ఉన్నత విద్యావంతుల గెలుపు
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసిన ఉన్నత విద్యావంతులు విజయం సాధించారు. సాగర్కు చెందిన మంద గౌతమి ఎమ్మెస్సీ బీఈడీ చేసి ప్రభుత్వ గురుకుల విద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆమె 4వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలలో ఆమె భర్త మంద రఘువీర్ ఇదే వార్డునుంచిగెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 12వ వార్డుకు చెందిన మానస స్వర్ణ ఎంఏ, బీఈడీ చేశారు. ఆమె గత ఎన్నికలలో ఇదే వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఈ సారి విజయం సాధించారు. వీరిద్దరూ మున్సిపల్ చైర్పర్సన్ రేస్లో ఉన్నారు.
ఉన్నత విద్యావంతుల గెలుపు
ఉన్నత విద్యావంతుల గెలుపు


