breaking news
Nalgonda District News
-
సీఎం సెక్యూరిటీ, కాంగ్రెస్ నేతల తోపులాట
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ముగిసిన తరువాత మహిళా సంఘాలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వేదికపైనే సీఎంను సన్మానించారు. ఇదే సమయంలో మాజీ మున్సిపల్ చైర్మన్, మేయర్ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్రెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహనన్రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని సన్మానించేందుకు వెళుతుండగా సీఎం సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పలుమార్లు వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే క్రమంలో నేతలను సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం పర్యటనలో ముఖ్యమైన నాయకులకు ఇలా జరగడం చర్చనీయాంశమైంది. ప్రకటనల్లో ఫొటోలపై నారాజ్.. సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా రోడ్లు భవనాల శాఖ జారీ చేసిన ప్రకటనల్లో ఫొటోలపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రొటోకాల్ ప్రకారం జిల్లాకు చెందిన, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం ఫొటోలను వేయలేదు. దీంతో గుత్తా సుఖేందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంబంధిత అఽధికారులకు అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. మరోవైపు సీఎం పర్యటనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేతకు ఆహ్వానం అందకపోవడం, మంత్రి అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు, హోర్డింగ్లలోనూ డీసీసీ అధ్యక్షుడి హోదాలో కైలాష్ నేత ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
పల్స్ పోలియో 94 శాతం
నల్లగొండ టౌన్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 1,54,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో పల్స్ పోలియో 94 శాతం పూర్తయింది. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నారు. నల్లగొండలోని జీజీహెచ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.రాహుల్ ప్రారంభించారు. హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుపర్ణతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నారులకు విధిగా పోలియో చుక్కలను వేయించడం వల్ల వారి జీవితానికి భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మ, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, వైద్యసిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎదురుగా వచ్చిన మృత్యువు
గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. - 8లోధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశంలో ధాన్యం దిగుమతి కొనుగోళ్లలో తెలంగాణ ముందుంటే.. తెలంగాణలో నల్లగొండ జిల్లా ముందుందన్నారు. జిల్లాలో కొత్తగా 75 వేల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఏఎమ్మార్పీ, సాగర్ కాల్వల ఆదునీకరణ పనులు చేపట్టామన్నారు. నా జీవితంలో ఇంత పెద్ద రోడ్ల ప్రాజెక్టు ఎక్కడా ఒకేసారి చేపట్టిన దాఖలాలు లేవన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో హైలెవల్, లోలెవల్ కెనాల్ పూర్తిచేసి లింక్ కలపాలని, డిండి, ఎదుల్ల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. -
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.మూసీ కాలుష్యంతో ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాలను మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ‘కేసీఆర్, కేటీఆర్ మీరు ఒకసారి నకిరేకల్ ప్రాంతంలో రాత్రి నిద్రపోయి చూడండి, ఇక్కడి ప్రజలు దోమలతో, మూసీ కంపుతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుందన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ పూర్తి చేయిస్తానని కేసీఆర్ ఎన్నికల్లో ప్రకటించి ఒక్కసారి కూడా అక్కడికి పోలేదన్నారు. సొరంగం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో నల్లగొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నల్లగొండను కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీకి మరో రూ.400 కోట్లు, షాదీఖానా నిర్మాణానికి, సొరంగ మార్గానికి మరో రూ.500 కోట్లు మంజూరు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. -
ఎస్ఎల్బీసీ, డిండి
ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్రెడ్డివచ్చే ఎన్నికల నాటికి..నల్లగొండ : ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్థిక మంత్రి చూస్తారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కళాశాల బహిరంగ సభ ప్రాంగణం వద్ద రూ.83 కోట్లతో మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఎల్బీసీ పూర్తిచేసి కృష్ణాజలాలను నల్లగొండ గడ్డపై పారిస్తానని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మూసీ కంపు, కాలుష్యం నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు. మూసీ కంపు వల్ల జిల్లాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం ఎందుకు పోవాలి ‘నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు యువకులు నాకు ఇలా చెప్పారు. సూర్యాపేటలో తులసివనంలో గంజాయి మొక్క ఉందన్న. ఆ మూడు జానలాయన కోమటిరెడ్డిని విమర్శిస్తుండు. ఈ సారి ఆ గంజాయి మొక్కను గెలువనివ్వమని నాకు చెప్పారు. నేను కూడా మీకు చెబుతున్నా ఆ ఒక్క మొక్కను కూడా పీకేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన పోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మా ఆడపడుచులంతా.. కళ్ల సంబురంగా నేను పెట్టిన చీరనుకట్టుకుని వచ్చిండ్రు. నేను అడుగుతున్నా.. వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవాల్నా.. గ్యాస్, సన్న బియ్యం, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాల్నా’ అంటూ ముఖ్యమంత్రి వేదిక నుంచి ప్రశ్నించారు. ఫ మూసీ కాలుష్యం నుంచి నల్లగొండకు విముక్తి కల్పిస్తాం ఫ సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం పోవాల్నా ఫ నల్లగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ కనగల్ : కనగల్ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ వద్ద సీఎం రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి హ్యామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092.37 కిలోమీటర్ల పరిధిలో 441 రహదారులను విస్తరించి, పటిష్టపరచేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుందని సీఎంతో పాటు మంత్రులు వెల్లడించారు. మెరుగైన రహదారుల నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా వాణిజ్య, వ్యవసాయ రంగాల పురోగతికి ఊతమిస్తుందని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. -
శాస్త్ర విజ్ఞానంతో కొందరి చేతుల్లోకే సంపద
● ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నల్లగొండ టౌన్ : శాస్త్ర విజ్ఞానం కొందరికి సంపద సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. జిల్లా ఔషధ అధికారి కాకి పరాబ్కుమార్ ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండలోని మెడికల్ కళాశాల ఎగ్జామినేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ కారణంగా సంపద ఆదానీ, అంబానీ చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమించే వారిని పక్కన పెడతూ ప్రస్తుత పాలకులు సోమరిపోతులను ప్రోత్సహిస్తోందన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం వీపీ డాక్టర్ బి.రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తూనే సమాజంలో మార్పు కోసం తన కుటుంబ వారసత్వాన్ని పరాబ్ కొనసాగించారని తెలిపారు. అనంతరం పరాబ్కు జ్ఞాపికలు, పుస్తకాలు బహూకరించారు. శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్క్రతిక మండలి అధ్యక్షురాలు బండ్రు విమల, అంబటి నాగయ్య, ఎలమంచిలి రవీంద్రనాథ్, సోమ మల్లయ్య, అమృత రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ క్రీడలో రాణించాలితిప్పర్తి : హ్యాండ్ బాల్ క్రీడలో విద్యార్థులు ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అబ్జర్వర్ ఎల్వి.రావు అన్నారు. తిప్పర్తిలో ఆదివారం నిర్వహించిన హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన హ్యండ్ బాల్ ఆసొసియేషన్ అధ్యక్షుడిగా నర్సింహారావు, కార్యదర్శిగా ఎండీ.అక్బర్, కోశాధికారిగా ఎండీ.బాబర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాగర్ను సందర్శించిన చిన్నారెడ్డినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ను మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజావాణి ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నాగార్జునకొండ పురావస్తు మ్యూజియం, మహాస్తూపం, సింహాల విహారాలను సందర్శించారు. అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధుడి పాదాలకు వందనం సమర్పించారు. మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఆయనను బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర కండువాలు, బ్రోచర్లతో సత్కరించారు. ఆయనకు టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జునసాగర్ ను సందర్శించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బుద్ధవనం ఎంతో అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. వారి వెంట ప్రొఫెసర్ జలంధర్రెడ్డి, ప్రొటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు నివాళి
పీవీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న భూపాల్రెడ్డి, పీవీ నర్సింహారావు అభిమానులునల్లగొండ టౌన్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం నల్లగొండ పట్టణంలో పీవీ అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పీవీ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయ మన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, కార్పొరేటర్ రమేష్, ఏవీఎల్ నర్సింహారావు, చకిలం సంధ్యారాణి, చకిలం వేణుగోపాలరావు, కంచనపల్లి రవీందర్రావు, రాజేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల నిర్వహణ భారం
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో కనీస వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద ఏటా రూ.వంద కోట్లు విడుదల చేసేది. నాలుగేళ్లుగా నిధుల విడుదలను నిలిపివేసింది. ప్రతి పీహెచ్సీకి ఏటా రూ.1.50 లక్షలు, ఆరోగ్య ఉపకేంద్రాల(సబ్సెంటర్ల)కు రూ.10 వేలు విడుదల అయ్యేవి. 2022–23 సంవత్సరంలో చివరిసారిగా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు మొండిచేయి చూపుతోంది. దీంతో జిల్లాలోని 34 పీహెచ్సీలు, 5 అర్బన్హెల్త్ సెంటర్లు, 257 సబ్ సెంటర్లు, 7 బస్తీ దవాఖానాల్లో నిర్వహణ భారంగా మారి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్హెచ్ఎం నిధులతో చేపట్టే కార్యక్రమాలు.. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ సంక్షేమం, కీటక జనిత, అసంక్రమిత, క్షయ, కుష్టు, సార్వత్రిక వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, మలేరియా, డెంగీ జ్వరాల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాలుగేళ్లుగా నిధుల్లేక ఆయా కార్యక్రమాలు కుంటుపడిపోయాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం.. గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకోసం ప్రతి ఐదువేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు (సబ్సెంటర్) ఏటా రూ.10వేల చొప్పున ఎన్హెచ్ఎం నిధులను విదుదల చేసేవారు. ఆ నిధులతో సబ్సెంటర్లో పారిశుద్ధ్య మెరుగు, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, అద్దెలు, తాగునీటి సౌకర్యాలకు వినియోగించే వారు. కానీ, నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా తయారైంది. నిలిచిన కుటుంబ నియంత్రణ శిబిరాలు.. కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకుంటే పురుషులకు రూ.1100, సీ్త్రలకు రూ.800 చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ, ఎన్హెచ్ఎం నిధులు విడుదలకాని కారణంగా నాలుగేళ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్లో ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల వేలాది రూపాయలను భరించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా నిలిచిన ఎన్హెచ్ఎం నిధులు అభివృద్ధికి దూరంగా పీహెచ్సీలు, సబ్సెంటర్లు కొనసాగని ఆరోగ్య కార్యక్రమాలు ఆస్పత్రుల్లో కుంటుపడిన వైద్యసేవలు -
స్నేహితుడి మరణం.. సమాజ సేవకు ప్రేరణ
సూర్యాపేటటౌన్ : ఎక్కడ జనసందోహం ఉన్నా.. ఎక్కడ పెద్ద జాతరలు, వారసంతలు ఉన్నా నల్లటి దుస్తులు ధరించి మెడలో పుర్రెల దండ వేసుకొని నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ ఫ్లెక్సీని పట్టుకొని అక్కడ కనిపిస్తారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సమాజంలో కనీసం ఒక్కరినో.. ఇద్దరినో మత్తు పదార్థాల బారి నుంచి విముక్తి కల్పించడమే తన కర్తవ్యంగా భావించి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. మూడేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం ప్రభాకర్ను తీవ్రంగా కలిచివేసింది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆయనను ఆలోచింపజేశాయి. సమాజంలో అవగాహన పెంచాలని సంకల్పించిన ఆయన అప్పటి నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభాకర్ ప్రత్యేక వేషధారణను ఎంచుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో పుర్రెల బొమ్మలతో చేసిన దండ వేసుకుని నో డ్రగ్స్..సేవ్ లైఫ్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంప్రదాయ పండగలు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగల సమయంలో ఆయా మతస్తుల వేషధారణతో మత్తు జోలికి వెళ్లొదని వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వేషధారణ చూసిన వారంతా ఆసక్తిగా దగ్గరకు రావడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సెలవు దొరికిన ప్రతిసారి ప్రభాకర్ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలను ఎంచుకుంటారు. వారసంతలు, జాతరలు, సభలు, ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో తన వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. యువతతోపాటు పెద్దలకు కూడా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బైక్ యాత్రతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవకు ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ పుర్రె దండతో మత్తుపై యుద్ధం ఫ నల్లటి దుస్తుల్లో మత్తు వ్యతిరేక సందేశం ఫ ‘నో డ్రగ్స్.. సేవ్ లైఫ్’ అంటూ చైతన్య యాత్ర ఫ మత్తు రహిత సమాజానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కృషినేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభాకర్ చేస్తున్న సేవ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే తన లక్ష్యమని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. -
హామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
నల్లగొండ : ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట టీఎస్యూటీఎఫ్ ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అశాసీ్త్రయమైన ఎన్ఈపీ 2020ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతను ఆపివేయాలని డిమాండ్ చేశారు. అవసరం ఉన్న చోట నూతన పాఠశాలలను తెరవాలని, విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిచాలని, పీఆర్సీకి రిపోర్ట్ తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. అనంతరం డీఆర్ఓ దశరథకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, నల్ల నరసింహ, జి.నాగమణి, నర్రా శేఖర్రెడ్డి, జి.అరుణ, వడ్త్యా రాజు, గేర నరసింహ, శ్రీనివాస్రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, యాదగిరి, చిన వెంకన్న, కొమర్రాజు సైదులు, గంటల వెంకట్, భాను ప్రకాష్, నరసింహమూర్తి, వరలక్ష్మి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘సర్’ బృందాలకు సహకరించాలి
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో (సర్) భాగంగా ఇంటింటికి వచ్చే బీఎల్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్లకు ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నుంచి ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలోని రహమత్నగర్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యజమానులతో మాట్లాడారు. ఇంటో ఎంతమంది ఉంటారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారని? అడిగి తెలుసుకున్నారు. యాప్ అప్డేట్ చేసుకున్నారా అని బీఎల్ఓను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారని, ఇందులో పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లను జతపరచి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, నల్లగొండ తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ అమీనా ఫరీద్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రశాంతంగా మూసీ మత్స్య సంఘం ఎన్నికలు
నకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూసీ మత్స్య సంఘానికి తొమ్మిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు పంచాయతీ పోరును తలంపించాయి. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పెదసంఖ్యలో బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓటర్లను హాల్లోకి అనుమతి ఇచ్చారు. మొత్తం 13 డైరెక్టర్ల పదవులకు గాను 44 మంది పోటీ పడుతున్నారు. ప్రతి ఓటరు 13 మందికి ఓటు వేయాల్సి ఉండడంతో పోలింగ్ ప్రక్రియ గంట అలస్యంగా ముగిసింది. మొత్తం 3,557 మంది ఓటర్లకుగాను, 3,118 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.బరిలో 44 మంది అభ్యర్థులు మూసీ మత్స్య సంఘం ఎన్నికల నిర్వహణతో ఓగోడు గ్రామంలో సందడి నెలకొంది. పోటీలో ఉన్న 44 మంది అభ్యర్థులు తమకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రం ఎదుట ప్రచారం నిర్వహించారు. దీంతో మాధారం – ఓగోడు రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సెంటర్ను డీసీఆర్బీ డీఎస్పీ రవి సందర్శించి పర్యవేక్షించారు. నకిరేకల్, శాలిగౌరారం సీఐలు హరిబాబు, రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 87.65 శాతం పోలింగ్ నమోదు అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్ -
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆసక్తి, అర్హత గల ప్రభుత్వ ఉపాధ్యాయులు జూలై 10వ తేదీలోగా nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ సుశీందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న కాపీని నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖలో బదిలీలునల్లగొండ : జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీ–ఈఓ)గా పనిచేస్తున్న బి.సంతోష్ను సిద్దిపేట జిల్లా డీపీ–ఈఓగా బదిలీ చేశారు. నల్లగొండలో ఏపీ–ఈఎస్గా విధులు నిర్వహిస్తున్న బి.చాణక్యను మంచిర్యాల జిల్లా డీపీ–ఈఓగా నియమించారు. డీపీ–ఈఓ పోస్టు ఖాళీ కావడంతో, నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్)కు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పోస్టు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ప్రస్తుతం నల్లగొండ డీసీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాస్రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జాయింట్ డైరెక్టర్ (ఈస్ట్)గా పనిచేస్తున్న సివి.శశిధర్రెడ్డిని నల్లగొండ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. సరూర్నగర్ డీపీ–ఈఓగా ఉన్న ఎస్.ఉజ్వలరెడ్డికి నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్)గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన అధికారులు తక్షణమే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయం ఆదేశించింది. హెడ్కానిస్టేబుళ్లకు ఎస్పీ అభినందననల్లగొండ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్ పట్టీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరిగినట్లేనని చెప్పారు. కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాంమిర్యాలగూడ అర్బన్ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న సంఘం ఈసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు మాడుగుల శ్రీనివాస్, మర్రి జోజికుమార్, పెరుమళ్ల ధనమ్మ, సావిత్రి, శోభ, కోడిరెక్క ప్రవీణ్, అభినవ్, నాగరాజు, నగేష్, నాగేంద్ర, సుహాసిని పాల్గొన్నారు. -
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్ను నియమించారని.. ఆ గ్యాంగ్ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్ను రంగంలోకి దించారు.దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. -
నల్లగొండను మోడల్ సిటీ చేస్తా
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ.కోటీ 20 లక్షలతో చేపట్టనున్న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. సిటీ పరిధిలో రెండు సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ నగరంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. నల్లగొండ అదనంగా 30 బస్సులు కేటాయించామని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్ద పెట్రోల్ పంపు, ఇందిరా మహిళ శక్తి క్యాంటిన్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధిలో భాగంగా రూ.83 కోట్లతో తాగునీటి శుద్ధి (వాటర్ ఫిల్టర్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ సిటీగా రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్, మేయర్ బుర్రి చైతన్య, రాష్ట్ర ప్రణాళిక ఆర్థిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, కార్పొరేటర్ కవిత, రమేష్, లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండలో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులకు శంకుస్థాపన -
నీలగిరిలో సిటీ బస్సులు
ఫ దర్వేశిపురం – అనిశెట్టి దుప్పలపల్లి రూట్లో నడిచే బస్సు దర్వేశిపురం, జి.చెన్నారం, జి.చెన్నారం ఎక్స్ రోడ్డు, కొత్తపల్లి, కతాల్గూడెం, హౌజింగ్ బోర్డు కాలనీ, సాగర్ ఎక్స్ రోడ్డు, మునుగోడు ఎక్స్ రోడ్డు, నేషనల్ ఫంక్షన్హాల్, డీవీకే రోడ్డు బస్టాప్, భాస్కర్ థియేటర్, క్లాక్టవర్, నల్లగొండ బస్టాండ్, రహమత్నగర్, బీటీఎస్, కలెక్టరేట్, అలకాపురి కాలనీ, రాంనగర్ పార్కు, కేంద్రియ విద్యాలయం, కేశరాజుపల్లి, హ్యాపీహోమ్స్, అనిశెట్టి దుప్పలపల్లి. ఫ చెర్వుగట్టు నుంచి ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజీ మధ్య నడిచే బస్సు ఎల్లారెడ్డిగూడెం, రాంనగర్కాలనీ, ఎంజీ యూనివర్సిటీ, 12వ బెటాలియన్, సీతారాంపురం, జీ స్కూల్, టీజీఎస్డబ్ల్యూర్ కాలేజీ, నలంద కాలేజీ, చర్లపల్లి, సాయి సదన్ హోమ్స్, మర్రిగూడ బైపాస్, మర్రిగూడ, ఐటీ హబ్, ఎస్బీఐ బ్యాంకు, వీటీ కాలనీ, పూజిత అపార్ట్మెంట్, ఎన్జీ కాలేజీ, క్లాక్ టవర్, నల్లగొండ బస్టాండ్, క్లాక్ టవర్, భాస్కర్ థియేటర్, డీవీకే రోడ్డు బస్టాప్, మునుగోడు ఎక్స్ రోడ్డు, సాగర్ ఎక్స్ రోడ్డు, అయ్యప్ప దేవాలయం, భాగ్యనగర్ కాలనీ, మెడికల్ కాలేజీ స్టాప్లో బస్సు ఆగుతుంది. ఫ చెర్వుగట్టు వద్ద : ఉదయం 06:45, 08:55, 11:25, మధ్యాహ్నం 01:55, సాయంత్రం 04:45, 06:35. ఫ ఎల్ఎల్బీసీ మెడికల్ కాలేజ్ వద్ద : ఉదయం 07:55, 10:05, మధ్యాహ్నం 12:35, 03:05, సాయంత్రం 05:25, రాత్రి 07:45. ఫ దుప్పలపల్లి వద్ద : ఉదయం 07:00, 09:10, 11:20, మధ్యాహ్నం 01:40, సాయంత్రం 04:10, రాత్రి 06:20. ఫ దర్వేశిపురం వద్ద : ఉదయం : 08:05, 10:15, మధ్యాహ్నం 12:25, 02:45, సాయంత్రం 05:15, రాత్రి : 07:25. ఫ రెండు సర్వీస్లను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి ఫ 20 ఏళ్ల తర్వాత అందనున్న సిటీ బస్ సేవలు ఫ నగర ప్రజలకు ఎంతో ఉపయోగం -
జూలై 22న ఎన్జీ కళాశాల స్నాతకోత్సవం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని నాగార్జున కళాశాల (ఎన్జీ) స్నాతకోత్సవాన్ని జూలై 22న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ, 2024–25 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ స్నాతకోత్సవానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు కళాశాలకు వచ్చి, నిర్ణీత ఫీజును చెల్లించి స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి తెలిపారు. స్నాతకోత్సవానికి అర్హులైన విద్యార్థుల జాబితా ఇతర పూర్తి వివరాలు కళాశాల అధికారిక వెబ్సైట్ nfco efe na go nd-a.ac.i n లో చూడవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9550636464 నంబర్ను సంప్రదించాలని సూచించారు. మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దుచండూరు : చండూరు మండలపరిదిలోని పుల్లెంల గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దని గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన స్కూల్ బస్సులను సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిప్పి పంపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపుతామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కాముల వెంకన్న, ఉప సర్పంచ్ ఊషయ్య, బొడ్డు సైదులు తదితరులు పాల్గొన్నారు. నేడు మూసీ మత్స్య సంఘం ఎన్నికలునకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది మంది మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్ సహకార సొసైటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 డైరెక్టర్ పదవులకు గాను 43 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఘం పరిధిలో నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఓ పంక్షన్ హాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం తుర్కపల్లి: ఇండస్ట్రీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ అధికారి వెంకన్న, ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాపూర్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్ సీతారాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
పథకాలు అందించే బాధ్యత అధికారులదే..
నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందినప్పుడే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఆయన అధికారులను అభినందించారు. అధికారులు ఆర్థిక విషయాలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ పథకాలను అమలు చేయాలని, చిన్న చిన్న మరమ్మతులు ఉంటే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ద్వారా డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులతో పాటు, విద్యార్థులు దోమలు బారిన పడకుండా దోమ తెరలు, తలుపులు వంటి మరమ్మతులన్నీ చేపట్టాలని సూచించారు. జిల్లాలో పథకాల ప్రగతిని ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. అంతకుముందు ఆయనకు.. కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, డీఎఫ్ఓ రాజశేఖర్, సీపీఓ శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ -
గుట్టలు మాయమై.. సాగుకు సిద్ధమై!
మండలంలో గుట్టలు, ప్రభుత్వ భూములు ఇలాగే మాయమైపోతే.. భవిష్యత్లో ప్రభుత్వ భవనాలు, సబ్స్టేషన్లు, సోలార్ ప్లాంట్ల వంటి అవసరాలకు స్థలం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, భూ ఆక్రమణలు, మట్టి తవ్వకాలపై పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.నిడమనూరు : నిడమనూరు మండలంలో గుట్టల తవ్వకాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒకవైపు వ్యవసాయ సీజన్ దగ్గర పడుతుండటంతో.. గుట్టలను, ప్రభుత్వ అసైన్డ్ భూములను తవ్వేస్తూ సాగు భూములుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల గుట్టలు సగానికి పైగా మాయమవగా, తాజాగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ‘ఎర్రగుట్ట’ చుట్టూ భారీ తవ్వకాలు.. నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఎర్రగుట్ట చుట్టుపక్కల రెండు వారాలుగా జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఎర్రబెల్లి, సోమోరిగూడెం, బుంటువారిగూడెం, మారుపాక గ్రామాలకు చెందిన కొందరు ఈ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 494లో 115 ఎకరాల 35 గుంటలుగా ఉన్న ఈ గుట్ట.. ఇప్పుడు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. ఇందులో రెండు సబ్ స్టేషన్లకు 6 ఎకరాలు, వాటర్ ట్యాంక్ (మిషన్ భగీరథ) కోసం కొంత స్థలం కేటాయించారు. భూ పంపిణీ కింద 30 నుండి 40 ఎకరాలు ఇవ్వగా.. దానికి రెట్టింపు భూమి ఆక్రమణకు గురైంది. మరో 10 నుంచి 15 ఎకరాల్లో తెల్లరాయి మైనింగ్ జరుగుతుండగా, మరికొందరు 20 ఎకరాల్లో తమకు పట్టా ఉందంటూ మట్టిని విక్రయిస్తున్నారు. మండలంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు ● మార్లగడ్డ–రాజన్నగూడెం (సర్వే నెం. 278) వెనిగండ్ల దేవునిగుట్ట వెనుక భాగాన్ని గతంలో పట్టా చేసుకోగా, ఇప్పుడు మట్టిని తవ్వి అమ్ముకుంటూ భూమిని చదును చేస్తున్నారు. ● గుంటకగూడెం బోడు (నిడమనూరు చెరువు పైన) ఇక్కడ అప్పుడప్పుడు రహస్యంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఇప్పటికే 30 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురికాగా.. ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్, సబ్స్టేషన్ ఏర్పాటును ఆక్రమణదారులు అడ్డుకోవడం గమనార్హం. గతంలో సర్వే నెంబరు 294 లోని 35 ఎకరాల ప్రభుత్వ భూమిని ముగ్గురు ప్రభుత్వ అధికారులే ఆక్రమించుకున్నా.. రెవెన్యూ అధికారులు కేవలం నోటీసులకే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● ముప్పారం సబ్స్టేషన్ గుట్టకు ఇరువైపులా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ముప్పారం–గుంటిపల్లి, ముప్పారం–సోమోరిగూడెం రోడ్డులోని గుట్టలు సగానికి పైగా మాయమయ్యాయి. ● తుమ్మడం పెద్ద చెరువు సర్వే నంబర్ 880 అసైన్డ్ భూమిలో 50–120 మీటర్ల వెడల్పున్న యేన ప్రాంతంలో మట్టిని తవ్వి సాగుకు సిద్ధం చేస్తున్నారు. ● వెనిగండ్ల సర్వే నంబర్ 99లో ఇటీవల ప్రధానమంత్రి సడక్ యోజన రహదారి పనుల అనుమతుల చాటున కొందరు అక్రమంగా మట్టి విక్రయాలు జరిపారు. నిడమనూరు మండలంలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి తవ్వకాలు ఫ సగానికిపైగా ఆక్రమణకు గురైన ఎర్రబెల్లి గుట్ట ఫ పట్టా భూముల పేరుతో మట్టి దందా ఫ నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు -
నేటి నుంచే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
జిల్లాలో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో పోల్చి ఇప్పటివరకు 86.62 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారు. మొత్తం 15,16,253 మంది ఓటర్లలో 13,13,325 మంది వివరాలు మ్యాపింగ్ కాగా, ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) వివరాల ధ్రువీకరణ కావాల్సి ఉంది. మ్యాపింగ్ పూర్తయిన వారిలో కూడా 4,02,517 మంది (30.65 శాతం) ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వివరాల్లో పొరపాట్లు ఉన్నట్లు వెల్లడైంది. వాటిని సరి చేసేందుకు అవకాశాలు కల్పించనున్నారు. ఫ ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్న బీఎల్ఓలు ఫ 2002, 2026 ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్ ఫ ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్లు 2.02 లక్షల మంది ఫ బీఎల్ఓలకు కిట్ల అందజేత, శిక్షణ కూడా పూర్తి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. వలసలు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉండటం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉంటే వాటిని తొలగిస్తారు. వంద రోజుల పాటు చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా కొత్త ఓటరు జాబితాను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) నేటినుంచి ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి వివరాలు సేకరించనున్నారు. జిల్లాలోని 1812 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో బీఎల్ఓను, వారిపై పర్యవేక్షణ కోసం 181 మంది సూపర్ వైజర్లను నియమించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ను (బీఎల్ఏ) కూడా నియమించుకునే అవకాశం కల్పించారు. వారు కూడా ఓటర్లకు సహకరిస్తూ పారాలను నింపడంలో భాగస్వామ్యులు కావచ్చు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 15,16,253 మంది ఓటర్లున్నారు. ప్రతి ఓటర్కు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఒక పారాన్ని నింపి సంతకం చేసి బీఎల్ఓకు ఇవ్వాల్సి ఉండగా, మరో ఫారాన్ని భవిష్యత్ అవసరాల కోసం తమ వద్ద ఉంచుకోవాలి. ఇందుకోసం మొత్తం 31,62,352 పారాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎల్ఓలకు అవసరమైన కిట్లు, శిక్షణను కూడా ఇచ్చారు. మొదటి నాలుగు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పారాలు పంపిణీ చేస్తారు. అనంతరం వాటిని తిరిగి సేకరించి రోజు వారీగా ఆన్లైన్ చేయనున్నారు. ఈసారి సర్ ప్రక్రియలో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితా, ప్రస్తుత 2026 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రతి ఓటర్ను ధ్రువీకరించనున్నారు. 2002లో జిల్లాలో 10,92,369 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం 15,16,253కు చేరింది. 24 సంవత్సరాల్లో ఓటర్ల సంఖ్య 4,23,884కు పెరిగింది. 2002 జాబితాలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా వివరాలను సరిపోల్చి అసలైన ఓటర్లను గుర్తించనున్నారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు, మరణించిన వారి పేర్లు, అర్హతలేని పేర్లను గుర్తించి తొలగించనున్నారు. 2002 జాబితాలో పేర్లు లేని వారు లేదా కుటుంబ వివరాలతో మ్యాపింగ్ కాని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాలి. సర్ ప్రక్రియ వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను జులై 31వ తేదీన ప్రకటిస్తారు. అందులో తమ పేరు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా, కొత్తగా పేర్లు నమోదు చేయించుకోవాలన్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓటు తొలగిస్తే సంబంధిత వ్యక్తులు ఫారం 6తో పాటు డిక్లరేషన్ సమర్పించాలి. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి జత చేసి బీఎల్ఓకు అందజేయాలి. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో నల్లగొండ నియోజక వర్గంలోనే తక్కువ మ్యాపింగ్ అయింది. కేవలం 75.01 శాతం మ్యాపింగ్ కాగా నాగార్జునసాగర్లో 95.40 శాతం, నకిరేకల్లో 95.04 శాతం, దేవరకొండలో 88.53 శాతం, మునుగోడులో 87.90 శాతం , మిర్యాలగూడలో 77.50 శాతం నమోదైంది. దేవరకొండ నియోజక వర్గంలో అత్యధికంగా 96,725 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ‘సర్’ సాగుతుంది ఇలా.. – జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం – జులై 31వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రకటన – జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ – సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం – అక్టోబర్ 1వ తేదీన ఓటరు తుది జాబితా ప్రకటన -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
నల్లగొండ : నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్థాన్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘చాత్రోంకి గూంజ్’ (విద్యార్థి యువత గొంతుక) మహా ఉద్యమానికి నల్లగొండ డీసీసీ మద్దతు నిస్తుందన్నారు. నీట్ పరీక్షల రద్దు, ప్రశ్నపత్రాల లీకేజీలు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం యువతను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, బట్టు జంగయ్య, ఎండీ అజీజ్, చింత ధనుంజయ్, జమ్ము అశోక్, ఆకటి సైదులు, ఎండీ అమన్ పాల్గొన్నారు. ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలినల్లగొండ టౌన్ : హైదరాబాద్లో ఈ నెల 28న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం చైర్మన్ పిడమర్తి రవి కోరారు. మంగళవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఉద్యమకారులు సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, 250 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మాతంగి అమర్, గురుపాటి సుదర్శన్, ఏర్పుల శ్రవణ్కుమార్, ఆసిఫ్ (అష్రఫ్), ముస్తఫా, నాగరాజు, వెంకన్న, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు. యాప్లతో వ్యవసాయం చేయలేం నల్లగొండ టౌన్ : ఎరువుల యాప్ ద్వారా రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేంద ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వానా కాలం సీజన్ ఆరంభమైనందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. దుకాణాల్లో డీఏపీ, యూరియాను అమ్మేవిదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులను విడుదల చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేషం, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి తేనున్న రవాణా శాఖ
సాంకేతిక పద్ధతిలో టెస్టులను నిర్వహించేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్టులు, ఫిట్నెస్ టెస్టులను అధికారుల పర్యవేక్షణలో నిర్వహించి, డ్రైవింగ్ సరిగ్గా చేశారా? వాహనం ఫిట్నెస్ సరిగ్గా ఉందా? లేదా? చెక్ చేసి, సర్టిఫై చేసే వారు. ఇకపై సాంకేతిక సహకారంతో టెస్టులను నిర్వహిస్తారు. ఇందుకు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్ల ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఫ అందుకు కొత్త ట్రాక్ల నిర్మాణానికి కసరత్తు ఫ దండెంపల్లి వద్ద ఐదు ఎకరాల్లో నిర్మించేలా ప్రతిపాదనలు ఫ రవాణా శాఖ కార్యాలయంతో పాటు ట్రాక్లు అక్కడే.. ఫ ఆటోమేటెడ్ విధానంలో డ్రైవింగ్, వాహనాల ఫిట్నెస్ టెస్టులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోనూ ఆ దిశగా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నల్లగొండ కలెక్టరేట్ వెనుక భాగంలో రవాణా శాఖ కార్యాలయం ఉంది. అక్కడే కార్యాలయ సేవలతోపాటు టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల కలెక్టరేట్ విస్తరణలో భాగంగా రవాణా శాఖ స్థలంలో కలెక్టరేట్ అదనపు భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ ట్రాక్ సగం వరకు పోయింది. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ కోసం హైదరాబాద్ రోడ్డులో స్థలాన్ని ఇవ్వాలని భావించినా అది లిటిగేషన్లో ఉండటంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. నల్లగొండ మండలంలోని దండెంపల్లిలో గతంలో తోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలాన్ని రవాణా శాఖకు ఇవ్వాలని, అక్కడే రవాణా శాఖ కార్యాలయాలతోపాటు ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఫిట్నెస్ టెస్టు సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే వాటి నిర్మాణ పనులను ప్రారంభించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఆటోమేటెడ్ ఫిట్నెస్లోనూ అంతే.. ఇప్పటివరకు వాహన ఫిట్నెస్ను అధికారులు స్వయంగా పరిశీలించి ఫైలు రాసి ఫిట్నెస్ జారీచేస్తారు. స్టీరింగ్, వీల్ అలైన్మెంట్, పొల్యుషన్, లైట్స్, బ్రేక్ తదితర కేటగిరీల్లో ఫిట్నెస్ను పరిశీలిస్తారు. ఆటోమేటెడ్ టెస్ట్లో.. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మిషన్లే పరీక్షిస్తాయి. వాటి ఫలితాల ఆధారంగానే అధికారులు సర్టిఫై చేస్తారు. ఒక్కో పరీక్షను ఒక్కో మిషన్ నిర్వహించనుంది. ఇంటివద్ద నుంచే లర్నింగ్ లైసెన్స్ లర్నింగ్ లైసెన్స్ను ఇంటివద్ద నుంచే ఆన్లైన్ ద్వారా పొందేలా రవాణ శాఖ సేవలను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. త్వరలో ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం రాబోతోంది. అందులో వాహనదారులు రవాణా శాఖ పోర్టల్ ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని, కంప్యూటర్లోనే టెస్ట్ రాసి లర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. రవాణా శాఖ సేవలను సులభతరం చేసేందుకు, పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ విధానాన్ని వాహనాల డీలర్లకు అప్పగించింది. త్వరలో ఆన్లైన్ లర్నింగ్ టెస్ట్ విధానం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. అలాగే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు, ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది. – కిరణ్కుమార్, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్, నల్లగొండడ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ (మోడల్) కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెస్స్ తీసుకోవాలనుకునే వాహనదారుడు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలి. అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇందులో భాగంగా 8, హెచ్ ఆకారంలో ఉండే ట్రాక్లో రివర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర కేటగిరీల్లో సదరు వాహనదారుడు వాహనాన్ని ఎడ్జెస్కు తగులకుండా నడుపుతున్నాడా? లేదా? అన్న విషయాలను రవాణా శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. అయితే, ఇప్పుడు కొత్తగా రాబోయే ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్ కూడా 8, హెచ్ ఆకారంలోనే ఉన్నప్పటికీ అందులో సెన్సార్లు ఉంటాయి. సెన్సార్లో గుర్తించి.. ఏమైనా తప్పు చేస్తే అతను డ్రైవింగ్లో ఫెయిల్ అయినట్లుగా సిస్టమ్లో చూపిస్తుంది. దాంతో అధికారులు అతను ఫెయిల్ అయినట్లుగా నిర్ధారిస్తారు. -
వ్యవసాయానికి నిరంతర విద్యుత్
నల్లగొండ : వ్యవసాయ రంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యుత్ శాఖ అధికారులతో నల్లగొండ సర్కిల్ పరిధిలోని టి–కోడ్ వారీ అంచనాలు, అభివృద్ధి పనుల పురోగతి, అమలు స్థితి, పెండింగ్లో ఉన్న పనులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కాలిపోయిన, పనిచేయని విద్యుత్ మీటర్లను తక్షణమే మార్చాలని అధికారులను ఆదేశించారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అసంపూర్తి పనుల పురోగతిని పరిశీలించిన సీఎండీ, వాటి పూర్తి కోసం అవసరమైన నిధులు, సామగ్రి అవసరాలపై చర్చించారు. అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త అంచనాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, చేపట్టనున్న అభివద్ధి పనులపై సమీక్షించారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.నరసింహులు, చీఫ్ ఇంజనీర్ (రూరల్ జోన్) బాలస్వామి, ఎస్ఈ (ఆపరేషన్స్)నల్లగొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎండీకి వినతి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ను మంగళవారం విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా విద్యుత్ శాఖ స్టోర్లలో అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్ల పనుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.పర్వతాలు, జిల్లా అధ్యక్షుడు ఎస్కే మొహిజ్, లింగస్వామి పాల్గొన్నారు. ఫ టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ -
వైటీపీఎస్ను ప్రైవేటీకరిస్తే సమ్మెబాట పడతాం
మిర్యాలగూడ : దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లోని ఏ విభాగాన్నీ ప్రైవేటీకరణ చేయవద్దని ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒకవేళ యాజమాన్యం మొండిగా ముందుకు వెళితే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులంతా ఆందోళనలు నిర్వహించి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వైటీపీఎస్ వద్ద మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జిలు ధరించి భోజన విరామ సమయంలో నినాదాలు చేశారు. టీజీ జెన్కో ఉద్యోగుల రేషనలైజేషన్ను అమలు చేస్తూ, త్వరితగతిన వైటీపీఎస్ ప్లాంట్కు అవసరమైన ఉద్యోగులను కేటాయించాలని కోరారు. సీహెచ్పీ, ఏహెచ్పీ టెండర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భరోసా కేంద్రాలు బలోపేతం కావాలి : ఎస్పీ
నల్లగొండ : భరోసా కేంద్రాల సేవలు మరింత బలోపేతం కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపులు, లైంగిక దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 2021 నుంచి 2026 వరకు పోక్సో, అత్యాచారం, మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 806 కేసులు నమోదయ్యాయని, 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని, బాధితులకు రూ.1.68 కోట్లకు పైగా పరిహారం అందించినట్లు వివరించారు. సమావేశంలో ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి, ఎకై ్సజ్ కోర్టు జడ్జి సాయి మేఘన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, పీపీ రంజిత్కుమార్, సీఐ మంజుల, భరోసా ఇన్చార్జి ఎస్ఐ అమ్రిన్, కోఆర్డినేటర్ నళిని తదితరులు పాల్గొన్నారు. -
నీరు తక్కువగా వాడే పంటల సాగు మేలు : కలెక్టర్
కనగల్ : వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం కనగల్ రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వాడాలి తదితర అంశాలపై వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందింస్తామన్నారు. అనంతరం కనగల్లోని మార్కెట్ యార్డ్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్, ఏఓ అమరేందర్గౌడ్, గోలి జాగల్రెడ్డి, సర్పంచ్ మురళీధర్గౌడ్, తహసీల్దార్ పద్మ పాల్గొన్నారు. -
నేడు రేణుకా ఎల్లమ్మ కల్యాణం
కనగల్ : ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో బాగంగా రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునిల కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా సాగనుంది. కల్యాణోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మంగళవారం సుప్రభాత సేవ, లలిత సహస్రనామార్చన, బాల భోగ నివేదన పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా సాగింది. కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి అమ్మవారి కల్యాణ మహోత్సవం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం, భక్తుల సౌకర్యార్థం కుర్చీలు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 25న గురువారం ఆలయం వద్ద 108 కళాశాలతో అష్టోత్తర శతకటాభిషేక మహోత్సవంతో పాటు ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల్లో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. పూజల్లో పూజల్లో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి దంపతులు, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఏసీకే భాస్కర్, సర్పంచ్ రాయల శేఖర్, మాజీ చైర్మన్లు కంచకుంట్ల గోపాల్రెడ్డి, ముత్తయ్య, కార్యదర్శులు పద్మ, రాజేందర్రెడ్డి, ముఖ్య అర్చకులు మల్లాచారి, శ్రవణ్కుమారాచార్యులు, ఉమామహేశ్వరరావు, దామోదర్రావు, శ్రీనివాసచారి, ఫణి కుమార్, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు ఉపేందర్రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, శ్రీకర్, రవి, నాగరాజు పాల్గొన్నారు. ఫ పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి దంపతులు ఫ దర్వేశిపురం ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం -
హౌసింగ్ బోర్డులో గజం రూ.75 వేలు
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని నల్లగొండ–దేవరకొండ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వాణిజ్య అవసరాలకు కేటాయించిన ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సోమవారం నిర్వహించిన బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. మొత్తం 31 ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.44.15 కోట్ల ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి.గౌతం వెల్లడించారు. ప్రతి ప్లాట్ 233 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా, చదరపు గజానికి రూ.20 వేల కనీస ధరను నిర్ణయించారు. అయితే కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో గరిష్టంగా చదరపు గజానికి రూ.75,500, కనిష్టంగా రూ.55,500 ధర నమోదైంది. ఈ వేలంలో భూములను కొనుగోలు చేసేందుకు 201 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ పాట్లు నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడం, భూములకు ఎలాంటి వివాదాలు లేకపోవడం వంటి కారణాలతో ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని గౌతం తెలిపారు. మొత్తం విక్రయాల్లో చదరపు గజానికి సగటున రూ.61 వేల ధర వచ్చినట్లు ఆయన తెలిపారు. వేలంలో రికార్డుస్థాయిలో ధర పలికిన కమర్షియల్ స్థలాలు ఫ 31 ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ.44.15 కోట్ల ఆదాయం -
చిరుగాలికే నేలకొరిగాయి!
మిర్యాలగూడ: కొద్దిపాటి ఈదురు గాలులకే విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. ఇవి నేలకొరుగుతుండడంతో ఒకవైపు ప్రమాదాలు జరుగుతుండగా, మరోవైపు ట్రాన్స్కోకు భారీగా నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం తెలంగాణ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్పీడీసీఎల్)కు కాంట్రాక్టర్లు విద్యుత్ స్తంభాలను సరఫరా చేస్తుంటారు. వీటిని ట్రాన్స్కో ద్వారా పనులు చేపట్టేందుకు సదరు కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. అధికారులు సూచించిన నిబంధనల ప్రకారం స్తంభాలను నాటి, విద్యుత్ తీగలను బిగించి వినియోగదారులకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇలా ఏర్పాటు చేసిన స్తంభాలు కొద్దిరోజులకే, స్వల్ప గాలులకే విరిగిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో విరిగిన స్తంభాలు ఇటీవల ఈదురుగాలులకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా సుమారు 2 వేల విద్యుత్ స్తంభాలు నేల కూలినట్లు తెలిసింది. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో సుమారు 600 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి–సాగర్, మాడ్గులపల్లి, వేములపల్లి ప్రాంతాల్లో మరో 1400 వరకు స్తంభాలు నేలమట్టమయ్యాయి. క్యూరింగ్ లోపమే కారణమా? భారీ ఈదురుగాలుల వల్లే ఈ నష్టం జరుగుతోందని అధికారులు చెప్తున్నప్పటికీ, స్తంభాల తయారీలో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిమెంట్ కాంక్రీట్తో అచ్చు వేసిన అనంతరం స్తంభాలను కనీసం 20 రోజుల పాటు క్యూరింగ్ (నీటిలో నానేలా) ఉంచాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్లు వారం లోపే వాటిని తెచ్చి వాడేస్తుండడం వల్లే ఈ పరిస్థితి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం స్తంభాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్లే, వారు నాణ్యత లేని మెటీరియల్ను వాడుతున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యత లేని స్తంభాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. డివిజన్ వ్యాప్తంగా ఇటీవల సుమారు 2వేల స్తంభాలు విరిగినట్లు తమ దృష్టికి వచ్చింది. హన్మకొండ, వరంగల్ నుంచి సరఫరా అయ్యే స్తంభాల్లో నాణ్యత ప్రమాణాలు లేనట్లు గుర్తించాం. వీటిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. విరిగిన స్తంభాల స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేస్తాం. – శ్రీనివాస్, విద్యుత్ శాఖ డీఈ, మిర్యాలగూడ మిర్యాలగూడ డివిజన్లో ఇటీవల 2 వేల స్తంభాలు నేలమట్టం ఫ నాణ్యతా లోపమే కారణమంటున్న రైతులు, అధికారులు -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్కు సోమవారం బాధితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
చెంతకు వచ్చి.. భరోసా ఇచ్చి!
నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్కు చెందిన బాణావత్ పార్వతి వితంతు, దివ్యాంగ మహిళ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చింది. వీల్చైర్లో ఉన్న ఆమె వద్దకు కలెక్టర్ స్వయంగా వచ్చారు. ఆమె సమస్యను విన్నారు. తనకు భర్త లేడని, ఎలాంటి ఉపాధి లేదని, ఇంటి అద్దె చెల్లించే స్థితిలో లేనని కలెక్టర్కు వివరించింది. దీంతో కలెక్టర్ చంద్రశేఖర్ స్పందించి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తూ కలెక్టరేట్ మెట్లు దిగేందుకు తీవ్ర ఇబ్బంది పడిండుతూ కనిపించింది. -
రైతువేదికల్లో నేడు విత్తన మేళా
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధవుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న, వినియోగదారుడు ఇష్టపడే తక్కువ కాలపరిమితి కలిగిన నాణ్యమైన సన్న వరి రకాలను ప్రోత్సాహించడం, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగును, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించడం విత్తన మేళా ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రైవేట్ విత్తన వ్యాపారులు, వారు ఎన్నిక చేసుకున్న రైతు వేదికల్లో విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు. ఏడు రకాల సన్నాలకే బోనస్ వరి సన్న రకాల్లో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, డబ్ల్యూజీఎల్44, జైశ్రీరాం ఈ రకాలకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విత్తనాలతోపాటు పంట మార్పిడిలో భాగంగా కంది, పెసర, మినుములు, నువ్వులు, కూరగాయల విత్తనాలను అమ్మకానికి ఉంచుతారు. యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడకాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించేందుకు నానో యూరియాను కూడా రైతు వేదికల్లో అందుబాటులో ఉంచుతారు. మంగళవారం జిల్లాలోని 33 మండలాల్లో ఒక్కో రైతు వేదికల్లో అధికారికంగా విత్తన మేళాను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 140 రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తారు. రైతులంతా ఈ విత్తన మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్ కోరారు. ఫ అమ్మకానికి విత్తనాలు, నానో యూరియా ఫ పంట మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యం -
ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. మారని పలువురు అధికారుల తీరు
నల్లగొండ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ లంచగొండులపై ఉక్కుపాదం మోపుతున్నా కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీ హెచ్చరికలు, అవగాహన కార్యక్రమాలు, ట్రాప్ కేసులు వరుసగా నమోదవుతున్నా లంచాల జోరు మాత్రం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన నాలుగు ఏసీబీ ట్రాప్ కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన కొందరు అధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు డిమాండ్ చేస్తుండగా, బాధితుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ అవినీతికి అలవాటు పడిన కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే.. జిల్లాలో కేవలం ఆరు నెలల వ్యవధిలో నాలుగు ట్రాప్ కేసులు నమోదు కావడం ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఇంకా ఏ స్థాయిలో కొనసాగుతోందో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, విద్యుత్, వక్ఫ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వంటి ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల అధికారులు ఏసీబీ వలలో చిక్కడం ఆందోళన కలిగిస్తోంది. ఏసీబీ అధికారులు నిరంతరం నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అధికారులు లంచాలు తీసేందుకు వెనుకాడకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా అరికట్టాలంటే కేవలం ట్రాప్ కేసులు మాత్రమే కాకుండా శాఖాపరమైన కఠిన చర్యలు, వేగవంతమైన విచారణలు, దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదిలో ఏసీబీ కేసులు ఇలా.. ● ఫిబ్రవరి 2న గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం భూ రికార్డులకు సంబంధించిన పని నిమిత్తం రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెవెన్యూ శాఖలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ● ఏప్రిల్ 16న దేవరకొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) బిల్లుల క్లియరెన్స్ కోసం రూ.30 వేల లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డాడు. ● జూన్ 6న మిర్యాలగూడలో వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహమూద్ అధికారిక నివేదిక కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు3న్నారు. ● జూన్19న నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జి.పవన్కుమార్ భూమి సర్వే నివేదిక జారీ చేయడానికి రూ.35 వేల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.15 వేల స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫ ఆరు నెలల్లో ఏసీబీకి పట్టుబడిన నలుగురు అధికారులు ఫ ప్రజలకు పారదర్శకంగా అందని సేవలు ఫ లంచగొండులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల నమోదు పెంచాలిదేవరకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ కె.లింగయ్య కోరారు. సోమవారం దేవరకొండ మండల పరిధిలోని కస్తూరాబా పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు వంటి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన వంటి వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సుశీందర్రావు, హెచ్ఎం పాత్లావత్ శ్రీను, ఉపాధ్యాయులు సయ్యద్, వెంకట్రెడ్డి, వినోద, దామోదర్, సత్యనారాయణ, క్రాంతి తదితరులు ఉన్నారు. గురుకుల జూనియర్ కళాశాలలో్ల స్పాట్ అడ్మిషన్లు రామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. నార్కట్పల్లి పోలీసులకు డీజీపీ అభినందన నార్కట్పల్లి : నార్కట్పల్లి పోలీసులను డీజీపీ అభినందించారు. ఆదివారం నీట్ రాసేందుకు వివిద ప్రాంతాల నుంచి ఎంజీ యూనివర్శిటీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పలువురు విద్యార్థులు యూనివర్సిటీ గేటు నుంచి కాలినడకన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. గమనించిన నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసుల ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాల్లో విద్యార్థులను పరీక్ష కేంద్రం వద్దకు తరలించారు. ఈ సంఘటన వీడియోను స్థానికులు ఎక్స్ ఖాతాలో డీజీపీ సీవీ ఆనంద్కు ట్యాగ్ చేశారు. స్పందించిన డీజీపీ నార్కట్పల్లి పోలీసుల సేవలను గుర్తించి అభినందించారు. వీరు అవార్డులకు అర్హులని ఎక్స్లో రాసుకొచ్చారు. -
కలెక్టరేట్ ఎదుట కిసాన్ మోర్చా ధర్నా
నల్లగొండ టూటౌన్ : రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతు భరోసా డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం అమలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, గుండా నవీన్రెడ్డి, లింగస్వామి, కరుణాకర్రెడ్డి, సత్యనారాయణ, సామ వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, భిక్షంరెడ్డి, బీపంగి జగ్జీవన్, మధుకర్, పాపిరెడ్డి, వెంకట్రెడ్డి, ఓంప్రకాష్ ఉన్నారు. -
రైతు వేదికల్లో యూరియా భద్రమేనా..!
మునుగోడు : రైతులకు యూరియా సులభంగా అందించాలనే ఉద్దేశంతో అధికారులు రైతువేదికల్లో విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో 40 రైతు వేదికలను ఎంపిక చేశారు. రైతు వేదికల్లో పీఏసీఎస్ ద్వారా మాత్రమే యూరియా విక్రయాలు సాగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఈ నిర్ణయం ఆచరణలో మాత్రం అనేక సమస్యలకు దారితీస్తుందని రైతులు, సహకార సంఘాల అధికారులు చెప్పుతున్నారు. మొత్తం 148 రైతు వేదికలు ప్రభుత్వం క్లస్టర్కు ఒకటి చొప్పున ఐదేళ్ల ఏండ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా మొత్తం 148 రైతు వేదికలు నిర్మించింది. వాటిలో 40 రైతు వేదికల్లో యూరియా విక్రయించనున్నారు. అందులో ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు అధికంగా ఉన్న మండలాల్లో ఒకటి, పర్టిలైజర్ దుకాణాలు తక్కువగా ఉన్న మండలాల్లో రెండు చొప్పున ఎంపిక చేశారు. ఎంపిక చేసిన రైతు వేదికలు చాలా వరకు గ్రామానికి దూరంగా ఉన్నాయి. కొన్ని రైతు వేదికల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కొన్నింటికి సరైనా రోడ్డు మార్గం లేదు. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నా పర్వేలేదు, కానీ గ్రామానికి దూరంగా ఉండటంతో ఆ యూరియాకి భద్రత ఎవరుంటానే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అదనపు సిబ్బంది అవసరం వ్యవసాయ శాఖ ద్వారా రైతు వేదికలను యూరియా విక్రయానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధికారులకు అప్పగిస్తే ఆ అధికారులే యూరియా నిల్వచేసి ఏఈఓలు చెప్పిన రైతులకు యూరియా విక్రయించాలి. రైతు వేదికల్లో యూరియా విక్రయానికి అదనపు సిబ్బంది అవసరం. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సహకార సంఘాలకు రైతు వేదికల్లో యూరియా విక్రయించడం ద్వారా మరిన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఏఈఓలు సైతం రైతు వేదికల్లో యూరియా విక్రయాలు కొనసాగిస్తే తమకు కూడా ఇబ్బందిగా ఉంటుందనే భావనలో ఉన్నారు. ఫ యూరియా విక్రయానికి 40 రైతు వేదికల ఎంపిక ఫ రైతు వేదికల్లో అరకొర వసతులు -
నీట్కు 283 మంది గైర్హాజరు
నల్లగొండ : నీట్–2026 రీ ఎగ్జామినేషన్ నల్లగొండలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,065 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 1,782 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్రియ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఎన్జీ కాలేజి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, హాజరు–గైర్హాజరు, పోలీసు బందోబస్తు, భద్రతా తనిఖీలు తదితర అంశాలను పరిశీలించి కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. -
విపత్తును ఎదుర్కొనేలా..
నల్లగొండ టూటౌన్ : ప్రస్తుత వర్షాకాలంలో వరద ప్రభావం వల్ల అత్యవసర సమస్యలు ఏర్పడితే వాటిని వెంటనే పరిష్కరించేలా నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 24 గంటల పాటు నగర ప్రజలకు అత్యవసర సేవలందించేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భారీ వర్షాలకు వచ్చే వరదల కారణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రెస్క్యూ బృందాలను నియమించింది. గతంలో రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షానికి నీలగిరి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు వరద ప్రభావిత కాలనీలకు వెంటనే ప్రత్యేక బృందాలను పంపించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సమస్యను తెలిపేందుకు కంట్రోల్ రూమ్ నగరంలో భారీగా ఈదురు గాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, రోడ్లపైనే పడిపోయి రాకపోకలకు అంతరాయం కలగడం లాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగితే వెంటనే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్కు సమాచారం అందిస్తే మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, గోడలు కూలినా తక్షణమే అధికారులు స్పందించి ప్రజలకు తగిన తోడ్పాటు అందించనున్నారు. డ్రెయినేజీలు పొంగడం, నీటి నిల్వ చేరడం, రోడ్లు దెబ్బతినడం లాంటివి జరిగితే తక్షణ చర్యలు తీసుకుంటారు. అందుబాటులో 150 సిబ్బంది ప్రస్తుత సీజన్లో ఏ క్షణంలోనైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కురిసే భారీ వర్షాలకు నగరంలో ఉన్న మూడు గుట్టల నుంచి వరద నీరు వివిధ కాలనీలను ముంచెత్తే ప్రమాదముంది. రోజంతా ఓ మోస్తరుగా వర్షం కురిసినా పెద్దగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. ఒకవేళ రెండు, మూగు గంటల పాటు కుండపోత వర్షంకురిస్తే నగరంలోని చాలా కాలనీలకు వరద ముంపు పొంచి ఉంటుంది. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురిసిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి జరుగకుండా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. వార్డు అధికారులు, శానిటేషన్ జవాన్లు, తాగునీటి సరఫరా సిబ్బంది, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, హరితహారం సిబ్బంది, టౌన్ప్లానింగ్ ఉద్యోగులు, రెవెన్యూ, శానిటేషన్ విభాగల అధికారులతో కలిపి 150 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఈ బృందాలు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. ఫ వర్షాకాలం నేపథ్యంలో ‘నీలగిరి’ యంత్రాంగం అప్రమత్తం ఫ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఫ అత్యవసర సేవలకూ ప్రత్యేక రెస్క్యూ బృందాలు ఆపద వస్తే ఫోన్ చేయాల్సిన నంబర్ 08682–220100 నగర ప్రజల భద్రతే మా కర్తవ్యం. భారీ వర్షాలు కురిసి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజల కోసం 24 గంటల పాటు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే సిబ్బంది అక్కడికి వచ్చి సమస్య పరిష్కరిస్తారు. – బి.శరత్చంద్ర, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
మేకల అభినవ్ను ఆదర్శంగా తీసుకోవాలి
నల్లగొండ టూటౌన్ : చెస్ క్రీడాకారులు మేకల అభినవ్ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మేకల అభినవ్ స్మారకార్థం మేకల అభినవ్ మెమోరియల్ కంబైన్డ్ జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినవ్ చెస్లో జిల్లాకు పేరుతెచ్చాడని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చెస్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ సెక్రటరీ కరుణాకర్రెడ్డి, చీఫ్ అర్బీటర్ విశ్వప్రసాద్, మేకల అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు, అరుణ, కృష్ణారెడ్డి, కళ్యాణి, శోభన్, రమేష్, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపికరామగిరి(నల్లగొండ) : చండూరుకు చెందిన కవి, సాహితీవేత్త, పరిశోధకుడు ఇడికోజు శ్రీనివాసాచారి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వహించనున్న కవి సమ్మేళనానికి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాల్కురికి సోమన మూల వేదికపై నిర్వహించనున్న ఈ కవి సమ్మేళనంలో రాష్ట్రంలోని ప్రముఖ కవులతో పాటు ఇడికోజు శ్రీనివాసాచారి పాల్గొని తన కవితను వినిపించనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు సాహిత్య రంగంలో కవి, విమర్శకుడు, పరిశోధకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్నారు. కవి సమ్మేళనానికి శ్రీనివాసాచారి ఎంపిక కావడంపై నల్లగొండ జిల్లా కవులు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు అండ.. ఏఐటీయూసీ జెండాగుర్రంపోడు : కార్మికుల హక్కులకు కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం గుర్రంపోడులో జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర పాలకుల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల శ్రమ దోపిడీ పెరిగిందన్నారు. ప్రధాని మోదీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం పట్టదన్నారు. అనంతరం ఏఐటీయూసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఆర్.లక్ష్మీపతి, మండల అధ్యక్షుడిగా ఎస్కే.అమీర్, ఉపాధ్యక్షులుగా జాల నర్సింహ్మ, నారాయణ, ప్రధాన కార్యదర్శిగా జాల పెదనర్సింహ, శ్రీను, కార్యదర్శిగా పోలేని సత్తయ్య, కోశాధికారిగా తవిటి వెంకన్నను ఎన్నుకున్నారు. -
లోక్ అదాలత్లో 11,233 కేసులు పరిష్కారం
రామగిరి (నల్లగొండ): కక్షిదారులు లోక్అదాలత్ను ఉపయోగించుకుంటే సమయం, డబ్బులు ఆదా అవుతాయని జిల్లా జడ్జి పి.వసంత్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 17వ జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన లోక్అదాలత్కు జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ల్లో మొత్తం 11,233 కేసులు (21 సివిల్, 4,196 క్రిమినల్, 69 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 6,890 ట్రాఫిక్ చలాన్ కేసులు, 34 బ్యాంకు రికవరీ కేసులు, 5 ఎలక్ట్రిసిటీ, 45 సైబర్ క్రైమ్) పరిష్కారమయ్యాయన్నారు. ప్రమాద బీమా కేసుల్లో రూ.3,15,73,000 నష్టపరిహారం ఇప్పించగా.. బ్యాంకు రికవరీ రూ.35,85,300, ట్రాఫిక్ చలాన్ రూ.20,31,300, ఎలక్ట్రిసిటీ రూ.16000, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.3,72,138 రికవరీ డబ్బులు ఇప్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తంరావు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ కుమార్, బి.అశోక్కుమార్, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఫ జిల్లా జడ్జి వసంత్ -
రైతులను ముంచేందుకు కుట్ర
మునుగోడు : రైతులను నిండా ముంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల ప్రత్యేక ఓటరు సవరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికే మూడు మార్లు ఎగ్గొట్టడమే కాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కొనలేమని బాహాటంగా ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు అప్పుచేసి నామమాత్రపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సమచారం లేకుండా అర్హులైన ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సర్ కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీకి తొత్తుగా మారి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథను మూడు నెలల పాటు జైల్లో ఉంచాల్సి బోయి నెల రోజులు కాకముందే బెయిల్ ఇప్పించారని ఆరోంపించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, కల్గుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మునగాల నారాయణరావు, కర్నాటి వెంకటేష్, పల్లె కళ్యాణి, పెద్టింటి బుచ్చిరెడ్డి, మందుల సత్యం, నల్లగొండ అంజి, పగిళ్ల సతీష్, మాదరబోయిన పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
23 నుంచి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
దర్వేశిపురం శ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ బ్రహ్మో త్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా చూస్తాం. జిల్లా నలుమాలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి. – చీదేటి వెంకట్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కనగల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కనగల్ మండలం దర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి 25వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి కోమటిరెడ్డి, గుత్తా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 23న నిత్య పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం సుప్రభాతసేవ, లలితా సహస్రనామర్చన, బాలభోగ నివేదన అనంతరం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. 24న శ్రీజమదగ్ని మహర్షి–ఎల్లమ్మ అమ్మవార్ల 24వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ గారిచే దేవస్థాన ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణకుమారాచార్యులు, అర్చకులు గాదె ఉమామహేశ్వర్రావు, దామోదర్రావు నేతృత్వంలో జరిపించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేస్తారు. ఈ ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఫ ముస్తాబవుతున్న దర్వేశిపురం దేవస్థానం ఫ 24న అమ్మవారి కల్యాణ మహోత్సవం -
నాన్న త్యాగమే.. నా విజయం
తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్రెడ్డి నల్లగొండ : మాది ఏపీలోని కడప జిల్లా చెన్నూరు. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సావిత్రి. మాది సాధారణ కుటుంబం. నన్ను, చెల్లిని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నాన్నకు అమ్మ తోడుగా నిలిచారు. మా నాన్న కుటుంబంలో పెద్దగా చదువుకున్నవారు లేరు. అందుకే మేమైనా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి వరకు కడపలో ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ నెల్లూరులో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మధ్యప్రదేశ్లోని ఐఐటీ ఇండోర్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. తర్వాత బెంగళూరులో రెండేళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు సిద్ధమయ్యాను. రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకోలేకపోయినా నిరాశ చెందలేదు. నాన్న మాటలే ముందుకు నడిపించాయి తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ, తల్లి అవసరమైన సందర్భాల్లో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపారు. వారిద్దరూ ఎన్నో కష్టాలు పడినా మా చదువులో మాత్రం ఎలాంటి లోటు రానీయలేదు. నాన్న చెప్పిన ‘మాకు చదువు లేదు.. మీరు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి రావాలి’ అనే మాటలే నన్ను ముందుకు నడిపించాయి. మా చెల్లి శ్రీలత బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో ప్రయత్నంలో సక్సెస్ సివిల్స్ సాధించాలన్న నా కలను నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. మూడోసారి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ సమయంలో కుటుంబం నుంచి, ముఖ్యంగా నాన్న నుంచి ఎంతో మద్దతు లభించింది. వారి ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫలితంగా సివిల్స్లో మూడో ప్రయత్నంలో 151వ ర్యాంకు సాధించగలిగాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధులు నిర్వహిస్తున్న నేను ఐఏఎస్ సాధించడంతో అమ్మానాన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ నాన్న ఒకటే చెబుతుంటారు.. ‘ప్రజలకు నిజాయితీగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని. ఆ మాటలే నాకు మార్గదర్శకం. మంచి పేరు తెచ్చుకోవాలని నాన్న కోరిక.. ఫ చిన్నచిన్న వ్యాపారాలు చేసి మమ్మల్ని చదివించారు ఫ ఆయన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించాను ఫ నిజాయితీగా సేవలందించాలనే సూచన తప్పక పాటిస్తా నల్లగొండ అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరు శ్రీకాంత్రెడ్డి -
‘వీబీజీ రామ్జీ’లో మహిళల పనిదినాల వాటా 66.49 శాతం
ప్రస్తుత వీబీజీ రామ్జీ గతంలో ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు అనుమతి ఉండగా, వీబీజీ రామ్జీలో తొలగించారు. అప్పట్లో ఆ పనుల కింద 90 రోజుల పనిదినాలు కల్పించే వారు. ప్రస్తుతం అవి లేకపోవడం, మరోవైపు పథకం అమలుకు రాష్ట్రాల నుంచి అదనంగా ప్రతిపాదనలను కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను చేర్చాలని ప్రతిపాదించింది. అలాగే కూరగాయల పందిరి సాగుకు కూడా చేర్చాలని పేర్కొంది. వాటిని చేర్చితే గ్రామీణ ప్రజలకు మరింత మేలు చేకూరనుంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్జీ) అమలులో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ప్రగతి సాధిస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆమోదించిన 68.09 లక్షల పనిదినాల లేబర్ బడ్జెట్లో 41.08 లక్షల పనిదినాలు పూర్తిచేసి, 60.33 శాతం లక్ష్యాన్ని సాధించింది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి మేలు చేసే పనులను వేగంగా చేపడుతోంది. జిల్లాలో 33 మండలాలు, 868 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. మొత్తం 3.52 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 7.31 లక్షల మంది కార్మికులు నమోదయ్యారు. ప్రస్తుతం 2.14 లక్షల క్రియాశీల జాబ్ కార్డులు, 3.68 లక్షల మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగు ఉపాధి హామీ పనుల్లో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. మొత్తం పనిదినాల్లో మహిళల వాటా 66.49 శాతంగా నమోదైంది. అందులో ఎస్సీ కార్మికుల పనిదినాలు 16.69 శాతం, ఎస్టీల పని దినాలు 24.74 శాతంగా ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. కుటుంబాలకు భరోసా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు నెలల్లో ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి సగటున 28.36 రోజుల ఉపాధి లభించింది. ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.301.72 వేతనం అందుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరగడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. రూ.154 కోట్ల వ్యయం ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో ఉపాధి పనులకు సంబంధించి రూ.154.03 కోట్ల వ్యయం జరిగింది. ఇందులో రూ.123.36 కోట్లు కార్మికుల వేతనాలకే ఖర్చు చేయగా, రూ.28.89 కోట్లు మెటీరియల్, నైపుణ్య కార్మికుల ఖర్చులకు వెచ్చించారు. పాలనా వ్యయం రూ.1.77 కోట్లుగా నమోదైంది. వ్యవసాయాభివృద్ధి ప్రాధాన్యం జిల్లాలో పనుల సంఖ్య 41 వేలకుపైగా ఉండగా, ఈ ఏడాది 555 పనులు పూర్తయ్యాయి. మొత్తం వ్య యంలో 40.6 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల పనులపైనే ఖర్చు చేయడం విశే షం. చెక్డ్యాంలు, ఫార్మ్పాండ్లు, నీటి సంరక్షణ, భూ సార అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెల్లింపుల్లో పారదర్శకత ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపుల్లో జిల్లాలో పురోగతి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100 శాతం చెల్లింపులు ఈ–ఎఫ్ఎంఎస్ విధానం ద్వారా జరగగా, 15 రోజుల్లోపు చెల్లింపులు వంద శాతంగా నమోదైంది. ఫ మూడు నెలల్లోనే 41 లక్షల పనిదినాలు ఫ ఇప్పటికే పూర్తయిన పనులు 555 ఫ ఇళ్ల నిర్మాణాలకు అనుమతిస్తే పెద్ద ఎత్తున పనులు -
నేడు యోగా దినోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఆదివారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు కూడా హాజరై జయప్రదం చేయాలని కోరారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టుల పనులు పూర్తిఫ నీటి పారుదల శాఖ కమిషనర్ శివకుమార్ నాయుడు నల్లగొండ : జిల్లాలో కొనసాగుతున్న నీటి ప్రాజెక్టుల పనులను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ భూసేకరణ, నీటిపారుదల శాఖ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధ్యక్షతన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టు, చింతపల్లి రిజర్వాయర్, సింగరాజుపల్లి, కష్ణంపల్లి, అంబాభవాని, కంబాలపల్లి, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టుల పనుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో అవార్డులు మంజూరైనందున పనుల విషయంలో జాప్యం చేయొద్దన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీల కోసం భూసేకరణ పూర్తయిన చోట లేఅవుట్లు రూపొందించి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేసినందుకు కలెక్టర్ను కమిషనర్ అభినందించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, సీఈ గగనం శ్రీనివాస్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరి శ్రీకాంత్రెడ్డి, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ మాధురి, జిల్లా అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. -
జల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
పెద్దఅడిశర్లపల్లి : జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్లో జల సంచయ్–జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం కొండవాలు ప్రాంతాల్లో కందకాలు, చెక్డ్యామ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, సర్పంచ్ నగేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఏపీఓ రాజు, ఏపీఎం నాగలీల, టీఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలను దత్తత తీసుకోవాలిచండూరు : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటి, దానిని దత్తత తీసుకొని సంరక్షించాలని జిల్లా ఫారెస్ట్ అధికారి సుమన్, ఎంపీడీఓ బండారు యాదగిరి పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా శనివారం చండూరు పట్టణ పరిధిలోని బంగారిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ బోయపల్లి సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, ఏపీఓ శ్రీనివాస్, హెచ్ఎం వేలంగిని మేరి, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
‘నీట్’ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నల్లగొండ : ఈ నెల 21న నీట్–2026 రీఎగ్జామినేషన్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నల్లగొండ అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా లోపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించనున్నామని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతించబోమన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, నార్కట్పల్లి సీఐ సురేష్ పాల్గొన్నారు. ఫ అదనపు ఎస్పీ రమేష్ -
స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, ఒకేషనల్ కళాశాలలను మంత్రి సందర్శించి మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి ప్రతీక్ పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యను అందించేలా నెలరోజుల్లో ప్రత్యేక ల్యాబ్ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజేందర్, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.ఉపేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైలాన్ పనులు పరిశీలించిన మంత్రి కనగల్ : కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద త్వరలో సీఎం రేవంత్రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా, శనివారం మంత్రి కోమటిరెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ పనులను పరిశీలించారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్లతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి గుర్తుగా నల్లగొండ నియోజకవర్గంలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డీఈ గణేష్, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్రెడ్డి, జేఈ దినేష్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, సర్పంచ్ నర్సింగ్ మురళీగౌడ్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
చండూరు : చండూరు మండలం దోనిపాములలో అగ్రిప్రమాదానికి గుడిసె దగ్ధమై ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ బండారు యాదగిరి కలిసారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘ఆదుకోండి సారూ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ఎంపీడీఓ యాదగిరి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఇందిరమ్మ రెండో విడతలో వారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీఓ కోటయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపైకి విస్తరించిన చెట్ల కొమ్మలు, ముళ్లపొదలను తొలగించాలని సూచించారు. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రహదారులు కోతకు గురికాకుండా చూడాలని, కనగల్–దేవరకొండ రహదారిపై గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లు సహా అన్ని వాహనాలకు రిఫ్లెక్టర్లు, గుర్తింపు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాంగ్రూట్లో రహదారులు దాటకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చిట్యాల ప్రాంతంలోని పరిశ్రమల వద్ద కార్మికుల రాకపోకల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, డీఆర్ఓ దశరథ్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుంచి 26 వరకు మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు, గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 26న 2కే రన్ నిర్వహిస్తామన్నారు. అనంతరం మాదకద్రవ్య వ్యతిరేక వారోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
బాధితులకు సత్వర న్యాయం అందాలి
వేములపల్లి : పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అన్నారు. శుక్రవారం వేములపల్లి పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్లో పెండింగ్ కేసులను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించి మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట, గుట్కా, మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
ఎంజీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలను యూనివర్సిటీలో ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 24.96 శాతం, రెండవ సెమిస్టర్లో 32.49 శాతం, మూడవ సెమిస్టర్లో 32.49 శాతం, నాల్గవ సెమిస్టర్లో 43.26 శాతం, ఐదవ సెమిస్టర్లో 47.28 శాతం, ఆరవ సెమిస్టర్లో 53.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, అసిస్టెంట్ కంట్రోలర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, సంధ్యారాణి, కళ్యాణి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యమునుగోడు : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, ప్రతిఒక్కరు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈఓ సుశీందర్రావు కోరారు. శుక్రవారం మునుగోడులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలు, దుస్తులతో పాటు మధ్యాహ్న భోజనం అందుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి, ఎంఈఓ మల్లేషం, హెచ్ఎం సుంకరి భిక్షంగౌడ్, వెంకట్నారాయణ, యూసుఫ్పాషా పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు నల్లగొండ టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో సంఘమిత్ర కోఆపరేటీవ్, అర్బన్ బ్యాంకు ముందంజలో ఉందని బ్యాంక్ ఫౌండర్, చైర్మన్ సంగం రామకృష్ణ తెలిపారు. శుక్రవారం బ్యాంకు 28వ వార్షికోత్సవ వేడుకలు బ్యాంకు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగం రామకృష్ణ మాట్లాడుతూ 1998లో బ్యాంకును స్థాపించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పున్న చండీకేశ్వర్, కొంగరి భిక్షం, గజ్జల వెంకటేశ్వర్లు, గుండ్ల అంజిరెడ్డి, ఎర్రమల్ల లక్ష్మీనర్సు, చెరిపల్లి పద్మ, వీరవెల్లి భవాని, రేణిగుంట చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను అరికడతాం
క్షేత్రస్థాయిలో అవగాహన.. సీజనల్ వ్యాధులపై గ్రామాలు, పట్టణాల్లో తమ సబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి నీటి తొట్లు, నీళ్ల ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటా సర్వే నిర్వహించి వారి ఇంట్లో ఎవరైనా జ్వరంతో, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అని తెలుసుకుని అవసరమైన మందులు ఇస్తారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. ఎలాంటి మందుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నల్లగొండ టౌన్ : ‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులకు నియంత్రణకు చేపట్టిన చర్యలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాటాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యాధులు వ్యాపించే సీజన్.. వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితమవుతుంది. వర్షాల కారణంగా పరిసరాల అపరిశుభ్రంగా మారుతాయి. దీంతో మలేరియా, మెదడువాపు, ఫైలేరియా, చికున్గున్యా, డెంగీ, డయేరియా, కలరా, టైఫాయిడ్, స్వైన్ఫ్లూతో పాటు వివిధ రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల చర్యలు చేపట్టాం. గ్రామాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం, మురుగునీటి గుంటల్లో మట్టి పోయించడం వంటి పనులకు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తాం. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వేలైన్స్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో ఫిజీషియన్, పిడియాట్రిక్ పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎం, ఎల్టీలు, ఆశ వర్కర్లు ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే ఈ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, సిబ్బందిని స్థానికంగా ఉండాలని ఆదేశించాం. స్థానికంగా ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్సీల వారీగా రోజూ నివేదికలు తెప్పించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.. వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాల్లోని నీటి గుంటలు ఉండే వాటిలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహర పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వేడి పదార్థాలను బుజించాలి. తాగునీటి ట్యాంకుల్లో క్లోరిన్ బిల్లలు చేసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఫ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం ఫ సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం ఫ పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ -
లక్ష్యం దిశగా ‘సమీకృత’ అడుగులు
నిడమనూరు: నిడమనూరు మండల పరిధిలోని ఊట్కూరులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రూ.220 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ భవన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకోవడంతో భారీ సంఖ్యలో ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, నిర్మాణ కార్మికులు ఊట్కూరుకు చేరుకున్నారు. 21.5 ఎకరాల చదునైన భూమి సేకరణ పాఠశాల నిర్మాణం కోసం ఊట్కూరులోని సర్వే నంబరు 354లో గల 12.5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, దానికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు 358, 361లలో మరో 9 ఎకరాల ప్రైవేట్ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. ఎకరాకు రూ.23.5 లక్షల చొప్పున పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా ముగిసింది. గతంలో నాగార్జునసాగర్లో ఈ స్కూల్ నిర్మించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే జైవీర్ కలిసి ఊట్కూరులోని ఈ చదునైన స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాలు వర్షకాలంలో పునాదులు, పిల్లర్ల గుంతల్లో నీరు చేరి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ సంస్థ పిల్లర్ల పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన పరిపాలన భవనానికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. పనుల నిమిత్తం ప్రత్యేక విద్యుత్ లైన్లు, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కార్మికుల కోసం తాత్కాలిక నివాస గృహాల నిర్మాణం కూడా పూర్తయింది. ఫ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచిన అధికారులు ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కేజీ నుంచి పీజీ వరకు 2600 మంది విద్యార్థుల సరిపడేలా తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్ల నిర్మాణ చేపట్టనున్నారు. ప్రధానంగా విద్యాలయ భవనాలు జీ ప్లస్ 3 నమునాలో 5.5 ఎకరాల్లో నిర్మాణ పనులు పిల్లర్ పనులు వేగంగా చేస్తున్నారు. జీ ప్లస్ 2 నమూనాలో 2 అకాడమిక్ భవనాలు, 68 అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. పరిపాలన భవనం, గ్రంథాలయం, వంటశాల, డార్మెటరీ జీ ప్లస్ 1 నమునాలో 80 వేల చదరపు అడుగుల వైశాల్యంతో భవనాలు నిర్మిస్తారు. అదేవిధంగా విద్యార్థుల హాస్టల్, ఉపాధ్యాయుల నివాసానికి జీప్లస్ 2 నమునాలో 24 డబుల్ బెడ్రూం నిర్మాణాలు, ప్రిన్సిపాల్, పరిపాలనాధికారుల నివాసానికి త్రిబుల్ బెడ్రూం నిర్మాణాలు 4, సెక్యూరిటీ, సందర్శకుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. -
ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి
నల్లగొండ: ఈ ఏడాది జిల్లాలో 57లక్షల 70 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. లతీఫ్ సాబ్ గుట్టపై మొక్కల పెంపకానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.65 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, డీఎఫ్ఓ రాజశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, డీఐఈఓ దశ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యం అందించాలి నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆస్పత్రిలో ఆయన హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తనకు పంపించాలన్నారు. ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలు, ప్రత్యేక కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
నిధులు లేక..
రూ. 40 కోట్ల వరకు నిధులు పెండింగ్ జిల్లాలో ఒక కార్పొరేషన్తోపాటు మరో ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు నెలకు సరాసరిగా రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఈ నిధులతో స్థానిక అవసరాలైన స్మశాన వాటికలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వీధి లైట్లు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపడుతుంటారు. అయితే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్ల వరకు నిధులు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లగొండ టూటౌన్: జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలనెలా విడుదల కావాల్సిన ‘పట్టణ ప్రగతి’ నిధులు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు కాకపోవడంతో పట్టణాల ప్రగతి పూర్తిగా ఆగిపోయింది. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ పట్టణాలకు గత ఏడాది (2025) జూలై నుంచి ఇప్పటివరకు పట్టణ ప్రగతి నిధుల మంజూరు నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నిధులు సకాలంలో రాక ఇబ్బందులు పడగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ అదే పరిస్థితి నెలకొంటుండడంతో పట్టణాల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్న మున్సిపాలిటీల అవస్థలు ముఖ్యంగా చిన్న మున్సిపాలిటీలు నిధుల కొరతతో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. కనీసం చిన్నపాటి మరమ్మతులు లేదా అత్యవసర పనులు చేపట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి ఉందని పలువురు అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పట్టణ ప్రగతి నిధులను నెలనెలా విడుదల చేస్తేనే మున్సిపాలిటీలు ప్రగతి సాధిస్తాయని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఏడాదిగా మంజూరు కాని పట్టణ ప్రగతి నిధులు ఫ చిన్నపాటి మరమ్మతులకూ నిధుల కొరత ఫ నిలిచిపోయిన అభివృద్ధి పనులునల్లగొండ 1. 26 కోట్లు మిర్యాలగూడ 78. 91లక్షలు హాలియా 16. 68 లక్షలు నకిరేకల్ 22. 15 లక్షలు నందికొండ 16. 62 లక్షలు చండూరు 11. 65 లక్షలు చిట్యాల 13. 64 లక్షలు దేవరకొండ 23. 54 లక్షలు మొత్తం 3.09 కోట్లు -
మత్స్య సొసైటీకి ముగిసిన నామినేషన్లు
నకిరేకల్: మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ముగిసింది. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు గురువారం వరకు 71 నామినేషన్ల దాఖలయ్యాయి. చివరి రోజు 29 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీరామ్ తెలిపారు. 25న నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు 3.30 గంటల తరువాత ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు జలాశయం చుట్టూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557మంది మత్స్యకారులు ఓటర్లుగా నమోదై ఉండగా వీరంతా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ టౌన్: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాలు, నీళ్ల విరోచనాలు, ఓఆర్ఎస్ ఉపయోగం, వాడే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పద్మ వైద్యాధికారులకు వివరించారు. సమావేశంలో డాక్టర్ కేవీఎన్ కృష్ణకుమారి, డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, డీపీఓ విష్ణు, మాతా శిశు సంక్షేమ అధికారి డాక్టర్ దీప పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ రాహుల్ -
ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సంజీవయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ.4 వేల చొప్పున ప్రీమెట్రిక్ ఉపకార వేతనం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుందని తెలి పారు. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటో, బ్యాంకు పాస్ బుక్ కాపీ, స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు నల్లగొండ: 2026–27 విద్యా సంవత్సరానికిగాను నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ పవిత్ర వాణి కర్ష గురువారం తెలిపారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో (మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ), (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్), (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్లో (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ), (మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ), బీకాం (బిజినెస్ అనలైటిక్స్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బీఏ (హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్) కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21లోపు కళాశాలలో సంప్రదించాలని కోరారు. గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లేష్కట్టంగూర్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన గుండాల మల్లేష్గౌడ్ నియామకమయ్యారు. బీసీడీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గురువారం నియామకపత్రం జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతులమీదుగా మల్లేష్గౌడ్ నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామాకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇ– కేవైసీ 80 శాతమే..
నల్లగొండ: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతోపాటు, అర్హులకే రేషన్ అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇ– కేవైసీ ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తి కాలేదు. ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వస్తున్నప్పటికీ, జిల్లాలో ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారులు ఈ– కేవైసీకి దూరంగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 991 రేషన్ షాపులు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 991 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,28,303 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 80 శాతం మంది మాత్రమే ఈ– కేవైసీ పూర్తి చేసుకోగా.. మిగిలిన 20 శాతం మంది ఇంకా బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులతో ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు రేషన్ పంపిణీలో అక్రమాలు, అనర్హుల పేర్ల కొనసాగింపు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం ఇ– కేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటికీ మరణించిన వ్యక్తుల పేర్లు కొన్ని రేషన్ కార్డుల్లో కొనసాగుతుండగా, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కూడా తొలగించని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దడంతో పాటు అర్హులైన కుటుంబాలకు మాత్రమే రేషన్ అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ– కేవైసీ చేయించుకునే విధానం.. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు సమీపంలోని చౌక ధరల దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న ఈ –పాస్ యంత్రంలో వేలిముద్ర నమోదు చేయగానే ఆధార్ వివరాలు ధ్రువీకరించబడతాయి. దీంతో ఈ– కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు ఇ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు ముందుకు రావాలి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం పదేపదే అవకాశం కల్పిస్తోంది. దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కూడా నిర్వహిస్తున్నాం. ఇంకా పెండింగ్లో ఉన్న 20 శాతం మంది లబ్ధిదారులు వెంటనే తమ సమీప రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ ఫ బయోమెట్రిక్ చేయించుకోని 20 శాతం మంది రేషన్ లబ్ధిదారులు ఫ అలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారుల హెచ్చరిక ఫ జిల్లాలో 5.28 లక్షల కార్డులు ఉండగా పెండింగ్లో లక్షకు పైగా లబ్ధిదారులు -
ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు బత్తిని నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ కోటయ్య, అసిస్టెంట్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాసుదేవ్, వేణు, బొజ్జ అనిల్ కుమార్, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సర్’ పేరుతో బీజేపీ కుట్రలు
చండూరు : సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం చండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని కాపాడుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
నక్కలగండిని సందర్శించిన ఎన్టీసీఏ బృందం
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) బృందం బుధవారం సందర్శించింది. నక్కలగండి ప్రాజెక్టుకు 450 ఎకరాల అటవీ భూమి అవసరం ఏర్పడింది. ఆ భూమికి బదులుగా ప్రభుత్వం చందంపేట మండలంలో కోరుట్ల, ముర్పునూతల, నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం వద్ద భూమిని అటవీ శాఖకు కేటాయించింది. ఆయా భూములను, నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎన్టీసీఏ బృందం సభ్యులు ఇక్కడికి వచ్చారు. భూముల వివరాలు తెలుసుకున్నారు. సందర్శించిన వారిలో హరిణి, ఏఐజి జివి.గోపి, సృష్టిమోడి, ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. -
బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి
మిర్యాలగూడ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు అత్యంత అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగి అక్రమ మార్గంలో బీజేపీ గెలిచిందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, జూలై 31న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను సరి చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త వెరిఫికేషన్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొట్టమొదటగా విజయం సాధించే సీటు మిర్యాలగూడ అని ధీమా వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని, ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్దార్థ, ఇలియాస్ఖాన్, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసిన్అలీ, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, షహనాజ్బేగం, ఎండీ.యూసుఫ్, పాలుట్ల బాబయ్య, షోయబ్, పెద్ది శ్రీనివాస్గౌడ్, హాతీరాం, చిట్టిబాబునాయక్ పాల్గొన్నారు. ఫ వైటీపీఎస్ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
రోడ్డు దాటడం ఇక సులభం
ఆటో ఎక్కండి.. స్కూల్కు రండి..నగరంలో ప్రతి రోడ్డులోనూ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. పలు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహనాదారులు, పాదాచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పుడు సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద ఈ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో రోడ్డు దాటే మార్గం సులభం కానుంది. అదే విధంగా రెడ్డి హాస్టల్ వద్ద, మేళ్ల దుప్పలపల్లి రోడ్డు క్రాసింగ్ వద్ద, గంధంవారిగూడెం క్రాసింగ్ వద్ద వాహాణాల వేగాన్ని నిరోధించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని డీవీకే రోడ్డు సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ వద్ద నిర్మిస్తున్న ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. అత్యధిక రద్దీ గల ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా రోడ్డు దాటే ప్రజలకు ఊరట కలగనుంది. ఉదయం, సాయంత్రం రద్దీ.. డీవీకే రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాల సంఖ్య కూడా భారీగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోవాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. జాతీయ రహదారి నిర్మాణం సంస్థ ఈ బ్రిడ్జి నిర్మిస్తోంది. తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. పెద్ద, పెద్ద నగరాల్లో మాత్రమే ఉండే ఈ ఎస్కలేటర్ బ్రిడ్జి తాజాగా నీలగిరి నగరంలో కూడా అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో తొలి ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిగా నిలిచిపోనుంది. అదే విధంగా ఖమ్మం, మహబూబ్నర్ లాంటి జిల్లాల్లో కూడా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేవని అధికారులు చెబుతున్నారు. తిప్పర్తి : మండలంలోని సిలార్మియాగూడెం గ్రామంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు ఉపాధ్యాయులు సొంత నిధులతో ఆటో సౌకర్యం కల్పించారు. ఆ ఆటోను సర్పంచ్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు యర్రమాద కవిత నరేందర్రెడ్డి, చింతకుంట్ల రవీందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆదిమల్ల శ్రీనివాస్, మధుబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.నీలగిరిలో శరవేగంగా ఎస్కలేటర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఫ సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాల వద్ద రూ.8 కోట్లతో పనులు -
డీఎంహెచ్ఓగా డాక్టర్ రాహుల్
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.రాహుల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓగా పని చేస్తున్న ఆయనకు నల్లగొండ డీఎంహెచ్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్.. కరోనా సమయంలో నోడల్ అధికారిగా పనిచేశారు. జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాహుల్ తెలిపారు. ఆయనను ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ కలెక్టర్ చంద్రశేఖర్ను మర్యాద పుర్వకంగా కలిశారు. డీఈఈ–సెట్ ఫేజ్–2 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలనల్లగొండ : డీఈఈ–సెట్–2026 ఫేజ్–2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదలైనట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈ–సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల్లో గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారికి జూన్ 18న డైట్, నల్లగొండలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫేజ్–1లో సీటు పొంది కళాశాలలో చేరిన అభ్యర్థులకు స్లైడింగ్ ఆప్షన్, ఫేజ్–1లో సీటు పొందని వారు, గతంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు జూన్ 19, 20 తేదీల్లో కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 21న వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్)కు అవకాశం కల్పించారని తెలిపారు. మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన జూన్ 25న సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులు జూన్ 25 నుంచి 27 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూసీ మత్స్య సొసైటీకి 42 నామినేషన్లునకిరేకల్ : మూసీ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘం డైరెక్టర్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నకిరేకల్ మండలం వల్లభాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. సొసైటీలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకుగాను బుధవారం వరకు 42 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి కే.శ్రీరామ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి తేదీ కావడంతో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రైస్ మిల్లర్ లక్ష్మయ్య అరెస్ట్రామగిరి (నల్లగొండ) : సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) అవకతవకల కేసులో నల్లగొండ పట్టణానికి చెందిన గౌతమి రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను నల్లగొండ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, భారీగా అవకతవకలకు పాల్పడినట్లు లక్ష్మయ్యపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడు లక్ష్మయ్యను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో, ప్రస్తుతం జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. లక్ష్మయ్యపై రామ్లక్ష్మణ్ మిల్లులో సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై కూడా కేసు ఉంది. -
సమస్యలు తీర్చండని మంత్రికి మొర
నల్లగొండ : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం వివిధ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. మంత్రిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్ అధికారి శ్రీకాంత్రెడ్డి బుధవారం నల్లగొండలోని ఇందిరాభవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రికి మొక్క అందజేశారు. -
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు యంత్రాంగం సన్నద్ధం
జిల్లాలోని నల్లగొండ నియోజకవర్గంలోనే ఓటర్ల మ్యాపింగ్ తక్కువగా (75.01 శాతం) పూర్తయింది. 62,373 మంది ఓటర్లు వివరాలను ఇంకా మ్యాపింగ్ చేయలేదు. మిర్యాలగూడలో 77.50 శాతం మ్యాపింగ్ పూర్తికాగా, నాగార్జునసాగర్లో 95.40 శాతం, నకిరేకల్లో 95.04 శాతం, మునుగోడులో 87.90 శాతం, దేవరకొండలో 88.53 శాతం మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్లో భాగంగా ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించినవి దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 96,725 మంది ఓటర్లు ఇచ్చిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించే లక్ష్యంతో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబితాల ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. ఈనెల 25వ తేదీ నుంచి సర్ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాల్లో, పట్టణాల్లో రెండు చోట్లా ఓటు ఉంటే ఒకచోట తొలగించనున్నారు. 2002 నాటి జాబితాతో మ్యాపింగ్ జిల్లాలో బూత్ల వారీగా 2002 ఓటర్ల జాబితాను, ప్రస్తుతం ఓటర్ల జాబితాతో పోల్చి ఇప్పటివరకు మ్యాపింగ్ చేపట్టారు. జిల్లాలో 86.62 శాతం మ్యాపింగ్ పూర్తయింది. మిగతా మ్యాపింగ్ ప్రక్రియను కూడా ఈనెల 25వ తేదీలోగానే పూర్తి చేయనున్నారు. పాత జాబితాలో తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యుల వివరాలతో ప్రస్తుతం ఓటర్లను అనుసంధానం చేయనున్నారు. ప్రతి ఇంటికీ బీఎల్ఓ ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టబోయే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేయనున్నారు. వాటిలో పూర్తి వివరాలు నింపి ఎన్యుమరేషన్ ఫామ్పై సంతకం చేయాలి. అందులో ఒక ఫామ్ను ఓటరు తన వద్ద ఉంచుకుని.. మరో ఫామ్ను బీఎల్ఓకు అందజేయాలి. ఈ ప్రక్రియపై బీఎల్ఓలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 18,012 మంది బీఎల్ఓలు శిక్షణ పొందారు. ఇందుకు అవసరమైన కిట్ను అందిస్తున్నారు. అసలైన ఓటర్ల గుర్తింపే లక్ష్యం సర్లో అసలైన ఓటర్లను గుర్తించడమే లక్ష్యంగా ఎన్ని కల సంఘం ఈ చర్యలు చేపట్టింది. ఓటరు భారతీయుడా కాదా, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్నాయా.. బోగస్ ఓట్లు ఏమైనా ఉన్నాయా? మృతి చెందిన వారి ఓట్లు అలాగే ఉన్నాయా? అనే వివరాలను సేకరించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టనున్నారు. 2002 జాబితాలో ఓట్లు లేని వారు, కుటుంబ సభ్యుల వివరాలు లేని వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ఆధారాల్లో ఏదో ఒకటి త గిన పత్రాలను సమర్పిస్తే వారి ఓటును ఉంచుతారు. అభ్యంతరాలకు అవకాశం నెల రోజుల పాటు కొనసాగే సవరణ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఎవరి పేర్లయినా తొలగిస్తే, ఇతర అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని దరఖాస్తుల పరిశీలన తర్వాత అక్టోబరులో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో సర్ మ్యాపింగ్లో 4.02 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 2002 10,92,369 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 15,16,253 మంది ఓటర్లు ఉండగా వారిలో 13,13,325 మంది (86.62 శాతం) ఓటర్ల వివరాలు మ్యాపింగ్ అయ్యాయి. ఇంకా 2,02,928 మంది (13.38 శాతం) ఓటర్లు వివరాలను ధ్రువీకరించలేదు. కొన్నిచోట్ల బీఎల్ఓలు ఆయా ఓటర్లను సంప్రదించనివి కూడా ఉన్నాయి. ఇక మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లలో 4,02,517 మంది (30.65 శాతం) వివరాల్లో తప్పులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరులాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. ఫ రెండు చోట్లా ఓటుంటే ఒకచోట తొలగింపు ఫ 86.62 శాతం పూర్తయిన మ్యాపింగ్ ఫ మ్యాపింగ్ కాని ఓటర్లు 2.02 లక్షల మంది ఫ 4,02,517 ఓటర్ల వివరాల్లో తప్పులు ఫ 25 నుంచి క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు వంద రోజుల్లో సర్ ప్రక్రియ ఇలా.. జూన్ 25 నుంచి ఇంటింటి గణన జూలై 31న ముసాయిదా జాబితా ప్రకటన జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరణ సెప్టెంబర్ 28 వరకు విచారణలు అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటన‘సర్’ మ్యాపింగ్ వివరాలు ఇలా.. నియోజకవర్గం మొత్తంఓటర్లు మ్యాపింగ్ అయినవి కానివి తప్పులున్నవి దేవరకొండ 2,69,098 2,38,220 30,878 96,725 నాగార్జునసాగర్ 2,34,722 2,23,925 10,797 66,840 మిర్యాలగూడ 2,40,574 1,86,443 54,131 58,008 నల్లగొండ 2,49,571 1,87,198 62,373 51,249 మునుగోడు 2,63,757 2,31,839 31,918 59,342 నకిరేకల్ 2,58,531 2,45,700 12,831 70,353 మొత్తం 15,16,253 13,13,325 2,02,928 4,02,517 -
‘చేయూత’ చెక్కు అందజేత
నల్లగొండ : పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నకిరేకల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కుటుంబానికి చేయూత పథకం కింద రూ.2 లక్షల చెక్కును ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవడం పోలీస్శాఖ బాధ్యత అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం, పెన్షన్, ఇతర సంక్షేమాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(నల్లగొండ ): ఆర్టీసీ సంస్థ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నల్లగొండలోని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ 2013 ీపీఆర్సీ ప్రకారం యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ను వెంటనే పీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు పంపించాలన్నారు. 2017 పీఆర్సీ బకాయిలను 9 సంవత్సరాలుగా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 పీఆర్సీని అమలు పరిచి బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలన్నారు. సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణం కల్పించాలని, తార్నాక ఆస్పత్రిలో పాత పద్ధతిలోనే ఒకేసారి రెండు నెలలకు సరిపడా మెడిసిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోనగిరి శంకరయ్య, రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల యాదగిరి, పల్రెడ్డి యాదగిరిరెడ్డి, బొమ్మ మల్లయ్య, శ్రీను, విఎస్పి.రావు, వివి.రెడ్డి, విఎ.రెడ్డి, రవీందర్, ఎస్ఆర్రెడ్డి, ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం హైదరాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, ఎండోమెంట్ సహాయ కమిషనర్ కె.భాస్కర్, అర్చకులు నాగోజు మల్లాచారి, గాదె దామోదర్రావు, జినుకుంట్ల చంద్రయ్య, కె.ఉపేందర్రెడ్డి, ఎన్.ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 21న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలునల్లగొండ టూటౌన్ : మేకల అభినవ్ 36వ జయంతి పురస్కరించుకొని ఈనెల 21వ తేదీన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ సౌజన్యంతో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కొసనం కరుణాకర్రెడ్డి, గాంధీగ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఉపాధ్యక్షుడు నీరుడు దయాకర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో అండర్ – 7, 9, 11, 13, 15, 17 విభాగాల్లో బాల, బాలికలకు స్విస్ పద్ధతిలో 5 రౌండ్లలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 36 మంది విజేతలకు బహుమతితో పాటు ఫిడే రేటెడ్ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. చెస్ పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాని, ఇతర వివరాలకు 9985423823 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించొద్దుచందంపేట : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ సూచించారు. మంగళవారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్ బుక్కులు, విక్రయ రికార్డులను పరిశీలించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రశీదు పొందాలని సూచించారు. రైతులు భూమిలో సరిపడా తేమ లేకుండా విత్తనాలు విత్తడం వల్ల మొలకలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుందన్నారు. ఆయన వెంట ఏడీఏ శ్రీలక్ష్మి, ఏఓ యాదగిరి ఉన్నారు. పశువులకు గొంతువాపు నివారణ టీకాలుమాడుగులపల్లి : పశువులకు ముందస్తుగా గొంతువాపు నివారణ టీకాలు వేయాలని జిల్లా పశువైద్యాధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మాడుగులపల్లి మండలంలోని గండ్రవానిగూడెం గ్రామంలో పశువుల గొంతువాపు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు వచ్చే జ్వరం, గొంతువాపు నివారణ కోసం ఈ టీకాలు వేస్తామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతినెలా పశువైద్య సిబ్బంది పర్యటించి గొంతువాపు ముందస్తు టీకాలు వేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వినయ్కుమార్, సర్పంచ్ బొబ్బలి కావ్యశ్రీనివాస్, రైతులు మాధవరెడ్డి, సతీష్, రవి, నారాయణ, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, సిబ్బంది రాకేష్, రవిచందర్ పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించాలి
తిరుమలగిరి(సాగర్) : ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూవివాదాలను పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా, డివిజన్ ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించి, ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. భూముల యజమానులు, సరిహద్దులు, గెజిట్ నోటిఫికేషన్లు, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని పలు విభాగాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా ఫారెప్ట్ అధికారి రాజశేఖర్, తహసీల్దార్ అనిల్ ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
14 రకాల సరుకులు ఇవ్వాలని ధర్నా
నల్లగొండ టౌన్ : జిల్లాలోని అన్ని రేషన్ షాపులలో 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కారం పొడి, పసుపు తదితర నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొండ అనురాధ, జిట్ట సరోజ, తుమ్మల పద్మ, నాగమణి, ఎస్కే సుల్తానా, ధనలక్ష్మి పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న మహిళలు -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
దేవరకొండ, హాలియా : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ, హాలియాలో సర్పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆర్ఎస్.ప్రవీణ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సర్పై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. దానిపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డ్రామాలో భాగంగానే మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకుండా చేశారని విమర్శించారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సాగర్ మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, బూడిద భిక్షమయ్య, ఇస్లావత్ రామచంద్రనాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవల్లి విజేందర్రెడ్డి, సాదం సంపత్కుమార్, చింతల వెంకటేశ్వరరెడ్డి, బీల్యానాయక్, కిషన్నాయక్, కూరాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీష్రెడ్డి, సురభి రాంబాబు, వెంకటేశ్వర్లు, కంకణాల వెంకట్రెడ్డి, సర్వయ్య, టీవీఎన్ రెడ్డి, దస్రూనాయక్, వల్లపురెడ్డి, బొడ్డు గోపాల్గౌడ్, దొంతం చంద్రశేఖర్రెడ్డి, రాజినేని వెంకటేశ్వరరావు, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి -
నీటి విడుదల సరే.. కాల్వల మరమ్మతులేవీ?
డిండి : వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిండి ప్రాజెకు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే మెయిన్ కెనాలకు ఉన్న 22 డిస్ట్రిబ్యూటర్లలో దాదాపు 10 నుంచి 15 డిస్ట్రిబ్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఏటా నీటి విడుదల సమయంలో నీరు వృథాఅయి.. ఆయకట్టు చివరి భూములకు పంట చివరి దశ వరకు నీరందక రైతులు నష్టపోతున్నారు. ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు.. డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.48 టీఎంసీలు) కాగా ప్రస్తుతం నిల్వ ఉన్న 2 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలోని ఎడమకాలువ కింద 12,500 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లాలోని కుడి కాలువ కింద 250 ఎకరాల ఆయకట్టు ఉంది. వానాకాలం పంటలకు నీటి విడుదలపై ఇరిగేషన్ శాఖ అధికారుల ఈనెల 8న రైతులతో సమావేశమయ్యారు. ఈనెల 17 లేదా 19వ తేదీన ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని సమావేశంలో రైతులు తీర్మానించారు. కాల్వ డిస్ట్రిబ్యూటర్లకు గడువులోగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను రైతులు కోరారు. నీటి విడుదల తేదీపై జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటి విడుదల సమయంలోనే హడావుడి.. డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు 22 డిస్ట్రిబ్యూటర్లలో సగానికి పైగా తుప్పు పట్టి పాడైనా గేట్లకు మరమ్మతు, కెనాల్ లోపలి భాగంలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకపోయిన మట్టిని తొలగించే విషయంలో ఏటా నీటి విడుదల సమయంలో మాత్రమే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నీటి విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతు పనులు పూర్తి కాలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాడైనా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నీరు వృథా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.బాపన్కుంట వద్ద మెయిన్ కెనాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు తుప్పపట్టిన గోనకొల్ శివారులోని డిస్ట్రిబ్యూటర్ తలుపు డిండి ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు ఉన్న డిస్ట్రిబ్యూటర్లలో పాడైన వాటికి మరమ్మతులు చేస్తున్నాం. నీరు వృథా కాకుండా చర్యలు చేపడతాం. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందిస్తాం. – హన్మంతురావు, ఇరిగేషన్ డీఈ ఫ ఆనవాలు కోల్పోయిన డిండి ప్రాజెక్టు మెయిన్కెనాల్ డిస్ట్రిబ్యూటర్లు ఫ నామమాత్రంగా పనులు చేస్తున్న అధికారులు ఫ తూములు సరిగాలేక 40 శాతం నీరు వృథా -
అర్హులకు ఓటు హక్కు కల్పించాలి
మునుగోడు : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత గ్రామస్థాయి బీఎల్ఏలదని.. సర్ కార్యక్రమంలో భాగంగా తొలగిస్తున్న ఓట్లు నిజమైనవా.. కాదా అనే విషయాన్ని బీఎల్ఏలు పరిశీలించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల నియోజకవర్గస్థాయి శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2.63 లక్షల ఓటర్లు ఉండగా అందులో 23,139 ఓట్లు బోగస్ అని, మరో 59,342 ఓటర్లలో వివిధ రకాల తేడాలు ఉన్నట్లు సర్ గుర్తించిందన్నారు. వాటిని బూత్స్థాయిలో బీఎల్ఏలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి అధికారులకు ఇవ్వాలని సూచించారు. బోగస్ ఓటర్ల తొలగింపు అనంతరం నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్ నేత అధ్యక్షతనలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, శిక్షకులు ఎండీ.నూమాన్, రుద్ర సంతోష్, మున్సిపల్ చైర్మన్ కొడి శ్రీనివాసులు, మొగుదాల పావనిరమేష్గౌడ్, చండూరు మార్కెట్ చైర్మన్ దొటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
విరిగిన ధ్వజ స్తంభం.. పునర్నిర్మాణం జాప్యం!
ఫ దాతలు సిద్ధంగా ఉన్నా పట్టించుకోని అధికారులు ఫ అరిష్టమంటున్న అర్చకులు మిర్యాలగూడ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ధ్వజ స్తంభం రెండేండ్ల క్రితం విరిగి పక్కకు ఒరిగిపోయి ఉంది. ఈ ధ్వజ స్తంభాన్ని పునర్నిర్మించేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, మూసీ నదుల సంగమం పవిత్ర పుణ్యక్షేత్రంగా మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి దేవాలయం, లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో రెండేండ్ల క్రితం ధ్వజస్తంభం విరిగిపోయి రేకులపై ఒరిగి ఉంది. ఆ రోజుల్లోనే ప్రముఖ అర్చకులు, సిద్ధాంతులు వెంటనే ధ్వజ స్తంభం నిర్మాణం చేసి దోష నివారణ పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అయినా దేవాదాయ శాఖ అధికారులు రెండేళ్లుగా ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అరిష్టదాయకమని బ్రాహ్మణులు, పులువురు హిందూ సంఘాల నాయకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేపట్టి ఆలయాన్ని ప్రక్షాళన చేసి, పూజలు, హోమాలు, స్వామివారి కల్యాణం నిర్వహిస్తే అందరికీ మంచి జరుగుతుందని భక్తులు అంటున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ జ్యోతిని వివరణ కోరగా త్వరలో నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
పాఠశాలల కుదింపును ఉపసంహరించుకోవాలి
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల కుదింపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందన్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల ఎరువులు విత్తనాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూరియా అమ్మకం యాప్ ను రద్దు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
తొలిరోజు హాజరు 9 శాతమే
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమవడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా బడి గంట మోగింది. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్ కనిపించింది. పాఠశాల ప్రాంగణాలను రంగురంగుల కాగితాలు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేశారు. దీంతో విద్యార్థులు కొత్త పుస్తకాలు రావడంతో ఆనందంలో మునిగిపోయారు. చాలా పాఠశాలల్లో ఖాళీగా తరగతి గదులు.. మొదటి రోజు పాఠశాలలకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులే రాని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలను ఓపెన్ చేసి ఖాళీగా కూర్చున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులే పాఠశాలలకు వచ్చారు. అమావాస్య ప్రభావంతో పాటు మొదటి రోజు కావడంతో పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఆసక్తి కనబర్చలేదు. స్వాగత ఏర్పాట్లలో అపశృతి.. పాఠశాలల పునః ప్రారంభం పండుగ వాతావరణంలో చేయాలని భావించి కొండమల్లేపల్లి పాఠశాలలో ఒక విద్యార్థి తోరణాలు కడుతున్న సందర్భంలో విద్యుత్ షాక్కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. బుధవారం నుంచి హాజరు పెరిగే చాన్స్ అమావాస్య కావడంతో పిల్లలను పాఠశాలలకు పంపలేదు. మంగళవారం చాలా మంది సెంటిమెంట్తో పాఠశాలలకు పంపే అవకాశం తక్కువ. 17వ తేదీ నుంచి ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది. బడిబాట ద్వారా విద్యార్థులను పాఠశాలలకు తెచ్చే కార్యక్రమం చేపడుతున్నందున హాజరు శాతం పెరగనుంది. వచ్చే రెండు మూడు రోజుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఫ పండుగ వాతావరణంలో పాఠశాలలు పునః ప్రారంభం ఫ అమావాస్య కావడంతో పిల్లలను స్కూళ్లకు పంపని తల్లిదండ్రులు ఫ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో విద్యార్థుల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కేవలం 9 శాతం విద్యార్థులే హాజరైనట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూడా 87 శాతం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం అమావాస్య కావడంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అమావాస్య రోజు కొత్త కార్యక్రమాలు ప్రారంభించకూడదనే సంప్రదాయ భావన కారణంగా హాజరు శాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మరోవైపు కొందరు విద్యార్థులు ఇంకా బంధువుల ఇళ్ల నుంచి తిరిగి రాకపోవడం, వ్యవసాయ పనుల నేపథ్యంలో కుటుంబాలతో ఉండడం వంటి కారణాలతో కూడా గైర్హాజరైనట్లు తెలుస్తుంది. -
భక్తజన ‘గట్టు’
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం సోమవారం జనసంద్రాన్ని తలపించింది. అమవాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమవాస్య రాత్రి దేవాలయంలో వేద మంత్రలతో లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్శర్మ ఆధ్వర్యంలో పూజలు సాగాయి. ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. గట్టు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. -
లక్ష్యసాధనలో ముందుండాలి
నల్లగొండ : విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంది.. లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా సోమవారం నల్లగొండలోని పానగల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్పీ అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయడం, వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ మానస, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఆయనకు వినతులు ఆయనకు అందజేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ఎఫ్ఎల్ఎంలో ప్రథమ స్థానంలో నిలపాలి
నల్లగొండ : పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం(ఎఫ్ఎల్ఎం) కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన నల్లగొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, మర్రిగూడెం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఫౌండేషన్ లిటరసీ, సంఖ్యాశాస్త్ర నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులకు అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. త్వరలోనే విద్యార్థులకు కొత్త యూనిఫాం అందజేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, కార్పొరేటర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రామగిరి(నల్లగొండ) : వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖే కాకుండా భద్రతా సిబ్బంది, ప్రజల పాత్ర కూడా ఎంతో కీలకమైందని సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ కోఆర్డినేటర్ రామిండ్ల తిరుపతి అన్నారు. నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో వైల్డ్ సురక్ష పేరిట సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి ప్రవర్తనపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామిండ్ల తిరుపతి, సురక్ష ట్రైనర్ తిరుపతి త్రివేణి, బెటాలియన్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో వినతుల స్వీకరణ
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 55, ఇతర శాఖలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం అధికారులతో ఏర్పాట చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు నెలల నుంచి ప్రజావాణి దరఖాస్తులు పెరుగుతున్నాయని, డివిజన్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందున ఇల్లు లేని వారిని గుర్తించి, డెజిటెడ్ అధికారితో పరిశీలన చేయించాలని తెలిపారు. ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ దశరథనాయక్, డీఎఫ్ఓ రాజశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూతబడ్డ పాఠశాలలను తెరిపిస్తాం
నార్కట్పల్లి : జిల్లాలో మూతబడ్డ 314 పాఠశాలలను పునః ప్రారంభిస్తామని.. ఆ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సమగ్రశిక్షా జిల్లా కోఆర్డినేటర్ ఆర్.వీరేంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఆయన నార్కట్పల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించి మాట్లాడారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న గ్రామాల్లో.. ప్రైవేట్ పాఠశాల పంపించే ఉపాధ్యాయులు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ఆయన వెంట బాజా మురళి, నరసింహ ఉన్నారు. మేరెడ్డి యాదగిరిరెడ్డికి సాహిత్య పురస్కారంరామగిరి(నల్లగొండ) : నల్లగొండకు చెందిన సీనియర్ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిష్టాత్మక ఆవంచ సీతారామారావు స్మారక సాహిత్య పురస్కారం అందుకున్నారు. నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, దివంగత ఆవంచ సీతారామారావు శత జయంతిని పురస్కరించుకొని ఆయన స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని యాదగిరిరెడ్డికి ప్రదానం చేశారు. గడిచిన ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య రంగంలో కొనసాగిస్తున్న విశిష్ట సేవలకు, ఆయన రాసిన కథలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మోత్కూరు నరహరి తదితర ప్రముఖుల చేతుల మీదుగా యాదగిరిరెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారాన్ని అందుకున్న యాదగిరిరెడ్డికి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు తండు కృష్ణకౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్, సాగర్ల సత్తయ్య, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, ఓరుగంటి పురుషోత్తం, పున్న అంజయ్య, వల్లాల అచ్చయ్య, పరందాం, శీలం భద్రయ్య తదితరులు అభినందనలు తెలిపారు. వాహనాల తనిఖీ.. మూడు కేసులు నమోదు నల్లగొండ : రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేపట్టారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ఏకకాలంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 130 వాహనాలను పరిశీలించగా, నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాహనాలపై కేసులు నమోదు చేశారు. నల్లగొండ జిల్లాలో 40 వాహనాలను తనిఖీ చేసి రెండు కేసులు నమోదు చేయగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించలేదు. సూర్యాపేట జిల్లాలో 45 వాహనాలను తనిఖీ చేసి ఒక కేసు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్, పర్మిట్ తదితర చట్టబద్ధ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా అధికారి వాణి తెలిపారు. -
విద్యార్థులకు శుభాకాంక్షలు : ఎస్పీ
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు ఎస్పీ శరత్చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు ఉత్సాహం, క్రమశిక్షణ, బాధ్యతతో ప్రారంభించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువు, వ్యాయామం, వినోదం, విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కష్టపడి చదవాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్లైన్, 100/112 అత్యవసర స్పందన సేవ, 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్, 8712670266 నల్లగొండ జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026మిర్యాలగూడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అద్దంకి– నార్కట్పల్లి బైపాస్పై మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రెండేండ్ల కిందట రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మూడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, రెండేండ్ల క్రితం శంకుస్థాపన చేసిన గుంతను సైతం పూడ్చివేశారు. ఈ రెండళ్ల కాలంలో సుమారు 25 రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి రూ.180 కోట్లు మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్పల్లి– అద్దంకి బైపాస్రోడ్డు గల వై జంక్షన్, నందిపాడు క్రాస్రోడ్డు, చింతపల్లి క్రాస్రోడ్డు, ఈదులగూడ క్రాస్రోడ్డు నాలుగు చోట్ల రూ.180 కోట్లతో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తొలుత చెప్పారు. అందులో రూ.30 కోట్లు భూములు కోల్పోయిన వారికి కేటాయించారు. ఆ నిధులతో మూడు ఫ్లైఓవర్లకే సరిపోతాయని వై జంక్షన్, నందిపాడు క్రాస్రోడ్డు, చింతపల్లి క్రాస్రోడ్డులో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ప్రమాదాలు కొన్ని.. ● పట్టణంలోని నందిపాడు బైపాస్రోడ్డు వద్ద పెట్నకోట భరతయ్య(75) స్కూటీపై పట్టణంలోకి వస్తున్న క్రమంలో హైదరాబాద్ వైపుకువెళుతున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. స్కూటీని ఢీ కొట్టిన అనంతరం అదే స్పీడ్తో రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో రెండు డీసీఎం వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదలో భరతయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ● పట్టణంలోని కృష్ణా కాలనీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడుకు చెందిన దేవులపల్లి నాగభూషణం పద్మ దంపతుల కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది. వీరంతా విజయవాడ పెనుగంచిప్రోలు, మోపిదేవి, కోటప్పకొండ ఆలయాల్లో పూజలు ముగించుకోని కారులో మిర్యాలగూడకు తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణ పరిధిలోని కృష్ణకాలనీ సమీపంలోకి రాగానే లారీ అతివేగంగా రావడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలివైపు పడింది. అదే సమయంలో అటు నుంచి వస్తున్న బొగ్గు లారీ కారును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ● చింతపల్లి బైపాస్రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. ఇటీవల కారు బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఇలా మిర్యాలగూడ బైపాస్లో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలో మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిల పనులను నామ్ ఎక్స్ప్రెస్కు అప్పగించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. కానీ, రెండేండ్ల కిందట శంకుస్థాపన చేసి.. ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ప్రారంభించలేదని, ఈసారైనా మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
మూడు పోస్టులకు 23 మంది హాజరు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని దేవాదా యశాఖ కమిషనర్ కార్యాలయంలో స్థానాచార్యులు, పురోహిత్, అథర్వ వేద పండిట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించినట్లు ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. ఈ మూడు పోస్టులకు గాను 23 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు మౌఖిక, రాత పరీక్షలు దేవాదాయశాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించినట్లు తెలిపారు. ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని ఈఓ పేర్కొన్నారు. శత ప్రశ్న శర సంధానం గ్రంథావిష్కరణ భువనగిరి : మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి సాయి అనుగ్రహ మహా పీఠంలో సిద్ధగురు రమణానంద మహర్షి రచించిన శత ప్రశ్న శర సంధానం గ్రంథాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణానంద మహర్షి మాట్లాడుతూ.. శత ప్రశ్న శర సంధానం గ్రంథంలో సాయిబాబా గురించి పూర్తిగా వివరించినట్లు తెలిపారు. 11 భాషలలో రచించిన ఈ గ్రంథాన్ని చదవితే సాయిబాబాపై సంపూర్ణ అవగాహన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షిర్డీ క్షేత్ర సీఈఓ చంద్రబాగ మహాదేవ్, ఆత్మానందా మహరాజ్, శివప్రసాద్, ధనుంజయ్, బలరాం తదితరులు పాల్గొన్నారు. -
బడి గంటకు వేళాయే..
నల్లగొండ : విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి బడులు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ఆకర్షించేలా రంగు కాగితాలు, మామిడితోరణాలు, కొబ్బరి మట్టలతో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నారు. తొలిరోజే పుస్తకాల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల్లోనే జిల్లాకు పాఠ్య పుస్తకాలు, నోట్పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాంకు రాగా వాటిని ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు తరలించారు. విద్యార్థులు మొదటి రోజు రాగానే తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు అందించనున్నారు. గురుకులాల వైపు మొగ్గు.. ఐదేళ్లుగా జిల్లాలో విద్యార్థుల ఎంపికలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి తర్వాత గురుకులాల్లో చేరుతున్నారు. ఉచిత వసతి, నాణ్యమైన బోధన, పోటీ పరీక్షల శిక్షణ వంటి సౌకర్యాలు ఉండడంతో గురుకులాల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. టీసీల ఆన్లైన్ విధానం అమల్లో ఉండటంతో విద్యార్థుల బదిలీలు సులభంగా సాగుతోంది. నాణ్యమైన విద్యే ధ్యేయం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు కనీసం 10 శాతం పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జూలై 20న ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ ఫలితాల ఆధారంగా బోధనలో అవసరమైన మార్పులు చేసి విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచే చర్యలు తీసుకోనున్నారు. పాత యూనిఫాంతోనే పాఠశాలలకు... ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు వస్త్రం రాగా వెంటనే కుట్టించేవారు. పాఠశాలలు ప్రారంభం రోజే నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాంలు అందించేవారు. అయితే ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు ఇంకా జిల్లాకు వస్త్రం రాలేదు. దీంతో విద్యార్థులు గత ఏడాది తీసుకున్న పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు రానున్నారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య ఇలా.. ప్రాథమిక 825 ప్రాథమికోన్నత 120 ఉన్నత 225 కేజీబీవీ 27 మోడల్ స్కూళ్లు 17 అర్బన్ రెసిడెన్షియల్ 1 కేంద్రీయ విద్యాలయాలు 2 ప్రభుత్వ, అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు 75,000కు పైగా.. ప్రైవేట్ పాఠశాలలు 388 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 30,000కు పైగా.. ఫ నేడు పాఠశాలల పునః ప్రారంభం ఫ గురుకులాలు, ప్రైవేట్ స్కూళ్లవైపు విద్యార్థుల మొగ్గు ఫ ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు -
పొదుపు డబ్బులు స్వాహా!
మహిళా సంఘాల సొమ్మును వీబీకే కాజేయడంపై గతంలో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఏపీఎం చందంపేట : సంఘ బంధం సభ్యులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇచ్చిన సొత్తును విలేజ్ బుక్ కీపర్ (వీబీకే) స్వాహా చేసేశాడు. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలో రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు చేసి ఏడాది గడిచిపోయినా ఇంత వరకు సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సొమ్మును కూడా రికవరీ చేయలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ మహిళా సంఘం సభ్యులు రూ.2 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు గ్రామ విలేజ్ బుక్ కీపర్కు అప్పగించారు. సదరు వీబీకే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తన సొంతానికి వినియోగించుకున్నాడు. తీరా విషయం బయపడడంతో రేపు డిపాజిట్ చేస్తా.. మాపు డిపాజిట్ చేస్తానంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో విసుగెత్తిన మహిళా సంఘం సభ్యులు నేరెడుగొమ్ము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదైంది. రికవరీకాని సొత్తు.. చర్యలు శూన్యం కేసు నమోదైనప్పటికి సదరు వీబీకేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కనీసం సొంతానికి వినియోగించిన సొమ్మును కూడా రికవరీ చేయకపోవడం మహిళా సంఘాల సభ్యులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సొమ్మును రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. ఫ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు రూ.2 లక్షలు అప్పగింత ఫ చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వీబీకే ఫ ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా చర్యలు శూన్యం ఫ న్యాయం చేయాలని వేడుకుంటున్న తిమ్మాపురం సంఘబంధం సభ్యులు -
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వాయిదా
కనగల్ : సీఎం రేవంత్రెడ్డి కనగల్ మండల పర్యటన వాయిదా పడిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన కనగల్ వద్ద సభా స్థలాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 17న జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశారని.. త్వరలో మరోతేదీ ఖరారవుతుందని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభ స్థలంలో నల్లరేగడి భూమి ఉండటంతో చిత్తడిగా మారిందన్నారు. పెద్ద టెంట్లు నిలబడటం లేదని, వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశామని తెలిపారు. త్వరలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రి పర్యటన తేదీ ఖరారు చేస్తామన్నారు. విద్యా రంగాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వంమిర్యాలగూడ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా బడులు ప్రారంభించి, ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ విమర్శించారు. ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయని, వాటిని తిరిగి తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే గత బీఆర్ఎస్కు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో కుర్ర సైదానాయక్, రవి, శివ పాల్గొన్నారు. పాలిసెట్ తుదిదశ కౌన్సిలింగ్రామగిరి(నల్లగొండ) : పాలిసెట్–2026 తుదిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, 16న సర్టిఫికెట్ల పరిశీలన, 16 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 17 నుంచి ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశ కౌన్సిలింగ్కు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు ఈ తుదిదశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు నిర్ణిత తేదీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని, హెల్ప్లైన్ సెంటర్ సౌకర్యాన్ని వినియోగించుకుని తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్లో అభ్యర్థులకు ఉచితంగా స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు సౌకర్యం కల్పించినట్లు వివరించారు. -
యాదగిరీశుడి దర్శనానికి వచ్చి వెళ్తుండగా..
యాదగిరిగుట్ట : కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన తప్పాటి నరసింహ (30) జీహెచ్ఎంసీకి చెందిన టాటా ఏస్ వాహనంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. కొండకు దిగువన పార్కింగ్ ఏరియాలో టాటా ఏస్ వాహనాన్ని పార్కింగ్ చేసి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి కిందకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో భాగంగా యాదగిరిగుట్ట రింగ్ రోడ్డులోకి రాగానే టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పెంటి కృష్ణమూర్తి, హరికంటి ధనుష్, రామాంజనేయులు, హరికంటి దర్శిత, పెంటి మధుకృష్ణ, హరికంటి రామాంజనేయులు, డ్రైవర్తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నరసింహ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతోనే నరసింహ మృతిచెందినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఫ టాటా ఏస్ వాహనం బోల్తా పడి యువకుడు మృతి ఫ మరికొందరికి గాయాలు -
దొంగ ఓట్లను తొలగించేందుకే ‘సర్’
సాక్షి యాదాద్రి : దొంగ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) చేపట్టిందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మల యాస్మిన్ నగేష్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘సర్’ పై మజ్లిస్ లాంటి పార్టీలు ప్రజల్లో అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను పరిశీలిస్తే పాతబస్తీలో కొన్ని ఇళ్లల్లో వ్యక్తులు లేకపోయినప్పటికీ వంద నుంచి 120మంది పేర్లతో దొంగ ఓట్లు నమోదై ఉన్నాయన్నారు. ఇలాంటి ఓట్లను ‘సర్’ ద్వారా ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. దీంతో విదేశీ వ్యక్తులు, ఉగ్రవాద మూలాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం ఉందన్నారు. కొన్ని హింసాత్మక శక్తులు రాజకీయ అండ చూసుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనవసరంగా అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ‘సర్’పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని, ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి దొంగ ఓట్ల తొలగింపు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్గౌడ్, నాయకులు పోతంశెట్టి రవీందర్, నర్లనర్సింగరావు, మాయ దశరథ, చందా మహేందర్గుప్తా, రత్నపురం బలరాం, ఉడుత భాస్కర్ పాల్గొన్నారు.ఫ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ -
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి
కోదాడ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసే బీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని యువత, మహిళ, రైతులను పార్టీకి అనుసంధానం చేయడానికి పాటుపడాలన్నారు. గ్రామ బూత్స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రజల తరఫున పోరాడాలని కోరారు. సర్ కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన పెంచుకోవాలన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సుంకర అజయ్కుమార్, సత్యబాబు, ఎస్.కె. నయీం, చింతా కవిత, బట్టు శివాజీ, మామిడి రామారావు, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ -
ఉపాధ్యాయుల్లో అపోహలు తొలగించాలి
నల్లగొండ : ఈహెచ్ఎస్పై ఉపాధ్యాయుల్లో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేసి పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు బకాయి పారితోషికాలను వెంటనే చెల్లించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు కాళం నారాయణ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు సత్తయ్య, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, నక్క యుగంధర్, సుదర్శన్రెడ్డి, డీవీఎస్ ఫణికుమార్, సుధాకర్రెడ్డి, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాల చరిత్రలో సుబ్బారావుది చెరగని ముద్ర
మిర్యాలగూడ : మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుబ్బారావు సేవలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతి ఎన్ఎస్పీ క్యాంప్లో నిర్వహించిన సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర నాయకుడు గోసుల మోహన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. సుబ్బారావు సమాజంలోని సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేశారని తెలిపారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. చైతన్య సమాఖ్య ద్వారా సామాజిక చైతన్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన ఆయన హక్కులపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పౌర హక్కుల పరిరక్షణలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, యురేనియం తవ్వకాల వ్యతిరేక ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజల తరఫున బలమైన స్వరంగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సీడీ రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, పొన్నూరు రమేష్, ఉదయ, కిరణ్మయి, సృజన, అజయ్, నీరజ, పాండురంగారావు, రామారావు, రాజు, రంగారావు, కృష్ణయ్య, రామయ్య, విమల, రాధా, జూలూరు గౌరీశంకర్, సజయ, అంబటి వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -
లోక్ అదాలత్తోనే సత్వర న్యాయం
చివ్వెంల (సూర్యాపేట) : న్యాయస్థానాల పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ నెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇందులో కక్షిదారుల ఆమోదంతో రాజీ కుదిర్చి ఇరువర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కారం చూపుతారు. బాధితులు, కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, సత్వర న్యాయం కోసం న్యాయశాఖ లోక్ అదాలత్ నిర్వహిస్తోంది. లోక్ అదాలత్ అంటే.. కోర్టుల్లో నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాటికి సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చు. లోక్ అదాలత్ అనేది లీగల్ సెల్ అథారిటీస్ యాక్టు–1987 ప్రకారం చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలో ఉపయోగించే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానంగా రూపొందించబడింది. ఎలాంటి ఫీజు ఉండదు.. పెండింగ్లో ఉన్న కేసులు లేదా న్యాయ స్థానాల్లో ప్రీలిటిగేషన్ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వేదిక లోక్ అదాలత్. ఈ చట్టం ప్రకారం లోక్ అదాలత్లు ఇచ్చే అవార్డు(నిర్ణయం) సివిల్ కోర్టు కేసుగా పరిగణించబడుతుంది. రాజీకి అవకాశం ఉన్న కేసులు మాత్రమే లోక్ అదాలత్ల ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవచ్చు. ఆ సంస్థ ఇచ్చే తీర్పు అంతిమం. కేసులు పరిష్కారమైనప్పుడు అవార్డుకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందు అప్పీల్ చేయడానికి అవకాశం ఉండదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అదే కోర్టులో కేసు వేస్తే పరిష్కారానికి సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు కోర్టు చుట్టూ తిరగాల్సిందే. లోక్ అదాలత్ కేసులకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇరువర్గాల వారు రాజీ పడవచ్చు. పరిష్కారమయ్యే కేసులు ఇవీ.. సివిల్, క్రిమినల్, మోటార్ వెహికల్ యాక్టులు, ఎకై ్సజ్ కేసులు, బ్యాంకు రుణాలు, కుటుంబ ఘర్షణలు, యాక్సిడెంట్ తదితర కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఫ పై కోర్టుల్లో అప్పీల్ లేకుండానే కేసుల పరిష్కారం ఫ రాజీ మార్గంతో డబ్బు, సమయం ఆదా ఫ 20న జాతీయ మెగా లోక్ అదాలత్ -
రిసార్ట్లో యువకుడి అనుమానాస్పద మృతి
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ శివారులోని ఓ రిసార్ట్లో శనివారం అర్ధరాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ మండలంలోని శ్రీరామ్పూర్ గ్రామానికి చెందిన గాండ్ల రాము(27) హైదరాబాద్లోని ఉప్పల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్పల్లిలో నివాసముంటున్నాడు. వీకెండ్ కావడంతో రాము పనిచేస్తున్న కంపెనీకి చెందిన 20 మంది స్నేహితులు కలిసి పార్టీ చేసుకునేందుకు గాను చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని ఓ రిసార్ట్ను బుక్ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న స్నేహితులు.. రాముతో పాటు అతడి స్నేహితులంతా శనివారం సాయంత్రం రిసార్ట్కు చేరుకున్నారు. ఆనందంగా కలిసిమెలిసి పార్టీ మొదలుపెట్టారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. కొంతసేపటి తర్వాత అంతా సద్దుమణిగింది. అనంతరం స్నేహితులంతా ఎవరి పనిమీద వారు నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పార్టీకి వచ్చిన నలుగురు స్నేహితులు కలిసి రిసార్ట్లోని స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో స్విమ్మింగ్ ఫూల్లో నడుచుకుంటూ మిగతావారిని అనుసరించసాగాడు. ఈ క్రమంలో ఆ ఈతరాని యువకుడి కాళ్లకు నీటి అడుగున ఏదో తగిలింది. ఈ విషయాన్ని మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పడంతో వారంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్లి చూడగా.. రాము కనిపించాడు. వెంటనే అతడిని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. రిసార్ట్ లోపల ఉన్న మిగతా స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారంతా బయటకు వచ్చి రాముకు సీపీఆర్ చేశారు. వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రాము మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్, ఎస్ఐ యాదగిరిలు ఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే తన కుమారుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని, అతడిని స్నేహితులే కొట్టి హత్య చేశారని రాము తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు చౌటుప్పల్ మండలం ఎల్లంబావి శివారులో ఘటన -
భగవద్గీత.. మానవాళికి దివ్య సందేశం
నకిరేకల్ : భగవద్గీత మానవాళికి మార్గదర్శకంగా నిలిచే దివ్య సందేశమని శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. అన్నమాచార్య కళాసమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్లోని శ్రీసాయి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ భగవద్గీత పారాయణం ద్వారా మనస్సుకు ప్రశాంతత ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయన్నారు. త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్స్వామి మాట్లాడుతూ.. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మానవ జీవిత సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతుందన్నారు.భగవద్గీత పారాయణం ద్వారా శ్రీకష్ణ భగవానుని దివ్య సందేశాన్ని గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని సూచించారు. అన్నమాచార్య కళా సమితి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గండేపల్లి సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్, డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ మాధవి వెల్లంకి, స్థానిక సాయి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తొనుపూనూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి -
అసంపూర్తిగా సీసీ లైనింగ్
నిడమనూరు : నాగార్జున్సాగర్ ఎడమకాల్వ మరమ్మతులు అసంపూర్తిగా చేపడుతున్నారు. కాల్వ నిర్మాణ సమయంలో చేపట్టిన బండల లైనింగ్ తొలగించి.. 2014 సీసీ లైనింగ్ చేపట్టినా.. అక్కడక్కడా అసంపూర్తిగా వదిలేశారు. ఆ అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ఏడాదిక్రితం టెండర్లు ఖరారు చేసి.. రెండు వారాలుగా పనులు ప్రారంభించారు. రూ.54 కోట్లతో సాగర్ మొదటి జోన్ (72కిలోమీటర్లు)పరిధిలో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్మరోసారి అసంపూర్తిగా పనులు చేపడుతున్నారని రైతులు అంటున్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న కాల్వ సీసీ పనులు పర్యవేక్షించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల బండల లైనింగ్ అలాగే వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ 38 కిలోమీటరు ప్రాంతం(బొకమంతలపహాడ్ – ముకుందాపురం) గ్రామాల వద్ద కిలోమీటర్ మేర బండల లైనింగ్ ఉంది. ఇక్కడ సాగర్ కాల్వ భూ ఉపరితలానికి దిగువన ఉండటంతో ఎటువంటి ప్రమాదం ఉండదని.. పాతబండల లైనింగ్ ఉంచుతున్నట్లు కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి. టెండరు ప్రకారం కాల్వ పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టరు పాత లైనింగ్ను పలుచోట్ల అలాగే ఉంచుతున్నారు. సీసీ లైనింగ్ లేకపోతే కాల్వ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ సాగర్ ప్రధాన కాల్వకు కొన్నిచోట్ల బండల లైనింగ్ ఉంచుతున్న కాంట్రాక్టర్ ఫ పనులను పర్యవేక్షించని ఎన్ఎస్పీ అధికారులు -
ప్రభుత్వ బడులను బాగు చేయాలి
కోదాడ : తెలంగాణలో కొత్త బడులు అవసరం లేదని.. ఉన్న ప్రభుత్వ బడులనే బాగు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ డివిజన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అన్నారు. నాణ్యమైన వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హక్కులను, విధులను తమ రెండు కళ్లుగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. రాములు, సోమయ్య, అనిల్కుమార్, యాకయ్య, శ్రీనివాసరెడ్డి, అరుణభారతి, వెంకటయ్య, సలీం షరీఫ్, తల్లాడ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, చందా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
‘ఎల్నినో’పై అప్రమత్తత అవసరం
తిరుమలగిరి(సాగర్) : వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ఫలితంగా భూగర్భజలాల లభ్యత తగ్గడంతో పాటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వర్షాధార పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రైతులందరూ అప్రమత్తంగా ఉండి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తిరుమలగిరి(సాగర్) ఏఓ గంట హర్షిత సూచిస్తున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. వరి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రైతులు దీర్ఘకాలిక వరి రకాల సాగును తగ్గించి స్వల్పకాలిక మరియు సన్న రకాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. దీని వల్ల పంటను 20–30 రోజుల ముందుగానే కోయవచ్చు. నీటి వినియోగం తగ్గి వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కంది, పెసర, మినుము, సజ్జలు, జొన్నలు, నువ్వులు మరియు ఆముదం సాగు చేయాలి. కరువు పరిస్థితులను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నేల తేమ సంరక్షణ..చెరువు మట్టిని పొలంలో తోలడం, పశువుల ఎరువును వేయడం, పొలంలో కలుపు మొక్కలను తొలగించడం, మల్చింగ్ పద్ధతుల ద్వారా నేలలో తేమను నిల్వ ఉండేలా చూడాలి. అంతేకాకుండా వర్షపు నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి. డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను వినియోగించడం ద్వారా నీటి పొదుపు మరియు నీటిని వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ఆరుతడి పంటలు మేలు..బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు సగానికి పైగా వరి విస్తీర్ణాన్ని తగ్గించి ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు మరియు నూనెగింజల పంటల విస్తీర్ణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేల సారం, నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచే చర్యలు.. ● రైతులు తమ పొలాల్లో పశువుల ఎరువు మరియు చెరువుల మట్టిని తోలడం ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. ● పచ్చిరొట్ట ఎరువుల పంటలైన జనుము, జీలుగ పంటలను సాగు చేసి పుష్పించే దశలో భూమిలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరుగుతుంది. ● దీని వల్ల వర్షపు నీరు భూమిలోకి సులభంగా ఇంకి భూగర్భజలాల పెరుగుదలకు దోహదపడతాయి. ● నేలలో నీటి నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం పెరిగి పంటలకు ఎక్కువకాలం తేమ అందుబాటులో ఉంటుంది. ● నేల భౌతిక పరిస్థితి మెరుగుపడంతో పాటు నేల సారం పెరిగి పంటల దిగుబడి మెరుగుపతాయి. ● నీటి వినియోగ సామర్ధ్యం, నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.ఎల్నినో పరిస్థితుల ప్రభావ నివారణకు సూచనలు.. వర్షాధార పంటలు సాగు చేసుకునే రైతులు నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన అనంతరం మొత్తం 60–75 మి.మీ. వర్షాపాతం నమోదైన తర్వాతే విత్తనాలు విత్తుకోవాలి. తక్కువ నీటి అవసరం కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలి. పంటలు ఎదిగే దశలో అవసరమైన మేరకు కచ్చితమైన నీళ్లు అందించాలి. సిఫారసు చేయబడిన మోతాదులో ఎరువులను వినియోగిస్తూ సమీకృత పోషక నిర్వహణ పద్ధతులను అనుసరించాలి. కీటక నాశకాల విచక్షణరహిత వినియోగాన్ని నివారించి పర్యావరణ హిత సమగ్ర కీటక నిర్వహణ విధానాలను అమలు చేయాలి. సాధ్యమైన చోట్ల సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలి. వానాకాలం సాగుపై తిరుమలగిరి (సాగర్) ఏఓ హర్షిత సూచనలు -
సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం
నల్లగొండ టూటౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, జిల్లా ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతనే జిల్లాకు రావాలని, లేకుంటే సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కుంభకోణాల అడ్డగా మారిందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన స్వలాభం కోసం నల్లగొండ బైపాస్ రోడ్డు అలాట్మెంట్ మార్చారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కుంభకోణం జరిగినా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నల్లగొండలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని, సర్ అంటేనే కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు. నల్లగొండలో రోహింగ్యాలు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ల వైర్లు చోరీ చేసినట్లు డీఎస్పీ చెప్పారని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు వీరెళ్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, పకీరు మోహన్రెడ్డి, శాంతస్వరూప్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి -
మేరెడ్డి సాహిత్యంలో రైతు జీవితాలు ప్రతిబింబం
రామగిరి (నల్లగొండ) : తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని, గ్రామీణ సంస్కృతిని మేరెడ్డి యాదగిరిరెడ్డి అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కొనియాడారు. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, సృజన సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా మేరెడ్డి యాదగిరిరెడ్డి ఎంతో నిబద్ధతతో సాహిత్య సృజన చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, తండు కృష్ణకౌండిన్య, రచయిత శిరంశెట్టి కాంతారావు, గుడిపాటి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, అలుగుబెల్లి రామచంద్రరెడ్డి, భూతం ముత్యాలు, వల్లాల అచ్చయ్య పరందాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, పున్న అంజయ్య, బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్రావు, ఓరుగంటి పురుషోత్తం, కుకుడాల గోవర్దన్, డాక్టర్ మొహమ్మద్ హసేన, మల్లికార్జునచారి, నాగేందర్, సత్తయ్య, జానకిరామ్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మహేందర్, చెరుపల్లి సంధ్య, తరుణోజు భీష్మాచార్య, శ్రీకళా రామ్మూర్తి పాల్గొన్నారు. -
అంగన్వాడీ ఖాళీల భర్తీకి కసరత్తు
మిర్యాలగూడ టౌన్ : అంగన్వాడీ టీచర్, ఆయా పొస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలో 163 అంగన్వాడీ టీచర్, 756 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టులు భర్తీ అధికారులు శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. కొంతమంది నోటిఫికేషన్కు ముందే రాజకీయ పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొత్తం 2093 కేంద్రాలు.. జిల్లాలోని అనుముల, చింతపల్లి, దామరచర్ల, కొండమల్లేపల్లి, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లకు పదవివీరమణ కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య, లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ భర్తీ ప్రక్రియ ఇలా.. గతంలో 10వ తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులను ఇచ్చారు. ఇప్పుడు విద్యా అర్హత ఇంటర్మీడియేట్కు పెంచారు. కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేయనున్నారు. ఈ కమిటీ చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఆర్డీఓ, డీడబ్ల్యూఓ, డీఎంహెచ్ఓలు కమిటీ సభ్యులుగా ఉంటారు. పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం 100 మార్కుల ప్రక్రియతో భర్తీ చేస్తారు. ఇందులో ఇంటర్మీడియేట్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 70 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేనివారికి 10 మార్కులను అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులను కలిపి మెరిట్ వచ్చిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు. ఫ 163 టీచర్, 756 హెల్పర్ పోస్టులు ఖాళీ ఫ జిల్లాస్థాయి కమిటీ చేత ఎంపిక ఖాళీల వివరాలు ఇలా.. ప్రాజెక్టులు టీచర్ హెల్పర్ అనుముల 18 82 చింతపల్లి 23 75 దామరచర్ల 20 105 దేవరకొండ 35 110 కొండమల్లేపల్లి 22 66 మిర్యాలగూడ 17 68 మునుగోడు 09 69 నకిరేకల్ 10 89 నల్లగొండ 09 92 -
కార్యకర్తలు యోధుల్లా పనిచేయాలి
నల్లగొండ : ఓటు హక్కును కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా యోధుడిలా పని చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలో బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏ) సర్పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలన్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అభ్యంతరాలు దాఖలు చేయాలన్నారు. ప్రజల మద్దతును ఓట్లుగా మార్చి భద్రపరచడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడి ఫలితాలను తారుమారు చేసేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో బీజేపీ కుట్రలు చేసి సర్ ద్వారా ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపించారు. రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు పోకుండా బీజేపీ కుట్ర చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్, టీపీసీసీ నియమిత ట్రైనర్ వెంకటరమణ.. సర్ విధి విధానాలు, ఓటర్ల జాబితా సవరణ, బీఎల్ఎల బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నియోజకవర్గ సర్ పరిశీలకులు రాంజీ, మేయర్ బురి చైతన్య, డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూరి రమేష్, గడ్డం అనూప్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ అర్హుల ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా చూడాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
వడ్డెర సంక్షేమానికి కృషి
దేవరకొండ : వడ్డెర సామాజికవర్గ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుకానారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డెరులను తిరిగి సంచార జాతులలో చేరుస్తూ జీవో నంబర్ 10ని విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డి, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో వడ్డెర జాతి పూర్తి నిర్లక్ష్యానికి గురైందన్నారు. జీవో విడుదలలో కీలక పాత్ర పోషించిన పల్లపు సమ్మయ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలిఫ ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికులు సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి సహకరించాలని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న వెల్లడించారు. శనివారం ఆమె నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా కార్మికులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా పరిశీలించిందని తెలిపారు. ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందని వివరించారు. కార్మికుల భవిష్యత్కు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా లింగస్వామిచిట్యాల : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కత్తుల లింగస్వామి ఎన్నికయ్యారు. తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో ఆ సంఘం జిల్లా మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు. పీజీ పాఠ్యాంశంగా ‘పాన్ మరక’రామగిరి (నల్లగొండ) : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ (తెలుగు) మొదటి సంవత్సరం, సెకండ్ సెమిస్టర్ ఆధునిక కవిత్వం పాఠ్యాంశాల్లో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క నివాసి, ప్రముఖ కవి అలీ రాసిన ‘పాన్ మరక’ కవితకు చోటు దక్కినట్లు అకడమిక్ తెలుగు కౌన్సిలర్, కవి, రచయిత పున్నమి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలీ రాసిన ‘పాన్ మరక’ కవితలో జీవం, జీవితం ఉన్నాయని, నిఖార్సైన ముస్లిం మైనారిటీల జీవితాల్లోని పేదరికాన్ని, యథార్థ పరిస్థితులను ఈ కవిత కళ్లకు కడుతుందని కొనియాడారు. సమాజంలోని వాస్తవాలను ప్రతిబింబించే ఇలాంటి ఉత్తమ కవితకు పీజీ పాఠ్యాంశాల్లో స్థానం లభించడం నల్లగొండ జిల్లాకే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠ్యాంశాల్లో అలీ కవితతో పాటు తెలుగు సాహితీ లోకంలో విశేష గుర్తింపు పొందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎన్.గోపి రాసిన ‘రొట్టె’ కవితకు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్ రాసిన ‘నాలుగో కన్ను’ కవితకు కూడా స్థానం కల్పించారని అంజయ్య పేర్కొన్నారు. సాహిత్య విలువలున్న ఉత్తమ కవితలను పీజీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఎంపిక చేసినందుకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి, పాలకమండలికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలి
నల్లగొండ : విద్యార్థుల సంఖ్య కనుగుణంగా పాఠశాలలను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆయన శనివారం నల్లగొండలో నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశంలో నాయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పట్టణీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల వలసలతో నగరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవన్నారు. నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం 5 వేలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలన్నారు. అక్రమ డిప్యుటేషన్ల రద్దు కోసం ప్రజలను కూడా సమీకరిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, నాగమణి, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్రెడ్డి, అరుణ, గేర నరసింహ, శ్రీనివాస్రెడ్డి, నలపరాజు వెంకన్న, భానుప్రకాష్, మధుసూదన్, పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి.సురేందర్రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాంకుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి -
రెండేళ్లలో రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తాం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ కనగల్ వద ్దసీఎం సభ ఏర్పాట్ల పరిశీలనకనగల్ : హ్యాం రోడ్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయన కనగల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి హాజరుకానున్న బహిరంగ సభ స్థలాన్ని, హ్యాం రోడ్ల పైలాన్, హెలిపాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 14 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తగా హ్యాం పద్ధతిలో నిర్మించే రోడ్లకు 17వ తేదీ సీఎం రేవంత్రెడ్డి కనగల్ వద్ద శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రోడ్లు ఉంటేనే పరిశ్రమలు, సంక్షేమం ఉంటాయన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బీసీ సొరంగం కూడా 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. కేంద్ర సీఆర్ఎఫ్ నిధుల ద్వారా నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు స్ట్రెయిట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరైందని, దాని పక్కనే బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ కూడా సద్ధమవుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని తెలిపారు. సభకు అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీపీఓ శంకర్నాయక్, డీఎస్పీ కె శివరాంరెడ్డి, ఆర్అండ్బీ డీఈ గణేష్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేదరక్షిత, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, నాయకులు గడ్డం అనూప్రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, దేవిరెడ్డి వెంకట్రెడ్డి, నర్సింగ్ మురళిగౌడ్, గోలి జగాల్రెడ్డి, నర్సిరెడ్డి, నర్సింగ్ కృష్ణయ్యగౌడ్, ఎండీ.హపీజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మూసీకి జలకళ
కేతేపల్లి : జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం ప్రాజెక్టుకు 876 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాల్వలకు విడుదల నిలిపి వేసే నాటిని రిజర్వాయర్లో నీటిమట్టం 627 అడుగులకు (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) తగ్గిపోయింది. నెల రోజుల నుంచి మూసీ ఎగువ, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీకి రోజూ 400 నుంచి 500 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. 4.46 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. -
సాగర్ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు శ్రీకాంత్రెడ్డి, సాయిశివాని, పారస్ కుమార్ శుక్రవారం నాగార్జునసాగర్ను సందర్శించారు. విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్న వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు సాగర్ ప్రధాన ఆనకట్టతో పాటు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధచరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించారు. బుద్ధవనం విశేషాలను తెలిపే లఘచిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన వారికి కండావాలు కప్పి, బోచర్లను అందచేశారు. టూరిజం గైడ్ సత్యనారాయణ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విశేషాలను వివరించారు. వారివెంట పెద్దవూర తహసీల్దార్ ఖాసీం, ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. -
కనగల్లో హ్యామ్ రోడ్ల పైలాన్
కనగల్ : సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపట్టే హ్యమ్ రోడ్ల పైలాన్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో.. కనగల్ సబ్ మార్కెట్ యార్డ్ వద్ద పైలాన్ను నిర్మిస్తున్నారు. శుక్రవారం పైలాన్ నిర్మాణ స్థలంలో కంకర మట్టిని పోసి డోజర్లతో చదును చేసి పనులను ప్రారంభించారు. ధర్వేశిపురం స్టేజీ సమీపంలో హెలిపాడ్ పనులు మొదలు పెట్టారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.పద్మ, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డీఈ గణేష్కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, చండూరు సీఐ టీ.రాము, ఎస్ఐ కె.రాజీవ్రెడ్డి, జేఈలు దినేష్రెడ్డి, శ్రీకాంత్, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్, మాజీ సర్పంచ్ సునీత కృష్ణయ్యగౌడ్, ఆర్ఐ సునీత, ఏఆర్ఐ యాదగిరి పాల్గొన్నారు. -
డీసీసీబీకి పాత పాలకవర్గమే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. వెంటనే ఆయా పాలకవర్గాలను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని జిల్లా సహకార అధికారులకు (డీసీవో) సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్లగొండ డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి, ఇతర డైరెక్టర్లు మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమ, బుధవారాల్లో ఆయా పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించనున్నాయి. డీసీసీబీ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ తరువాత మళ్లీ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడగించకుండా, గత ఏడాది డిసెంబరు నెలలో వాటిని రద్దు చేసింది. జిల్లా కలెక్టర్లను పర్సన్ ఇన్చార్జీలుగా నియమించింది. దీనిపై డీసీసీబీలకు చెందిన కొందరు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జీవో 598పై స్టే విధిస్తూ గత నెల 21న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు.. డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లాల సహకార అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డీసీసీబీకి పాత పాలకవర్గమే ఉంటుంది.ఫ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాలకవర్గాల రద్దు జీఓ సస్పెన్షన్ ఫ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
ఆలేరు: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మహిళా కార్యకర్తలు కీలకం అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షినటరాజన్కు రాజ్యసభ అవకాశం రాకుండా కుట్రలు చేయడం మహిళల పట్ల బీజేపీ నిజమైన వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు ఓట్ల దోపిడీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల దోపిడీకి కూడా ప్రయత్నించడంపై మండిపడ్డారు. కొత్తగా వివాహమైన మహిళల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా మహిళా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్పై కుట్ర : ఎంపీ చామల భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఆమె రాజ్యసభ నామినేషన్ను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని, కాంగ్రెస్ను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై ఇప్పుడు బిల్లు పెట్టినా ఓటు వేయడానికి కాంగ్రెస్ సిద్ధమేనన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలే కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఇదిలా ఉంటే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేకపోవడంతో ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి అలిగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, నల్లగొండ, సూర్యాపేట, యాద్రాది జిల్లాల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.ఫ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్రం విఫలం ఫ సీట్ల దోపిడీకి పాల్పడుతున్న బీజేపీ ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫ ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంచట్టసభల్లో మహిళా రిజర్వేషన్ (33శాతం) బిల్లును తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో పోస్ట్ కార్డులపై మహిళల సంతకాలు సేకరించి వాటిని నేరుగా ప్రధాని నరేంద్రమోదీకి పంపే ఉద్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరులో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంలో పోస్టుకార్డుల రాసి ప్రదర్శించారు. గ్రామగ్రామాన తిరుగుతూ మహిళలను చైతన్య పరిచి, పోస్టుకార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. -
17 మున్సిపాలిటీల్లో 20 చెరువులు
ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 20 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. రూ.55 కోట్లతో చెరువు కట్టల వెడల్పు, రాతి కట్టడం, కలుషిత నీరు దారి మళ్లించడం లాంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చెరువుకు కట్టకు లోపలి భాగంలో మొత్తం రాతి కట్టడం నిర్మించడం ద్వారా చెరువులోని నీరు గాలికి అలలుగా వరద తాకిడికి చెరువు కట్ట కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువు కట్టలను విస్తరణ చేపట్టడంతో రాకపోకలకు కూడా సులభంగా మారనుంది. మిర్యాలగూడలో చెరువు కట్టకు రాతి కట్టడం పనులు -
సర్పంచ్లకు గౌరవ వేతనం
నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. జిల్లాలోని 866 మంది సర్పంచ్లకు ఐదు నెలల 10 రోజుల గౌరవ వేతనాల చెల్లింపునకు రూ.3.55 కోట్లను విడుదల చేసింది. జిల్లా పంచాయతీ కార్యాలయం బిల్లులను ట్రెజరీకి సమర్పించగా, ఒకటి రెండు రోజుల్లో సర్పంచ్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా, 866 గ్రామపంచాయతీలకు సర్పంచ్లు ఉన్నారు. వీరికి నెలకు రూ.6,500 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. గతేడాది డిసెంబర్ 20న బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్లకు ఇప్పటివరకు వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంతో సర్పంచ్ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనల ఆహ్వానంనల్లగొండ : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుంది. తెలంగాణ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ‘ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్లేస్మెంట్’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలతో అనుబంధం, ఉపాధి కల్పనలో అనుభవం ఉన్న శిక్షణ భాగస్వామ్య సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల శిక్షణ సంస్థలు తమ ప్రతిపాదనలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, నల్లగొండలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల అందజేతకు గడువు, దరఖాస్తు విధానం కోసం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలిపారు. చర్చల కమిటీ ఏర్పాటు చేయాలిమిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల నూతన వేతన సవరణకు సంబంధించి యాజమాన్యాలతో చర్చించేందు వీలుగా వేతన కమిటీని ఏర్పాటు చేయాలని టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం నాయకులతో కలిసి హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ.. గతంలో కుదిరిన వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసి రెండు నెలలు దాటుతున్నా నూతన కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. విద్యుత్ రంగాన్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన వేతన సవరణ, అలవెన్సుల ఖరారు కోసం తక్షణమే చర్చల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కూలి పోరాటాలు ఉధృతం చేస్తాంతిప్పర్తి : భూమి, కూలి పోరాటాలను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 20వ మహసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతన చట్టం చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భూ సీలింగ్ చట్టాన్ని సవరించి, ప్రాజెక్టుల కింద రెండు పంటలు పండే భూములు ఐదు ఎకరాల కంటే మించి ఉంటే పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేయకుంటే భూ పోరాటాలు చేస్తామన్నారు. భూమి లేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్లో నిధులు తగ్గించి వ్యవసాయ కార్మికుల పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య, నాయకులు నన్నూరి వెంకట రమణారెడ్డి, లింగస్వామి, మన్నెం భిక్షం, రాములు, చెరుకు పెద్దులు, మారయ్య, సుకన్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ఫిట్నెస్ పరీక్ష చేయించని 418 స్కూల్ బస్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలలు జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,739 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటివరకు 1,321 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. ఇంకా 418 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఫిట్నెస్ పరీక్షలు చేయించని బస్సులను పాఠశాలల ప్రారంభం తర్వాత రోడ్లపైకి అనుమతించబోమని రవాణా శాఖ స్పష్టం చేస్తోంది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్రేకులు, టైర్లు, ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, సీట్ల స్థితి వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు. దీనిపై రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. యాజమాన్యాలు ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షల కోసం ముందుకు రావడం లేదు. నల్లగొండ జిల్లాలోనే అధికం.. ● ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్కూల్ బస్సులు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. మొత్తం 759 బస్సుల్లో 578 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా, ఇంకా 181 బస్సులు తనిఖీలకు హాజరుకావాల్సి ఉంది. ● సూర్యాపేట జిల్లాలో మొత్తం 592 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో 420 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందగా, 172 బస్సులు ఇంకా పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. ● యాదాద్రి–భువనగిరి జిల్లాలో మొత్తం 388 స్కూల్ బస్సులు ఉండగా, 323 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశాయి. మరో 65 బస్సులు ఇంకా తనిఖీలకు రాలేదు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం రోజూ వేలాది మంది విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు మిగిలిన 418 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, పెండింగ్లో ఉన్న వందలాది స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కావడం ఇప్పుడు రవాణా శాఖకు సవాల్గా మారింది. విద్యార్థుల భద్రత కోసం యాజమాన్యాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.ఫ 15వ తేదీనే పాఠశాలల పునఃప్రారంభం ఫ ఫిట్నెస్ లేకుండా రోడెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులు జిల్లాల వారీగా స్కూల్ బస్సుల వివరాలు ఇలా.. జిల్లా బస్సులు ఫిట్నెస్ పూర్తి పెండింగ్ నల్లగొండ 759 578 181 సూర్యాపేట 592 420 172 యాదాద్రి 388 323 65 మొత్తం 1739 1321 418 -
తొలకరి పలకరింపు
నల్లగొండ అగ్రికల్చర్ : తొలకరి పలకరించింది. జిల్లా అంతటా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మొస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటున 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అడవిదేవులపల్లిలో అత్యధికంగా 105.7 మిల్లీమీటర్లు, నాంపల్లి 80.6, దామరచర్ల 70.0, చిట్యాల 8.8, నార్కట్పల్లి 10.7, కట్టంగూర్ 20.3, శాలిగౌరారం 30.4, నార్కట్పల్లి 39.3, కేతేపల్లి 1.5, తిప్పర్తి 6.8, నల్లగొండ 9.2, హాలియా 13.2, నిడమనూరు 17.4, త్రిపురారం 34.7, మిర్యాలగూడ 3.4, తిరుమలగిరిసాగర్ 23.2, పెద్దవూర 70.2, చింతపల్లి 4.0, గుర్రంపోడు 6.2, పీఏపల్లి 14.0, నేరడుగొమ్ము 28.5, కొండమల్లేపల్లి 13.4, దేవరకొండ 7.6, గుండ్లపల్లి 3.1, చందంపేట 8.8, గుడిపల్లి 27.2, మునుగోడు 13.4, చండూరు 7.5, మర్రిగూడలో 37.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంచి వర్షం కురవడంతో వానాకాలం సాగు పనులు రైతులు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేవరకొండ, చందంపేట, పెద్దవూర, హాలియా, నకిరేకల్, నాంపల్లి, చింతపల్లి, అడవిదేవులపల్లి, గుర్రంపోడు, మునుగోడు, నార్కట్పల్లి, నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లో రైతులు పత్తి కట్టెను తీసి దుక్కులు దున్నుకున్నారు. మరోమారు మోస్తరు వర్షాలు కురిస్తే పత్తి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంది. వానాకాలం వరిసాగుకు వరినార్లు కూడా పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
పానగల్లో మరో పంప్హౌస్
నీలగిరిలో రోజూ తాగునీటి సరఫరాకు 50 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మాణం నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. నగరంలో ఇంటింటికీ రోజూ తాగునీటి సరఫరాకు ప్లాంట్ నిర్మించనున్నారు. ఇందుకుగాను తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) నుంచి రూ.83 కోట్లు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించడానికి కొత్త పంప్హౌస్ నిర్మాణం చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పానగల్లో 50 మిలియన్ లీటర్స్ ఫర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యం గల మరో పంప్హౌస్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఈ పానగల్లో పంప్హౌస్ నిర్మాణం పూర్తయితే నీలగిరి నగరంలో తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటి సరఫరా.. నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లోని 48 డివిజన్ల పరిధిలో సుమారు 2.50 లక్షల వరకు జనాభా ఉంది. ఈ జనాభాకు ప్రస్తుతం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక బోర్ల ద్వారా పలు కాలనీలకు నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నగరంలో 24 గంటలపాటు ఇంటింటికి తాగు నీరందిస్తానని పలుమార్లు చెప్పిన ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి మాట నిలబెట్టుకున్నారు. కొత్త పంప్హౌస్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ నుంచే ప్రతి రోజూ 50 ఎంఎల్డీ తాగునీరు అందనుంది. నగర ప్రజలకు రోజుకు 5 కోట్ల లీటర్ల తాగునీటిని అందించనున్నారు. ప్రస్తుతం నగరంలో 10 నీటి ట్యాంకులను కొత్తగా నిర్మిస్తుండగా పాతవి 15 ఉన్నాయి. మొత్తం 25 ట్యాంకుల నుంచి నగరంలోరి 48 డివిజన్లకు తాగునీటి సరఫరా జరగనుంది. నీలగిరి నగర ప్రజలకు రోజూ తాగునీరు అందించడానికి కొత్త పంప్హౌస్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిధులు మంజూరు చేయించిన మంత్రికి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – బుర్రి చైతన్య, నగర మేయర్ ఫ రాబోయే 30 సంవత్సరాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా.. ఫ రూ.83 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ -
ఇన్చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు డీఎంహెచ్ఓగా పనిచేసిన పుట్ల శ్రీనివాస్ హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎల్బీనగర్ డీఎంహెచ్ఓగా పనిచేస్తున్న చంద్రశేఖర్ను జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓగా తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నియమించింది. గురువారం ఆయన విధుల్లో చేరనున్నట్టు సమాచారం. మాజీ సైనికులు దరఖాస్తు చేసుకోవాలినల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లాలో ఉన్న మాజీ సైనిక వితంతువులు, పెన్షన్ లేని మాజీ సైనికులు హైదరాబాద్ ఇందిరమ్మ హౌసింగ్ పథకం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి వనజ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు తెలంగాణ నివాసి అయి కుటుంబంలో ఎవరికి సొంత ఇల్లు ఉండరాదని, తక్కువ ఆదాయం కలిగి ఉండాలని, ఇంతకుముందు ప్రభుత్వ పథకాల ద్వారా గృహ ప్రయోజనం పొంది ఉండరాదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం జతచేసి తమ దరఖాస్తులను ఈ నెల 12లోగా నల్లగొండలోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని కోరారు. నీటి వనరులను సంరక్షించుకోవాలిమర్రిగూడ (చింతపల్లి) : నీటి వనరుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. జల సంచయ్ జన భాగీరథీ కార్యక్రమంలో భాగంగా బుధవారం చింతపల్లి మండలం కొడకొండ్ల గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో నీటి నిల్వ కోసం నీటి కుంటలు నిర్మించుకోవాలన్నారు. వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు వాలుకు అడ్డంగా రాళ్ల కట్టలు నిర్మించడం, గుట్టల ప్రాంతాల్లో కందకాలు తవ్వడం వంటి పనులు చేపట్టడం ద్వారా నేల కోతను నివారించవచ్చన్నారు. నీటి వనరుల సంరక్షణపై అవగాహన పెంపొందించి భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సదస్సులో ఎంపీడీఓ సుజాత, సర్పంచ్ కాశగోని వెంకటయ్య, ఏపీఓ శౌరిరెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ఆలేరులో 12న ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశంనల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దినేష్ గార్డెన్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలి
మిర్యాలగూడ : అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బాధ్యతగా వ్యవహరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్నేతతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రభుత్వంపై విశ్వాసం పెంచే దిశగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడంలోనూ బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో మాసనపల్లి లింగాజి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి -
ధాన్యం తూకాల్లో మాయాజాలం
ధాన్యం తూకాల్లో రైతులకు అన్యా యం జరిగింది. కేంద్రంలో తూకం లెక్కకు, మిల్లు వద్ద తూకానికి 14క్వింటాళ్లు తక్కువగా చూపడం దారుణం. అధికారులే న్యాయం చేయాలి. – గాదరి ప్రసాద్, రైతు, అయిటిపాముల కట్టంగూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా కట్టంగూర్ మండలం అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో అక్రమాలు వెలుగు చూడడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలో కాంటా వేసిన ధాన్యం లెక్కకు, రైస్ మిల్లులో వేసిన లెక్కకు పొంతన లేకుండా పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈనెల 6న అయిటిపాముల కొనుగోలు కేంద్రంలో రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్యకు చెందిన 27 బస్తాల చొప్పున మొత్తం 634 బస్తాల ధాన్యాన్ని కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు 42 కేజీల చొప్పున కాంటా వేసి మొత్తం 266 క్వింటాళ్ల ధాన్యం రికార్డులో నమోదు చేశారు. అనంతరం ఈ ధాన్యానిన చెర్వుఅన్నారం గ్రామంలో ఉన్న శివసాయి రైస్ మిల్లుకు తరలించారు. 14.65 క్వింటాళ్లు తక్కువగా చూపారు! లారీ రైస్మిల్లు చేరుకున్నాక దిగుమతి సమయంలో మిల్లు యాజమాన్యం ఒక్కో బస్తాకు 2 కేజీల చొప్పున తరుగు తీసి 40 కేజీల చొప్పున తిరిగి తూకం వేశారు. ఈ క్రమంలో ఏకంగా 14.65 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపించడంతో రైతులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇదేమిటని మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఐకేపీ కేంద్ర నిర్వాహకులనే అడగండి అని సమాధానం ఇచ్చినట్లు రైతులు తెలిపారు. తీరా కేంద్రం నిర్వాహకులను నిలదీస్తే మాకేమీ తెలియదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరుపుతాము.. ఇదే విషయమై సివిల్ సప్లయ్ డీటీ ఆర్.జ్యోతిని వివరణ కోరగా ధాన్యం తూకంలో భారీ మొత్తంలో తక్కువగా రావటానికి ఆస్కారం లేదని చెప్పారు. దీనిపై తక్షణమే స్పందించి రైస్మిల్లు యాజమాన్యంతో పాటు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.కేంద్రంలో ఒక లెక్క.. మిల్లులో మరో లెక్క! ఫ అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో తాజాగా వెలుగుచూసిన మోసం ఫ 266 క్వింటాళ్ల ధాన్యానికి 14.65 క్వింటాళ్ల తరుగు ఫ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతుల ఆవేదన -
పూర్తికావొచ్చిన ఫ్లైఓవర్
ఫ పెద్దకాపర్తి వద్ద 700 మీటర్ల పొడవుతో నిర్మాణం ఫ త్వరలోనే ప్రారంభానికి సన్నాహాలు చిట్యాల : జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ నియంత్రణతోపాటు వాహనాలు వేగంగా వెళ్లేందుకు చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ప్రస్తుతం ఫ్లై ఓవర్పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. త్వరలోనే ఈ ఫ్లై ఓవర్ని అధికారికంగా ప్రారంభించేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేలా.. జాతీయ రహదారిపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు గతంలో ఉన్న ఫ్లై ఓవర్ కింద నుంచి పెద్దకాపర్తి మీదుగా రామన్నపేట, చిన్నకాపర్తికి వెళ్లే వాహనాలకు ఇక్కట్లు కలిగేవి. అంతేకాకుండా పెద్దకాపర్తి వద్ద సాధారణ రోజులతోపాటు వారాంతపు సెలవులు, దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయేవి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఇబ్బందులను తొలగించేందుకు 21 జూన్ 2024లో పెద్దకాపర్తి వద్ద హైవేపై ఫ్లై ఓవర్ నిర్మించేందుకు నిర్ణయించారు. 700 మీటర్లు.. రూ.30 కోట్లు పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై 700 మీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.30 కోట్లు కేటాయించింది.ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో పెద్దకాపర్తి వద్ద తరచుగా జరిగే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు వాహనదారులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోనున్నారు. -
గ్యాస్ ‘సీరియల్’ కష్టాలు
నిడమనూరు : గ్యాస్ సిలిండర్ కోసం నిడమనూరులో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్లను సీరియల్లో పెట్టి ఎండలో వేచిచూస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదాము వద్ద 200 మీటర్లకు పైగా వరుసగా 4 వందలకు పైగా సిలిండర్లు వరుస క్రమంలో పెట్టి బారులుదీరారు. ఆ ప్రాంతం అంతా గ్యాస్ కోసం వచ్చే వారి వాహనాలతో నిండిపోయింది. గ్రామీణ విత్రక్ పథకంలో మండలానికి గ్యాస్ ఏజెన్సీ కేటాయించినప్పటికీ నిడమనూరు ఏజెన్సీ వారు నిడమనూరు మండలమే కాకుండా హాలియా, త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్) మండలాల్లో మొత్తం 25 వేల వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో వినియోగదారులకు డిమాండుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్లు అందించలేకపోతున్నారు. నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీకి వారానికి ఒకటి, రెండు లారీల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. సిలిండర్లు వచ్చిన రోజునే గోదాం వద్ద పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్యల లేదని కేవలం నిడమనూరులోనే గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా గ్యాస్ వినియోగదారుల డిమాండ్, బుకింగ్ ఆధారంగా గ్యాస్ పంపిణీ మెరుగుపడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నిడమనూరులోని గ్యాస్ ఏజెన్సీకి 25 వేల కనెక్షన్లు వారంలో రెండు రోజులే సరఫరా -
జిల్లా వ్యవసాయాధికారితో రేపు ‘ఫోన్ ఇన్’
వానాకాలం సీజన్ ఆరంభమైంది. ఈ సమయంలో విత్తనాల ఎంపిక, భూసార పరిరక్షణ, ఎరువుల వాడకం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల సమాచారం, నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర విషయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’.. వ్యవసాయ అధికారితో ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు నేరుగా జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్కి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.తేది. 11.06.2026 గురువారం సమయం : ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 89777 51294 -
కాంటా వేసినా కల్లాల్లోనే..
మాడుగులపల్లి : కాలం ముంచుకొస్తున్నా అన్నదాతలకు యాసంగి ధాన్యం అమ్మకం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షాలు భయపెడుతుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం, రవాణా సౌకర్యాల లేమి రైతులను దెబ్బ తీస్తున్నాయి. మాడ్గులపల్లి మండల పరిధిలోని గండ్రవానిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి గండ్రవానిగూడెం కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పది రోజులుగా కాంటాలు వేసిన ధాన్యం అక్కడే ఉంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి దాదాపు 5 నుంచి 6 లారీల ధాన్యం బస్తాలు తడిశాయి. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కటే లారీ.. నాలుగు రోజుల నిరీక్షణ గండ్రవానిగూడెం కేంద్రానికి రవాణా కాంట్రాక్టర్ కేవలం ఒకే ఒక్క లారీని కేటాయించడం గమనార్హం. ఇక్కడి నుంచి మిల్లులకు వెళ్లిన ఆ లారీ.. అక్కడ అన్లోడ్ అయి తిరిగి ఈ కేంద్రానికి రావడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోంది. ఆ లారీ తిరిగి వస్తేనే ఇక్కడ ధాన్యం తరలించేది.రైతుల ఆందోళన మంగళవారం అద్దంకి – నార్కట్పల్లి రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై వేసి ఆందోళన చేపట్టారు. కాంటాలు వేసి 25 రోజులైనా ఇప్పటివరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆందోణ కొనసాగడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సీఈవో రవీంద్రరావు వచ్చి తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. తాను ఉన్నతాధికారులతో మాట్లాడానని బుధవారం వరకు ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరవించారు. ఫ వర్షాలకు తడుస్తున్న ధాన్యం ఫ లారీల కొరతతో తరలింపు ఆలస్యం ఫ ధాన్యం ఎగుమతి చేయాలని కుక్కడం వద్ద రోడ్డెక్కిన రైతులు -
స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేయాలి
హాలియా : పాఠశాలల పునః ప్రారంభంలోపే పాఠశాలలు, హాస్టళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. హాలియా పట్టణంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్సీ బాలికల హాస్టల్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పట్టణంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది తదితర విషయాలపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్తో చర్చించారు. అనంతరం స్థానిక కేజీబీవీని తనిఖీ చేసి పాఠశాలలో టాయిలెట్లు, తాగునీటి వసతి ఉండేలా చూడాలని డీఈఓ సుశీందర్రావును ఆదేశించారు. సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సీ బాలికల హాస్టల్లో మరమ్మతు పనులు పరిశీలించి హాస్టల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డికి సూచించారు. బీసీ బాలికల వసతి గృహంలో సౌకర్యాలు, స్టోర్ రూం, డార్మెటరీని తనిఖీ చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణలో చేపట్టిన తాగునీటి ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోగా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వరు, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గౌని రాజారమేష్ యాదవ్, కమిషనర్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు, డిప్యూటీ ఇంజనీర్ విభాగం అధికారులు తదితరులు ఉన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
కంకణబద్ధులై పనిచేయాలి
దేవరకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పార్టీ బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) కంకణబద్ధులై పని చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, శాసనమండలి విప్ బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓటరు సవరణ కార్యక్రమాన్ని తమ రాజకీయ విస్తరణకు ఉపయోగించుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ట్రైనర్ ప్రతాప్రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక, ఎంఏ సిరాజ్ఖాన్, వేణుధర్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వడ్త్యా దేవేందర్, నాయిని మాధవరెడ్డి, ముక్కమళ్ల వెంకటయ్య పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలునాయక్ -
బీఎల్ఏలు కాంగ్రెస్ పార్టీకి పునాది
హాలియా : బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కాంగ్రెస్ పార్టీకి పునాది అని శాసనమండలి విప్ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షుడు కైలాష్నేత అన్నారు. హాలియాలో మంగళవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గం బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వారు ముఖ్య మాట్లాడారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, పటిష్టత కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. బీఎల్ఏలు ఓటర్ల నమోదు సమయంలో అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి ఒక్క ఓటును నమోదు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కర్నాటి లింగారెడ్డి, శిక్షణ అసెంబ్లీ ఇన్చార్జి ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, వివిధ మండలాల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సర్వయ్య, కృష్ణనాయక్, రామేశ్వరి, అంబటి సోమయ్య, నాయకులు మజహర్ మైనొద్దీన్, పాండునాయక్, బానుచందర్రెడ్డి, పద్మ ఉన్నారు. -
‘నక్ష’ సర్వేపై అపోహలు వద్దు
● సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్ మిర్యాలగూడ టౌన్ : భూ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు పట్టణంలో ఆస్తులకు కచ్చితమైన హద్దులను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష సర్వేపై ప్రజలకు ఆపోహలు వద్దని నక్ష సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నక్ష సర్వేపై రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్ష సర్వేలో భాగంగా పట్టణంలో ప్రతి ఇంటిని, అస్తులను పక్కాగా సర్వే చేస్తామన్నారు. అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా గృహాలు, భవనాలు, ఖాళీ స్థలాలు మ్యాపింగ్ చేస్తామన్నారు. పట్టణ సర్వే అధికారులకు సహరించాలన్నారు. జూలై చివరి వరకు ఈ నక్ష సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నక్ష సర్వే డీఐ శ్రీనివాస్రెడ్డి, పవన్, మేనేజర్ జ్ఞానేశ్వరి తదితరులున్నారు. ఎంజీయూలో ‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజర్ కాలేజీల ఆధ్వర్యంలో ‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ల్రైబరీని యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ల్రైబరీ నిర్వహిస్తారని తెలిపారు. లైబ్రరీలో విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలు, సాహిత్య, అకడమిక్ పుస్తకాలను అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జి ప్రేమ్సాగర్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, అరుణప్రియ, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. నేడు మంత్రి రాకనల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9 గంటలకు నల్లగొండకు చేరుకుని.. 10 గంటలకు నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంత్రి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొని.. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరి వెళతారు. డీఎంహెచ్ఓ బదిలీనల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన స్పౌజ్ కింద హైదరాదాద్ జిల్లాకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బదిలీచేశారు. ఈయన స్థానంలో డీంఎహెచ్ఓగా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 43 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా జయలతనల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా డాక్టర్ జయలత బదిలీపై వచ్చారు. ఆమె సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ బదిలీపై న్లగొండకు వచ్చారు. సోమవారం ఆమె.. ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నర్సింహారావు నేత నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యులు, మెడికల్ కళాశాల బాధ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలినల్లగొండ : ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్నాయక్ పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్నాంపల్లి : మండలంలోని షర్బాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బేక్కం వీరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం డీఈవో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయుడి కుటుంబ కలహాల్లో భాగంగా ప్రజావాణిలో పలు ఫిర్యాదులు రావడం, ఆయన తన భార్య పేరు మీద చిట్టీలు వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలిరామగిరి (నల్లగొండ) : రైతులందరు తప్పనిసరిగా పార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లిలో నిర్వహించిన ఫార్మర్ రిజిస్ట్రీ క్యాంపెయిన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు రిజిస్ట్రీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ సుంకోజు శ్రీనివాస్, ఏఈఓ శోభ, గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీ ‘బడి’బాట
రెండున్నర ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లల పేర్లు నమోదు చేయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మమాట–అంగన్వాడీ బాట అనే బడిబాట చేపడుతున్నాం. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తాం. బడిఈడు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – కృష్ణవేణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, నల్లగొండ మిర్యాలగూడ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట–పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తోంది. అందులో భాగంగా అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్వాడీ బడిబాట’ పేరుతో అంగన్వాడీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగుతూ రెండున్నరేళ్ల చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా.. ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేస్తున్నారు. తొమ్మిది ప్రాజెక్టులు జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. భోజనం, బ్రేక్ఫాస్ట్ ఒకే దగ్గర అందేలా.. అంగన్వాడీకి వచ్చే చిన్నారులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉంటారు. వారికి ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తారు. వీరికి కేంద్రంలోనే బ్రేక్ఫాస్ట్గా చిరుధాన్యాలతో కూడిన ఉప్మా, మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు గుడ్డు అందివ్వనున్నారు. ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఫ 15వ తేదీనుంచి ప్రత్యేక కార్యక్రమం ఫ రెండున్నరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీల్లో పూర్వప్రాథమిక విద్య ఫ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఇలా.. 6 నెలల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 72,474 బాలింతలు 5316 -
కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నకిరేకల్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తా సమన్వయంతో పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ టైనర్ ఎండీ నూమాన్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు అవగాహన కలిగి ఉండి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తించి పదవులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, లక్ష్మీనర్సు, మల్లారెడ్డి, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్ పాల్గొన్నారు.ఫ ఏఐసీసీ ట్రైనర్ ఎండీ.నూమాన్ -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
దేవరకొండ : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్స్థాయి ప్రజావాణిలో కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో వచ్చే ప్రజావాణి సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం కావాలని, ఒకసారి వచ్చిన ఫిర్యాదుదారుడు మళ్లీ రాకుడదని చెప్పారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో ఎఫ్టీఎల్ నిర్ధారించాలని.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ రానున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పద్మప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జూలై చివరి నాటికి ‘నక్ష’ సర్వే పూర్తిచేస్తాం
మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో చేపట్టిన ‘నక్ష సర్వే’ను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. నక్ష సర్వేకు పైలట్ పథకం కింద ఎంపికై న మున్సిపాలిటీల్లో సర్వే పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎంపికై ందని ఇందులో ఇండ్లు, భవనాలు, ఖాళీ స్థలాల కచ్చితమైన మ్యాపింగ్ కోసం సర్వే వేగంగా జరుగుతుందన్నారు. సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు మొత్తం 32 వార్డులను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం 356 బ్లాకులు, 43 వ్యవసాయ బ్లాకులు, 313 భవనాల బ్లాకులుగా విభజించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25వేల ఆస్తులను గుర్తించగా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర శ్రమతో ఇప్పటివరకు 9,375 ఆస్తులకు సంబంధించిన డిజిటల్ సర్వేను పూర్తి చేసి రికార్డు స్థాయిలో 37శాతం ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు వార్డుల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భూములు, ఇళ్ల సమగ్ర మ్యాపింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తంగా 14 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించినట్లు కలెక్టర్ వివరించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రయాణికురాలి నుంచి బస్సు యజమానులుగా మహిళలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మహిళల ఆర్థిక స్వావలంభనకు మరో అడుగు పడింది. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ప్రతి మండల సమాఖ్యకు ప్రభుత్వం ఒక్కో బస్సును కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో 32 మహిళా సమాఖ్యలకు 32 బస్లను అందజేస్తోంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆర్టీసీకి ఈ బస్సులను అద్దెకు ఇవ్వడంతో ఒక్కో సమాఖ్యకు ప్రతినెలా అదనపు ఆదాయం సమకూరనుంది. మహిళల ఆర్థిక సాధికారితకు, ఆత్మ విశ్వాసానికి, స్వయం సమృద్ధికి ఈ బస్సులు ప్రతీకలుగా నిలువనున్నాయి. ఈ బస్సులతో మహిళలు యాజమానులుగా మారనున్నారు. ప్రభుత్వం రూ.30 లక్షలు, మహిళా సమాఖ్య రూ.6 లక్షలు మహిళా సమాఖ్యలకు అందజేస్తున్న ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు. ఇందులో కమ్యూనిటీ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (సీఐఎఫ్) ద్వారా ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.30 లక్షలు అందించగా, సంబంధిత మహిళా సమాఖ్యలు రూ.6 లక్షలు వాటాగా చెల్లించాయి. దాని ద్వారా బస్లను కొనుగోలు చేసి వాటన్నింటిని ఆర్టీసీకి అప్పగించారు. మహిళా అభివృద్ధికి వేదిక ఇందిరమ్మ మహిళా శక్తి పథకం మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా గాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రతి నియోజక వర్గంలో ఇప్పటికే మహిళా శక్తి భవనాలు నిర్మించుకున్నారు. జిల్లాలో రాష్ట్రస్థాయి నుంచి ఒక పెట్రోల్ బంక్ మంజూరైంది. అది నిర్మాణ దశలో ఉంది. జిల్లా స్థాయి నుంచి మరో 3 బంక్ల ఏర్పాటుకు భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మూడు రైస్ మిల్లుల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నారు. తిరుమలగిరిసాగర్ అల్వాల, చండూరు మండల కేంద్రంలో సోలార్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 32 బస్లు రావడంతో వారికి మరింత ఆర్థిక తోడ్పాటు దక్కనుంది. నార్కట్పల్లి మహిళా సమాఖ్య బస్సుఫ జిల్లాలోని 32 మండల మహిళా సమాఖ్యలకు 32 బస్సులు ఫ ఒక్కో బస్ విలువ రూ.36 లక్షలు ఫ ప్రతి నెలా రూ.69,468 అద్దె చెల్లించనున్న ఆర్టీసీ ఫ మహిళల ఆర్థిక సాధికారితకు ప్రతీకగా నిలువనున్న బస్సులుసూర్యాపేటకు 23, యాదాద్రికి 17 నల్లగొండ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు 32 బస్సులను కేటాయించిన ప్రభుత్వం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండల సమాఖ్యలకు 17 బస్సులు కేటాయించింది. సూర్యాపేట జిల్లాకు 23 బస్సులు వచ్చాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు 72 బస్సులు కేటాయించారు. -
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండది మొదటి స్థానం
మిర్యాలగూడ : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్లో 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 96,769 మంది రైతుల నుంచి రూ.1789 కోట్ల విలువైన 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 2.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1570 కోట్లు జమ చేశామని, ఇంకా రూ.190కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్ల నుంచి 22వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరించామన్నారు. యాదాద్రి జిల్లా నుంచి మరో 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
వంతెన శిథిలం.. భయంగా ప్రయాణం
ఫ నిర్లక్ష్యం నీడలో ఉప్పలపహాడ్ మూసీ బ్రిడ్జి ఫ కూలిన రక్షణ గోడలు, పట్టించుకోని అధికారులుకేతేపల్లి : మూసీ నదిపై నిజాం కాలంలో నిర్మించిన చారిత్రాత్మక వంతెన నిర్వహణను పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరింది. 2010లో 65వ నంబర్ జాతీయ రహదారి నాలుగులేన్లుగా విస్తరించిన సమయంలో కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్, సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామాల మధ్య మూసీ నదిపై వారధిగా ఉన్న ఈ వంతెనకు సమాంతరంగా రెండు వరుసలుగా నూతనంగా మరో వంతెన నిర్మించారు. అప్పటి నుంచి ఈ పాత వంతెనను అధికారులు పట్టించకోవడం లేదు. ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వంతెన రెయిలింగ్ దిమ్మెలను పగులగొట్టి అందులో ఉన్న ఇనుపరాడ్లను దుండుగులు ఎత్తుకెళ్లారు. వంతెనపై రాగి చెట్లు మొలుస్తుండటంతో వంతెన గోడల పగుళ్లు ఏర్పడుతున్నాయి. వర్షం నీరు కిందకు పోయే రంద్రాలు మూసుకపోవటంతో వంతెనపై నీరు నిలిచి గుంతలు ఏర్పడి రోడ్డు ధ్వంసమవుతోంది. నిత్యం వాహనాల రాకపోకలు.. సూర్యాపేట నుంచి మిర్యాలగూడ సుమారు 25 గ్రామాలను కలుపుతూ వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంది. పాత వంతెన పైనుంచే మండలంలోని ఉప్పలపహాడ్, తుంగతుర్తి, చెర్కుపల్లి గ్రామాలతో పాటు నకిరేకల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనాలు ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెనకు ఇరువైపుల ఉన్న రక్షణ దిమ్మెలు ధ్వంసం కావడంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పాత వంతెనకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
శాలిగౌరారం ప్రాజెక్టుకు వరద
ఫ 11 అడుగులకు చేరిన నీటిమట్టం శాలిగౌరారం : జిల్లాలో మద్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మూసీనదిపై ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ భాగాన శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరువచ్చేందుకు పల్లివాడ వద్ద నిర్మించిన ఆనకట్ట చివరిది. పల్లివాడ ఆనకట్టకు ఎగువభాగంలో అసిఫ్నహర్, భీమలింగం, ధర్మారెడ్డి, బునాదిగాని, పిల్లాయిపల్లి, బాచారం ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఆనకట్టల వద్ద మూసీనదికి ఇరువైపుల ఉన్న కాలువల పరిధిలో ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో మూసీనది ప్రవాహం నేరుగా పల్లివాడ ఆనకట్ట మీదుగా మూసీనదిలోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పల్లివాడ ఆనకట్ట వద్ద ఉన్న హెడ్రెగ్యూలేటర్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టు రాచకాల్వలోకి నీటిని మళ్లించడంతో మూసీనదిలోని వరదనీరు శాలిగౌరారం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. పక్షం రోజుల్లో 11 అడుగులకు చేరిన నీటిమట్టం.. శాలిగౌరారం ప్రాజెక్టు 1200 ఎకరాల విస్తీర్ణంలో 21 అడుగుల నీటి సామర్థ్యంతో 6 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉంది. గడిచిన యాసంగి పంటకు నీటిని నిలిపివేసేనాటికి ప్రాజెక్టు నీటిమట్టం 4 అడుగులకు పడిపోయింది. గతనెల 24 నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో 15 రోజుల్లో ప్రాజెక్టు నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం సీజన్కు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
వేములపల్లి : ఇల్లు లేని ప్రతి పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో 14 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోపాటు మహిళా సంఘ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో 931 మహిళా సంఘ భవనాల ఏర్పాటుతో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రభాగంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని, ఇప్పటికే 7.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సాదాబైనామా దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు సుమారు 4కిలోల వరకు తరుగు తీసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని రైతులు వారికి ఫిర్యాదు చేశారు. దానిపై సమగ్ర విచారణ చేపట్టి తనకు నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే పల్లెబాట.. ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోని వాటిని పరిష్కరించి తగిన న్యాయం చేసేందుకు ‘ప్రగతి సింగిడి జనంతో మాట పల్లె బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, రాబోవు రెండున్నర సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాలను అనుసంధానం చేయడమే ప్రగతి సింగిడి అన్నారు. ఈనెల 15 తరువాత వారంలో ఐదు రోజులపాటు నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి రాత్రి ఆ గ్రామాల్లో బసచేసి తెల్లారి ఉదయం అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్రాజు, సీఐ పీఎన్డీ.ప్రసాద్, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జితేందర్రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్లు పిల్లల సందీప్, ఝెల్లికట్టి భరత్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సయ్యద్ జాని, నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్నాయక్, మాలి కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, దేశబోయిన రవికుమార్, బంటు చొక్కయ్యగౌడ్, రేగట్టె రవీందర్రెడ్డి, బ్రహ్మదేవర విద్యాసాగర్, తాళ్ల వెంకటేశ్వర్లు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ ఆమనగల్లులో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు -
పూర్వవైభవం దక్కేనా..!
సంస్థాన్ నారాయణపురంలోని సదరన్ ఆన్లైన్ బయో టెక్నాలజీస్ లిమిటెడ్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. - 8లోకొండమల్లేపల్లి మండలంలోని కొర్రోనితండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండటంతో మూడేళ్ల క్రితం మూసివేశారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యాశాఖ అధికారుల కృషితో 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. -
ముగిసిన ‘థ్రెడ్. పోచంపల్లి’ ఎగ్జిబిషన్
భూదాన్పోచంపల్లి : హైదరాబాద్లోని హైటెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీలపై ఉక్కుపాదం
దేవరకొండ : విత్తనాల విషయంలో రైతులు మోసాలకు గురికాకుండా నాణ్యమైన విత్తనాలతో పంటలు సాగు చేసేలా సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగు కోసం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 12,02,051 ఎకరాల్లో సాగు అంచనా.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానిలో వరి 5,86,137 ఎకరాల్లో, పత్తి 5,30,524 ఎకరాల్లో, కంది 14 వేల ఎకరాల్లో, ఇతర పంటలు కలిపి మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నకిలీ విత్తనాలతోరైతులకు నష్టం గతంలో కొందరు దళారులు ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అంటగట్టిన ఘటనలు ఉన్నాయి. ఆ విత్తనాలు సాగు చేసిన రైతులు పంట దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని దుకాణదారులను ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి రశీదు ఇవ్వాలని, స్టాక్ వివరాలను డిస్ ప్లే చేయాలని దుకాణాదారులకు సూచిస్తున్నారు. రైతులు గ్రామాల్లో దళారులను నమ్మి మోసపోకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం ఉంటే అధికారులకు తెలియపర్చాలని కోరుతున్నారు. ఫ విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు ఫ నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని ఆదేశాలు ఫ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచన -
ఆర్టీసీ ఆర్ఎం బదిలీ
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నల్లగొండ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో నూతన రీజనల్ మేనేజర్గా ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు నల్లగొండ రీజనల్ మేనేజర్గా సేవలందించిన జానిరెడ్డి హైదరాబాద్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా బదిలీ అయ్యారు. 15న పాఠశాలల పునః ప్రారంభంనల్లగొండ : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పునః ప్రారంభ తేదీని ప్రభుత్వం మార్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం జూన్ 15న పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే విద్యా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పని దినంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు ఈ నెల 15న తెరుచుకోనున్నాయి. పాఠ్యపుస్తకాల రచయితగా మల్లేష్నకిరేకల్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సవంత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం, ఏపీలో ద్వితీయ సంవత్సరం జీవశాస్త్రం తెలుగు మాధ్యమ పాఠ్యపుస్తకాల రచయితగా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన మోదాల మల్లేష్కు అవకాశం దక్కింది. గతంలో తెలుగు అకాడమీ నుంచి ప్రచురితమైన గ్రూప్–1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలు (ఆంగ్లమం, తెలుగుమాధ్యమం) రచనలో ఆయన భాగస్వామి అయ్యారు. డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పుస్తక రచనలో కూడ సహ రచయితగా ఉన్నారు. టీజీ–20 అనురాగ్ నల్లగొండ నైట్స్ జట్టు ఫ 20 మంది క్రికెటర్లను వేలంలో దక్కించుకున్న ఫ్రాంచైజీనల్లగొండ టూటౌన్ : యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) చేపట్టిన టీజీ–20 క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలం ఆదివారం ముగిసింది. హైదరాబాద్లో నిర్వహించిన వేలంలో ఫ్రాంచైజీ అనురాగ్ నల్లగొండ నైట్స్ భారీ ధర చెల్లించి క్రీడాకారులను దక్కించుకుంది. టీమ్కు అవసరమైన 20 మందిని వేలం ద్వారా దక్కించుకున్నారు. ఆటగాళ్లలో ఎండీ.అర్ఫాజ్అహ్మద్ (రూ. 11 లక్షలు), రాహుల్ బుద్ది (రూ.8 లక్షలు), చింతల రక్షణ్రెడ్డి (రూ.6 లక్షలు), పాట్కూరి నితీష్రెడ్డి (రూ.5.50 లక్షలు), నిశాంత్ సరను (రూ.5.50 లక్షలు), అనికేత్రెడ్డి (రూ.4.75 లక్షలు), ఎలగాని వరుణ్గౌడ్ (రూ.3.50 లక్షలు), ప్రణవ్ సూర్యదేవర (రూ.2.50 లక్షలు), ఇళ్యాన్ సతని (రూ.1 లక్ష) హర్షవర్ధన్సింగ్ (రూ.1 లక్ష), చిన్నుగారి రుత్విక్, డివేష్ సింగ్, జస్వంత్ మోతె, విక్రాంత్రెడ్డి, షేక్ సమీర్, షేక్ సోహెల్, బీరవోలు నాగసుధామ్స్రెడ్డి, శ్రీకాంత్, ఉర్వేష్ కక్కడ్ ఒకొక్కరికి రూ.75 వేల చొప్పున్న చెల్లించి దక్కించుకున్నారు. ఆటోమిషన్ ఆధునీకరణకు ప్రతిపాదనలు పంపాంనాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్నిగేట్లను సమర్థవంతంగా ఎత్తేందుకు వినియోగించే ఆటోమిషన్ ఆధునీకరణకు తయారు చేసిన అంచానాలను రాష్ట్రప్రభుత్వ పరిపాలన అనుమతి కోసం పంపినట్లు సాగర్డ్యాం ఇంజనీర్లు తెలిపారు. గతంలో ఆంధ్రా అధికారులు ధ్వంసం చేసిన పరికరాలను పునరుద్ధరించేందుకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.29.2 లక్షల ఖర్చుతో ఆటోమిషన్ పరికరాలకు మరమ్మతులు చేసి గేట్ల నియంత్రణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆధునాతన ఎస్సీఏడీఏ వెర్షన్ కోసం రూ.43.20 లక్షల అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పరిపాలన ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఆధునీకరించి.. 100శాతం రిమోట్ ఆపరేషన్తో పాటు మ్యానువల్ తనిఖీలతో గేట్లను ఎత్తి దింపనున్నట్లు పేర్కొన్నారు. -
కిక్కిరిసిన పశువుల సంత
బీజేపీని బలోపేతం చేయాలి బూత్ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.- 8లోకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత ఆదివారం కిక్కిరిసిపోయింది. రైతులు సాగు పనులు ప్రారంభించడం, రోహిణి కార్తె పూర్తయి.. మృగశిర కార్తె రావడం, వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి విత్తనాలు వేసేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు ఎక్కువగా అరకదున్నే ఎద్దుల కొనుగోలు చేసి పంట చేలు పూర్తయ్యాక వాటిని తిరిగి అమ్ముతుంటారు. అందులో భాగంగానే ప్రతి వేసవికాలంలో మృగశిర కార్తె ముగింపు వరకు పశువుల క్రయ విక్రయాలు కొండమల్లేపల్లిలో ఎక్కువగా జరుగుతాయి. ఆదివారం అరక దున్నే ఎద్దుల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. సంతలో జత ఎద్దులకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్ష వరకు ధర ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. -
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
నల్లగొండ టౌన్ : విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరనీయుడన్నారు. తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమెను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, విశ్వనాథం, సత్యనారాయణ, రమణాచారి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేంద్రబాబు, శోభారాణి, రఘువీర్ ప్రతాప్, షణ్ముఖచారి పాల్గొన్నారు. ఫ తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ -
నల్లగొండ, మిర్యాలగూడలో భారీగా పెరిగిన భూముల విలువ
కమర్షియల్ స్థలాలకు పెరిగిన విలువలు ఇలా.. (రూ.లలో/గజం) పాత ధరకొత్త ధరసాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడలో భూ విలువలు భారీగా పెరిగాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఈ రెండు ప్రాంతాల్లోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడలో కమర్షియల్ ప్లాట్లు గతంలో గజానికి రూ.31,800 ఉండగా ప్రస్తుతం అది 40,700 (21.86 శాతం) పెరిగింది. ఈ రెండు పట్టణాల్లో అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విలువల కూడా భారీగా పెరిగింది. ప్రాంతాల వారీగా వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల విలువలను సమరించింది. సవరించిన విలువలను శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్టంగా 15 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెంపు ఉండడంతో ప్రజలపై భారం పడుతోంది. హాలియాలో ఎకరం రూ.80 లక్షలు.. వ్యవసాయ భూములకు సంబంధించి జిల్లాలో హాలియాలో ఎకరానికి కనిష్టంగా రూ.5 లక్షలు ఉండగా.. హైవే వెంట రూ.80 లక్షలకు పెరిగింది. మునుగోడులో కనిష్టంగా రూ.4.50 లక్షలు ఉండగా అత్యధికంగా 6.75 లక్షలు ఉంది. పెద్దవూరలో అత్యధికంగా రూ.55 లక్షలు ఉండగా తక్కువగా రూ.5 లక్షల వరకు ఉంది. నిడమనూరులో తక్కువగా రూ.5,11,875 ఉండగా ఎక్కువగా రూ.8,58,375 లక్షలకు పెరిగింది. చిట్యాలలో హైవే వెంట వట్టిమర్తి వద్ద రూ.63 లక్షలకు పెరగగా.. ఎలికట్టెలో రూ.5.40 లక్షలుగా ఉంది. కొండమల్లేపల్లిలో అతి తక్కువగా రూ.4.50 లక్షలు ఉండగా.. అత్యధికంగా రూ.76 లక్షలకు పెరిగింది. వేములపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ ఇటిక్యాలలో రూ.30,50,200 ఉండగా.. తక్కువ చలిచీమలపాలెంలో రూ.6,75,000 ఉంది. నాంపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ తక్కువగా రూ.3,36,500 అత్యధికంగా రూ.16,33,500 ఉంది. చండూరు మండలంలోని చండూరులో గరిష్టంగా రూ.63,52,500 కాగా.. తక్కువగా కొండాపురంలో రూ.3,93,750గా ఉంది. అపార్ట్మెంట్ల విలువ పెరిగిందిలా.. నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడ పట్టణంలో అపార్ట్మెంట్లలో చదరపు అడుగుల విస్తీర్ణం ధరలు భారీగా పెరిగాయి. గతంలోకంటే ప్రాంతాన్ని బట్టి 20 శాతం నుంచి 50 శాతానికిపైగా పెంచింది. నల్లగొండలోని ప్రకాశం బజార్లో అపార్ట్మెంట్లలో చదరపు అడుగు మార్కెట్ విలువ గరిష్టంగా రూ.3 వేలకు పెంచగా, శివాజినగర్లో రూ.1,800లకు పెంచింది. మిర్యాలగూడలోనూ పోలీస్స్టేషన్ నుంచి ఓల్డ్ ఎంఆర్వో రోడ్లో కనిష్టంగా రూ.1800 చేయగా, మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి బ్రిడ్జి రోడ్డులో గరిష్టంగా రూ.3400లకు పెంచింది ఇళ్ల స్థలాల విలువలు భారీగా పెంపు.. ● నల్లగొండలో రెసిడెన్షియల్ విభాగంలో రూ.1,700 ఉన్న చోట రూ.2,600కు, రూ.2,400 నుంచి రూ.4,200కు పెంచారు. బొట్టుగూడలో రూ.2,400 నుంచి రూ.4,800కు, చర్లపల్లిలో రూ.3,100 నుంచి రూ.5,425కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గజానికి రూ.500 ఉన్న విలువను రూ.900కు పెంచారు. ● మిర్యాలగూడ మండలంలో గతంలో గజం ధర రూ.500 ఉండగా.. రూ.900కు పెంచారు. ● చింతపల్లి హైవే వెంట గజానికి రూ.4200, కనిష్టంగా ముస్లింవాడలో రూ.1600 ఉంది. ● మర్రిగూడలో హైదరాబాద్ రోడ్డులో గరిష్టంగా గజానికి రూ.2600 కాగా, కనిష్టంగా పడమటి వాడలో రూ.1500గా ఉంది. ప్రకాశం బజార్31,80040,7004,100మిర్యాలగూడ రోడ్డు6,00010,000వెంకటేశ్వర కాలనీ16,200గడియారం–రామగిరి మార్గం17,60026,000దేవరకొండ మెయిన్ రోడ్డు5,80027,1003,100అశోక్నగర్5,500ఫ 15 శాతం నుంచి 100 శాతం వరకు విలువల పెంపు ఫ ప్రాంతాల వారీగా సవరణ ఫ ప్రభుత్వానికి ఆదాయం.. జనంపై భారం వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లకు మార్కెట్ విలువ చూపించడం లేదు. మిర్యాలగూడ మండల పరిధిలోని జప్తి వీరప్పగూడెంలో సర్వేనంబర్ 157లో, కాల్వపల్లిలో సర్వేనంబర్ 1, తడకమళ్లలో సర్వేనంబర్ 15, మిర్యాలగూడ శివారులో సర్వే నంబర్ 110 ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి విలువ రూ.0 గా చూపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల విలువ పూర్తిస్థాయిలో అప్డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. -
వైద్యం సరిగా అందుతుందా..
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)ను కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అక్కడే వెల్నెస్ సెంటర్ను సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి–అడిక్షన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్.. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు తగు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సందర్శించిన కలెక్టర్.. గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించి మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు నేత, డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు పాల్గొన్నారు. ఫ జీజీహెచ్లో సేవలపై కలెక్టర్ ఆరా -
గుట్టను 20 మీటర్లు తవ్వడమెందుకు?
నల్లగొండ టూటౌన్ : బ్రహ్మంగారి, లతీఫ్ సాహెబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణానికి గుట్టను 20 మీటర్ల లోతు ఎందుకు తవ్వుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారనే అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ నగరంలోని గుట్టలపై జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా మునుగోడు హౌసింగ్బోర్డులో రాళ్లు పడి దెబ్బతిన్న ఇళ్లన్నాయన పరిశీలించారు. పేలుళ్ల వల్ల పెద్ద, పెద్ద రాళ్లు వచ్చి తమ నివాసాలపై పడడంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడినట్లు స్థానికులు భూపాల్రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు భయబ్రాంతులకు గురయ్యే విధంగా గుట్టలపై పేళుల్లు జరుపడం ఎంటని ప్రశ్నించారు. పేళుళ్ల దాటికి స్లాబ్లకు రంద్రాలు పడుతున్నా అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యత లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస పాంత్రాలలో బ్లాస్టింగ్కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఘాట్రోడ్డు నిర్మాణానికి డీపీఆర్, టెండర్ ప్రక్రియ ఉందో లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో మంజూరు చేసిన నిధులతో కాంగ్రెస్ నాయకులకు వెంచర్లు ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నాణ్యత లేకుండా వేసుకుంటున్నారని వివర్శించారు. వీటన్నింటిపై విచారణ జరిపి, బ్లాస్టింగ్ జరిపిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, నాయకులు మారగోని గణేష్, పెరిక కరణ్జయరాజ్, కుందూరు ప్రవీణ్రెడ్డి, గోపగాని రాజశేఖర్, దోటి శ్రీనివాస్, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన -
ప్రపంచంలోనే అరుదైనది మియాజాకి మామిడి
కిలో పండ్ల ధర రూ.రెండున్నర లక్షలు ఫ సిరిపురంలో పెంచుతున్న శేషుకుమార్ ఫ తొలిసారి కాతకొచ్చిన జపాన్ రకం మియాజాకి ఫ దేశీయ, విదేశీ రకాలను కూడా సాగుచేస్తున్న అభ్యుదయ రైతు నడిగూడెం : మామిడిని సాధారణంగా ఫలరాజు అంటుంటాం. అన్ని ఫలాల్లో కంటే రారాజుగా పిలువబడే మామిడిలో ప్రపంచంలోనే అరుదైనది.. అత్యంత ఖరీదైనది ‘మియాజాకి’ రకం. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన రైతు వాసికర్ల శేషుకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో మియాజాకి రకం మామిడిని సాగుచేస్తున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో ఆయన దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల మామిడి మొక్కలు పెంచుతున్నారు. అందులో మియాజాకి కూడా ఉంది. శేషుకుమార్ మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు రూ.1200 చొప్పున పెట్టి మూడు మొక్కలు తెచ్చి నాటగా ఒక మొక్క చనిపోయింది. మిగతా రెండు మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది తొలిసారిగా 20కి పైగా కాయలు కాశాయి. మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రెండున్నర లక్షల రూపాయల ఉంటుందని, ఈ రకం పండులో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయని రైతు శేషు కుమార్ తెలిపారు. కాయ ఎరుపు రంగులో 300 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. బంగినపల్లి, దశేరి, తోతాపూరి, హిమాయత్, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సా, చెరకు రసాలు, చిన్న రసాలు, నీలం, పండూరి మామిడి, కేసరి, తెల్ల గులాబి, ఆమ్రపాలి, ముంత మామిడి, మల్లిక, పందిరి మ్యాంగో, కస్తూరి మ్యాంగో తదితర రకాలు సాగులో ఉన్నాయి. ఆయన క్షేత్రంలో ఒక్కో రకం రెండు నుంచి మూడు మొక్కల చొప్పున సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను కడియం, జడ్చర్ల నుంచి తెచ్చినట్లు రైతు తెలిపారు. తాను పండించిన అరుదైన రకాలు జపాన్ రకం మియాజాకి, అమెరికన్ థామిట్ క్వీన్, కేసరి పండ్లను ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఐసీఏఆర్ డైరక్టర్ డాక్టర్. షేక్.మీరాకు అందజేశానని చెప్పారు. శేషుకుమార్ సాగుచేస్తున్న విదేశీ రకాలు ఇవీ..మియాజాకి, థామిట్ క్వీన్, నాసిక్ పసంద్, గోల్డెన్ మ్యాంగో, పర్పుల్ మ్యాంగో, ఫోర్ స్టోన్ మ్యాంగో, క్యాట్మెన్ మ్యాంగో, బన్సారా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, బర్సూన్ కింగ్, వర్వేటర్, బర్రి మ్యాంగో, టెన్కేజీ మ్యాంగో, బ్లాక్ స్టోన్ మ్యాంగో. గత ఐదేళ్ళుగా పండ్ల తోటలు, కూరగాయలు, అకు కూరలతో పాటు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా అర ఎకరంలో అధిక సాంద్రత పద్ధతిలో 270 మామిడి మొక్కలను సాగు చేస్తున్నాను. దేశ, విదేశాలలో ఉన్న దాదాపు అన్ని రకాలను సాగు చేస్తున్నా. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులను వాడకుండా సహజ సిద్ధంగా సాగు చేస్తున్నా. నిత్యం ఆదాయం పొందుతున్నాను. – వాసికర్ల శేషు కుమార్, అభ్యుదయ రైతు, సిరిపురం -
పిల్లలే మన భవిష్యత్తు
పిల్లలు తమ సమస్యలను స్వయంగా వ్యక్తపరిచి, సమాజ అభివృద్ధిలో చురుకై న భాగస్వాములుగా ఎదగడమే బాల పంచాయతీ ప్రధాన ఉద్దేశం. గ్రామానికి బస్సు సౌకర్యం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య ఇంకా ఏ ఇతర సమస్యలు వస్తే.. సంబంధిత శాఖ అధికారుల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులే వ్యక్తపరచడం. విద్య, ఆరోగ్యం, గ్రామ సమస్యలను గుర్తించి పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖ అధికారులకు చిన్నప్పటినుంచే చేరవేయడాన్ని విద్యార్థులు నేర్చుకోవాలి. వారి హక్కులు, బాధ్యతలను నేర్చుకోవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదిగేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కనగల్ : ‘పిల్లలే మన భవిష్యత్తు. వారికి సమయం ఇవ్వండి, వారి ఆలోచనలను వినండి, ప్రోత్సహించండి’ అని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు అన్నారు. కనగల్ మండలంలోని చర్లగౌరారం గ్రామంలో శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి ఎంతో ముఖ్యమన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్లో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. చిన్నారులు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని తెలిపారు. బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం యంగిస్థాన్ ఎన్జీఓ ఆశ్రిత బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలకరాజు సునీత వెంకటేశం, ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆదిరెడ్డి, రాము, కరుణాకర్, ఎస్ఐ అంజలి, రాజీవ్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈఓ సుశీందర్రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, ఆర్టీఏ మెంబర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కలపూరి నాగరాజు, చీదేటి సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ఫ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు ఫ చర్లగౌరారంలో బాల పంచాయతీ


