, రామచందర్గౌడ్, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు. సాగర్కు లోకాయుక్త న్యాయమూర్తినాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి ఏ.రాజశేఖర్రెడ్డి శనివారం నాగార్జునసాగర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు నిడమనూరు కోర్టు సూపరింటెండెంట్ చంద్రశేఖర్శర్మ, ప్రొటోకాల్ అధికారి దండా శ్రీనివాస్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. -
అధికార పార్టీతోనే అభివృద్ధి
ఫ మంత్రి సీతక్క ఫ చిట్యాలలో ఎన్నికల ప్రచారం చిట్యాల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆయా పంచాయతీలకు రూ.250 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళ సంఘాలకు రూ.1200 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మహిళలను ఆర్థికం బలోపేతం చేసేందుకుగాను బస్సులు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చిట్యాలలో రైస్ మిల్లు ఏర్పాటుకు మహిళలకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేస్తే మురిగిపోతాయని, అభివృద్ధి ఉండదని చెప్పారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పాటి నర్సిరెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు రాష్ట్ర మంత్రి సీతక్క కండువ కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, ఏఎంసీ మాజీ చైర్మన్ పందిరి శ్రీనివాసులు, గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య, కాటం వెంకటేశం, పాటి మాధవరెడ్డి, గుండెబోయిన సైదులు, పిశాటి భీష్మారెడ్డి, ఆవుల యాదయ్య, అంతటి వెంకటేశం, వడ్డెపల్లి లక్ష్మయ్య, జనగాం రవీందర్గౌడ్, బొబ్బల రాంరెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, అంశల సత్యనారాయణ, కాటం సత్తయ్య పాల్గొన్నారు. -
చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ పరిధుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై, వాహనదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్ఐ గోపాల్రావు, పోలీసులు పాల్గొన్నారు. -
పట్టణాల్లో నాకాబందీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పోలింగ్కు ముందు రోజు నుంచే డివిజన్లు, వార్డుల్లో నాకాబందీ నిర్వహిస్తాం. మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూస్తాం’ అని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తోపాటు చండూరు, చిట్యాల, దేవరకొండ, నాగార్జునసాగర్, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టబోయే చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఎస్పీ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 162 వార్డుల్లో 164 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ఇందులో 65 లొకేషన్లను క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించాం. వాటిల్లో గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిగ్గింగ్, క్రాస్ ఓటింగ్ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో రూట్ మొబైల్ బృందాలను నియమిస్తాం. జిల్లాలో రెండు వేల మందితో స్పెషల్ పోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. వారంతా బందోబస్తులో పాల్గొంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తాం. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడుతున్నాం. 300 మంది పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేశాం. మున్సిపాలిటీల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి కదలిలకపై నిఘా పెట్టాం. రోజూ పిలిపించి చెక్ చేస్తున్నాం. కార్పొరేషన్తోపాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 81 మంది నుంచి ఆయుధాలను డిపాజిట్ చేయించాం. గతంలో గొడవలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో నాయకులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. గతంలో నేరాలకు పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎలాంటి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తాం. ఏమైనా సంఘటనలు జరిగితే స్థానిక ప్రజలు కూడా డయల్ 100 ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వండి. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఓటు వేయకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే విధంగా ఆలోచించి ఓటు వేయండి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 3 వార్డులకు కలిపి ఒకటి చొప్పున చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తనిఖీలు జరుగుతాయి. పోలింగ్కు ముందు డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఓటర్లను ఇతర ప్రలోబాలకు గురి చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో మున్సిపాలిటీలో డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. మిర్యాలగూడ, హాలియా, నందికొండ ప్రాంతాల్లో ఏఎస్పీ ఇన్చార్జి వ్యవహరిస్తాను. నేను నల్లగొండతో పాటు చండూరు, చిట్యాల, దేవరకొండ ప్రాంతాలు పర్యవేక్షిస్తా. ఇప్పటికే పలుచోట్ల తనిఖీలను ముమ్మరం చేశాం. మిర్యాలగూడతో పాటు నందికొండ, హాలియా మున్సిపాలిటీలకు అవంతీపురం మార్కెట్ యార్డులో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల కౌంటింగ్ను నల్లగొండ సాగర్ రోడ్డులోని రామానందతీర్థ నిడమనూరు గురుకుల పాఠశాల కేంద్రంలో ఏర్పాటు చేశారు. నల్లగొండ కార్పొరేషన్ కౌంటింగ్ను ఆర్జాలబావిలోని వేర్ హౌజింగ్ గోదాములో ఏర్పాటు చేశారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్సులను అక్కడి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అక్కడ మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తాం. ఫ మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తాం ఫ డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాం ఫ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఫ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. స్వేచ్ఛగా ఓటెయ్యాలి ‘సాక్షి’తో ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కార్పొరేషన్లో చరిత్రాత్మక తీర్పునివ్వాలి
నల్లగొండ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పునివ్వాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని 10, 11, 6, 7, 8, 9, 25 డివిజన్లలో నిర్వహించిన జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. మొదటిసారి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. తాను మంత్రిగా ఉన్నానని.. ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు. నల్లగొండలో రూ.2200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. తనను టైదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ కావాలని.. ప్రజలు ఆలో చించి ఓటు వేయాలన్నారు. ఏ సమస్య వచ్చి నా కార్పొరేటర్ తనకు చెబితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, ఆయా డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. ఫ నీలగిరిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
దేవరకొండ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కల్టెకర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్ పేషంట్, అవుట్ పేషంట్, పార్మసీ, ప్రసూతి విభాగాలను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్ రవిప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
లారీ డ్రైవర్ను బెదిరించిన ఇద్దరి అరెస్ట్
నార్కట్పల్లి : లారీ డ్రైవర్ను చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నార్కట్పల్లి ఎస్ఐ పి.విష్ణుమూర్తి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ సునీల్తివారి లారీలో వెలిమినేడు నుంచి ఐరన్ లోడు వేసుకొని బయల్దేరాడు. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటంలో ఉన్న ఒక కంపెని వద్ద లారీ ఆపాడు. వంట చేసుకోవడానికి అవసరమైన సామగ్రి కోసం ఏపీ లింగోటంలోని కిరాణాషాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చి లారీ డ్రైవర్ను బలవంతంగా వాహనంపై ఎక్కించుకొని కొద్దిదూరం తీసుకెళ్లారు. ఇనుప రాడ్డుతో కొట్టి చంపుతామని బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకొని స్కూటీపై పారిపోయారు. లారీ డ్రైవర్ వెంటనే నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను బెదిరించిన మాద యడవల్లి గ్రామానికి చెందిన లింగస్వామి, నార్కట్పల్లికి చెందిన ఎస్కే ఉమర్ను అరెస్ట్ చేశారు. లారీ డ్రైవర్ వద్ద నుంచి వారు లాక్కెళ్లిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 9న అప్రెంటీస్ మేళా డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేళాకు హాజరయ్యే ఆసక్తిగల విద్యార్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9705182677 నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లులో గుప్తనిధుల కలకలంవేములపల్లి : మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం గుప్తనిధుల కలకలం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బీమారం–సూర్యాపేట రహదారి సమీపంలో పెరుమళ్ల కృష్ణయ్య పొలం వద్ద పురాతన కాలానికి చెందిన శివుడి శిలాఫలకం, నాటి లిపితో కూడిన బండరాయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ రాయిపై కుంకుమ, పసుపు చల్లి తవ్వకాలు చేసి, తిరిగి రాయిని అక్కడే ప్రతిష్ఠించి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన కృష్ణయ్య ఈ విషయాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో, గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామంలో చర్చ సాగుతోంది. -
నల్లబెల్లం, పటిక పట్టివేత
మోతె : మండల పరిధిలోని గోల్తండాలో శుక్రవారం గుగులోతు మంగిత్య కుమారుడు రవీందర్ ఇంటి వద్ద 60 కేజీల నల్ల బెల్లం, 250 కేజీల పటికతో పాటు 5 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గుగులోతు రవీందర్ను సూర్యాపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించినట్లు తెలిపారు. ఎన్ఫోర్సుమెంట్ ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఎస్సై పి.గోపాల్రావు, హెడ్ కానిస్టేబుల్ అప్సర్, సిబ్బంది బ్రహ్మం, రమేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికమిర్యాలగూడ టౌన్ : హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ స్థాయి కరాటే పోటీలకు మిర్యాలగూడ మండలంలోని నలంద విద్యాలయం విద్యార్థులు ఎంపికయ్యారు. ఎల్లో బెల్ట్ అండర్–12 విభాగంలో బండారి హరిచందన, చేపూరి వంశీ, అండర్–14 విభాగంలో చేపూరి వర్షిత, కేతావత్ ఉదయ్ శ్రీ, రమావత్ దీపిక, రమావత్ శ్రవంతి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జొన్నలగడ్డ వెంకట్రెడ్డి, కరస్పాండెంట్ జొన్నలగడ్డ రజని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. వీధి కుక్కల దాడిలో 10 మేక పిల్లలు మృతి నడిగూడెం : మండలంలోని నారాయణపురం గ్రామంలో తీగల శ్రీను ఇంటి ఆవరణలో ఉన్న మేక పిల్లలపై శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 10 మేక పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెందాయి. రూ.40 వేలకు పైగా నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. -
ముగ్గురు జూదరుల అరెస్ట్
తుర్కపల్లి : మండలంలోని వాసాలమర్రి గ్రామ శివారులో జూదం అడుతున్న ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తకియొద్దిన్ తెలిపారు. గ్మ్రా శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి మేడ్చల్కు చెందిన పెంజెర్ల రాజేందర్, దేవరి వేణురాజ్, కామారెడ్డికి చెందిన కోరంపల్లి సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పారిపోయారు. వారి వద్ద నుంచి రూ. 2.07 లక్షల నగదు, మూడు కార్లు, రెండు సెట్ల పేక ముక్కలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మణ్ సహాయంతో వాసాలమర్రి శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది పేకాట నిర్వహిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫ రూ. 2లక్షలు స్వాధీనం -
భువనగిరి బంజారాహిల్స్
భువనగిరి టౌన్ : బంజారాహిల్స్ పేరు వినగానే హైదరాబాద్లో ఉన్న ప్రాంతం గుర్తుకు వస్తుంది. కానీ భువనగిరి పట్టణంలో కూడా బంజారాహిల్స్ కాలనీ ఉంది. హైదరాబాద్లో లాగానే ఎత్తైన ప్రదేశంలో ఈ కాలనీ ఏర్పాటు చేయడంతో దీనిని భువనగిరి బంజారాహిల్స్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో బంజారు భూములు ఎక్కువగా ఉండడంతో పాటు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు శివారు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఇళ్ల సంఖ్య పెరిగి చివరకు ఒక కాలనీ ఏర్పడింది. ప్రస్తుతం పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు సైతం ఇక్కడ నిర్మిస్తున్నారు. -
ఓటరు ‘పల్స్’ పట్టేస్తున్నారు
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓ పార్టీ నాయకులు శ్రీపీపుల్స్ పల్స్శ్రీ సంస్థ సహకారంతో ఓటర్లు మోబైల్స్కు కాల్ చేస్తున్నారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఎందుకు అనే విషయమై మోబైల్ కాలర్ ద్వారా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ఓటర్ల నాడికి అనుగుణంగా తమ పార్టీల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీభూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. బీఎల్ఓలు రెండు రోజులుగా ఇంటింటికీ వెళ్లి స్లిప్పులను అందిస్తున్నారు. మున్సిపాలిటీలోని 13 వార్డులకు మొత్తం 15,827 మంది ఓటర్లు ఉన్నారని మున్సిపల్ కమీషనర్ అంజన్రెడ్డి తెలిపారు. మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. బూత్ల వారీగా 26 మంది బీఎల్ఓలు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్లు వచ్చాయ్... భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. శుక్రవారం ప్రత్యేక వాహనంలో భువనగిరి పోలీస్ స్టేషన్కు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ రామలింగం, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ పర్యవేక్షణంలో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక గదిలో భద్రపరిచి సీల్ వేశారు. ఈ నెల 10న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు 128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,831 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 57,396 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఓటర్ల సంఖ్య కంటే 20 శాతం అదనంగా ఉన్నాయి. -
ప్రజాసేవకు అమర జవాన్ కూతురు
జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేకోదాడ : పట్టణంలోని 18వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్కు బదులుగా చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన ఉప్పగండ్ల శ్రీనివాస్కు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస్ కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలను పట్టుకొని వార్డులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న కర్రి సుబ్బారావు రెబల్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. సూర్యాపేట : కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన లాన్స్నాయక్ గోపయ్యచారి కూతురు పోలోజు మౌనిక సూర్యాపేట పట్టణంలో 46వ వార్డు నుంచి కౌన్సిలర్ స్థానానికి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఎన్నికల్లో నిలబడినట్టు ఆమె చెప్పారు. -
నవాబుల నాటి మాల్ బౌలీ..
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలో చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అప్పటి పేర్లే నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటిదే పాతబస్తీలో ఉన్న మాల్బౌలి. నిజాం కాలం నుంచి ఈ పేరు వాడుకలో ఉంది. బౌలి అంటే బావి అని అర్థం. నిజాం కాలంలో ఇక్కడ ఉన్న శివాలయం వద్ద ఒక బావి ఉండేది. అప్పట్లో ఈ బావి నుంచి నీటిని తోడే సమయంలో అందులోంచి నగలు లభించాయి. అందువల్ల ఆ బావికి మాల్ బౌలిని పిలవడం మొదలు పెట్టారు. ఆ బావి ఉన్న ప్రాంతానికి క్రమంగా ఆపేరే పడిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మాల్బౌలి అని పిలుస్తుంటారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. -
నేడు జవహర్ నవోదయ పరీక్ష
పెద్దవూర : పెద్దవూర మండలం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి 9వ, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ కె.శంకర్ తెలిపారు. 9వ తరగతికి 447 మంది బాలురు, 329 మంది బాలికలు మొత్తం 776 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరికి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్, దేవరకొండ రోడ్డులోని గవర్నమెంట్ బాలుర హైస్కూల్, పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 924 మంది బాలురు, 1,009 మంది బాలికలు మొత్తం 1933 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సూర్యాపేట జిల్లాలోనే 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వివరాలు సూర్యాపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట, జెడ్పీహెచ్ఎస్(బాలుర), గవర్నమెంట్ (ఎంఏఎం) హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్(బాలికలు) మున్సిపల్ ట్యాంకు దగ్గర, గవర్నమెంట్ హైస్కూల్ నంబర్–2, కోదాడలోని కేఎస్ ఎస్బీఎం జెడ్పీహెచ్ఎస్ బాలురు, జెడ్పీహెచ్ఎస్ బాలురు, సెయింట్ జోసెఫ్ సీసీఆర్ హైస్కూల్. ఫ 9వ తరగతి, ఇంటర్లో ప్రవేశం -
మహిళలకు రేవంత్ సర్కార్ పెద్దపీట
యాదగిరిగుట్ట : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 7, 8 వార్డులలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారని వెల్లడించారు. ఎవరైనా మహిళ రుణం తీసుకొని మరణిస్తే ఆమెకు సంబంధించిన రుణం రూ.2లక్షలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మహిళా సంఘాలలో సభ్యత్వాలను అందజేస్తున్నామని తెలిపారు. అబద్ధాలకు నిలువుటద్దం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిజాలను దాచిపెట్టి, ప్రజలకు అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలే కానీ.. అబద్దాలపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంటోందన్నారు. కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిపై అసూయతో నిందలు వేస్తున్నాడని మంత్రి సీతక్క విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆమె ఓటర్లను కోరారు. ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీలను అద్బుతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 మున్సిపాలిటీల్లో 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు బిక్షపతిగౌడ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి, కౌన్సిలర్ అభ్యర్థులు ముక్కెర్ల వెంకటేష్, పెలిమెల్లి లావణ్య, ముక్కెర్ల మల్లేష్, మున్సిపల్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఫ అబద్ధాలతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంటోంది.. ఫ యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
మిర్యాలగూడ, మోటకొండూరు : తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్థాపానికి గురైన ప్రేమ జంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామానికి చెందిన వరి కుప్పల రాకేశ్(21), ఓర్సు సౌమ్య దగ్గరి బంధువులు. రాకేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా సౌమ్య ఇంటర్ చదువుతున్నది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు మందలించారు. దాంతో రాకేశ్, సౌమ్య దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపించారు. వెంటనే కుటుంబసభ్యులు 100కు డయల్ చేసి వివరాలు వెల్లడించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరగా చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోటకొండూరులో మిస్సింగ్ కేసు సౌమ్య కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఉదయం బయటికి వెళ్లింది. ఆమె మరో వ్యక్తితో మిర్యాలగూడ ప్రాంతంలో కనిపించిందని కొంత మంది చెప్పడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి
కోదాడ : పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడానికే ప్రజాచైతన్య వేదిక పీపుల్స్ ఎజెండాను రూపొందించిదని, నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు వీటిని గుర్తించి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని అన్నారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులకు పీపుల్ ఎజెండా కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య వంతమైన కోదాడ పట్టణం అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉండడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరాన్ని ఉందన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. ఆయన వెంట వేదిక సభ్యులు ఉన్నారు. టీచరు కొట్టాడని.. పోలీసులకు విద్యార్థి ఫిర్యాదుమర్రిగూడ : తనను ఉపాధ్యాయుడు కొట్టాడంటూ మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. బుధవారం జడ్పీహెచ్ఎస్లోని 8వ తరగతి ఇ–1 సెక్షన్కు చెందిన క్లాస్ టీచర్ సెలవు పెట్టడంతో వారికి హాజరు తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ వెళ్లారే గానీ హాజరు తీసుకోలేదు. ఈ విషయమై డీఈఓ కార్యాలయం నుంచి పాఠశాల ప్రధానోపాయుడికి ఫోన్ చేసి ప్రశ్నించారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో క్లాస్లో ఉన్న విద్యార్థిని మందలించాడు. సదరు విద్యార్థి గురువారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి తనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్సింగ్ని వివరణ కోరగా తాను విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని పేర్కొన్నారు -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ను శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నల్లగొండలోని తన చాంబర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీలలోని 162 వార్డులకు, 475 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 20 శాతం రిజర్వ్తో కలుపుకొని 270 మంది కౌంటింగ్ సిబ్బంది, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు మొత్తం 810 మంది సిబ్బందికి ర్యాండమెంజేషన్ నిర్వహించినట్లు తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 56 కౌంటింగ్ టేబుళ్లు, 16 ఆర్ఓ టేబుళ్లు మొత్తం 72 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్, ఆర్ఓ టేబుళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు, ప్రలోబాలకు గురిచేసే సామగ్రిపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిఘా ఉంచాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్ట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ సమస్యత్మాక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. 47 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సమావేవంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
సాగర్కు వివిధ రాష్ట్రాల అధికారులు
నాగార్జునసాగర్ : భారత్ దర్శన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు ప్రపంచ పర్యటక కేంద్రమైన నాగార్జునసాగర్ను శుక్రవారం సందర్శించారు. వీరు వారం రోజులుగా హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. సాగర్కు చేరుకున్న ఈ బృందానికి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని, బుద్ధవనాన్ని సందర్శించారు. ఇక్కడి విశేషాలను తెలుసుకున్నారు. బుద్ధవనంలోని బుద్ధ విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని ఆసక్తిగా వీక్షించారు. పెద్దవూర తహసీల్దార్ దేవిక్ష, సాగర్ ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాస్రెడ్డి, వెంకటరమణ, జోసెప్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవామృతంతో చీడపీడల నివారణ
నడిగూడెం : ఘన, ద్రవ జీవామృతంతోపాటు వేస్ట్ డీకంపోజర్, వర్మి కంపోస్టు వాడడం ద్వారా పంటలకు సోకే చీడపీడలను నివారించవచ్చని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి డి.నరేష్, మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఏ.కిరణ్ సూచించారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు క్రింద కృషి, సఖీ బృందాల సభ్యులకు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసికర్ల శేషు కుమార్ సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. 1.50 ఎకరాల విస్తీర్ణంలో సహజసిద్ధ పద్ధతుల్లో చేస్తున్న సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతు వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు పలు అంశాలపై సభ్యులకు ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మా డీపీడీ జి.నివేదిత, కె.మల్లారెడ్డి, బి.భువనేశ్వరి పాల్గొన్నారు.


