Nalgonda District News
-
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
నకిరేకల్ : ‘నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు నాకు రెండు దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. వారి సంక్షేమం కోసం నిరంతరం ఓ సేవకుడిగా పని చేస్తున్నాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం’ అని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇతర మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేశామన్నారు. నకిరేకల్ మండలం కడపర్తిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందన్నారు. రూ.101 కోట్లతో అయిటిపాము లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మూసీ ప్రాజెక్టు వద్ద మరో వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి విన్నవించానని చెప్పారు. నకిరేకల్ మున్సిపాలిటీతో పాటు, అన్ని మండల కేంద్రాలు, గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.ఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం -
నీలగిరి బడ్జెట్ రూ.281.46 కోట్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.281.46 కోట్ల బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశం మందిరంలో ఆదివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం మేయర్ బుర్రి చైతన్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ చైతన్య ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చు వివరాలను సభ్యులకు తెలియజేశారు. బడ్జెట్పై కార్పొరేటర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోడంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో వచ్చే ఐదేళ్లలో నల్లగొండను స్మార్ట్ సిటీగా తయారు చేయడమే తన ధ్యేయమని మేయర్ చైతన్య పేర్కొన్నారు. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో ఐదు సబ్ స్టేషన్ల నిర్మించనున్నామని, శివారు ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.6.49 కోట్లు కేటాయించామని తెలిపారు. పానగల్ బైపాస్ నుంచి సావర్కర్ నగర్, రామగిరి, క్లాక్టవర్ల మీదుగా డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ కోసం మంత్రి కోమటిరెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.14.45 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ మేయర్ అమేర్, కార్పొరేటర్లు ఇబ్రహీం, కేసాని వేణుగోపాల్రెడ్డి, నవీన్గౌడ్, అమీనా ఫర్వీన్ సమద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మేయర్ బుర్రి చైతన్య, పాల్గొన్న కార్పొరేటర్లు -
‘డిండి’ పూర్తి చేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి పలువురు సీపీఐలో చేరారు. మెగావత్ భీముడు, వడ్త్యా బాలాజీ, మెగావత్ సందీప్, మెగావత్ పవన్, మెగావత్ భీమా, కొర్ర మున్నా పార్టీలో చేరినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో ముదిగొండ మురళీకృష్ణ, ఆర్ అంజయ్య చారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, కోరె సత్తయ్య, ఊరిపాక వెంకటయ్య, దండిగా వెంకటయ్య, గిరి స్వామి, బుషిపాక యాదయ్య, అగ్గిరాజు, దామెర రమేష్ పాల్గొన్నారు. -
యాదగిరీశుడి ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెల వు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులు అధికంగా రావడంతో ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామి వారిని సుమారు 40వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.41,39,620 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
రసవత్తరంగా ఎడ్ల పందేలు
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో రామనవమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రెండోరోజూ రసవత్తరంగా సాగాయి. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మంతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఒంగోలు గిత్తలు ఈ పోటీల్లో పాల్గొని బండ లాగాయి. మరో మూడురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమనీనరసింహారావు, మాజీ ఎంపీపీ తిరుమలశెట్టి అప్పయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సయ్యద్ నిజాం, బొబ్బా రవీందర్రెడ్డి, నాగుల్మీరా, నాయుడు ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ మేడి సామేలు, దస్తగిరి, సంకలమద్ది అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య
నకిరేకల్ : తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబాసాహెబ్గూడెంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబాసాహెబ్గూడేనికి చెందిన నిమ్మల నర్సయ్య తన భార్య, కుమారుడు అక్షయ్(28)తో కలిసి ముంబైలో పాల వ్యాపారం చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. అక్షయ్ జల్సాలకు అలవాటుపడి ఏ పనిచేయకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అక్షయ్ ముంబై నుంచి శనివారం ఉదయం స్వగ్రామం బాబాసాహెబ్గూడేనికి వచ్చాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్చేసి డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు లేవని, ముంబై వచ్చి ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు అక్షయ్కు సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ్ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మృతుడి తండ్రి నిమ్మల నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ హరిబాబు తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొని ఒకరు మృతి కొండమల్లేపల్లి : బైక్పై వెళ్తూ ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలానికి చెందిన మాచర్ల రాములు(52) తన భార్య తిరుపతమ్మతో కలిసి పని నిమిత్తం ఆదివారం బైక్పై దేవరకొండకు వచ్చారు. రాత్రి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో దేవరకొండ మండలం బొడ్డుపల్లి గ్రామ శివారుకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. రాములు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో తిరుపతమ్మను దేవరకొండ ప్రభుత్య ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో వృద్ధురాలు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి గేటు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన చివ్వెంల మండల పరిఽ దిలోని గుంజలూరు గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంజలూరు గ్రామానికి చెందిన సుంకరి అంజమ్మ(75) ఆదివారం తెల్లవారుజామున తన ఇంటి గేటు తెరిచేందుకు ప్రయత్నించగా.. ఇంట్లోకి విద్యుత్ సరఫరా అవుతున్న వైరు గేటు గ్రిల్స్కు ఆనుకోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మృతురాలి మనుమడు సుంకరి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె ఉంది. తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెఆలేరు : ఆలేరు పట్టణంలోని రంగనాయకుల వీధికి చెందిన ఎలగల శ్రీనివాస్(48) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు గాయత్రి, గౌతమి ఉన్నారు. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె గాయత్రి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రి పాడె ముందు కుమార్తె రోదిస్తుండటం చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. -
సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పూజారి దుర్మరణం
మిర్యాలగూడ అర్బన్ : బైక్పై వెళ్తున్న పూజారిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందం వద్ద జరిగింది. వన్టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రానికి చెందిన కందాల హరికృష్ణ(45) మిర్యాలగూడ పట్టణంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజు ఉదయం మిర్యాలగూడ నుంచి వెళ్లి పాలకీడు మండల కేంద్రంలోని దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి వస్తుంటాడు. ఆదివారం ఉదయం కూడా పూజలు చేయడానికి పాలకీడుకు బైక్పై వెళ్తుండగా.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందం వద్ద లారీ వెనుక నుంచి వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో హరికృష్ణ ఎగిరి రోడ్డుపై పడిపోగా అతడి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుస్తుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భాస్వరం.. భూమికి ముఖ్య పోషకం
పెద్దవూర : భూమికి భాస్వరం ముఖ్యమైన పోషకం. గాలి, నీరులానే మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు సాగు భూమి ద్వారా లభ్యమవుతాయి. వీటిలో నత్రజని, భాస్వరం పోషకాలు తక్కువ పరిమాణంలో, పొటాష్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ పోషకాలు ఇసుక భూములు, మధ్యస్త నేలలు, ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో తక్కువ శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. పోషక పదార్థాల లభ్యత నేల రకాన్ని బట్టి నేల భౌతికస్థితి, రసాయన లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని మండల వ్యవసాయ శాఖ అధికారి పి.సందీప్ తెలిపారు. కరగని రూపంలో భాస్వరం.. సాగవుతున్న భూముల్లో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్న భాస్వరం పోషకం కరగని డైకాల్షియం, ట్రై కాల్షియం ఫాస్ఫేట్ల రూపంలో ఉంది. తేలిక భూముల్లో కంటే బరువు నేల(వరి పండించే డెల్టా భూములు)ల్లో భాస్వరం పోషకం ఎక్కువ శాతం మొక్కలకు అందుబాటులో లేని రూపంలో ఇమిడీకృతమై ఉంది. ఈ నెలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు వాడే భాస్వరపు ఎరువుల్లోని భాస్వరం పోషకం మోనో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. కరిగిన వెంటనే కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లతోనూ రసాయన చర్య జరుగుతుంది. దీని ఫలితంగా అల్యూమినియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఫాస్ఫేట్లుగా మారుతాయి. ఇవి కరగని రూపంలో ఉండి తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల చర్యల వలన మొక్కకు అందుబాటులోకి వస్తాయి. భాస్వరం ఏ మేరకు వాడాలి? భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే సాగులో ఉన్న వివిధ పంటలకు ఎంత భాస్వరం అవసరమో తెలుస్తుంది. దీనిని బట్టి పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా భాస్వరాన్ని అందజేయాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ డీఏపీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులు మొదలగు వాటి ద్వారా భాస్వరాన్ని అందజేయవచ్చు. జీవ ఎరువులతో ఉపయోగాలు జీవ ఎరువులతో బాసిల్లాస్, సూబోమోనాస్ వంటి సూక్ష్మజీవులు ఆస్పర్జిల్లడ్ పెన్సిలియం వంటి శిలీంద్రాలు భూమిలో కరగని రూపంలో భాస్వరాన్ని కరిగించి మొక్కకు లభ్యత పెంచుతాయి. సిఫార్సు చేసిన భాస్వరం మోతాదును ఎకరాకు 10 నుంచి 12కిలోల వరకు తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం ద్వారా భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెందుతాయి. మట్టి నమూనాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములను 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి. ప్రాముఖ్యత భాస్వరాన్ని లవణాల రూపంలో మొక్కలు తీసుకుంటాయి. పూలు, విత్తనాలు, దుంపలు తదితర ఆర్థిక ప్రాముఖ్యత గల పంటల్లో విత్తనపు భాగాల్లో ఈ పోషకం అవసరం ఎక్కువే. భూమిలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లేందుకు దోహదపడుతుంది. పంట త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. కణ విభజన, పైరు అభివృద్ధి మొక్క తొందరగా నిలదొక్కుకోవడం, మొక్కలో మాంసకృత్తులు, ఎంజైములు తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పంటలకు కలిగే దుష్పలితాలను కొంతమేరకు అరికడుతుంది. మొక్కలకు అవసరమైన పిండి పదార్థం తయారు చేసుకునే కిరణజన్య సంయోగక్రియలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ మూలకం లోపిస్తే మొక్కల వేర్ల పెరుగుదల బలహీనమవుతాయి. పంటలో పెరుగుదలతో పాటు పిలకలుపెట్టే శక్తి క్షీణిస్తుంది. పైరు పూతకు రావడం ఆలస్యమై దిగుబడులు ఘణనీయంగా తగ్గుతాయి. భాస్వరం లోపించిన పత్ర హరితం(క్లోరోఫిల్) ఏర్పడకపోవడం వలన ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు కనబడతాయి. మొక్కలు వాతావరణం నుంచి బొగ్గు పులుసు వాయువును తీసుకుని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కలు వాటి తొలిదశలో ఎదిగే భాగాల్లో భాస్వరం అందుబాటులో ఉండటం అవసరం. ఆమ్ల, క్షార భూముల్లో భాస్వరం సరిగ్గా అందుబాటులో ఉండదు. సాగు నేలల్లో భాస్వరం అధికమైనా జింకు లోపం వస్తుంది. ఏ దశలో వేయాలిఫ భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థను అభివృద్ధి పరుస్తుంది. వరి పంటలో నాట్లకు ముందు దమ్ము చేసేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 75–100 కిలోలు, 20 కిలోల యూరియా కలిపి వేయాలి. లేదా వరి నాటిన తర్వాత పది రోజులకు డీఏపీ ప్లస్ యూరియా లేక ఇతర భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. ఫ వర్షాధార మెట్టపంటలకు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలకు ఆఖరి దుక్కిలో వేయాలి. ఫ రైతులు అవసరం లేకున్నా ముఖ్యంగా వరి పంటకు భాస్వరం ఎరువులను రెండు, మూడు పర్యాయాలు వాడుతున్నారు. -
డ్రగ్స్పై వినూత్నంగా అవగాహన
కోదాడ : మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెంలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో సామాజిక కార్యకర్త, తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో ఉగాది పంచాంగం చెబుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని వినూత్నంగా అవగాహన కల్పిచారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డు న పడుతాయన్నారు. కార్యక్రమంలో వెంకటనా రాయణ, నరేష్, జయకృష్ణ, రవి పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు
నల్లగొండ : ప్రత్యేక ప్రజావాణిలో 74 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలి పారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక ప్రజా వాణిలో ఆయన దివ్యాంగులు, వృద్ధుల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చి ఇబ్బంది పడొద్దని.. వారి కోసం ప్రతి నెలా 4వ శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. ఇక్కడ వారి సమస్యలు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
రా రైస్ ఇవ్వాలని ఎఫ్సీఐ నిబంధన.. బాయిల్డ్ రైసే ఇస్తామంటున్న మిల్లర్లు
నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ధాన్యం కల్లాలకు వస్తోంది. కానీ, కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే ఈ యాసంగిలో సీఎంఆర్గా (కస్టమ్ మిల్లింగ్ రైస్) రా రైస్ మాత్రమే పెట్టాలంటూ ఎఫ్సీఐ నిబంధన పెట్టింది. రా రైస్ సాధ్యం కాదని.. బాయిల్డ్ రైస్ అయితేనే పెడతామని మిల్లర్లు అంటున్నారు. లేదంటే ధాన్యం దించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత రావడం లేదు. గతంలోనూ నిబంధన యాసంగి సీజన్లో ఎప్పుడైనా బాయిల్డ్ రైస్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా సమయంలో (2022–23) రారైస్ పెట్టాలని అప్పట్లో ఎఫ్సీఐ ఆదేశించింది. కానీ అమలుకు నోచుకోలేదు. ధాన్యాన్ని మిల్లర్లు తీసుకున్నా.. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ధాన్యాన్ని టెండర్ ద్వారా వేలం వేసింది. దాంట్లో ఏడు మిల్లులు అక్రమాలకు పాల్పడటం వాటిపై కేసులు నమోదు కావడం ఒక మిల్లు యజమానులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్నే తీసుకుంది. తాజాగా మళ్లీ ఈ యాసంగిలో రా రైస్ పెట్టాలంటూ నిబంధన పెట్టింది. 65 శాతం బియ్యం ఇవ్వలేమంటున్న మిల్లర్లు యాసంగి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల రా రైస్ ఇవ్వలేమని మిల్లులు చెబుతున్నారు. రా రైస్కు మిల్లింగ్ చేస్తే నూక శాతం పెరుగుతుందని 65 శాతం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని తాము బాయిల్డ్ రైసే ఇస్తామని చెబుతున్నారు. లేదంటే ధాన్యం దిగుమతి చేసుకోలేమని అంటున్నారు. దీంతో జిల్లా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇది కొలిక్కి వస్తేనే ధాన్యం కొనుగోళు కేంద్రాల ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు ప్రారంభమై రైతులు ధాన్యాన్ని కొందరు కల్లాలకు తెచ్చి ఆరబోస్తుండగా మరికొందరు మిల్లుల్లో అమ్ముకుంటున్నారు.ఎఫ్సీఐ ఈ సీజన్లో రారైస్ ఇవ్వాలని తెచ్చిన నిబంధనపై పునరాలోచన చేయాలి. ఎండ తీవ్రత వల్ల మిల్లింగ్ చేస్తే ఎక్కువ నూక అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో రా రైస్ పెట్టడం సాధ్యం కాదు. ధాన్యం దించుకుంటే మిల్లర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ అయితే నిబంధనల ప్రకారం ఇవ్వగలుగుతాం. ఈ విషయంలో మిల్లర్లంతా ఆలోచన చేసి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తాం. – రేపాల భద్రాద్రి రాములు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫ యాసంగి ధాన్యం సేకరణలో వీడని సందిగ్ధం ఫ మిల్లర్లతో అధికారుల చర్చలు 380 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయంజిల్లా వ్యాప్తంగా యాసంగిలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 4 లక్షల వరకు సన్నాలను మిల్లర్లు నేరుగా కొటారని, 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. మొత్తం 380 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధం చేశారు. గతేడాది యాసంగిలో ఏప్రిల్ 1న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సారి కూడా ఏప్రిల్ 1నే ప్రారంభించే అవకాశం ఉంది. -
బైక్ షోరూమ్కు జరిమానా
నల్లగొండ : బైక్ షోరూమ్కు రూ.లక్షా75 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ వినియోగదారుల కమి షన్ తీర్పునిచ్చింది. చౌటుప్పల్కు చెందిన బొమ్మ మల్లేష్ 2023లో చౌటుప్పల్లోని హైటెక్ మోటార్స్లో హీరో గ్లామర్ బైక్ కొనుగోలు చేశాడు. బైక్ సరిగ్గా నడవకపోవడంతో షోరూమ్ను సంప్రదించాడు. నిర్వాహకులు స్పందించకపోవడంతో మల్లేష్ నల్లగొండ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి రూ.1.35 వేలు బైక్ ఖరీదు, రూ.30 వేలు జరిమానా, రూ.10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని శనివారం వినియోగదారుల కమిషన్ తీర్పునిచ్చింది. పరిహారాన్ని మొత్తం 9 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. -
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. -
ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి : ఎస్పీ
నార్కట్పల్లి : ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రతిఒక్కరూ సహకరించాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు శ్రీరామ నవమి వేడుకల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలన్నారు. దుకాణాలు రోడ్డుపైకి రాకుండా.. ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్ జేరిపోతుల భరత్, ఎస్బీ సీఐ రాము, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్రెడ్డి, పుల్లెంల అచ్చాలు, పుల్లెంల శ్రీనివాస్ ఉన్నారు. -
వానాకాలం 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసింది. అందులో పత్తి 5,13,524 ఎకరాలు, వరి 5,86,137 ఎకరాలు, కంది 14 వేలు, సజ్జ 200, జొన్న 500, మొక్కజొన్న 500, గడ్డి జొన్న 200, ఆముదం 500, పెసర 7 వేలు, వేరుశనగ 500తోపాటు ఇతర పంటలు కలిపి మొత్తం 12,02,051 ఎకరాల్లో వానాకాలం పంటలు సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్కు నివేదించింది. సకాలంలో వర్షాలు కురిసి నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు నిరంతరంగా అందిస్తే వానాకాలం సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఎరువులకు ప్రతిపాదనలు.. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన పత్రిపాదనలను జిల్లా వ్యవసాయ శాఖ.. రాష్ట్ర కమిషనరేట్కు నివేదించింది. యూరియా 1.61 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,343 మెట్రిక్ టన్నులు, ఎన్ఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 12,923 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. గత వానాకాలం యాసంగి సీజన్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈసారి ముందస్తుగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వానికి నివేదిక వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు ముందుగానే వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి విత్తనాలు 16.81 లక్షల ప్యాకెట్లు (450 గ్రాములు), వరి 1,26,800 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను కావాలని నివేదించింది. కంది 14 వేల క్వింటాళ్లు, పెసర 7వేలు, వేరుశనగ 500 క్వింటాళ్లు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది.ఫ అత్యధికంగా వరి 5.86 లక్షలు, పత్తి 5.13 లక్షల ఎకరాలు ఫ అవసరం మేరకు ఎరువులు, విత్తనాలకు ప్రతిపాదనలువానాకాలం సీజన్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. ప్రైవేట్ కంపెనీల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువుల ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
వైభవంగా మహాలక్ష్మి యాగ శోభాయాత్ర
మిర్యాలగూడ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో శుక్రవారం త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాలక్ష్మి యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం హౌసింగ్బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు వైభవంగా యాగ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, మిల్లర్లు గందె రాము, బండారు కుశలయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాధవి, చిలుకల రవికుమార్, ప్రసాద్, కారంపూడి జానకిరాఘవచార్యులు, గుడిపాటి నాగేందర్, రేపాల పురుశోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు. -
నకిలీ బ్రాండ్లతో బియ్యం సరఫరా..
ఫ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్ బియ్యం వ్యాపారులు మిర్యాలగూడ అర్బన్ : నకిలీ బ్రాండ్ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్టౌన్ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది. మార్కెట్లో కాకరకు దక్కని రేటుఫ పశువులు, గొర్రెలకు మేతగా వదిలేసిన రైతు పెద్దవూర : మండలంలోని బట్టుగూడేనికి చెందిన రైతు కూన్రెడ్డి మధుసూదన్రెడ్డి రెండెకరాల్లో కాకర సాగు చేశాడు. పంట చేతికి వచ్చాక విక్రయించటానికి మార్కెట్కు వెళ్లగా కిలో రూ.10 అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తీగ పందిరిపై సాగు చేసిన కాకరకాయలకు మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉందని, కిలో రూ.10కి విక్రయిస్తే కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా రావని కాకర పంటలో పశువులు, గొర్రెలను మేపుతున్నట్లు తెలిపారు. -
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
నల్లగొండ: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్కే ఖాన్, మురళి, మేకల నరసింహ, మల్లేష్, నాగమణి పాల్గొన్నారు. ట్రాక్టర్ చోరీ చేసిన దొంగల అరెస్టునార్కట్పల్లి : ట్రాక్టర్ చోరీ చేసిన ఇద్దరు దొంగలను నార్కట్పల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. గతేడాది ఆగస్టు 7న అర్ధరాత్రి నార్కట్పల్లి మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన నకరేకంటి రమేష్ ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. రమేష్ ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కరచోల గ్రామానికి చెందిన మదన రవీంద్రనాథ్రెడ్డి, ఎన్నిరెడ్డి బాపిరెడ్డి ట్రాక్టర్ చోరీ చేసినట్లు గుర్తించి వారిని గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ పి. విష్ణుమూర్తి, పోలీస్ సిబ్బంది సత్యనారాయణ, గిరిబాబును సీఐ కె. నాగరాజు అభినందించారు. -
రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
నల్లగొండ టూటౌన్: రైతుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతులందరి ఖాతాల్లో జమ చేయాలన్నారు. వరికోతలు ప్రారంభమైనందున ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాలని, మిగిలినపోయిన వారి రైతు రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వీబీజీ రామ్ జీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ చంద్రశేఖర్కు అందజేశారు. ఆయన వెంట కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, సెంట్రల్ హైదరాబాద్ ఇన్చార్జి వీరెళ్లి చంద్రశేఖర్, భూనిర్వాసితుల సెల్ రాష్ట్ర కన్వీనర్ భవనం మధుసూదన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, కన్మంతరెడ్డి అశోక్రెడ్డి, పోతెపాక లింగస్వామి, గుండా నవీన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు. -
బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్ సీసీఎఫ్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్ వ్యూ పాయింట్ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్ అటవీ సీసీఎఫ్ సునీల్ హీరావత్, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్, సాగర్ డీఎఫ్ఓ సంగీత, శ్రీనివాసరావు ఉన్నారు. మహిళా సర్పంచ్ పై దాడినాంపల్లి : భూ తగాదాలో భాగంగా మహిళా సర్పంచ్పై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లపురాజుపల్లి గ్రామ సర్పంచ్ మంటిపల్లి మణిమాలకి, అదే గ్రామానికి చెందిన చినముత్తయ్య మధ్య కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఐదు రోజుల క్రితం సర్పంచ్ మణిమాలకు సంబంధించిన భూమిలో చినముత్తయ్య ట్రాక్టర్తో దున్నడంతో సర్పంచ్, ఆమె భర్త శ్రీశైలం కలిసి ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో చినముత్తయ్య ఆగ్రహంతో సర్పంచ్ మణిమాల, ఆమె భర్తపై దాడికి దిగాడు. సర్పంచ్కు తీవ్రగాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె. లింగారెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మర్రిగూడ(చింతపల్లి) : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన నాగిళ్ల బాబయ్య(37) తుఫాన్ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన తండ్రి వ్యవసాయ పొలంలోకి సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చేందుకు మంగళవారం రాత్రి ఆటోలో కుర్మేడు గేట్ నుంచి చింతపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని మర్రిగూడ మండలం వెంకటేశ్వర్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
అవగాహనతోనే విపత్తులను ఎదుర్కోవచ్చు
చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్రావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్సింగ్, ఆర్డదో వెలమ శేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్కుమార్చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ -
నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన
నల్లగొండ టూటౌన్: యూనివర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్నానం చేసేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు
నార్కట్పల్లి : నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణవెల్లెంల, అయిటిపాముల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే ఆసరా పెన్షన్లు పెంచలేదని ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అబద్ధపు ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి బడ్జెడ్లో కూడా మొండిచేయి చూపిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రభుత్వ సొమ్ముతో దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3.75 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా స్థానిక నాయకులకు లంచం ఇస్తేనే పని మొదలుపెట్టే పరిస్థితి నెలకొందన్నారు. నేత, గీత కార్మికుల ప్రమాద బీమా సొమ్మును విడుదల చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ అడ్డదారిలో ముఖ్యమంత్రి సీటులో రేవంత్రెడ్డి కూర్చున్నాడని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బైరెడ్డి కరుణాకరరెడ్డి, కరణం బలరాం, కొండూరు శంకర్, వాజీదు అలీ, దోసపాటి విష్ణుమూర్తి, శ్రీనివాస్రెడ్డి, కొత్త నర్సింహా, కర్నాటి ఉపేందర్, పోగుల నర్సింహా, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రిఫ్లెక్టీవ్ టేప్స్తో వాహన యజమానులపై భారం
రామగిరి(నల్లగొండ): ప్రైవేట్ ట్రావెల్ వాహనాలపై రిఫ్లెక్టీవ్ టేప్స్ తప్పనిసరి చేయడంతో వాహన యజమానులపై భారం పడుతుందని నల్లగొండ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐతరాజు రమేష్ అన్నారు. ఈమేరకు గురువారం ట్రాన్స్పోర్ట్ అధికారిణి లావణ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐతరాజు రమేష్ మాట్లాడుతూ.. ట్రావెల్స్ సరిగ్గా నడవకపోవడంతో వాహన యజమానులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని, కొత్తగా రిఫ్లెక్టీవ్ టేప్స్ తప్పనిసరి చేసి రూ.7 వేల వరకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనతో వాహనాలను నడపలేమన్నారు. ప్రభుత్వం వెంటనే రిఫ్లెక్టివ్ టేప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఏడుకొండలు, జానయ్య, శ్రీశైలం, నరేష్, లింగస్వామి, యాదగిరి, ప్రవీణ్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు అధిక ప్రాధాన్యం
కనగల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని తెలిపారు. నల్లగొండలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించామని, నర్సింగ్ కళాశాల నిర్మాణం డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దర్వేశిపురం నుంచి గుర్రంపోడు మీదుగా రూ. 180 కోట్లతో చేపట్టే రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామన్నారు. కనగల్ చౌరస్తా నుంచి అసంపూర్తిగా ఉన్న రహదారిని సరి చేసేందుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రేగట్టె వరకు రూ.60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, పగిడిమర్రి మీదుగా ముశంపల్లి వరకు రూ.100 కోట్లతో రోడ్డు మంజూరైందన్నారు. రూ.కోటి 20 లక్షలతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏర్పాటు, మరో రూ.16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీఐఈఓ దశ్రు నాయక్, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
భూసేకరణ వేగవంతం చేయాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ: ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలోని కలెక్టరేట్లో గురువారం ఆయన తన ఛాంబర్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయ సముద్రం, మాద ఎడవల్లి, శివన్నగూడెం, అంబ భవాని, డిండి, నక్కలగండి, ఏకేబియర్, పెండ్లిపాకల చింతచెట్టు తండా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల అంశాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, రైతులకు సమయానికి పరిహారం చెల్లించాలన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పునరావాసం పొందిన కుటుంబాలకు అన్ని సదుపాయాలు అందించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి నల్లగొండ: నల్లగొండలోని కలెక్టరేట్లో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతి నెలా చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు వయో వృద్ధుల జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలు తెలపొచ్చని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు రామగిరి(నల్లగొండ): కంప్యూటర్ సైన్స్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని నాగార్జునసాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొబ్బిలి రాజా అన్నారు. గురువారం ఎన్జీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ, అవకాశాలు’ అనే అంశంపై విస్తృతోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ని సమన్వయం చేసుకుంటూ రాణించాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో లభిస్తున్న ఉద్యోగ అవకాశాలపై వివరించారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సదస్సు ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు కెరీర్ ఎంపికలో స్పష్టత కలిగించడం ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇన్చార్జ్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, సీఓఈ మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ రామగిరి(నల్లగొండ): లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారానికి శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ (పూర్తి అదనపు బాధ్యతలు) పురుషోత్తంరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్లగొండకు అన్యాయం చేయొద్దునల్లగొండ టౌన్ : డిండి ఎత్తిపోతల పథకం విషయంలో నల్లగొండకు అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారమే నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఏదుల వద్ద 436 మీటర్ల నీటి మట్టం నుంచే డిండికి నీటిని తీసుకునేలా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం 440 మీటర్ల నీటి మట్టం నుంచి నీటిని తీసుకోవాలంటే తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలిపెద్దవూర : అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణావత్ సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్లను గురువారం పెద్దవూరలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు షబ్బీర్, కృష్ణ, శ్రీనునాయక్, ఎండీ.షాహీన్ బేగం, రాంరెడ్డి, డి.సైదులు, షాహదా బేగం, జ్యోతి పాల్గొన్నారు. -
ఫుల్ ట్యాంక్ కోసం తిప్పలు
సాక్షి ప్రతినిది, నల్లగొండ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు ముందస్తుగా జాగ్రత పడుతున్నారు. యుద్ధం కారణంగా భవిష్యత్లో మన దేశంలో కూడా ఇబ్బందులు తప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించడంతో ఇక పెట్రోల్, డీజిల్కు ఇబ్బందులు తప్పవేమోనన్న ఆలోచనల్లో ప్రజలు పడ్డారు. ఇందులో భాగంగా ముందు జాగ్రత్తగా వాహనదారులంతా పెట్రోలు, డీజిల్ కోసం బంకుల వద్ద బారులుదీరి ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. దీంతో వచ్చిన డీజిల్, పెట్రోల్ త్వరగా అయిపోతుండటంతో బంకుల యజమానులు నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. పెట్రోలు, డీజిల్కు ముందస్తు జాగ్రత్తలు యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందన్న విషయం ఆందోళనకు కారణమవుతోంది. ప్రస్తుతం ఇంధన కొరత లేకున్నా యుద్ధం కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడవుతాయని ప్రజలు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లాలో బైక్లు, ఆటోలు, కార్లు, ఇతరత్రా వాహనాలు పెట్రోలు, డీజిల్ కోసం బంక్ల వద్ద బారులుదీరాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పరిస్థితి కనిపించింది. ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేయాలంటూ బంక్ సిబ్బందిని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దీంతో బంకుల్లోని పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుంటున్నాయి. జిల్లాలో 180 పెట్రోలు, డీజిల్ బంక్లు ఉన్నాయి. వీటికి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ కంపెనీల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇందన కొరత లేదు. వాహనదారులు భయంతో వాహనాలను ఫుల్ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీనివల్ల పెట్రోలు, డీజిల్ నిల్వలు అయిపోతున్నాయి. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. వాహనదారులు గమనించి అవసరం ఉన్నంత వరకే పెట్రోల్ పోయించుకోవాలి. – వెంకటేశం, డీఎస్ఓ, నల్లగొండ ఫ యుద్ధ ప్రభావంతో వాహనదారుల ముందు జాగ్రత్త ఫ పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద తంటాలు ఫ క్రెడిట్ విధానం తొలగించడంతో ట్యాంకర్ల రాకలో జాప్యం ఫ ఫలితంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులు -
పాత సామగ్రి వేలం
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత సామగ్రిని బుధవారం వేలం వేవారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ టెండర్దారుల సమక్షంలో పారదర్శకంగా వేలం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, మోటర్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్, అడ్మిన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీఈడీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డిలు బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోట్ అయ్యారు. మూడవ సెమిస్టర్లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 269 మంది ప్రమోటయ్యారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.ఉపేందర్రెడ్డి తెలిపారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మట్లాడుతూ పెన్షనర్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. అనంతరంకలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి, నాయకులు యుగేందర్రెడ్డి, వెంకటరెడ్డి, మోహన్రావు, రంగయ్య, శ్రీశైలం, యాదగిరి, ఆంజనేయులు ఉన్నారు. -
పన్ను కట్టకుంటే.. ఆస్తి జప్తే!
రెడ్ నోటీసులు అందుకున్న తర్వాత కూడా బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్, నల్లా కనెక్షన్లు కట్ చేయడంతో పాటు, ఆయా నిర్మాణాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆస్తి పన్నుల వసూళ్ల నిమిత్తం విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బందిపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై నాన్–బెయిల బుల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులకు ఆటంకం కలిగించిన పట్టణానికి చెందిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిర్యాలగూడ టౌన్ : ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పన్ను చెల్లింపునకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండటంతో వసూళ్లను ముమ్మరం చేశారు. పన్నులు కట్టని వారి ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీర్ఘకాలికంగా పన్నులు ఎగవేస్తున్న దాదాపు 500 మందికి ఇప్పటికే అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారి ఇళ్ల వద్దకు నేరుగా ఈ జప్తు వాహనాన్ని పంపి చర్యలు తీసుకోనున్నారు. 34 బ్లాక్లుగా విభజన మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి మొత్తం 26,518 అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.20 కోట్ల 53 లక్షల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా.. ఈ నెల 22వ తేదీ నాటికి రూ.7 కోట్ల 30 లక్షల 63 వేలు మాత్రమే ఖజానాకు చేరింది. ఇంకా రూ.13 కోట్ల 22 లక్షల 67 వేల మేర బకాయిలు పేరుకుపోయాయి. మార్చి 31 నాటికి వంద శాతం ఆస్తి పన్ను వసూలైతే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.15 కోట్ల వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల వసూళ్ల కోసం 48 వార్డులను 34 బ్లాక్లుగా విభజించారు. మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ), రెవెన్యూ ఇన్స్పెక్టర్ల(ఆర్ఐ) పర్యవేక్షణలో బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచే రూ. 2 కోట్లు.. మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్పీ, రైల్వే తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు సుమారు 520 వరకు ఉన్నాయి. వీటి నుంచే మున్సిపాలిటీకి రూ.2 కోట్లకు పైగా పన్నులు రావాల్సి ఉంది. మరోవైపు, బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ కల్పిస్తుందనే ఆశతో కొందరు పన్నుల చెల్లింపును దాటవేస్తున్నారు. దీంతో వార్డు అధికారులు ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు.ఫ మొండి బకాయిదారుల ఇళ్ల ముందుకు ‘జప్తు వాహనం’ ఫ మిర్యాలగూడలో 500 మందికి రెడ్ నోటీసులు ఫ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే కేసులే మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లకు ఇప్పటికే జప్తు వాహనం ఏర్పాటు చేశాం. ఆస్తి పన్నులు చెల్లించాలంటూ వార్డుల్లో డప్పు చాటింపు చేయిస్తున్నాం. పన్నుల వసూళ్లకు 9 మందితో కూడిన టీమ్ వేయగా.. ఒక ఆర్ఓ, ముగ్గురు ఆర్ఐలు పర్యవేక్షిస్తున్నారు. వంద శాతం ఆస్తి పన్నులు వసూలైతేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయక తప్పదు. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ -
రుణ లక్ష్యాన్ని పూర్తిచేయాలి
నల్లగొండ : ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025 త్రైమాసిక లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరగతి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రుణాలు, టర్మ్ లోన్లు, డీఆర్డీఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల గ్రౌండింగ్ విషయంలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు విద్యా రుణాలపై దృష్టి సారించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేసే బ్యాంకు లింకేజీ, మెప్మా,సెర్ప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే పథకాలపై కూడా బ్యాంకర్లు ఈ నెల 30వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా బ్యాంకుల సహకారంతో జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం నాబార్డ్ ఆధ్వర్యంలో 2026 –27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16,861 కోట్లతో రూపొందించిన శ్రీసామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక్ఙ (పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026– 27) బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డ్ డీడీఎం వినయ్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. -
ద్వితీయశ్రేణిలో నిరుత్సాహం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పూర్తి స్థాయి కార్యవర్గంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పార్టీ సంస్థాగత నిర్మాణంపై జాప్యం జరుగుతోంది. దీంతో జిల్లా పార్టీ కార్యవర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు నిరాశ తప్పడం లేదు. నాలుగు నెలల కిందటే జిల్లా అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధిష్టానం ఆయా జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేయడంలో వెనుకబడింది. ఇటీవల టీపీసీసీ 14 జిల్లాలకు మాత్రమే పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించగా.. అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గాలను ప్రకటించలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్న వారికి ఉత్కంఠ తప్పడం లేదు. పెండింగ్లో రెండు జిల్లాల కార్యవర్గాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2025 నవంబర్ 22వ తేదీన డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. అందులో నల్లగొండ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన పున్న కై లాష్ నేత, సూర్యాపేట జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్య, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను జిల్లా అధ్యక్షులుగా నియమించింది. తరువాత వెంటనే జిల్లా కార్యవర్గాలను ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ అందులో జాప్యం జరగడంతో అధిష్టానం కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఆయా డీసీసీల పూర్తిస్థాయి కార్యవర్గాల ప్రకటనపై టీపీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కార్యవర్గాన్ని ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కమిటీలను పెండింగ్లో పెట్టింది. ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించని అధిష్టానం ఫ యాదాద్రి జిల్లాకు ఇటీవల కమిటీ వేసిన టీపీసీసీ ఫ డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు.. ఫ జిల్లా కమిటీల్లో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపు -
ఎస్సీల అభివృద్ధికి ఊతం
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 1,368 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు గాను అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారమే చివరి తేదీగా యంత్రాంగం ప్రకటించింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం.. జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 654 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 676 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 38 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు. నేటివరకే దరఖాస్తు గడువు.. అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అర్హతలు, నిబంధనలు ఇలా.. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళితబంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటిలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఫ 2025–26 ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక ఖరారు ఫ జిల్లాకు 1,368 యూనిట్లు మంజూరు ఫ వ్యవసాయ, రవాణా రంగాలకు ప్రాధాన్యం ఫ ఆన్లైన్లో దరఖాస్తుకు నేడు చివరి తేదీ జిల్లాకు కేటాయింపులు ఇలా.. యూనిట్ లక్ష్యం ఈవీ టూ వీలర్స్ 654ఈవీ త్రీ వీలర్స్ 676సోలార్ పంప్ సెట్లు 38 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90శాతం, రూ.3లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది. -
ప్రజావాణిలో వినతుల వెల్లువ
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కార నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 83 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూ శాఖకు సంబంధించినవి 40, ఇతర శాఖలకు 43 వచ్చాయని తెలిపారు. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి ప్రజావాణి అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామసభలో ప్రభుత్వ ప్రాధామ్య పథకాలు, ఆరు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సీపీఓకు సమర్పించాన్నారు. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, పంచాయతీలను సందర్శించి ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలు చురుకుగా సాగేలా చూడాలన్నారు. జనగణనకు ఎన్యుమరేషన్ బ్లాక్లను నిర్ణయించడంతోపాటు, సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలని ఆదేశించారు. జంతు సంరక్షణలో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబీసీ స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయాలి
ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం నకిరేకల్ : బస్వాపూర్ రిజర్వాయర్ను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట, చిట్యాల మండలాల్లో సూమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. మూసీ నదిపైన వంతెన పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన నల్లగొండ టూటౌన్ : మహిళా సంఘాల పేరుతో రూ.కోటీ 49 లక్షలను ఐసిఐసిఐ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్, కేశరాజుపల్లికి చెందిన ఆర్పీ స్వాహా చేశారని ఆరోపిస్తూ కేశరాజుపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం నల్లగొండలోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కేశరాజుపల్లి ఆర్పీ తమకు ఎలాంటి సంబంధం లేకుండా సంఘానికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకొని రుణాలు ఎత్తుకున్నట్లు ఆరోపించారు. బ్యాంకు యాజమాన్యం తమకు నోటీసులు ఇవ్వడంతో ఆ విషయం బయటపడిందని.. బ్యాంకులో ఎలాంటి ఖాతాలు లేకుండా మాకు సంబంధం లేకుండా రుణాలు ఎలా ఇస్తారని బ్యాంకు ముందు నిరసన తెలిపామన్నారు. పొదుపు ఖాతాలకు ఐసీఐసీఐ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని యూనియన్ బ్యాంకులో తమ పొదుపులు ఉన్నాయని తెలిపారు. వెంటనే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టూ టౌన్ ఎస్ఐ మానస అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
నల్లగొండ టౌన్ : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాల పెంపుపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ.సలీం, దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, సత్యనారాయణ, నాగమణి, బొందు పార్వతి, అవుట రవీందర్, విజయలక్ష్మి, అంబటి మన్నెమ్మ, ఫాతిమా, ఇంద్రగంటి సైదమ్మ, పి.సరిత, మనిరూప, పరిపూర్ణమ్మ, యాదమ్మ, డి.కళ్యాణి ,ఎల్లమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 35 మంది భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి విన్నవించారు. వారి ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ వాటిని పరిశీలన నిమిత్తం సంబంధిత పోలీస్ అధికారులకు పంపి.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నేటి నుంచి ‘ఓపెన్’ ప్రాక్టికల్ తరగతులు
రామగిరి(నల్లగొండ) : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రాక్టికల్ తరగతులు నల్లగొండ ఎన్జీ కాలేజీలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్కుమార్ తెలిపారు. ఐదో సెమిస్టర్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, బొటనీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తరగతులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఒకటి, మూడో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతికట్టంగూర్ : యువకులు దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన గుండు నాగరాజు(35)తో ఈ నెల 6న ఇద్దరు యువకులు ఘర్షణ పడి అతడి తలపై కర్రతో బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరాజును కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. ఆదివారం మృతుడి అన్న పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. రవీందర్ తెలిపారు. -
యాదగిరిగుట్ట ప్రధానార్చకుడిపై చర్యలు తీసుకోవాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతా శౌచంతో పాల్గొని పూజలు నిర్వహించిన ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులుపై చర్యలు తీసుకోవాలని ఈఓ భవానీ శంకర్కు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. కాండూరు వెంకటాచార్యులు సొంత బంధువు కాండూరి భార్గవ్కు శిశువు జన్మించగా.. హిందూ సాంప్రదాయం ప్రకారం శిశువు జన్మించిన రోజు నుంచి ఆ కుటుంబానికి చెందిన వారికి పది రోజుల పాటు జాతక శౌచం ఉంటుందని, అయినప్పటికీ ఫిబ్రవరి 25న స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆయన జరిపించారని నల్ల రాధాకృష్ణ ఆరోపించారు. కాండూరి వెంకటాచార్యులుతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసచార్యులు సైతం శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సైతం ఆయన మైలలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై దేవాదాయశాఖ అధికారులు ఐఏఎస్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో దళిత సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్ద యుగంధర్, తెలంగాణ సీనియర్ సిటిజనన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమాండ్ల విష్ణు, టేకి రాజశేఖర్, వీహెచ్పీ కొమ్మగళ్ల వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్ కనుకుంట్ల విజయకుమార్, బీజేపీ నాయకులు బొల్లం చంద్రమౌళి, మన్నెం నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ జాతక శౌచంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా వ్యవహరించారు ఫ ఈఓ భవానీ శంకర్కు విన్నవించిన వివిధ సంఘాల నాయకులు -
వడదెబ్బ నుంచి పశు సంరక్షణ ఇలా..
గుర్రంపోడు : వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు వడదెబ్బతో మృతిచెందే ప్రమాదం ఉంది. వడదెబ్బ నుంచి పశువులను రక్షించుకునేందుకు గుర్రంపోడు మండల పశువైద్యాధికారి సాయిరాం రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు.. ● ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులు ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి ● వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభా వం వల్ల చూలు పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పశువుల్లో పునురుత్పత్తి పక్రియ కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా ... వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానకి పలుమార్లు కడగాలి. తాగునీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షక్షన్లు వేయించాలి. రక్తంలోని సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోరైట్స్ అందిస్తే పశువులు నీరసం నుంచి బయటపడతాయి. వడదెబ్బ నివారణకు మందస్తు చర్యలు ● వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళ మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈదనివ్వాలి. ●గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తైన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి మధ్యాహ్నం వేళల్లో నీరు చల్లాలి. ● వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డు పైన వరిగడ్డి వేసి మధ్యాహ్నం వేళ నీరివ్వాలి. ● షెడ్డుల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడగాల్పుల నుంచి తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. ● పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. ● పశువులకు గోమర్లు లేకుండా చూసుకోవాలి. ● పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలి. -
ఇది ఉద్యమనామ సంవత్సరం
సూర్యాపేట అర్బన్ : ఇది ఉద్యమనామ సంవత్సరం అని, ప్రజా సమస్యలపై సీపీఐ శ్రేణులు రాజీలేని పోరాటం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గడపగడపకు సీపీఐ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని, పంటలు ఎండిపోకుండా నీరందించేలా అధికారులతో మాట్లాడాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రజలను సమీకరించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని కోరారు. కొత్తగా రెండు లక్షల మందికి రేషన్ కార్డులు, మరో రెండు లక్షల మందికి పెన్షన్లు అందిస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, అర్హులైన వారికి ఆ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం కేవలం రూ.12వేల కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. మే నెలలో కూడా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కంబాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, యల్లావుల రాములు ధూళిపాళ ధనుంజయనాయుడు, మేకల శ్రీనివాసరావు, యల్లంల యాదగిరి, మండవ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బత్తినేని హనుమంతరావు, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి పాల్గొన్నారు ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి -
సేదదీరడానికి వచ్చి.. శవమై తేలి..
కట్టంగూర్ : కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సేదదీరడానికి స్విమ్మింగ్ పూల్కు వచ్చిన మాజీ సైనికుడు అందులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) ఆదివారం కట్టంగూర్లో తన అత్తగారింటికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. సాయంత్రం సేదదీరడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఈదులూరు రోడ్డులో గల ఎంఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్కు వెళ్లాడు. స్విమింగ్ చేస్తూ నీరు తాగడంతో నీటిలో మునిగిపోయాడు. చాలాసేపటి వరకు బయటకు రాకపోవటంతో గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు జనార్దన్ను బయటకు లాగారు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినా అప్పటికే అతడు మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో బెల్లి జనార్దన్ మృతదేహంపై ప్రజా గాయని, ఉద్దీపని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వేముల పుష్ప పూలమాల వేసి నివాళులర్పించారు. ఫ స్విమ్మింగ్ పూల్లో మునిగి మాజీ సైనికుడు మృతి ఫ కట్టంగూర్ మండల కేంద్రంలో ఘటన -
అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం
భువనగిరిటౌన్ : పీఎం సంసద్ పోటీల్లో విజేతలకు ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహుమతుల ప్రదానోత్సవా న్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఎస్పీ అక్షాంశ్యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్, కేంద్ర మంత్రికి అదనపు కలెక్టర్ భాస్కర్రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు. ఫ ముఖ్య అతిథులుగా హాజరైన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ -
విత్తన, విద్యుత్ చట్టాలను రద్దుచేయాలి
నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నూతన విత్తన, విద్యుత్, జీరామ్ జీ చట్టాలను రద్దుచేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండలం వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్లోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తీసుకొచ్చిన ఉపాధి హమీ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతులు, రైతు కూలీలు ఐక్యంగా ఉండి వాటిపై పోరాడాలని కోరారు. ఈ సెమినార్లో ఆ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎం.డేవిడ్ కుమార్, జిల్లా అద్యక్షుడు జ్వాలా వేంకటేశ్వర్లు, జిల్లా ప్రదాన కార్యదర్శి అంబటి చిరంజీవి, నాయకులు భీరెడ్డి సత్తిరెడ్డి, సిలివేరు జానయ్య, గజ్జి రవి, ముస్కు హనుమంతు, వేముల శంకర్, బురుగు సత్తయ్య, అంబటి కృష్ణమూర్తి, మామిడి ఎల్లయ్య ,వెంకటేశ్వర్లు, సైదులు, వెంకన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ : సామ్రాజ్యవాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు వత్తాసు పలకడం భారత ప్రధాని మోదీకి తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపే యుద్ధాన్ని ఆపాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో తీర్మానం పెట్టకపోవడం దారుణమన్నారు. యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి వ్యతిరేకించినా ట్రంప్ తన ఆధిపత్య ధోరణి మానుకోకపోవడం ఆయన సామ్రాజ్యవాదానికి నిదర్శనమన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉందన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగా ర్జున, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
చందంపేట : బైక్పై వెళ్తున్న యువకుడిని ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన బుడిగపాక దశరథం(27) టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి నేరెడుగొమ్ము నుంచి దేవరకొండకు బైక్పై వస్తుండగా.. మార్గమధ్యలో తిమ్మాపురం సమీపంలో ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య బుడిగపాక అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. విద్యార్థినిని వేధిస్తున్న రేడియోగ్రాఫర్ తొలగింపునల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్న పారామెడికల్ విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్న రేడియోగ్రాఫర్ను విధుల నుంచి తొలగించారు. సదరు విద్యార్థిని చేసిన ఫిర్యాదు మేరకు ఆస్పపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి.. ఆర్ఎంఓతో కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణలో రేడియోగ్రాఫర్ విద్యార్థినిని వేధించినట్లు రుజువు కావడంతో అతడిని విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రేడియోగ్రాఫర్ను ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. భారీగా నల్లబెల్లం, పటిక పట్టివేతదేవరకొండ : నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటికను నాగర్ర్నూల్ జిల్లాలోని చారకొండ నుంచి దేవరకొండకు ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తుండగా.. దేవరకొండ ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 1800 కిలోల నల్లబెల్లం, 70 కిలోల పటికతో పాటు 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు సంతోష్, కిషన్ పర్యవేక్షణలో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ అధికారులు శేఖర్రెడ్డి, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతపెన్పహాడ్ : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో పొలిశెట్టి ఉపేంద్ర ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఆమైపె కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామా చేసి బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఉచిత విద్యనందించేందుకే ‘పీపీటీ’ టెస్టు
నల్లగొండ : చుక్కా రామయ్య మార్గదర్శకత్వంలో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ (పీపీటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో కొనసాగుతున్న ప్రగతి విద్యానికేతన్లో ఉచిత విద్యనందించేందుకు 6, 7 తరగతుల్లో ప్రవేశానికి టెస్టు నిర్వహిస్తున్నట్టు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల్ల వెంకటేశం తెలిపారు. నల్లగొండలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం పీపీటీ టెస్టుకు సంబంధించిన బుక్లెట్ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నిరుపేద కుటుంబాలకు చెందిన తెలివైన విద్యార్థులను ఈ టెస్టు ద్వారా ఎంపిక చేసి ప్రగతి విద్యానికేతన్ విద్యాలయంలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, రవీందర్, పరీక్ష నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీజిల్లా కన్వీనర్గా శ్రీనునకిరేకల్ : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్గా నకిరేకల్ మండం చందంపల్లి గ్రా మానికి చెందిన యార శ్రీను నియామకమయ్యా రు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం జిల్లా కమిటీని ప్రకటించింది. జిల్లా కో కన్వీనర్గా ఎండీ యూసుఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అద్దంకి రవీందర్, ట్రెజరర్గా కీర్తి అశోక్, జాయింట్ సెక్రటరీలుగా నందికంటి సైదులు, షేక్ ఖలీల్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సైఫ్, వెంకటరావ్, బాసాప్ప శ్రీనివాస్, యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఎసాం నాగరాజు, నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఎస్కే అన్సారీ(నల్లగొండ), టి.సలీంరాజు(దేవరకొండ), చేగొండి మహేందర్(నాగర్జునసాగర్), వెంకట సుబ్బయ్య(నాగర్జున సాగర్), యార శ్రీను (నకిరేకల్) దువ్వాడ నవీన్ (మునుగోడు), శ్రవణ్ (మునుగోడు కోఇన్చార్జి)ను నియమించారు. -
బస్వాపురం రిజర్వాయర్లో పడి యువకుడు..
యాదగిరిగుట్ట రూరల్ : బస్వాపురం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన సి. అభిలాష్ (26) ఐకేఈ మెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం అభిలాష్తో పాటు అతడితో పనిచేసే మహిపాల్, రిషి, విజయ్, ప్రశాంత్, శర్మ, అజయ్ కలిసి భువనగిరి పట్టణ పరిధిలోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం స్నేహితులంతా కలసి సరదాగా కాలక్షేపం చేశారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరి పరిధిలో ఉన్న బస్వాపురం రిజర్వాయర్ను సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో లప్పానాయక్ తండా పరిధిలోని దుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న ప్రాజెక్టు నీటి వద్దకు వెళ్లారు. అభిలాష్ ఈత కొట్టడానికి నీటిలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు అభిలాష్ను బయటకు తీసుకొచ్చే లోపే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. -
నిమ్మకాయలు కిలో రూ.100
నడిగూడెం : నడిగూడెం, కరివిరాల, చెన్నకేశ్వాపురం నిమ్మ మార్కెట్లలో నిమ్మ కాయల ధర వారం రోజులుగా కిలోకు రూ.100 పలుకుతోంది. రూ.70 ఉన్న ధర ఒక్కసారిగా అదనంగా రూ.30 పెరగడంతో నిమ్మ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంతో పాటు, చెన్నకేశ్వాపురం, వేణుగోపాలపురం, కరివిరాల, బృందావనపురం, రామాపురం, యఖలాస్ఖాన్పేట తదితర గ్రామాలలో దాదాపు 2500 ఎకరాలకు పైగా నిమ్మ సాగులో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మకు ఈ ఏడాది తెగుళ్లతో పాటు, నల్లి, తామర పురుగులు ఆశించాయి. దీనికి తోడు వాతావరణంలో మార్పుల్లో భాగంగా పొగ మంచుకురవడం, రాత్రి వేళలో చలి తీవ్రంగా ఉండడంతో పంట దిగుబడి, కాతపై ప్రభావం పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. పూత, కాత సరిగ్గా రాకపోవడంతో పంట దిగుబడులు పడిపోయాయని ఆందోళ వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గినప్పటికి నిమ్మకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మాఫీ రాలే.. వసూలు కాలే!
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్ పడుతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, చండూరు, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్ మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిదారులు వడ్డీ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మార్చి చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల క్రితమే జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బకాయిలపై వడ్డీ మాఫీ చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మార్చి చివరి వారం వస్తున్నా నేటికీ వడ్డీ మాఫీ ప్రకటన రాకపోడంతో బకాయిదారులు ఆస్తి పన్ను చెల్లిచడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని స్థానిక అధికారులు, సిబ్బంది ప్రతిరోజు కాలనీల్లో తిరుగుతున్నారు. కానీ బకాయిలతో సహా ఆస్తి పన్ను ముందుగా చెల్లించడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని పలువురు భవన యాజమానులు చెబుతున్నారు. 50 శాతం కూడా వచ్చే అవకాశం లేదు ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరిని ఆస్తి పన్ను వసూలు కోసం గల్లీ గల్లీ తిప్పుతారు. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్ పెట్టినా మార్చి చివరి నాటికి 70 శాతం నుంచి 95 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడం అంత సులభం కాదని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. కనీసం 50 శాతం కూడా వసూలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తే ఆస్తి పన్ను ఎక్కువగా వసూలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్ ఫ జీహెచ్ఎంసీలో 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించిన ప్రభుత్వం ఫ జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ ఫ వడ్డీ మాఫీ రాకుండా పన్ను చెల్లింపునకు భవన యజమానుల విముఖత నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.17 కోట్లు వసూలు చేశారు. ఈసారి రూ.19 కోట్లు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. కానీ ఇప్పటి వరకు రూ.13 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ. 6 కోట్లు వసూలు కావల్సి ఉంది. ఈ పది రోజుల్లో రూ.6 కోట్లు వసూలు అయ్యేది కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఎలాంటి వడ్డీ మాఫీ వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్ చేస్తాం. బకాయిదారులంతా పన్ను చెల్లించాలి. – శరత్చంద్ర, కార్పొరేషన్ కమిషనర్ -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐల య్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు అండెం సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్, జనగాం ఉపేందర్రెడ్డి, పోతంశెట్టి మంజుల, కసుబ శ్రీనివాసరావు, పులి అనిల్కుమార్, పిట్టల బాల్రాజ్, పోతంశెట్టి వెంకటేశ్, ఎడ్ల సత్తిరెడ్డి, సుర్వి వేణుగౌడ్, గోలి పింగల్రెడ్డి, కూర వెంకటేశ్ పాల్గొన్నారు. అమెరికాకు వత్తాసు పలకడం తగదుఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపిక
గుర్రంపోడు : గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గుజ్జ వెంకట్రెడ్డి ఈ నెల 25వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీల్లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపర్చి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు నల్లగొండ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి అక్బర్ అలీ తెలిపారు. వెంకట్రెడ్డిని ప్రధానోపాధ్యాయుడు కత్తి యాదగిరిరెడ్డి, ఉపాధ్యాయులు, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్రెడ్డి, బాలూనాయక్ అభినందించారు. కల్మలచెరువు యువతి.. గరిడేపల్లి : మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన మామిడి రజిత కూడా ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపింది. రజిత ప్రస్తుతం జనగామ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె చిన్నతనం నుంచి వాలీబాల్లో రాణిస్తోంది. రజితను గ్రామ పెద్దలు, స్నేహితులు అభినందించారు. గుజ్జ వెంకట్రెడ్డిమామిడి రజిత -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవులు రావడంతో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నసత్ర కేంద్ర భవనం, కొండపైన, కొండ కింద ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడున్నర గంటలకు పైగా, వీఐపీ టిక్కెట్ దర్శనానికి గంటన్నర, బ్రేక్ దర్శనానికి అర గంటకు పైగా సమయం పట్టింది. స్వామిని 45వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.57,56,656 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. ఆకట్టుకున్న నత్య ప్రదర్శన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని తూర్పు మాడ వీధిలోని సాంస్కృతిక వేదికపై ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారిణులు భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. హైదరాబాద్లోని ఉప్పల్లో గల వైష్ణవి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకురాలు స్వప్నప్రవీణ్ ఆధ్వర్యంలో విష్ణుజా, విశ్వజా కళాకారిణుల ఆధ్వర్యంలో ఈ నృత్య ప్రదర్శన కొనసాగింది. ఈ నత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. -
వాటర్ ట్యాంకర్తో వరి పొలానికి నీరు
రాజాపేట : ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్నారు. రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొందుగుల గ్రామానికి చెందిన రైతు మర్ల నాగరాజు తన పొలానికి వాటర్ ట్యాంకర్తో నీళ్లు పెడుతుండటం గమనించారు. నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వరి పంట వేశానని, నీళ్లు లేక పంట ఎండిపోతుందని సదరు రైతు నాగరాజు సీపీఐ నాయకులు తెలిపాడు. నిత్యం ఒక్కో వాటర్ ట్యాంకర్కు రూ.1500 చొప్పున చెల్లిస్తూ రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని చివరి దశలో ఉన్న తన వరి పొలానికి అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని వివరించాడు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిగుళ్ల లింగం తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నల్లగొండ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. నల్లగొండలో శనివారం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు మహిళలను, నూతన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులను ఆమె సన్మానించి మాట్లాడారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తారని చెప్పారు. ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీను మాట్లాడుతూ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనంతరం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మేయర్ చైతన్యను సన్మానించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి, రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, కొమిరిశెట్టి రమ, పందిరి గీత, కార్పొరేటర్ యామ కవిత, కటకం శ్రీనివాస్, ఉప్పల స్వప్న, చందా భాగ్యలక్ష్మి, లెంకలపల్లి మంజుల, నళిని, తాళ్లపల్లి రాము, పారేపల్లి శ్రీనివాస్, నాల వెంకటేశ్వర్లు, బుక్కా వెంకయ్య, మేడం విశ్వప్రసాద్, వందనపు జ్యోతి, వీరెల్లి సతీష్, కోటగిరి రామకృష్ణ, కర్నాటి నగేష్, డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తల మధ్యన నిత్య ఆర్జిత కై ంకర్యాలు విశేషంగా జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు.ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం భక్తుల కోలాహలం నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ప్రరిశ్రమల ఏర్పాటులో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నల్లగొండ జిల్లా
స్థూల జిల్లా ఉత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది. తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి తరువాత అత్యధికంగా నల్లగొండలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రై జెస్ (ఎంఎస్ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్ పోర్టల్లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది. ఫ ఉద్యమ్ పోర్టల్, ఎంఎస్ఎంఈ వద్ద భారీగా ఔత్సాహికుల దరఖాస్తులు ఫ 1051 రేషన్ దుకాణాలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నల్లగొండ ఫ జీడీడీపీలో 5వ, తలసరి ఆదాయంలో 9వ స్థానం ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే ఫ సోషియో ఎకనామిక్ఔట్లుక్–2026 వెల్లడి -
నల్లగొండను సస్యశ్యామలం చేస్తా
బి.వెల్లెంల ప్రాజెక్టు నీటిని పరిశీలించడానికి అప్పాజిపేట వద్ద బైక్ నడుపుతూ వెళ్తున్న మంత్రి బి.వెల్లెంల ప్రాజెక్టు కాల్వను పరిశీలిస్తున్న మంత్రి కోమటిరెడ్డిరామగిరి(నల్లగొండ) : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్లగొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వలలను బైక్పై తిరుగుతూ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ పనులకు అప్పాజిపేటలో శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా అప్పాజీపేట కాకి చెరువు, బంటుగూడెం చెరువులను నిండుతాయన్నారు. కాలువ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగుల ఆండాలుసైదులు, ఉప సర్పంచ్ పోలె సతీష్కుమార్ పాల్గొన్నారు.ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ బైక్పై తిరిగి బ్రాహ్మణ వెల్లెంల కాల్వల పరిశీలన -
డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదు
నల్లగొండ టౌన్ : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్లో నీటిమట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండికి అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు వస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ను సీపీఐ ఆద్వర్యంలో సందర్శిస్తామన్నారు. ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం పరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో బొల్గూరి నర్సింహ, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రవణ్కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న నృత్యాలు
నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ అతిథి గృహంలో వారంతంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శనివారం విజయ విహార్లో మిర్యాలగూడ కేంద్రియ విద్యాలయానికి చెందిన కీర్తన, వినీత, యస్మిత, హరిణి, పవిత్ర, జాస్మిత.. డాన్స్ మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో చేసిన నృత్యాలకు సందర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. నృత్యాలు చేసిన విద్యార్థులకు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో విజయ్ విహార్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో సకల జనులకు మొండిచెయ్యిదేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు మొండిచెయ్యి చూపించిందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్లో ఎక్కడా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదన్నారు. పేదలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికలకు ముందు అభయహస్తం మేనిఫెస్టోతో ప్రజలను నమ్మబలికి ఓట్లు దండుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 840రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సమావేశంలో నాయకులు కేతావత్ బీల్యానాయక్, కిషన్నాయక్, టీవీఎన్ రెడ్డి, ఆంజనేయులు, నీల రవి, వేముల రాజు, రూప్లానాయక్, పొట్ట మురళి, మధు, అంజి గౌడ్, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు. -
రైతులందరికీ ‘ఎకరం’ భరోసా
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి రైతు భరోసా ఆదివారం రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ తొలి విడతలో రైతులందరికీ ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానుంది. తిరిగి 20 రోజుల తర్వాత రెండో విడతలో రెండు ఎకరాల్లోపు వరకు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అనంతరం 3వ విడతలో ఏప్రిల్ చివరి నాటికి రైతులకు ఎన్ని ఎకరాలున్నా అంత వరకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబందించిన ఖాతాలు, నిధుల వివరాలను ట్రెజరీకి పంపించింది. ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి వానాకాలం యాసంగికి కలిపి రూ.10 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరానికి సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున ఇస్తున్న విషయం విధితమే. గత యాసంగి సీజన్లో రైతులకు ఎకరానికి రూ.6 వేలు చొప్పున జనవరి 26, 2025న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. కానీ ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికి రైతు భరోసా నిధులు జమ చేయలేదు. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ నెల 22న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను సిద్దిపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా నిధులు ఇలా.. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో రూ.5,78,764 మంది రైతులకు ఎకరం లోపునకు సంబంధించి రూ.303,04,41,953 ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా.. 5,22,313 మంది రైతులకు సంబంధించి రూ.268,57,20,042 రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ట్రెజరీకి పంపింది. ఈ మొత్తం రైతుల ఖాతాల్లో ఆదివారం జమ కానున్నాయి. ఫ నేడు రైతుల ఖాతాల్లో మొదటి విడత డబ్బులు జమ ఫ 20 రోజుల తర్వాత రెండెకరాల్లోపు రైతులందరికీ.. ఫ మూడో విడతలో అందరికీ ఇచ్చేలా సన్నాహాలు -
అన్న ప్రసాదానికి రూ.6 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు. గంజాయి పట్టివేత సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సీతారాంరెడ్డి
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. -
రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్రెడ్డి, రాచకొడ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం
నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
‘లవ్వాలా’ సినిమా డైరెక్టర్ అడ్లూరు వాసి
శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్కుమార్ డైరెక్టర్గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లోగల కాకతీయహిల్స్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్వాలా’ అనే సినిమాకు రంజిత్కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. పశు సంతతి గుర్తించాలిపశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి. మేలు జాతి పశువుల శరీర లక్షణాలుపాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పొదుగు లక్షణాలుపశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి. పశువుల కొనుగోలులో గుర్తుంచుకోవాల్సిన విషయాలుఅక్టోబర్, నవంబర్ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి. చూడాల్సిన అంశాలు● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి. ● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి. ● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి. ● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి. ● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి. ● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి. ● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి. ● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే పశువులను కొనకూడదు● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే) ● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం ● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు ● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.పశువుల బరువు తెలుసుకోవడం పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు. కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు. ఎల్ అనగా పశువు ముందు జబ్బ పాయింట్ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో. జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది. పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్రెడ్డి సూచనలు -
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం
సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు. 60 మంది బాధితుల నుంచి రూ.కోటి 85లక్షల వసూలు నిందితుడి అరెస్టు, రిమాండ్ -
ఆటోను ఢీ కొట్టిన కారు
మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యాపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ● ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు -
‘యూనిటీ’కి గద్దర్ అవార్డు
● కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ తీసిన భూదాన్పోచంపల్లి వాసి ● డిప్యూటీ సీఎం చేతులమీదుగా అవార్డు అందుకున్న దర్శకుడు, నిర్మాతభూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలి ఉద్యమనేత, మాజీ మంత్రి దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్పోచంపల్లికి యువ దర్శకుడు బడుగు విజయ్కుమార్ దర్శకత్వంలో, చౌటుప్పల్కు చెందిన చిత్ర నిర్మాత ధనుంజయ్య రూపొందించిన ‘యూనిటీ’కి ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ గద్దర్ అవార్డు–2026 దక్కింది. ఈమేరకు గురువారం రాత్రి హైదరాబాద్లోని శిల్పకళావేదికలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు చేతుల మీదుగా దర్శకుడు బడుగు విజయ్కుమార్ అవార్డు, రూ.5లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యతను పెంచింది దర్శకుడు విజయ్కుమార్ మాట్లాడుతూ.. గద్దర్ ఫిల్మ్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చిత్ర విజయంలో అండగా నిలిచిన నిర్మాత చిరందాస్ శ్రీకాంత్, ధనుంజయ్య, చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ్య మాట్లాడుతూ.. తాము రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే 12 అవార్డులు లభించాయని తెలిపారు. కాగా.. పోచంపల్లి వాసి రాష్ట్రస్థాయిలో గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం పట్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, భారత లవకుమార్, కొండా లక్ష్మ ణ్బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, అడ్వకేట్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎంఏ షరీఫ్, కార్టూనిస్ట్ దయానంద్, రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
లక్ష్యం మేరకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు పూర్తిచేస్తామని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పేర్కొన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి గురువారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 2,281 గృహ ప్రవేశాలకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 348 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, హౌసింగ్ డీఈ అబ్దుల్ వాజిద్, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ జయలక్ష్మీ, హౌసింగ్ ఏఈ ప్రీతి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పెద్దకాపర్తి, గుండ్రాంపల్లి గ్రామాల సర్పంచ్లు కాటం వెంకటేశం, బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది
వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి. – ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ వంట నూనెల ధరలను నియంత్రించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ధరలను నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టానురీతిగా పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. – రొయ్య కిరణ్, దేవరకొండ రోడ్డు -
మరో ఇద్దరికి విప్ హోదా
సాక్షి ప్రతినిది, నల్లగొండ : శాసన సభ, శాసన మండలిలో పలువురి సభ్యులకు విప్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్గా తుంగతుర్తికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ హోదా దక్కింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా వచ్చింది. వేముల వీరేశం, అద్దంకి దయాకర్కు ప్రభుత్వ విప్ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు విప్ హోదా -
నూనెల ధరలు ౖపైపెకి..
నల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ప్రీడమ్ ఆయిల్, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి హోల్సేల్, రిటేల్ వ్యాపారులు వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలో హోల్సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరను పెంచుతూ పోతున్నారు. జిల్లా అంతటా వంట నూనెల పరిస్థితి ఇలాగే ఉంది. హోల్సేల్ డీలర్లు సిండికేట్గా మారి.. గత నెలలో పామాయిల్ కిలో ప్యాకెట్ ధర రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.140కి చేరింది. ప్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ గత నెలలో కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.170 అయ్యింది. వేరుశగన (పల్లీ) నూనె గతంలో రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.170కి చేరింది. హోల్సేల్ డీలర్లు సిండికేట్గా ఏర్పడి యుద్ధాన్ని సాకుగా చూపుతూ నూనెల ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట నూనెల ధరలు నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో హోల్సేల్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం శుభాకార్యాల సీజన్ కావడంతో పాటు ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంట నూనెల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.ఫ కిలో రూ.170కి చేరిన పల్లీ, సన్ఫ్లవర్ ఆయిల్ ఫ గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 పెరుగుదల ఫ యుద్ధం సాకుతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఆందోళనలో సామాన్య ప్రజలు -
సమాజ సేవతోనే గుర్తింపు
చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన దాసరి శ్రీరాములు(విద్యారంగం), డాక్టర్ మూడ సుదర్శన్ (వైద్యరంగం), యేళ్ల భయ్యన్న(జర్నలిజం), కొంతం సత్తిరెడ్డి(వ్యవసాయం)లకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదమోహన్రెడ్డి, శ్రీకనకదుర్గా ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ, బొబ్బల శివశంకర్రెడ్డి, నర్రా భిక్షంరెడ్డి, చిలివేరు నర్సింహ, కాకులారపు బొర్రారెడ్డి, కంభంపాటి నర్సింహ, మల్లేష్, కృష్ణ పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దుకట్టంగూర్ : ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేదిలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫొటో క్యాప్చర్ విధానంతో కూలీలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందన్నారు. ఉపాధి హామీ నిధుల విషయంలో గతంలో 90 శాతం నిధులు ఇస్తుండగా ప్రస్తుతం 60 శాతానికి తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం దారుణమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.600 చొప్పున ఇస్తూ 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, చిలుముల రామస్వామి, గడగోజు రవింద్రాచారి, గద్దపాటి సుధాకర్, కృష్ణయ్య, పొన్న సురేష్, గంట మల్లేష్, నర్సింహ పాల్గొన్నారు. సంత వేలం 23వ తేదీకి వాయిదా మునుగోడు : మునుగోడు పశువుల సంత వేలం ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. బుధవారం సంత వేలం పాట నిర్వహించినా అనుకున్న పాట రాకపోవడంతో ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్రెడ్డి తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలలోపు డీడీలు చెల్లించి కొత్తవారు కూడా వేలంలో పాల్గొనాలని కోరారు. గరుడ వాహన సేవ మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో గురువారం గరుడవాహన సేవను ఊరేగించారు. అంతకుముందు శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,అర్చకులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
నల్లగొండ టౌన్ : మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో చింతకాయల సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 24న హైదరాబాద్లోనిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శ్రీనివాస్, పెరిక కృష్ణ, మోహన్, పి.లింగయ్య, రాములు, లక్ష్మయ్య, నాగరాజు, శివ పాల్గొన్నారు. -
బత్తాయి.. మందగమనం
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్పై ప్రభావం పడింది. దీంతో ప్రస్తుత వేసవిలో బత్తాయి ధర పెరగకపోగా కోతలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా బత్తాయి, నిమ్మ కాయలకు అంతగా విదేశీ ఎగుమతులు ఉండవు. ఎగుమతులకు అవసరమయ్యే లారీల కొరత కారణంగా మార్కెట్ స్తంభించింది. సొంత ప్రాంతాలకు వెళ్లిన లారీలు ఢిల్లీ పరిసర ప్రాంతాల లారీల డైవర్లు హోలీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి ఇంకా తిరిగా రాలేదు. ఈసారి కురిసిన అధిక వర్షాలకు కశ్మీర్లో ఆపిల్ పంట దెబ్బతినడంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం వల్ల విదేశాల నుంచి విమానాల ద్వారా ఆపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో లారీలకు కిరాయిలు దొరకక అక్కడే నిలిచిపోవడంతో ఇక్కడ లారీల కొరత ఏర్పడింది. లారీల కిరాయిలు 10 శాతం మేర పెరగడంతో వ్యాపారులు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. రంజాన్ పండుగ కారణంగా కూలీల కొరత, మార్కెట్లో క్రయవిక్రయాల్లో మందగమనం నెలకొంది. కత్తెర పంట కోతలోనూ జాప్యం బత్తాయి కత్తెర దిగుబడులు సాధారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమమవుతాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కత్తెర ముందు సీజన్ కాయల కోతలు పూర్తికాలేదు. ఆ కాయలకు కత్తెర దిగుబడుల్లో కలిసి అధిక ధర వస్తుందని ఆశిస్తున్నా కోయడంలో జాప్యం జరిగి కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే రేటు కుదుర్చుకున్న వ్యాపారులు పలు కారణాల వల్ల కాయలు కోయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడక్కడా వరికోతలు ప్రారంభం కావడంతో రైతులు కల్లాలకు ధాన్యం తీసుకువస్తున్నారు. గత ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 1న ప్రారంభించగా ఈసారి అంతకు ముందే ధాన్యం కొనుగోళ్లు చేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి సూచించడంతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 23న నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో కొనుగోళ్ల తేదీపై స్పష్టత రానుంది. దిగుబడి అంచనా.. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 6 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లు కొనుగోలు చేస్తారని, మిగిలిన ధాన్యం ఐకేపీ, పీఏసీఎస్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయనున్నారు. పెరగనున్న కేంద్రాలు యాసంగి సీజన్లో దిగుబడి అధికంగా వస్తున్నందున దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం 375 కొనుగోలు కేంద్రాల వరకు ఏర్పాటు చేయగా ఈసారి 400 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి ఎక్కడైతే ధాన్యం అధికంగా వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రధాన శాఖల అధికారులు, మిల్లర్లతో కూడా సమావేశం నిర్వహించారు. యాసంగి కొనుగోళ్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు వరికోతలు ప్రారంభం కావడంతో ఏ క్షణమైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. తూకం యంత్రాలతో పాటు టార్పాలిన్లు, గన్నీబ్యాగ్లు, టెంట్లు, ఇతర పరికరాలను సమకూర్చుతున్నారు. జిల్లాకు 2 కోట్ల వరకు గన్నీ బ్యాకులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. అందులో ఇప్పటికే జిల్లాలో 70 లక్షల వరకు గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మిగితా వాటిని సమకూర్చుకునే కార్యాచరణపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. జిల్లాలోని తిప్పర్తి మండలంలో ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కల్లాలకు ధాన్యం తెచ్చి ఆరబెడుతున్నారు. దీంతో గత సీజన్ కంటే ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. నెల 23వ తేదీన, లేదంటే ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్రంలోనే ముందుగా నల్లగొండ జిల్లాలోని ఆర్జాలబావి, తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1న ప్రారంభించారు. ఈసారి అంతకంటే ముందే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా మంత్రి సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి ఏడు మిల్లులు బ్లాక్లో ఉన్నందున ఆ మిల్లులకు పోయే ధాన్యాన్ని ఇతర మిల్లులకు మళ్లించి కొనుగోళ్లు చేపట్టేలా, ట్రాన్స్పోర్టు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మిల్లుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. ఉగాది, రంజాన్ పండుగల ప్రభావం వల్ల స్థానికంగా కూలీల కొరత ఉంది. ఢిల్లీ మార్కెట్లో వ్యాపారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ వారం బత్తాయి మార్కెట్ మందకొడిగానే సాగుతోంది. కొద్ది రోజులుగా లారీలు అందుబాటులో లేక కాయలు కోయలేకపోయాం. వచ్చే వారం నుంచి మార్కెట్లు పుంజుకుని బత్తాయి ధర పెరిగే అవకాశం ఉంది. – శంకర్రావు, బత్తాయి వ్యాపారి, కొప్పోలు ధరలేని కత్తెర పంట ఫ వరుస పండుగలు..లారీల కొరతే కారణం ఫ యుద్ధ ప్రభావంతో నిలిచిన ఎగుమతులు ఫ ఇబ్బందుల్లో బత్తాయి రైతులు ఫ 23 తర్వాత యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించే అవకాశం ఫ మంత్రి ఆదేశంతో ఈ సారి ముందుగానే కేంద్రాలు ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం ధాన్యం (లక్షల మెట్రిక్ టన్నుల్లో) దిగుబడి అంచనా 14 మార్కెట్కు వచ్చేది 8 మిల్లర్లు కొనేది 6 కొనుగోలు కేంద్రాలు 400 అవసరమైన గన్నీ బ్యాగులు 2 కోట్లు అందుబాటులో ఉన్నవి 70 లక్షలు -
ఘర్షణతో కాంగ్రెస్కు సంబంధం లేదు
చండూరు : చండూరులో గత ఆదివారం వ్యక్తిగత కారణాలతో యువకుల మధ్య జరిగిన ఘర్షణతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ గొడవలో కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురు మాత్రమే ఉన్నారని, మిగిలిన 12 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు.. కోమటిరెడ్డి బ్రదర్స్, కోడి బ్రదర్స్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 వార్డుల్లో పోటీచేస్తే ఒక్కటి కూడా గెలువలేదని, ఎవరిని బొందపెట్టాలో ప్రజలకు తెలుసన్నారు. చండూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోడి గిరిబాబు మాట్లాడుతూ ఇసుక మాఫియా నడిపే ఓ వ్యక్తి.. పోలీసుల అండతో అమాయకులైన యువకులపై కేసులు పెట్టించారని, గాయాలపాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పిటీషన్ ఇస్తే కూడా కేసు ఫైల్ చేయకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. దళిత యువకుడిని దూషించినా పోలీసులు పట్టించుకోకపోవం శోచనీయమన్నారు. గంగిడి మనోహర్రెడ్డి చీడపురుగని, బీజేపీకి పట్టిన దరిద్రం అని దుయ్యబట్టారు. వ్యక్తిగత గొడవలకు కూడా బీజేపీ బంద్కు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కటకం రమేష్, కాంగ్రెస్ నాయకులు కోడి వెంకన్న, పందుల సత్యం, కృష్ణారెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు. ఫ చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలికోదాడరూరల్ : కోదాడ మండలంలో ఆర్కే మేజర్ పరిధిలోని ఆయకట్టు గ్రామాలైన దోరకుంట, కాపగల్లు, నల్లబండగూడెం, రెడ్లకుంటలో వరి పంటకు నీరు అందడం లేదని, వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని రైతులు బుధవారం కాలువలోకి దిగి ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం వరి పైరుకు సరిపడినంత నీరు అందకపోతే ధాన్యం తాలుగా మారుతుందని రైతులు తెలిపారు. పంట కోతకు వచ్చేంత వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఎంజీయూ లా కాలేజీ ప్రిన్సిపాల్గా రవినల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపాల్గా కామర్స్ అధ్యాపకుడు ఆకుల రవిని నియమిస్తూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకుల రవి నియామకం పట్ల యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు
నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని, మరోసారి దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు హెచ్చరించారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చండూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్రెడ్డి, కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్ తదితరులు ఉన్నారు. డ్రగ్స్పై సిట్తో ఒరిగేదేమీ లేదుహైదరాబాద్ శివారులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫాంహౌస్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినవన్నీ ఉత్తమాటలే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఫామ్హౌస్కు డ్రగ్స్కు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో నాయకులే పాల్గొనడటం బాధాకరమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణ సమాజంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలి
కనగల్ : రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. కనగల్ మండలంలోని నర్సింహాపురం గ్రామంలో రైతు పుండరీకం చేపట్టిన పట్టు పురుగులు పెంపకం, మల్బరీ తోటలను బుధవారం కలెక్టర్ సందర్శించారు. 2017లో పట్టు పురుగుల సాగు చేపట్టి నేటి వరకు నిరంతరాయంగా కొనసాగిస్తున్నానని రైతు పుండరీకం కలెక్టర్కు వివరించారు. ఎకరాకు పెట్టుబడి కింద రూ.8లక్షల నుంచి రూ.10 లక్షల మేర ఖర్చు వస్తుందని వివరించారు. ప్రతి ఏటా ఎనిమిది పంటలు తీస్తున్నానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్బరీ పట్టు పురుగుల సాగుకు సబ్సిడీలు ఇచ్చాయని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మల్బరీ పట్టుపురుగుల పెంపకానికి ఈ ప్రాంత వాతావరణం చాలా అనుకూలమన్నారు. రైతులు పట్టుపురుగుల పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందాలన్నారు. రైతులు పట్టు పురుగుల పెంపకం వైపు మళ్లేఆ అధికారులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం తేలకంటిగూడెంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఇళ్ల గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లకు నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే బోరు మోటారు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉధ్వాన శాఖ డీడీ సుభాషిని, హార్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, సర్పంచ్ బైరు నాగమణినాగయ్య, కార్యదర్శి క్రాంతి, ఏఈఓ అభిలాష్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. దావత్ ఏ ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్.. రామగిరి (నల్లగొండ) : రంజాన్ మాసం సందర్భంగా నల్లగొండలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ముస్లింలకు ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విందును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పేద మైనార్టీలకు రంజాన్ పండుగ రోజు తోఫా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, డీఎస్పీ శివరాంరెడ్డి, డిప్యూటీ మేయర్ అమేర్ అలీ, తహసీల్దార్ పరశురాములు, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, మైనార్టీ నాయకులు ఎండీ బషీరుద్దీన్, ఎంఏ ఖాన్ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ -
చెర్వుగట్టులో ఘనంగా లక్షపుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈఓ మోహన్బాబు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ఈ పూజల్లో అర్చకులు సతీష్శర్మ, సురేష్శర్మ, శ్రీకాంత్శర్మ పాల్గొన్నారు. -
గృహ ప్రవేశాలకు అమావాస్య అడ్డు!
ఫ ఉగాది రోజున సామూహిక గృహ ప్రవేశాలకు లబ్ధిదారుల విముఖత ఫ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించే అవకాశంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు అమావాస్య అడ్డంకిగా మారింది. జిల్లాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఉగాది పండుగ రోజైన గురువారం సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అయితే అదే రోజు అమవాస్య ఉండడంతో గృహ ప్రవేశాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. దీంతో సామూహిక గృహ ప్రవేశాలకు బ్రేక్ పడింది. అయితే ఆ తరువాత స్థానిక పరిస్థితులను బట్టి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గృహ ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. లేదా లబ్ధిదారులు ఎవరికివారే గృహ ప్రవేశాలు చేసుకోవాలని అధికారులు సూచించనున్నారు. 99 రోజుల కార్యక్రమంలో 6,409 గృహాలు టార్గెట్ ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో జూన్ 12 నాటికి 6,409 ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు పూర్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 1809 గృహాలు పూర్తయ్యాయి. వాటిల్లో ఉగాది పండుగ రోజున గృహ ప్రవేశాలు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ నిర్ణయించారు. అత్యధిక గృహాలను నిర్మించి రాష్ట్రంలోనే నల్లగొండ రెండో స్థానంలో నిలిచింది. ఉగాది పండుగ అయినప్పటికి అమావాస్య రావడంతో నూతనంగా నిర్మించుకున్న గృహాల ప్రవేశాలకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో సామూహిక గృహ ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. కలెక్టర్ దృష్టికి తాగునీటి సమస్య ఇందిరమ్మ ఇళ్ల వద్ద తాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం కనగల్ మండలం తేలకంటివారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఎండాకాలం వచ్చినందున సమస్య మరింత ఎక్కువగా ఉందని, తాగునీటి సమస్య తీర్చాలని అక్కడి లబ్ధిదారులు కలెక్టర్కు విన్నవించారు. ప్రస్తుతం దూరం నుంచి పైప్లైన్లు వేసుకుని నీటిని తెచ్చుకుంటున్నామని చెప్పడంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను పంపించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లోని ఇళ్ల వద్ద కూడా ఇలాంటి సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
మున్సిపల్ అధికారులకే పన్నులు చెల్లించాలి
నల్లగొండ టూటౌన్ : వివిధ పన్నులను మున్సిపల్ అధికారులకు మాత్రమే చెల్లించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నల్లగొండలో ప్రజలకు ఫోన్ చేయడం, క్యూఆర్ కోడ్ సెండ్ చేసి ఇంటి, వాణిజ్య పన్నులు కట్టమని అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మోసాలను ప్రజలు గమనించాలని మున్సిపల్ కార్యాలయంలో, మున్సిపల్ అధికారులకు మాత్రమే పన్నులు చెల్లించాలని సూచించారు. అప్రమతంగా లేకపోతే ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు.గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026నల్లగొండలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్ చంద్రశేఖర్చెర్వుగట్టులో లక్షపుష్పార్చనఅర్హులంతా ఓటరుగా నమోదు కావాలినల్లగొండ : అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బుధవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సవరణ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈఆర్వోలు, మండల స్థాయిలో ఏఈఆర్ఓ, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు ఉంటారని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు మ్యాపింగ్ కాని వారందరూ మ్యాపింగ్ అయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముంతాజ్ అలీ, లింగస్వామి, రఫీ, అద్దంకి రవి, నర్సిరెడ్డి, యాదగిరి, పిచ్చయ్య, బషీరుద్దీన్ పాల్గొన్నారు. -
చండూరులో యువకుల మధ్య ఘర్షణ
● ఏడుగురికి గాయాలుచండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురికి గాయాలయ్యాయి. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన దోటి కిరణ్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. కిరణ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా పోటీలో నిల్చున్నాడని చండూరులోని శివాలయం యూత్ సభ్యులు అతడిపై కక్ష పెంచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల చండూరు మండలం తుమ్మలపల్లి జాతరలో పేకాట ఆడుతున్న కొందరు యువకులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. దోటి కిరణ్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు తమపై కేసులు పెట్టారని భావించిన యువకులు అతడిపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కస్తాల ఎక్స్ రోడ్ వద్ద దోటి కిరణ్, మరికొంత మంది యువకులు ఉండగా.. చండూరు శివాలయం యూత్ సభ్యులు కర్రలతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో దోటి కిరణ్, దోటి నరేష్, దోటి శివ, సోమ రాజు, భీమనపల్లి గణేష్, సంగెపు నరేష్, చెరుపల్లి వెంకటేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల ముందుగానే వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని పథకం ప్రకారమే తనపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 16మందిపై దోటి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 8 గ్యాస్ సిలిండర్లు స్వాధీనంయాదగిరిగుట్ట : యాదగిరిగుట్టలోని పలు హోటళ్లు, టీస్టాల్స్లో సివిల్ సప్లయి అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి 8 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఏఎస్ఓ సురేష్రెడ్డి, సీఎస్ నర్సింగ్రావు, ఆర్ఐలు విజయసింహారెడ్డి, నర్సింహారెడ్డి, రమేష్ పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
నల్లగొండ : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నల్లగొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మునుగోడు రోడ్డు గణేష్నగర్ కాలనీ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం కొంతమంది వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి నలుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 2 కిలోల గంజాయి, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు మహ్మద్ పుర్ఖాన్, కారింగుల ప్రదీప్, వల్కి వినోద్కుమార్, బైరుగొండ నవీన్గా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరు హైదరాబాద్లోని ధూల్పేట్ నుండి గంజాయిని తెచ్చి చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి నల్లగొండలోని యువకులు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు నలుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు కే. సతీష్, బి. లచ్చిరెడ్డి, సిబ్బందిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. 2 కిలోల గంజాయి, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వపత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
నల్లగొండ ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట
నల్లగొండ : ప్రేమ వివాహం చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని సోమవారం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను ఆయన కార్యాలయంలో ప్రేమ జంట కలిసి విన్నవించారు. నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన మారగోని నాగరాజు, తిరుమని అఖిల గత నెల 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించారు. కారు, బైక్ దగ్ధం మోతె : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కారు, బైక్ దగ్ధమయ్యాయి. వివరాలు.. మోతె మండల పరిధిలోని అన్నారిగూడెం గ్రామానికి చెందిన అంకిరెడ్డి మల్లయ్య ఇంటి ఆవరణలోని పార్కింగ్ చేసిన కారు, బైక్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. అదేవిధంగా ఇల్లు కూడా దగ్ధమైనట్లు మల్లయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం హాలియా : ఎక్కువ మంది ప్రయాణికులను తరలిస్తున్న ఆటో డ్రైవర్ను పోలీసులు ఆపి ప్రశ్నించగా.. పోలీసులను బెదిరించాలని అనుకొని ఆటో డ్రైవర్ నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం హాలియా పట్టణంలో జరిగింది. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాసుల రమేష్(45) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం రమేష్ తన ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా 16 మంది ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుండగా హాలియాలో పోలీసులు ఆపి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులను బెదిరించాలని అనుకున్న రమేష్ పక్కనే ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, స్థానికులు కాల్వలో కొట్టుకుపోతున్న రమేష్ను బయటకు లాగి అతడి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు రమేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సాగర్ ఎడమ కాల్వలో బాలుడు గల్లంతు నిడమనూరు : సాగర్ ఎడమ కాల్వలో ఈత కొడుతూ బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సఫియా కుటుంబం ఉపాధి నిమిత్తం నిడమనూరు మండలంలోని బొక్కమంతలపహాడ్ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద సఫియా బట్టలు ఉతుకుతుండగా.. వారి పదమూడేళ్ల కుమారుడు కాల్వలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనోవేదనతో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి కనగల్ : అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో.. గతంలో ఆ సంస్థ ఏజెంట్గా పనిచేసిన వ్యక్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కనగల్ మండల పరిధిలోని శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన గంజి లక్ష్మీనారాయణ(65) గతంలో అగ్రిగోల్డ్ ఏజెంట్గా పనిచేశాడు. తనకు తెలిసిన వారి నుంచి లక్షల రూపాయలు ఆ సంస్థలో పెట్టుబడి పెట్టించాడు. కొంతకాలానికి ఆ సంస్థ మూతబడటంతో డబ్బులు కట్టిన వారు.. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మీనారాయణపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. -
ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు
పాలకవీడు : ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని గడ్డిపల్లి కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్త నరేష్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై సోమవారం పాలకవీడు మండలం కోమటికుంట గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రముఖ వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రకృతి వ్యవసాయ విధానాలపై సమగ్రంగా వివరించారు. రసాయన మందులు, పురుగు మందుల వాడకం వల్ల నేల నిస్సారమవడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటోందన్నారు. పాలేకర్ సూచించిన జీవామృతం వంటి సహజసిద్ధ ఎరువులు తయారు చేసుకుని వినియోగించడం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయన్నారు. పెట్టుబడి లేని ఈ సాగు విధానం వల్ల రైతులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందన్నారు. రైతులు రసాయన సేద్యాన్ని విడిచిపెట్టి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.కళ్యాణచక్రవర్తి, సర్పంచ్ వడిత్య సునీత, ఇఫ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, ఏఈఓ గోపి, కార్యదర్శి నాగలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. -
భార్యను కత్తితో పొడిచిన భర్త
ఆత్మకూరు(ఎం) : భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఆమెను కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన గుర్రాల మంజుల కుమార్తె దేవికి, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన వెంపటి మహేష్తో 2012లో వివాహం జరిగింది. వీరికి కుమార్తె రేణుక ఉంది. మహేష్ కుటుంబంతో కలిసి బీబీనగర్లో ఉంటూ తాపీ మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దేవి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మహేష్ అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీరి కుమార్తె రేణుక సికింద్రాబాద్లో ఉంటున్న మహేష్ తల్లిదండ్రుల వద్ద ఉంటుండడంతో దేవి కూడా అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి ఈ మధ్యనే తన పుట్టిల్లు ఆత్మకూరు(ఎం)కు వచ్చింది. దేవిని తీసుకెళ్లడానికి మహేష్ సోమవారం ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మహేష్ కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దేవిని విచక్షణారహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దేవిని అంబులెన్స్లో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేష్ ఆత్మకూరు(ఎం)పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఘాతుకం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు? -
అర ఎకరంలో పన్నెండు పంటలు
స్వయంగా బండిపై విక్రయిస్తూ.. హనుమంతు చేనులో సస్యరక్షణ చర్యలు, అంతర్ కృషిచేస్తుండగా అతడి భార్య మాధవి ప్రతిరోజు ఉదయం కూరగాయలు, ఆకుకూరలను తెంపుకుని తమ చేను సమీపంలో ఉన్న ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్ద బండిపై పెట్టి స్వతహాగా విక్రయిస్తోంది. రోజుకు ఎంతయితే అమ్మకాలు జరుగుతాయో అంతే పరిమాణంలో కూరగాయలు, ఆకుకూరలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మార్కెట్లో కూరగాయల దుకాణాలకు పోస్తే తక్కువ రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అదే నేరుగా తామే విక్రయించుకుంటే కిరాయి ఖర్చులు తగ్గి రెట్టింపు ఆదాయం వస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం రోజుకు అన్నిరకాల కూరగాయలు కలిపి అర క్వింటాల్కు పైగానే విక్రయిస్తున్నట్లు హనుమంతు దంపతులు చెబుతున్నారు.పెద్దవూర: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి, మిరప పంటలు సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా వెళ్లడం లేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన రైతు కాశిమళ్ల హనుమంతు, మాధవి దంపతులు మాత్రం గత మూడేళ్లుగా తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలోనే పన్నెండు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. కూరగాయలు, ఆకుకూరలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాశిమళ్ల హనుమంతు తనకున్న వ్యవసాయ భూమిలో ఖరీఫ్లో పత్తి, మిరప, కంది పంటలు సాగు చేశాడు. పత్తి పంట చేతికి రాగానే పత్తి కట్టెను తొలగించి 20 నుంచి 30 గుంటల భూమిని కూరగాయలు, ఆకుకూరల సాగుకు కేటాయించి చదును చేశాడు. రెండు గుంటల భూమిలో చిన్నపాటి కర్రలను ఏర్పాటు చేసి తీగ పందిరి ఏర్పాటు చేశాడు. బీర, సొరకాయ, కాకర విత్తనాలు వేసి తీగలకు సుతిలితో పైకి ఎక్కేలా చేశాడు. మిగిలిన భూమిలో టమాట, బెండ, దోస, కాకర, గోరుచిక్కుడు, చిక్కుడు, వంగ వంటి కూరగాయలతో పాటు పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర వంటి ఆకుకూరలను సాగు చేస్తూ తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.పెట్టుబడి తక్కువ.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండటంతో అర ఎకరం పొలంలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను సాగు చేశాను. చీడపీడల నివారణకు తప్ప క్రిమిసంహారక మందుల పిచికారీ తక్కువే. రెండు గుంటల భూమిలో ప్లాస్టిక్ వైరు, కర్రలతో తీగ పందిరి వేసి బీర, కాకర, సొరకాయలు సాగు చేశాను. వీటికి నీటి వినియోగం కూడా తక్కువే. ఒక్కసారి పాలకూర విత్తనాలు వేస్తే 8 నుంచి 10 సార్లు కోసుకోవచ్చు. నిత్యం ఆదాయం వస్తుంది. – కాళిమళ్ల హనుమంతుచక్రాల బండిపై విక్రయిస్తున్నా పండించిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్కు తీసుకెళ్తే తక్కువ రేటుకు అడుగుతున్నారు. దీంతో మా చేను సమీపంలోని ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్దకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చిపోతుంటారు. దీంతో నాలుగు చక్రాల బండిని కొనుగోలు చేసి ఉదయం కూరగాయలు, ఆకుకూరలను తెంపి మధ్యాహ్నం నుంచి నేరుగా విక్రయిస్తున్నాను. దీంతో లాభాలు పొందుతున్నాం. – కాళిమళ్ల మాధవి కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగుచేస్తున్న దంపతులు -
రైతు భరోసాకు ముహూర్తం
భానుపురి (సూర్యాపేట), నల్లగొండ అగ్రికల్చర్, భువనగిరి : యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సిద్దిపేట జిల్లాలో ఈనెల 22న సీఎం రేవంత్రెడ్డి మొదటి విడతగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. అయితే వానాకాలం సీజన్ మాదిరిగా కాకుండా ఈ యాసంగిలో మూడు విడతల్లో రైతులందరికీ రైతు భరోసా సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట విడతలో ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే రూ.6000 చొప్పున జమ చేయనున్నారు. ఆ తర్వాత 20 రోజులకు ఎకరంపై భూమి ఉన్న రైతులకు రెండో విడతలో రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. అనంతరం మరో 20 రోజుల తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు అర్హులైన రైతులందరికి రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన ఈ నిధులను చాలా ఆలస్యంగా పంటలు చేతికి వచ్చే దశలో ప్రభుత్వం అందిస్తోంది. వరుస ఎన్నికలు, నిధుల సమస్యతో ఆలస్యం కాగా.. ఇప్పటికై నా నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు విడతల్లో సాయం సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 2.70లక్షల మంది రైతులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 6.19 లక్షల ఎకరాల భూమికి రైతుబంధు నిధులు అందాయి. అయితే అనర్హులకు రైతుభరోసా అందుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలు చేపట్టి సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ లెక్కన గత యాసంగిలో సాగు భూములను సర్వే చేయగా.. 7,581 ఎకరాల భూమికి అదనంగా రైతు భరోసా అందుతున్నట్లు గుర్తించారు. వీటికి మినహా ఇతర భూములకు పెట్టుబడి సాయం ఇచ్చింది. అదేవిధంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులున్నారు. వారికి ఎకరానికి 6 వేల చొప్పున రూ.738,67,60,000 ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.33 లక్షల మంది రైతులు ఉన్నారు. సుమారు 6లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. వారి ఖాతాల్లో రైతు భరోసా కింద సుమారు రూ.300కోట్లు జమకానున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో..రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ప్రతీ సీజన్లోనూ ఆలస్యంగా రైతుల అకౌంట్లలో జమ చేసింది. యాసంగి సీజన్ నవంబర్ రెండో వారంలో ప్రారంభమై.. డిసెంబర్, జనవరిలో ముమ్మరంగా సాగుతోంది. ఈ సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అవసరం అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం సీజన్లో ముందుగా వేసిన వరి పంట మరో 20 రోజుల్లో చేతికి వచ్చే సమయానికి రైతు భరోసాను అందిస్తోంది. 22వ తేదీ నుంచి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ ఎకరాకు రూ.6వేల చొప్పున ఇవ్వనున్న ప్రభుత్వం ఆలస్యంగానైనా అందుతున్న యాసంగి పెట్టుబడి సాయంఉమ్మడి జిల్లాలో లబ్ధి పొందనున్న రైతులు.. జిల్లా మొత్తం రైతులు అందనున్న సాయం నల్లగొండ 5.65లక్షలు రూ.738.67 కోట్లు సూర్యాపేట 2.70లక్షలు రూ. 366.50 కోట్లు యాదాద్రి భువనగిరి 2.33లక్షలు రూ.300 కోట్లు -
వంగమర్తి రీచ్ నుంచి యథేచ్ఛగా తరలుతున్న ఇసుక
సాక్షి ప్రతినిధి నల్లగొండ : శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామ పరిధిలో గల మూసీనది వద్ద ప్రభుత్వ అనుమతితో కొనసాగుతున్న ఇసుక క్వారీ అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఇసుక క్వారీ నిర్వహణ ఉంది. మూసీ ప్రాజెక్టులో పూడిక తీసిన ఇసుకను తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) స్టాక్ పాయంట్కు తరలించకుండా నేరుగా ఇసుక పూడికతీత వద్దకే లారీలు, టిప్పర్లు వెళ్లి ఇసుకను లోడ్ చేసుకుని బయటికి వెళ్లిపోతున్నాయి. దీనివల్ల టీజీఎండీసీ ఇసుక స్టాక్ను ఆన్లైన్లో నమోదు చేయడంలేదు. ఇలా ప్రభుత్వ పనుల కోసమంటూ రోజుకు 60కు పైగా టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. దీంతో ప్రభుత్వం వద్ద ఇసుకను కొనుగోలు చేసే లారీలకు ఇసుక డీడీలు లభించడం అసాధ్యంగా మారింది. ఇంత జరుగుతున్నా టీజీఎండీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. 2012 నుంచి ఇసుక క్వారీ.. మూసీ ప్రాజెక్టు పూడిపోతుండటంతో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న శాలిగౌరారం మండలంలోని ఇటుకులపహాడ్, వంగమర్తి గ్రామాల పరిధిలో ఇసుక పూడికతీత(డీషిల్టింగ్)కు 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటి నుంచి మూసీ ప్రాజెక్టులో వంగమర్తి, ఇటుకులపహాడ్ పరిధిలో ఇసుకరీచ్(క్వారీ)లు ఏర్పాటు చేశారు. మూడునాలుగేళ్ల క్రితం ఇటుకులపహాడ్లో క్వారీ నిలిచిపోగా, వంగమర్తి క్వారీ కొనసాగుతోంది. వంగమర్తి క్వారీకి కూడా 2025 జూన్ 9 వరకే అనుమతి ఉండగా ప్రకృతి వైపరిత్యాల వల్ల నిర్ణీత కాలంలో ఇసుక పూడికతీత పనులు పూర్తికాలేదు. ఇంకా 3.25 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక(5.20 లక్షల మెట్రిక్ టన్నులు) పూడికతీత చేపట్టాల్సి ఉండటంతో ప్రభుత్వం సంబంధిత క్వారీ నిర్వాహణదారుడికి 2026 జూన్ 8 వరకు ఇసుక అనుమతి ఇచ్చింది. మూసీ ప్రాజెక్టు నుంచి పూడిక తీసిన ఇసుకను కాంట్రాక్టర్ క్వారీ వద్ద టీజీఎండీసీకి చెందిన స్టాక్ పాయింట్కు తరలించాలి. అక్కడ స్టాక్ అయిన ఇసుకను టీజీఎండీసీ ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పనులకు కేటాయింపులు.. వంగమర్తి క్వారీ ఇసుకను ప్రభుత్వ పనుల కోసం కేటాయించింది. ఇందులో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు మెట్రిక్ టన్ను ఇసుకను రూ.90కి ఇస్తుండగా, ఇందిరమ్మ ఇండ్లు, సాండ్ బజార్, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో పాటూ ప్రైవేట్ వ్యక్తులకు మెట్రిక్ టన్ను రూ.375లకు విక్రయిస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుకను తరలించే వాహనాలకు లోడింగ్ దగ్గర నుంచి అన్లోడింగ్ జరిగే వరకు ఎక్కడా పక్కదారి పట్టకుండా జీపీఎస్ సిస్టంను అమర్చడంతో పాటు సంబంధితశాఖకు చెందిన సిబ్బంది ఒకరు ఆ వాహనంలో వెళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం టీజీఎండీసీ పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇక్కడ ఇసుక పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తనతోపాటు తనకు సంబంధించిన మరో ఇద్దరు వ్యక్తుల పేరుతో 55 టిప్పర్లను కొనుగోలు చేసి ప్రభుత్వ పనుల పేరుతో టీజీఎండీసీ వద్ద ప్రభుత్వ నిర్ధేశిత ధరకు ఇసుకను కొనుగోలు చేసి బయటికి తరలిస్తున్నాడు. ప్రభుత్వ పనుల పేరిట డీడీలు.. మైనింగ్ అధికారుల సహకారంతో ప్రభుత్వ పనుల పేరుతో డీడీలను పొందుతున్న కాంట్రాక్టర్ తన టిప్పర్లతో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు ఇసుకను విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానిక ఇసుక లారీల యజమానులు అంటున్నారు. వంగమర్తి ఇసుకరీచ్ నుంచి కాంట్రాక్టర్ రోజుకు కనిష్టంగా 60 టిప్పర్ల ఇసుక(210 మెట్రిక్ టన్నులు) అక్రమంగా తరలిస్తున్నారని, దాని విలువ రోజుకు రూ.30 లక్షలకు పైమాటే ఉంటుందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్కు సహకరిస్తుండడం వల్లే తాము ఇసుకను రవాణా చేసుకునేందుకు ఆన్లైన్లో ఇండెంట్ లేకపోవడంతో డీడీలు దొరకక ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని ఇసుక లారీల యజమానులు ఆరోపిస్తున్నారు.వంగమర్తి ఇసుకరీచ్లో జరిగే అక్రమ రవాణా విషయం మండలస్థాయి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు అందరి సహకారాలు ఉన్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత కాకుండా స్థానిక, జిల్లా ‘ముఖ్య’ ప్రజాప్రతినిధులు, వీవీఐపీల సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. వారంతా తమ వాటాలు పుచ్చుకునే అక్రమాలకు సహకరిస్తున్నారనేది బహిరంగ ఆరోపణ. వంగమర్తి ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఇసుక లారీల యజమానులు, స్థానికులు ఇసుకరీచ్ వద్ద ఇటీవల వరుసగా రెండురోజుల పాటూ ఆందోళన చేపట్టడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. -
డీఈఈ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : తెలంగాణ డీఈఈ సెట్ – 2026 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్సీ) రెండు సంవత్సరాల కోర్సులకుగాను 2026–28 బ్యాచ్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కారింగుల నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత తదితర వివరాలకు 8317567404 ఫోన్ నంబర్ను సంప్రదించాలని, http:deecet.cd-se.telangana.gov.in వెబ్సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతంనార్కట్పల్లి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ భద్రాచలం పర్యటనకు వెళ్తూ సోమవారం నార్కట్పల్లిలో కాసేపు ఆగారు. ఆయనకు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్, ఆర్ఐ తరుణ్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 30 మంది తమ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలకు సంబంధించిన సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు ఆయా సమస్యను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో మార్పును సహించంచిట్యాల : ఉపాధిహామీ చట్టంలో మార్పులను సహించేది లేదని, పాత చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని వనిపాకల, వట్టిమర్తి, నేరడతో పాటు పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పని ప్రదేశాలను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహతో కలిసి ఆయన సందర్శించారు. కూలీతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ, పంచాయతీలకు లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆయన వెంట వనిపాకల సర్పంచ్ కొడేటి మహిపాల్రెడ్డి, ఉపసర్పంచ్ బద్దల లింగస్వామి, మాజీ ఎంపీపీ ఐలేష్, మల్లేష్, మేడి నర్సింహ, ఎల్ల వెంకట్రెడ్డి, సర్పంచ్లు మేడి శ్రీలత, మిర్యాల వెంకటేశం, ఉపసర్పంచ్ మహేందర్, దుబ్బాక రజనీకాంత్రెడ్డి, గాలిబ్, కృష్ణయ్య, కొండ వెంకన్న ఉన్నారు. -
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
నల్లగొండ టూటౌన్ : స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, మైనార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 56 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని 40 రోజులపాటు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను అందించారు. అనంతరం కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో నల్లగొండకు 1,152 కుట్టు మిషన్లు వచ్చాయన్నారు. మొదటి విడతలో 56 మందికి 100 శాతం సబ్సిడీతో పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతావి విడతలవారీగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మిషన్లు తీసుకున్న మహిళలు వాటిని వినియోగించుకొని స్వయం ఉపాధి పొందాలన్నారు. సెట్విన్ ద్వారా మహిళలకు బ్యుటీషియన్, టైలరింగ్తో పాటు వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మైనార్టీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ రవీందర్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వీఓఏలపై పనిభారం తగ్గించాలని ధర్నా
నల్లగొండ టౌన్ : విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ)లపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం, వీఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వీఓఏలకు రూ.20వేల కనీస వేతనాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వీఓఏల సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఈనెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజు, బషీర్, పోలే సత్యనారాయణ, వెంకన్న, రేణుక, సువర్ణ, నగేష్, పాపయ్య, సావిత్రి, శైలజ, రాజు, సైదులు, సుమీలా, పుష్ప, మంగ, అజిత, కలమ్మ, పుష్పలత, కోటిరెడ్డి, పద్మ పాల్గొన్నారు. -
ప్రజావాణిలో 105 ఫిర్యాదులు
నల్లగొండ : ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 105 ఫిర్యాదులు రాగా.. రెవెన్యూకు సంబంధించి 60, జిల్లా అధికారులకు 45 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామని.. ఈనెల 28 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. వంట గ్యాస్ ఇబ్బందులు తలెత్తొద్దు : కలెక్టర్ ప్రజావాణి అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లు 21 రోజుల నుంచి 45 రోజుల్లోపు సరఫరా చేస్తున్నారని.. సిలిండర్లను బ్లాక్ చేయడం, డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య పరంగా వినియోగించడం నేరమన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో గ్యాస్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాల పంపిణీ, ఇఫ్తార్కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 22, 23 తేదీల తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.ఫ బాధితుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ చంద్రశేఖర్ -
స్వయంగా చెత్త సేకరించిన సర్పంచ్
చిట్యాల : చిట్యాల మండలంలోని బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామిగౌడ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో చెత్తను సేకరించారు. ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో గ్రామ పంచాయతీ సిబ్బంది పనులకు రావటం లేదు. చెత్త సేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ డ్రైవర్కు జీతం లేకపోవటంతో అతను కూడా విధులకు రావటం లేదు. గ్రామంలో చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్ స్వామిగౌడ్.. తానే ట్రాక్టర్ నడుపుతూ వీధి వీధికి వెళ్లి చెత్త సేకరించారు. గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్ను నడుపుతున్న సర్పంచ్ స్వామిగౌడ్ -
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్గౌడ్కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్నగర్కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్లోని ఫిల్మ్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
నల్లగొండ : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని సెట్విన్ సంస్థలో శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. సెట్విన్ సంస్థ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సుల్లో 1250 మందికి శిక్షణ ఇచ్చారని.. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ వద్ద న్యాక్ శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రిషియన్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామన్నారు. మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలుస్తాం.. మూసీ కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలుస్తుందన్నారు. గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని.. ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్కే మాత్రమే పరిమితమైన సెట్విన్ను జిల్లాలకు విస్తరించామని, ప్రతి సంవత్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందాలని పేర్కొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు స్వయం ఉపాధి చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్అలీ, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపాల్ రేణుక పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ -
నిమ్మ.. బస్తా రూ.2500
నేను రెండు ఎకరాల్లో నిమ్మ సాగు చేశాను. వంద చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాకున్న వంద చెట్లకు గాను ఈ సీజన్లో 100 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా 20 బస్తాలకు మించి రాలేదు. దీర్ఘకాలిక పంట అయిన నిమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిలడక ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి. – యానాల శ్రీనివాస్రెడ్డి, నిమ్మ రైతు, నెల్లిబండ, నకిరేకల్ మండలం నకిరేకల్ : నిమ్మకాయల రేటు ఒక్కసారిగా పెరిగింది. వేసవికాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలను ప్రజలు ఎక్కవగా వాడుతుండడంతో నిమ్మకు మంచి ధర వస్తోంది.. తెలంగాణలో ఏకై క నిమ్మ మార్కెట్ ఉన్న నకిరేకల్లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చైన్నె, కలకత్తా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం నకిరేకల్మార్కెట్లో నిమ్మ బస్తా (23 కేజీల టిక్కి) రూ.2000 నుంచి రూ.2500 పలుకుతోంది. కానీ నిమ్మ తోటలను తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు పెరిగినా రైతులకు ప్రయోజనం ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూమారు 30 వేల ఎకారాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20 వేల రైతు, కౌలుదారు కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు, మంచుతో పాటు చెట్లకు ఎర్ర తెగులు వ్యాపించాయి. దీంతో నిమ్మ చెట్లపైన పూత రాలిపోవడంతోపాటు పిందె కూడా లేకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఏటా మార్చి నుంచి మే వరకు నిమ్మకు మొదటి విడత మంచి సీజన్ ఆ తరువాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండో విడత సీజన్ ఉంటుంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే నిమ్మ ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు లాభం లేకుండా పోయింది. ప్రసుత్తం మార్కెట్ వచ్చేది 5 వేల బస్తాలే.. రెండు నెలల క్రితం నకిరేకల్ మార్కెట్కు రోజూ 10 వేల నుంచి 15 వేల బస్తాల దిగుమతులు వచ్చేవి. అప్పట్లో బస్తా ధర రూ.500 నుంచి రూ.700 ధర పలికింది. ఇప్పుడు 5 వేల బస్తాలకు మించి నిమ్మ దిగుమతులు రావడం లేదు. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల ధర రూ.2000 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది. మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోడంతో తోటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఒక్క చెట్టు నుంచి 3 నుంచి 4 బస్తాల దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఒక్క బస్తాకు మించి రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో భారీగా పెరిగిన నిమ్మకాయల ధర ఫ వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులు ఫ ధర పెరిగినా రైతులకు దక్కని ప్రయోజనం -
తొలి రోజు 37 మంది గైర్హాజరు
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 106 పరీక్ష కేంద్రాల్లో తెలుగు పరీక్ష నిర్వహించినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. పరీక్ష రెగ్యులర్ విద్యార్థులు 19,653 మందిగాను.. 19,619 మంది పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 19 మందికి గాను 16 మంది హాజరయ్యారు. ముగ్గురు.. మొత్తం 37 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల తనిఖీ పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. శనివారం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల, మండలంలోని దోమలపల్లి జెడ్పీహెచ్లోని పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలోకి ఇతరులేవరూ వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులను పూర్తగా తనిఖీ చేయాలని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
నల్లగొండ : అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ (గృహ అవసరాలు) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్యాస్ సరఫరా లేదన్న సాకుతో జిల్లాలోని హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల భోజనానికి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రిన్సిపాళ్లను, సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. గ్యాస్ సక్రమ సరఫరా, పర్యవేక్షణ విషయమై ప్రభుత్వం జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్బంగా ఆయన శనివారం గ్యాస్ సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సీనియార్టీ ప్రకారం గ్యాస్ సరఫరా చేయాలన్నారు. జిల్లా దాటి ఇతర ప్రాంతానికి గ్యాస్ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా కమర్షియల్ సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు జిల్లాస్థాయి కమిటీ తీర్మాణించిందన్నారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పొడిగింపు
నల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన మార్కెట్ చైర్మన్ పదవీకాలం ఆరు నెలలు పొడిగించడంపై జూకూరి రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో రైతుల సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా పని చేస్తానని తెలిపారు. కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి నల్లగొండ టౌన్ : రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని ఎస్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా 13వ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్లను అమలు చేయబోమని తీర్మాణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయని కారణంగా కోటి మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూలై నుంచి పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పరిపూర్ణాచారి, ఎండీ.సలీం, మల్లు గౌతంరెడ్డి, సైదులు, బి.ప్రమీల, దందెంపల్లి సత్తయ్య, చింతపల్లి బయ్యన్న, నల్ల వెంకటయ్య, కానుగు లింగస్వామి, అవుట రవీందర్, జిట్టా నగేష్, శ్రీనివాస్, రాజు, నర్సింహ, పోలె సత్యనారాయణ, వెంకటమ్మ, పార్వతి, అంజయ్య, సైదాచారి, అనురాధ, సునీత, శ్రీవాణి, దయానంద్, ముత్యాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలిమిర్యాలగూడ : మన సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సాంఘిక, పద్య నాటికలు ఎంతగానో దోహదపడుతాయని రిటైర్డ్ ఉపాధ్యాయుడు, కవి, రచయిత వారణాసి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు ఆరవ రోజు కొనసాగాయి. ఈ పోటీలను శనివారం ఆయన తెలంగాణ నాటక సమాఖ్య సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు విలకత్తుల పుల్లయ్యతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. పద్యాల ద్వారా తెలుగు భాషలోని మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ, పదజాలంపై పట్టు పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తడకమళ్ల రామచంద్రరావు, రామవతారం, పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం పాల్గొన్నారు. జల నారాయణుడికి మంగళహారతులుభువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి జల నారాయణ స్వామికి మంగళహారతుల సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఎండతున్న పైరు.. ట్యాంకర్తో నీరు
చిట్యాల : చేతికొచ్చే దశలో వరి వాడు పడుతున్నాయి. బోర్లు వట్టిపోవడంతో పంటలకు నీరు అందడం లేదు. దీంతో పొట్టదశకొచ్చిన వరి చేలను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా వరి చేలకు నీటిని అందిస్తున్నారు. ఈ పరిస్థితి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలలో నెలకొంది. గ్రామానికి చెందిన పలువురు రైతులు చేతికొచ్చే దశలో బోరు ఎండిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. అయినా పంటకు నీరు సరిపోక ఎండిపోతోంది. ఈ దశలో పంట ఎండిపోతే అప్పుల పాలు అవుతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి సాగునీరు అందిస్తే.. భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యాటక ప్రాంతాలను ప్రత్యేక టూరిజం కారిడార్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నందికొండ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. అనంతరం ఆయనను స్థానిక నాయకుడు రాజగోపాల్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మధుకర్రెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడాలిమిర్యాలగూడ : అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడేలా నిధుల కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచే విధంగా నిధులు కేటాయింపు ఉండాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి వాటిలో ప్రస్తుతానికి మూడు మాత్రమే అమలులో ఉన్నాయని, మిగిలిన వాటిని తక్షణమే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్లాన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, శశిధర్రెడ్డి, మంగారెడ్డి, రవినాయక్, పరుశురాములు, వినోద్నాయక్ పాల్గొన్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషిచేయాలిమునుగోడు : ఉపాధిహామీ పథకం ద్వారా భూగర్భ జలాలు పెంచే పనులు చేపట్టాలని కేంద్ర అధ్యయన బృందం సభ్యులు సూచించారు. శుక్రవారం మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన చేపల చెరువులు, చెక్ డ్యామ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అడుగంటున్న భూగర్భ జలాలు పెరగాలంటే చెక్ డ్యామ్లు, చేపల చెరువుల నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర అధ్యయన బృందం సభ్యులు నవనీత్, రాచీగార్, ప్రతీప కోరేడే, ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిటెంట్లు నాగరాజు, అలివేలు, ఫీల్డ్ అసిటెంట్ శ్యామల, రైతులు ఉన్నారు. -
పోలీస్స్టేషన్లలో గ్రంథాలయాలు శుభ పరిణామం
నల్లగొండ : పోలీస్స్టేషన్లలో గ్రంథాలయాల ఏర్పాటు శుభ పరిణామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘స్టార్ట్ లైబ్రరీ – సేవ్ లైబ్రరీ’ నినాదంలో భాగంగా నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని 20 పోలీస్ స్టేషన్లలో గ్రంథాలయాలకు సంబంధించిన పుస్తకాలను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. సమయం దొరికితే మొబైల్ ఫోన్లలో మునిగిపోతున్న వారికి పుస్తక పఠనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్న తరుణంలో విపంచి ఫౌండేషన్ ముందుకు గ్రంథాలయాలు ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గాదె వినోద్రెడ్డి, విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారుడు అందోజు నాగభూషణం, ఫౌండేషన్ సభ్యులు గడ్డం సత్యనారాయణ, డాక్టర్ బావన రుషి, నడిగోటి శ్రీనివాస్, పోలోజు వెంకటాచారి, మేకల ప్రదీప్రెడ్డి, స్వామి పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
పునరుద్ధరణ ఇంధనాలతో భవిష్యత్తు
రామగిరి(నల్లగొండ) : పునరద్ధరణ ఇంధనాలతో ఉజ్వల భవిష్యత్ ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.జలపతి అన్నారు. ఎన్జీ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రీన్ మెథడ్స్, నానో మెటీరియల్స్ పాత్రను వివరించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పునరుద్ధరణ ఇంధన వనరులపై దృష్టి సారించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మావతి మాట్లాడుతూ కంప్యూటర్ కెమిస్ట్రీ ద్వారా ఎనర్జీ మెటీరియల్స్ మోడలింగ్ ప్రాధాన్యతను వివరించారు. పారిశ్రామికవేత్త నవీన్కుమార్ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ ఫార్మాస్యూటికల్స్ ఆవశ్యకతను వివరించారు. అనంతరం పరిశోధన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, వెంకటేశ్వర్లు, అనిల్కుమార్, సీఈఓ మునిస్వామి, బత్తిని నాగరాజు, అధ్యాపకులు ఏ.మల్లేశం, శ్రీధర్, కోటయ్య, జోత్న్స తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామానికి రోడ్డు వేయిస్తా
మునుగోడు : తన పదవీకాలం పూర్తయ్యేలోగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి పక్కా బీటీ రోడ్లు వేయిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండలంలోని చల్మెడ, కల్వకుంట్ల, మునుగోడు, ఎల్గలగూడెం, సోలిపురం, కిష్టాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, దుబ్బకాల్వ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కేవలం 12 ఫీట్ల వెడల్పుతో రోడ్లు నిర్మించేందుకు నిధులు చేసిందని.. ఆ రోడ్లను తాను 18 ఫీట్ల వెడల్పుతో నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించానని చెప్పారు. పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాలె అభివృద్ధి చెందుతాయన్నారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వంతో కొట్లాడైనా సరే నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ డీఈ నాగేశ్వర్రావు, తహసీల్దార్ ఎన్.నరేష్, ఎంపీడీఓ యుగేందర్రెడ్డి, పంచాయితీరాజ్ ఏఈ సతీష్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు కొండ శ్రీను, బండమీది యాదయ్య, మురళి, బొల్లం రమేష్యాదవ్, పాలకూరి రమాదేవి, గోపగోని పాపయ్య, మాలుగు శ్రీను పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ
నల్లగొండ టూటౌన్ : ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ ఈనెల 8 నుంచి 18 వరకు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిర్వహిస్తున్నట్లు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువత http:// agnipathvayu.cdac.in ద్వారా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాకారులుగా విడిపోలేదుమిర్యాలగూడ : తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోయాయే తప్ప.. కళాకారులగా విడిపోలేదని.. నాటకరంగంలో తామంగా ఒకే కుటుంబమని రాష్ట్ర కళాకారుల రంగస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు దరుమూరి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్యాలగూడలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు శుక్రవారం కొనసాగాయి. ఐదు ఈ పోటీలను పారిశ్రామికవేత్త పొలిశెట్టి ధనుంజయతో కలిసి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న నాటికలు యువతరాన్ని మేల్కొలిపే విధంగా ఉన్నాయని కితాబిచ్చారు. ‘మోహిని భస్మాసుర’ అనే పద్య నాటకాన్ని అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం, ‘గేమ్’ అనే సాంఘిక నాటికను సిరిమువ్వ కల్చరల్ హైదరాబాద్, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ సాంఘిక నాటికను గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రతినిధులు పల్లెల్లో పర్యటించాలి
మిర్యాలగూడ : ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీఓలు గ్రామాల వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందినవారి జాబితాను రూపొందించి ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామసభలో చదివి వినిపించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా సభలో చర్చించాలన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వాణిజ్య పరమైన సిలిండర్లకు మాత్రమే కొరత ఉందని, ప్రజలు అపోహాలు నమ్మవద్దని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్కు వాడిన 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. పేదలకు విద్యా, వైద్యం అందించేందుకు సహకారం అందించాలని కలెక్టర్ను కోరారు. యూరియాను మండలాల వారీగా కాకుండా పీఏసీఎస్ల వారీగా తమకు కేటాయించాలని, వైటీపీఎస్కు సంబంధించి ీసీఎఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుధాబాలకృష్ణ, వైస్ ఛైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అదికారులు, నాయకులు పాల్గొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం మిర్యాలగూడ : వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ రామకృష్ణరావు నిర్వహించిన వీడియో కాన్ఫ్రెన్స్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వరకు ప్రజలకు ఆయా రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన నీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఉదయ సముద్రం కింద సాగువుతున్న పంటలకు ఎప్పటివరకు సాగునీరు అవసరం ఉందో క్షేత్రస్థాయిలో ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నల్లగొండలోని ఓ రెస్టారెంట్లో కట్టెలపొయ్యిపై వంట చేయిస్తున్న నిర్వాహకులు, (ఇన్సెట్లో) ఓ రెస్టారెంట్లో మూతపడిన గ్యాస్పొయ్యినల్లగొండ : వంట గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్ల మూతపడుతున్నాయి. వీధి వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు హోటళ్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. దీంతో కట్టెలకు ధర పెరిగింది. మరోవైపు అధికారులు హోటళ్లపై దాడులు చేసి వారి వద్ద డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. గ్యాస్ కొరత లేదని చెబు తున్న అధికారులు జిల్లాలోని 34 ఏజెన్సీల్లో ఎక్కడ ఎంత స్టాక్ ఉందో చెప్పలేకపోతున్నారు. ఇక గ్యాస్ దొరకదన్న భయాందోళనలో ప్రజలు బుకింగ్ కోసం ఎగబడుతున్నారు. హోటల్ బంద్ చేసినట్లు బోర్డు ఏర్పాటు నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున గడియారం సెంటర్లో ఉన్న వెంటరమణ టిఫిన్ సెంటర్ను గ్యాస్ కొరతతో మూసి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించి బోర్డు పెట్టింది. పక్కన ఉన్న వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్లో వంటలను కట్టెలతో చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్లపై ఉక్కుపాదం.. గృహ వినియోగాలకు సంబంధించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు వాడితే.. పౌర సరఫరాల అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారులు కట్టెలపోయినే ఆశ్రయిస్తుండగా మరి కొందరు హోటల్లను, రెస్టారెంట్లను మూసేస్తున్నారు. గ్యాస్ ఉంటేనే టిఫిన్ బండ్లు నడిపేది..రోడ్ల వెంట టిఫిన్ బండ్లు పెట్టుకుని చాలా మంది కుటుంబాలను పోషింకుంటున్నారు. గ్యాస్ కొరత వారిని రోడ్డున పడేస్తోంది. కమర్షియల్ గ్యాస్ నిషేధించడంతో డొమెస్టిక్ గ్యాస్ వాడే పరిస్థితి లేదు. ఒకవేళ వాడినా పౌర సరఫరా అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ఆగి కమర్షియల్ సిలిండర్లు సరఫరా అయితే తప్ప వారి వ్యాపారం సాగే పరిస్థితి కనిపించడం లేదు. నేటి నుంచి టెన్త్ పరీక్షలుపశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే. భవిష్యత్లో డొమెస్టిక్ గ్యాస్ (గృహ అవసరాల)కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కమర్షియల్ గ్యాస్ వాడే హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లకు సరఫరా నిలిచిపోయింది. ఏజెన్సీల వద్ద స్టాక్ ఉన్న వరకు ఇచ్చేశాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడున్నాయి. కొన్ని మెస్లు, హాస్టళ్లు, బిర్యానీ సెంటర్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల బట్టీ పొయ్యిలు ప్రారంభించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం ఫ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపైనే వంటకాలు.. ఫ రోడ్డున పడ్డ వీధి వ్యాపారులు -
గ్రామాల అభివృద్ధిపై సర్పంచులు దృష్టి సారించాలి
రామగిరి(నల్లగొండ): సర్పంచులు గ్రామాభివృద్ధిపై దష్టి సారించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్లో గురువారం సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. పేదలంకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషిచేయాలన్నారు. నూతన సర్పంచులకు పలు విషయాలపై అవగాహ కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, వై.అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, డీపీఓ శంకర్ నాయక్, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఎనర్జీతో సుస్థిర భవిష్యత్తు
రామగిరి (నల్లగొండ) : గ్రీన్ ఎనర్జీ సుస్థిరమైన భవిష్యత్తు ఇస్తుందని, గ్లోబర్ వార్మింగ్ను అరికట్టి సహజ వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ ముఖ్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ నాగారపు లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత–పర్యావరణ పరిరక్షణపె రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఔషధాల కొనుగోలు ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాము శ్రీధర్ ప్రసంగిస్తూ కార్బోహైడ్రెట్ల ప్రాముఖ్యతను వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ఐఐటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ నట్టే ఫ్లోరిన్ బ్రోమిన్ రసాయనిక చర్యల ఉపయోగాలు ఔషధాల తయారీలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవి కుమార్ మాట్లాడుతూ కాలుష్యాన్ని అరికట్టడానికి హరిత ఇంధన వనరులే ఏకై క మార్గమని అన్నారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ శిలాజ ఇంధన కాలుష్యం నుంచి దేశాన్ని కాపాడాలన్నారు. సావనీర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో సీఓఈ డాక్టర్ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్నినేటర్ బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ అనిల్ అ బ్రహం, డాక్టర్ అనిల్ బొజ్జ, డాక్టర్ బి.వెంకటేశ్వ ర్లు, అధ్యాపకులు డాక్టర్ సి.జ్యోత్స్న పాల్గొన్నారు. -
చెరువులను నింపాలి
మునుగోడు : బి.వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు నీటితో మునుగోడు మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను వెంటనే నింపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. కల్వలపల్లిలో ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుంటే కండ్లలో నీళ్లు వస్తున్నాయన్నారు. 7–ఆర్ కాల్వ పనులు నేటికి ప్రారంభించకపోవడం వల్లే ఇక్కడి రైతులు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. 36 ఎకరాల భూసేకరణ చేపట్టినా కాల్వను ఎందుకు తవ్వించడం లేదని ప్రశ్నించారు. కిష్టాపురం చెరువు వరకు కాల్వ నిర్మాణం చేపట్టి మునుగోడు, నల్లగొండ మండలాల్లోని చెరువులను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదిర్శ గుర్జ రామచంద్రం, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, నాయకులు గట్టుపల్లి నర్సిరెడ్డి, బొల్గూరి నర్సింహ, తిరిపారి వెంకటేశ్వర్లు, సురిగి చలపతి పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులు బాధ్యతగా మెలగాలి
నల్లగొండ టూటౌన్ : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండలోని జిల్లా పరిషత్ హాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, నీలగిరి కార్పొరేషన్ కార్పొరేటర్లకు నిర్వహించిన శిక్షణలో మంత్రి మాట్లాడారు. ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రస్తుత వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం సంతోషించదగిన విషయమన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కృషిచేయాలని కోరారు. మెప్మా పీడీపై మంత్రి ఆగ్రహం మెప్మా కొత్త గ్రూపులు, రుణాలకు సంబంధించి తగిన సమాచారం లేకుండా వచ్చిన మెప్మా పీడీ శ్రీనివాస్పై మంత్రి మండిపడ్డారు. పీడీ కొత్తగా వచ్చానని చెప్పడంతో అన్ని తెల్చుకుని రావాలి.. కొత్తగా వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులకు ఏం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజల మేలుకే 99 రోజుల కార్యాచరణ ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదు
నల్లగొండ : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన మూడు రోజుల నుంచి కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమే కొరత ఉందన్నారు. నల్లగొండలో కొన్నిచోట్ల డొమెస్టిక్ గ్యాస్ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 16 మందిని గుర్తించి వారిపై నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకునేందుకు ఇదివరకు 21 రోజుల సమయం ఉండేదని, దానిని ఇటీవల 45 రోజులకు మార్చడం జరిగిందన్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి సమస్యలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన టోల్ ప్రీ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
పాడి పంటలకు పరిమితి పెంపు
జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి సాగు చేసే రైతులే ఉన్నారు. పంటల రుణ సదుపాయం పెంపుతో జిల్లాలో వారందరికీ ఆర్థిక వెసలుబాటు కలుగనుంది. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుండగా, 5.5 లక్షలకుపైగా ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మరో 5.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. దీంతో అత్యధికంగా పంటలు సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూరనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వం పంటల రుణ పరిమితిని పెంచింది. ఈ మేరకు బ్యాంకర్ల కమిటీ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఆధీనంలో రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 44 రకాల సాగు పంటలకు, 84 రకాల ఉద్యాన వన పంటలకు, మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు రుణ పరిమితిని పెంచింది. పెంచిన రుణ పరిమితి 2026–27 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వని కొన్ని రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 12 లక్షలకు ఎకరాలకుపైగా పంటలు సాగుచేసే రైతులకు మరింత ఆర్థిక వెసలుబాటు లభించనుంది. రూ.2 వేల నుంచి రూ.4 వేలు పెంపు జిల్లాలో అత్యధికంగా రైతులు పండించే వరి, పత్తి పంటలకు ప్రభుత్వం ఈసారి రుణాన్ని పెంచింది. ఈ పంటలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణాలపై ఇకపై అదనంగా రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మొన్నటివరకు వరిసాగు చేసే ఎకరం పొలంపై రూ.44 వేల నుంచి రూ.46 వేలు రుణంగా ఇచ్చిన బ్యాంకులు ఇకపై రూ.ఎకరానికి 48 వేల చొప్పున రుణ ఇవ్వనున్నాయి. వర్షాధారంగా (రేయిన్ ఫెడ్) పండించే పత్తి పంట ఎకరాకు రూ.46 వేల నుంచి రూ.48 వేలు ఇచ్చిన బ్యాంకులు ఈసారి రూ.50 వేల చొప్పున రుణాలను అందించనున్నాయి. మిర్చి పంటకు పెంచిన రుణ సదుపాయం ముఖ్యంగా మిర్చి పంటకు ఎకరానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణ పరిమితిపై ఈసారి రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు పెంచింది. గతంలో మిర్చి పంట వేసే రైతులకు ఎకరానికి రూ.84 వేల నుంచి రూ.86 వేలు రుణంగా ఇచ్చిన బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిర్చి పంటకు ఎకరానికి రూ.90 వేల చొప్పున ఇవ్వనున్నాయి. గతేగాది ఇవ్వని పంటలకు ఈసారి.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణాలను ఇవ్వని వివిధ రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. నీటి పారుదల సౌకర్యం కలిగి ఉండి పత్తి సాగు చేసే రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలను ఇవ్వలేదు. ఈసారి ఎకరానికి రూ.52 వేల చొప్పున రుణాలను బ్యాంకులు ఇవ్వనున్నాయి. అలాగే వరి పంట (డైరెక్ట్ సీడ్ రైస్) ఎకరానికి రూ.45 వేలు, చిల్లీస్ (విత్ మల్చింగ్) రూ.లక్ష, పుదీనా రూ.35 వేలు, అంటు కట్టిన కూరగాయలు ఎకరానికి రూ.70 వేలు, మల్బరీకి రూ.64 వేలు, జోవర్ (స్వీట్) రూ.24 వేలు చొప్పున ఈసారి రుణాలను ఇవ్వనున్నాయి. గొర్రెలు, మేకలు యూనిట్లకూ పెంపు గొర్రెలు, మేకలు, బ్రాయిలర్ కోళ్ల యూనిట్లపైనా ప్రభుత్వం రుణ పరిమితి పెంచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల యూనిట్కు రూ.26 వేల నుంచి రూ.28 వేలు రుణంగా ఇవ్వగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్కు రూ.32 వేలు ఇవ్వనున్నాయి. మేకల యూనిట్కు రూ.27 వేల నుంచి రూ.29 వేలు ఇవ్వగా, ఇకపై రూ.35 వేలు రుణంగా బ్యాంకులు ఇవ్వనున్నాయి. బ్రాయిలర్, లేయర్ కోళ్లపైనా కూడా రుణ పరిమితిని పెంచింది.రుణం పెంచిన ప్రభుత్వం ఫ వరికి ఎకరాకు రూ.48 వేలు ఫ ఉద్యాన, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకూ పెంపు ఫ అత్యధికంగా మిర్చికి రూ.90 వేలు ఫ ఈ ఏడాది డైరెక్ట్ సీడ్ రైస్, జొన్న పంటలకూ రుణాలు రుణపరిమితి(ఎకరానికి రూ.లలో) పంటలు గతంలో పెంచింది వరి 46,000 48,000 పత్తి 48,000 50,000 మిర్చి 86,000 90,000 గొర్రెల యూనిట్ 28,000 32,000 మేకల యూనిట్ 29,000 35,000 -
ఇంటి గుట్టు దాచినా తప్పించుకోలేరు!
నల్లగొండ టూటౌన్ : ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అనే సామెత మనందరికి బాగా తెలుసు. కానీ నేడు ఇంటి గుట్టు దాచినా దాగదులే అనే విధంగా టెక్నాలజీ పెరిగింది. వ్యాపారం విషయానికొస్తే ఏ వ్యాపారం మీద బ్యాంకు రుణం తీసుకోవాలన్నా బ్యాంకు అధికారులు ట్రేడ్ లైసెన్స్ అడుగుతుంటారు. కొందరు వ్యక్తులు వ్యాపారం చేయకున్నా వారు ఉంటున్న ఇంటి నంబర్తో ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. దాంతో సంబంధిత బ్యాంకుల వారు రుణం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కొత్తగా వచ్చిన ఆన్లైన్ విధానంతో ట్రేడ్ లైసెన్స్ తీసుకోగానే సంబంధిత నివాస భవనం కమర్షియల్ భవనంగా గుర్తిస్తున్నారు. హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో ఆటోమేటిక్గా నివాస ఆస్తి పన్ను నుంచి కమర్షియల్ ఆస్తి పన్నుగా మారిపోతుంది. దాంతో రూ.ఐదారు వేలు ఉన్న ఆస్తి పన్ను ఐదారింతలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి వ్యాపారం చేసినా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. కానీ, చాలా మంది వ్యాపారం పెట్టకుండానే బ్యాంకులో రుణం కోసం ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు. అయితే అద్దెకు ఉండే వారు సదరు ఇళ్ల నంబర్లపై ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటుండడంతో ఇళ్ల యాజమానులను బెంబేలెత్తిస్తోంది. ఇక నుంచి వ్యాపారం చేసినా, చేయకుండా ఇంటి నంబర్ మీద ట్రేడ్ లెసెన్స్ తీసుకున్నా ఆటోమేటిక్గా కమర్షియల్గా మారి ఆస్తి పన్ను పెరుగుతుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతోపాటు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇకనుంచి ఆన్లైన్ విధానం అమలు కానుంది. నీలగిరిలో 345 మందికి వాణిజ్య పన్ను.. నీలగిరి నగరంలో ఇటీవల 345 మంది భవనాలు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతో కమర్షియల్ భవనాలుగా మారిపోయాయి. ఇవన్నీ నివాస భవనాలు మాత్రమే. వీటిలో 30కిపైగానే వ్యాపార కార్యకలాపాలు నడుస్తుండగా, మిగతావి మాత్రం నివాస భవనాలుగానే ఉన్నాయి. నివాస భవనాల ఇంటి నంబర్లు వేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతో కమర్షియల్గా మారిపోయాయి. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ఓ నివాస భవనం కమర్షియల్గా వినియోగిస్తున్నా, నివాసం ఆస్తి పన్ను కింద కేవలం రూ.600 మాత్రమే ఉంది. దీనికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతో ఈ పన్ను రూ.60 వేలకు పెరిగింది. మరో భవనానికి రూ.6 వేలు ఉండగా, రూ.42 వేలకు పెరిగింది. అదేవిధంగా ఓ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి బ్యాంకు రుణం కోసం ఇదే ఇంటి నంబర్తో ట్రేడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేయడంతో ఇక్కడ కమర్షియల్గా మారడంతో రూ.30 వేలకు ఆస్తి పన్ను వచ్చింది. సంబంధిత ఇంటి యాజమాని ఇంత ఆస్తి పన్ను ఎందుకు వచ్చిందని ఆరా తీయడంతో ఆయనకు తెలియకుండానే అద్దెకుంటున్న వ్యక్తి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నట్లు బయపడింది. సదరు ఇంటి యాజ మాని అద్దెకు ఉన్న వ్యక్తితోనే ఆస్తి పన్ను కట్టించాడు. ఇక నుంచి మన ఇల్లు నివాసమా, లేక వాణిజ్య భవనమా అనేది దాచినా దాగే పరిస్థితి ఉండదు. ఫ ఇంటి నంబర్తో ట్రేడ్ లైసెన్స్ పొందితే కమర్షియల్ భవనంగా గుర్తింపు ఫ ఆటోమేటిక్గా మారుతున్న ఆస్తి పన్ను ఫ రూ.వందల నుంచి రూ.వేలుగా మార్పు ఫ కొత్తగా ఆన్లైన్ విధానం అమలు -
ప్రతి తొట్టిలో నీరుండాలి
మునుగోడు : గ్రామాల్లో మూగజీవుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన ప్రతి నీటి తొట్టిలో నీరు నింపి ఉంచాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పలు గ్రామాల్లోని నీటి తొట్లలో నీరు నింపకపోవడంతో గురువారం సాక్షి దినపత్రికలో నీరు లేక.. దాహం కేక! అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జెడ్పీ సీఈఓ స్పందించారు. మునుగోడు ఎంపీడీఓ యుగేంధర్రెడ్డికి ఫోన్చేసి పశువుల కోసం నిర్మించిన నీటి తొట్లలో నీరు నింపేలా చొరవచూపాలని సూచించారు. దీంతో ఆయన.. కార్యదర్శులకు సూచించగా పలు గ్రామాల్లోని నీటి తొట్లను ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా నింపి ఉంచారు. 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిమునుగోడు : 108 సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ప్రమాదస్థలానికి వెళ్లి బాధితులను ఆసుపత్రులకు తరలించాలని 108 ప్రోగ్రామ్ జిల్లా మేనేజర్ ఎస్కే.సలీం అన్నారు. గురువారం మునుగోడులోని 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులతోపాటు ఆ వాహనంలోని ప్రథమ చికిత్సకు అందుబాటులో ఉన్న పరికరాలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో వడదెబ్బకు గురైయ్యేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. వారికి అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ఇతర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట సిబ్బంది ప్రదీప్, రమేష్, డాక్టర్ నర్మద తదితరులు ఉన్నారు. నల్లగొండ, మల్లేపల్లిలో టాస్క్ఫోర్స్ దాడులునల్లగొండ, కొండమల్లేపల్లి : నల్లగొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లోని హోటళ్లు, దాబాలు, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై గురువారం ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నల్లగొండలోని ప్రసాద్, నందిని, క్రితుంగ హోటళ్లలో, మల్లేపల్లిలోని నేహా, సాయినందిని హోటళ్లలో, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్పై దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న మొత్తం 68 డొమెస్టిక్ (వంట గ్యాస్) సిలిండర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై 6ఎ కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకటేష్ తెలిపారు. ఈ దాడుల్లో సిపిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్, రెవెన్యూ అధికారులు ఎస్డీ.ముబీన్, ఎండి.ముక్తార్, ఎ.దీపక్, ఆర్.సైదులుగౌడ్, జ్యోతి, ఎ.సైదులు, కుమార్రెడ్డి పాల్గొన్నారు. యూజీడీ పనులు త్వరగా పూర్తిచేస్తాంమిర్యాలగూడ : పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) భాస్కర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రజారోగ్య శాఖ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లుతో కలిసి మిర్యాలగూడ పట్టణంలో యూజీడీ పనులు, అమృత్ నీటి ట్యాంక్ నిర్మాణాలను పరిశీలించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఎస్టీపీ–1, రాంనగర్ బంధం డంపింగ్ యార్డు పక్కన ఉన్న ఎస్టీపీ–2 (వ్యర్థపు నీటి శుద్ధి ప్లాంట్లు) పనులను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. హౌసింగ్ బోర్డులో నిర్మిస్తున్న ఉపరితల నీటి ట్యాంక్ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాల్లో నాణ్యత లోపాలు లేకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాళ్లగడ్డ వద్ద అదనంగా మరో శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ వెంకన్న, ఏఈలు నవీన్, అంజలి, ప్రజారోగ్య శాఖ ఏఈ సాయితేజ పాల్గొన్నారు. -
కుళాయి.. బకాయి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి కార్పొరేషన్లో నల్లా బిల్లుల బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 48 డివిజన్లలో మొత్తం 38,658 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇళ్లకు నెలకు రూ.100, వాణిజ్య అవసరాలకు రూ. 600 చొప్పున బిల్లులు చెల్లించాల్సి ఉంది. రెండు దశాబ్దాలుగా కుళాయి బిల్లుల వసూలుపై సరైన పర్యవేక్షణ లేక పోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొరవడిన పర్యవేక్షణ ప్రతినెలా నల్లా బిల్లులు వసూలు చేయాల్సిన సిబ్బంది పట్టించుకోక పోవడం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే బకాయిలు భారీగా పేరుకు పోయాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు పాత బకా యిలు సుమారు రూ.27 కోట్లు ఉన్నట్లు సమాచారం, ఆన్లైన్ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రూ.4 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.10 కోట్ల వరకు( 52.47 శాతం) నల్లా బిల్లులు వసూలయ్యాయి. బకాయిలపై పట్టింపేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ సిబ్బంది వసూలు చేస్తున్నారు. కానీ పాత బకాయిల విషయాన్ని పట్టించుకోవడం లేదు. వాటిని అలాగే వదిలేస్తే ఇక అంతే సంగతులు అయ్యే అవకాశం లేకపోలేదు. కార్పొరేషన్ అందిస్తున్న తాగు నీటిని వినియోగిస్తున్న ప్రజల నుంచి కుళాయి బిల్లులు వసూలు చేయక పోవడం వల్లే పాత బకాయిలు పేరుకు పోయాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో నీలగిరిలో 18 వేల లోపు ఉన్న కనెక్షన్లు ప్రస్తుతం రెండింతలయ్యాయి. అయినా ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రస్తుత పాలకవర్గం బకాయిలపై ప్రత్యేక దృష్టి పెడితే కార్పొరేషన్ ఖజానా నిండనుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్పొరేషన్కు రావల్సిన పాత బకాయిల విషయాన్ని విస్మరించారని, కార్పొరేషన్లో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా అధికారులు బకాయి బిల్లులపై దృష్టి సారిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ నీలగిరి కార్పొరేషన్లో నల్లా బిల్లుల వసూలును పట్టించుకోని అధికారులు, సిబ్బంది ఫ ఏటా రావాల్సింది రూ.4 కోట్లు ఫ బకాయిలు రూ. 27 కోట్లు -
అలరిస్తున్న సాంఘిక నాటక పోటీలు
మిర్యాలగూడ : పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు అలరిస్తున్నాయి. బుధవారం 3వ ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రంగా రవికుమార్, రంగా శ్రీధర్ జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. ‘త్యాగశీలి దధీచి మహర్షి’ అనే పద్య నాటకాన్ని టీబీఆర్ ఆర్ట్స్ హైదరాబాద్ వారు, ‘భక్త ప్రహ్లాద’ పద్య నాటకాన్ని నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్, ‘ఉరి’ సాంఘిక నాటికను వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు, ‘వేదాంతం’ సాంఘిక నాటికను శ్రీ షిర్డిసాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి, ‘తితీక్ష’ సాంఘిక నాటికను బివికె క్రియేషన్స్ కాకినాడ వారు నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామావతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, వెంకటలక్ష్మీనారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం పాల్గొన్నారు. -
జిల్లా కోర్టును సందర్శించిన ఆస్ట్రేలియా న్యాయవాది
రామగిరి(నల్లగొండ) : ఆస్ట్రేలియాకు చెందిన న్యాయవాది బుధవారం నల్లగొండ కోర్టును సందర్శించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో న్యాయవాదిగా పనిచేస్తున్న స్పెన్సర్ నల్ల గొండలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా కోర్టును సందర్శించిన ఆయన కేసుల విచారణ, తదితర అంశాలపై పలు విషయాలను నల్లగొండ న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. 13న జాబ్ మేళానల్లగొండ : నల్లగొండలోని ఐటీఐ క్యాంపస్లో ఈ నెల 13న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ, ఐటీఐ చదివి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7893420435 నంబబర్కు ఫోన్ చేయాలని సూచించారు. విద్యానిధికి దరఖాస్తులు నల్లగొండ: విదేశాల్లో విద్యనభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద 2026 సంవత్సరంలో అర్హులైన ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోగా telangana. epass.cgg.gov.inలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలిమిర్యాలగూడ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం మిర్యాలగూడ రైతు వేదికలో ఇన్విజిలేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో యూసుఫ్, కొమ్ము శ్రీనివాస్, ఎంఈఓలు ధర్మానాయక్, లక్ష్మణ్నాయక్, రవినాయక్, వెంకన్న, వరలక్ష్మి, ఉపాద్యాయులు కొర్ర కృష్ణకాంత్నాయక్, తావుర్యా, తిరుపతి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సాజిద్అలీ, దస్తగిరి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. -
కాంగ్రెస్ హయాంలో అన్నదాతల అరిగోస
దేవరకొండ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం చందంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సర్వయ్య, కార్యకర్తలతో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో రైతుబంధు జమచేయకుండా వారిని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా, కరెంట్, సాగునీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు టీవీఎన్ రెడ్డి, బిల్యానాయక్, కిషన్నాయక్, వడ్త్యా రమేష్, పల్లా ప్రవీణ్రెడ్డి, వల్లపురెడ్డి, గాజుల ఆంజ నేయులు, నీలా రవి తదితరులున్నారు. ముత్యాల సర్వయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగదీష్రెడ్డి, పక్కన రవీంద్రకుమార్ఫ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి -
నీరు లేక.. దాహం కేక!
మునుగోడు : వేసవి కాలంలో చెరువులు, కుంటలు ఎండిపోయి మూగజీవాలకు నీరు లభించక అవస్థలు పడుతుంటాయి. ఆ మూగజీవాల దాహం తీర్చేందుకు గత ప్రభుత్వం 2015 నుంచి 2018 వరకు ఉపాధి హామీ, ఇతర పథకాల ద్వారా ప్రతి గ్రామ శివారులో రెండు నుంచి నాలుగైదు వరకు నీటితొట్లను నిర్మించింది. ఆ నీటితొట్లకు గ్రామ పంచాయతీ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చి నిండా నీరు నింపేవారు. అలా మండల వ్యాప్తంగా ఉన్న 28 గ్రామ పంచాయతీలతో పాటు ఆవాస గ్రామాల్లో కలిపి దాదాపు 145కు పైగా నీటితొట్లు ఉండేవి. అయితే అందులో కొన్ని శిథిలమై ధ్వంసం కాగా.. మరికొన్ని ఇప్పటికీ అలానే ఉన్నాయి. కానీ ఆ తొట్లకు మూడేళ్లుగా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో మూగజీవాలను సాకుతున్న రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద, ఇతర సౌకర్యాల ద్వారా నీరు అందిస్తున్నారు. కొందరు రైతుల వ్యవసాయ బోర్లు ఎండిపోతుండటంతో పశువులకు నీటి కోసం పాట్లు పడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న నీటితొట్లను వాడుకలోకి తీసుకురావాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
నల్లగొండ : జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదవుతున్న నేరాల పరిస్థితి, పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తు పురోగతి, కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్షలు పడేలా చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేవించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. దొంగతనాల నివారణకు పగలు, రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. గంజాయి రవాణా, జూదం, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, శ్రీనివాసరావు, రవి, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
జనగణన దేశానికి ఎంతో ముఖ్యం
నల్లగొండ : దేశాభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని.. జనగణన దేశానికి ఎంతో ముఖ్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక ప్రాంత జనాభాను బట్టి నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. జనగణన కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, హ్యాండ్ బుక్స్ను జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. జనగణన రెండు విభాగాలుగా నిర్వహిస్తామని.. కుటుంబాలు, మనుషుల లెక్కలు సేకరిస్తామని తెలిపారు. 2027 జనగణన డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. జనగణనకు అవసరమైన టెక్నికల్ అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించాలని ఆదేశించారు. రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ రఘు మాట్లాడుతూ జనగణనలో సూపర్వైజర్, ఎన్యూమరేటర్లు, చార్జ్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓలు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలి వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన నల్లగొండలోని ఎస్ఎల్బీసీ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ గదులను, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి దగ్గరికి వెళ్లి నాణ్యతను పరిశీలించారు. వంట బాగుందా.. మెనూ అమలు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమీపంలో పాన్, గుట్కా షాపులు కనిపించడంతో పాఠశాలలకు వంద మీటర్ల పరిధిలో ఆ షాపులు లేకుండా చూడాలని డీఎస్పీకి సూచించారు. నల్లగొండ టౌన్ : సహకార బ్యాంకు తమ సేవలను రైతులకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం నల్లగొండలోని సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 2025–26 అర్ధవార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన బ్యాంకు పురోగతిని పరిశీలించి తగు సూచనలు చేశారు. నాబార్డ్ అందించే రుణ సదుపాయంతో రైతులు పండించే పంటలను నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్, గోడౌన్స్ నిర్మించాలన్నారు. మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత బ్యాంకుకు ఏర్పడిందన్నారు. బంగారం, ఇతర రుణాల సకాలంలో చెల్లించే విధంగా చూసుకోవాలని తెలిపారు. త్వరలో ప్రారంభం కాబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, మురళిరమణ, ప్రవీణ్, సీఈఓ ఆర్.శంకర్రావు, జీఎం నర్మద ఉన్నారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సరిహద్దు దాటొస్తున్న
ఇక్కడి ఓ ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా అక్రమ దందాసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇసుక.. అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నుంచి దళారులు సరిహద్దులు దాటించి తెలంగాణలోకి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దందాకు తెరలేపారు. ఈ అక్రమ రవాణా వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అండతోనే రాత్రి సమయాల్లో పరిమితికి మించి లోడ్తో లారీలు యథేచ్ఛగా సరిహద్దు దాటుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న లారీలే ఈ అక్రమ రవాణాకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అధికారులు నిఘా పెంచినా, రాజకీయ పలుకుబడి ముందు ఆ నిఘా నీరుగారిపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులో నిఘా కరువు ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఈ అక్రమ రవాణా జోరుగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. కృష్ణానది సరిహద్దు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక రవాణా సాగుతోంది. అక్రమ రవాణా చేస్తున్న లారీలను పట్టుకుంటున్నా నామమాత్రంగా కేసులను నమోదు చేసి వదిలేస్తున్నారే తప్ప నియంత్రించేందుకు చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.బుకింగ్ లేకుండానే సరఫరా ఒక్కొక్క లారీలో 30టన్నులు, టిప్పర్లో 35టన్నుల ఇసుక పడుతుంది. కానీ వ్యాపారులు ఒక్కొక్క లారీలో 40 నుంచి 50టన్నులు, టిప్పర్లో 40 నుంచి 60 టన్నుల చొప్పున పరిమితికి మించి ఏపీ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మిర్యాలగూడలోని ఖాళీ స్థలాల్లో డంప్ చేసి అవసరమైన సమయంలో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇసుక వాహనం పేరిట ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల చాలా రోజుల సమయం పడుతుండడంతో అవసరమైన వారు ఇసుక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.3,970వేలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఆఫ్లైన్లో మాత్రం రూ.5000 నుంచి రూ.7వేలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆంధ్రా ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే పట్టుకోని కేసులను నమోదు చేస్తాం. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళనఫ ఏపీ నుంచి రాత్రి వేళ లారీల్లో తరలించి మిర్యాలగూడలోని ఖాళీ ప్రదేశాల్లో డంప్ ఫ ఇక్కడ ట్రాక్టర్ ఇసుక రూ.7 వేల వరకు విక్రయం ఫ ఇటీవల ఆ ప్రజాప్రతినిధి లారీని వదిలేసిన పోలీసులుమిర్యాలగూడ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రోజూ టన్నుల కొద్ది ఇసుక మిర్యాలగూడకు తరలివస్తున్నా అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. గత సంవత్సరం వంగమర్తి నుంచి మిర్యాలగూడకు వస్తున్న మూడు ఇసుక టిప్పర్లను రామచంద్రగూడెం వైజంక్షన్ వద్ద పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం హనుమాన్పేట వద్ద ఓ ఇసుక లారీని పట్టుకున్నారు. దానిపై పోలీసులు లోతుగా విచారణ చేయగా మిర్యాలగూడకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఐదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తెలియడంతో విస్తుపోయారు. ఆ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయకుండానే ఆ లారీని వదిలేసినట్లు సమాచారం. గతంలో పట్టణ శివారులోని రైల్వేట్రాక్ వద్ద ఓ ఇసుక లారీని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ లారీ ఈనెల 22 వరకు పర్మిట్ పొంది ఉంది. కానీ అందులో ఇసుక మాత్రం 27టన్నులకుగాను 56టన్నులు ఉంది. ఓవర్ లోడ్ ఉండడంతో మిర్యాలగూడ టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
నల్లగొండ మీదుగా అమృత్ భారత్ రైలు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లనుంది. హైదరాబాద్ చర్లపల్లి నుంచి అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య ఈ రైలు ఈ నెల 13 నుంచి రాకపోకలు సాగించనుంది. ఈ రైల్లో స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ రైలు వల్ల ఉత్తర–తూర్పు భారతదేశానికి తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఈ రైలు జిల్లాలోని నల్లగొండ స్టేషన్లో ఆగుతుంది. బీఆర్ఏఓయూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలురామగిరి(నల్లగొండ) : గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ అంబేద్కర్లో ఓపెన్ యూనిర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణ కోర్సులు అందించనున్నట్లు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు మంగళవారం ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో బీఆర్ఏఓయూలో అనేక మార్పులు తీసుకోస్తున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ, భూదాన్పోచంపల్లి జలాల్పూర్ స్వామి రామనందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ కోర్సులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్కుమార్ మాట్లాడుతూ, చదువే కాకుండా, డిగ్రీ పూర్తయిన వారు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దూరవిద్య కేంద్రం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎన్నో రంగాల్లో కల్పించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు, కళాశాల కౌన్సిలర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానంతో ‘వికసిత్ భారత్’మిర్యాలగూడ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా భారతదేశం ‘వికసిత్ భారత్’గా అవతరిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ – అచీవ్మెంట్స్ అండ్ ఛాలెంజర్స్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. మాతృభాషలోనే ప్రపంచ విషయాలను నేర్చుకునేలా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. కళాశాల అర్థశాస్త్ర ప్రొఫెసర్ గుమ్మడి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అకడమిక్ కో–ఆర్డినేటర్ పి.నాగరాజు, సీనియర్ అధ్యాపకులు వెంకటరమణ, పి.రవీందర్, శివకృష్ణ, నాగరేఖా, రాణి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఎర్రబెల్లి జాతర నిడమనూరు : ఎర్రబెల్లి జాతర ముగిసింది. మంగళవారం సాయంత్రం సంప్రదాయంగా దేవరపెట్టను గోపాలపురం గ్రామానికి సాగనంపారు. వీడ్కోలు కార్యక్రమంలో ఎర్రబెల్లి యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓ లింగా.. ఓ లింగా.. గజ్జెల మోతలు, కాటారుల విన్యాసాలు, భేరి, డోలు వాయిధ్యాల చప్పుళ్ల నడుమ దేవరపెట్టను గోపాలపురానికి తరలించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మన్నెం వెంకన్నయాదవ్, మన్నెం రంజిత్యాదవ్, శ్రవణ్కుమార్, నారాయణ, పూజరులు బొల్లం లింగయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు. -
ఆలయంలో విజయీభవ పూజ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని తులసీనగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులు విజయీభవ పూజను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు మంచి మార్కులు రావాలని ఈ పూజ చేశారు. కార్యక్రమంలో డీఈఓ బి.భిక్షపతి, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యామ్సుందర్రెడ్డి, పోలోజు నాగేందర్, యాదయ్య, రమేష్రెడ్డి, మహమ్మద్ ఫయాజ్, చర్లపల్లి గణేష్, ఎం.జానారెడ్డి, జి.జానయ్య, మనోజ్, వెంకటరెడ్డి, ఎ.జానకిరామ్రెడ్డి, ప్రభాకర్, కళ్యాణ్ తదితరురు పాల్గొన్నారు. -
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
నల్లగొండ : ‘పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 109 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈసారి నిమిషం నిబంధన తొలగించి 5 నిమిషాలు అలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతిస్తాం’ అని డీఈఓ భిక్షపతి తెలిపారు. శనివారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లను మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పరీక్షలకు 19,845 మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 19,845 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ విభాగంలో 19,698 విద్యార్థులు, ప్రైవేట్ 137 మంది పరీక్షలకు హాజరువుతారు. పరీక్ష పేపర్లు కూడా ఆయా సెంటర్ల పరిధిలోని పోలీస్స్టేషన్లలో భద్రపరిచాం. హైపవర్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరు ప్లఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో టీమ్లో రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల నుంచి ఒక్కరు చొప్పున ముగ్గురు ఉంటారు. సీ సెంటర్లలో 13 సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు 1,032 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. 109 మంది సెంటర్ సూపర్వైజర్లు, 109 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. రోజూ 3 గంటల పాటు పరీక్ష.. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. పిజికల్ సైన్స్ పేపర్–1 9.30 నుంచి 11 గంటల వరకు పిజికల్ సైన్స్ పేపర్–2 (బయాలజికల్ సైన్స్) 11 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. 5 నిమిసాలు గ్రేస్ పిరియడ్ కింద ఎవరైనా ఆలస్యంగా వస్తే అనుమతిస్తాం. క్లాక్రూమ్ ఏర్పాటు.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ప్రతి పరీక్ష కేంద్రం బయట క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి విలువైన వస్తువులు ఉంటే అక్కడ భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశాం. అక్కడ వారికి వస్తువులు ఇస్తే టోకెన్ ఇస్తారు. పరీక్ష పూర్తయిన తర్వాత వారి వస్తువులు తిరిగి తీసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై డీఈఓ, ఎంఈఓ, ఎస్హెచ్ఓల ఫోన్ నంబర్లు ఉంటాయి. మాల్ ప్రాక్టీస్కు సహకరిస్తే సర్వీస్ నుంచి సిబ్బంది రిమూవ్.. పరీక్షల్లో ఎవరైనా సిబ్బంది మాల్ ప్రాక్టీస్కు సహకరిస్తే శాఖపరమైన చర్యలతో పాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక పేపర్లను తిరిగి పోస్టాపీస్లకు తరలిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. విద్యార్థులు పరీక్ష సమయానికి 40 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలి. సీఎస్ రూమ్లో సీసీ కెమెరాల సమక్షంలోనే పేపర్లను ఓపెన్ చేసి అదే రోజు పేపరా కాదా అని చెక్చేసిన తర్వాతే పేపర్లు పంపిణీ చేస్తాం. విద్యార్థులు ప్యాడ్, హాల్టికెట్, పెన్నులు మాత్రమే తెచ్చుకోవాలి. ఒకవేళ వాటర్ బాటిల్ తెచ్చినా గేటు బయట ఉంచాల్సిందే. సిబ్బంది తప్పకుండా ఐడీ కార్డులు పెట్టుకువస్తారు. ఫ టెన్త్ పరీక్షలకు 109 కేంద్రాలు ఏర్పాటు చేశాం ఫ ప్రశ్నపత్రాలను పోలీస్స్టేషన్లలో భద్రపరిచాం ఫ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి ఫ డీఈఓ భిక్షపతి -
అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పెన్నా మోహన్శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దివ్య జ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని మంగళవారం గుత్తా సుఖేందర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ధూప దీప నైవేద్య అర్చకులకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మానవాళికి మంచి జరగాలని ఆకాంక్షించారు. మేయర్ చైతన్య మాట్లాడుతూ బ్రాహ్మణులందరూ సమాజ హితం కోసం పూజలు చేయాలని కోరారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకులకు సమన్యాయం జరిగేందుకు అర్చక ఉద్యోగ జేఏసీ కృషి చేస్తుందని అన్నారు. అర్చకులకు పే స్కేల్స్ రావడానికి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కె.భాస్కర్, కారంపూడి నరసింహాచార్యులు, దివ్య రామన చక్రవర్తులు, బాలసుబ్రహ్మణ్యం, డివిఆర్ శర్మ, కొండోజు నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
సంక్షేమానికే ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’
నకిరేకల్ : గ్రామాలు, మున్సిపాలిటీల్లో సమస్యలు లేకుండా తీర్చదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికల కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక నియోజకర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాల్సిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జాబితాను చదివి వినిపించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఉగాది ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే 87126 70266 నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమన్వయంతో పని చేయాలి :వేముల వీరేశం, ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. నకిరేకల్లో 100 పడకల వైద్యశాల భవనాన్ని తర్వలో ప్రారంభిస్తామన్నారు. రోడ్డు భద్రత దృష్ట్యా నియోజకవర్గంలో సీసీ కెమరాల ఏర్పాటుకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, డీసీహెచ్ మాతృనాయక్, డీపీఓ శంకర్నాయక్, హసింగ్ పీడీ రాజ్కుమార్, మార్కెట్ చైర్ పర్సన్ గుత్తా మంజుల, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్లు చౌగోని రజిత, పందిరి గీత, మండల ప్రత్యేక అధికారి కిరణ్కుమార్ ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ ఫ నకిరేకల్లో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం -
ఆయిల్పామ్తో నిత్య ఆదాయం
మర్రిగూడ : ఆయిల్పామ్ సాగు ద్వారా రైతులకు నిత్య ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి కె.సుభాషిణి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉద్యానశాఖ సహకారంతో రైతులకు నిర్వహించిన సాంకేతిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎకరం ఆయిల్పామ్ సాగు చేస్తే ఏడాదికి రూ.1.50 లక్షలు నికర ఆదాయం పొందవచ్చన్నారు. మొక్క నాటిన నాటి నుంచి మూడు సంవత్సరాల తరువాత కాపు ప్రారంభమై 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందన్నారు. అదేవిధంగా కోకో, వక్క సాగును అంతర పంటలుగా సాగు చేసినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి, పత్తి, బత్తాయి కంటే అధిక ఆదాయం వచ్చే పంట కేవలం ఆయిల్పామ్ మాత్రమేనన్నారు. అనుముల మండలంలో పామ్ అయిల్ ఫ్యాక్టరీ పనులు సాగుతున్నాయని తెలిపారు. రైతులు మొక్కలు నాటుకునే సమయంలో బై బ్యాక్ పాలసీ అగ్రిమెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పతంజలి కంపెనీ కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పతంజలి డీజీఎం యాదగిరి, మేనేజర్ మధుసూదన్రెడ్డి, ఏడీఏ వేణుగోపాల్, నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్, ఏఓ సుహాస్, నర్రా రవీందర్రెడ్డి, ప్లాంటేషన్ అధికారి భానుచందర్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, మోహన్, స్వామి, బాబు, రైతులు పాల్గొన్నారు. -
సవాళ్లకు పరిష్కారం చూపుతున్న నాటికలు
మిర్యాలగూడ : ప్రస్తుత సమాజంలో నాటికలు ఆయా సమస్యలను, సవాళ్లను ప్రతిభావంతంగా చర్చించి, పరిష్కారాలు కూడా సూచిస్తున్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త జయిని మురళి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిసోర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్రెడ్డి అన్నారు. పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలను రెండవ రోజు మంగళవారం వారు ప్రారంభించి మాట్లాడారు. సందర్భంగా ‘ఎవరు’ అనే సాంఘిక నాటికను అద్దెపల్లి, ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి, గుంటూరు వారు ప్రదర్శించగా ‘తరమెళ్లిపోతున్నది’ అనే సాంఘిక నాటకాన్ని శ్రీకరణం సురేష్ మెమోరియల్ థియేటర్ గుంటూరు, ‘ఇంద్రప్రస్థం’ అనే సాంఘిక నాటికను అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం నటీనటులకు ప్రోత్సాహక బహుమతులతోపాటు షీల్డ్లను అందించారు. మొదట సిరిమువ్వ నాట్యమండలి మిర్యాలగూడ మాస్టర్ రాము, అభినయ రుద్ర నాట్యమండలి ఖమ్మం మాస్టర్ ఫణికుమార్ సంయుక్తంగా చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, అధ్యక్షుడు రామవతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తిశర్మ, నారాయణశర్మ, సాయిలు, సత్యనారాయణచారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శైలజ, సరస్వతి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
7,041 మంది రైతులకు అందని రుణమాఫీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో 7,041 మంది రైతులకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వ యంత్రాంగం తప్పిదం కారణంగా ఆయా రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదు. రెండేళ్లు ఏడాది గడిచిపోయినా ఆయా రైతుల గోడును పట్టించుకునేవారు లేకుండాపోయారు. రుణమాఫీ కోసం రైతులు.. బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వారు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కూడా కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే రైతుల రుణమాఫీ కింద విడుదల చేసిన డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని 7,041 మంది రైతులు కోరుతున్నారు. వారిలో నల్లగొండ మండలం ఒక్క సూరారం రైతులే 165 మంది ఉన్నారు. ఇదే అసలు సమస్య రాష్ట్రంలో ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని విడతల వారీగా అమలు చేసింది. 2024 మొదట్లో ఒకసారి రూ.1 లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్లో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు పథకాన్ని అమలు చేసింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన సమయంలోనే ఏపీజీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మార్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీజీవీబీకి ఉన్న ఐఎఫ్ఎస్సీ కోడ్తోనే మాఫీ చేయాల్సిన రైతుల రుణాల వివరాలను బ్యాంకులకు పంపించింది. అయితే అప్పటికే టీజీబీలకు కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు వచ్చేశాయి. బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిపోవడం, ఏపీజీవీబీ ఐఎఫ్ఎస్సీ కోడ్తోనే నిధులను పంపించడంతో అవి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) కింద రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఆయా రైతులందరికి రుణమాఫీ అందలేదు పట్టించుకోని బ్యాంకులు, ప్రభుత్వం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్.. టీజీబీగా మారడంతో రుణమాఫీ కాని రైతులంతా అటు ప్రభుత్వం చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులను అడిగితే తాము టీజీబీగా మారినట్లు, మారిన ఐఎఫ్ఎస్సీ కోడ్లను కూడా ప్రభుత్వానికి పంపించామని, వారు చూసుకోకపోతే తామేం చేస్తామని చెబుతున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే తాము నివేదికను ప్రభుత్వానికి పంపించామని, తామేం చేయమలేమని చెబుతున్నారు. రుణాలకు వడ్డీ చెల్లించాలని వేధిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ పథకం ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ నల్లగొండ జిల్లాలోని 7041 మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు వరంగల్ జిల్లాలోనూ ఇదే సమస్యతో వేల మంది రైతులు రుణమాఫీ కాలేదని తెలిసింది. నాకు బ్యాంకులో రూ. 86,945 రుణం ఉంది. రుణమాఫీ ఇంతవరకు కాలే దు. బ్యాంకు అధికారులు వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – శ్రీరామోజు వెంకటాచారి -
నేటి నుంచి గాలికుంటు నిరోధక టీకాలు
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళశారం నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. మూడు నెలల వయస్సు వయస్సు నిండిన వాటికి టీకాలను వేయడానికి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చింది. అవసరమైన టీకాలను జిల్లాకు తెప్పించి అన్ని పశు వైద్యశాలలకు పంపింది. టీకాల కోసం ఏర్పాటు చేసిన బృందాలు ఉదయం 8 గంటలకే ఆయా గ్రామాల్లో రైతుల కొట్టాలు, షెడ్లకు చేరుకుని టీకాలను వేయనున్నారు. టీకాలు వేసిన పశువుల కొమ్ములకు గుర్తుగా ఆకుపచ్చ రంగు వేస్తారు. టీకాలను వేసిన వాటి వివరాలను భారత్ పశుధన్ యాప్లో వెంటనే నమోదు చేయనున్నారు. వ్యాధికి కారణాలు, నివారణ.. ఈ వ్యాధి వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ వ్యాధిని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లేదా గాలికుంటు వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకమైన మందు లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారు. గాయాలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడగడం, యాంటి బయాటిక్స్, నొప్పి నివారణకు మందులు, విటమిన్ బి కాంప్లెక్స్ ఇవ్వడం, మృదువైన మేతను అందివ్వడం వంటి చర్యలు తీసుకుంటారు.ఫ ఏప్రిల్ 9వ తేదీ వరకు కార్యక్రమం ఫ జిల్లా వ్యాప్తంగా 3 లక్షల పశువులకు టీకాలు ఫ టీకాల కోసం 80 బృందాల ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో రైతులు విధిగా తమ పశువులు, గేదెలకు టీకాలను వేయించాలి. రోగం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ జీవి రమేష్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి -
ధాన్యం మళ్లింపు కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం మళ్లింపు కేసులో అరెస్టయిన కందుకూరి మహేందర్ను రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లాలో రూ.191.13 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో మహేందర్తో పాటు అతని భార్యను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తదుపరి విచారణలో భాగంగా మహేందర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జేఎంఎఫ్సీ (స్పెషల్ మొబైల్) కోర్టు పోలీసుల అభ్యర్థనను సమ్మతిస్తూ మహేందర్ను రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిచింది. ఈ నేపథ్యంలో మహేందర్ తరఫున దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను కోర్టు వాయిదా వేసింది. జెడ్పీ సీఈఓగా విధుల్లో చేరిన ప్రేమ్కరణ్రెడ్డినల్లగొండ : రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఓఎస్డీ ప్రేమ్కరణ్రెడి తిరిగి నల్లగొండ జెడ్పీ సీఈఓగా సోమవారం విధుల్లో చేరారు. నల్లగొండ జెడ్పీ సీఈఓగా ఉన్న ఆయన గతేడాది మేలో ఉత్తమ్కుమార్రెడ్డి వద్ద ఓఎస్డీగా వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరిగి నల్లగొండ జెడ్పీ సీఈఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, కార్యదర్శి నరేందర్రెడ్డి, సురేందర్రెడ్డి, సూపరింటెండెంట్లు సన్మానించారు. హెచ్పీవీ టీకా కేంద్రం తనిఖీనాగార్జునాసాగర్ : సాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ సెంటర్ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) పద్మ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె బాలికలందరూ హెచ్పీవీ టీకా తీసుకునేలా చూడాలన్నారు. పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ వర్కర్లు అర్హులైన బాలబాలికలను వారి తల్లిదండ్రులతోపాటు వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకుని రావాలని సూచించారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీకాలు వేస్తారని తెలిపారు. 14 ఏళ్లు పూర్తయి.. 15 ఏళ్లు నిండని బాలబాలికలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆమె వెంట ఉదయ్, స్టెఫీ, కమలమ్మ, గంగాబాయి, తిరుమలచారి ఉన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ పెట్టొద్దు
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. పెండింగ్ పెట్టొద్దని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. మొత్తం 125 ఫిర్యాదులు రాగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 72, జిల్లా అధికారులకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నెల రోజులకు మించి పెండింగ్లో పెట్టవద్దన్నారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పెండింగ్ ఫైళ్ల జాబితా రూపొందించి ఈ నెల 15వ తేదీలోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారంలోపు పరిష్కరించిన వాటి వివరాలను సమర్పించాలన్నారు. ఇకపై అన్ని కార్యాలయాల ఫైళ్లు ఈ– ఆఫీస్ ద్వారా నిర్వహించాలనాని, ఇందుకోసం ఎన్ఐసీ ద్వారా ప్రతి శాఖకు ఒక మెయిల్ ఐడీ ఇస్తామన్నారు. జనగణనలో భాగంగా ఎన్యూమరేషన్ బ్లాక్లను ఖరారు చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
వైభవంగా ఎర్రబెల్లి జాతర
నిడమనూరు : ఓ లింగా.. ఓ లింగా నామస్మరణతో ఎర్రబెల్లి గుట్ట(గొల్లగట్టు) మారుమోగింది. లింగమంతులస్వామి జాతర సందర్భంగా సోమవారం తెల్లవారుజామున ఎర్రబెల్లి గుట్టపై లింగమంతులస్వామి, మాణిక్యాలదేవి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. గోపాలపురం నుంచి వచ్చిన దేవరపెట్టలోని దేవతమూర్తులకు యాదవులు, పూజరులు(బైండ్ల) సంప్రదాయబద్దంగా కల్యాణం నిర్వహించారు. తలంబ్రాలను పోసిన అనంతరం మాణిక్యాలదేవి, యలమంచమ్మ దేవతలకు భక్తులు జీవాలుకోసి, మొక్కులు చెల్లించుకున్నారు. డోలు, కటారుల విన్యాసాల నడుమ నైవేథ్యాలను సమర్పించారు. ఎర్రబెల్లి పరిసరాలు సోమవారం భక్తులతో నిండిపోయాయి. -
ఉద్యమకారుల ఫోరం అధ్యక్షురాలిగా జానకిరెడ్డి
నాగార్జునసాగర్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నందికొండ మున్సిపాలిటీకి చెందిన జానకిరెడ్డి ఏకగ్రీవంగా నియామకయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వోరుగంటి ఆనంద్ ఆదివారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలి పారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నేరవేర్చేందు కు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం, ఆత్మగౌ రవం, సంక్షేమం కోసం కృషిచేస్తానని తెలిపారు. పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటంగుర్రంపోడు : పేదల పక్షాన సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలంలోని చామలేడులో నలుగురు వార్డు సభ్యులతోపాటు 50 మంది సీపీఐలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అంజచారి, రేపాక లక్ష్మీపతి, వెంకట్రెడ్డి, షేక్ మదార్, చేవూరి శంకరాచారి, పగిల్ల రమేష్, ఆవుల సైదులు, లింగమ్మ, రమేష్, కవిత, వార్డు సభ్యుడు దోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బత్తాయి రైతుకు పురస్కారం గుర్రంపోడు : జీవన ఎరువులు వాడి బత్తాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించిన గుర్రంపోడు మండలం బ్రహ్మణగూడెం గ్రామానికి చెందిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ రైతు పురస్కారం అందించింది. ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోరమాండల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా రైతుమేళా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా రైతు శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. పలువురి అభినందన రైతు శ్రీనివాస్ ఉత్తమ పురస్కారం అందుకోవడంపై బత్తాయి రైతుల జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షుడు సురుగురు శ్రీనివాస్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ ఉపేందర్రెడ్డి, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఉద్యాన అధికారి సుభాషిణి ఽకృతజ్ఞతలు తెలిపారు.


