Nalgonda District Latest News
-
జ్యూస్ కంటే.. పండ్లు బెటర్
ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండకు తట్టుకోలేక చాలా మంది ఎక్కువ మోతాదులో కొబ్బరి నీరు తాగుతున్నారు. దానివల్ల డీ హైడ్రేషన్ వచ్చే ప్రమాదముంది. ఒక గ్లాస్కు మించి కొబ్బరి నీరు తాగవద్దు. ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ నుంచి బయట పడతారు. ప్రూట్ జ్యూస్ కంటే పండ్లు తినడం మంచిది. వేసవిలో హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమట బయటకు వెళ్లి డీ హైడ్రేషన్ వచ్చే ప్రమాదముంది. హెవీగా ఎక్సర్సైజ్ చేయడం తగ్గించాలి. లిక్విడ్ ఓఆర్ఎస్ తాగడం మానాలి. – డాక్టర్ అనిల్, ఎండీ, జనరల్ మెడిసిన్ -
అటవీ భూముల్లో సాగు చేయొద్దు
చందంపేట : అనుమతి లేకుండా అటవీ భూముల్లో సాగు చేయొద్దని ఎఫ్ఆర్ఓలు సుమన్, భాస్కర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని గువ్వలగుట్ట గ్రామంలో ప్రజలకు అటవీ భూముల సంరక్షణపై అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ సుమన్ మాట్లాడుతూ అక్రమంగా కలపను తరలించినా, చెట్లను నరికినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అటవీ జంతువుల సంరక్షణకు సహకరించాలని, అటవీ జంతువులను వేటాడినా, చంపినా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ బీసన్న, ఎస్ఐ లోకేష్, సర్పంచ్ సైదమ్మహన్మా, బీట్ ఫాసర్లు తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనుల పరిశీలనతిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న సుందరీకణ పనులను ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ, ఫౌంటేయిన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఈ గౌస్, ప్రసాద్, సిబ్బంది సైదులు తదితరులు ఉన్నారు. -
ఆదిలోనే మిల్లర్ల అడ్డంకులు
ఫ తాలు పేరిట కొర్రీలు.. ఫ ధాన్యం దిగుమతి చేసుకోకుండా నిలిపివేత ఫ మిల్లుల వద్ద ఆగిపోయిన లారీలుశాలిగౌరారం : ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు ఆ పంటల దిగుబడులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే అరంభంలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. శాలిగౌరారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైన మొదటి రోజే.. అడ్డంకులు ఎదురయ్యాయి. తాలు ఉందంటూ లారీల్లోని ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా నిలిపివేశారు. దీంతో రెండురోజులుగా మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలను నిలిపివేశారు. దీంతో కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 15 కేంద్రాలు ప్రారంభం శాలిగౌరారం మండలంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను.. ఇప్పటికే 15 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మరో ఐదు కేంద్రాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. శాలిగౌరారం, శాలిలింగోటం, తక్కెళ్లపహాడ్ కేంద్రాల నుంచి కాంటా వేసిన 8 లారీల ధాన్యం అదేరోజు సాయంత్రం ట్యాగింగ్ చేసిన మిల్లులకు పంపారు. మిల్లుల వద్దకు చేరుకున్న లారీలను సంబంధిత మిల్లుల యజమానులు ధాన్యంలో తాలు ఉందని కొర్రీలు పెట్టి దిగుమతి చేసుకోలేదు. దీంతో లారీలు రెండు రోజులుగా మిల్లుల వద్ద నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు జరిగిన తొలిరోజే కొర్రీలు మొదలయ్యాయంటే తర్వాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంటోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
వేడుక ఏదైనా.. బౌన్సర్ పక్కా!
మధుమేహం ప్రతి ఇంటి సమస్య మధుమేహం ప్రతి ఇంట్లో సమస్యగా మారిందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. - 8లోబౌన్సర్లు.. సినీ తారలు, బడా పారిశ్రామిక వేత్తల పక్కన మాత్రమే కనిపించేవారు. నగరాల్లో పబ్బులు, క్లబ్బుల్లోనే వీరి హడావుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైన సెలబ్రిటీ బయట అడుగు పెట్టినా, వేడుకై నా, ప్రారంభోత్సమైనా వీరిని నియమించుకోవడం సర్వసాధారణమైంది. అయితే, నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ కల్చర్ కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకూ విస్తరించింది. – నల్లగొండ టూటౌన్ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా బంధుమిత్రుల ముందు తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి కొందరు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంటున్నారు. వేడుకలో కొత్తదనం చూపించేలా, తోపులాట జరిగినా అదుపు చేసేలా పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. ఏ వేడుకలో చూసినా నల్లకోటు, దృఢమైన శరీరంతో కనిపించే బౌన్సర్లు సందడి చేస్తున్నారు. సంపన్న కుటుంబాల వారి వేడుకల్లో ఫంక్షన్ హాల్ గేటు నుంచి వేదిక వరకు వీరి హడావుడి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల బందోబస్తుతో పాటు బౌన్సర్ల సేవలను వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకూ బౌన్సర్లను వినియోగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభలకు సైతం బౌన్సర్లను వినియోగించారు. వివిధ పట్టణాల్లో షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ప్రారంభించేందుకు సినీనటులు, మంత్రులు వచ్చే సందర్భంలోనూ బౌన్సర్లను పెడుతున్నారు. బౌన్సర్ల వినియోగం పెరగడంతో సంబంధిత ఏజెన్సీలకు మంచి ఆదరణ లభిస్తోంది. యువతకు కూడా ఇదొక ఉపాధిగా మారింది. పదవ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు. బౌన్సర్లు ప్రతిరోజూ జిమ్లలో వ్యాయామాలు చేస్తూ, డైట్ పాటిస్తూ తమ శరీర ఆకృతిని కాపాడుకుంటున్నారు. ఫంక్షన్ల నిర్వాహకులు ఒక్కో బౌన్సర్కు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అందులో కొంత సెక్యూరిటీ సంస్థ కమీషన్గా తీసుకుంటుంది. అయితే నల్లగొండ జిల్లాలో పురుషులు మాత్రమే బౌన్సర్లుగా సేవలందిస్తున్నారు. మహిళా బౌన్సర్లు లేరు. ఏదైనా వేడుకకు మహిళా బౌన్సర్లు కావాలని కోరితే హైదరాబాద్ నుంచి పిలిపిస్తామని సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. శుభకార్యాలు జరుపుకునేవారు బౌన్సర్ల కోసం మా సంస్థను ఆశ్రయిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవడానికి బౌన్సర్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద కూడా మా బౌన్సర్ల సేవలు అందిస్తున్నాం. రాజకీయ పార్టీల సభలకు కూడా పంపిస్తున్నాం. దీంతో బౌన్సర్లకు డిమాండ్ పెరిగింది. – జానీపాషా, సురక్ష సెక్యూరిటీ అండ్ బౌన్సర్ సర్వీసెస్, నల్లగొండ కేవలం ఆడంబరమే కాకుండా, అవసరం కోసం వీరిని నియమించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వేడుకల్లో స్టేజీ మీదకు వెళ్లే సమయంలో తోపులాట జరగకుండా, అతిథులు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు బౌన్స ర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకుల సొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ శుభకార్యం చేసుకునేవారు సొంతంగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఫంక్షన్లు, షాపుల ఓపెనింగ్లలో రద్దీ నియంత్రణకు బౌన్సర్ల సేవలు సెలబ్రెటీలు వచ్చినప్పుడు సెక్యురిటీగానూ.. రాజకీయ సభలకు కూడా బౌన్సర్లు చిన్న పట్టణాలకూ విస్తరించిన ట్రెండ్ -
కుడికాల్వకు నీటి నిలిపివేత
ఫ మరో రెండు రోజుల్లో ఎడమకాల్వకు కూడా.. నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ కుడికాల్వకు శనివారం నీటిని నిలిపివేశారు. ఎడమ కాల్వకు మరో రెండు రోజుల్లో నీటిని నిలిపివేయనున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో కుడి కాల్వకు సుమారు 190టీఎంసీల నీటిని విడుదల చేశారు. అలాగే ఎడమ కాల్వకు 150 టీఎంసీల నీటిని వదిలారు. గత ఏడాది వానాకాలం సీజన్ పూర్తయ్యే వరకు వరదలు కొనసాగాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కాల్వలద్వారా పొలాలకు తరలించడంతో పాటు చెరువులు నింపారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 528.40 అడుగులుండగా 165.0408టీఎంసీల నిల్వలున్నాయి. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీనల్లగొండ : మహిళా శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. జిల్లాలో దివ్యాంగులకు 112 రెట్రో ఫిట్టర్ మోటర్ వెహికల్స్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, వార్డెన్ వెంకటరెడ్డి, బాలయ్య, నవీన్, సునీల్, కొత్త వెంకన్న పాల్గొన్నారు. రైస్ మిల్లుల్లో తనిఖీలుచండూరు : రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారంతో రైస్మిల్లులు, అనుమానిత ప్రదేశాల్లో శనివారం పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఒకవేళ ఈ దందాలో రేషన్ డీలర్ల పాత్ర ఉంటే వారి డీలర్షిప్ రద్దు చేసేందుకు సిఫారసు చేస్తామని తెలిపారు. తరుచూ ఈ దందాలో పట్టుపడేవారిపై పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతామన్నారు. -
రోగులకు మెరుగైన చికిత్స అందించాలి
నల్లగొండ : మత్తు పదార్థాల బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మత్తు విముక్తి విభాగాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రోగులకు సూచించారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, కౌన్సెలింగ్తో పాటు, చికిత్స అందిస్తూ శ్రద్ధగా చూసుకుంటున్నామని ఇన్చార్జి వైద్యుడు అనిల్ తెలిపారు. త్వరలోనే ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, డీఎస్పీ శివరాంరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు, ఇన్చార్జి డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలి
చిట్యాల : రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు ఆడిట్ నిర్వహించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. చిట్యాల మండలం బొంగొనిచెర్వు పరిధిలోని పేలుడు జరిగిన నోష్ ల్యాబ్స్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పేలుడు జరిగిన తీరును ఆ పరిశ్రమ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల పాటించకపోవటంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్మికులపై పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ మెరుగైన వైద్య సహాయంతో పాటు, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నోష్ ల్యాబ్స్లో గాయపడి చికిత్స పొందుతున్న లక్ష్మణ్కుమార్, వెంకటేశ్వర్లుకు మెరుగైన వైద్యం అందించాలని పరిశ్రమ నిర్వాహకులను కోరారు. ఆయన వెంట లొడంగి శ్రవణ్కుమార్, బొడిగె సైదులుగౌడ్, ఎండీ.అక్బర్, జిల్లా సత్యం, జిల్లా లక్ష్మయ్య, బొబ్బలి శంకర్రెడ్డి, సీమ అంజయ్య, దేవేందర్, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫూలే ఆశయాలను భావితరాలకు అందించాలి
నల్లగొండ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను భావితరాలకు తీసుకెళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం జ్యోతిరావుఫూలే ‘ద్వి శతాబ్ది’ ఉత్సవాల సందర్భంగా ఫూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం కృషి చేసిన వ్యక్తి ఫూలే అని కొనియాడారు. నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావుఫూలే సంఘసంస్కర్త మాత్రమే కాదని, మహిళా చదువు కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవ, తహసీల్దార్ పరశురాం, చోల్లేటి ప్రభాకర్, పున్న కై లాష్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మరగోని నవీన్గౌడ్, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, కొండూరు సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ, వెంకన్నగౌడ్, చొల్లేటి రమేష్, మిర్యాల యాదగిరి, పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన కూడలి.. నిలువ నీడ లేదు
పెద్దవూర : నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారితో పాటు జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారికి సైతం మండల కేంద్రం ప్రధాన కూడలిగా ఉంది. అనుముల మండలం ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలన్నా పెద్దవూరకు వచ్చి వెళ్తుంటారు. ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి బస్సులు పెద్దవూర మీదుగా వెళ్తుంటాయి. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా పెద్దవూరకు రావాల్సి ఉంటుంది. ఇరవై సంవత్సరాల క్రితం పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద బస్షెల్టర్ ఉండేది. రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని అధికారులు తొలగించారు. అప్పటినుంచి ప్రయాణికుల కష్టాలు మొదలయ్యాయి. బస్షెల్టర్ నిర్మించకపోవడంతో ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ ప్రజలు రోడ్ల వెంట నిరీక్షిస్తుంటారు. బస్సులు రోడ్డు పక్కనే ఆపుతుండటంతో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి బస్టాండ్ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
పలువురు జడ్జిల బదిలీ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వసంత్ రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు వికారాబాద్ కోర్టుకు బదిలీ కాగా.. ఆయన స్థానంలో కొత్తగూడెం నుంచి పి.వసంత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. నల్లగొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.సంపూర్ణ ఆనంద్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. నల్లగొండ కోర్టు నాలుగవ అదనపు జడ్జి కె.కవిత ఇదే కోర్టులో మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎం.కిరణ్మయి నల్లగొండ నాలుగవ అదనపు కోర్టు జడ్జిగా వచ్చారు. ఆదిలాబాద్ నుంచి జడ్జి పి.శివరామ్ప్రసాద్ సూర్యాపేట మొదటి అదనపు జడ్జిగా వచ్చారు. 19న ‘మోడల్’ ప్రవేశపరీక్షనల్లగొండ : జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో, 7 నుంచి 10వ తరగతులకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్టికెట్లను ఈ నెల 10 నుంచి www.tgms.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 6వ తరగతికి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులకు ప్రవేశపరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13 నుంచి ‘అరైవ్ అలైవ్’నల్లగొండ : ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత ప్రత్యేక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆయన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించమే లక్ష్యంగా పని చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై ప్రచారం చేయాలన్నారు. డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాల తనిఖీలు చేయాలని సూచించారు. -
సాగర్లో డయాబెటీస్ సదస్సు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ విజయవిహార్లో జాతీయస్థాయి డయాబెటీస్ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రీసెర్చ్ సొసైటీ ఫర్ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా(ఆర్ఎస్ఎస్డీఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక డయాబెటీస్ సదస్సు (టీజీఆర్ఎస్ఎస్డీఐ–2026) సాగర్లోని టీఎస్టీడీసీ రిసార్ట్స్ విజయవిహార్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఏప్రిల్ 12వరకు కొనసాగుతుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వైద్యుల శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ సదస్సు ప్రదాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా వైద్యులు, నిపుణులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొనున్నారని పేర్కొన్నారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి హాజరుకానున్నారు. -
బస్షెల్టర్ ముందే చిరు వ్యాపారం
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో బస్షెల్టర్ లేక ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, నల్లగొండ వెళ్లే ప్రయాణికుల కోసం పాత ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ముందు చిన్న బస్షెల్టర్ ఉన్నా.. దాని చుట్టూ చిరు వ్యాపారుల బండ్లు పెట్టడంతో ఉపగయోగం లేకుండా పోయింది. పట్టణంలో ఈ కూడలికి బస్టాండ్ కిలోమిటర్ దూరంలో ఉన్నా.. ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం ఇక్కడే నిరీక్షిస్తున్నారు. ఇక్కడ నీడ లేదు, కూర్చోవడానికి వసతులు లేవు. బస్సులు వచ్చేంత వరకు నిలబడాల్సిందే. ఈ సెంటర్లో బస్ షెల్టర్లు నిర్మిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పట్టణవాసులు అంటున్నారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
నల్లగొండ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరి గోడలు, ఫుడ్ స్టోరేజ్ గోడౌన్లు, అమ్మ ఆదర్శ పాఠశాల భవనాలు, తదితర నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని భవనాల్లో తాగునీటి సౌకర్యం, హాస్టళ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, కిచెన్లు, తాగునీటి సదుపాయాలు, ఆర్ఓ ప్లాంట్లు సమర్థంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీరు ఇబ్బంది లేకుండా బోర్లకు ఏమైనా మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదంపై అవగాహన కల్పించాలినల్లగొండ టౌన్ : ప్రజలు సహజ వైద్య విధానాల వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను సూచించారు. శ్రీప్రజా పాలన– ప్రగతి ప్రణాళికశ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన హోమియోపతి డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద, యునాని, హోమియోపతి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానీమన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హోమియోపతి నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పోషకాహారం, తాజా పండ్లు తీసుకోవాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఇతరులకు సేవ చేయగలుగుతారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ సుహాసిని, డాక్టర్ ముబీన్ పర్వీన్, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆయుష్ డిపార్ట్మెంట్ డీపీఎం కళ్యాణ్, డాక్టర్లు, ఫార్మసిస్టులు, యోగా సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
ధాన్యం కల్లంలా.. సర్వీస్ రోడ్డు
కేతేపల్లి : కేతేపల్లి మండలంలో కేతేపల్లి, కొర్లపహాడ్, చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో సర్వీసు రోడ్ల వెంట బస్షెల్టర్లు నిర్మించారు. హైవే వెళ్లే ఇతర వాహనాలకు ఆటంకం కలుగకుండా బస్షెల్టర్ల ముందు బస్బేలు సైతం ఏర్పాటు చేశారు. కానీ, డ్రైవర్లు హైవేపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో బస్సుల కోసం జనం రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ నిలబడుతున్నారు. ఇక పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు గంటల తరబడి ఎండలో ఎండుతూ, వర్షానికి తడుస్తూ రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బస్షెల్టర్లు నిరుపయోగంగా ఉండటంతో రైతులు ధాన్యం ఆరబోసేందుకు కల్లాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల మాసం విక్రయదారులు, యాచకులకు అడ్డాగా మారాయి. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
మిర్యాలగూడ అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దుతు తెలిపి మాట్లాడారు. కార్మికులందరికీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్ని అర్హతలు కలిగి ఉండి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న వారిని ఆర్టిజన్లు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, మంగారెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
రైలు కూత!
అన్ని జిల్లా కేంద్రాలకు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మూడు జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ ఉండగా, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూడా రైల్వే కల నెరవేరబోతోంది. అందుకు అవసరమైన పనులకు 2026–27 రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్కు సంబంధించిన సమగ్ర కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను ఇటీవల కేంద్రం దక్షిణ మధ్య రైల్వేకు అందించింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా చేపట్టే రైల్వే లైన్ల సర్వేలు, కొత్త లైన్లకు సంబంధించిన అంశాలను పేర్కొంది. వాటికి కొంత మేర నిధులు కేటాయించింది. ఆ ప్రాజెక్టులు ఆచరణ రూపం దాల్చితే సూర్యాపేటతో పాటు దేవరకొండ వంటి ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ లభించనుంది. కీలక ప్రాజెక్టులకు నిధులు సూర్యాపేటను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – శంషాబాద్ లైన్తో పాటు నల్లగొండ, దేవరకొండను కలుపుతూ చేపట్టే విశాఖపట్టణం – విజయవాడ – కర్నూల్కు సెమీహైస్పీడ్/హైస్పీడ్ రైల్వే కారిడార్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ఈసారి బడ్జెట్లో రూ.4.71 కోట్లు కేటాయించింది. ఇది పూర్తయ్యాక డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించనుంది. శంషాబాద్ – విశాఖపట్టణం లైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్ మీదుగా చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట మీదుగా జగ్గయ్యపేట, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని నుంచి విశాఖపట్టణం చేరనుంది. ఇక మరోలైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట మీదుగా సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్కు ఏర్పాటు చేయనున్నారు. 942 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రూట్లో సెమీ హైస్పీడ్ / హైస్పీడ్ రైల్ గంటకు 220 కిలోమీటర్ల వేగంగంతో ప్రయాణించనుంది. అంటే నాలుగు గంటల్లో శంషాబాద్ నుంచి విశాఖపట్టణం చేరనుంది. దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల పొడవునా కొత్త రైల్వే లైన్ వేసేందుకు రూ.458.46 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 133 కిలోమీటర్లు ఉన్న డోర్నకల్ –మిర్యాలగూడ లైన్ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించింది. ఈ లైన్ నిఘా, ట్రాఫిక్ సర్వే కోసం బడ్జెట్లో రూ.37 లక్షలు కేటాయించింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో అదనపు బాక్స్ బ్రిడ్జీలు, నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో వికలాంగుల కోసం సదుపాయాల కల్పన, ప్లాట్ఫామ్ల విస్తరణ, ఎస్కలేటర్లకు నిధులను కేటాయించింది. ఎఫ్ఎల్ఎస్ పూర్తయిన డోర్నకల్ – గద్వాల లైన్డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 చేపట్టిన ఎఫ్ఎల్ఎస్ మార్చి నెలలో పూర్తయిందని, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 296 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్కు సంబంధించిన డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా చివరి దశకు చేరుకుంది. ఒకటీ రెండు నెలల్లో ఆ నివేదిక రైల్వే బోర్డుకు చేరనుంది. రూ.5,330 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ లైన్ నిర్మాణం ఆచరణలోకి వస్తే డోర్నకల్ నుంచి కూసుమంచి మీదుగా పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, దేవరకొండ లేదా నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాలకు చేరనుంది. వీటిల్లో ఈ రైల్వే లైన్ ఆచరణ రూపం దాల్చినా జిల్లాలో ఇంతవరకు రైల్వే కనెకట్టివిటీ లేని ప్రాంతాలకు రైల్వే సదుపాయం లభించనుంది.ఫ ఇప్పటికే నల్లగొండ, భువనగిరికి రైల్వే కనెక్టివిటీ ఫ ఇక సూర్యాపేటకూ రైలు సౌకర్యం ఫ కొత్త రూట్లలోనూ రైల్వే లైన్లు ఫ డోర్నకల్ – గద్వాల ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి ఫ మాచర్ల – నల్లగొండ లైన్కు రూ.458.46 కోట్లు కేటాయింపు ఫ డోర్నకల్–మిర్యాలగూడ అంశాన్ని పేర్కొన్న రైల్వే శాఖ ఫ 2026–27 బడ్జెట్ వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే -
‘మహిళా శక్తి’కి ఇంధనం
నల్లగొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోనూ సత్తాచాటేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి పథకం కింద జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు పెట్రోల్ బంకులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బంకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. ఎస్ఎల్బీసీలో రూ.3.50 కోట్లతో తొలి బంకు నల్లగొండ నియోజకవర్గానికి మంజూరైన పెట్రోల్ బంకును జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద మెడికల్ కాలేజీని ఆనుకుని 1.20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.3.50 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను తీసుకునేందుకు నీలగిరి మహిళా జిల్లా సమైక్య ముందుకు రావడంతో ప్రభుత్వం వారికి భూమిని కేటాయించింది. గతేడాది అక్టోబర్ 13న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధానమైన ఇంధన ట్యాంకర్లను తీసుకొచ్చి భూమిలో అమర్చారు. అయితే ఈ బంకులో కేవలం పెట్రోలు, డీజిల్ అమ్మకాలకే పరిమితం కాకుండా ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) చార్జింగ్ స్టేషన్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. అంతేకాకుండా, స్థానిక మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయాల కోసం, ఇతర వ్యాపారాల కోసం ఇక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. మిగతా ఐదు చోట్లా సర్వం సిద్ధం మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో బంకుల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేసి, డీఆర్డీఓకు నివేదికలు అందజేశారు. ఈ ఐదు బంకుల ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కంపెనీ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు సేకరించిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ఐదు బంకుల పనులు కూడా ప్రారంభం కానున్నాయి.మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు ఫ నల్లగొండ జిల్లాకు ఆరు బంకులు మంజూరు ఫ ఎస్ఎల్బీసీ వద్ద ముమ్మరంగా బంకు నిర్మాణ పనులు ఫ మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో పూర్తయిన భూసేకరణమిగతా బంకులు ఏర్పాటయ్యే ప్రాంతాలు ఇవే.. నియోజకవర్గం గ్రామం మిర్యాలగూడ తడకమళ్ల నాగార్జునసాగర్ కొత్తపల్లి (అనుముల) దేవరకొండ దేవరకొండ పట్టణం నకిరేకల్ కట్టంగూర్ మునుగోడు ఉడతలపల్లి (చండూరు) -
‘పీఎన్జీ’ పనులు వేగవంతం చేయాలి
నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న పైపులైన్ సహజ వాయువు (పీఎన్జీ) విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండలోని తన చాంబర్లో పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ సంక్షోభం కారణంగా వాణిజ్య విభాగంలో ఎల్పీజీ లభ్యతపై ప్రభావం పడుతున్నందున, పీఎన్జీ సరఫరాను విస్తరించడం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్వర్క్లను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పీఎన్జీ నెట్వర్క్ విస్తరణ పనుల కొనసాగింపునకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా మాదిరిగానే ఇంటింటికీ గ్యాస్ పైప్ లైన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మెగా సిటీ గ్యాస్ ప్రాజెక్టు వలిగొండ నుంచి నార్కట్పల్లి వరకు విస్తరించిందన్నారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ట్యాంక్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నార్కట్పల్లి నుంచి నల్లగొండ వరకు పైప్లైన్ ద్వారా 5 గ్రామాలను కలుపుతూ టాప్ ఆప్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, పౌరసరపాల శాఖ అధికారి వెంకటేష్, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారి శేఖర్రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
11న జ్యోతిరావు ఫూలే జయంతి
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నల్లగొండలోని క్లాక్ టవర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నేతలు, అధికారులు హాజరు కావాలని కోరారు. నిస్వార్థ సేవకుడు.. నర్రా రాఘవరెడ్డిఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చిట్యాల : పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నిస్వార్థ సేవకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్స్టేజీ వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో పాలకులకు తన వాణి వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు నేడు కరువయ్యారన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాఘవరెడ్డి చేసిన ప్రజాసేవ మరువలేనిదన్నారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, మల్లు లక్ష్మి, నారి ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, చింతపల్లి భయ్యన్న, మండల నాయకులు రాచమడ్ల శ్యాంసుందర్, శీలా రాజయ్య, అర్రూరీ శ్రీను, ఐతరాజు నర్సింహ, కల్లూరి కుమారస్వామి, మెట్టు నర్సింహామ, నరేష్ పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిమాడుగులపల్లి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం మాడుగులపల్లి మండలం పాములపాడు పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, ల్యాబ్ను పరిశీలించి మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు జరిగేలా చూడాలన్నారు. లెప్రసీ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ జబ్బు ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు, ఉపాధిహామీ పనుల వద్దకు వెళ్లి రైతులకు, కూలీలకు వడదెబ్బ పట్ల అవగాహన కల్పిచి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దీప, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వేణుగోపాల్రెడ్డి, డీటీసీఓ కల్యాణ్ చక్రవర్తి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఎ.సత్యనారాయణ, డాక్టర్ పి.ప్రశాంత్బాబు ఉన్నారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలినల్లగొండ టౌన్ : విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండలో గురువారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టన ధర్నా వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మెను నిలిపివేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, శ్రవణ్ కుమార్, పబ్బు వీరస్వామి, జిట్టబోయిన లింగస్వామి, గుండ లింగారెడ్డి, పెరిక శేఖర్, వేణుగోపాల్రెడ్డి, పెరమాళ్ల మురళి, అద్దంకి వెంకన్న, లతీఫ్, విజయ్, ఉమాదేవి, నాగమణి, రమ్య పాల్గొన్నారు. -
శాలిగౌరారం పీహెచ్సీపై కలెక్టర్కు నివేదిక
శాలిగౌరారం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో చెత్తకుప్పను తలపించేలా ఉన్న మెడికల్ స్టోర్ రూమ్ను సిబ్బంది గురువారం శుభ్రపరిచారు. ఆరుబయట ఉన్న లక్షల రూపాయల విలువ కలిగిన సూదిమందుల స్టాక్ను స్టోర్రూమ్లో భద్రపరిచారు. సాక్షి దినపత్రికలో గురువారం ‘శాలిగౌరారం పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి సంబంధిత జిల్లా ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని మండల వైద్యాధికారిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో మండల వైద్యాధికారి పీహెచ్సీకి వచ్చి కిందిస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టోర్రూమ్ను శుభ్రం చేయించారు. గడువుదాటిన సూదిమందులు, నిరుపయోగ వస్తువులను బయటపడేశారు. పీహెచ్సీ వరండాలో ఉన్న రూ.లక్షల విలువైన సూది మందులను మెడికల్ స్టోర్రూమ్లో భద్రపరిచారు. అనంతరం ఘటనకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్తోపాటు సంబంధిత ఉన్నతాధికారులకు అందజేశారు. -
ఇంప్లాంట్స్లో గోల్మాల్!
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల కోసం అవసరమైన వివిధ రకాల ఇంప్లాంట్స్ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి ఇంప్లాంట్స్ సరఫరా కోసం అర్హులైన కాంట్రాక్టర్ల నుంచి జిల్లా పర్చేజింగ్ కమిటీ నెలరోజుల క్రితం టెండర్లు ఆహ్వానించింది. వాస్తవానికి ఆ టెండర్లను ఇ–ప్రొక్రూర్మెంట్ పద్ధతిని నిర్వహించాల్సి ఉండగా అధికారులు మాన్యువల్గా నిర్వహించారు. అయితే ఈ ప్రక్రియలో సుమారు నలుగురు ఽకాంట్రాక్టర్లు తమ టెండర్ ఫారాల్లో తమ ధరలు కోట్ చేసి సమర్పించారు. పది రోజుల క్రితం టెండర్లను తెరిచిన అధికారులు తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు ఇంప్లాంట్స్ సరఫరాకు ఆర్డర్స్ను అందించాల్సి ఉన్నా.. నేటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో టెండర్లలో ఏదో గోల్మాల్ జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగా ఆస్పత్రికి సకాలంలో ఇంప్లాంట్స్ సరఫరా లేకపోవడం వల్ల ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే జాప్యం ఇంప్లాంట్స్ సరఫరా కోసం పిలిచిన టెండర్లకు రాజకీయ రంగు పులుముకుంది. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. అన్ని అర్హతలు ఉన్నా కాంట్రాక్టర్లకు కాదని ఇప్పటి వరకు ఇంప్లాంట్స్ను సరఫరా చేసిన కాంట్రాక్టర్కే తిరిగి అప్పగించాలని అధికార పార్టీ నేతలు..అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి అర్హులైన కాంట్రాక్టర్కు ఇంప్లాంట్స్ సరఫరాకు ఆర్డర్స్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఫ టెండర్లు పూర్తయి నెల రోజులు ఫ నేటికీ కాంట్రాక్టర్ను ఎంపిక చేయని జిల్లా పర్చేజింగ్ కమిటీ ఫ పాత కాంట్రాక్టర్కే ఇవ్వాలని అధికార పార్టీ నేతల ఒత్తిడి ఫ నల్లగొండ జీజీహెచ్కి నిలిచిన ఇంప్లాంట్స్ సరఫరా ఫ ఇబ్బందుల్లో ఆర్థోపెడిక్ రోగులు ఇంప్లాంట్స్ సరఫరాకు కాంట్రాక్టర్ ఎంపిక విషయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా పర్చేజింగ్ కమిటీదే తుది నిర్ణయం. ఎంపికలో మా ప్రమేయం ఏమి ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కమిటీ ఎంపిక చేస్తుంది. – డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
విద్యార్థుల సంఖ్య పెంచేలా..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వచ్చే విద్యాసంవత్సరంలో అధిక సంఖ్యలో అడ్మిషన్లు పెంచేందుకుగాను ముందస్తుగా గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టాం. మండల వ్యాప్తంగా ఇప్పటికే 20 అడ్మిషన్లు అయ్యాయి. ఉదయం పాఠశాల పూర్తికాగానే ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాం. – తరి రాములు, ఎంఈఓ, పెద్దవూర పెద్దవూర : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో విద్యా శాఖ ముందస్తుగా బడిబాట కార్యక్రమం చేపట్టింది. రానున్న 2026–27 విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని మందస్తుగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సర్కారు బడుల్లోకి పంపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. పాఠశాలల్లో చేర్పించేందుకు బడిఈడు పిల్లలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా బడి బయట ఉన్న డ్రాపౌట్ పిల్లలను తిరిగి బడిబాట పట్టించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి ఐదేళ్లు నిండిన చిన్నారులను నేరుగా మొదటి తరగతిలో చేర్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వలస కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలో మొత్తం సుమారు 1,424 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ప్రాథమిక స్థాయిలోనే ఎక్కువ నమోదు జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలకు పోటీగా రూపుదిద్దుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రచారం ఇలా.. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించడంతో పాటు, ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమ బోధన అందుబాటులోకి వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పోషకాహారంతో కూడిన మధ్యహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తున్నామని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో మండలస్థాయి అధికారులు ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తున్నారు. జూన్12న పాఠశాలల పున:ప్రారంభమయ్యే నాటికి కనీసం 10–15శాతం అదనపు అడ్మిషన్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు గ్రామాల్లో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సర్కారు బడుల వైపు తల్లిదండ్రులను మళ్లిస్తున్నారు. విద్యా శాఖ ముందస్తు ‘బడిబాట’ ఫ సర్కారు బడులను బలోపేతం చేయడమే లక్ష్యం ఫ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్న టీచర్లు ఫ జిల్లాలో మొత్తం 1,424 పాఠశాలలు పాఠశాలల వివరాలు ప్రాథమిక 980ప్రాథమికోన్నత 185ఉన్నత 259విద్యార్థులు 1.38 లక్షలు -
విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం
మునుగోడు : రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎనలేని కృషిచేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలం పులిపలుపుల ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.25వేల నుంచి రూ. 15వేల నగదు ప్రోత్సాహకాలు అందిస్తానన్నారు. మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డిపై కొట్లాడి బి.వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు తెచ్చి పూర్తిచేసి ఇటీవలే సీఎం రేవంత్రెడ్డితో నీటిని నింపితే ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. త్వరలో మునుగోడు మండలంలోని కాల్వలు తవ్వించి సాగు నీరు పారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్రెడ్డి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, పాఠశాల హెచ్ఎం కళావతి, సర్పంచ్లు కమ్మంపాటి జ్యోతి వెంకటేష్, దాసరి గోవర్ధన్, ఉపాధ్యాయులు యూసుఫ్పాషా, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
రైతులకు సంఘం అవసరం
బత్తాయి రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఓ సంఘం అవసరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026- 8లోసాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : వేసవిలో ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 5.96 మీటర్ల పైన ఉండగా.. మార్చి నెలాఖరులో 6.69 మీటర్ల లోతుకు పోయాయి. అంటే 0.73 మీటర్లకు భూగర్భ జలాలు తగ్గాయి. 8 మండలాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ, గతేడాది మార్చి నెలాఖరుతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భూగర్భ జలాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. గతేడాది కంటే ఇప్పుడు 1.44 మీటర్లు పైకే.. గత సంవత్సరం మార్చిలో జిల్లాలో సగటున 8.13 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు ఉండగా.. ఈ ఏడాది మార్చిలో 6.69 మీటర్లపైనే ఉన్నాయి. అంటే 1.44 మీటర్ల పైకే భూగర్భ జలం ఉంది. జిల్లాలో ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. సగటును మించి వర్షాలు కురిశాయి. గత సంవత్సరం మే నెలలోనే వర్షాలు ప్రారంభమై 2025 డిసెంబర్ వరకు కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటల్లో నీరు చేరింది. దానికి తోడు ఎగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం, సాగర్ కూడా నిండటంతో కృష్ణా జలాలతో చెరువులు నింపారు. దీంతో భూగర్భ జలాలు గతేడాది కంటే ఎక్కువగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఐదు మండలాల్లో తగ్గుదల ● అడవిదేవులపల్లి మండలంలో గతేడాది మార్చిలో 3.40 మీటర్లపైన ఉన్న భూగర్భ జలాలు ఈ మార్చి నెలాఖరుకు 4.84 మీటర్లకు పడిపోయాయి. ● కొండమల్లేపల్లిలో గతేడాది 5.06 మీటర్ల వద్ద భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 7.75 మీటర్ల లోతుకు పడిపోయాయి. ● మిర్యాలగూడ మండలంలో గతేడాది 0.47 మీటర్లపైన భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం అవి 3.22 మీటర్ల లోతులో ఉన్నాయి. ● నకిరేకల్లో గత సంవత్సరం 7.0 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఇప్పుడది 8.05 మీటర్లకు పడిపోయింది. ● వేములపల్లి మండలంలో గత సంవత్సరం 3.86 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు, ఇప్పుడు 4.44 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. జిల్లాలో మొత్తం 1,417 చెరువులు ఉన్నాయి. ఇందులో 821 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 290 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నిల్వ ఉంది. 271 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మరో 35 చెరువుల్లో ఇంకా 75 నుంచి 100 శాతం నీటితో నిండుకుండలా ఉన్నాయి. దీనివల్ల ఈసారి మార్చి నెలాఖరు నాటికి భూగర్భ జలాలు పెద్దగా తగ్గలేదు.ఫ ఫిబ్రవరి పోల్చితే.. మార్చి నెలాఖరుకు పడిపోయిన జలాలు ఫ ఎనిమిది మండలాల్లో ప్రమాద ఘంటికలు ఫ వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా తగ్గే అవకాశం ఫ గతేడాది మార్చితో పోల్చితే మాత్రం కాస్త మెరుగే.. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ, కనగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన కనగల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. జి.ఎడవల్లి, కురంపల్లి, నల్లగొండ మండలంలోని జీకెఅన్నారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా చోట్ల మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని క్షేత్రస్థాయిలో కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ రెవెన్యూ అధికారులందరూ ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్, హమాలీ, ఇతర సౌకర్యాల సమస్య లేకుండా చూస్తామన్నారు. ఎండాకాలం కావడంతో నిర్ధేశిత ధాన్యం తేమ శాతం వస్తుందని.. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో లైట్లు ఏర్పాటు చేసి కాంటాలు వేయాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మిస్తామన్నారు. రూ.450 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్లు మురళీధర్గౌడ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండ, కనగల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం -
ఎంజీయూలో జీఎస్టీ అధికారుల తనిఖీ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ప్రభుత్వానికి రూ.99 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టిన వ్యవహారంలో బుధవారం స్టేట్ జీఎస్టీ అధికారులు యూనివర్సిటీలో తనిఖీలు చేశారు. ఈనెల 7వ తేదీన ‘సాక్షి’లో ‘రూ. 99 లక్షల జీఎస్టీ ఎగనామం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర జీఎస్టీ అధికారులు స్పందించారు. బుధవారం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వినయ్కుమార్ బృందం యూనివర్సిటీకి వచ్చి 113 మంది ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, 18 జీఎస్టీ చెల్లింపులు, యూనివర్సిటీ చెల్లించిన 2 శాతం జీఎస్టీ చెల్లింపుల పత్రాలను పరిశీలించారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ చెల్లించాల్సిన 16 శాతం జీఎస్టీకి సంబధించిన రూ.99 లక్షల వివరాలను సంబంధిత యూనివర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జీఎస్టీ అధికారులు దీనిని సీరియస్గా తీసుకొని నోటీస్లు జారీ చేయడంతో సంబంధిత ఔట్సోర్సింగ్ ఏజెన్సీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలిసింది. దాంతోనే రాష్ట్ర జీఎస్టీ అధికారులు వచ్చి తెలుసుకున్న పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేధించనున్నట్లు తెలిసింది. వైజాగ్కాలనీలో ఎకో టూరిజం● ఎమ్మెల్యే బాలునాయక్ చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్కాలనీ సమీపంలో ఎకో టూరిజం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన టీఏసీ సమావేశంలో పాల్గొని పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించానని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలిపెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెద్దవూర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ఎస్టీ రెగ్యులర్ హాస్టల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికలను, పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి సమ్మెటీవ్ అసెస్మెంట్–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం డీటీడీఓ శ్రీనివాస్ను ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఏసీఎంఓ డివి.నాయక్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డి.బాలోజీ, హెచ్డబ్ల్యూఓ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు కూన్రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండీ.షబ్బీర్, శ్రీనునాయక్, సురేందర్, షాహీన్బేగం, జహేదాబేగం, సైదులు, శాంతి, రామయ్య, ఏఎన్ఎం జ్యోతి, సిబ్బంది కమలమ్మ, నాగేందర్, సాంభయ్య, రాములమ్మ తదితరులు ఉన్నారు. ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటి విడుదలపెద్దవూర: రైతుల అభ్యర్థన మేరకు ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–8, 9 కాలువకు యాసంగి సీజన్లో వారబంధీ గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ కాల్వ పరిధిలో పంటలు చేతికిరాకపోవడంతో రైతులంతా కాలువకు నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ఏఎమ్మార్పీ ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఏఎమ్మార్పీ ఏఈ జీవేష్ బుధవారం వరి చేలను ఏఈఓలతో కలిసి పరిశీలించి నీటి అవసరం ఉన్నదని నివేదించారు. దీంతో సాయంత్రం నుంచి ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించిన వారిలో రైతులు దాసరి శ్రీను, కొండల్, లక్ష్మారెడ్డి, అంజి, అంజిరెడ్డి, సూర్య తదితరులు ఉన్నారు. -
క్యాన్సర్ రహిత సమాజం దిశగా..
జిల్లాలోని కిషోర బాలికల తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచాం. – పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నల్లగొండ టౌన్ : మహిళలను పట్టి పీడిస్తున్న వివిధ రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ టీకాలు వేయడం ద్వారా మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార, ఇతర క్యాన్సర్లను అరికట్టవచ్చు. 14 నుంచి 15 ఏళ్ల వయసు గల కిషోర బాలికలకు ఈ టీకాలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో 20 వేల మంది 14–15 సంవత్సరాల కిషోర బాలికలు నమోదై ఉన్నారు. వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో టీకాలు జిల్లాకు ఇటీవల 3,600 హెచ్పీవీ వ్యాక్సిన్ యూనిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, మర్రిగూడ ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున టీకాలను వేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. పరీక్షలు ముగియగానే టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 429 మంది యుక్త వయసు కిషోర బాలికలకు టీకాలు వేశారు. మిగిలిన వారికి టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. మెడికల్ ఆఫీసర్లకు అవగాహన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, ఏజెంట్లకు హెచ్పీవీ టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కల్పించింది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే హెచ్పీవీ టీకాలను వేయాలని నిర్ణయించినప్పటికి కేంద్రం నుంచి టీకాలు సరఫరా కావడంతో జాప్యం జరిగింది. కేంద్రం పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయగానే కిషోర బాలికలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారు. ఫ కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఫ జిల్లాకు చేరిన 3,600 యూనిట్లు ఫ టెన్త్ పరీక్షలు ముగియగానే వ్యాక్సినేషన్ ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ -
సౌండ్ చేస్తే.. తుక్కు తుక్కే..!
● నల్లగొండలో అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు ధ్వంసంనల్లగొండ : ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా నల్లగొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు అమర్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు రాఘవరావు, మహాలక్ష్మయ్య, రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారికి కలెక్టర్ భరోసా
నల్లగొండ : కలెక్టర్ చంద్రశేఖర్ ఓ చిన్నారికి భరోసాగా నిలిచారు. కనగల్ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుమార్తె స్వాతిక (10) గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది. తన కుమార్తెకు కృత్రిమ కాలు అమర్చి, తాను ఉపాధి పొందేందుకు మూడు చక్రాల బండి అందించాలని తండ్రి చంద్రమౌళి బుధవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ చిన్నారి స్వాతికకు కృత్రిమ కాలు ఏర్పాటుకు సాయం చేసేందుకు అంగీకరించడంతో పాటు, చంద్రమౌళి జీవనోపాధి కోసం మూడు చక్రాల బండిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్వాతికకు అవసరమైన వైద్య సహాయం అందించి ఆమె సాధారణ జీవనాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలి పథకాల అమలులో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జనగణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియను తప్పులు లేకుండా చేయాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, వార్డుల వారీగా సెన్సస్ నిర్వహించాలని తెలిపారు. స్లమ్ ప్రాంతాలను వేరు చేసి మ్యాపింగ్ చేయాలని.. ఏవైనా సందేహాలు ఉంటే సీపీఓను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 166 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. మిగతా కేంద్రాలను కూడా వెంటనే తెరవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. సాదా బైనామా పై వచ్చిన దరఖాస్తులనువెంటనే పరిష్కరించాలన్నారు. సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, సీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని మండలాల్లో పొంచి ఉన్న ప్రమాదం
జిల్లా వ్యాప్తంగా చూస్తే ఫిబ్రవరి కంటే మార్చి నెలలో భూగర్భ జలాల తగ్గుదల స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ.. పలు మండలాల్లో మాత్రం ఈనెల, వచ్చే నెలలో భారీగా భూగర్భ జలాలు భారీగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. జిల్లాలో 33 మండలాల్లో ఫిబ్రవరి నెలతో పోల్చితే మార్చి నెలలో దాదాపు అంతటా భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక 8 మండలాల్లో మీటరు కంటే ఎక్కువగా లోతులోకి భూగర్భ జలాలు వెళ్లాయి. అందులో అత్యధికంగా కొండమల్లేపల్లిలో వేగంగా భూగర్భ జలాలు పడిపోయాయి. అక్కడ ఫిబ్రవరి నెలలో 3.28 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. మార్చి నెలలో 7.75 మీటర్లకు పడిపోయాయి. కొండమల్లేపల్లిమిర్యాలగూడవేములపల్లినార్కట్పల్లికట్టంగూరుగుడిపల్లిగుండ్లపల్లిచింతపల్లి0.551.361.42.835.873.283.224.447.877.757.919.437.007.1211.00ఈ సంవత్సరంలో పలు మండలాల్లో భూగర్భ జలాల తగ్గుదల ఇలా (మీటర్లలో..)7.99మార్చి -
మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం మాన్యంచెల్కలో రూ.కోటీ 91 లక్షల వ్యయంతో నిర్మించిన పట్టణ పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు అందించి మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. పట్టణంలో ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సంయుక్తంగా మూడెకరాల స్థలంలో కంటి ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాన్యంచెల్క జంక్షన్ను ఆధునీకరించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అమీర్అలీ, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ కుందూరు దీపిక ప్రవీణ్కుమార్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నర్సింహారావు నేత, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి
భూదాన్పోచంపల్లి : మూసీ పరీవాహక మండలాల రైతులకు గోదావరి జలాలను అందించి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సోమవారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జీబీఆర్ గార్డెన్స్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా 3వ మహాసభలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటిరోజు శ్రీమూసీ ప్రక్షాళన–గోదావరి జలాల సాధనశ్రీ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మూసీ చుట్టూ రసాయన వ్యర్థాలు వదులుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణపై ఉన్న శ్రద్ధ.. ప్రక్షాళనపై లేదని విమర్శించారు. బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరందించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల సాధన కొరకు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పోరాటాలకు సిద్ధ కావాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ జహాంగీర్ మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి షామీర్పేట, ఏదులాబాద్ మీదుగా చెరువులను నింపుతూ పిలాయిపల్లి కాలువలోకి గోదావరి జలాలను వదిలితే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని అన్నారు. గోదావరి జలాల సాధన కొరకు రాజకీయాలకతీతంగా రైతులను చైతన్యం చేస్తూ ఉద్యమకార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం మూసీ వేదిక గౌరవ అధ్యక్షుడు పిట్టల శ్రీశైలం మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మూసీ డంపింగ్యార్డుగా మారిందని విమర్శించారు. మూసీ విషపు జలాలతో ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని, ఇటు పంటలు, పాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వెంటనే మూసీ కాలువల కత్వల పైన ఈటీపీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం నాయకుడు గూడురు అంజిరెడ్డి, న్యాయవాది కొత్త బుచ్చిరెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, మంచాల మధు, పగిళ్ల లింగారెడ్డి, దుబ్బాక జగన్, అందెల జ్యోతి, నెల్లికంటి జంగయ్య, వడ్డేపల్లి యాదగిరి, సామ జంగారెడ్డి, పుష్పలత, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్, బుగ్గ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి -
బంగారం దుకాణంలో చోరీకి యత్నం
ఆలేరు : బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చి, బంగారం దుకాణం యజమానిని ఏమార్చి చోరీకి యత్నించాడు ఓ దొంగ. అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాప్ సమీపంలో సంపత్చౌదరి అనే వ్యక్తి భవానీ జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అబ్బాస్అలీ జ్యువెల్లరీ షాపు వద్దకు వచ్చాడు. తనకు బంగారు కావాలని యజమాని సంపత్చౌదరికి చెప్పాడు. దీంతో యజమాని వివిధ రకాల ఆభరణాలను టేబుల్ పైన పెట్టాడు. ఇంకా ఏమైనా ఆభరణాలు ఉంటే చూపెట్టమంటూ షాపు యజ మానిని మాటలతో ఏమార్చాడు. ఈ క్రమంలో సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసును జేబులో వేసుకొని షాపు నుంచి హడావిడిగా బయటకు వచ్చి పారిపోతుండగా.. యజమాని గమనించి కేకలు వేశాడు. స్థానికులు అప్రమత్తమై పారిపోతున్న అబ్బాస్ అలీని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. జ్యువెల్లరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు ఎస్ఐ వినయ్ తెలిపారు. దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత ఆలేరు పట్టణంలో ఘటన -
నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి
రామగిరి (నల్లగొండ), కనగల్ : రైతులు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి కోరారు. సోమవారం నల్లగొండ మండల పరిధిలోని తొరగల్, ఎం.దుప్పలపల్లి, కొత్తపల్లి, అప్పాజీపేట, నర్సింగ్భట్ల, కుదావన్పూర్, చిన్న సూరారంతోపాటు కనగల్ మండలం కనగల్, తేలకంటిగూడెం, పర్వతగిరి, చర్లగౌరారం, ఏమిరెడ్డిగూడెం, లింగాలగూడెం, దోరెపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ కల్పిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంటాలు వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, నల్లగొండ ఎంపీడీఓ యాకూబ్, ఏఓ శ్రీనివాస్, ఏపీఎం వినోద, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్రకట్టంగూర్ : ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలం పిట్టంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. బీజేపీ కూటమి ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తొలగించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ఇవ్వాలని షరతు పెట్టడంతో భవిష్యత్లో ఉపాధి హామీ పనులు కనుమరగయ్యే ప్రమాదం ఉందన్నారు. కూలీలకు ఉపాధి పనులను దూరం చేసి వారి పొట్టగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కారింగు రమణ, వంగా మహేశ్వరి, నవనీత, లక్ష్మి, తోటకూరి యాదమ్మ పాల్గొన్నారు. -
డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, యాదాద్రి : డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేయడంలో పోలీసులు మరింత అప్డేట్ కావాలని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో భరోసా కేంద్రం, జిల్లా పోలీస్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు అన్నివిభాగాల్లో 15 సంవత్సరాల ముందున్నారన్నారు. దానిని కొనసాగిస్తూ సాంకేతికంగా ఎదగాలన్నారు. అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మొక్కలు నాటారు. అంతకు ముందు భరోసా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం డీజీపీ స్వీకరించారు. భరోసా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డి, అదనపు డీజీపీ మహేష్ భగవత్లకు ఎస్పీ మెమొంటోలు అందజేశారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న డీజీపీ యాదాద్రి భువనగిరి జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్లో దొంగ రివాల్వర్ చోరి చేశాడని, యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయంలో దొంగతనం కేసులు తనకు ఎప్పుడు గుర్తుకు వస్తాయన్నారు. అప్పటి పోలీసులు కలిసికట్టుగా పనిచేసి దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు అన్నారు. అన్నిచోట్ల పనిచేయడం వేరు.. ఇక్కడ పనిచేయడం వేరన్నారు. ఎస్పీగా, రాచకొండ కమిషనర్గా జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పోలీస్ అధికారులతో పంచుకున్నారు. సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్సీలు రవీందర్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్నాయుడు, ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఫ డీజీపీ శివధర్రెడ్డి -
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధ్యయనం
భూదాన్పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో మానవ హక్కుల వేదిక, క్లైమెట్ ఫ్రంట్ సంస్థ, మూసీ పరిరక్షణ సమితి సంస్థకు చెందిన 14 మంది ప్రతినిధుల బృందం సోమవారం భూదాన్పోచంపల్లి పరిధిలో మూసీ పరీవాహక గ్రామాల్లోని కాలువలు, చెరువులు, పంట పొలాలను సందర్శించారు. జూలూరు గ్రామంలో రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల సమన్యయ కమిటీ సభ్యులు వసంతలక్ష్మి, జీవన్కుమార్ మాట్లాడుతూ.. మూసీ కాలువలు, చెరువుల్లోని నీరంతా పచ్చగా ఉండి దుర్వాసన వస్తోందన్నారు. మూసీ కాలుష్య నీటితో పండించే పంటలు, చేపలు తినడానికి పనికిరావని తెలిపారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణకు కేటాయించిన బడ్జెట్లో రూ.2వేల కోట్లు గ్రామ వ్యవస్థలకు కేటాయించాలన్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన కత్వలు, కాలువలను ఆధునీకరించాలని, కాలుష్యంతో కూడిన చెరువులను పూడికతీసి పరిశుభ్రపర్చాలని కోరారు. అలాగే గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నాన్నారు. మూసీ పునరుద్ధరణను గౌరెల్లి నుంచి సోలిపేట మూసీ సాగునీటి డ్యాం వరకు పొడిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్బాబు, నగర కమిటీ సభ్యులు రోహిత్, శ్రావ్య, ప్రొఫెసర్ శ్రీధర్, బాలయ్య, ఆకాశ్, రుచిత్, అభిషేక్, గ్రామస్తులు దిండు బాలరాజు, చిలువేరు అయిలయ్య, బస్వయ్య, అయిలయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కామినేని ఆస్పత్రికి వృద్ధురాలి మృతదేహం అప్పగింత
నకిరేకల్ : నకిరేకల్లోని పన్నాలగూడెంలో నివాసముంటున్న కనుకుంట్ల సుశీల(70) గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలు సేకరించారు. సోమవారం సుశీల మృతదేహాన్ని కూడా ఆమె భర్త శంకర్రెడ్డి, కుమారులు సుధీర్రెడ్డి, నవీన్రెడ్డి, విద్యాసాగర్రెడ్డి అంగీకారంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్, క్లబ్ ప్రతినిధులు రాంమోహన్నావు, ఎర్ర శంభులింగారెడ్డి, సూర్యచంద్రరావు, పైళ్ల శశిధర్రెడ్డి తదితరులు ఉన్నారు. సుశీల భౌతికకాయానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్, స్థానిక కౌన్సిలర్ కందాల భిక్షంరెడ్డి, సీపీఎం నేతలు వంటేపాక వెంకటేశ్వర్లు, బొజ్జ చిన వెంకులు, వంటేపాక కృష్ణ నివాళులర్పించారు. -
విద్యుదాఘాతానికి గురైన గర్భిణి
● 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్తండాకు చెందిన బి. నిఖిత ఐదు నెలల గర్భిణి. సోమవారం ఇంట్లో బోరు మోటారు స్విచ్ ఆన్ చేస్తుండగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను అంబులెన్స్లో ఎక్కించుకొని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిత పరిస్థితి నిలకడగా ఉందని 108 అంబులెన్స్ పైలెట్ పి. సైదులు, మెడికల్ టెక్నీషియన్ సీహెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి గడ్డి లోడు దగ్ధం● మంటలు ఆర్పివేసిన పోలీస్ కానిస్టేబుళ్లు మఠంపల్లి : మండలంలోని కాల్వపల్లితండాకు చెందిన రైతు బానోతు రూప్లానాయక్ సోమవారం తన వ్యవసాయ పొలం నుంచి వరి గడ్డిని ట్రాక్టర్లో లోడు చేసుకుని ఇంటికి తీసుకొస్తుండగా కరెంట్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. గడ్డి దగ్ధమవుతుండడంతో వెంటనే రైతు మఠంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసు కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సమీపంలోని వ్యవసాయ బోరుతో పాటు బావి నుంచి బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పివేశారు. ఫైరింజన్ కోసం వేచి చూడకుండా మంటలు ఆర్పివేసిన కానిస్టేబుళ్లను గ్రామస్తులు అభినందించారు. జూదరుల అరెస్ట్త్రిపురారం : మండలంలోని కామరెడ్డిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురు జూదరులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారయ్యారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామరెడ్డిగూడెం గ్రామ శివారులోని కుంట సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి కామెల్ల లక్ష్మణ్, గోగుల చందన్, పల్లపు శ్రీనును అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన దోరెపల్లి శేఖర్, రెమిడాల దుర్గయ్య, రెమిడాల మహేందర్, నర్సింగ్ విజయ్ పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.600 నగదు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
దాడి కేసులో నిందితుడి రిమాండ్
మేళ్లచెరువు : యువకుడిపై దాడి చేసి అతడి బైక్, సెల్ఫోన్ లాక్కోని పరారైన వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్ఐ పరమేష్ తెలిపారు. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన నవీన్ ఈ నెల 4వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని ఓ దాబాలో భోజనం చేసి వచ్చాడు. అదే సమయంలో చందమల్ల శ్రీకాంత్ అలియాస్ చిక్కుల శ్రీకాంత్ నవీన్ వద్దకు వచ్చి అకారణంగా అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో నవీన్పై కర్రలతో శ్రీకాంత్ దాడి చేసి బైక్, సెల్ఫోన్ లాక్కోని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటిరోజు ఉదయం నవీన్ కుటుంబ సభ్యులు అతడి ఒంటిపై గాయాలను గమనించి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ను అతడి ఇంట్లో సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై 7 కేసులు ఉన్నాయని, దీంతో అతడిపై రౌడీషీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు అడ్డగూడూరు : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వంట మాస్టర్ వేల్పుల నర్సయ్య, జెట్ట తండాకు చెందిన సరిత కలిసి మోత్కూరు మండలంలో ఓ ఫంక్షన్లో వంట చేసి బైక్పై తిరిగి తిరుమలగిరికి వెళ్తున్నారు. మార్గమధ్యలో అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులోని నూనె మిల్లు సమీపంలో రోడ్డు పక్కనే ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. విద్యార్థికి గాయం
మోత్కూరు : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాజిపురం ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ బునాది గుంతలు తవ్వి పనులను మధ్యలోనే వదిలేశాడు. కాగా సోమవారం విరామం సమయంలో 1వ తరగతి విద్యార్థి చింత రిత్విక్ ఆడుకుంటూ బునాది గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఉపాధ్యాయులు, స్థానికులు గమనించి విద్యార్థిని మోత్కూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎంఈఓ సత్యనారాయణను వివరణ కోరగా.. కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరితగతిన ప్రహరీ నిర్మాణం చేసేలా చూస్తానని తెలిపారు. -
‘బైపాస్’ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో బైపాస్ నిర్మాణంలో నాసిరకం మట్టిని ఉపయోగిస్తూ నిధుల దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మట్టి మాఫియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండకు కేంద్ర ప్రభుత్వం రూ.530 కోట్లతో బైపాస్ మంజూరు చేస్తే నిర్మాణ విషయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. నిబంధనలకు పాతర వేసిన కాంట్రాక్టర్కు మంత్రి, అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడ ఎర్రమట్టి ఉపయోగించడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, బుద్దారం, అనంతారం గ్రామాల్లోని చెరువుల నుంచి రూ.140 కోట్ల విలువైన నాసిరకం మట్టి తెచ్చి రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతెపాక సాంబయ్య, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, దాయం భూపాల్రెడ్డి, చింత ముత్యాల్రావు, పోతెపాక లింగస్వామి, గుర్రం వెంకట్రెడ్డి, రావెళ్ల కాశమ్మ, వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, పురుషోత్తం పాల్గొన్నారు. -
బీజేపీ నాయకులపై కేసు కొట్టివేత
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని పానగల్ సమీపంలో అద్దంకి–నార్కట్పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది బీజేపీ నాయకులపై నల్ల గొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేశారని టూటౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో 8 ఏళ్లుగా బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, మిర్యాల గిరి, జంజిరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్, చింత యాదగిరి తదితరులపై ఈ కేసు కొనసాగింది. సోమవారం వీరందరిపై కేసును కొట్టివేస్తూ జిల్లా కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య పెన్పహాడ్ : ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని చీదెళ్ల గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చీదెళ్ల గ్రామానికి చెందిన గొబ్బి కాంతయ్య(53) ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు. -
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించగా రెవెన్యూ శాఖకు 61, ఇతర శాఖలకు 52తో కలిపి మొత్తం 113 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన టీ–ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం పూర్తిచేయాలన్నారు. ఈనెల 14న నిర్వహించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించాలన్నారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఎఫ్ఓ రాజశేఖర్, దేవరకొండ, చండూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ప్రస్తుత యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభమైనందున కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9963407064కు రైతులు ఫోన్ చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రబీలో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 కనీసం మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. సన్నధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్లో 24 గంటల పాటు విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
‘కార్పొరేట్’కు కొమ్ముకాస్తున్న కేంద్రం
మర్రిగూడ : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, అప్పులు వంటి అంశాలతో దేశం తీవ్ర సంక్షోభంలో నెట్టబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, మండల కన్వీనర్ బుర్ర శేఖర్, నాయకులు కల్లెట్ల లింగయ్య, చలం పాండు, ఎరుకల నిరంజన్, జక్కల అంయ్య, మాద సత్యం, బొల్లం యాదయ్య, రామిడి భూపతిరెడ్డి, కొట్టం యాదయ్య, బాలకిషన్, అల్వాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పునరుత్థానం అద్భుత ఘట్టంరామగిరి (నల్లగొండ) : క్రీస్తు పునరుత్థానం అద్భుత ఘట్టమని నల్లగొండ బిషప్ ధమన్కుమార్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో సోమవారం ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తుకు పూజా బలిని సమర్పించి మాట్లాడారు. అనంతరం అనాథలకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో ఫాదర్ బాలరాజు, బాలశౌరి, రాయప్ప, సిస్టర్ రమ్య, గాబ్రియల్, జోసెఫ్ రోజీ, పసల శౌరయ్య, టీఎస్ క్రిష్టోఫర్, జేమ్స్ పాల్గొన్నారు. -
లక్షల
ఎంజీయూలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాకంనల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీ చెల్లించకుండా ఎగనామం పెట్టింది. యూనివర్సిటీకి ఈ ఏజెన్సీ సంస్థ జూనియర్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, డైనింగ్ హాల్స్ హెల్పర్లు, స్టోర్ కీపర్లు మొత్తంగా 113 మందిని కేటాయించగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సిబ్బందిని కేటాయించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ఈ ఏజెన్సీ సంస్థ రూ.99 లక్షలు జీస్టీ ఎగ్గొడుతున్నా యూనివర్సిటీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అన్నీ తెలిసిన సందరు అధికారులు జీఎస్టీకి చెల్లించాల్సిన రూ.99 లక్షల విషయాన్ని దాచి పెడుతుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీ చెల్లించాలని పలు మార్లు జీస్టీ అధికారులు యూనివర్సిటీతోపాటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించడంలేదని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో యూనివర్సిటీ అధికారులు.. వర్కర్లకు ఇవ్వాల్సిన జీతాలు రెండు నెలలుగా ఏజెన్సీకి ఇవ్వకుండా నిలిపివేశారు. దాంతో వర్కర్లు, ఇతర ఉద్యోగులు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారుల బాధ్యతారాహిత్యం.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్కర్ల కోసం టెండర్లు పిలిచిన సమయంలోనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ సంస్థ జీఎస్టీ సంస్థ నుంచి బకాయిలు లేనట్లు ఎన్ఓసీ సమర్పించాల్సి ఉంటుంది. కానీ సదరు యూనివర్సిటీ అధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా సదరు ఏజెన్సీ సంస్థకు టెండరు అప్పగించారు. మూడు నాలుగేళ్లుగా జీస్టీ చెల్లించడంలేదని జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని కారణంగానే సదరు ఏజన్సీ సంస్థ ఏకంగా రూ.99 లక్షల జీస్టీ ఎగ్గొట్టింది. ఒక్కో ఉద్యోగికి 18 శాతం యూనివర్సిటీ జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, యూనివర్సిటీ నేరుగా 2 శాతం, ఏజెన్సీ ద్వారా 16 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ 16 శాతం డబ్బులను ఏజెన్సీ సంస్థ స్వాహా చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. యూనివర్సిటీలోని కొందరు అధికారులు ఏజెన్సీ సంస్థతో అంటకాగి ముడుపులు పుచ్చుకొని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టకుండా సహకరించినట్లు తెలిసింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఏ అధికారికి నోటీసులు వెళ్లినా కూడా ఏజెన్సీ సంస్థకు జీతాలు, జీఎస్టీ చెల్లింపు అతడిదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా, రిటైర్డ్ అయినా కూడా వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఉద్యోగులను, వర్కర్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీకి ప్రతినెలా 16 శాతం జీఎస్టీ చెల్లించాం. జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీస్ వచ్చి మాట వాస్తవమే. ఏజెన్సీ యజమానికి కూడా నోటీస్ ఇచ్చాం. జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీదే. – అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్ ఫ దాచిపెడుతున్న యూనివర్సిటీ అధికారులు ఫ రెండు నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వని ఏజెన్సీ -
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
కోదాడ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సూచించారు. సోమవారం ఆయన కోదాడ ఆర్టీసీ బస్టాండ్, డిపోను తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న సేవలను పరిశీలించారు. వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తదనుగుణంగా సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జానిరెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ సుచరిత, డీఎం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి -
ఎన్నికల ప్రక్రియలో మార్పు రావాలి
రామగిరి (నల్లగొండ) : ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఆయన రచించిన ఏడుకోలల బాయి ఎన్నికల శతకంపై నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో సోమవారం సృజన సాహితీ ఆధ్వర్యంలో పద్యగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కవులు తమకు కేటాయించిన శతకంలోని పద్యాలను పాడారు. ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కవిత్వాన్ని జీవితంలో భాగంగా భావిస్తానన్నారు. తాను సంప్రదాయ పద్యాన్ని ఎంచుకొని ఆధునిక వస్తువు ఎన్నికల తీరుపై శతకాన్ని రచించానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య మాట్లాడుతూ.. ఏనుగు లక్ష్మణకవి సంస్కృత కావ్యం సుభాషిత రత్నావళిని తెలుగులో అనువదించారని, ఇప్పుడు ఏనుగు నరసింహారెడ్డి సామాన్యుల హృదయాలలోని భావాలను పద్య కవిత్వంగా ఏడుకోలల బాయి శతకాన్ని రాయడం ఎన్నికల స్వరూపాన్ని మార్చాలనేది ఉద్దేశమన్నారు. ప్రాచీన పద్యం ద్వారా వర్తమాన సమస్య ఎన్నికల వ్యవస్థ గురించి చెప్పడం వినూత్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ.. ఐదు శతాబ్దాల క్రితమే వేమన పద్య ప్రక్రియ ద్వారా ఆనాటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపి సామాజిక సంస్కరణకు దోహదపడ్డారని, ఇప్పుడు సీస పద్యాలతో భారత ఎన్నికల్లోని లొసుగులను నరసింహారెడ్డి ఎత్తిచూపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తండు కృష్ణకౌండిన్య, తూర్పు మల్లారెడ్డి కనకటి రామకృష్ణ, సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, ఇడికోజు శ్రీనివాసాచారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, నర్రా సుఖేందర్రెడ్డి, సి. అనితకుమారి, శీల అవిలేను, బరిగెల శ్రవణ్, గడ్డం శ్రీను, కాసుల ఆంజనేయులు, బైరెడ్డి కృష్ణారెడ్డి, బక్క పిచ్చయ్య, మామిడి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి -
హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి
ప్రారంభమవుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నల్లగొండ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. పది రోజుల క్రితమే కోతలు ప్రారంభమై పెద్ద ఎత్తున ధాన్యం కల్లాలకు వస్తుండడంతో.. అధికారులు కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలను తెరవాలని నిర్ణయించిన అధికారులు ఆదివారం వరకు 16 కేంద్రాలను ప్రారంభించారు. కానీ కాంటాలు మాత్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి యాసంగి సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిల్లు నేరుగా కొనుగోలు చేస్తాయని, మిగిలిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వస్తుందని లెక్కలు వేశారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత యాసంగి కంటే ఈసారి అధికంగా దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 2న సందర్భంగా చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆదివారం నల్లగొండలోని ఆర్జాలబావిలో కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేచి చూసే ధోరణిలో యంత్రాంగం గత యాసంగి సీజన్్లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ప్రారంభించడంలో వేచి చూసే ధోరణిలో ఉంది. రైతులకు తప్పని పడిగాపులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా.. క్షత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 16 కేంద్రాలు ప్రారంభించినా.. కాంటాలు మాత్రం వేయడం లేదు. చాలా కేంద్రాల వద్దకు ఇంకా టార్పాలిన్లు, తేమ, తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు కూడా రాలేదు. రైతులకు అవసరమైన నీడ, తాగునీటి వసతి కూడా కల్పించలేదు. దీంతో రైతులు రోజూ కేంద్రాల వద్ద తమ ధాన్యం ఆరబెట్టి.. సాయంత్రం కుప్పగా చేస్తూ.. రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఫ ఈ సీజన్లో 401 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం ఫ ఇప్పటివరకు 16 కేంద్రాలు ప్రారంభం ఫ ఆర్జాలబావిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్, కలెక్టర్ -
మహనీయుడు జగ్జీవన్రామ్
నల్లగొండ : సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశా కిరణం బాబు జగ్జీవన్రామ్ అన్నారు. జగ్జీవన్రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, చొల్లేటి ప్రభాకర్, పున్న కై లాస్ నేత, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, మారుపాక నరేందర్, పెరిక షణ్ముఖకుమార్, పాలడుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏడుకొండలు, పెరిక స్వాతి, శ్రీని వాసరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్, బుర్ర సుధాకర్, కత్తుల సంజీవయ్య, అవుట రవీందర్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
నార్ముల్కు నవశకం
ప్రభుత్వం వారంలోగా ఎన్వోసీ ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది. సీఎం రేవంత్రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ ప్రతినిధులకు ఎన్వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనెలలోనే ఎన్డీడీబీ టేకోవర్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. – గుడిపాటి మధుసూదన్రెడ్డి, నార్ముల్ చైర్మన్ సాక్షి, యాదాద్రి : నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) కష్టాలు తీరే సమయం వచ్చేసింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్ను కాపాడేందుకు ప్రభుత్వం.. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి.. ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, ఢిల్లీ మదర్ డెయిరీ చైర్మన్ జయతీర్థాచారితో ఇటీవల హైదరాబాద్ సమావేశం అయ్యారు. 15ఏళ్ల పాటు డెయిరీని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వేలాది మంది డెయిరీ రైతులకు శుభవార్తే అని చెప్పవచ్చు. ఏటా రూ.5కోట్ల గుడ్విల్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ నార్ముల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నార్ముల్కు ఏటా ఎన్డీడీబీ రూ.5 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.25 కోట్ల గుడ్ విల్ ఇస్తుంది. ఈ డబ్బులతో రైతులకు బోనస్, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. అయితే నార్ముల్ పాల సేకరణకు 2లక్షల లీటర్లకు పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులను మాత్రం ఎన్డీడీబీ ఆధ్వర్యంలో ఢిల్లీ మదర్ డెయిరీ నిర్వహించనుంది. లీటర్ పాలకు రూ.6.50 కమీషన్ చెల్లిస్తారు. తద్వారా నార్ముల్కు నెలకు రూ.2.కోట్ల ఆదాయం లభించనుంది. ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్ను గాడిన పెట్టడానికి ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఎన్డీడీబీ నుంచి ఇద్దరు, ఢిల్లీ మదర్ డెయిరీ నుంచి ఇద్దరు, నార్ముల్ నుంచి చైర్మన్, ఎండీ ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మొత్తం డెయిరీ వ్యవహారాలు జరగనున్నాయి. ఎన్డీడీబీ నుంచి రూ.50కోట్లు ఒప్పందం ప్రకారం నార్ముల్ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎన్డీడీబీ దశల వారీగా రూ.50 కోట్లు ఇవ్వనుంది. 50 వేల మంది రైతులు, 311 రిజిస్టర్ సొసైటీలు, రోజు 50 వేల లీటర్ల పాల అమ్మకాలు ఉన్నాయి. ప్రధానంగా రైతులకు ఇవ్వాల్సిన 9 పాల సేకరణ బిల్లుల మొత్తం రూ.25 కోట్లు, బ్యాంకు అప్పులు రూ.26 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4 కోట్లు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.6 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నింటిని ఎన్డీడీబీ ఇచ్చే రూ.50 కోట్లతో సర్దుబాటు చేస్తారు. 30 శాతం వేతనాలు కట్ డెయిరీలో ప్రస్తుతం అవసరానికి మించిన ఉద్యోగులు ఉన్నారని గుర్తించారు. వీరిని తగ్గించుకోవాలన్నది తాజా నిర్ణయం. 300 మంది ఉద్యోగులు అవసరం ఉండగా, 500కు పైగా ఉద్యోగులు ఎందుకన్నది చర్చిస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కట్ చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. తక్కువ వేతనంతో పనిచేసే వారు ఉంటారు. లేదంటే వారే స్వచ్ఛందంగా తప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఎన్వోసీ ఇవ్వగానే టేకోవర్ ప్రస్తుతం నార్ముల్ను టేకోవర్ చేయడానికి ఎన్డీబీబీ సిద్ధమైంది. హయత్నగర్లోని నార్ముల్ డెయిరీ ప్లాంటు భూములు 73 ఎకరాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న చిల్లింగ్ సెంటర్ల భూములు, చిట్యాల భూములపై ఎన్డీడీబీకి ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వాలి. సీఎం రేవంత్రెడ్డి ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఎన్వోసీ ఇస్తే డెయిరీ ప్లాంటును విస్తరించడం, భువనగిరిలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంటును పునురుద్ధరించడం, చిల్లింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. డెయిరీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నది మరో ప్రధాన నిర్ణయం. ఇటీవల భువనగిరి, సూర్యాపేట మిల్క్చిల్లింగ్ సెంటర్లలో రూ.45 లక్షల అక్రమాలు వెలుగుచూశాయి. మూతబడిన సొసైటీల పేరున డెయిరీకి పాలు పోసినట్లు రికార్డులు సృష్టించిన వ్యవహారంలో భువనగిరిలో రూ.40 లక్షలు, సూర్యాపేటలో రూ.5 లక్షల అక్రమాలు వెలుగు చూశాయి. బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ ఒప్పందంతో నార్ముల్లో అక్రమాలకు అడ్డకట్ట పడనుంది. -
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి
నకిరేకల్ : వేసవిలో వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేకల్ మండలం నెల్లిబండలో వడదెబ్బతో శనివారం బుడిగె శంకరయ్య(60) మృతిచెందినట్లు ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపై ఆదివారం మండల వైద్యాధికారి పి.వెంకటేషం, సిబ్బంది శ్యాంసుందర్, శివాణి, లత నెల్లి బండను సందర్శించి శంకరయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. శంకరయ్య మరణంపై ఆదివారం కలెక్టర్కు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్కు నివేదిక సమర్పించామని, ఆయన వడదెబ్బతోనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ నుంచి ప్రజలు రక్షణ పొందేలా.. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎండదెబ్బ లక్షణాలు ముందుగానే గుర్తించి సమీప ఆరోగ్య కేంద్రాలకు పంపే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎండ దెబ్బను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను అందుబాటులో పెట్టామని వివరించారు. ప్రజలు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఫ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ -
7న సీనియర్ క్రికెట్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో అండర్– 25 సీనియర్ క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేన్ జిల్లా కార్యదర్శి అమీనుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు త్వరలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ వెంట బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, రెండు పాస్ పోర్ట్సైజ్ ఫొటోలు తీసుకొని ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మేకల అబినవ్ స్టేడియానికి రావాలని సూచించారు. రెండు రేషన్ షాపులు సీజ్డిండి : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, వావిల్కొల్ గ్రామాల్లోని రేషన్ షాపులను దేవరకొండ డీటీసీఎస్ మోబీన్ ఆదివారం సీజ్ చేసారు. వివరాల ప్రకారం మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రేషన్ డీలర్ కొన్ని నెలల నుంచి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా వారికి కొంత మేర నగదు అందజేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో బ్రాహ్మణపల్లి రేషన్ షాపుతోపాటు అదే డీలర్ ఇన్చార్జిగా నిర్వహిస్తున్న వావిల్కొల్ రేషన్ షాపుల్లో తనిఖీలు చేశారు. దీంతో రెండు షాపుల్లో నిల్వ ఉన్న సరుకుల్లో తేడాలు రావడంతో సదరు డీలర్పై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీసీఎస్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం పంపీణీలో అవకతవకలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిద్ధాంతం కలిగిన పార్టీలకే ఆదరణమోత్కూరు : సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం మోత్కూరులో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసినప్పుడే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాగలుగుతుందన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజులరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, ప్రశిక్షణ ప్రభారి గౌరు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్, నాయకులు కె.నాగార్జున్రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, ఏనుగు జితేందర్రెడ్డి, పోచం సోమయ్య, సజ్జనం మనోహర్, చేకూరి మల్లేశం, కూరాకుల వెంకన్న, సైదులు, ఏనుగు జితేందర్రెడ్డి, సజ్జనం మనోహర్, రమణ, సోమేశ్వరి, రేణుక, రాము, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బైపాస్ నిర్మాణంలో అన్నీ అవకతవకలే..
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు, నాసిరకం పనులు కనిపిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఆయన బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. నిబందనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నా మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదని, కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. గ్రావెల్ (ఎర్రమట్టి)తో నిర్మాణం చేయాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. కంచనపల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయ సముద్రం, బుద్ధారం, అనంతారం, సాగర్ రోడ్డులో ఉన్న చెరువుల నుంచి మట్టి దందా చేసి పర్యావరణానికి నష్టం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధగోని శ్రీనివాస్గౌడ్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, కార్పొరేటర్లు దాసరి సాయి, రామగిరి అఖిల్రావు, వంగూరి రాఖి, ఫకీర్ మోహన్రెడ్డి, చింతా ముత్యాలరావు, దాసోజు యాదగిరాచారి, గాలి శ్రీనివాస్, ఆవుల మధు, ఆకునూరి సత్యనారాయణ, పాలకూరి రవి, శివరామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, అనిల్, గడ్డం శాంతిస్వరూప్ పాల్గొన్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయం
దేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బార్ అసోసియేషన్, బీఎస్ ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.అనిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎస్ హరీష్బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, డీఎస్పీ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమమహేష్, వనం జగదీష్, గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి రమాశంకర్, షౌకత్అలీ, శివకుమార్, వీరబాబు, గిరిధర్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
రాయితీ పొందు
ముందస్తుగా చెల్లించు..నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు. ఐదు శాతం రాయితీ ఇస్తుండడంతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తిపన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. బకాయిలతో సహ చెల్లిస్తేనే రాయితీ వర్తిపు.. పట్టణాలు, నగరంలోని నివాసాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2026 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్నును ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహ చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో ఐదు శాతం రాయితీ వర్తిస్తుంది. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లిస్తే అపరాధ రుసుం పడుతుండడంతో.. ప్రజలు ఈ ఐదు శాతం రాయితీ వినియోగించుకుంటే లబ్ధి పొందవచ్చు. నీలగిరి కార్పొరేషన్ టార్గెట్ రూ.8.50 కోట్లు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 44వేల భవనాలు ఉన్నాయి. సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ సుమారు రూ.18 కోట్ల వరకు ఉండగా, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 19 వేలకు పైగా భవనాలు ఉండగా రూ.25 కోట్లకు పైగా ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. జిల్లాలో నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీలు మాత్రమే పెద్దవి. మిగతా నాలుగు మున్సిపాలిటీలు చిన్నవి మాత్రమే. నీలగిరిలో ఈ ముందస్తు పన్ను రాయితీలో బాగంగా ఒక్క నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ దాటితే అపరాద రుసుం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధ రుసుం పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఆస్తి పన్ను చెల్లించని వారు అపరాధ రుసుంతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. అపరాద రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలోనే ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు. ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం మినహాయింపు ఫ మున్సిపాలిటీలు, నగరంలో ఈ నెలాఖరు వరకు చెల్లించేవారికి వర్తింపు ఫ జూన్ దాటితే అపరాధ రుసుంతో కట్టాల్సిందే.. ఫ భవన యజమానులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు -
ఆర్మీ లెఫ్టినెంట్గా సుధాకర్
నల్లగొండ : నల్లగొండ ఎన్జీ కాలేజీ ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలుముల సుధాకర్ నేషనల్ కేడెట్ కాప్స్ (ఎన్సీసీ)లో అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ (ఏఎన్ఓ)గా అర్హత సాధించారు. లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీ ఆఫీసర్ ర్యాంకు పొందాడు. ఈయన మహారాష్ట్రలోని నాగపూర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు సైనిక శిక్షణను పూర్తి చేశాడు. ఈ శిక్షణలో ఫైరింగ్, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్, డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు సుధాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఫిట్నెస్ నాయక్
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఆయన ఎన్ని పనులున్నా.. రోజూ వ్యాయామం మిస్ చేయరు. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు ఎమ్మెల్సీ శంకర్నాయక్. కార్య కర్తలకు కూడా ఆయన ఇదే సూచిస్తారు.ఫ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ శంకర్నాయక్ ప్రత్యేక శ్రద్ధ ఫ సోషల్ మీడియాలో ఆయన ఫిట్నెస్ వీడియోలకు యూత్ ఫిదా ఫ మితాహారం, ఆరు గంటలు నిద్ర ఆయన హెల్త్ సీక్రెట్మిర్యాలగూడ : ఎమ్మెల్సీ శంకర్నాయక్ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ తొలుత జాగింగ్ చేస్తారు. 16 రకాల యోగాసనాలను వేస్తారు. ముఖ్యంగా వజ్రాసనం, కపాలభాతి వంటి ఆసనాలు వేస్తారు. తరువాత వెయిట్ లిఫ్టింగ్, డిప్స్తోపాటు వాలీబాల్, కబడ్డీ ఆడుతారు. చిన్నప్పటి నుంచే .. ఎమ్మెల్సీ శంకర్నాయక్కు చిన్నప్పటి నుంచే క్రీడలతోపాటు వ్యాయామంపై ఆసక్తి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు సైతం నిత్యం వ్యాయామం చేస్తారు. శంకర్నాయక్ ఏదైనా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు సైతం వ్యాయామం, శరీర దారుఢ్యానికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన యువత.. ‘ఫిట్నెస్ నాయక్’ అని కితాబిస్తున్నారు. ఆహార నియమాలు ఇవే.. శంకర్నాయక్ ఉదయం అల్పాహారంగా జొన్న గటక, రాగి సంకటి తీసుకుంటారు. మధ్యాహ్నం మిత భోజనం, రాత్రి జొన్నరొట్టె మాత్రమే తీసుకుంటారు. మాంసాహారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. నిత్యం ఆరుగంటలు తప్పకుండా నిద్రిస్తానని ఆహారం, నిద్ర నియమాలు పాటిస్తుండడంతో తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా శంకర్నాయక్కు ఆసక్తి ఉంది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. ఇటీవల శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతికోత్సవంలో కట్టప్ప వేషధారణ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రుల అభినందనలు అందుకున్నారు. -
నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు
నల్లగొండ టూటౌన్ : నైపుణ్యాలు గల విద్యార్థులకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం యూనివర్సిటీలో నిర్వహించిన జాబ్ మేళాకు 700 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాబ్మేళాలో 100 మందికిపైగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్కుమార్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, ప్రదీప్రెడ్డి, భాస్కర్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
కోతలు ముమ్మరం..
ఫ ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఫ పది రోజుల నుంచి కల్లాల్లోధాన్యం పోస్తున్న రైతులు ఫ కొనుగోళ్లకు తప్పనిఎదురుచూపులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. యాసంగి వరి కోతలు పది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యం తీసుకొచ్చి కల్లాల్లో పోస్తున్నారు. గతేడాది యాసంగిలో మార్చి 25వ తేదీన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. ఈసారి ఏప్రిల్ నెల వచ్చినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. రా రైస్, బాయిల్డ్ రైస్ విషయంలో సమస్యల కారణంగానే ఇంకా కేంద్రాలను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలకు భారీగా ధాన్యం గత యాసంగి సీజన్్లో ఏర్పాటు చేసిన చోటనే ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రైతులు ముందుగానే ఆయా ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు అధికంగా ఉంటుండటంతో నిర్దేశిత తేమ శాతం త్వరగా వచ్చేస్తోంది. అయినా జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. ఒక్క చిట్యాల మండలంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం బుధవారం ఒకచోట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. అయితే అక్కడ కూడా ఇంకా కొనుగోళ్లు చేపట్టలేదు. మిల్లర్లతో అధికారులకు కుదరని సయోధ్య ఈసారి యాసంగి సీజన్లో పూర్తిగా రా రైస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రా రైస్ ఇవ్వాలనే నిబంధన విధించింది. అయితే సాధారణంగా యాసంగి సీజన్లో రా రైస్ పూర్తి స్థాయిలో రావని, మిల్లింగ్ సమయంలో నూక అధికంగా వచ్చి, తాము నష్టపోవాల్సి వస్తుందని మిల్లర్లు అంటున్నారు. ఈసారికి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఈసారి బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే తాము ధాన్యం దిగుమతి చేసుకోమని మిల్లర్లు చెబుతున్నారు. అయితే దీనిపై జిల్లా స్థాయిలో అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిల్లర్లతో అధికారుల చర్చలు అధికారులు ప్రభుత్వం విధించిన నిబంధనను మిల్లర్లకు వివరించి ధాన్యం దిగుమతి చేసుకోవాలని చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. సీఎంఆర్ కింద రారైస్ ఇస్తే నూక అధికంగా వచ్చి తాము నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందేనని మిల్లర్లను ఒప్పించేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. మిల్లర్లు కూడా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ధాన్యం దిగుమతి విషయంలో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ, తిప్పర్తిలో కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కేంద్రాలు, కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతులు మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
సుందరీకరణ పనులు పునః ప్రారంభం
తిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో సుందరీకరణ పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. రూ.9 కోట్ల చేపట్టనున్న సుందరీకరణ పనులను 2024 సెప్టెంబర్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. అప్పట్లోనే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేయించడంతో సుందరీకణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో రోడ్ల విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, డివైడర్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్తో కూడలిలో బాబు జగ్జీవన్రామ్, డాక్టర్ బిఆర్అంబేద్కర్ కాంస్య విగ్రహాలు, పౌంటేయిన్ ఏర్పాటు తదితర పనులు చేపట్టి సుందరంగా మార్చనున్నారు. జగ్జీవన్రాం, అంబేద్కర్ల కాంస్య విగ్రహాలను ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళహారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళవాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన పూజలు.. నిజాభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్రనామార్చన, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం జోడు సేవలు, రాత్రి శయనోత్సవంతో ముగిశాయి. -
ప్రాణాలను కాపాడడంలో గోల్డెన్ అవర్ కీలకం
భువనగిరి : పిల్లల్లో గాయాల వల్ల కలిగే మరణాలను తగ్గించడంలో గోల్డెన్ అవర్ కీలక పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, మెడికల్ సూపరింటెండెంట్ లక్కిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎయిమ్స్లో నిర్వహించిన పిడియాట్రిక్ ట్రామా రిససిటేషన్ మాడ్యూల్ వర్క్షాప్లో వారు మాట్లాడారు. అనంతరం డాక్టర్ నేహఠాకూర్ రాయ్ పర్యవేక్షణలో డాక్టర్ దేబాసిస్ దాస్ చేతన్ గినిగిరి, అరవింద్ అనందల్ సుమారు 40 మంది నర్సులకు శ్వాసనాళ నిర్వహణ, షాక్ రిససిటెషన్, పాయింట్ ఆఫ్ కేర్, అల్ట్రాసౌండ్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఎయిమ్స్కు చెందిన సీనియర్ రెసిడెంట్లు డాక్టర్ అనన్య శ్రియం, చేతన్ ఎన్ ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు ఉపాధ్యాయుడి ఎంపిక
పెద్దవూర : ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ దేశ పర్యటనకు పెద్దవూర మండలం ఏనెమీదిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకట్రెడ్డి ఎంపికయ్యారు. మన రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ను చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన 28 మంది ఉపాధ్యాయులను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. వీరు ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఫిన్లాండ్లో పర్యటించనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, గుణాత్మక విద్య ద్వారా విద్యార్థుల ప్రగతి, రిసోర్స్ పర్సన్గా అనుభవం, పాఠ్యపుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వర్క్షాపుల్లో భాగస్వామ్యం, వినూత్న బోధన నైపుణ్యాలు మరియు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల ఆధారంగా వెంకట్రెడ్డిని ఎంపిక చేశారు. కాగా, గత ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో ఈయన యోగా విభాగంలో రాష్ట్రం తరపున జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణుడిగా, లైఫ్ స్కిల్ కోచ్గా సేవలు అందిస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. వెంకట్రెడ్డి ఎంపికపై జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి, ఎంఈఓ తరి రాము, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
వృద్ధ తల్లిదండ్రులకు ఊరట
వృద్ధాప్యంలో అమ్మానాన్నల పోషణ బాధ్యత పిల్లలదే.. నల్లగొండ : కని, పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. వారి పోషణ తమకు భారంగా భారంగా భావిస్తున్నారు. తమను కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఎందరో తల్లిదండ్రులు వయో వృద్ధుల ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటి అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ యాక్ట్ –2026ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనున్నది. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకే.. పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పింఛన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. కానీ ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాక పోగా, కొంత మంది కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తల్లిదండ్రుల మద్దతు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతో మంది తల్లిదండ్రులకు మేలు కలుగుతుంది. విశ్రాంత ఉద్యోగులకూ కష్టాలే.. ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లలో చాలా మంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించే వారు కూడా ఉన్నారు. కొందరైతే తల్లి లేదా తండ్రి బ్యాంక్ పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులను తమ వద్దనే ఉంచుకొని వారి పింఛన్ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు. మరి కొందరు తల్లిదండ్రులు డబ్బులు డ్రా చేయగానే వారిని బెదిరించి లాక్కుటున్నారు.నూతన చట్టం ప్రకారం తమను పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి 15 శాతం లేదా గరిష్టంగా రూ.10వేలు (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే వారందరికీ వర్తిస్తాయి. అయితే పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. పెన్షన్, ఇతర ఆదాయ వనరులు ఉన్న తల్లిదండ్రులకు వర్తించదు. బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరొక ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను కలిసే వెసులుబాటును కూడ కల్పించారు. ఫ నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల వేతనం నుంచి 15శాతం కోత ఫ ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోనే పరిష్కారానికి చర్యలు ఫ పేరంటల్ సపోర్ట్ యాక్ట్తో వృద్ధులకు భరోసా -
దేవరకొండలో ‘ఇంటింటికీ సీపీఐ’
దేవరకొండ : దేవరకొండ పట్టణంలో శుక్రవారం ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి ప్రజలను కలిసి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు దాటిందని గుర్తు చేశారు. దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి చేసి సమసమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు. భవిష్యత్లో ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీకి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నాయకులు పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, రమావత్ అంజయ్యనాయక్, కాంతయ్య, పల్లా దేవేందర్రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, సుదర్శన్రెడ్డి, కనకాచారి తదితరులున్నారు. రేణుకా ఎల్లమ్మకు మొక్కుబడి కల్యాణంనల్లగొండ : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి మొక్కుబడి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, ఉపేందర్రెడ్డి, రాజయ్య, నాగరాజు, ఆంజనేయులు, అర్చకులు గాదే దామోదర్రావు, ఫణికుమార్, శ్రీనివాసచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు వరంమిర్యాలగూడ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని తన కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సీఎం సహాయ నిధి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి తక్షణ సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మాలి కాంతారెడ్డి, బొంగర్ల సుకన్య వినోద్ పాల్గొన్నారు. సహకార ఉద్యోగుల సస్పెన్షన్మోత్కూరు : మోత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గదిలో రాత్రివేళ ఉద్యోగులు మద్యం సేవించడం వాస్తవమని తేలడంతో సస్పెన్షన్కు గురయ్యారు. ఉద్యోగులు పెండెం నరహరి, ఎస్కె.యాకూబ్, సీహెచ్.కృష్ణలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సహకార అధికారి జి.మురళీరమణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
సమస్యల పరిష్కారానికే ‘ప్రజాపాలన’
తిప్పర్తి : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అంతజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేస్తుందన్నారు. తిప్పర్తి మండలంలో రూ.60లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. రూ.6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.26 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ.70 లక్షలు, కాల్వల మరమ్మతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేశామన్నారు. నెల రోజుల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిచేసి గృహ ప్రవేశాలను చేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ సొంతంగా రూ.20వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండల కేంద్రానికి త్వరలో ముఖ్యమంత్రిని తీసుకొస్తానన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో 352 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. సర్పంచ్లు, అధికారుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సర్పంచ్ బద్ధం రజితసుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సర్పంచ్ ముత్తినేని శ్యాంసుందర్, నాయకులు ఊట్కూరి సందీప్రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ జానయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఫ తిప్పర్తి గ్రామ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
నేరాల నియంత్రణే పోలీస్ శాఖ లక్ష్యం : ఎస్పీ
నార్కట్పల్లి : నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా గురువారం నార్కట్పల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటు చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం సులభతరమవుతుందన్నారు. యువత మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమేష్, సర్పంచ్ జేరిపొత్తుల భరత్, కార్యదర్శి రవికుమార్, ఉప సర్పంచ్ శిరీష, సట్టు సత్తయ్య, పుల్లెంల శ్రీనివాస్, ఎస్బీ సీఐ రాము, నార్కట్పలి్ల్ సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణు, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
మద్దతు ధర చెల్లించాలని రైతుల ఆందోళన
వేములపల్లి : తాము ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ గరిష్ట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని రైస్ మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా క్వింటా ధాన్యాన్ని రూ.2,700 నుంచి రూ.2,600కు కొనుగోలు చేసిన మిల్లర్లు సిండికేట్గా మారి ధరను తగ్గించి రూ.2,500లకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు రైస్ మిల్లుల వద్దకు వెళ్లి మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని రూ.2,600కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పదో తరగతి పరీక్షకు 45 మంది గైర్హాజరునల్లగొండ : జిల్లాలో ఏర్పాటు చేసిన 106 పరీక్ష కేంద్రాల్లో గురువారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 19,659 మంది పరీక్ష రాయగా 39 మంది గైర్హాజరయ్యారు. అలాగే 103 మంది ప్రైవేటు విద్యార్థులకు 97 మంది పరీక్ష రాయగా ఆరుగురు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు. -
సమాచారం అందించాలి
నకిలీ విత్తనాలు అమ్మకుండా దుకాణాలు, వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మేవారి సమాచారాన్ని టాస్క్పోర్స్ అధికారులకు తెలిపాలి. బార్కోడ్ ఉన్న ప్యాకెట్లు మాత్రమే కొనాలి. తప్పక రశీదు తీసుకుని దాన్ని సీజన్ ముగిసే వరకు దగ్గర పెట్టుకోవాలి. గతంలో నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడిన వారు తిరిగి అమ్మితే పీడీ యాక్టు ప్రయోగిస్తాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది
చిట్యాల : రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో ఆ గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీభిక్షం అధ్యక్షతన గురువారం జరిగిన గ్రామసభకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్తో కలిసి హాజరై మాట్లాడారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మ ందికిపైగా ఆసరా పింఛన్లు, నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. తన పదవీకాలం మరో ఇరవై నెలలు ఉందని.. ఆలోపు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరింపజేయిస్తానన్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతారమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాలలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఎంపీడీఓ జయలక్ష్మి, తహసీల్దార్ విజయ, ఏఓ గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్ నేత, గ్రామ ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, నాయకులు పల్లపు బుద్దుడు, పోలగోని స్వామి, చెరుకు సైదులు, పోలగోని నర్సింహ, ఉయ్యాల లింగయ్య, జన్నపాల శ్రీను, పాకాల దినేష్, గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు. ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
మళ్లీ తెరపైకి పోలీస్ బెటాలియన్!
సంస్థాన్ నారాయణపురం: రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేయనుంది. ఈమేరకు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంతో పాటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో కూడా సంస్థాన్ నారాయణపురంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ స్థానికంగా కొంతమంది రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ప్రభుత్వం నూతన బెటాలియన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో సంస్థాన్ నారాయణపురంలో బెటాలియన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో బెటాలియన్కు ప్రతిపాదనలు హైదారాబాద్కు 100 కిలోమీటర్ల పరిధిలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయాలని రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆధికారులు సంస్థాన్ నారాయణపురం సమీపంలోని సర్వే నంబర్ 255లోని భూములను పరిశీలించి 84.24ఎకరాల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకుగాను ప్రతిపాదనలు పంపించారు. అయితే సర్వే నంబర్ 255లో 144 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా.. 11 ఎకరాలు పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఆధీనంలో ఉంది. అదేవిధంగా 2 ఎకరాల 15 గుంటల్లో గాంధీనగర్ తండా ఉంది. మిగతా భూమిలో దాదాపు 80 సంవత్సరాలుగా తాతల తరాల నుంచి 180 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. పత్తితో పాటు ఇతర ఆరుతడి పంటలను పండిస్తున్నారు. వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ భూములకు గతంలో పాత పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా అందజేశారు. కొంత మంది రైతులుకు డిజిటల్ పాస్ పుస్తకాలు తీసుకున్నారు. ఈ పాస్ పుస్తకాలపై రైతులు బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అందుకున్నారు. ఈ భూముల్లో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడంతో గతంలో రైతులు ఆందోళనలు కూడా చేశారు. తిరిగి బెటాలియన్ ఏర్పాటు అంశం తెరమీదుగా రావడంతో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి వివరణ కోరాగా.. పోలీస్ బెటాలియన్కు స్థలం కేటాయింపు జరగలేదని తెలిపారు. కేవలం స్థలం ఉందని ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. -
ధాన్యం ధర తగ్గించి దగా
మిర్యాలగూడ : సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని మిల్లర్లు రైతులను నిలువునా ముంచుతున్నారు. ఆయకట్టు ప్రాంతంలో కోతలు మొదలైన సమయంలో (పదిరోజుల క్రితం) క్వింటా ధాన్యం ధర రూ.2750 ఉంటే.. మిల్లర్లు సిండికేట్గా మారి రోజుకు కొంత తగ్గిస్తూ ఇప్పుడు రూ.2,400 లోపే ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే వారి ధాన్యంలో కొర్రీలు పెట్టి అసలే కొనుగోలు చేయడం లేదు. ఇప్పటికే దిగుబడి తగ్గి ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ధాన్యం ధర తగ్గించి మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆయకట్టులో సన్నాల సాగు నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 3.5 లక్షరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. ఈ యాసంగి సీజన్లో రైతులు కావేరి, జేఎస్ఆర్, హెచ్ఎంటీ వంటి సన్న రకాలను సాగు చేశారు. పదిరోజుల క్రితం కోతలు మొదలయ్యాయి. తెగుల ప్రభావంతో ఎకరాకు 30 నుంచి 35 బస్తాలలోపే దిగుబడి వస్తోంది. ఒకటిరెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షం కురుస్తుండడంతో రైతుల ఆందోళన చెంది ఒకేసారి పొలాలు కోస్తున్నారు. దీంతో మిల్లులకు ధాన్యం పోటెత్తుతోంది. కొనుగోలుకు కొర్రీలు.. ధాన్యం తెచ్చిన రైతును ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లుల వద్ద పడిగాపులు కాయించి తీరా పచ్చగింజ, తాలు పేరుతో ధరలో కోత పెడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆయకట్టులో ఇప్పటి వరకు 25 శాతం మేర కోతలు అయ్యాయి. ఇప్పుడే ధర తగ్గిస్తే భవిష్యత్లో ఇంకా ధర కోత పెట్టే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కూడా మిల్లర్లకు కలిసివస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో 17 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.2389, సన్నాలకు బోనస్ రూ.500 చెల్లిస్తారు. దీంతో క్వింటాకు రూ.2,889 రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ మిల్లుల్లో ఎక్కడా అంత ధరపెట్టి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. మిల్లుల్లో ధర లేకపోతే రైతులు ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేవారు. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో మిల్లర్లు చెప్పిన రేటుకే ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతున్నారు. గుమస్తాలు, కమీషన్దారుల ఇష్టారాజ్యం మిల్లుల్లో గుమస్తాలు, కమీషన్దారుల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరు మిలాకత్ అయి రైతులను ముంచుతున్నారు. రైతుల తెచ్చిన ధాన్యానికి తొలుతు కమీషన్ దారుడు ఓ రేటు వేసి మిల్లుకు పంపిస్తున్నాడు. అక్కడ మిల్లుల్లో గుమస్తాలు కమీషన్దారుడు చెప్పిన రేటుకు కొంత తగ్గించి కొనుగోలు చేస్తాడు. కానీ, ఎవరైనా రైతు నేరుగా మిల్లుకు ధాన్యం తెస్తే వారి ధాన్యం బాగోలేదని కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నారు. అదే ధాన్యాన్ని అమ్ముకునేందుకు గత్యంతరం లేక రైతు కమీషన్దారుడిని ఆశ్రయిస్తే వారు చెప్పిన మిల్లులో వెంటనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది కమీషన్దారులుగా చలామనీ అవుతున్నారు. పెద్ద మిల్లులదే హవా.. మిర్యాలగూడ పరిసరాల్లో సుమారు వందకు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బియ్యం ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్న ఓ పది పెద్ద మిల్లులే ధరను నిర్ణయిస్తున్నాయి. ధర తగ్గించాలన్నా.. పెంచాలన్నా.. వారిదే పెత్తమని చిన్న మిల్లుల యాజమాన్యం వాపోవడం గమనార్హం. పెద్ద మిల్లుల యాజమాన్యం సిండికేట్ అయి ధరలను అదుపు చేస్తున్నారని తెలుస్తోంది. సాగర్ ఆయకట్టులో మిల్లర్ల దోపిడీ ఫ మేం చెప్పిన రేటుకే అమ్మండి... లేకుంటే పోండి అంటూ బెదిరింపులు ఫ పది రోజుల క్రితం క్వింటా ధర రూ.2,750.. ఇప్పుడు రూ.2,400 లోపే.. ఫ దిగుబడి లేక.. ధర రాక దిగాలు చెందుతున్న అన్నదాతలుమిల్లర్లు సిండికేట్గా మారకముందే రైతులకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ధర నిర్ణయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్వింటాకు రూ.2,350కే కొనుగోలు చేయడంతో కొందరు రైతులు.. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రైతులకు జరుగుతున్న నష్టాలపై వామపక్ష నాయకులు, రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టి సబ్కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య
హాలియా : మతిస్థిమితం సరిగ్గా లేని మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుర్రంపోడు మండలంలోని మొసంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ (49) కుమారుడు శ్రీధర్ ఆరునెలల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె మనోవేదనకు గురై మతిస్థిమితం కోల్పోయింది. బుధవారం ఆమె ఇంటికి కొద్దిదూరంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి అక్కడికి వెళ్లేలోపు ఆమె మృతిచెంది ఉంది. మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె పెద్ద కుమారుడు బొంగరాల శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా.. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. యాదగిరీశుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్ర నామార్చన చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం చేపట్టి, ఆలయాన్ని మూసివేశారు. -
జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపు
శాలిగౌరారం : ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ప్రజల నుంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంస్థలను తనఖీ చేశారు. మొదటగా వల్లాల గ్రామంలో వన నర్సరీని పరిశీలించారు. నర్సరీ నిర్వాహణ, మొక్కల పెంపకం, వనమహోత్సవ కార్యక్రమ ప్రణాళికలు తదితర అంశాలను సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులో ఉపాధిహామీ పథకం కింద రూ.6 లక్షల అంచనాతో కూలీలకు 3వేల పనిదినాలు కల్పించేందుకు చేపట్టిన ఫిష్పాండ్లను పరిశీలించారు. ఉపాధి పనులు జరిగేచోట కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో గల ప్రభుత్వ మోడల్స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి స్కూల్లో బోధనాతీరు, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కట్టెలపొయ్యిపై వంటలు చేయడాన్ని గమనించిన కలెక్టర్ వంటకు గ్యాస్ వినియోగించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం అడ్లూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనఖీ చేశారు. అక్కడ గర్భిణులు, బాలింతలతో మాట్లాడి పౌష్టికాహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. వీఓ భవనాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట లక్ష్మివెంకట్రెడ్డి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల పరిస్థితిని, మిషన్ భగీరథ నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, సీడీపీఓ ఆస్రాఅంజుమ్, సర్పంచ్లు భూపతి తిరుపతమ్మ, కట్ట లక్ష్మి, పీఆర్ఏఈ భరత్చంద్ర, ఏపీఓ జంగమ్మ, ఏపీఎం శంకరయ్య, పంచాయతీ కార్యదర్శులు కృష్ణయ్య, నరేందర్ ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
ఇద్దరు దొంగల అరెస్టు
కొండమల్లేపల్లి: అల్యూమినియం వస్తువులను చోరీ చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇద్దరు మహిళలు సామగ్రి గల బస్తాను తీసుకెళ్తున్నారు. వారు పోలీసులను చూసి భయంతో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. బస్తాను తనిఖీ చేయగా అందులో పాత అల్యూమినియం వస్తువులు ఉన్నాయి. ఇద్దరు మహిళలు పట్టణ కేంద్రానికి చెందిన జంగాల కాలనీవాసులు పర్వతం కోటమ్మ, వీరమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త ఏరుకునే క్రమంలో వినాయక బైక్ రిపేర్ షాప్ నుంచి అల్యూమినియం వస్తువులను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు కొండమల్లేపల్లి ఎస్సై తెలిపారు. దొంగలను పట్టుకున్న ఎస్సై రమేష్, క్రైమ్ సిబ్బంది హేము, భాస్కర్లను ఉన్నతాధికారులు అభినందించినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. -
గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవద్దు
నల్లగొండ టౌన్ : వంటగ్యాస్ సరఫరా మెరుగు పడిందని గ్యాస్ కోసం వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎల్పీజీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పగిడి గోవర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ అవసరం లేకున్నా గ్యాస్ బుకింగ్ చేయవద్దని, సిలిండర్ డెలివరీ చేసిన సమయంలో సీలు, బరువు, లీకేజీ లేని విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్న సీరియల్ ప్రకారమే గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 14 ప్రతిభా కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నల్లగొండ ప్రాంతీయ సమన్వయ అధికారి బి.జానునాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జేఈఈ, ఎంసెట్, ఐఐటీ, నీట్, ఏఐఐఎంఎస్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల గిరిజన విద్యార్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ చార్జీల పెంపునల్లగొండ : సేవలకు మీసేవ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎ కేటగిరిలో ప్రస్తుతం రూ.35 ఉన్న మీసేవ చార్జీలు 62కు, బి కేటగిరిలో రూ.45 ఉన్న చార్జీలు రూ.80కి పెంచినట్లు తెలిపారు. మీ సేవ నిర్వహకులు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పారాక్వాట్ నిషేధం నల్లగొండ అగ్రికల్చర్ : ప్రజల పాలిట యపాశంలా మారిన పారాక్వాట్ (గడ్డి మందు)ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రధానంగా ఈ మందును మెట్టపంటల్లో కలుపు నివారణ కోసం వాడుతుంటారు. దీంతో గడ్డి జాతులకు చెందిన పలు రకాల కలుపు వెంటనే చనిపోతోంది. కూలీల ఖర్చు లేకుండా చాలామంది ఈ మందునే వాడుతున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు.. ఇలా పలు కారణాలతో జిల్లాలో నిత్యం ఏదోఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు చాలాకాలంగా చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా గడ్డిమందు తాగేవారి మరణాలు అధికమయ్యాయి. గడ్డిమందుకు విరుగుడు లేకపోవడంతో ఈ మందును ఏమాత్రం తీసుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలురకాల గడ్డిమందులు, అందులోనూ పారాక్వాట్పై నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ఉత్పత్తులను నిషేధిస్తూ తీర్మాణించింది. మార్చి 31న రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ జీఓ 24ను విడుదల చేస్తూ వెంటనే నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. -
అటెండర్ నుంచి తహసీల్దార్గా..
నడిగూడెం : తొలిసారి అటెండర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కార్యాలయానికే తహసీల్దార్గా విధుల్లో చేరారు అనంతగిరి మండలం రాగాపురం గ్రామానికి చెందిన సోంపంగు సూరయ్య. ఆయన కారుణ్య నియామకం కింద 1995 జూన్లో నడిగూడెం తహసీల్దారు కార్యాలయంలో అటెండర్గా బాధ్యతలు స్వీకరించారు. సర్వీస్ ఆధారంగా 2007లో జూనియర్ అసిస్టెంట్గా అవకాశం వచ్చింది. తిరిగి 2011లో ఆర్ఐగా ప్రమోషన్ రాగా.. 2013 వరకు అదే కార్యాలయంలో విధులు నిర్వహించారు. అదే సంవత్సరం చిలుకూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. 2017 వరకు అక్కడే పనిచేశారు. అదేవిధంగా 2017 నుంచి 2018 వరకు మఠంపల్లి డిప్యూటీ తహసీల్దార్గా, 2018 నుంచి 2021 వరకు కోదాడ డిప్యూటీ తహసీల్దార్గా, 2022 నుంచి 2024 వరకు మోతె డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించారు. 2024లో తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చింది. ఈక్రమంలో 2026 మార్చి వరకు చింతలపాలెం తహసీల్దారుగా పని చేశారు. తిరిగి నడిగూడెం మండలానికి తహసీల్దార్గా బదిలీ కావడంతో బుధవారం ఆయన విధుల్లో చేశారు. తొలిసారిగా నడిగూడెంలో అటెండర్గా చేరి, అదే కార్యాలయంలో తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని సోంపంగు సూరయ్య తెలిపారు. ఫ నాడు అటెండర్గా ఫైళ్లు మోసిన చోటుకే తహసీల్దార్గా విధుల్లోకి -
ప్రజలకు వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నా
రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే క్రమంలో ఏకాగ్రత అవసరం. ఒక్కోసారి రెండు గంటల సమయం కూడా పడుతుంది. ఈక్రమంలో వారికి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ఆస్పత్రికి తీసుకువచ్చేలా చూస్తాం. కష్టాలను ఎదుర్కొంటున్నా.. ప్రజలకు అందించే సేవల్లో వాటిని మరిచిపోతాం. 19ఏళ్లలో 18,550 ఎమర్జెన్సీ కేసులు చేశాం. 108 అంబులెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. – వెలిజాల సైదులు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ -
చికిత్స పొందుతూ ఏఆర్ కానిస్టేబుల్ మృతి
భువనగిరి: చికిత్స పొందుతూ ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం వద్ద చోటుచేసుకుంది. మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన నరాల శంకర్ యాదవ్(32) ఏఆర్ కానిస్టేబుల్గా హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 28న స్వగ్రామానికి వచ్చాడు. తుర్కపల్లిలో తన స్నేహితుడు ఉద్యోగం సాధించిన సందర్భంగా అతడిని కలిసేందుకు అదేరోజు బైక్పై వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో సాయంత్రం వడపర్తి గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. కాగా.. మృతుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. విద్యుత్ కేబుల్ వైర్ల చోరీ నూతనకల్: మండల పరిధిలోని చిల్పకుంట్లలో విద్యుత్ మోటర్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీ చేశారు. పొలానికి ఉపయోగించే విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు, ఫీజ్లను దొంగిలించారని సుమారు 20మంది రైతులకు చెందిన బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించాలని కోరారు. -
ప్రజల ప్రాణాలకు భరోసా
మిర్యాలగూడ : ఫోన్ చేసిన నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించడంలో 108 అంబులెన్స్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం వాహన సౌకర్యం మాత్రమే కాకుండా ఆస్పత్రికి చేరుకునేలోపు అంబులెన్స్లో అవసరమైన వైద్యచికిత్స అందించి ప్రాణాపాయాన్ని తప్పిస్తున్నారు. గురువారం అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం సందర్భంగా వారి సేవలపై ప్రత్యేక కథనం. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 128 మంది సిబ్బంది నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 28 ‘108’ అంబులెన్స్ వాహనాలు షిప్టుల వారీగా 24గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఒక్కో వాహనంలో నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 128 మంది ఈఎంటీ, టెక్నీషియన్, ఫైలెట్లు పని చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని, గర్భిణులు, అత్యవసర సమయంలో వైద్య సేవలు అవసరం ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏడాదిలో 33,671 కేసులు జిల్లాలో 2025 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి వరకు 108 అంబులెన్స్ వాహనాల ద్వారా 33,671 కేసులను టేకప్ చేశారు. ఇందులో కేటగిరీల వారీగా రోడ్డు ప్రమాదాలు 4971, పాయిజన్ కేసులు 1459, గర్భిణుల కేసులు 3946, అపస్మారక స్థితిలో ఉన్న బాధితులు 2179, కడుపునొప్పి 4632, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 2322, గుండె సంబంధిత కేసులు 1865, ఆత్మహత్య కేసులు 871 ఉన్నాయి. ఫ లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్న 108 అంబులెన్స్ వాహనాలు ఫ ఫోన్ చేసిన నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది నేడు అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం -
ఐదుగురు గంజాయి నిందితుల అరెస్ట్
తుర్కపల్లి: మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. సమాచారం మేరకు తుర్కపల్లి ఎస్ఐ మహమ్మద్ తఖియోద్దీన్ తన సిబ్బందితో కలిసి ఎల్లమ్మ గుడి సమీపంలో ఐదుగురు అనుమానితుల ను తనిఖీ చేశారు. ఈమేరకు తుర్కపల్లి మండలానికి చెందిన ఒగ్గుబాబు, జూకంటి సత్యం, ఒగ్గు నవీన్కుమార్, జూకంటి శివకుమార్, బొమ్మలరామారాం మండలం దీరా వత్ దేవేందర్ వద్ద 200 గ్రామల గంజాయి ఉండగా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గంజాయిని కలకత్తా నుంచి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాబాలో నగదు చోరీచివ్వెంల(సూర్యాపేట) : మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట ఉన్న దాబాలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తి నగదు చోరీ చేశాడు. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కాసుల రామన్న అక్కలదేవిగూడెం గ్రామ శివారులో దాబా నిర్వహిస్తున్నాడు. అతను మంగళవారం రాత్రి 12 గంటల వరకు దాబాలో ఉండి అనంతరం ఇంటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి కౌంటర్లో ఉన్న నగదు, సిగరెట్ ప్యాకెట్లు కనిపించలేదు. కౌంటర్లో ఉన్న రూ.13 వేల నగదు చోరీకి గురైందని వాపోయాడు. చోరీకి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు. -
బుద్ధవనంలో ఏఎస్ఓల బృందం
హాలియా : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ను మంగళవారం అసిస్టెంట్ సెక్షన్ అధికారుల (ఏఎస్ఓల) బృందం సందర్శించింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 70 మంది బృందం సభ్యులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మెనేజ్మెంట్ కన్సల్టెంట్ అమర్జిత్ సింగ్ ఆధ్వర్యంలో సాగర్కు చేరుకోగా వీరికి ప్రొటోకాల్ ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వీరు లాంచీలో నాగార్జునకొండ మ్యూజియం, నాగార్జునసాగర్ డ్యాంతోపాటు బుద్ధవనంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. బుద్ధుడి జీవిత విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. మహాస్తూపంలో ధాన్యం చేశారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ అధికారి శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, టూరిజం గైడ్ సత్యనారాయణలు బుద్ధ ధమ్మం, నాగార్జునకొండ, డ్యాం విశేషాలను వివరించారు. -
నా ఎదుగుదలకు తెలుగు దోహదపడింది
రామన్నపేట : తాను ఐఏఎస్ స్థాయికి ఎదగడానికి తెలుగు భాష దోహదపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధశాస్త్రం, వాణిజ్యశాస్త్రం మరియు భౌతికశాస్త్రం ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు మరియు సమకాలీన పురోగతి’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాట్ జీపీటీ, ఏఐ వలన స్వీయ అభ్యసన, విషయ సేకరణ సులభతరమైందని అన్నారు. కొత్త ఆవిష్కరణల వలన పరిపాలనా వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. విద్య మానవ సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం జాతీయ సెమినార్ల నిర్వహణకు పూనుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఇటిక్యాల పురుషోత్తం సదస్సు సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. ఉన్నత విద్య మార్కుల సాధన కోసం కాకుండా సమాజంలో మార్పులు తీసుకురావడానికి, వ్యక్తిత్వ వికాసంతో పాటు ఉపాధిని పెంపొందించడానికి ఉపయోగపడేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన ఏనుగు నర్సింహారెడ్డిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు సీహెచ్. కృష్ణారెడ్డి, వివిధ కళాశాలల ప్రతినిధులు బండారు రామకృష్ణ, సురేష్ శ్రీపాద, ఎస్ఏ మాలిక్, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధాశ్రీనివాస్, పూర్వ విద్యార్థి తూడి మురళీధర్, సదస్సు కన్వీనర్ పి. వెంకటేశ్వర్రావు, కోకన్వీనర్లు జి. సునీత, చిన్నబాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి -
ఐటీ చెల్లింపుదారులకు ఆహార భద్రత కార్డులు
ఫ ఐటీ విచారణలో దొరికిన కార్డుదారులు ఫ 25,129 మంది కార్డులు పొందారని సమాచారం ఫ వాస్తవాలు తేల్చాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు నల్లగొండ : ఐటీ చెల్లించేవారు ఆహారభద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం రెండు విడతల్లో ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆ సందర్భంలో ఆస్తులు ఎక్కువగా ఉన్న కొందరితోపాటు ఐటీ చెల్లించేవారు కూడా ఆహార భద్రత కార్డులు పొందినట్లు ఐటీ శాఖ తేల్చింది. దీంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వాటిని విచారించి వాస్తవాలు తేల్చాలని జిల్లా అధికారులకు ఆదేశాలు పంపగా వారు తహసీల్దార్ల విచారణకు పంపుతున్నారు. జిల్లాలో మొదటి విడత 7,862, రెండో విడతలో 17,267 మంది ఆహార భద్రత కార్డులు పొందారు. వీరిలో కొందరు భూములు ఉండి, ఐటీ చెల్లిస్తున్నారు. ఈ విషయం ఐటీ శాఖ ద్వారా తెలియడంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ జిల్లాలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ ఎంత మంది ఐటీ చెల్లించేవారు కార్డులు పొందారో విచారించాలని డీఎస్ఓను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 25,129 మంది ఐటీ చెల్లింపుదారులు కార్డులు పొందారని పంపించారు. ఇందులో అత్యధికంగా మిర్యాలగూడలో 4,226 మంది ఐటీదారులు కార్డులు పొందగా, నల్లగొండలో 3,147 మంది కార్డులు పొందారు. వీటిని విచారించి వాస్తవమని తేలితే కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం మిర్యాలగూడ : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు జీవన్దాన్ సంస్థకు దానం చేశారు. వివరాలు.. దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన గౌరు శ్రీనివాస్(58) గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో వాసవీ క్లబ్ వీ104–ఎ రీజియన్, 10 కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ వారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు. దీంతో శ్రీనివాస్ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు తదితర అవయవాలను మంగళవారం జీవన్దాన్ సంస్థకు దానం చేశారు. శ్రీనివాస్ అవయవదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. అనంతరం శ్రీనివాస్ స్వగ్రామం కొండ్రపోల్లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వరల్డ్ టీచర్స్ క్విజ్ విజేతగా కోదాడ వాసి
కోదాడ : ప్రపంచంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బెంగళూరు నగరం కేంద్రంగా గ్రే కాప్స్, టీచర్ ట్రైబ్ సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన వరల్డ్ టీచర్స్ క్విజ్–26 విజేతగా కోదాడలోని తేజ విద్యాలయ ఉపాధ్యాయుడు ఉస్తేల ధనుష్రెడ్డి నిలిచినట్లు పాఠశాల నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీల్లో 11 వేల మంది పాల్గొనగా ఫైనల్కు నలుగురు ఎంపికయ్యారు. ఐదు రౌండ్లుగా జరిగిన ఫైనల్ పోటీలో ధనుష్రెడ్డి 500 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచి రూ.20 వేల నగదు గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. విజేతను పాఠశాల ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. నేటి నుంచి చికెన్ వ్యాపారుల సమ్మె నల్లగొండ టూటౌన్ : చికెన్ దుకాణాలకు కోళ్లను సరఫరా చేస్తున్న కార్పొరేట్ కంపెనీల తీరును ఖండిస్తూ చికెన్ వ్యాపారుల అసోసియేషన్ చేపడుతున్న సమ్మె జయప్రదం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 1వ తేదీ (బుధవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని చికెన్ దుకాణాలు మూసివేసి సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. చికెన్ దుకాణాల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న చికెన్ దుకాణాల యజమానులు దుకాణాలు మూసివేసి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో నలుగురికి చోటునల్లగొండ టూటౌన్ : బీజేపీ రాష్ట్ర కమిటీలో జిల్లా కేంద్రానికి చెందిన నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ నేత చింతా సాంబమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నూకల నరసింహారెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, మాదగోని శ్రీనివాస్గౌడ్లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
హెల్మెట్ ధరించకుంటే యమపురికే..
మిర్యాలగూడ అర్బన్ : రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మంగళవారం రాత్రి మిర్యాలగూడలోని రాజీవ్చౌక్ వద్ద పోలీస్ కళా బృందం సభ్యులతో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమకింకరుల వేషాలు వేయించి వాహనదారులకు రోడ్డు భద్రతా, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ కె.రాజశేఖరరాజు, సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్య, కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, వన్టౌన్, టూటౌన్ ఎస్ఐలు సైదిరెడ్డి, రాంబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మోదీ పాలనలో వ్యవసాయం నిర్వీర్యం
రామన్నపేట: మోదీ పాలనలో దేశ వ్యాప్తంగా వ్యవసాయరంగం నిర్వీర్యం అవుతోందని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం జాతీయ నాయకుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం రామన్నపేటలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం మహిళారైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో వ్యవసాయరంగాన్ని బందీగా చేయడానికి కేంద్రం కుటు పన్నుతోందన్నారు. పాలకులు విరుద్ధ విధానాలు అవలంబిస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సంస్కరణ బిల్లులు రైతులకు శాపంగా మారుతాయని హెచ్చరించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ మాట్లాడుతూ మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, బొంతల చంద్రారెడ్డి, కందాల ప్రమీల, మేక అశోక్రెడ్డి, మాటూరి బాలరాజు, బొంతు రాంబాబు, వీటి వెంకటేశ్వర్లు, చీరిక అలివేలు,శీలం ఫకీరమ్మ, గన్నెబోయిన విజయభాస్కర్, రంజిత, బూరుగు కృష్ణారెడ్డి, గన్నెబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, కందుల హన్మంత్, గాదె నరేందర్ గంటెపాక శివ, పుట్టల ఉదయ్, మునుకుంట్ల లెనిన్, నాగటి ఉపేందర్, వేముల సైదులు, శానగొండ వెంకటేశ్వర్లు, మేడి ముకుంద, జంపాల అండాలు, బొడిగె రజిత, ఎర్ర సుమలత పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
ఉచిత బస్సుతో ఆర్థిక భరోసా
నల్లగొండ : ఉచిత బస్సు పథకం మహిళల్లో ఆర్థిక భరోసానింపిందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు, విద్యార్థినులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి రూ.10 వేల కోట్లు, అలాగే జిల్లాలో సుమారు రూ.340 కోట్లు ఆదా చేశారన్నాన్నారు. కార్యక్రమంలో నీలగిరి మేయర్ బుర్రి చైతన్య, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి. జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సీడీపీఓ హరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిపో మేనేజర్ రమణ, హుస్సేన్, మహిళలు పాల్గొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు సహకరించాలినల్లగొండ : మహనీయులైన డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెలలో నిర్వహించనున్నందున ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. నల్లగొండ కలెక్టరేట్లో మంగళవారం వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించేందుకు సర్కులర్ జారీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు కోరిక మేరకు ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వార్డు సభలకు ఏర్పాట్లు చేయండి ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సభలకు గ్రామ అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. సమావేశాల్లో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, సీపీఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ్, జెడ్పీ సీఈఓ ప్రేమకరణ్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తిప్పర్తి : వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నానో యూరియా, డ్రోన్లు, ఆధునిక యంత్రాలను ఉపయోగించి పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సన్నరకం వరిధాన్యం పండించేలా ప్రోత్సహించాలన్నారు. రైతులను ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించి అధిక ఆదాయానిచ్చే పంటలను సాగు చేయించాలన్నారు. రైతులు నకిలీ విత్తనాలుకొని మోసపోకుండా విత్తన వ్యాపారులపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, జిల్లా ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, ఏఓ సన్నిరాజు, ఇతర మండలాల ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రమాదాల నివారణపై..
ఆలవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్లగొండలో వాహన దారులకు అవగాహన కల్పించారు. మూడు నెలలుగా మూసివేత నేరెడుగొమ్ము మండలంలోని చెంచు కాలనీలో ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా మూతపడింది.- 8లోమూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బంది లేకుండా ఎలక్ట్రానిక్ మిషన్లో బ్లూటూత్ లింక్ను తొలగించాలి. బ్లూటూత్ లింక్లో ఒక్క నెలకు సంబంధించి బియ్యం ఇచ్చేలా ఏర్పాటు చేశారు. తద్వారా ఒక్కో కార్డుదారుడు మూడు నెలల బియ్యానికి మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనివల్ల బియ్యం పంపిణీలో ఆసల్యం అవుతుంది. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల కమిషన్కు వినతిపత్రం ఇచ్చాం. జిల్లాలో అదనపు కలెక్టర్కు విన్నవించాం. ప్రభుత్వం పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – పారేపల్లి నాగరాజు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి రేపటి నుంచి మూడు నెలల రేషన్ఫ రేషన్ షాపులకు బియ్యం తరలిస్తున్న అధికారులు ఫ 1051 షాపుల ద్వారా పంపిణీ -
అడ్లూరు గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత
కోదాడరూరల్ : కోదాడ మండలం అడ్లూరులో సోమవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. గ్రామసభ ప్రారంభం కాగానే ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష, కొందరు వార్డు సభ్యులు కలిసి ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలో ఎక్కడ పనిచేశారు, నిధులు ఎంత డ్రా చేశారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ గువ్వల శిరీష స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే పనులు చేశామని, పనులన్నింటికీ ఎంబీ రికార్డులు ఉన్నాయని, ఆ మేరకే నిధులు డ్రా చేశామని తెలిపారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా.. మొత్తం 10మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు. కర్రలతో దాడి చేసుకున్న రెండు వర్గాలు 10 మందిపై కేసు నమోదు -
ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణపై సోమవారం నల్లగొండ పట్టణంలోని క్లాక్టవర్ సెంటర్లో అరైవ్– అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎస్పీ అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై సరైన మార్గనిర్ధేశం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై పోలీస్ కళాబృందం, చిన్నారుల నృత్యం, యమధర్మరాజు వేషధారణతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్రెడ్డి, మహాలక్ష్మయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.హెల్మెట్ వినియోగంపై చిన్నారులతో అవగాహన కల్పిస్తున్న పోలీసులు -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పెద్దవూర: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాకు చెందిన వడ్త్య తార(48) భర్తతో విడాకులు తీసుకుని అదే తండాలో తన తల్లి వద్ద ఉంటుంది. కొద్దిరోజులుగా ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ బుజ్జమ్మ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉట్లపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్కు వెళ్లిన తార మద్యం సేవించి గజ్జల లింగారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిద్రించింది. ఈ క్రమంలో రాత్రి గుర్తుతెలియని వాహనం రోడ్డుపై నిద్రించిన తారను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు మంగులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపారు. హైవేపై రసాయన వ్యర్థాల పారబోత చిట్యాల : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి పారబోశారు. దీంతో హైవే వెంట దుర్వాసన వస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా రసాయన వ్యర్థాలు పారబోస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వేడి బూడిదలో దిగిన ముగ్గురు చిన్నారులకు గాయాలు హుజూర్నగర్ : రోడ్డు పక్కన పోసిన వేడి బూడిదలోకి దిగిన ముగ్గురు చిన్నారుల కాళ్లకు గాయలయ్యాయి. ఈ ఘటన సోమవారం హుజూర్నగర్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు పక్కన ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కాలిన వరిపొట్టు బూడిదను పోశారు. పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలో ఉండే ముగ్గురు పిల్ల లు విశాల్, నాగ యశ్వంత్, యశ్వంత్ ఆడుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్లారు. విశాల్ బూడిదలోకి దిగడంతో అతడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. అతడిని రక్షించేందుకు వెళ్లిన నాగయశ్వంత్, యశ్వంత్కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. విశాల్ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి, అక్కడ నుంచి హైదరాబాద్కు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పెద్దఅడిశర్లపల్లి : బైక్పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవులు(29) బోర్వెల్ బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చెన్నకేశవులు బైక్పై అంగడిపేట నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో తన బోర్వెల్ వాహనం కనిపించడంతో బైక్ ఆపి డ్రైవర్తో మాట్లాడాడు. అనంతరం బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. హాలియా : బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండల పరిధిలోని తానేదార్పల్లి గ్రామ బస్స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి(23) బైక్పై గుర్రంపోడు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తుండగా.. తానేదార్పల్లి గ్రామ బస్స్టేజీ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి వడ్లపల్లి మణిపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. -
గ్రీవెన్స్ డేలో 126 వినతులు
నల్లగొండ : ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 126 ఫిర్యాదులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు 69, ఇతర శాఖలకు 57 వచ్చాయని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. 2న గ్రామ, వార్డు సభలు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సభలో ప్రజలకు తెలియజేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలకు డీఆర్డీఏ, మెప్మా తదితర శాఖలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల్లో పెండింగ్లో ఉన్న ఫైల్స్ వెంటనే క్లీయర్ చేయాలన్నారు. అనంతరం జాతీయ సీనియర్ చెవిటి క్రీడల చాంపియన్ షిప్ పోటీల్లో విజేతలను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి పాల్గొన్నారు. 1 నుంచి ఈ – ఆఫీస్ ఫైల్ ఫైళ్ల నిర్వహణలో పారదర్శకత, వేగవంతానికై ఏప్రిల్ 1 నుంచి ఈ– ఆఫీసు ఫైల్ పద్ధతిని అమలు చేయనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ– ఆఫీస్ ఫైల్ నిర్వహణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ –ఆఫీస్ ఫైలింగ్ విధానంతో ఫైళ్ల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల ఫైళ్లను భౌతికంగా అధికారి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే అనుమతి తీసుకోవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతి లాల్, దుర్గారావు పాల్గొన్నారు. -
సంఘాల లెక్కలు చెప్పడంలేదని..
కట్టంగూర్ : సమభావన సంఘాలకు చెందిన లెక్కలను చెప్పకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన మహిళా సంఘాలు సభ్యులు విచారణకు వచ్చిన అధికారులతో పాటు సర్పంచ్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. ఈ సంఘటన కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన వీబీకే నాగమణి మహిళా సంఘాలకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవటంతో అనేకసార్లు ఉన్నతాధికారులకు మహిళా సంఘాలు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అధికారులు విచారణ కోసం అనేకసార్లు గ్రామానికి వెళ్లి లెక్కలు తేల్చకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించటం లేదు. ఇందులో భాగంగా సోమవారం ఏపీఎం డి. రాములు, సీసీ ప్రసాద్తో కలిసి చెర్వుఅన్నారం గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం వెళ్లారు. గ్రామానికి వచ్చిన అధికారులు లెక్కలు చెప్పకుండా మరోసారి వాయిదా వేసినట్లు చెప్పడంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు గ్రామ పంచాయతీకి తాళం వేసి మూడు గంటల పాటు అధికారులతో పాటు సర్పంచ్ చిలుముల సైదులును నిర్బంధించారు. మహిళలు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ బంధం–2 అధ్యక్షురాలు గద్దపాటి రేణుక మాట్లాడుతూ.. తాను అధ్యక్షురాలిగా ఎన్నికై సంవత్సరం గడుస్తున్నా వీబీకే నాగమణి సంఘం లెక్కలు చూపించకుండా దాటవేస్తుందని, ఐకేపీ ధాన్యం కొనుగోలు నిర్వహణలో, సంఘం డిపాజిట్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. రాత్రయినా అధికారులను బయటకు పంపించకపోవటంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమభావన సంఘాల లెక్కలను క్లియర్ చేయిస్తామని హామీ ఇవ్వటంతో పంచాయతీ కార్యాలయం తాళం తీసి అధికారులను బయటకు పంపారు. మహిళా సంఘాల సభ్యుల ఆగ్రహం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన సభ్యులు చెర్వుఅన్నారంలో ఘటన -
సీఎంఆర్ ధాన్యం దిగుమతి చేసుకోం
భువనగిరిటౌన్ : 2025–26 రబీ సీజన్కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోబోమని యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మిల్లుల్లో ఇప్పటికే భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, కొత్తగా వచ్చే ధాన్యాన్ని భద్రపరచడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మిల్లర్లు తెలిపారు. ప్రస్తుతం 2024–25 రబీ కాలానికి సంబంధించి సుమారు 90,000 టన్నుల ధాన్యం మిల్లుల వద్దే నిల్వ ఉందని, అదేవిధంగా 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి మరో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి రా రైస్ పెట్టాల్సి ఉన్నందున, నిల్వలు పెరిగిపోయి మిల్లుల్లో అడుగు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పాత నిల్వలు పూర్తిగా డెలివరీ అయిన తర్వాతే కొత్త ధాన్యం దిగుమతి గురించి ఆలోచిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మార్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి అశోక్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలుతిప్పర్తి : బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గోలి మాధవరెడ్డి బైక్పై ఇంటికి వెళ్తుండగా తిప్పర్తి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రాచకొండ రిజర్వాయర్కు డీపీఆర్ సిద్ధం చేయాలి
సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగు జలాలు అందించే రాచకొండ రిజర్వాయర్కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. రాచకొండ రిజర్వాయర్ నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నాలో రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు మారినా ఎస్ఎల్బీసీ, డిండీ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకం ఎత్తును 440 మీటర్లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు. 436 మీటర్లుగా నిర్ణయించి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు జలాలు అందించాలన్నారు. రాష్ట్రంలో సాగు జాలలు అందని నియోజకవర్గం మునుగోడు ఒక్కటే అన్నారు. ఈ కార్యక్రమాంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి, నాయకులు బచ్చనగోని గాలయ్య, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, పల్లె శేఖర్రెడ్డి, కురుమిద్ద శ్రీనివాస్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ తదితరలున్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
మూడు నెలలుగా బడి మూసివేత
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పలుగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు డిసెంబర్లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పాఠశాల మూతపడే ఉంది. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో విద్యార్థులంతా ఇంటి వద్దే ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు పక్కనే ఉన్న పలుగుతండా ప్రాథమిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని పలుగుతండా వాసులు కోరుతున్నారు. ఉపాధ్యాయురాలి రాజీనామా కొత్తవారిని నియమించకపోవడంతో తెరుచుకోని స్కూల్ -
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
నకిరేకల్ : ‘నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు నాకు రెండు దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. వారి సంక్షేమం కోసం నిరంతరం ఓ సేవకుడిగా పని చేస్తున్నాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం’ అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇతర మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేశామన్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందన్నారు. రూ.101 కోట్లతో అయిటిపాము లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూసీ ప్రాజెక్టు వద్ద మరో వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి విన్నవించానని చెప్పారు. నకిరేకల్ మున్సిపాలిటీతో పాటు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం -
నీలగిరి బడ్జెట్ రూ.281.46 కోట్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.281.46 కోట్ల బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆదివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం మేయర్ బుర్రి చైతన్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చు వివరాలను సభ్యులకు తెలియజేశారు. బడ్జెట్పై కార్పొరేటర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోడంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో వచ్చే ఐదేళ్లలో నల్లగొండను స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తన ధ్యేయమని మేయర్ చైతన్య పేర్కొన్నారు. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో ఐదు సబ్ స్టేషన్ల నిర్మించనున్నామని, శివారు ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.6.49 కోట్లు కేటాయించామని తెలిపారు. పానగల్ బైపాస్ నుంచి సావర్కర్ నగర్, రామగిరి, క్లాక్టవర్ల మీదుగా డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.14.45 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ మేయర్ అమేర్, కార్పొరేటర్లు ఇబ్రహీం, కేసాని వేణుగోపాల్రెడ్డి, నవీన్గౌడ్, అమీనా ఫర్వీన్ సమద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మేయర్ బుర్రి చైతన్య, పాల్గొన్న కార్పొరేటర్లు -
సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వృద్ధురాలు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి గేటు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన చివ్వెంల మండల పరిఽ దిలోని గుంజలూరు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంజలూరు గ్రామానికి చెందిన సుంకరి అంజమ్మ(75) ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి గేటు తెరిచేందుకు ప్రయత్నించగా.. ఇంట్లోకి విద్యుత్ సరఫరా అవుతున్న వైరు గేటు గ్రిల్స్కు ఆనుకోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మృతురాలి మనుమడు సుంకరి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె ఉంది. తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెఆలేరు : ఆలేరు పట్టణంలోని రంగనాయకుల వీధికి చెందిన ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రి, గౌతమి ఉన్నారు. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె గాయత్రి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రి పాడె ముందు కుమార్తె రోదిస్తుండటం చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
భాస్వరం.. భూమికి ముఖ్య పోషకం
పెద్దవూర : భూమికి భాస్వరం ముఖ్యమైన పోషకం. గాలి, నీరులానే మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు సాగు భూమి ద్వారా లభ్యమవుతాయి. వీటిలో నత్రజని, భాస్వరం పోషకాలు తక్కువ పరిమాణంలో, పొటాష్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ పోషకాలు ఇసుక భూములు, మధ్యస్త నేలలు, ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో తక్కువ శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. పోషక పదార్థాల లభ్యత నేల రకాన్ని బట్టి నేల భౌతికస్థితి, రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి పి.సందీప్ తెలిపారు. కరగని రూపంలో భాస్వరం.. సాగవుతున్న భూముల్లో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్న భాస్వరం పోషకం కరగని డైకాల్షియం, ట్రై కాల్షియం ఫాస్ఫేట్ల రూపంలో ఉంది. తేలిక భూముల్లో కంటే బరువు నేల(వరి పండించే డెల్టా భూములు)ల్లో భాస్వరం పోషకం ఎక్కువ శాతం మొక్కలకు అందుబాటులో లేని రూపంలో ఇమిడీకృతమై ఉంది. ఈ నెలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు వాడే భాస్వరపు ఎరువుల్లోని భాస్వరం పోషకం మోనో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. కరిగిన వెంటనే కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లతోనూ రసాయన చర్య జరుగుతుంది. దీని ఫలితంగా అల్యూమినియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఫాస్ఫేట్లుగా మారుతాయి. ఇవి కరగని రూపంలో ఉండి తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల చర్యల వలన మొక్కకు అందుబాటులోకి వస్తాయి. భాస్వరం ఏ మేరకు వాడాలి? భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే సాగులో ఉన్న వివిధ పంటలకు ఎంత భాస్వరం అవసరమో తెలుస్తుంది. దీనిని బట్టి పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా భాస్వరాన్ని అందజేయాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ డీఏపీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులు మొదలగు వాటి ద్వారా భాస్వరాన్ని అందజేయవచ్చు. జీవ ఎరువులతో ఉపయోగాలు జీవ ఎరువులతో బాసిల్లాస్, సూబోమోనాస్ వంటి సూక్ష్మజీవులు ఆస్పర్జిల్లడ్ పెన్సిలియం వంటి శిలీంద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కకు లభ్యత పెంచుతాయి. సిఫార్సు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12కిలోల వరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెందుతాయి. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములను 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి. ప్రాముఖ్యత భాస్వరాన్ని లవణాల రూపంలో మొక్కలు తీసుకుంటాయి. పూలు, విత్తనాలు, దుంపలు తదితర ఆర్థిక ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువే. భూమిలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లేందుకు దోహదపడుతుంది. పంట త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. కణ విభజన, పైరు అభివృద్ధి మొక్క తొందరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైములు తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పంటలకు కలిగే దుష్పలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమైన పిండి పదార్థం తయారు చేసుకునే కిరణజన్య సంయోగక్రియలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ మూలకం లోపిస్తే మొక్కల వేర్ల పెరుగుదల బలహీనమవుతాయి. పంటలో పెరుగుదలతో పాటు పిలకలుపెట్టే శక్తి క్షీణిస్తుంది. పైరు పూతకు రావడం ఆలస్యమై దిగుబడులు ఘణనీయంగా తగ్గుతాయి. భాస్వరం లోపించిన పత్ర హరితం(క్లోరోఫిల్) ఏర్పడకపోవడం వలన ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు కనబడతాయి. మొక్కలు వాతావరణం నుంచి బొగ్గు పులుసు వాయువును తీసుకుని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కలు వాటి తొలిదశలో ఎదిగే భాగాల్లో భాస్వరం అందుబాటులో ఉండటం అవసరం. ఆమ్ల, క్షార భూముల్లో భాస్వరం సరిగ్గా అందుబాటులో ఉండదు. సాగు నేలల్లో భాస్వరం అధికమైనా జింకు లోపం వస్తుంది. ఏ దశలో వేయాలిఫ భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థను అభివృద్ధి పరుస్తుంది. వరి పంటలో నాట్లకు ముందు దమ్ము చేసేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 75–100 కిలోలు, 20 కిలోల యూరియా కలిపి వేయాలి. లేదా వరి నాటిన తర్వాత పది రోజులకు డీఏపీ ప్లస్ యూరియా లేక ఇతర భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. ఫ వర్షాధార మెట్టపంటలకు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలకు ఆఖరి దుక్కిలో వేయాలి. ఫ రైతులు అవసరం లేకున్నా ముఖ్యంగా వరి పంటకు భాస్వరం ఎరువులను రెండు, మూడు పర్యాయాలు వాడుతున్నారు. -
రసవత్తరంగా ఎడ్ల పందేలు
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో రామనవమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రెండోరోజూ రసవత్తరంగా సాగాయి. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మంతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒంగోలు గిత్తలు ఈ పోటీల్లో పాల్గొని బండ లాగాయి. మరో మూడురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమనీనరసింహారావు, మాజీ ఎంపీపీ తిరుమలశెట్టి అప్పయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సయ్యద్ నిజాం, బొబ్బా రవీందర్రెడ్డి, నాగుల్మీరా, నాయుడు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మేడి సామేలు, దస్తగిరి, సంకలమద్ది అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
డ్రగ్స్పై వినూత్నంగా అవగాహన
కోదాడ : మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెంలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో సామాజిక కార్యకర్త, తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో ఉగాది పంచాంగం చెబుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని వినూత్నంగా అవగాహన కల్పిచారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డు న పడుతాయన్నారు. కార్యక్రమంలో వెంకటనా రాయణ, నరేష్, జయకృష్ణ, రవి పాల్గొన్నారు. -
‘డిండి’ పూర్తి చేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి పలువురు సీపీఐలో చేరారు. మెగావత్ భీముడు, వడ్త్యా బాలాజీ, మెగావత్ సందీప్, మెగావత్ పవన్, మెగావత్ భీమా, కొర్ర మున్నా పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో ముదిగొండ మురళీకృష్ణ, ఆర్ అంజయ్య చారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, కోరె సత్తయ్య, ఊరిపాక వెంకటయ్య, దండిగా వెంకటయ్య, గిరి స్వామి, బుషిపాక యాదయ్య, అగ్గిరాజు, దామెర రమేష్ పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య
నకిరేకల్ : తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్గూడెంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాహెబ్గూడేనికి చెందిన నిమ్మల నర్సయ్య తన భార్య, కుమారుడు అక్షయ్(28)తో కలిసి ముంబైలో పాల వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అక్షయ్ జల్సాలకు అలవాటుపడి ఏ పనిచేయకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అక్షయ్ ముంబై నుంచి శనివారం ఉదయం స్వగ్రామం బాబాసాహెబ్గూడేనికి వచ్చాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్చేసి డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు లేవని, ముంబై వచ్చి ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు అక్షయ్కు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ్ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి తండ్రి నిమ్మల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ హరిబాబు తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొని ఒకరు మృతి కొండమల్లేపల్లి : బైక్పై వెళ్తూ ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలానికి చెందిన మాచర్ల రాములు(52) తన భార్య తిరుపతమ్మతో కలిసి పని నిమిత్తం ఆదివారం బైక్పై దేవరకొండకు వచ్చారు. రాత్రి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారుకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. రాములు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో తిరుపతమ్మను దేవరకొండ ప్రభుత్య ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో పూజారి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్ : బైక్పై వెళ్తున్న పూజారిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందం వద్ద జరిగింది. వన్టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రానికి చెందిన కందాల హరికృష్ణ(45) మిర్యాలగూడ పట్టణంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజు ఉదయం మిర్యాలగూడ నుంచి వెళ్లి పాలకీడు మండల కేంద్రంలోని దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి వస్తుంటాడు. ఆదివారం ఉదయం కూడా పూజలు చేయడానికి పాలకీడుకు బైక్పై వెళ్తుండగా.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందం వద్ద లారీ వెనుక నుంచి వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ ఎగిరి రోడ్డుపై పడిపోగా అతడి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుస్తుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యాదగిరీశుడి ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెల వు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు అధికంగా రావడంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామి వారిని సుమారు 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,39,620 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
నల్లగొండ : ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలి పారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా వాణిలో ఆయన దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చి ఇబ్బంది పడొద్దని.. వారి కోసం ప్రతి నెలా 4వ శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ఇక్కడ వారి సమస్యలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
రా రైస్ ఇవ్వాలని ఎఫ్సీఐ నిబంధన.. బాయిల్డ్ రైసే ఇస్తామంటున్న మిల్లర్లు
నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ధాన్యం కల్లాలకు వస్తోంది. కానీ, కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఈ యాసంగిలో సీఎంఆర్గా (కస్టమ్ మిల్లింగ్ రైస్) రా రైస్ మాత్రమే పెట్టాలంటూ ఎఫ్సీఐ నిబంధన పెట్టింది. రా రైస్ సాధ్యం కాదని.. బాయిల్డ్ రైస్ అయితేనే పెడతామని మిల్లర్లు అంటున్నారు. లేదంటే ధాన్యం దించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు. గతంలోనూ నిబంధన యాసంగి సీజన్లో ఎప్పుడైనా బాయిల్డ్ రైస్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా సమయంలో (2022–23) రారైస్ పెట్టాలని అప్పట్లో ఎఫ్సీఐ ఆదేశించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ధాన్యాన్ని మిల్లర్లు తీసుకున్నా.. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ధాన్యాన్ని టెండర్ ద్వారా వేలం వేసింది. దాంట్లో ఏడు మిల్లులు అక్రమాలకు పాల్పడటం వాటిపై కేసులు నమోదు కావడం ఒక మిల్లు యజమానులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్నే తీసుకుంది. తాజాగా మళ్లీ ఈ యాసంగిలో రా రైస్ పెట్టాలంటూ నిబంధన పెట్టింది. 65 శాతం బియ్యం ఇవ్వలేమంటున్న మిల్లర్లు యాసంగి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రా రైస్ ఇవ్వలేమని మిల్లులు చెబుతున్నారు. రా రైస్కు మిల్లింగ్ చేస్తే నూక శాతం పెరుగుతుందని 65 శాతం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని తాము బాయిల్డ్ రైసే ఇస్తామని చెబుతున్నారు. లేదంటే ధాన్యం దిగుమతి చేసుకోలేమని అంటున్నారు. దీంతో జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇది కొలిక్కి వస్తేనే ధాన్యం కొనుగోళు కేంద్రాల ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై రైతులు ధాన్యాన్ని కొందరు కల్లాలకు తెచ్చి ఆరబోస్తుండగా మరికొందరు మిల్లుల్లో అమ్ముకుంటున్నారు.ఎఫ్సీఐ ఈ సీజన్లో రారైస్ ఇవ్వాలని తెచ్చిన నిబంధనపై పునరాలోచన చేయాలి. ఎండ తీవ్రత వల్ల మిల్లింగ్ చేస్తే ఎక్కువ నూక అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో రా రైస్ పెట్టడం సాధ్యం కాదు. ధాన్యం దించుకుంటే మిల్లర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ అయితే నిబంధనల ప్రకారం ఇవ్వగలుగుతాం. ఈ విషయంలో మిల్లర్లంతా ఆలోచన చేసి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తాం. – రేపాల భద్రాద్రి రాములు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫ యాసంగి ధాన్యం సేకరణలో వీడని సందిగ్ధం ఫ మిల్లర్లతో అధికారుల చర్చలు 380 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయంజిల్లా వ్యాప్తంగా యాసంగిలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 4 లక్షల వరకు సన్నాలను మిల్లర్లు నేరుగా కొటారని, 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. మొత్తం 380 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధం చేశారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ 1న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సారి కూడా ఏప్రిల్ 1నే ప్రారంభించే అవకాశం ఉంది. -
బైక్ షోరూమ్కు జరిమానా
నల్లగొండ : బైక్ షోరూమ్కు రూ.లక్షా75 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమి షన్ తీర్పునిచ్చింది. చౌటుప్పల్కు చెందిన బొమ్మ మల్లేష్ 2023లో చౌటుప్పల్లోని హైటెక్ మోటార్స్లో హీరో గ్లామర్ బైక్ కొనుగోలు చేశాడు. బైక్ సరిగ్గా నడవకపోవడంతో షోరూమ్ను సంప్రదించాడు. నిర్వాహకులు స్పందించకపోవడంతో మల్లేష్ నల్లగొండ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి రూ.1.35 వేలు బైక్ ఖరీదు, రూ.30 వేలు జరిమానా, రూ.10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని శనివారం వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. పరిహారాన్ని మొత్తం 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. -
వైభవంగా మహాలక్ష్మి యాగ శోభాయాత్ర
మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో శుక్రవారం త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాలక్ష్మి యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హౌసింగ్బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు వైభవంగా యాగ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, మిల్లర్లు గందె రాము, బండారు కుశలయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాధవి, చిలుకల రవికుమార్, ప్రసాద్, కారంపూడి జానకిరాఘవచార్యులు, గుడిపాటి నాగేందర్, రేపాల పురుశోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి : ఎస్పీ
నార్కట్పల్లి : ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు శ్రీరామ నవమి వేడుకల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలన్నారు. దుకాణాలు రోడ్డుపైకి రాకుండా.. ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ జేరిపోతుల భరత్, ఎస్బీ సీఐ రాము, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్రెడ్డి, పుల్లెంల అచ్చాలు, పుల్లెంల శ్రీనివాస్ ఉన్నారు. -
వానాకాలం 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసింది. అందులో పత్తి 5,13,524 ఎకరాలు, వరి 5,86,137 ఎకరాలు, కంది 14 వేలు, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న 500, గడ్డి జొన్న 200, ఆముదం 500, పెసర 7 వేలు, వేరుశనగ 500తోపాటు ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్కు నివేదించింది. సకాలంలో వర్షాలు కురిసి నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు నిరంతరంగా అందిస్తే వానాకాలం సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎరువులకు ప్రతిపాదనలు.. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన పత్రిపాదనలను జిల్లా వ్యవసాయ శాఖ.. రాష్ట్ర కమిషనరేట్కు నివేదించింది. యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,343 మెట్రిక్ టన్నులు, ఎన్ఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 12,923 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. గత వానాకాలం యాసంగి సీజన్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈసారి ముందస్తుగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వానికి నివేదిక వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ముందుగానే వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి విత్తనాలు 16.81 లక్షల ప్యాకెట్లు (450 గ్రాములు), వరి 1,26,800 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను కావాలని నివేదించింది. కంది 14 వేల క్వింటాళ్లు, పెసర 7వేలు, వేరుశనగ 500 క్వింటాళ్లు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.ఫ అత్యధికంగా వరి 5.86 లక్షలు, పత్తి 5.13 లక్షల ఎకరాలు ఫ అవసరం మేరకు ఎరువులు, విత్తనాలకు ప్రతిపాదనలువానాకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. ప్రైవేట్ కంపెనీల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువుల ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
అవగాహనతోనే విపత్తులను ఎదుర్కోవచ్చు
చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, ఆర్డదో వెలమ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్కుమార్చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ -
నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
నల్లగొండ టూటౌన్: యూనివర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్నానం చేసేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
నల్లగొండ: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్కే ఖాన్, మురళి, మేకల నరసింహ, మల్లేష్, నాగమణి పాల్గొన్నారు. ట్రాక్టర్ చోరీ చేసిన దొంగల అరెస్టునార్కట్పల్లి : ట్రాక్టర్ చోరీ చేసిన ఇద్దరు దొంగలను నార్కట్పల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. గతేడాది ఆగస్టు 7న అర్ధరాత్రి నార్కట్పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన నకరేకంటి రమేష్ ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రమేష్ ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కరచోల గ్రామానికి చెందిన మదన రవీంద్రనాథ్రెడ్డి, ఎన్నిరెడ్డి బాపిరెడ్డి ట్రాక్టర్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ పి. విష్ణుమూర్తి, పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, గిరిబాబును సీఐ కె. నాగరాజు అభినందించారు. -
రిఫ్లెక్టీవ్ టేప్స్తో వాహన యజమానులపై భారం
రామగిరి(నల్లగొండ): ప్రైవేట్ ట్రావెల్ వాహనాలపై రిఫ్లెక్టీవ్ టేప్స్ తప్పనిసరి చేయడంతో వాహన యజమానులపై భారం పడుతుందని నల్లగొండ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐతరాజు రమేష్ అన్నారు. ఈమేరకు గురువారం ట్రాన్స్పోర్ట్ అధికారిణి లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐతరాజు రమేష్ మాట్లాడుతూ.. ట్రావెల్స్ సరిగ్గా నడవకపోవడంతో వాహన యజమానులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని, కొత్తగా రిఫ్లెక్టీవ్ టేప్స్ తప్పనిసరి చేసి రూ.7 వేల వరకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనతో వాహనాలను నడపలేమన్నారు. ప్రభుత్వం వెంటనే రిఫ్లెక్టివ్ టేప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఏడుకొండలు, జానయ్య, శ్రీశైలం, నరేష్, లింగస్వామి, యాదగిరి, ప్రవీణ్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ టూటౌన్: రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతులందరి ఖాతాల్లో జమ చేయాలన్నారు. వరికోతలు ప్రారంభమైనందున ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని, మిగిలినపోయిన వారి రైతు రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వీబీజీ రామ్ జీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ చంద్రశేఖర్కు అందజేశారు. ఆయన వెంట కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, సెంట్రల్ హైదరాబాద్ ఇన్చార్జి వీరెళ్లి చంద్రశేఖర్, భూనిర్వాసితుల సెల్ రాష్ట్ర కన్వీనర్ భవనం మధుసూదన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, కన్మంతరెడ్డి అశోక్రెడ్డి, పోతెపాక లింగస్వామి, గుండా నవీన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు
నార్కట్పల్లి : నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల, అయిటిపాముల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే ఆసరా పెన్షన్లు పెంచలేదని ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అబద్ధపు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి బడ్జెడ్లో కూడా మొండిచేయి చూపిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ సొమ్ముతో దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థానిక నాయకులకు లంచం ఇస్తేనే పని మొదలుపెట్టే పరిస్థితి నెలకొందన్నారు. నేత, గీత కార్మికుల ప్రమాద బీమా సొమ్మును విడుదల చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ అడ్డదారిలో ముఖ్యమంత్రి సీటులో రేవంత్రెడ్డి కూర్చున్నాడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బైరెడ్డి కరుణాకరరెడ్డి, కరణం బలరాం, కొండూరు శంకర్, వాజీదు అలీ, దోసపాటి విష్ణుమూర్తి, శ్రీనివాస్రెడ్డి, కొత్త నర్సింహా, కర్నాటి ఉపేందర్, పోగుల నర్సింహా, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్ సీసీఎఫ్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్ వ్యూ పాయింట్ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్ అటవీ సీసీఎఫ్ సునీల్ హీరావత్, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్, సాగర్ డీఎఫ్ఓ సంగీత, శ్రీనివాసరావు ఉన్నారు. మహిళా సర్పంచ్ పై దాడినాంపల్లి : భూ తగాదాలో భాగంగా మహిళా సర్పంచ్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లపురాజుపల్లి గ్రామ సర్పంచ్ మంటిపల్లి మణిమాలకి, అదే గ్రామానికి చెందిన చినముత్తయ్య మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఐదు రోజుల క్రితం సర్పంచ్ మణిమాలకు సంబంధించిన భూమిలో చినముత్తయ్య ట్రాక్టర్తో దున్నడంతో సర్పంచ్, ఆమె భర్త శ్రీశైలం కలిసి ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో చినముత్తయ్య ఆగ్రహంతో సర్పంచ్ మణిమాల, ఆమె భర్తపై దాడికి దిగాడు. సర్పంచ్కు తీవ్రగాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె. లింగారెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మర్రిగూడ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన నాగిళ్ల బాబయ్య(37) తుఫాన్ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి వ్యవసాయ పొలంలోకి సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చేందుకు మంగళవారం రాత్రి ఆటోలో కుర్మేడు గేట్ నుంచి చింతపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని మర్రిగూడ మండలం వెంకటేశ్వర్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
నకిలీ బ్రాండ్లతో బియ్యం సరఫరా..
ఫ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్ బియ్యం వ్యాపారులు మిర్యాలగూడ అర్బన్ : నకిలీ బ్రాండ్ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్టౌన్ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది. మార్కెట్లో కాకరకు దక్కని రేటుఫ పశువులు, గొర్రెలకు మేతగా వదిలేసిన రైతు పెద్దవూర : మండలంలోని బట్టుగూడేనికి చెందిన రైతు కూన్రెడ్డి మధుసూదన్రెడ్డి రెండెకరాల్లో కాకర సాగు చేశాడు. పంట చేతికి వచ్చాక విక్రయించటానికి మార్కెట్కు వెళ్లగా కిలో రూ.10 అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తీగ పందిరిపై సాగు చేసిన కాకరకాయలకు మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉందని, కిలో రూ.10కి విక్రయిస్తే కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా రావని కాకర పంటలో పశువులు, గొర్రెలను మేపుతున్నట్లు తెలిపారు. -
విద్యకు అధిక ప్రాధాన్యం
కనగల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని తెలిపారు. నల్లగొండలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించామని, నర్సింగ్ కళాశాల నిర్మాణం డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దర్వేశిపురం నుంచి గుర్రంపోడు మీదుగా రూ. 180 కోట్లతో చేపట్టే రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామన్నారు. కనగల్ చౌరస్తా నుంచి అసంపూర్తిగా ఉన్న రహదారిని సరి చేసేందుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రేగట్టె వరకు రూ.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, పగిడిమర్రి మీదుగా ముశంపల్లి వరకు రూ.100 కోట్లతో రోడ్డు మంజూరైందన్నారు. రూ.కోటి 20 లక్షలతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏర్పాటు, మరో రూ.16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీఐఈఓ దశ్రు నాయక్, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ: ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్లో గురువారం ఆయన తన ఛాంబర్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయ సముద్రం, మాద ఎడవల్లి, శివన్నగూడెం, అంబ భవాని, డిండి, నక్కలగండి, ఏకేబియర్, పెండ్లిపాకల చింతచెట్టు తండా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల అంశాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, రైతులకు సమయానికి పరిహారం చెల్లించాలన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పునరావాసం పొందిన కుటుంబాలకు అన్ని సదుపాయాలు అందించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి నల్లగొండ: నల్లగొండలోని కలెక్టరేట్లో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెలా చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు వయో వృద్ధుల జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలు తెలపొచ్చని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు రామగిరి(నల్లగొండ): కంప్యూటర్ సైన్స్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని నాగార్జునసాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొబ్బిలి రాజా అన్నారు. గురువారం ఎన్జీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ, అవకాశాలు’ అనే అంశంపై విస్తృతోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ని సమన్వయం చేసుకుంటూ రాణించాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో లభిస్తున్న ఉద్యోగ అవకాశాలపై వివరించారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సదస్సు ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు కెరీర్ ఎంపికలో స్పష్టత కలిగించడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇన్చార్జ్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, సీఓఈ మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ రామగిరి(నల్లగొండ): లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారానికి శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ (పూర్తి అదనపు బాధ్యతలు) పురుషోత్తంరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్లగొండకు అన్యాయం చేయొద్దునల్లగొండ టౌన్ : డిండి ఎత్తిపోతల పథకం విషయంలో నల్లగొండకు అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారమే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఏదుల వద్ద 436 మీటర్ల నీటి మట్టం నుంచే డిండికి నీటిని తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం 440 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని తీసుకోవాలంటే తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలిపెద్దవూర : అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణావత్ సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్లను గురువారం పెద్దవూరలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు షబ్బీర్, కృష్ణ, శ్రీనునాయక్, ఎండీ.షాహీన్ బేగం, రాంరెడ్డి, డి.సైదులు, షాహదా బేగం, జ్యోతి పాల్గొన్నారు. -
పన్ను కట్టకుంటే.. ఆస్తి జప్తే!
రెడ్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నల్లా కనెక్షన్లు కట్ చేయడంతో పాటు, ఆయా నిర్మాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆస్తి పన్నుల వసూళ్ల నిమిత్తం విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై నాన్–బెయిల బుల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులకు ఆటంకం కలిగించిన పట్టణానికి చెందిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిర్యాలగూడ టౌన్ : ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పన్ను చెల్లింపునకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండటంతో వసూళ్లను ముమ్మరం చేశారు. పన్నులు కట్టని వారి ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీర్ఘకాలికంగా పన్నులు ఎగవేస్తున్న దాదాపు 500 మందికి ఇప్పటికే అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి ఇళ్ల వద్దకు నేరుగా ఈ జప్తు వాహనాన్ని పంపి చర్యలు తీసుకోనున్నారు. 34 బ్లాక్లుగా విభజన మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి మొత్తం 26,518 అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.20 కోట్ల 53 లక్షల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా.. ఈ నెల 22వ తేదీ నాటికి రూ.7 కోట్ల 30 లక్షల 63 వేలు మాత్రమే ఖజానాకు చేరింది. ఇంకా రూ.13 కోట్ల 22 లక్షల 67 వేల మేర బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31 నాటికి వంద శాతం ఆస్తి పన్ను వసూలైతే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15 కోట్ల వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల వసూళ్ల కోసం 48 వార్డులను 34 బ్లాక్లుగా విభజించారు. మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ), రెవెన్యూ ఇన్స్పెక్టర్ల(ఆర్ఐ) పర్యవేక్షణలో బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచే రూ. 2 కోట్లు.. మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్పీ, రైల్వే తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు సుమారు 520 వరకు ఉన్నాయి. వీటి నుంచే మున్సిపాలిటీకి రూ.2 కోట్లకు పైగా పన్నులు రావాల్సి ఉంది. మరోవైపు, బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుందనే ఆశతో కొందరు పన్నుల చెల్లింపును దాటవేస్తున్నారు. దీంతో వార్డు అధికారులు ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు.ఫ మొండి బకాయిదారుల ఇళ్ల ముందుకు ‘జప్తు వాహనం’ ఫ మిర్యాలగూడలో 500 మందికి రెడ్ నోటీసులు ఫ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే కేసులే మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లకు ఇప్పటికే జప్తు వాహనం ఏర్పాటు చేశాం. ఆస్తి పన్నులు చెల్లించాలంటూ వార్డుల్లో డప్పు చాటింపు చేయిస్తున్నాం. పన్నుల వసూళ్లకు 9 మందితో కూడిన టీమ్ వేయగా.. ఒక ఆర్ఓ, ముగ్గురు ఆర్ఐలు పర్యవేక్షిస్తున్నారు. వంద శాతం ఆస్తి పన్నులు వసూలైతేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయక తప్పదు. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మట్లాడుతూ పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. అనంతరంకలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి, నాయకులు యుగేందర్రెడ్డి, వెంకటరెడ్డి, మోహన్రావు, రంగయ్య, శ్రీశైలం, యాదగిరి, ఆంజనేయులు ఉన్నారు. -
ఫుల్ ట్యాంక్ కోసం తిప్పలు
సాక్షి ప్రతినిది, నల్లగొండ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు ముందస్తుగా జాగ్రత పడుతున్నారు. యుద్ధం కారణంగా భవిష్యత్లో మన దేశంలో కూడా ఇబ్బందులు తప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించడంతో ఇక పెట్రోల్, డీజిల్కు ఇబ్బందులు తప్పవేమోనన్న ఆలోచనల్లో ప్రజలు పడ్డారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా వాహనదారులంతా పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద బారులుదీరి ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. దీంతో వచ్చిన డీజిల్, పెట్రోల్ త్వరగా అయిపోతుండటంతో బంకుల యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. పెట్రోలు, డీజిల్కు ముందస్తు జాగ్రత్తలు యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందన్న విషయం ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం ఇంధన కొరత లేకున్నా యుద్ధం కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడవుతాయని ప్రజలు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో బైక్లు, ఆటోలు, కార్లు, ఇతరత్రా వాహనాలు పెట్రోలు, డీజిల్ కోసం బంక్ల వద్ద బారులుదీరాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిస్థితి కనిపించింది. ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేయాలంటూ బంక్ సిబ్బందిని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. జిల్లాలో 180 పెట్రోలు, డీజిల్ బంక్లు ఉన్నాయి. వీటికి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ కంపెనీల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇందన కొరత లేదు. వాహనదారులు భయంతో వాహనాలను ఫుల్ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీనివల్ల పెట్రోలు, డీజిల్ నిల్వలు అయిపోతున్నాయి. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. వాహనదారులు గమనించి అవసరం ఉన్నంత వరకే పెట్రోల్ పోయించుకోవాలి. – వెంకటేశం, డీఎస్ఓ, నల్లగొండ ఫ యుద్ధ ప్రభావంతో వాహనదారుల ముందు జాగ్రత్త ఫ పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద తంటాలు ఫ క్రెడిట్ విధానం తొలగించడంతో ట్యాంకర్ల రాకలో జాప్యం ఫ ఫలితంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు -
రుణ లక్ష్యాన్ని పూర్తిచేయాలి
నల్లగొండ : ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డీఆర్డీఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు విద్యా రుణాలపై దృష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజీ, మెప్మా,సెర్ప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం నాబార్డ్ ఆధ్వర్యంలో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16,861 కోట్లతో రూపొందించిన శ్రీసామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక్ఙ (పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026– 27) బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డ్ డీడీఎం వినయ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. -
పాత సామగ్రి వేలం
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత సామగ్రిని బుధవారం వేలం వేవారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ టెండర్దారుల సమక్షంలో పారదర్శకంగా వేలం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, మోటర్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్, అడ్మిన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీఈడీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోట్ అయ్యారు. మూడవ సెమిస్టర్లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 269 మంది ప్రమోటయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.ఉపేందర్రెడ్డి తెలిపారు. -
ప్రజావాణిలో వినతుల వెల్లువ
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కార నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 83 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, ఇతర శాఖలకు 43 వచ్చాయని తెలిపారు. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి ప్రజావాణి అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామసభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సీపీఓకు సమర్పించాన్నారు. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, పంచాయతీలను సందర్శించి ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు చురుకుగా సాగేలా చూడాలన్నారు. జనగణనకు ఎన్యుమరేషన్ బ్లాక్లను నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలని ఆదేశించారు. జంతు సంరక్షణలో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబీసీ స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎస్సీల అభివృద్ధికి ఊతం
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 1,368 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు గాను అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారమే చివరి తేదీగా యంత్రాంగం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం.. జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 654 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 676 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 38 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు. నేటివరకే దరఖాస్తు గడువు.. అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అర్హతలు, నిబంధనలు ఇలా.. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళితబంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటిలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఫ 2025–26 ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక ఖరారు ఫ జిల్లాకు 1,368 యూనిట్లు మంజూరు ఫ వ్యవసాయ, రవాణా రంగాలకు ప్రాధాన్యం ఫ ఆన్లైన్లో దరఖాస్తుకు నేడు చివరి తేదీ జిల్లాకు కేటాయింపులు ఇలా.. యూనిట్ లక్ష్యం ఈవీ టూ వీలర్స్ 654ఈవీ త్రీ వీలర్స్ 676సోలార్ పంప్ సెట్లు 38 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90శాతం, రూ.3లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది. -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
నల్లగొండ టౌన్ : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.సలీం, దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, సత్యనారాయణ, నాగమణి, బొందు పార్వతి, అవుట రవీందర్, విజయలక్ష్మి, అంబటి మన్నెమ్మ, ఫాతిమా, ఇంద్రగంటి సైదమ్మ, పి.సరిత, మనిరూప, పరిపూర్ణమ్మ, యాదమ్మ, డి.కళ్యాణి ,ఎల్లమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలి
ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం నకిరేకల్ : బస్వాపూర్ రిజర్వాయర్ను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో సూమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. మూసీ నదిపైన వంతెన పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన నల్లగొండ టూటౌన్ : మహిళా సంఘాల పేరుతో రూ.కోటీ 49 లక్షలను ఐసిఐసిఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్, కేశరాజుపల్లికి చెందిన ఆర్పీ స్వాహా చేశారని ఆరోపిస్తూ కేశరాజుపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం నల్లగొండలోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కేశరాజుపల్లి ఆర్పీ తమకు ఎలాంటి సంబంధం లేకుండా సంఘానికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకొని రుణాలు ఎత్తుకున్నట్లు ఆరోపించారు. బ్యాంకు యాజమాన్యం తమకు నోటీసులు ఇవ్వడంతో ఆ విషయం బయటపడిందని.. బ్యాంకులో ఎలాంటి ఖాతాలు లేకుండా మాకు సంబంధం లేకుండా రుణాలు ఎలా ఇస్తారని బ్యాంకు ముందు నిరసన తెలిపామన్నారు. పొదుపు ఖాతాలకు ఐసీఐసీఐ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని యూనియన్ బ్యాంకులో తమ పొదుపులు ఉన్నాయని తెలిపారు. వెంటనే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ ఎస్ఐ మానస అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి విన్నవించారు. వారి ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ వాటిని పరిశీలన నిమిత్తం సంబంధిత పోలీస్ అధికారులకు పంపి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ద్వితీయశ్రేణిలో నిరుత్సాహం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పూర్తి స్థాయి కార్యవర్గంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పార్టీ సంస్థాగత నిర్మాణంపై జాప్యం జరుగుతోంది. దీంతో జిల్లా పార్టీ కార్యవర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశ తప్పడం లేదు. నాలుగు నెలల కిందటే జిల్లా అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధిష్టానం ఆయా జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేయడంలో వెనుకబడింది. ఇటీవల టీపీసీసీ 14 జిల్లాలకు మాత్రమే పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించగా.. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాలను ప్రకటించలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న వారికి ఉత్కంఠ తప్పడం లేదు. పెండింగ్లో రెండు జిల్లాల కార్యవర్గాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2025 నవంబర్ 22వ తేదీన డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన పున్న కై లాష్ నేత, సూర్యాపేట జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్య, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను జిల్లా అధ్యక్షులుగా నియమించింది. తరువాత వెంటనే జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ అందులో జాప్యం జరగడంతో అధిష్టానం కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఆయా డీసీసీల పూర్తిస్థాయి కార్యవర్గాల ప్రకటనపై టీపీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కార్యవర్గాన్ని ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కమిటీలను పెండింగ్లో పెట్టింది. ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించని అధిష్టానం ఫ యాదాద్రి జిల్లాకు ఇటీవల కమిటీ వేసిన టీపీసీసీ ఫ డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు.. ఫ జిల్లా కమిటీల్లో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపు -
సేదదీరడానికి వచ్చి.. శవమై తేలి..
కట్టంగూర్ : కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సేదదీరడానికి స్విమ్మింగ్ పూల్కు వచ్చిన మాజీ సైనికుడు అందులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) ఆదివారం కట్టంగూర్లో తన అత్తగారింటికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. సాయంత్రం సేదదీరడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఈదులూరు రోడ్డులో గల ఎంఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. స్విమింగ్ చేస్తూ నీరు తాగడంతో నీటిలో మునిగిపోయాడు. చాలాసేపటి వరకు బయటకు రాకపోవటంతో గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు జనార్దన్ను బయటకు లాగారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినా అప్పటికే అతడు మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో బెల్లి జనార్దన్ మృతదేహంపై ప్రజా గాయని, ఉద్దీపని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వేముల పుష్ప పూలమాల వేసి నివాళులర్పించారు. ఫ స్విమ్మింగ్ పూల్లో మునిగి మాజీ సైనికుడు మృతి ఫ కట్టంగూర్ మండల కేంద్రంలో ఘటన -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
చందంపేట : బైక్పై వెళ్తున్న యువకుడిని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన బుడిగపాక దశరథం(27) టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి నేరెడుగొమ్ము నుంచి దేవరకొండకు బైక్పై వస్తుండగా.. మార్గమధ్యలో తిమ్మాపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య బుడిగపాక అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. విద్యార్థినిని వేధిస్తున్న రేడియోగ్రాఫర్ తొలగింపునల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న పారామెడికల్ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్న రేడియోగ్రాఫర్ను విధుల నుంచి తొలగించారు. సదరు విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు ఆస్పపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి.. ఆర్ఎంఓతో కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణలో రేడియోగ్రాఫర్ విద్యార్థినిని వేధించినట్లు రుజువు కావడంతో అతడిని విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రేడియోగ్రాఫర్ను ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. భారీగా నల్లబెల్లం, పటిక పట్టివేతదేవరకొండ : నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటికను నాగర్ర్నూల్ జిల్లాలోని చారకొండ నుంచి దేవరకొండకు ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తుండగా.. దేవరకొండ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 1800 కిలోల నల్లబెల్లం, 70 కిలోల పటికతో పాటు 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు సంతోష్, కిషన్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ అధికారులు శేఖర్రెడ్డి, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతపెన్పహాడ్ : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో పొలిశెట్టి ఉపేంద్ర ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఆమైపె కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామా చేసి బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
మాఫీ రాలే.. వసూలు కాలే!
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్ పడుతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, చండూరు, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్ మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిదారులు వడ్డీ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మార్చి చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల క్రితమే జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బకాయిలపై వడ్డీ మాఫీ చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మార్చి చివరి వారం వస్తున్నా నేటికీ వడ్డీ మాఫీ ప్రకటన రాకపోడంతో బకాయిదారులు ఆస్తి పన్ను చెల్లిచడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని స్థానిక అధికారులు, సిబ్బంది ప్రతిరోజు కాలనీల్లో తిరుగుతున్నారు. కానీ బకాయిలతో సహా ఆస్తి పన్ను ముందుగా చెల్లించడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని పలువురు భవన యాజమానులు చెబుతున్నారు. 50 శాతం కూడా వచ్చే అవకాశం లేదు ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరిని ఆస్తి పన్ను వసూలు కోసం గల్లీ గల్లీ తిప్పుతారు. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టినా మార్చి చివరి నాటికి 70 శాతం నుంచి 95 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడం అంత సులభం కాదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. కనీసం 50 శాతం కూడా వసూలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తే ఆస్తి పన్ను ఎక్కువగా వసూలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్ ఫ జీహెచ్ఎంసీలో 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఫ జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఫ వడ్డీ మాఫీ రాకుండా పన్ను చెల్లింపునకు భవన యజమానుల విముఖత నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.17 కోట్లు వసూలు చేశారు. ఈసారి రూ.19 కోట్లు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. కానీ ఇప్పటి వరకు రూ.13 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ. 6 కోట్లు వసూలు కావల్సి ఉంది. ఈ పది రోజుల్లో రూ.6 కోట్లు వసూలు అయ్యేది కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఎలాంటి వడ్డీ మాఫీ వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్ చేస్తాం. బకాయిదారులంతా పన్ను చెల్లించాలి. – శరత్చంద్ర, కార్పొరేషన్ కమిషనర్ -
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
యాదగిరిగుట్ట ప్రధానార్చకుడిపై చర్యలు తీసుకోవాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతా శౌచంతో పాల్గొని పూజలు నిర్వహించిన ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులుపై చర్యలు తీసుకోవాలని ఈఓ భవానీ శంకర్కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. కాండూరు వెంకటాచార్యులు సొంత బంధువు కాండూరి భార్గవ్కు శిశువు జన్మించగా.. హిందూ సాంప్రదాయం ప్రకారం శిశువు జన్మించిన రోజు నుంచి ఆ కుటుంబానికి చెందిన వారికి పది రోజుల పాటు జాతక శౌచం ఉంటుందని, అయినప్పటికీ ఫిబ్రవరి 25న స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆయన జరిపించారని నల్ల రాధాకృష్ణ ఆరోపించారు. కాండూరి వెంకటాచార్యులుతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసచార్యులు సైతం శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సైతం ఆయన మైలలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై దేవాదాయశాఖ అధికారులు ఐఏఎస్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో దళిత సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్ద యుగంధర్, తెలంగాణ సీనియర్ సిటిజనన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమాండ్ల విష్ణు, టేకి రాజశేఖర్, వీహెచ్పీ కొమ్మగళ్ల వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్ కనుకుంట్ల విజయకుమార్, బీజేపీ నాయకులు బొల్లం చంద్రమౌళి, మన్నెం నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ జాతక శౌచంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారు ఫ ఈఓ భవానీ శంకర్కు విన్నవించిన వివిధ సంఘాల నాయకులు -
వడదెబ్బ నుంచి పశు సంరక్షణ ఇలా..
గుర్రంపోడు : వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు వడదెబ్బతో మృతిచెందే ప్రమాదం ఉంది. వడదెబ్బ నుంచి పశువులను రక్షించుకునేందుకు గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరాం రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు.. ● ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులు ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి ● వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభా వం వల్ల చూలు పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పశువుల్లో పునురుత్పత్తి పక్రియ కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా ... వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానకి పలుమార్లు కడగాలి. తాగునీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షక్షన్లు వేయించాలి. రక్తంలోని సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోరైట్స్ అందిస్తే పశువులు నీరసం నుంచి బయటపడతాయి. వడదెబ్బ నివారణకు మందస్తు చర్యలు ● వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళ మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈదనివ్వాలి. ●గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తైన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి మధ్యాహ్నం వేళల్లో నీరు చల్లాలి. ● వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డు పైన వరిగడ్డి వేసి మధ్యాహ్నం వేళ నీరివ్వాలి. ● షెడ్డుల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడగాల్పుల నుంచి తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. ● పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. ● పశువులకు గోమర్లు లేకుండా చూసుకోవాలి. ● పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. -
వాటర్ ట్యాంకర్తో వరి పొలానికి నీరు
రాజాపేట : ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్నారు. రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొందుగుల గ్రామానికి చెందిన రైతు మర్ల నాగరాజు తన పొలానికి వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతుండటం గమనించారు. నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వరి పంట వేశానని, నీళ్లు లేక పంట ఎండిపోతుందని సదరు రైతు నాగరాజు సీపీఐ నాయకులు తెలిపాడు. నిత్యం ఒక్కో వాటర్ ట్యాంకర్కు రూ.1500 చొప్పున చెల్లిస్తూ రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని చివరి దశలో ఉన్న తన వరి పొలానికి అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని వివరించాడు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిగుళ్ల లింగం తదితరులు పాల్గొన్నారు. -
ఇది ఉద్యమనామ సంవత్సరం
సూర్యాపేట అర్బన్ : ఇది ఉద్యమనామ సంవత్సరం అని, ప్రజా సమస్యలపై సీపీఐ శ్రేణులు రాజీలేని పోరాటం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడపగడపకు సీపీఐ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని, పంటలు ఎండిపోకుండా నీరందించేలా అధికారులతో మాట్లాడాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రజలను సమీకరించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు. కొత్తగా రెండు లక్షల మందికి రేషన్ కార్డులు, మరో రెండు లక్షల మందికి పెన్షన్లు అందిస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, అర్హులైన వారికి ఆ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. మే నెలలో కూడా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కంబాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు ధూళిపాళ ధనుంజయనాయుడు, మేకల శ్రీనివాసరావు, యల్లంల యాదగిరి, మండవ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బత్తినేని హనుమంతరావు, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి పాల్గొన్నారు ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి -
నేటి నుంచి ‘ఓపెన్’ ప్రాక్టికల్ తరగతులు
రామగిరి(నల్లగొండ) : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రాక్టికల్ తరగతులు నల్లగొండ ఎన్జీ కాలేజీలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్కుమార్ తెలిపారు. ఐదో సెమిస్టర్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, బొటనీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తరగతులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఒకటి, మూడో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికట్టంగూర్ : యువకులు దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన గుండు నాగరాజు(35)తో ఈ నెల 6న ఇద్దరు యువకులు ఘర్షణ పడి అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. ఆదివారం మృతుడి అన్న పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. రవీందర్ తెలిపారు. -
బస్వాపురం రిజర్వాయర్లో పడి యువకుడు..
యాదగిరిగుట్ట రూరల్ : బస్వాపురం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన సి. అభిలాష్ (26) ఐకేఈ మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం అభిలాష్తో పాటు అతడితో పనిచేసే మహిపాల్, రిషి, విజయ్, ప్రశాంత్, శర్మ, అజయ్ కలిసి భువనగిరి పట్టణ పరిధిలోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం స్నేహితులంతా కలసి సరదాగా కాలక్షేపం చేశారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరి పరిధిలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్ను సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో లప్పానాయక్ తండా పరిధిలోని దుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న ప్రాజెక్టు నీటి వద్దకు వెళ్లారు. అభిలాష్ ఈత కొట్టడానికి నీటిలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు అభిలాష్ను బయటకు తీసుకొచ్చే లోపే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐల య్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు అండెం సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, జనగాం ఉపేందర్రెడ్డి, పోతంశెట్టి మంజుల, కసుబ శ్రీనివాసరావు, పులి అనిల్కుమార్, పిట్టల బాల్రాజ్, పోతంశెట్టి వెంకటేశ్, ఎడ్ల సత్తిరెడ్డి, సుర్వి వేణుగౌడ్, గోలి పింగల్రెడ్డి, కూర వెంకటేశ్ పాల్గొన్నారు. అమెరికాకు వత్తాసు పలకడం తగదుఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
నిమ్మకాయలు కిలో రూ.100
నడిగూడెం : నడిగూడెం, కరివిరాల, చెన్నకేశ్వాపురం నిమ్మ మార్కెట్లలో నిమ్మ కాయల ధర వారం రోజులుగా కిలోకు రూ.100 పలుకుతోంది. రూ.70 ఉన్న ధర ఒక్కసారిగా అదనంగా రూ.30 పెరగడంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంతో పాటు, చెన్నకేశ్వాపురం, వేణుగోపాలపురం, కరివిరాల, బృందావనపురం, రామాపురం, యఖలాస్ఖాన్పేట తదితర గ్రామాలలో దాదాపు 2500 ఎకరాలకు పైగా నిమ్మ సాగులో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకు ఈ ఏడాది తెగుళ్లతో పాటు, నల్లి, తామర పురుగులు ఆశించాయి. దీనికి తోడు వాతావరణంలో మార్పుల్లో భాగంగా పొగ మంచుకురవడం, రాత్రి వేళలో చలి తీవ్రంగా ఉండడంతో పంట దిగుబడి, కాతపై ప్రభావం పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. పూత, కాత సరిగ్గా రాకపోవడంతో పంట దిగుబడులు పడిపోయాయని ఆందోళ వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గినప్పటికి నిమ్మకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


