breaking news
Nalgonda District News
-
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో 15 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు ఇతర సిబ్బందితో కలిపి సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి ఇంక్ బాటిల్స్, పెన్నులు, మార్కర్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, పర్సులతోపాటు అనుమతి లేని సామగ్రి తీసుకురావొద్దన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడం వంటి కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అవంతీపురంలో కౌంటింగ్ కేంద్రం పరిశీలన మిర్యాలగూడ : మండలంలోని అవంతీపురం మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం ఎస్పీ శరత్చంద్రపవార్ పరిశీలించారు. కేంద్రంలో మాక్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్రాజు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వంతెనలు.. మృత్యుమార్గాలు
నిడమనూరు : మండల పరిధిలో నాగార్జున సాగర్ ఎడమకాల్వపై నిర్మించిన వంతెనలు (బ్రిడ్జిలు) మృత్యుమార్గాలుగా మారాయి. బ్రిడ్జిల వెంట రెయిలింగ్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముకుందాపురం వద్ద ఓ కారు కాల్వలో పడిన ఘటనలో దంపతుల ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు నేరుగా కాల్వలోకి ఉండటం, బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు వెంట బారికేడ్లు, కాల్వలోకి వెళ్లకుండా రాతి స్తంభాలు లేకపోవడంతో కాల్వలోకి కారు దూసుకెళ్లిందని ఘటన స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు నిర్ధారించారు. నాలుగు చోట్ల బ్రిడ్జిలు ఉన్నా.. సాగర్ ఎడమకాల్వపై నిడమనూరు మండలంలోని 28 కిలోమీటర్ వద్ద ముప్పారం, 32.5 కిలోమీటర్ వద్ద వేంపాడు, బొకమంతలపహాడ్, ముకుందాపురం గ్రామాల వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిలపై కొంతమేర మాత్రమే ఇనుప రెయిలింగ్ ఉండగా అప్రోచ్ రోడ్డు కాల్వ వెంట కొంతదూరం రెయిలింగ్ లేకపోవడంతో రోడ్డంతా కాల్వలోకి వెళ్లేలా ఉంటుంది. దీంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రాత్రి వేళల్లో కానీ, వేంపాడు, ముప్పారం గ్రామాలకు వెళ్లాలంటే మూలమలుపు వెంటనే కాల్వ కనిపిస్తోంది. 3 మీటర్ల పరిధిలో చిన్నగా బ్రిడ్జి కనిపిస్తోంది. బ్రిడ్జికి అప్రోచ్గా కొంత ఇనుప కంచె కానీ, గోడ నిర్మించాల్సి ఉంది. అయితే సాగర్ ఆధునీకరణ పనులు చేపడుతున్నప్పుడు బ్రిడ్జిల వెంట ఉన్న రాతి స్తంభాలు, బారికేడ్లను పూర్తిగా తొలగించారు. పనులు పూర్తయిన అనంతరం రక్షణ గోడలుకానీ బారికేడ్లు నిర్మించలేదు. అసంపూర్తి పనులు కూడా చేపట్టలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగతున్నాయి. ఇప్పటికై నా ఎన్ఎస్పీ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనల వద్ద ఇనుప కంచె కానీ రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పారం, వేంపాడు, ముకుందాపుర, బొకమంతలపహాడ్ వద్ద సాగర్ ఎడమకాల్వపై ఉన్న బ్రిడ్జిల వెంట రక్షణ గోడలు నిర్మించాలి. ముప్పా రం బ్రిడ్జి మీదుగా, ఊట్కూరు, సోమవారిగూడెం, ముప్పారం, నందికొండవారిగూడెం గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ప్రమాదాల నేపథ్యంలో రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. రక్షణ గోడలు నిర్మించాలి. – కేశబోయిన జానయ్య, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఊట్కూరు వేంపాడు, గుంటిపల్లి, ఎర్రబెల్లికి వెళ్లాలంటే వేంపాడు వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళలో పలు గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి వద్దకు రాగానే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వేంపాడు కాల్వ వెంట రోడ్డు మూలమలుపు ఉండటంతో దూరంగా ఉన్నప్పుడే కాల్వను, బ్రిడ్జిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్తోపాటు సూచికలు ఏర్పాటుచేయాలి. – మల్లికంటి కోటయ్య, రైతు, వేంపాడు ఫ ప్రమాదకరంగా సాగర్ ఎడమకాల్వపై బ్రిడ్జిలు ఫ కాల్వ ఆధునీకరణ పనుల్లో దెబ్బతిన్న రక్షణ గోడలు ఫ తాజాగా ముకుందాపురం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు ఫ ఈ ఘటనలో దంపతుల మృత్యువాత ఫ బ్రిడ్జిలపై రెయిలింగ్ ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు -
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి
పెద్దవూర : పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా గిరిజన సహాయ అభివృద్ధి అధికారి(ఏటీడీఓ) ఎం.శ్రీనివాస్ అన్నారు. గురువారం పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ మండలాల్లోని గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పెద్దవూర మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్లో నిర్వహించిన మోటీవేషనల్ (ప్రేరణ), కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సక్సెస్ అనేది ఒక్కరోజుతో వచ్చేది కాదని, అది నిరంతర సాధనతోనే సాధ్యమన్నారు. మీరు చేయాల్సిన పనిని తప్పులేకుండా శ్రద్ధతో చేయండి ఫలితం అదే వస్తుందన్నారు. పదవ తరగతి పూర్తయ్యాక ఏయే కోర్సులు ఉంటాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డీవీ.నాయక్, మోటీవేటర్ రవికుమార్, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం డీ.బాలోజీ, వార్డెన్లు కొల్లు బాలకృష్ణ, అహల్య, శ్రీనివాస్రెడ్డి, సుధాకర్, జైపాల్, ఆర్పీలు కూన్రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండి.షబ్బీర్, రాములు, దూద్యానాయక్ పాల్గొన్నారు. -
నేడే పుర కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం (ఈ నెల 13వ తేదీన) జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ అనంతరం మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూడు కేంద్రాల్లో కౌంటింగ్ నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావి వేర్హౌసింగ్ కార్పొరేషన్ గోదా ములో జరగనుంది. అలాగే మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మిర్యాలగూడలోని అవంతీపురం మార్కెట్ యార్డులో జరుగనుంది. ఇక, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నల్లగొండ సమీపంలోని ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న నిడమనూరు గురుకుల పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరిచి ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెటు బాక్సులను తెచ్చి టేబుళ్ల్లపై ఉంచుతారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా వార్డుల్లోని బ్యాలెట్ పేపర్లను పోలింగ్ స్టేషన్ల వారీగా ఇనిషియల్ కౌంటింగ్ చేస్తారు. పోలింగ్ జరిగిన రోజు బ్యాలెట్ పేపర్ల లెక్క, బ్యాలెట్ బాక్సులు తెరిచిన తరువాత అన్ని బ్యాలెట్ పేపర్లు ఉన్నాయా లేదా? అన్నది సరిచూస్తారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిల్గా కట్టి ఒక డ్రమ్ములో వేస్తారు. ఐదు మున్సిపాలిటీల ఫలితాలు 2గంటల వ్యవధిలోనే.. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో వార్డులు కేవలం 20లోపే ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 2 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయితే 2 గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 10గంటల లోపే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఉదయం 11.30 వరకు నల్లగొండ, మిర్యాలగూడ తుది ఫలితాలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మొదట పోస్టల్ బ్యాలెట్, ఇనిషియల్ ఓట్ల కౌంటింగ్తోపాటు బండిల్స్ కట్టే ప్రక్రియ 9 గంటల వరకు పూర్తికానుంది. ఆ తర్వాత ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. దాదాపు 3 వేలలోపే ఒక్కో వార్డులో ఓటర్లున్నారు. కొన్ని డివిజన్లు, వార్డుల్లో మాత్రమే 3 వేల పైచిలుకు ఓటర్లున్నారు. అత్యధికంగా ఉన్న వార్డులున్న నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఉదయం 11.30 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయి తుది ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ టేబుళ్లు నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపుకు 49, దేవరకొండకు 20, చండూరుకు 10, చిట్యాలకు 12, నందికొండకు 12, హాలియా 11 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లను ఒక్కో రౌండ్లోనే లెక్కించనున్నారు. తేలనున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం ఫ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం ఫ కౌంటింగ్కు మూడు కేంద్రాలు ఫ ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్ల చొప్పున ఫ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫ ఉదయం 11.30 గంటల వరకు తుది ఫలితాలు జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల్లో ఓట్ల లెక్కింపునకు వార్డుకో టేబుల్ను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల్లో 2,500కుపైగా ఓట్లు ఉంటే 2 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్పై ఓట్ల లెక్కింపునకు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 55 మంది రిటర్నింగ్ అధికారులతోపాటు ఒక్కో రిటర్నింగ్ అధికారికి ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. -
ఓటరు తీర్పు ఎటువైపు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ఆయా రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అభ్యర్థులు కూడా ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా జరిగిన పోలింగ్ వివరాలను ముందేసుకుని ఎన్ని ఓట్లు తేడాతో బయటపడతామనే అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల క్రమ సంఖ్యల వారీగా ఎందరు ఓటేశారు..? ఎందరు గైర్హాజరయ్యారు ? ఓట్లేసిన వారిలో తమ వారెవరు..? ఎదుటి పక్షానికి చెందిన వారెవరు అంటూ లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. ఎవరి ధీమా వారిదే.. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 78.09 శాతం ఓట్లు పోలయ్యాయి. ఏ వార్డు తీసుకున్నా 75 శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది. ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అధికంగా ద్విముఖ పోరే.. కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ సైతం ఉండడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తంగా పరిశీలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడ్డాయని పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తంగా 162 వార్డులకు గాను హాలియాలో ఒక వార్డు ఏకగ్రీవంగా కావడంతో 161 వార్డులకు పోలింగ్ జరిగింది. నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో 48 చొప్పున డివిజన్లు, వార్డులు ఉండగా, దేవరకొండలో 20 వార్డులు, చండూరులో 10 వార్డులు కాగా, చిట్యాల, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో 12 చొప్పున వార్డులు ఉన్నాయి. గెలుపు అంచనాలో కాంగ్రెస్ అన్ని స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఽపూర్తి ధీమాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ.. అన్నిచోట్ల గట్టిపోటీ ఇచ్చామని, తమకూ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొంటోంది. బీజేపీ కూడా ఈసారి తమకు గతంలో కంటే అధిక స్థానాల్లో గెలుపొందుతామన్న ధీమాలో ఉండగా ఎంఐఎం, పార్వర్డు బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కూడా కొందరు గెలుపు మాదే అంటున్నారు. ఒక వార్డులో 2,500 ఓట్లు ఉన్నాయని అనుకుంటే.. అందులో కనీసం 2,200 ఓట్లు పోలైతే.. త్రిముఖ పోటీ ఉన్నచోట అభ్యర్థి విజయానికి కనీసం 750 ఓట్లు వస్తే చాలు. ద్విముఖ పోటీ ఉన్నచోట అయితే 1,100 ఓట్లకు ఒక్కటి ఎక్కువ వచ్చినా గెలుస్తామని భావిస్తున్నారు. వార్డులో పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని పోల్ అయ్యి ఉంటాయి, తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందో అంచనాలు కట్టేందుకు కుస్తీ పడుతున్నారు. మేయర్ పీఠం కాంగ్రెస్కే..? కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోని వార్డుల సంఖ్యలో యాభై శాతం ప్లస్ ఒక సీటు అదనంగా వచ్చిన పార్టీ మేయర్/చైర్మన్ పీఠాలు కై వసం చేసుకునే వీలుంది. ఒకవేళ యాభై శాతం సీట్ల మేరకు ఒకటి రెండు తక్కువ సీట్లు వచ్చినా.. అధికార పార్టీకి ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు అందుబాటులో ఉండడం అదనపు బలం కానుంది. ఈ సమీకరణతోనే అన్నిచోట్లా తామే మేయర్/చైర్మన్ పీఠాలు దక్కించుకుంటామని కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది. నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు 25 సీట్లు వచ్చిన పార్టీకే మేయర్ పీఠం దక్కనుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 30కి పైగా డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యుల అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపారదర్శకంగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముతోపాటు సాగర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద గోదాం, మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం మార్కెట్ యార్డులో, నల్లగొండలోని సాగర్ రోడ్డులో ఉన్న నిడమనూరు బాలికల గురుకులంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపోల్స్లో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. ఫ ఫలితాల అంచనాల్లో అభ్యర్థులు ఫ కార్పొరేషన్ మేయర్ పీఠం తమదేనంటున్న కాంగ్రెస్ ఫ మున్సిపాలిటీల్లోనూ అనుకూలమేనంటూ ప్రకటనలు ఫ గెలుపుపై ధీమాతో ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్న అభ్యర్థులు -
మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజుర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. నేటి బంద్కు కాంగ్రెస్ మద్దతునల్లగొండ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడితే గుణపాఠం తప్పదు ● మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డిమిర్యాలగూడ : అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని తగిన గుణపాఠం చెబుతామని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 29వ వార్డులో ఎన్నికల సమయం ముసిగిన తరువాత మిత్రపక్షాల అభ్యర్థికి చెందిన ఏజెంట్లు మస్తాన్, జమీల్, చాంద్పాషాపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జావిద్, ఆయన అనుచరులు కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. బాధితులు చికిత్స పొందుతుంటే వారిని హతమార్చాలని ఆస్పత్రిలోకి వచ్చి మరుణాయుధాలతో మరోసారి దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడులపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన జావిద్, ఆయన అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా 20వ వార్డులో దొంగ ఓట్లు వేయించారని, దీనిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నందుకు పోలీసులు సమక్షంలోనే వారిపై దాడులకు పాల్పడ్డారని, ఈ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిదార్థ, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, హతీరాం, మెసిన్అలీ, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పాలుట్ల బాబయ్య, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, పోకల రాజు తదితరులు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఓపీఓల నిరసనమిర్యాలగూడ టౌన్ : పీఓలు, ఏపీఓల మాదిరిగానే తమకు కూడా రూ.1300 పారితోషికం ఇవ్వాలని కోరుతూ బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోగల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఓపీఓలు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాము కూడా పీఓలు, ఏపీఓల మాదిరిగానే రెండు రోజులుగా విధులు నిర్వహించామని తమకు రూ.1000 పారితోషికం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.ఈ విషయంపై మున్సిపల్ కమిషన ర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఓపీఓలకు రూ. వెయ్యి చొప్పున ఇచ్చామని, ఒక వేళ కలెక్టర్ ఆదేశిస్తే మరో రూ.300 పంపిస్తామని స్పష్టం చేశారు. -
నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్దే..
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి చరిత్ర సృష్టించబోతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి కార్పొరేషన్ ఎన్నిక కావడంతో ప్రతి వార్డులో ప్రచారానికి వెళ్లానని.. అక్కడ పేదలకు ఎన్నో హామీలిచ్చానని తెలిపారు. ప్రతి డివిజన్లో ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ప్రత్యేక రూమ్ను ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు స్వీకరించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నల్లగొండలో బొట్టుగూడ హైస్కూల్ తరహాలో మిగతా 18 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా విధానం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తన దగ్గరకు వస్తే.. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తానని తెలిపారు. మేయర్ ఎన్నిక తర్వాత నల్లగొండ కార్పొరేషన్లో 100 ఎకారల భూమిని సేకరించి దేవరకొండ రోడ్డులో 4 వేలు, నార్కట్పల్లి రోడ్డులో 4 వేల ఇందిరమ్మ ఇళ్లను 75 గజాల్లో కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని చరిత్ర సృష్టిస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
బ్యాలెట్ బాక్సుల్లో భవితవ్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 161 డివిజన్లు / వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది.ఈనెల 13వ తేదీన (శుక్రవారం) కౌంటింగ్ అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లు మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. నల్లగొండ కార్పొరేషన్కు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆర్జాలబావిలోని వేర్ హౌజింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించి భద్రపరిచారు. దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్ఎల్బీసీలోని నిడమనూరు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ భద్రపరిచారు. మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడంతో ఈ మూడు మున్సిపాలిటీల బ్యాలెట్ బాక్సులను అక్కడకు తరలించి స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. పటిష్ట భద్రత.. జిల్లాలోని 3 కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల వద్ద పోలీసులు మూడంచెల భద్రత కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద మొదటి స్టేజీలో తెలంగాణ స్పెషల్ రిజర్వుడ్ పోలీసులతో భద్రత కల్పిస్తుండగా, రెండో స్టేజీలో ఏఆర్ పోలీసులు, మూడో స్టేజీలో సివిల్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13వ తేదీన జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 473 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 13వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. స్ట్రాంగ్ రూమ్లకు తరలిన బాక్సులు మూడంచెల భద్రత కల్పించిన పోలీసులు -
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
తిప్పర్తిలో రాస్తారోకో చేస్తున్న రైతులుతిప్పర్తి : అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో యూరియా అందించాలని కోరుతూ బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతు యాప్ ద్వారా యూరియా సరఫరా చేయడం ద్వారా సామాన్య రైతులకు అందడం లేదని, యాప్ గురించి తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లో అప్డేట్ చేసిన క్షణాల్లో యూరియా అయిపోతుందని, పెద్ద రైతుల కోసమే యూరియా యూప్ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. యాప్ను రద్దు చేసి నేరుగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ రైతుల వద్దకు చేరుకుని అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఆమె ఇంటికి తాళం లేకపోవడంతో ఇంటిపక్క వారు గమనించి లక్ష్మమ్మకు సమాచారం అందించారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉంచిన తులం బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి సామగ్రి మెత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇళ్ల వారు వచ్చి చూస్తేగానీ ఏమేమి చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుంది. -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చిట్టంకుంట గ్రామంలో జరిగే బంధువుల శుభకార్యానికి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అంతకు ముందు భీముడు కుటుంబ సభ్యులు వేడి నీటి కోసం ఇంట్లోని బాత్రూంలో కరంట్ హీటర్ పెట్టి మర్చి పోయి వెళ్లారు. దాంతో బకిట్లోని నీరు అతిగా వేడి కావడంతో హీటర్ కాలిపోయి బాత్రూంతోపాటు బెడ్రూంలో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వారి ఇంట్లోంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫర్నీచర్తో పాటు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. -
మిర్యాలగూడలో ఘర్షణలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి. 29వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి డబ్బికార్ మల్లేష్ తరఫున షేక్ మస్తాన్న్, షేక్ జమీన్, షేక్ బడేమియా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన వారిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జావెద్, అతడి సోదరులు అనుచరులతో కలిసి ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీంతో మస్తాన్ తలకు గాయమై స్పృహ కోల్పోయాడు జమీన్, బడేమియాకు గాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తనయుడు నల్లమోతు సిద్దార్ధ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో జావెద్ అనుచరులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని.. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శిస్తున్న నల్లమోతు సిద్దార్ధపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మస్తాన్, జమీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మరో మూడు వార్డుల్లో ఘర్షణలు.. అదేవిధంగా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 32వ వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. 20వ వార్డు రెడ్డీకాలనీలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంటుగా కూర్చున్న అశోక్పై ఆ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి భర్త దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే ఫిర్యాదు చేశాం.. 29వ వార్డులో ఘర్షణలు జరిగే ఆస్కారం ఉందని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తాను ముందుగానే ఫిర్యాదు చేశానని సీపీఎం అభ్యర్ధి డబ్బికార్ మల్లేష్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జావెద్పై గతంలో పలు కేసులు ఉన్నాయని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని, తన ఫిర్యాదుపై స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ 29వ వార్డులో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ వర్గీయుల దాడి ఫ పోలీసుల లాఠీచార్జి ఫ ముగ్గురికి గాయాలు ఫ మరికొన్ని వార్డుల్లో చెదురుమదురు ఘటనలుఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో గాయపడి నల్లగొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసిహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్ధార్థతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, సీపీఎం కొన్ని చోట్లా కలసి పనిచేశాయని, మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకే కాంగ్రెస్ గుండాలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి ప్రయత్నం చేసారని, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్లను ఆక్రమించే యత్నం చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. మిర్యాలగూడలో జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. -
మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా
నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి. – దబ్బెటి వరుణ్ సాయి, మోత్కూరు ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నేను తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాను. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందాలి. – దబ్బెటి నేహ, జామచెట్లబావి, మోత్కూరు -
కాంగ్రెస్దే ఘన విజయం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సామాన్యులకు సన్న బియ్యం అందిచండంతో పాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను 100శాతం అమలు చేస్తుందని అన్నారు. 1994 నుంచి.. మంత్రి ఉత్తమ్ 1994లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్ దంపతులు కోదాడలోని నయానగర్లో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
ఫ ఓటెయ్.. చికెన్ తీసుకో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా చికెన్ షాపులకు వెళ్లి టోకెన్ ఇచ్చి చికెన్ తీసుకున్నారు. దాంతో చికెన్ షాపులు కిటకిటలాడాయి. షాపుల నిర్వాహకులు ముందుగానే కోళ్లను తెప్పించుకొని, టోకెన్తో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేసి చికెన్ అందించారు. -
మార్చి నాటికి ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు
చిట్యాల : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మార్చినాటికి పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు స్వప్న, సంతోష, కళమ్మతో మాట్లాడారు. బిల్లుల విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులు ప్రమీల, సత్యనారాయణతో మాట్లాడారు. పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపి.గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుందని అంతకుమించి అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేసుకొని ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయిన వెంటనే మరుగుదొడ్డి నిర్మాణానికి బుక్ చేయించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని వారికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయించాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ జయలక్ష్మి, ఏఈ ప్రీతి, గ్రామ పంచాయతీ సర్పంచ్ కాటం వెంకటేశం ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన నార్కట్పల్లి : మండలంలోని జువ్విగూడెం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, దాసరిగూడెం, ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ మంగళవారం పరిశీలించారు. ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎంపీడీఓ ఉమేష్, ఎంపీఓ సుధాకర్, సర్పంచ్ చింత అనిల్కుమార్, హౌసింగ్ ఏఈ ఇందు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ విపి.గౌతమ్ నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ విపి.గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డబుల్బెడ్ రూమ్ గృహ సముదాయాల్లో కరెంటు, తాగునీరు, డ్రెనేజీ, అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాకే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ బి.చంద్రశేఖర్తో కలిసి నల్లగొండలోని కలెక్టరేట్ వెనక గొల్లగూడెం వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పోలింగ్కు పకడ్బందీ భద్రత
నల్లగొండ : మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ఎలాంటి నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికలకు ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 29 మంది సీఐలు, 84 మంది ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 1097 మంది, 5 ప్లాటూన్ల టీజీఎస్పీ సిబ్బందిని నియమించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. 164 వార్డుల్లో 473 పోలింగ్ స్టేషన్లలో జరగనున్న ఎన్నికల్లో 66 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని.. ఆయా చోట్ల అదనపు బలగాలు, 07 స్ట్రైకింగ్ ఫోర్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 47 రూట్ మొబైల్ పార్టీలు, 08 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 333 మందిని బైండోవర్ చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. నల్లగొండలో విస్తృత తనిఖీలు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాత్రి పట్టణంలో విస్తత తనిఖీలు నిర్వహించారు. నల్లగొండలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో చేపట్టిన తనిఖీలను ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యవేక్షించారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 4.9 కేజీల వెండి, 24 బీర్ బాటిళ్ల మద్యం, 64 చీరలు, ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
రోజూ బడికి రావాలి
మర్రిగూడ : విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కోరుతూ మర్రిగూడ మండలంలోని దామెరబీమనపల్లి పాథమిక పాఠశాల హెచ్ఎం లచ్చిరాం వారం రోజు లుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి వారిని పాఠశాలకు తీసుకెళ్తున్నారు. మంగళవారం ఓ విద్యార్థి పొలం పనులు చేస్తుండగా తెలుసుకుని వారి పొలానికి వెళ్లి విద్యార్థిని పాఠశాలకు తీసుకొచ్చారు. విద్యార్థులు పొలం బాట కాదు.. బడి బాట పట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఎస్.వెంకట్కుమార్ ఉన్నారు. -
ఆయకట్టుకు నీరిస్తున్నా.. నిండుకుండే!
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్ నుంచి ఆయకట్టులో పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నా.. ప్రాజెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోకు సమానంగా నిత్యం ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో నీటిమట్టం తగ్గడం లేదు. మూసీ ప్రాజెక్టు ఎగువన ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజలు తమ అవసరాల కోసం వినియోగించిన నీరంతా నేరుగా మూసీకి చేరుతోంది. దీంతో పాటు మూసీ నది తీరం వెంట ఉన్న వలిగొండ, రామన్నపేట, శాలిగౌరారం మండలాల్లో సాగు చేసిన వరి పొలాల నుంచి జాలు కూడా మూసీకి వస్తోంది. ఇలా రోజూ 250 నుంచి 500 క్యూసెక్కుల నీరు మూసీ రిజర్వాయర్లో చేరుతోంది. ఆయకట్టుకు సాగునీరు.. మూసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 35 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటలు పూర్తయ్యే వరకు నీటిని విడుదల చేశారు. అప్పటికీ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో(645 అడుగులు) నీటిమట్టం ఉండటంతో యాసంగి సీజన్లో పంటల సాగుకు మొదటి విడతగా గత డిసెంబర్ 15న నెల రోజుల పాటు, రెండవ విడతలో 15 రోజుల పాటు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు రోజూ 500 క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 641అడుగుల (3.39 టీఎంసీలు) నీరు ఉంది. ఫ నిత్యం నీటితో కళకళలాడుతున్న మూసీ రిజర్వాయర్ ఫ ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో -
డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అందిస్తాం
ఫ టీజీఎస్పీడీసీఎల్ శివాజీ నల్లగొండ : వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆయన మంగళవారం నల్లగొండలోని ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్కు ఎలాంటి కొరత లేదన్నారు. ఈ నెల చివరి నాటికి 7 సబ్స్టేషన్ల అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పరికరాల కొరత ఉన్నట్లుగా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారి మాటల్లో వాస్తవం లేదన్నారు. 450 కిలోమీటర్ల వైర్ అందుబాటులో ఉండటంతో పాటు డీపీఆర్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికతో విద్యుత్ శాఖ ముందుకు పోతుందన్నారు. సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈటీ రాజునాయక్, డీఈ ప్రసాద్, స్టోర్ ఏడీ శంకరయ్య, పాల్గొన్నారు. ఎంజీయూలో ముగిసిన వర్క్షాప్నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ 8వ సెమిస్టర్, ఎంసీఏ 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, యూజర్ ఇంటర్ ఫేస్ టూ ల్స్, సైడ్ డెవలప్మెంట్ టూల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు స్వయంగా పరీక్షించి, ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం సాధ్యమవుతుందని సీ ఎస్సీ విభాగం అధిపతి ఎం.జయంతి తెలి పారు. కార్యక్రమంలో సీవీఎస్సార్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.సాగర్, కోఆర్డినేటర్ జ్యోతిరాణి పాల్గొన్నారు. నిజాయితీ పరులను ఎన్నుకోండి : జూలకంటిమిర్యాలగూడ : మున్సిపాలిటీలో ఎన్నికల్లో నిజాయితీ పరులను, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ధనబలంతో వచ్చే అవకాశవాదులను, అవినీతిపరులు ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాల ఆశ చూపి ఓట్లు పదవులు పొందేందుకు ముందుకు వస్తున్నారని.. అలాంటి వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రెండేండ్ల కాలంలో పట్టణంలో అభివృద్ధి జరగలేదని, కేవలం కాలయాపన చేస్తూ కాలం గడిపారని అన్నారు. తమ హయాంలో రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రెనేజీ పనులు చురుకుగా సాగాయని.. ఇప్పుడు ఏ అభివృద్ధీ జరగలేదని విమర్శించారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి గోదాములో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. పోలింగ్ రోజున ఉదయం 6.45 గంటలకు ఏజెంట్ల ఎదుట బ్యాలెట్ బాక్స్ను తెరవాలన్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు, జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరుగుతుందన్నారు. 3,09,097 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికలకు 2855 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేసేలా అవగాహన కల్పించామన్నారు. నల్లగొండ కార్పొరేషన్కు సంబంధించి ఆర్జాలబావి గోదాములో, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్ఎల్బీసీ సమీపంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
అచ్చం వైఎస్సార్ లాగే..
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐనాల శ్రీనివాస్ సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణతో జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఆయన అచ్చం వైఎస్సార్ హావ భావాలు ప్రదర్శిస్తుండడంతో జూనియర్ వైఎస్సార్గా పేరుపొందాడు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కాంగ్రెస్ మీటింగ్లు, సభలు జరిగినా ఆయన పాల్గొంటూ ఉంటాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. -
సెల్ఫోన్కు అనుమతి లేదు
భువనగిరిటౌన్ : ఓటు వేసేందుకు వెళ్లే వారు సెల్ఫోన్ను బయట ఉన్న అధికారికి ఇచ్చి వెళ్లాలి. ఒక వేళ సెల్ఫోన్ తీసుకెళ్లి ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే నేరంగా పరిగణిస్తారు. ఓటు వేస్తూ సెల్ఫీ తీసినట్లు గుర్తిస్తే అధికారులు వెంటనే అతడిని బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో సదరు వ్యక్తి వేసిన ఓటు పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు ఓటు వేయ డానికి 18 ఏళ్లుకు పైగా ఉన్న సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. అతడి ఓటును బహిరంగ పర్చనని సహాయకుడు నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి మున్సి పాలిటీలోని జడ్పీహెచ్ఎస్, సీతావానిగూడెం, నారాయణగిరి, ముక్తాపూర్, రేవనపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే గదులను శుభ్రం చేస్తున్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లోని గుర్తులు స్పష్టంగా కన్పించేలా అన్ని పోలింగ్ కేంద్రాలలోని కంపార్ట్మెంట్ పైన లైట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి తెలిపారు. -
ఆడపిల్లలకు వరాల జల్లు
చిట్యాల : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులోని పోటీచేస్తున్న కౌన్సిలర్ ఆభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లలకు పెద్ద ఎత్తున నజరానాలు ప్రకటించారు. 9వ వార్డులో ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.10,116, ఆడపిల్ల పుడితే రూ.5,116 అందిస్తానని ఆ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆగు అశోక్ తరఫున మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు ఎన్నికల ప్రచారంలో ఆడపిల్ల పుడితే రూ.11,116, ఆడపిల్ల పెళ్లికి రూ.15,116 అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిర్రబోయిన సమతా శ్రీకాంత్ తన వార్డులో ఆడపిల్లపు పుట్టిన, ఆడపిల్ల పెళ్లి చేసినా రూ.10,116 అందిస్తానని హామీనిచ్చారు. 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిమ్మనగోటి శ్రీను వార్డు ప్రజలు శుభకార్యాలు జరుపుకొంటే ఫంక్షన్హాల్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిలివేరు శేఖర్ తరఫున ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు మన్నెం సైదులు వార్డులో అడపిల్ల పెళ్లికి రూ.10వేలు అందిస్తామని హామీ ఇచ్చాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 7వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన కూరెళ్ల లింగస్వామి తన వార్డులో ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లింగస్వామి భార్య జ్యోతి ఆడపిల్ల పెళ్లికి రూ.10,116 నజరానా ఇస్తామని ప్రకటించారు.ఫ మున్సిపల్ అభ్యర్థుల హామీలు -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురం వద్ద సాగర్ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో గల్లంతైన తల్లం పుల్లయ్య ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అతడి ఆచూకీ కోసం సోమవారం సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు, నిడమనూరు పోలీసులు, పుల్లయ్య కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించారు. ప్రత్యేక బోటులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన స్థలం నుంచి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వరకు ఎడమ కాల్వ తూముల వద్ద వెతుకుతున్నారు. గాలింపు చర్యలను నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, హాలియా సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ ఉప్పు సురేష్, ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మాసత్యం పర్యవేక్షించారు. లభ్యంకాని పుల్లయ్య ఆచూకీ -
వార్డు సమస్యలను గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వాలని సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక నాయకులు కోరారు. వేదిక రూపొందించిన కరపత్రాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట వారు ఆవిష్కరించారు. అవినీతి, అక్రమాలను రూపుమాపడానికి, సమాజ మార్పు కోసం పాటుపడాలని సూచించారు. ప్రజలు ఈ కరపత్రాన్ని వార్డు నుంచి పోటీ చేసే వారికి అందించి అందుకు సంబంధించిన హామీలు పొందాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్.భద్రయ్య, కరీం, సుభాని, ఆవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం చేస్తానని.. పుస్తెలతాడు అపహరణ
భూదాన్పోచంపల్లి: సంతానం లేని వారికి వైద్యం చేస్తానని నమ్మించిన గుర్తుతెలియని వ్యక్తి మహిళ నుంచి 4 తులాల బంగారు పుస్తెలతాడు అపహరించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం భూదాన్పోచంపల్లి పట్టణంలోని గాంధీనగర్లో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన వంగూరి ప్రణీత, రాజ్కుమార్ దంపతులకు వివాహమై ఐదేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వైద్యులతో చికిత్స తీసుకుంటున్నారు. బైక్పై హెల్మెట్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి సోమవారం రాజ్కుమార్ ఇంటి వద్దకు వచ్చి సంతానం లేని వారికి కేరళ ఆయుర్వేద వైద్యం చేస్తామని నమ్మించాడు. ఇందుకు రూ.12వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఇది నమ్మిన రాజ్కుమార్ దంపతులు రూ.6వేలు ఇస్తామని చెప్పారు. ఈ మేరక సదరు వ్యక్తి మొదట రాజ్కుమార్ ఒంటికి నూనె లాంటి పదార్థాన్ని పూసి అతడిని స్నానం చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ప్రణీతకు కూడా మెడ భాగంలో నూనె పూస్తూ పుస్తెలతాడును తీయమని చెప్పడంతో ఆమె తీసి మంచం పైన పెట్టింది. అనంతరం ఆమెను కూడా స్నానం చేసి రమ్మని చెప్పాడు. ప్రణీత స్నానానికి వెళ్లగానే మంచంపై ఉంచిన పుస్తెలతాడు సదరు వ్యక్తి తీసుకొని అక్కడ నుంచి ఉడాయించాడు. ప్రణీత స్నానం చేసి వచ్చి చూడగా ఆ వ్యక్తి లేడు, పుస్తెలతాడు కన్పించలేదు. వెంటనే తేరుకొని భర్త రాజ్కుమార్ ఆమె చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భాస్కర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగుడు అంతకుముందు వైద్యం చేస్తామని చెప్పి ఇదే కాలనీకి చెందిన మరో వ్యక్తితో మాట్లాడిన మొబైల్ నంబర్ను పరిశీలించగా ట్రూ కాలర్లో అతడి పేరు వెంకటేశ్వర్రావు అని, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాగా వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉంటే సంతానం లేనివారికి వైద్యం చేస్తామంటూ ఇటీవల పోచంపల్లిలో పలువురి వద్ద వేల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్లు తెలిసింది. -
మున్సిపల్ బరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి
మిర్యాలగూడ: రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత మల్లు స్వరాజ్యం మనవరాలు మల్లు మధులత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 17వ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మల్లు స్వరాజ్యం కుమారుడు మల్లు గౌతమ్రెడ్డి కోడలు అయిన మధులత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలిపెట్టి ప్రజా సేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు. తన అమ్మమ్మ మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు సైతం యువతకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలని, తనను గెలిపిస్తే 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఆమె చెప్పారు. -
కార్పొరేషన్లో కాంగ్రెస్కు పట్టం కట్టండి
నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నల్లగొండలోని 14, 15, 16, 17, 3 డివిజన్లలో నిర్వహించిన రోడ్డుషోలో మాట్లాడారు. చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్కు పట్టం కడితే.. నల్లగొండ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలన్ని పేదలకు అందించడమే నా ధ్యేయమన్నారు. నల్లగొండలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేయడంతో పాటు 24 గంటలు తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే హైదరాబాద్ తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో అంగన్వాడీ భవనాలు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బొట్టుగూడ తరహాలో అబివృద్ధి చేసి పేదలకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అన్ని రంగాల్లో అబివృదిద్ధ జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, పాశం రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బొజ్జ శంకర్, పెరిక నాగరాజు, అశ్విని పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మదర్ డెయిరీలో కుంభకోణం
ఫ పాలుపోయకుండానే రూ. 9.50 లక్షలు బిల్లు కై ్లమ్ ఫ జీఎం, మేనేజర్, సూపర్వైజర్ సస్పెన్షన్ సాక్షి, యాదాద్రి : పాలు పోయకుండానే రూ.9.50 లక్షల మేర బిల్లులు డ్రా చేసిన వ్యవహారంలో మదర్ డెయిరీ జనరల్ మేనేజర్ కృష్ణ, భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ దశరథ, ప్రాసెసర్ పరమేశ్వర్రెడ్డిలు సస్పెండ్ అయ్యారు. మూతపడిన పాల కేంద్రాలలో పాలు పోసినట్లుగా దొంగబిల్లులు సృష్టించారు. పాలు పోయకుండానే భువనగిరి చిల్లింగ్ సెంటర్ నుంచి చెల్లింపుల కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల్లో రూ.9.50 లక్షల మేర బిల్లులు మదర్ డెయిరీకి పంపించారు. మూతపడిన పాల కేంద్రాలు చాడ, ముత్తిరెడ్డిగూడెం, నమాత్పల్లి, సూరేపల్లి, ఏంబాయి సొసైటీల పేరుతో దొంగ బిల్లులు సృష్టించారు. ఆగస్టు, సెప్టెంబర్ బిల్లులు డ్రా చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించనందున సెప్టెంబర్ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. ఈ స్కాంలో అప్పటి మదర్ డెయిరీ ఎండీ అయిన ప్రస్తుత జనరల్ మేనేజర్ కృష్ణ, భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ దశరథ, ప్రాసెసింగ్ సూపర్ వైజర్ పరమేశ్వర్రెడ్డిల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వీరిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఉద్యోగులపై విచారణకు ఆదేశించినట్లు మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి చెప్పారు. ఈ స్కాంపై పూర్తి విచారణ జరిపి దోషులను గుర్తించి రైతులకు న్యాయం చేస్తామని చైర్మన్ చెప్పారు. -
తెలంగాణ రాజకీయాలను మునుగోడు శాసిస్తుంది
చండూరు : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మునుగోడు గడ్డ శాసించే రోజు వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ‘నాకు పదవిపై వ్యామోహం లేదు. రాజగోపాల్రెడ్డి ఏం చేస్తాడో అని రాష్ట్రం మొత్తం మునుగోడు వైపు చూస్తోంది.గత ప్రభుత్వంలో నా రాజీనామా వల్ల నాకు అన్యాయం జరిగినా.. మునుగోడుకు న్యాయం జరిగింది. నా రాజీనామాతో అప్పటి కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చాను’ అని అన్నారు. సోమవారం ఆయన చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల సభలో మాట్లాడారు. ప్రజలు మీది ఏ ఊరు అంటే గతంలో నల్లగొండ అని చెప్పే వాళ్లు. ఇప్పుడు మాది మునుగోడు అని చెప్పుకునే స్థాయికి తెచ్చానని అన్నారు. చండూరు మున్సిపాలిటీలో కనీసం నివాస స్థలం లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలం ఇస్తానని, ప్రభుత్వం స్ధలం ఉన్నా లేకున్నా సొంతంగా కొనైనా వారికి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ రాని వృద్ధులకు.. ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు తానే నెలకు 2వేల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ రూ.5వేలు ఇవ్వాలని రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు.డబ్బులకు ఓటు అమ్ముకోవద్దు..మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దని, డబ్బులు పెట్టిన వ్యక్తి దగ్గరికి పనికి పోతే పుణ్యానికి ఓటు వేశావా అని ఎదురు ప్రశ్నిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులతో వస్తున్నారు మోసపోవద్దని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం శ్రీనివాస్రెడ్డి, అనంత చంద్రశేఖర్, గిరిబాబు, కోడి శ్రీనివాసులు, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సన్నద్ధతపై సోమవారం సాయంత్రం ఆయన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్బీ, బీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా చూడాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్ చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బందికి అందించాలని సూచించారు. పీఓలు పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా గమనించాలని, మున్సిపల్ కమిషనర్లు కమ్యునికేషన్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాదారణ పరిశీలకులు జి. రమేష్ మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ పూర్తిగా తనిఖీ చేసుకొని సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు. 90 శాతం ఓటింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది చివరి ర్యాండమైజేషన్ కలెక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలింగ్ నిర్వహణకు గాను మొత్తం 475 పోలింగ్ కేంద్రాలలో 20 శాతం రిజర్వ్ కలుపుకొని సిబ్బందిని కేటాయిస్తూ ర్యాండమైజేషన్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 571 మంది పీఓలు, 571 మంది ఏపీఓలు, 1,713 మంది ఓపీఓలు మొత్తం 2,855 మందికి ఈ ర్యాండమైజేషన్లో పోలింగ్ విధులను కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
16వ డివిజన్ అభివృద్ధి బాధ్యత నాదే..
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 16వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెరిక స్వాతిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ అభివృద్ధి బాధ్యత నాది అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 16వ డివిజన్లో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే డివిజన్లోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం నుంచి వందల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉండి, ప్రజల మధ్య ఉన్న అభ్యర్థి గెలుపుతోనే డివిజన్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్రెడ్డి, వినాయకరాజు పాల్గొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
చండూరు : ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. చండూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు పలు సూచనలు చేశారు. బ్లూ ప్రింట్పై పలు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేసిన బ్యాగులను విప్పి పరిశీలించారు. మెటీరియల్ సరిపోతుందా లేదా చూసుకుని అదనంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించే అంశంపై చర్చించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీదేవి, ఎంపీడీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మల్లేషం, మాస్టర్ ట్రైనర్ మాదగోని వెంకటేశం తదితరులు ఉన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి
చిట్యాల : ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో రుద్రవరం యాదయ్య, రెండో వార్డు అభ్యర్థి షబనా అజీమ్, తొమ్మిదో వార్డు అభ్యర్థి ఆగు అశోక్ తరఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసేవారిని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీలో నిలిపామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు నిలిచిపోయిన సంక్షేమ పథకాలు, అసంపూర్తి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రెండున్నరేళ్లుగా చిట్యాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా మోసపూరిత హామీలతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో దూదిమెట్ల సత్తయ్య, అర్రూరి శ్రీశైలం, కన్నెబోయిన శ్రీశైలం, చిత్రగంటి ప్రవీణ్, రుద్రవరం సునీల్, నర్రా భిక్షంరెడ్డి పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ప్రకృతి, వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల గుండా నెల రోజులుగా చేపడుతున్న ప్రకృతి విజ్ఞానయాత్ర సోమవారం ఎంజీ యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంజీ సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి హేతుబద్ధమైన వైజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రతి అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, లోతైన పరిశీలన, సామాజిక అన్వయింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా తయారై దేశసేవలో భాగస్వాములు కావాలని కోరారు. కవి, వాగ్దేయకారుడు జయరాజ్ మాట్లాడుతూ మానావళి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిపై అవగాహన కలిగి ఉండాలని, మొక్కలు నాటడం తమ బాధ్యతగా బావించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విజ్ఞానదర్శిని వ్యవస్థాపకులు రమేష్, గంజి ఈశ్వరలింగం, సురేష్కుమార్, స్వరాజ్యం, ఎం.వెంకటరమణారెడ్డి, సురేష్రెడ్డి, షరీఫ్, కిరణ్, రమేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు నన్ను మేయర్ను చేస్తుంది
ఫ 38వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం రుణపడి ఉంది ఫ నా భర్త శ్రీనివాస్రెడ్డి ఇక్కడ నుంచి మూడు సార్లు కౌన్సిలర్గా గెలిచారు ఫ నన్ను కూడా ఆదరించి గెలిపించాలి ఫ మంత్రి సహకారంతో కార్పొరేషన్ను అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి నల్లగొండ : ‘నల్లగొండలోని 32వ డివిజన్ ప్రజలకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంది. నా భర్త బుర్రి శ్రీనివాస్రెడ్డిని మూడు పర్యాయాలు గెలిపించారు. ఆయన మున్సిపల్ చైర్మన్గానూ పనిచేశారు. ప్రస్తుతం ఈ డివిజన్ నుంచి నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. మీరు వేసే ఓటు నన్ను మేయర్ను చేస్తుంది’ అని కాంగ్రెస్ పార్టీ 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నల్లగొండను స్మార్ట్ సిటీగా చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి కంకణ బద్ధులయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద రూ.216 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 11 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. 24 గంటలు కృష్ణా జలాలు అందించేందుకు రూ.125 కోట్లతో పనులు సాగుతున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, బస్టాండ్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు, డీఈఓ ఆీఫీస్ నుంచి మిర్యాలగూడ రోడ్డు వరకు బీటీ రోడ్లు, పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి రూ.900 కోట్లతో రింగు రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలో విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ఐదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీ ప్రారంభించాం. రూ.100 కోట్లతో ముశంపల్లి రోడ్డును అభివృద్ధి చేసుకుంటున్నాం. రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ సెంటర్, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనులు చేపట్టారు. నల్లగొండకు తలమానికం అయిన లతీప్సాబ్ దర్గా, బ్రహ్మంగారి గుట్టకు రూ.140 కోట్లతో ఘాట్రోడ్డు పనులు జరుగుతున్నాయి. రూ.150 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తున్నాం. నన్ను ఆదరించి గెలిపిస్తే ప్రజలకు జవాబు దారీగా పని చేస్తా. 32వ డివిజన్ను పట్టణంలోనే మరింత అందంగా తీర్చిదిద్దుతా. మంత్రి సహకారంతో ఒక మహిళగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. కార్పొరేషన్ కావడం నిజంగా అదృష్టం. తద్వార కేంద్రం నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. నల్లగొండకు కొండంత అండగా కోమటిరెడ్డి ఉన్నాడు. పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు సహకరించాలి. -
నేడు, రేపు సెలవు
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలోని విద్యా సంస్థలన్నింటికీ ఈనెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలకు 10, 11 తేదీల్లో సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయం ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఓ పక్క అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. మరో పక్క సంక్షేమ పథకాలు చేపట్టి పేదలకు అందిస్తున్నాడని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని అదే తరహాలో మున్సిపాలిటీల్లో కూడా విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని, ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. సమావేశంలో జిల్లేపల్లి పరమేష్, ఎండీ.ముంతాజ్ అలీ, భవ్యతేజ్రెడ్డి, గౌతమ్, రవీందర్రెడ్డి, పగిల్లరాజు, శరత్, జస్వంత్ పాల్గొన్నారు. -
పట్టణాల్లో నాకాబందీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పోలింగ్కు ముందు రోజు నుంచే డివిజన్లు, వార్డుల్లో నాకాబందీ నిర్వహిస్తాం. మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చూస్తాం’ అని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్తోపాటు చండూరు, చిట్యాల, దేవరకొండ, నాగార్జునసాగర్, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టబోయే చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఎస్పీ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 162 వార్డుల్లో 164 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ఇందులో 65 లొకేషన్లను క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించాం. వాటిల్లో గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రిగ్గింగ్, క్రాస్ ఓటింగ్ వంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో రూట్ మొబైల్ బృందాలను నియమిస్తాం. జిల్లాలో రెండు వేల మందితో స్పెషల్ పోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. వారంతా బందోబస్తులో పాల్గొంటారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తాం. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా చర్యలు చేపడుతున్నాం. 300 మంది పాత నేరస్తులను ఇప్పటికే బైండోవర్ చేశాం. మున్సిపాలిటీల పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి కదలిలకపై నిఘా పెట్టాం. రోజూ పిలిపించి చెక్ చేస్తున్నాం. కార్పొరేషన్తోపాటు ఆరు మున్సిపాలిటీల పరిధిలో 81 మంది నుంచి ఆయుధాలను డిపాజిట్ చేయించాం. గతంలో గొడవలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో నాయకులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. గతంలో నేరాలకు పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఎలాంటి ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తాం. ఏమైనా సంఘటనలు జరిగితే స్థానిక ప్రజలు కూడా డయల్ 100 ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వండి. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఓటు వేయకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే విధంగా ఆలోచించి ఓటు వేయండి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 3 వార్డులకు కలిపి ఒకటి చొప్పున చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తనిఖీలు జరుగుతాయి. పోలింగ్కు ముందు డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఓటర్లను ఇతర ప్రలోబాలకు గురి చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో మున్సిపాలిటీలో డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. మిర్యాలగూడ, హాలియా, నందికొండ ప్రాంతాల్లో ఏఎస్పీ ఇన్చార్జి వ్యవహరిస్తాను. నేను నల్లగొండతో పాటు చండూరు, చిట్యాల, దేవరకొండ ప్రాంతాలు పర్యవేక్షిస్తా. ఇప్పటికే పలుచోట్ల తనిఖీలను ముమ్మరం చేశాం. మిర్యాలగూడతో పాటు నందికొండ, హాలియా మున్సిపాలిటీలకు అవంతీపురం మార్కెట్ యార్డులో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల కౌంటింగ్ను నల్లగొండ సాగర్ రోడ్డులోని రామానందతీర్థ నిడమనూరు గురుకుల పాఠశాల కేంద్రంలో ఏర్పాటు చేశారు. నల్లగొండ కార్పొరేషన్ కౌంటింగ్ను ఆర్జాలబావిలోని వేర్ హౌజింగ్ గోదాములో ఏర్పాటు చేశారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్సులను అక్కడి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. అక్కడ మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తాం. ఫ మూడు నాలుగు వార్డులకు ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తాం ఫ డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాం ఫ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఫ ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా.. స్వేచ్ఛగా ఓటెయ్యాలి ‘సాక్షి’తో ఎస్పీ శరత్చంద్ర పవార్ -
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసింది శూన్యం
మిర్యాలగూడ టౌన్ : ఆరు గ్యారంటీ పథకాలను ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నర ఏళ్లుగా చేసిన అభివృద్ధి శూన్యం అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 3వ వార్డు తాళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి వై.పద్మ, సీపీఎం బలపరిచిన 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గుడిసె జానకమ్మను గెలిపించాలని కోరారు. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప.. ప్రస్తుతం ఏ పనీ జరగలేదన్నారు. సీపీఎం, బీఆర్ఎస్ మిత్రపక్షాలను గెలిపిస్తేనే వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరం అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నలమోతు సిద్దార్థ, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రమేష్, ఇస్మాయిల్, నర్సింగ్, ఖరీం, బంటు ఈదయ్య, రీయాజ్, నాగులు, నాగేందర్, ముభీన్, జాంగీర్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
దేవరకొండ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కల్టెకర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇన్ పేషంట్, అవుట్ పేషంట్, పార్మసీ, ప్రసూతి విభాగాలను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్ రవిప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీ చేయడమే ధ్యేయమని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అండగా నిలవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్రెడ్డికి మద్దతుగా ఏఆర్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 6వ డివిజన్కు అధిక నిధులు ఇచ్చి ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా చొరవ తీసుకుంటామన్నారు. సునంద కర్నాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఏఆర్నగర్, శాంతినగర్ కాలనీల అభివృద్ధి తాను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి కర్నాటి సునంద కర్నాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ల్యాబ్ సర్వీస్ ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ రోగులకు వైద్య పరీక్షల కోసం ఓపీ విబాగం పక్కనే ప్రత్యేక ల్యాబ్ సర్వీస్ను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రంలోనే అవుట్ పేషెంట్స్ రక్త, మూత్ర పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి త్వరగా పరీక్షల రిపోర్టును అందించనున్నారు. దీంతో వారికి సమయం ఆదా కావడంతో పాటు వెంటనే సరైన చికిత్సలు అందించే అవకాశం ఉంది. ప్రత్యేక ల్యాబ్ సర్వీసును సూపరింటెండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపీ విభాగంతో పాటు క్యాజువాలిటీలో కూడా మెడికో లీగల్ కేసుల కోసం ప్రత్యేకమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నప్రభ, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రత్న, రజని, డాక్టర్ మహేష్, స్పందన, తార, సునీత, శ్రీలత, సాగర్ పాల్గొన్నారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చుపెద్దవూర : కసి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని గర్ల్స్ చైల్డ్ ఎంపర్మెంట్ మోటివేటషన్ స్పీకర్, ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గంజి భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం పెద్దవూర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మోటివేషనల్ స్కిల్స్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మేధావులంతా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రయత్నం ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. ప్రతి పుస్తకంలోనూ ఏదో ఒక విషయం ఉంటుందని, పుస్తకాన్ని మించిన నేస్తం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ తరి రాములు, ఉపాధ్యాయులు రమాదేవి, కృష్ణయ్య, రాములు, భాస్కర్, వాలియా, దూదియా, ఇంధుమతి, అరవింద్రెడ్డి, పద్మావతి, చంద్రమణి, లలిత, జానమ్మ, హైమావతి, సీఆర్పీ వెంకటయ్య పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు.. ప్రయోగాల కేంద్రాలునల్లగొండ టూటౌన్ : సమాజ హితమైన ప్రయోగాల కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు తయారు కావాలని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వృక్షశాస్త్రాల విభాగాల ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి నెలలో ‘ఆరోగ్యవంతమైన భూమండలం కొరకు జీవశాస్త్రాల్లో ఆవిష్కరణలు’ అనే అంశంపై ఎంజీ యూనివర్సిటీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రేమ్సాగర్, మాధురి, వసంత, అన్నపూర్ణ, ఆర్ఎస్ బుట్టి, శివరాం, రామచందర్గౌడ్, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు. సాగర్కు లోకాయుక్త న్యాయమూర్తినాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి ఏ.రాజశేఖర్రెడ్డి శనివారం నాగార్జునసాగర్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్విహార్ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు నిడమనూరు కోర్టు సూపరింటెండెంట్ చంద్రశేఖర్శర్మ, ప్రొటోకాల్ అధికారి దండా శ్రీనివాస్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. -
చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులు అక్రమంగా సరఫరా కాకుండా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ పరిధుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని, అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై, వాహనదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్ఐ గోపాల్రావు, పోలీసులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో చరిత్రాత్మక తీర్పునివ్వాలి
నల్లగొండ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పునివ్వాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని 10, 11, 6, 7, 8, 9, 25 డివిజన్లలో నిర్వహించిన జరిగిన సభల్లో మంత్రి మాట్లాడారు. మొదటిసారి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సాద్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. తాను మంత్రిగా ఉన్నానని.. ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు. నల్లగొండలో రూ.2200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మేయర్ ఎన్నిక తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. తనను టైదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ కావాలని.. ప్రజలు ఆలో చించి ఓటు వేయాలన్నారు. ఏ సమస్య వచ్చి నా కార్పొరేటర్ తనకు చెబితే వెంటనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వంగూరి లక్ష్మయ్య, ఆయా డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. ఫ నీలగిరిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
అధికార పార్టీతోనే అభివృద్ధి
ఫ మంత్రి సీతక్క ఫ చిట్యాలలో ఎన్నికల ప్రచారం చిట్యాల : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల తర్వాత ఆయా పంచాయతీలకు రూ.250 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళ సంఘాలకు రూ.1200 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మహిళలను ఆర్థికం బలోపేతం చేసేందుకుగాను బస్సులు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చిట్యాలలో రైస్ మిల్లు ఏర్పాటుకు మహిళలకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేస్తే మురిగిపోతాయని, అభివృద్ధి ఉండదని చెప్పారు. చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పాటి నర్సిరెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు రాష్ట్ర మంత్రి సీతక్క కండువ కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, ఏఎంసీ మాజీ చైర్మన్ పందిరి శ్రీనివాసులు, గుడిపాటి లక్ష్మీనర్సింహ, జడల చినమల్లయ్య, కాటం వెంకటేశం, పాటి మాధవరెడ్డి, గుండెబోయిన సైదులు, పిశాటి భీష్మారెడ్డి, ఆవుల యాదయ్య, అంతటి వెంకటేశం, వడ్డెపల్లి లక్ష్మయ్య, జనగాం రవీందర్గౌడ్, బొబ్బల రాంరెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, అంశల సత్యనారాయణ, కాటం సత్తయ్య పాల్గొన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
మిర్యాలగూడ, మోటకొండూరు : తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని మనస్థాపానికి గురైన ప్రేమ జంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామానికి చెందిన వరి కుప్పల రాకేశ్(21), ఓర్సు సౌమ్య దగ్గరి బంధువులు. రాకేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా సౌమ్య ఇంటర్ చదువుతున్నది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు మందలించారు. దాంతో రాకేశ్, సౌమ్య దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగుతూ కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపించారు. వెంటనే కుటుంబసభ్యులు 100కు డయల్ చేసి వివరాలు వెల్లడించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరగా చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోటకొండూరులో మిస్సింగ్ కేసు సౌమ్య కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఉదయం బయటికి వెళ్లింది. ఆమె మరో వ్యక్తితో మిర్యాలగూడ ప్రాంతంలో కనిపించిందని కొంత మంది చెప్పడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
ప్రజాసేవకు అమర జవాన్ కూతురు
జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేకోదాడ : పట్టణంలోని 18వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్కు బదులుగా చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన ఉప్పగండ్ల శ్రీనివాస్కు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస్ కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలను పట్టుకొని వార్డులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న కర్రి సుబ్బారావు రెబల్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. సూర్యాపేట : కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన లాన్స్నాయక్ గోపయ్యచారి కూతురు పోలోజు మౌనిక సూర్యాపేట పట్టణంలో 46వ వార్డు నుంచి కౌన్సిలర్ స్థానానికి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఎన్నికల్లో నిలబడినట్టు ఆమె చెప్పారు. -
ఓటరు ‘పల్స్’ పట్టేస్తున్నారు
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓ పార్టీ నాయకులు శ్రీపీపుల్స్ పల్స్శ్రీ సంస్థ సహకారంతో ఓటర్లు మోబైల్స్కు కాల్ చేస్తున్నారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఎందుకు అనే విషయమై మోబైల్ కాలర్ ద్వారా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా ఓటర్ల నాడికి అనుగుణంగా తమ పార్టీల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీభూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. బీఎల్ఓలు రెండు రోజులుగా ఇంటింటికీ వెళ్లి స్లిప్పులను అందిస్తున్నారు. మున్సిపాలిటీలోని 13 వార్డులకు మొత్తం 15,827 మంది ఓటర్లు ఉన్నారని మున్సిపల్ కమీషనర్ అంజన్రెడ్డి తెలిపారు. మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. బూత్ల వారీగా 26 మంది బీఎల్ఓలు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల్లో ఈ పని పూర్తవుతుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్లు వచ్చాయ్... భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. శుక్రవారం ప్రత్యేక వాహనంలో భువనగిరి పోలీస్ స్టేషన్కు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ రామలింగం, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్కుమార్ పర్యవేక్షణంలో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక గదిలో భద్రపరిచి సీల్ వేశారు. ఈ నెల 10న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు 128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 47,831 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 57,396 బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఓటర్ల సంఖ్య కంటే 20 శాతం అదనంగా ఉన్నాయి. -
లారీ డ్రైవర్ను బెదిరించిన ఇద్దరి అరెస్ట్
నార్కట్పల్లి : లారీ డ్రైవర్ను చంపుతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నార్కట్పల్లి ఎస్ఐ పి.విష్ణుమూర్తి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ సునీల్తివారి లారీలో వెలిమినేడు నుంచి ఐరన్ లోడు వేసుకొని బయల్దేరాడు. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటంలో ఉన్న ఒక కంపెని వద్ద లారీ ఆపాడు. వంట చేసుకోవడానికి అవసరమైన సామగ్రి కోసం ఏపీ లింగోటంలోని కిరాణాషాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చి లారీ డ్రైవర్ను బలవంతంగా వాహనంపై ఎక్కించుకొని కొద్దిదూరం తీసుకెళ్లారు. ఇనుప రాడ్డుతో కొట్టి చంపుతామని బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్ఫోన్ తీసుకొని స్కూటీపై పారిపోయారు. లారీ డ్రైవర్ వెంటనే నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను బెదిరించిన మాద యడవల్లి గ్రామానికి చెందిన లింగస్వామి, నార్కట్పల్లికి చెందిన ఎస్కే ఉమర్ను అరెస్ట్ చేశారు. లారీ డ్రైవర్ వద్ద నుంచి వారు లాక్కెళ్లిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. 9న అప్రెంటీస్ మేళా డిండి : మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో ఈనెల 9వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాధాకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేళాకు హాజరయ్యే ఆసక్తిగల విద్యార్థులు తమ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9705182677 నంబర్ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లులో గుప్తనిధుల కలకలంవేములపల్లి : మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం గుప్తనిధుల కలకలం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బీమారం–సూర్యాపేట రహదారి సమీపంలో పెరుమళ్ల కృష్ణయ్య పొలం వద్ద పురాతన కాలానికి చెందిన శివుడి శిలాఫలకం, నాటి లిపితో కూడిన బండరాయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ రాయిపై కుంకుమ, పసుపు చల్లి తవ్వకాలు చేసి, తిరిగి రాయిని అక్కడే ప్రతిష్ఠించి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన కృష్ణయ్య ఈ విషయాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో, గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామంలో చర్చ సాగుతోంది. -
ముగ్గురు జూదరుల అరెస్ట్
తుర్కపల్లి : మండలంలోని వాసాలమర్రి గ్రామ శివారులో జూదం అడుతున్న ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తకియొద్దిన్ తెలిపారు. గ్మ్రా శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి మేడ్చల్కు చెందిన పెంజెర్ల రాజేందర్, దేవరి వేణురాజ్, కామారెడ్డికి చెందిన కోరంపల్లి సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పారిపోయారు. వారి వద్ద నుంచి రూ. 2.07 లక్షల నగదు, మూడు కార్లు, రెండు సెట్ల పేక ముక్కలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మణ్ సహాయంతో వాసాలమర్రి శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో కొంతమంది పేకాట నిర్వహిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫ రూ. 2లక్షలు స్వాధీనం -
నల్లబెల్లం, పటిక పట్టివేత
మోతె : మండల పరిధిలోని గోల్తండాలో శుక్రవారం గుగులోతు మంగిత్య కుమారుడు రవీందర్ ఇంటి వద్ద 60 కేజీల నల్ల బెల్లం, 250 కేజీల పటికతో పాటు 5 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గుగులోతు రవీందర్ను సూర్యాపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించినట్లు తెలిపారు. ఎన్ఫోర్సుమెంట్ ఇన్స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఎస్సై పి.గోపాల్రావు, హెడ్ కానిస్టేబుల్ అప్సర్, సిబ్బంది బ్రహ్మం, రమేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికమిర్యాలగూడ టౌన్ : హైదరాబాద్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ స్థాయి కరాటే పోటీలకు మిర్యాలగూడ మండలంలోని నలంద విద్యాలయం విద్యార్థులు ఎంపికయ్యారు. ఎల్లో బెల్ట్ అండర్–12 విభాగంలో బండారి హరిచందన, చేపూరి వంశీ, అండర్–14 విభాగంలో చేపూరి వర్షిత, కేతావత్ ఉదయ్ శ్రీ, రమావత్ దీపిక, రమావత్ శ్రవంతి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జొన్నలగడ్డ వెంకట్రెడ్డి, కరస్పాండెంట్ జొన్నలగడ్డ రజని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. వీధి కుక్కల దాడిలో 10 మేక పిల్లలు మృతి నడిగూడెం : మండలంలోని నారాయణపురం గ్రామంలో తీగల శ్రీను ఇంటి ఆవరణలో ఉన్న మేక పిల్లలపై శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 10 మేక పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెందాయి. రూ.40 వేలకు పైగా నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. -
ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి
కోదాడ : పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడానికే ప్రజాచైతన్య వేదిక పీపుల్స్ ఎజెండాను రూపొందించిదని, నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు వీటిని గుర్తించి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని అన్నారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులకు పీపుల్ ఎజెండా కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య వంతమైన కోదాడ పట్టణం అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉండడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరాన్ని ఉందన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. ఆయన వెంట వేదిక సభ్యులు ఉన్నారు. టీచరు కొట్టాడని.. పోలీసులకు విద్యార్థి ఫిర్యాదుమర్రిగూడ : తనను ఉపాధ్యాయుడు కొట్టాడంటూ మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. బుధవారం జడ్పీహెచ్ఎస్లోని 8వ తరగతి ఇ–1 సెక్షన్కు చెందిన క్లాస్ టీచర్ సెలవు పెట్టడంతో వారికి హాజరు తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ వెళ్లారే గానీ హాజరు తీసుకోలేదు. ఈ విషయమై డీఈఓ కార్యాలయం నుంచి పాఠశాల ప్రధానోపాయుడికి ఫోన్ చేసి ప్రశ్నించారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో క్లాస్లో ఉన్న విద్యార్థిని మందలించాడు. సదరు విద్యార్థి గురువారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి తనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్సింగ్ని వివరణ కోరగా తాను విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని పేర్కొన్నారు -
భువనగిరి బంజారాహిల్స్
భువనగిరి టౌన్ : బంజారాహిల్స్ పేరు వినగానే హైదరాబాద్లో ఉన్న ప్రాంతం గుర్తుకు వస్తుంది. కానీ భువనగిరి పట్టణంలో కూడా బంజారాహిల్స్ కాలనీ ఉంది. హైదరాబాద్లో లాగానే ఎత్తైన ప్రదేశంలో ఈ కాలనీ ఏర్పాటు చేయడంతో దీనిని భువనగిరి బంజారాహిల్స్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో బంజారు భూములు ఎక్కువగా ఉండడంతో పాటు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు శివారు ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఇళ్ల సంఖ్య పెరిగి చివరకు ఒక కాలనీ ఏర్పడింది. ప్రస్తుతం పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు సైతం ఇక్కడ నిర్మిస్తున్నారు. -
నవాబుల నాటి మాల్ బౌలీ..
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలో చారిత్రక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అప్పటి పేర్లే నేటికీ కొనసాగుతున్నాయి. అలాంటిదే పాతబస్తీలో ఉన్న మాల్బౌలి. నిజాం కాలం నుంచి ఈ పేరు వాడుకలో ఉంది. బౌలి అంటే బావి అని అర్థం. నిజాం కాలంలో ఇక్కడ ఉన్న శివాలయం వద్ద ఒక బావి ఉండేది. అప్పట్లో ఈ బావి నుంచి నీటిని తోడే సమయంలో అందులోంచి నగలు లభించాయి. అందువల్ల ఆ బావికి మాల్ బౌలిని పిలవడం మొదలు పెట్టారు. ఆ బావి ఉన్న ప్రాంతానికి క్రమంగా ఆపేరే పడిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని మాల్బౌలి అని పిలుస్తుంటారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. -
మహిళలకు రేవంత్ సర్కార్ పెద్దపీట
యాదగిరిగుట్ట : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 7, 8 వార్డులలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారని వెల్లడించారు. ఎవరైనా మహిళ రుణం తీసుకొని మరణిస్తే ఆమెకు సంబంధించిన రుణం రూ.2లక్షలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మహిళా సంఘాలలో సభ్యత్వాలను అందజేస్తున్నామని తెలిపారు. అబద్ధాలకు నిలువుటద్దం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిజాలను దాచిపెట్టి, ప్రజలకు అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ప్రజల్లో ఉండాలే కానీ.. అబద్దాలపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంటోందన్నారు. కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిపై అసూయతో నిందలు వేస్తున్నాడని మంత్రి సీతక్క విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆమె ఓటర్లను కోరారు. ఆలేరు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీలను అద్బుతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 మున్సిపాలిటీల్లో 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు బిక్షపతిగౌడ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి, కౌన్సిలర్ అభ్యర్థులు ముక్కెర్ల వెంకటేష్, పెలిమెల్లి లావణ్య, ముక్కెర్ల మల్లేష్, మున్సిపల్ కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఫ అబద్ధాలతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంటోంది.. ఫ యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క -
నేడు జవహర్ నవోదయ పరీక్ష
పెద్దవూర : పెద్దవూర మండలం చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి 9వ, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ కె.శంకర్ తెలిపారు. 9వ తరగతికి 447 మంది బాలురు, 329 మంది బాలికలు మొత్తం 776 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరికి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్, దేవరకొండ రోడ్డులోని గవర్నమెంట్ బాలుర హైస్కూల్, పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 924 మంది బాలురు, 1,009 మంది బాలికలు మొత్తం 1933 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సూర్యాపేట జిల్లాలోనే 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ వెంట హాల్టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వివరాలు సూర్యాపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట, జెడ్పీహెచ్ఎస్(బాలుర), గవర్నమెంట్ (ఎంఏఎం) హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్(బాలికలు) మున్సిపల్ ట్యాంకు దగ్గర, గవర్నమెంట్ హైస్కూల్ నంబర్–2, కోదాడలోని కేఎస్ ఎస్బీఎం జెడ్పీహెచ్ఎస్ బాలురు, జెడ్పీహెచ్ఎస్ బాలురు, సెయింట్ జోసెఫ్ సీసీఆర్ హైస్కూల్. ఫ 9వ తరగతి, ఇంటర్లో ప్రవేశం -
జీవామృతంతో చీడపీడల నివారణ
నడిగూడెం : ఘన, ద్రవ జీవామృతంతోపాటు వేస్ట్ డీకంపోజర్, వర్మి కంపోస్టు వాడడం ద్వారా పంటలకు సోకే చీడపీడలను నివారించవచ్చని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి డి.నరేష్, మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఏ.కిరణ్ సూచించారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు క్రింద కృషి, సఖీ బృందాల సభ్యులకు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసికర్ల శేషు కుమార్ సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. 1.50 ఎకరాల విస్తీర్ణంలో సహజసిద్ధ పద్ధతుల్లో చేస్తున్న సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతు వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు పలు అంశాలపై సభ్యులకు ప్రయోగపూర్వకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆత్మా డీపీడీ జి.నివేదిత, కె.మల్లారెడ్డి, బి.భువనేశ్వరి పాల్గొన్నారు. -
ప్రలోభాలతో ప్రసన్నం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రలోభాలు మొదలయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. డివిజన్లు, వార్డుల వారీగా తమ పరిస్థితి ఏమిటో ఓ అంచనాకు వస్తున్న అభ్యర్థులు ఎన్నికల్లో బయటపడే మార్గాలను వెదుకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రచారం కొనసాగిస్తూ.. రాత్రి పూట మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. పురుష ఓటర్లను మందు పార్టీలతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మందుతో విందు భోజనాలు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు పార్టీలు ఇస్తున్నారు. విందులు ఏర్పాటు చేస్తున్నారు. పలు డివిజన్లలోని సంఘాలు, కమ్యూనిటీ గ్రూపులకు విందులు ఇస్తున్నారు. ముఖ్యంగా యువతకు, కాలనీల్లో ఉండే ఆయా సంఘాలకు సాయంత్రమైతే దావత్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగస్తులు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అసోసియేషన్లు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అసోసియేషన్ బాధ్యులకు నగదు ఇస్తామంటూ ఆశజూపి వారి మద్దతు కోరుతున్నట్లు తెలిసింది. అపార్ట్మెంట్లలోని ఓటర్లకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ముఖ్యంగా నల్లగొండతో పాటు మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. కొన్ని అపార్ట్మెంట్లలో బయటకు డబ్బు తీసుకోమని చెబుతుండడంతో.. వారికి ఖరీదైన మద్యంతో మర్యాద చేయాల్సి వస్తోందని, అందుకు ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. రహస్య ప్రాంతాల్లో పార్టీలు నల్లగొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం మాత్రం ఎవరెవరికి పార్టీలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలనే విషయాలపైనే ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఓటరు జాబితా ఆధారంగా అభ్యర్ధులు.. ఉదయం నుంచే ఓటర్ల సమయాన్ని కోరుతున్నారు. తమకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డులో ఉన్న ఉద్యోగులను రహస్య ప్రాంతాలకు తరలించి ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఓ చోటకు చేర్చుతున్నారు. ఇక రాత్రివేళ బయటకు రాలేని ఉద్యోగులు, ఇతరుల కోసం నేరుగా మద్యం బాటిళ్లను తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం. అప్పుడే మద్యం పంపిణీ పలు డివిజన్లు, వార్డుల్లో అప్పుడే ఇంటింటికీ మద్యం బాటిళ్లు పంపిణీ చేయడం మొదలైనట్లు చెబుతున్నారు. డబ్బుల పంపిణీ మినహా మిగిలిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాల అమలు దిశగా సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు రోజు వారీ ఖర్చులు చూసి లబోదిబోమంటున్నారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు తాయిలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఓటుకు ఎంత పంచాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నారు. కొన్ని డివిజన్లు, వార్డుల్లో మహిళలకు కొందరు అభ్యర్థులు చీరలు, సారెలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాటితో పాటు కొన్నిచోట్ల స్వీట్లు ప్యాకెట్లను అందిస్తున్నారు. కొందరు అభ్యర్థుల పరిస్థితి ఇలా ఉంటే మరి కొందరు మహిళలకు కాలనీల వారీగా గెటుగెదర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ పొద్దంతా ప్రచారం.. రాత్రి వేళ ఓటర్లకు దావత్లు ఫ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రణాళిక ఫ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలకు ప్రత్యేకంగా సిట్టింగ్ ఫ మహిళలకు చీరల పంపిణీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు -
బడుల్లో మోగని నీటిగంట
నల్లగొండ : పాఠశాలల్లో వాటర్ బెల్ మూగబోయింది. విద్యార్థులు సమయానికి తప్పనిసరిగా నీరు తాగేందుకు వాటర్బెల్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. విద్యాధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఎక్కడా వాటర్ బెల్ మోగడం లేదని విమర్శలు వస్తున్నాయి. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా వాటర్ బెల్ అమలయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో చాలా మంది విద్యార్థులు తగినన్ని నీరు తీసుకోరు. నీరు ఎక్కువ తాగితే టీచర్లు మూత్రశాలలకు పంపరని మరికొందరు భావిస్తుంటారు. అంతేకాకుండా మూత్రశాలలు లేవని, దప్పిక వేయడం లేదని ఇంకొందరు నీరు తాగడం లేదు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీనిని అధిగమించేందుకు కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో కూడా వాటర్ బెల్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ఫ పాఠశాలల్లో అమలు కాని వాటర్బెల్ ఫ కొరవడిన విద్యాధికారుల పర్యవేక్షణ వయస్సుల వారీగా తీసుకోవాల్సిన నీరు ఇలా.. వయస్సు లీటర్లు 1, 2 1 2– 5 1.2 5– 8 1.5 9– 13 1.6 –2 14– 18 2.2 –2.6 -
పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫాం–12 సమర్పించాలని సూచించారు. పోల్ చీటీల పంపిణీ 54 శాతం పూర్తయిందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. చెర్వుగట్టు హుండీ లెక్కింపునార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాననికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 16 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను శుక్రవారం మహా మండపంలో లెక్కించారు. రూ.26,14,237 ఆదాయం వచ్చి నట్లు ఆలయ ఆధికారి మోహన్బాబు తెలి పారు. అన్నదానం కార్యక్రమానికి భక్తులు సమర్పించిన హుండీని లెక్కించగా రూ. 16,45,100 వచ్చినట్లు వెల్లగించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, సర్పంచ్ నేతగాని కృష్ణ, వరాల రమేష్, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివా స్రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, నరేష్, మహేందర్రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్రెడ్డి ఓటుకు నోటు దొంగ ఫ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లగొండ టూటౌన్: సీఎం రేవంత్రెడ్డి ఓటుకు నోటు దొంగ అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ, అమిత్షాలపై సీఎం రేవంత్రెడ్డి ప్రగల్బాలు మాట్లాడటం మానుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతంపైగా కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్, పోతెపాక లింగస్వామి, చింత ముత్యాల్రావు, మిర్యాల వెంకటేశం, శ్రీనివాస్, పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవ సేవభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారికి సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, రాత్రి పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
సాగర్కు వివిధ రాష్ట్రాల అధికారులు
నాగార్జునసాగర్ : భారత్ దర్శన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు ప్రపంచ పర్యటక కేంద్రమైన నాగార్జునసాగర్ను శుక్రవారం సందర్శించారు. వీరు వారం రోజులుగా హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. సాగర్కు చేరుకున్న ఈ బృందానికి జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు నాగార్జునసాగర్ డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాన్ని, బుద్ధవనాన్ని సందర్శించారు. ఇక్కడి విశేషాలను తెలుసుకున్నారు. బుద్ధవనంలోని బుద్ధ విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని ఆసక్తిగా వీక్షించారు. పెద్దవూర తహసీల్దార్ దేవిక్ష, సాగర్ ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాస్రెడ్డి, వెంకటరమణ, జోసెప్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
28వ తేదీలోగా సీఎంఆర్ ఇవ్వాలి
నల్లగొండ : మిల్లర్లు ఈనెల 28వ తేదీలోగా సీఎంఆర్ (కష్టం మిల్లింగ్ రైస్)ను చెల్లించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సీఎంఆర్పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2024–25కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను.. పెండింగ్ లేకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2025–26 యాసంగి సీజన్కు మిల్లర్లు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. గన్ని బ్యాగులను కార్పొరేషన్కు అప్పగించాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేష్, డీఎం రామ్, నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, శ్రీనివాస్, భద్రాద్రి ఇంద్రారెడ్డి, గౌరు వెంకటేశ్వర్లు, బాబి తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ -
అన్నం తినే చేతిని మరువద్దు
నల్లగొండ : ‘అన్నం తినే చేతిని మరువద్దు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. హస్తమే మీకు అండగా ఉంటుంది’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని 21వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నల్లగొండకు ఎన్ని నిధులు అడిగినా ఇస్తామన్నారని.. నల్లగొండను స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులకు ఓట్లేస్తే ప్రయోజనం ఉండదదని.. వారికి ఎమ్మెల్యే, మంత్రులు లేరి.. వారు ఎవరి వద్దకు వెళ్లి సమస్య పరిష్కరిస్తారో మీరే అర్థం చేసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉందని.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్లగొండలో రూ.900 కోట్లతో రింగురోడ్డు, లతీప్సాబ్గుట్ట, బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్డు పనులు సాగుతున్నాయన్నారు. అంతకు ముందు 4వ డివిజన్ కేశరాజుపల్లి, 5వ డివిజన్, 20వ డివిజన్, 42వ డివిజన్, 47వ డివిజన్లో ప్రచారం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, కార్పొరేటర్ అభ్యర్థులు ఇబ్రహీం, సుభాష్, పబ్బుసాయి, యామ కవిత, బోగరి వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు. ఫ కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించాలి ఫ ఎన్నికలప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ను శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నల్లగొండలోని తన చాంబర్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీలలోని 162 వార్డులకు, 475 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 20 శాతం రిజర్వ్తో కలుపుకొని 270 మంది కౌంటింగ్ సిబ్బంది, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు మొత్తం 810 మంది సిబ్బందికి ర్యాండమెంజేషన్ నిర్వహించినట్లు తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 56 కౌంటింగ్ టేబుళ్లు, 16 ఆర్ఓ టేబుళ్లు మొత్తం 72 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్, ఆర్ఓ టేబుళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు జి.రమేష్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఎన్నికల డీటీ విజయ్ పాల్గొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు, ప్రలోబాలకు గురిచేసే సామగ్రిపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నిఘా ఉంచాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్ట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ సమస్యత్మాక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్నారు. 47 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని తెలిపారు. సమావేవంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
నల్లగొండ టూటౌన్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. శుకవారం వారు నల్లగొండలోని 5, 13, 21, 14, 45, 46, 15, 16, 17 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నీలగిరి పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు. నల్లగొండ నియోజకవర్గానికి కేసీఆర్ రూ.1500 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్న కాంగ్రెస్
చిట్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి ప్రజాధనాన్ని లూఠీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. చిట్యాలలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, రైతు భరోసా, ఆసరా ఫించన్ల పెంపు వంటి హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు గుండాల నరేష్గౌడ్, మాస శ్రీనివాస్, కూరెళ్ల శ్రీను, పల్లె వెంకన్న, కంబాలపల్లి సతీష్కుమార్, గంజి గోవర్ధన్, జయారపు రామకృష్ణ, అంశల అనిల్కుమార్ పాల్గొన్నారు.ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సయ్యగౌడ్ -
కనగల్ పీహెచ్సీని ఆదర్శంగా తీసుకోవాలి
కనగల్ : ప్రతినెలా 4 నుంచి 6 వరకు ప్రసవాలు జరుగుతున్న కనగల్ పీహెచ్సీని ఇతర పీహెచ్సీలు ఆదర్శంగా తీసుకొని వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. గురువారం ఆయన కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ల్యాబ్, వార్డులు లేబర్ రూమ్ ఫార్మసీ గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్సీ లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో కనగల్ పీహెచ్సీ జిల్లాలో ముందుండటం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్రెడ్డి, రాహుల్, దీప, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్ , ప్రోగ్రాం ఆఫీసర్స్ కళ్యాణ్ చక్రవర్తి, పద్మ, కృష్ణకుమారి, నగేష్, డీపీఓ విష్ణు, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ గాదరి రామకృష్ణ, డాక్టర్ రమణారెడ్డి, వెంకటేశం, శేషాదేవి, పద్మ పాల్గొన్నారు. ఫ వైద్య ఆరోగ్యశాఖ డీహెచ్ రవీంద్రనాయక్ -
వైభవంగా యాదగిరీశుడి నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ప్రకారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం అంతరాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేశారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్నేత చండూరు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు పున్నాౖకైలాష్నేత కోరారు. చండూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అయితేనే మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే రూ. చండూరు మున్సిపాలిటీలో రూ.30 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరో రూ.15 కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మునుగోడు అభివృద్ధి కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసింది శూన్యమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. చండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అనంత చంద్రశేఖర్, కోడి శ్రీనివాసులు, బూతరాజు ఆంజనేయులు, మల్లేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ను తిడితే గొప్పోడివి కావు
మిర్యాలగూడ : 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ను విమర్శిస్తే ఎప్పటికీ గొప్పోడివి కావని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ మండలం గూడూరులో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్రెడ్డి అని, ఆ కేసులో 56 రోజులు జైలులో ఉన్నారని, ఇప్పటికీ ఆయనపై 86 కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గతంలో రేవంత్రెడ్డి ఎవరి బూట్లు తుడిచాడో, ఎవరి కాళ్లు పట్టుకున్నాడో అందరికీ తెలుసని విమర్శించారు. కాంట్రాక్టర్లు, అధికారులను బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణకు ఎప్పటికీ జాతిపిత అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి మరోసారి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పట్టణంలో కౌన్సిలర్ల నామినేషన్లను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. రెండేళ్ల పాలనలో మిర్యాలగూడ పట్టణానికి ఇప్పటివరకు ఎలాంటి నిధులు తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో అన్నభీమోజు నాగార్జునచారి, నల్లమోతు సిద్ధార్థ, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, కట్టా మల్లేష్గౌడ్, కుందూరు వీరకోటిరెడ్డి, హాతీరాంనాయక్ పాల్గొన్నారు. ఫ తెలంగాణ జాతిపిత కేసీఆరే.. ఫ మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుండాల : పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ మోత్కూరు సెక్షన్ ఆఫీసర్ కె.ఎల్లేష్ సూచించారు. గురువారం గుండాల మండలం వెల్మజాల గ్రామంలో రైతులు పడకంటి నరేందర్, పడకంటి శ్రీను, జోలం పాండు వ్యవసాయ భూమిలో పులి సంచరించినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలను పరిశీలించారు. ఇవి పులిపాదముద్రలే అని నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎలేష్ మాట్లాడుతూ రైతులు ఎవరూ రాత్రి వేళల్లో ఒంటరిగా వ్యవసాయ బావుల వద్దకు వెళ్ల వద్దన్నారు. పశువులు, గొర్రెలు, మేకలను ఇళ్ల వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారి పి.శ్రీనివాస్, సర్పంచ్ కుర్మిళ్ల కవితశ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాస ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఫారెస్ట్ అధికారుల సూచన -
వైద్యులు సమన్వయంతో పనిచేయాలి
నల్లగొండ : ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమ్మడి జిల్లా మూడు ప్రధాన విభాగాల అధిపతులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ఆసుపత్రులు, వైద్య కళాశాలల అధిపతులతో సమన్వయ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నల్లగొండ జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించుకోవాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో వైద్యాధికారులు పుట్ల శ్రీనివాస్, వెంకటరమణ, మనోహర్, నల్లగొండ డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, నల్లగొండ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జె.సత్యనారాయణ, సూపరింటెండెంట్ నరసింహారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దష్ట్యా, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జోనల్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులకు గురువారం నల్లగొండలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. మాస్టర్ ట్రైనర్ సోమయ్య పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు దేవరకొండ : ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. మెటర్నటీ, ఇన్, అవుట్ పేషెంట్ల వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యులకు ఆయన పలు సూచనలిచ్చారు. ఆస్పత్రిలో గల వైద్యులు, సిబ్బంది వివరాలను సూపరింటెండెంట్ రవిప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఆయన వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు. నాణ్యమైన భోజనం పెట్టాలిమునుగోడు : ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శంకర్నాయక్ అన్నారు. గురువారం ఆయన మునగోడులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామగ్రితోపాటు పండ్లు, కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. వంటలు రుచికరంగా పెడుతున్నారా అన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ యుగేంధర్రెడ్డి, పాఠశాల ప్రత్యేక అధికారి వసంత ఉన్నారు. నర్సరీల్లో పనుల వేగవంతానికి కృషితిప్పర్తి : వచ్చే సీజన్కు అవసరమయ్యే మొక్కల పెంచడానికి నర్సరీల్లో పనుల వేగవంతానికి కృషిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి.శ్రీనివాస్రావు అన్నారు. గురువారం ఆయన తిప్పర్తి మండలం రామలింగాలగూడేన్ని ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి నిషతో కలిసి సందర్శించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, గత 15వ ఆర్థిక సంఘం ద్వారా చేపట్టిన పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నర్సరీలతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, సర్పంచ్ ముత్తినేని శ్యాంసుందర్, ఫారెస్ట్ అధికారి మౌనిక, ఎంపీడీఓ జానయ్య, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
5,59,327 ఎకరాల్లో పంటలు
నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్ ముగిసింది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమైన యాసంగి సాగు జనవరి నెలాఖరుతో ముగిసిపోయింది. ఇప్పటి వరకు 5,52,327 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీటి విడుదల చేస్తుండడంతో వాటి పరిధిలో వరి పెద్ద ఎత్తున సాగైంది. అంచనాకు తగ్గిన వరిసాగు యాసంగిలో 6లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. అందులో వరి 5.50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని లెక్కలు వేసింది. అయితే సీజన్ముగిసే నాటికి వరి 4,36,876 ఎకరాల్లో సాగైంది. డిండి అయకట్టు పరిధిలో ఈ సారి సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతులు సాగు చేయలేదు. కేవలం బోరుబావుల కిందనే వరినాట్లు వేసుకున్నారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలకు వరిసాగు కొంత సాగు తగ్గింది. వరి తరువాత రెండవ స్థానంలో వేరుశనగను రైతులు సాగు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 18,823 ఎకరాల్లో రైతులు వేరుశనగ వేశారు. ఎక్కువగా దేవరకొండ, చందంపేట, పీఏపల్లి తదితర మండలాల్లో వేరుశనగ సాగైంది. రైతు భరోసా కోసం ఎదురుచూపులు యాసంగి సీజన్ సాగు ముగిసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుభరోసా విడుదల చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది రైతులు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం రైతులు ఖాతాల్లో జమచేస్తారని రైతులు భావించారు. ప్రభుత్వం యాసంగి రైతుభరోసాను ఇస్తుందా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం జనవరి 26న రైతుభరోసా డబ్బులను విడుదల చేసిన ప్రభుత్వం మొన్నటి వరకు ప్రస్తుతం ఎలాంటి ప్రకటనా చేయలేదు. బుధవారం మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా వేస్తామని ప్రకటించడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు.ఫ ముగిసిన యాసంగి సీజన్ ఫ అత్యధికంగా 4,36,876 ఎకరాల్లో సాగైన వరి -
తక్షణమే మోటార్లు అందించాలి
జిల్లాలోనే ఎక్కువగా తేనపల్లితండా పరిధిలో 14 బోర్లు వేశారు. ఒక్క మోటారు బిగించలేదు. బోర్లుకు సొంతంగా విద్యుత్ సౌకర్యం, మోటారు ఏర్పాటు చేసుకొనే విషయంతో రైతుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కరెంటు సౌకర్యం, మోటార్లకు నిధులు విడుదల చేయాలి. –వడిత్యా రజిత, సర్పంచ్, తేనపల్లితండా గిరి వికాసం పథకం కింద రెండేళ్ల క్రితం జిల్లాలో 56 బోర్లు వేయగా వాటికి కరెంటు సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇందుకుగాను నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కరెంట్ సౌకర్యం వస్తేనే మోటార్లు ఇతర వసతులు కల్పించేందుకు వీలవుతుంది. – వై. శేఖర్రెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ చంద్రశేఖర్ మిర్యాలగూడ : ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలోని బాలికల వసతిగృహాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులను, వంట గదిని, భోజనాన్ని, బియ్యం, వంట సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. సిబ్బంది నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయాలతో వంటలు వండి విద్యార్ధులకు అందించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు. -
సంక్షేమానికే మీ ఓటు
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిర్యాలగూడలో ఆసియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని.. ఈ ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహిళలకు రుణాలు అందించి కోటీశ్వరులను చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. మిర్యాలగూడ పెద్ద పట్టణమని ఇక్కడి ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని.. సోనియాగాంధీ తెలంగాణ దేవత అన్నారు. కాంగ్రెస్ మరో 20 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. – మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మనుషులు, ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 12లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో నెల్లికల్లు, వీర్లపాలెం, దున్నపోతులగండి, తోపుచర్ల, కేశవాపురం లిఫ్టులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకుని రైతులకు అందిస్తున్నామన్నారు. – జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కార్పొరేట్ స్థాయిలో అన్ని వర్గాల పిల్లలకు విద్యను అందించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలన్నారు. ,మిర్యాలగూడ : కాంగ్రెస్ పాలనలో పేదలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సంక్షేమానికి పట్టం కట్టేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు.. కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారాలన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో లక్షలాది మందికి రేషన్కార్డులు అందించి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసియా ఖండంలోనే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిందని అన్నారు. ఇక్కడ అధునాతన రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సన్న వడ్లను మద్దతు ధరకు కొని.. బోనస్ రూ.500 ఇస్తున్నామన్నారు. 25.35లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నామని.. త్వరలో మరో రూ.9వేల కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామన్నారు. రూ.22,500 కోట్లతో ఇళ్ల నిర్మాణం వైఎస్సార్ హయాంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పదేండ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇళ్లను పేదలకు ఇచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతమని, ఈ సమస్య పరిష్కారానికి ప్రాజెక్టులు కట్టించామన్నారు. 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎస్ఎల్బీసీని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేశాం రెండేండ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.17,472 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నల్లగొండలోని మున్సిపాలిటీలకు రూ.2,228కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో రూ.295 కోట్లను మంజూరు చేశామన్నారు. భవిష్యత్లో మిర్యాలగూడ మున్సిపాలిటీకి, నల్లగొండ కార్పొరేషన్కు ఏం కావాలన్నా చేస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికలు అయ్యాక నాగార్జునసాగర్లో ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరిస్తానన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణం వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, పద్మావతి, వంశీచందర్, మాజీ ఎంపీ హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ శంకర్నాయక్ కోరారు. అర్హులందరికీ రేషన్కార్డులు అందించి సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ నిర్బందాలు ఉండేవని, నేడు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పెద్దలు జానారెడ్డి స్ఫూర్తితో రేవంత్రెడ్డి సారథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసికట్టుగా ఉండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్నారు. మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడకు జిల్లా అయ్యే అర్హతలు ఉన్నాయని జిల్లాగా ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల్లో విశ్వాసం నింపేందుకే కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయించానని, కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. తాను ముఖ్యమంత్రికి ఇచ్చిన రూ.2 కోట్ల చెక్కుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ డబ్బులను రైతు సంక్షేమం కోసం వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఫ రూ.17,472 కోట్లతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నాం ఫ ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండబెట్టింది ఫ నల్లగొండ, మిర్యాలగూడకు ఎన్ని నిధులైనా ఇస్తా ఫ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ మిర్యాలగూడలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ బహిరంగ సభ జానారెడ్డి నమ్మి భాస్కర్రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను ఆయన మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వాపస్ తీసుకోవాలని భాస్కర్రావు బెదిరిస్తున్నారని.. ‘మా అభ్యర్థులను బెదిరిస్తే భాస్కర్రావు.. నీకు చింతపండు అవుతుంది’ అని హెచ్చరించారు. ఆయన బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. సర్పంచ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులు అందరు మనోళ్లే ఉన్నారని.. కౌన్సిలర్లు వేరే వాళ్లు ఉంటే పనిచేయరని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. -
రేవంత్ రెడ్డివి నీతి మాలిన పనులు
నల్లగొండ టూటౌన్ : ‘సీఎంరేవంత్ రెడ్డివి అన్నీ నీతి మాలిన పనులే... ఇవ్వాళ కోడ్ను ఉల్లంఘిస్తూ మిర్యాలగూడ సభలో శంకుస్థాపనలు చేసిండు.. హడావుడి చేసిండు... దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి’ అని మాజీ మంత్రి జి. జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సందర్భంగా మాట్లాడారు. ‘జిల్లాకు వచ్చిండు... అవే చిల్లర మాటలు, అవే బూతులు మాట్లాడి పోయిండు..అక్కడ ఉన్న మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మీద కూడా అవాకులు మాట్లాడిండు’ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిల్లర మాటలు, భూతులు మాట్లాడి సీఎం తన పరువు తీసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన మాటలకు కొంతమంది ఆహా ఓహో అంటూ వంతపాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు, ప్రజలకు ఏమి చేస్తావో చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మీద అవాకులు మాట్లాడాడని విమర్శించారు. అవి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని.. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు వేస్తామంటున్నాడని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్కి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి ఆ పార్టీ పెద్దలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మిర్యాలగూడలో కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం స్పందించాలి -
ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ప్రవేశాలకు ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శశికళ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. http://tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 25న హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, మార్చి 1న ఉదయం 11.00 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. వివరాలకు 9396621492 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్యాన్సర్పై ఎంజీయూలో అవగాహన సదస్సునల్లగొండ టూటౌన్ : వరల్డ్ క్యాన్సర్డే సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఎంజీయూలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తిస్తే సరైన సమయంలో టీకా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధులను ముందుగానే నివారించవచ్చున్నారు. టీకా ప్రాధాన్యత, అవసరం, ప్రయోజనాలను ఆమె వివరించారు. ఈ సదస్సులో డాక్టర్లు వసంతకుమారి, శ్రీదేవి, మారం వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. వైద్య కళాశాల అధ్యాపకులకు శిక్షణనల్లగొండ టౌన్ : గాంధీ మెడికల్ కాలేజీ సికింద్రాబాద్ ఎన్ఎంసీ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకులకు బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2026 అంశంపై మూడు రోజులపాటు శిక్షణనిచ్చారు. మెడికల్ విద్యార్థులకు మెరుగ్గా బోధించేందుకు అవసరమైన ఆధునిక బోధనా పద్ధతులపై అధ్యాపకుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్లు కిరణ్ మాదల, శివ, రాంచందర్, తిరుపతిరావు, స్వరూపారాణి, అనుపమ, గీత పాల్గొన్నారు. వేణుగోపాలస్వామి ఊరేగింపునార్కట్పల్లి: మండలంలోని గోపలాయపల్లి సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన బుధవారం వారిజాల వేణుగోపాలస్వామి గ్రామోత్సవం(ఊరేగింపు) కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో కనులపండువగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు గట్టుపై నుంచి గోపలాయపల్లి గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. భక్తులు, మహిళలు కోలాటం ఆడారు. ఈ వేడుకల్లో సర్పంచ్ మచ్చ జయసుధ ముత్యాలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధార యాదయ్య, ఈఓ వెంకటరెడ్డి, దోసపాడు విష్ణుమూర్తి, బాసెట్టి శ్రీనివాస్, నరసింహ, రామ్ గోపాల్రెడ్డి, వరలక్ష్మి, గోసుల భద్రాచలం, మచ్చ నరేష్, గోసుల సుదర్శన్, పాండు, కృష్ణయ్య, ఎర్రయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
వికసించని ‘గిరి వికాసం’
ఫ ఈ పథకం కింద జిల్లాలో 56 బోర్లు వేసినా.. వాటికి మోటార్లు లేవు ఫ రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఫ అసలు ఈ పథకం ఉందా.. లేదా అని గిరిజనుల అనుమానం గుర్రంపోడు : మెట్ట వ్యవసాయం చేస్తూ ఎదుగు బొదుగు లేని జీవితాలు గడుపుతున్న గిరిజన రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో చేపట్టిన సీఎం గిరివికాస పథకం అడుగు ముందుకు పడడం లేదు. రెండేళ్ల క్రితమే జిల్లా వ్యాప్తంగా గిరిజన లబ్ధిదారులను గుర్తించి వారి భూముల్లో 56 బోర్లు వేసినా.. వాటికి విద్యుత్ సౌకర్యం, మోటార్లు అందించలేదు. వేసిన బోర్లకు కరెంటు, మోటార్లు అందిస్తే 380 ఎకరాలు సాగులోకి వచ్చేది. కానీ రెండేళ్లుగా ఎలాంటి కదలికా లేకపోవడంతో అసలు ఈ పథకాన్ని ఉన్నట్లా.. లేనట్లా అనే సందేహం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. బోర్లకే పరిమితం గతంలో ఉన్న ఇందిర జలప్రభను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం గిరివికాస పథకంగా పేరు మార్చింది. 2022లో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించి 110 మంది లబ్ధిదారులను ఎంపికచేశారు. ఇద్దరు, ముగ్గురు గిరిజన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా.. ఐదు నుంచి పది ఎకరాల భూములను యూనిట్గా తీసుకున్నారు. భూగర్భ జలవనరుల శాఖ నివేదిక మేరకు 2023 మార్చిలో వారి భూముల్లో 56 బోర్లు వేశారు. రెండేళ్లుగా వాటికి విద్యుత్ సౌకర్యంగాని, మోటార్లుగాని ఇవ్వలేదు. బోర్లు వేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు కూడా చెల్లించలేదు. కరెంటు సౌకర్యం కోసం విద్యుత్ సంస్థకు డబ్బులు జమ చేయడానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. రైతుల ఆశలపై నీళ్లు.. ముందుగా కరెంటు సౌకర్యానికి నిధులు మంజూరైతేనే.. ఆ తర్వాత మోటార్లకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం ఇక్కడే అర్ధాంతరంగా నిలిచిపోయింది. లబ్ధిదారుల భూములను ఉపాధిహామీ పథకం ద్వారా అభివృద్ధి చేసి సాగులోకి తేవాల్సి ఉంది. సీఎం గిరివికాస పథకంలో తమ భూములకు సాగునీరు అందుతుందని, మెట్టభూములు సస్యశ్యామలం అవుతాయని ఆశించిన రైతులకు కానీ ప్రభుత్వ అలసత్వం కారణంగా నిరాశే ఎదురవుతోంది. అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అన్న విషయంలో అధికారుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా బోర్లకు మోటార్ల గురించి ప్రస్తావించిన దాఖలాలేవని పలువురు రైతులు వాపోతున్నారు. గిరిజనుల భూముల్లో వేసిన బోర్లు ఇలా.. మండలం బోర్ల సంఖ్య చందంపేట 4 చింతపల్లి 1 దేవరకొండ 11 డిండి 10 నాంపల్లి 3 నేరెడుగొమ్ము 1 గుర్రంపోడు 14 పీఏపల్లి 11 తిరుమలగిరిసాగర్ 1 -
జీరా రైస్లో గుట్కా ప్కాకెట్
● ఎంజీయూ వద్ద రోడ్డెక్కిన విద్యార్థులు నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మెస్లో జీరా రైస్లో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం సృష్టించింది. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం, వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యార్థి నాయకులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మోహన్, ఛత్రపతి, మౌనేష్, సుధీర్, అజయ్, సతీష్, శంకర్, సూర్య, విజయ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీలో ఉండేదెవరో..!
నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉండే వారిపై చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు. నామినేషన్లు వేసినా, ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం, బి ఫారాలను ఇవ్వకపోవడంతో ఆయా అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు, పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థులుగా గుర్తింపు కల్పించే బి ఫారాలను అందజేసే గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు అన్ని పార్టీలు అభ్యర్థులను తేల్చకపోవడంతో ఆశావహులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బుజ్జగింపుల ద్వారా నామినేషన్ల ఉపసంహరణకు చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో నాయకులకు రెబల్స్ గుబులు పట్టుకుంది. నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి పేరు సహా అన్ని డివిజన్లకు 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారికి బిఫారాలు అందజేస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థి ఎవరన్నది స్పష్టం చేయలేదు. మరోవైపు బీజేపీ 26 మంది అభ్యర్థులనే ప్రకటించింది. అందులో ముగ్గురి పేర్లను మార్పు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఎవరికి బీఫారం దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 35వ డివిజన్లో సిట్టింగ్ బీజేపీ కౌన్సిలర్ గుర్రం వెంకన్న భార్య గుర్రం ధనలక్ష్మి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాము టీఆర్ఎస్కు వెళ్లారన్న ప్రచారంలో వాస్తవం లేదని వెంకన్న పేర్కొన్నారు. అయితే అక్కడ ఇప్పటికే మరొకరి పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో ఎవరికి ఆ పార్టీ బిఫారం ఇస్తుందోనన్న గందరగోళం నెలకొంది. మరోవైపు అదే డివిజన్లో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. జిల్లాలోని మరో ఆరు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు అభ్యర్థులను తేల్చకపోవడంతో ఒక్కో వార్డునుంచి ముగ్గురు, నలుగురు చొప్పున నామినేషన్లు వేశారు. అయితే ఎవరకి పార్టీ బిఫారం ఇస్తుందనే విషయంలో స్పష్టత రాలేదు. చండూరు, మిర్యాలగూడ, చిట్యాల, దేవరకొండ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా కొంతమంది పేర్లను ప్రకటించినా, వారిలో బిఫాం ఇచ్చే విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే తమకు బీఫారం ఇవ్వాలంటూ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలకు తలనొప్పి తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం చాలా మంది పని చేశారు. ఆ సమయంలో వారికి కౌన్సిలర్ టికెట్ ఇస్తామన్న ఆశ చూపారు. ఇలా అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో రెండు మూడు రోజుల నుంచి బుజ్జగింపులు మొదలు పెట్టినా ఆశావహులు లొంగడం లేదు. బిఫాం వచ్చేదెవరికి.. అది దక్కనివారి దారెటు? బుజ్జగింపులకు లొంగని ఆశావహులు బిఫాం ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీలో ఉంటామని ప్రకటనలు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలోఅభ్యర్థులను తేల్చని పార్టీలు నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేతకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. -
సీఎం సభకు ఏర్పాట్లు ముమ్మరం
మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు సమీపంలో సభా వేదిక ఖరారు చేశారు. బహిరంగ సభలో సుమారు 40వేల మంది కూర్చొనే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు సౌకర్యంతోపాటు బారీకేడింగ్ తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో సభా ప్రాంగణం వద్ద గట్టి నిఘా పెట్టనున్నారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, వంద మంది ఎస్ఐలు, 900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. బహిరంగ సభ, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ, డీపీఓ తదితర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు -
విద్యుత్ స్టోర్ ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
నల్లగొండ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రైతులు ఏడాది క్రితం డీడీలు కట్టినా మెటీరియల్ ఇవ్వడం లేదంటూ విద్యుత్ కాంట్రాక్టర్లు సోమవారం నల్లగొండలోని విద్యుత్ స్టోర్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని చెబుతున్నా.. మెటీరియల్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్టోర్ అధికారులు రైతులకు సంబంధించిన మెటీరియల్కు కాకుండా.. ఇతర పనులకు సామగ్రి ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పంచింది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సామగ్రి వెంటనే ఇచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు రవిచంద్ర, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
118 మంది బాల కార్మికులకు విముక్తి
నల్లగొండ: ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో 92 కేసుల్లో 118 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులు, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంద కార్మికులుగా ఉన్నవారిని, కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడుతున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 92 కేసుల్లో 118 మంది పిల్లలను రెస్యూ చేసామని, వీరిలో 105 మంది బాలలు, 13 మంది బాలికలు ఉన్నారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో బీహార్, చత్తీస్ఘడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బాలకార్మికులను రెస్క్యూ చేసి కాపాడిన ఏహెచ్టీయూ సిబ్బంది, అధికారులను ఎస్పీ అభినందించి రివార్డ్ ప్రకటించారు. ఎవరైనా.. వీధి బాలలు, బాల కార్మికులు కనిపిస్తే డయల్100, 1098, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలరామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్–2026 (పాలిసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఫీజు ఎస్సీ ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.100 అదనపు రుసుంతో ఏప్రిల్ 21వ తేదీ, రూ.300 అదనపు రుసుంతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు నల్లగొండ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్కుమార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షకు 3 రోజుల ముందు నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలిమిర్యాలగూడ : వైద్యులు, సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ బస్తీ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీసీఓ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దీప, సిబ్బంది విష్ణు, మోతిలాల్, వాసుదేవరెడ్డి, ప్రభాకర్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండమేయర్ పీఠం బీజేపీదే● మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నల్లగొండ టూటౌన్ : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, తొలిసారి కార్పొరేషన్గా ఏర్పడిన నల్లగొండ మేయర్ పీఠం బీజేపీదేనని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్లో పోటీ చేసేందుకు బీజేపీలో పోటీ తీవ్రంగా ఉందని, ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నరసింహారెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవిగౌడ్, బొజ్జ శేఖర్, బీపంగి జగ్జీవన్, వంగూరి రాఖీ పాల్గొన్నారు. -
మార్చి 1న బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : ప్రపంచశాంతిని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న 3వ దమ్మ పాదయాత్ర మార్చి 1న నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకోనుందని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. థాయిలాండ్, భారతదేశాలకు చెందిన సుమారు వందమంది బౌద్ధ భిక్షవులు పాల్గొంటున్న ఈ యాత్ర కర్నాటకలోని కలబురిగి సిద్ధార్థ బుద్ధవిహార్ వద్ద సోమవారం ప్రారంభమైనట్లు తెలిపారు. కర్నాటకలోని ఉప్లాన్, కురికోట, మారగుట్టి, లాల్దారి, కప్పార్గం, మన్నెకెల్లి మీదుగా 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మడిగికి చేరుకోనుందని పేర్కొన్నారు. తెలంగాణలోని పలుప్రాంతాల మీదుగా సాగనున్న ఈ యాత్ర ఫిబ్రవరి 18న సికింద్రాబాద్ మహాబోధి బుద్ధవిహారానికి చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 20న బయల్దేరి ఉప్పల్ తర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, కొండమల్లేపల్లి, అంగడిపేట, పెద్దవూర మీదుగా మార్చి1వ తేదీన నాగార్జునసాగర్ చేరుకుంటుందని తెలిపారు. రెండు రోజులపాటు సాగర్లో ఉంటుందన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన బౌద్ధ భిక్షువులు హిమాచల్ప్రదేశ్లోని మనాలి ప్రాంతానికి చెందిన బౌద్ధ భిక్షువులు సోమవారం సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాలచెంత పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహా స్థూపంలో కాసేపు ధ్యానం చేశారు. వారికి ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్ధవనం బ్రోచర్లను అందజేసి.. బౌద్ధకండువాలతో సత్కరించారు. -
విధులు సమర్థంగా నిర్వహించాలి
నీటి గణన పూర్తి చేయాలి ఇరిగేషన్ వాటర్ బాడీస్ గణనను 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణనపై ఆయన సమీక్షించి మాట్లాడారు. మైనర్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు, మేజర్ ఇరిగేషన్ కింద ఉన్న నీటి వనరులు, బోర్లు, బావులకు సంబంధించిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్లో సాగునీటి ప్రణాళికలు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ గణన బలమైన ఆధారంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్ల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంటు, ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం వంటి అంశాలు వివరించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని టీ పోల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీలకులు జి.రమేష్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, డీఈఓ భిక్షపతి, ట్రైనింగ్ నోడల్ అధికారి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు ద్వారాక్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు
● కోదాడ – జడ్చర్ల హైవేపై ట్రాఫిక్ జామ్ మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని ఎఫ్సీఐ గోదాంలోకి వెళ్లే గూడ్స్ రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆదివారం ఉదయం కోదాడ–జడ్చర్ల హైవేపై అడ్డంగా నిలిచిపోయింది. దాంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు మరో స్టేషన్ నుంచి రైల్ ఇంజన్ రప్పించి రైలును అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం స్థానిక పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మహిళ మెడలో పుస్తెలతాడు చోరీనడిగూడెం : మహిళ మెడలో బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన ఆదివారం నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి కూలి పనులు చేసుకునే జంగిలి వీరమ్మ మధ్యాహ్నం సమయంలో గ్రామ శివారులోని గంగమ్మ గుడికి వెళ్తోంది. ఈక్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోతుండగా ఆమె ప్రతిఘటించి తాడును గట్టిగా పట్టుకోవడంతో సుమారు 20 గ్రాముల తాడు వరకు తెగి పడింది. దీంతో దానిని తీసుకొని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నల్లగొండ కార్పొరేటర్ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ ఫ ఎన్నికల సన్నద్ధంపై దిశా నిర్దేశం నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారీగా సమన్యాయం పాటించామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫ్రి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీరు గెలిస్తే నేను గెలిచినట్లేనని.. మీ గెలుపు, నా గెలుపు పేదల గెలుపు’ అన్నారు. నల్లగొండలో 48 కి 48 మంది కార్పొరేటర్లు గెలిస్తే పట్టణాభివృద్ధికి ఎన్ని నిధులైనా తెస్తానన్నారు. నల్లగొండలో బీసీలకు 70శాతం సీట్లు కేటాయించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మీరు గెలిచి.. అభివృద్ధి విషయం తనకు వదిలేయమని చెప్పారు. ప్రతి ఓటరును కలిసి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ జూమ్ మీటింగ్లో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య, బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, అబ్బగోని రమేష్గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
పాఠశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థి
నల్లగొండ : పాఠశాల భవనంపై నుంచి విద్యార్థి దూకడంతో అతడి రెండు కాళ్లు విరిగాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఆర్టీఐఎస్టీ ఇంజనీరింగ్ కాలేజీ భవన సముదాయంలో నిర్వహిస్తున్న తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరగగా.. అధికారులు మాత్రం గోప్యంగా ఉంచారు. వివరాలు.. గుర్రంపోడు మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన వేముల వెంకన్న, పద్మ దంపతుల కుమారుడు శివసాయి తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం తమ కుమారుడు శివసాయి పాఠశాల భవనంపై నుంచి దూకాడని, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని పాఠశాల నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లినట్లు విద్యార్థి తల్లి పద్మ పేర్కొంది. ఇప్పటి వరకు తమ కుమారుడికి ఆపరేషన్ చేయలేదని, ఎందుకు దూకావని శివసాయిని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడని ఆమె తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించాలంటే అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం సరిగ్గా చేయడం లేదని, తన కుమారుడికి మంచి వైద్యం అందించి బాగుచేయాలని ఆమె కోరుతోంది. గతంలో పారిపోయాడు : ప్రిన్సిపాల్ అయితే శివసాయి గతంలో ఒకసారి పాఠశాల నుంచి పారిపోయాడని, ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతడిని ఇంటికి తీసుకెళ్లారని ప్రిన్సిపాల్ సునీత వివరించింది. ఆ తర్వాత శివసాయి తల్లిదండ్రులు బతిమిలాడితే తిరిగి అతడికి పాఠశాలలోకి తీసుకున్నామని తెలిపింది. శివసాయి మళ్లీ పారిపోతే టీసీ ఇవ్వాలని అతడి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని పేర్కొంది. అయితే ఈ నెల 30న ప్రార్థన అయిన తర్వాత పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో శివసాయి భవనంపై నుంచి దూకినట్లు ప్రిన్సిపాల్ తెలిపింది. విషయం తెలియగానే కలెక్టర్కు సమాచారం ఇచ్చి కారులో పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, శివసాయికి పాఠశాలలో ఉండటం ఇష్టం లేకనే భవనం పైనుంచి దూకినట్లు ప్రిన్సిపాల్ వివరించింది. విద్యార్థి కుడి కాలు విరిగింది : సూపరింటెండెంట్ విద్యార్థి కుడి కాలు మోకాలి కింద విరగడంతో పాటు పాదంలో ఎముకలు విరిగాయని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహ తెలిపారు. నడుంలోనూ ఫ్యాక్చర్ అయిందని, వాపులు ఉండటంతో ఆపరేషన్ చేయలేకపోయామని, వాపులు తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు కాళ్లు విరగడంతో ఆస్పత్రిలో చేర్చిన పాఠశాల నిర్వాహకులు గోప్యంగా ఉంచిన అధికారులు -
యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవురోజు కావడంతో పాటు మేడారం జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణమైన భక్తులు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు, ముఖ మండపం, క్యూకాంప్లెక్స్ వంటి ప్రాంతాలు భక్తులతో నిండుగా కనిపించాయి. భక్తులు అధికంగా రావడంతో స్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. నృసింహస్వామిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.45,26,865 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
వేణుగోపాలుడు పెళ్లికొడుకాయెనే..
● గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి కల్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులునార్కట్పల్లి : మండల పరిధిలోని గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం మత్స్యగిరిచార్యులు, వెంకటేశ్వరచార్యులు, శుభంశర్మ, అభిషేక్దేవ్శర్మ, ఉషల్దూవేశర్మ తదితరుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు కార్యక్రమం జరిపించారు. అనంతరం కల్యాణ వేదిక వద్దకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. విశ్వసేనారాధన పూజ తర్వాత కల్యాణతంతు నిర్వహించారు. కల్యాణోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ దంపతులు కల్యాణానికి హాజరై తిలకించారు. అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి సన్మానించారు. భక్తులు అఽధిక సంఖ్యలో హాజరై కల్యాణం తిలకించారు. తలంబ్రాలను దేవుడికి సమర్పించారు. ఈ కల్యాణంలో దాదాపు 400 మంది దంపతులు పాల్గొన్నారు. సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచ్లు మచ్చ జయసుధ, జెరిపోతుల భారత్, పరమేష్, చిరుమర్తి ధర్మయ్య, ప్రవీణ్రెడ్డి, మాజీ సర్పంచ్ గోసుల భద్రాచలం, దార యాదయ్య, రాచకొండ భాస్కర్, రేగట్టే రాంగోపాల్రెడ్డి, వరలక్ష్మి, గణేష్, నర్సిరెడ్డి, కృష్ణయ్య, నాగరాజు, ఈశ్వరయ్య, వేణు పాల్గొన్నారు. -
గంజాయి ముఠా అరెస్ట్
మిర్యాలగూడ : గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను వాడపల్లి పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్రాజు వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం మధుబని జిల్లాకు చెందిన ఇంద్రజిత్కుమార్, ప్రిన్సియాదవ్, కన్నయ్యకుమార్ పాశ్వాన్, కమలేష్యాదవ్, పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాకు చెందిన గన్మిత్సింగ్ దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూలీలుగా పనిచేస్తూ వీర్లపాలెం గ్రామంలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఈ ఐదుగురు వీర్లపాలెం గ్రామ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ పర్యవేక్షణలో వాడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు ఐదుగురు బిహార్కు చెందిన అనిల్యాదవ్, ముఖేష్యాదవ్, రోషన్యాదవ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రైలులో వీర్లపాలెంకు తీసుకొచ్చి స్థానికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తోటి కార్మికులతో కలిసి రెండు గ్రాముల చొప్పున గంజాయి ప్యాకెట్లను తయారు చేసి రూ.100కు విక్రయిస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారు. వారి నుంచి రూ.1.25లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, ప్యాకింగ్కు ఉపయోగించే పాలిథిన్ కవర్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అనిల్యాదవ్, ముఖేష్యాదవ్, రోషన్యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ పీఎన్డీ ప్రసాద్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది వెంకటేష్, మధు, సైదులు, పూజ, సంతోష్రెడ్డి, చంద్రశేఖర్, యాదగిరిని డీఎస్పీ అభినందించారు. ఐదు కేజీల గంజాయి స్వాదీనం -
ఎంఐఎం అనుమతితోనే మేయర్
నల్లగొండ : మన అనుమతి లేనిదే నల్లగొండలో మేయర్ ఎవరు కాలేరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నల్లగొండలో ఆదివారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డబ్బులు ఎవరు ఇచ్చినా తోసుకోవాలని సూచించారు. నల్లగొండలో 9 మంది ఎంఐఎం కార్పొరేటర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. 26 ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డ్ భూమి ఉందని దాన్ని కొన్ని అతీతశక్తులు కాజేయలని చూశాయని, ఎంఐఎం ఆ భూములను కాపాడిందన్నారు. అభ్యర్థులు వేరే ముసుగులో మన వారే ఉన్నారని, కానీ వారి నోటికి తాళాలు ఉంటాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎంఐఎం పార్టీ ఉందన్నారు. ప్రత్యర్థులు ఓటు కోసం డబ్బులు పంచితే తీసుకుని.. వాటితో బాత్రూమ్ మర్మతు చేసుకోవాలని.. ఓటు మాత్రం మజ్లిస్కే వేయాలన్నారు. తాము ఇంత తక్కువగా ఉన్నామని అయినా.. తమను చూసి బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ దేశం భగత్సింగ్ను కన్నదని.. అంతకు ముందే సుల్తాన్ను కూడా కన్నదని పేర్కొన్నారు. ఫ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నల్లగొండ టూటౌన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలోని 143 జూనియర్ కళాశాలల నుంచి 9,251 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జనరల్లో 6,092 మంది, ఒకేషనల్ విభాగంలో 3,159 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీలో 3850 మంది, బైపీసీలో 2016 మంది హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలకు 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్లయింగ్ స్క్యాడ్ ఏర్పాటు చేసినట్లు డీఐఈవో దస్రూనాయక్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలినల్లగొండ టౌన్ : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్లో సీపీఐకి ఒక కో–ఆప్షన్ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలిపారు. సమావేశంలో నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, పబ్బు వీరాస్వామి, కెఎస్.రెడ్డి, వి.లెనిన్, మదార్, ముండ్ల ముత్యాలు, యూసుఫ్, వెంకట్రావు, రెవెల్లి యాదయ్య, ఐతరాజు శంకర్, దోటి పండరి, గుండె రవి, సుజాత, విజయ, ధనలక్ష్మి, వీరయ్య తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న ‘కూచిపూడి’ ప్రదర్శనభువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలోని మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్కు చెందిన కూచిపూడి నాట్య గురువు ప్రవీణ్ శిష్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో నాట్య కళాకారిణిలు నవ్య, నాగశ్రీ, రమ్మ, దశరథ, కౌసల్య, చందన తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
రాజాపేట : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ)జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు రాజాపేట మండలం దూదివెంకటాపురం ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని గుల్లెన ప్రణీత ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎస్. విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ మధు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత నెల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున ప్రణీత పాల్గొని జాతీయస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఛత్తీస్గడ్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననున్నట్లు వారు తెలిపారు. -
తాత బాటలో మనవడు
చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మసనం సంగీతాశ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ చౌటుప్పల్ మొట్టమొదటి సర్పంచ్ అయిన మసనం లక్ష్మయ్య మనవడు కావడం విశేషం. తాత బాటలోనే రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్న శ్రీనివాస్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తాత లక్ష్మయ్య విగ్రహానికి ఆదివారం నివాళులర్పించి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్కే చెక్ పవర్భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీల్లో సర్పంచ్. ఉప సర్పంచ్కు కలిపి చెక్ పవర్ ఉంటుంది. కానీ మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా మున్సిపల్ కమిషనర్కు మాత్రమే చెక్పవర్ ఉంటుంది. మున్సిపాలిటీల్లో వివిధ పనుల కోసం లక్షల రూపాయలతో సామగ్రి కొనుగోలు, అభివృద్ధి పనులు వంటివి చేపడితే సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి బిల్ చేసి మున్సిపల్ కమిషనర్కు సమర్పిస్తారు. వాటి వివరాలను కమిషనర్ సరి చూసుకొని ధ్రువీకరించి పాలకవర్గ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫైల్పై మున్సిపల్ చైర్మన్ సంతకం తీసుకోవాలి. అనంతరం ఆయా వివరాలను క్యాష్బుక్లో నమోదయ్యాక కమిషనర్ చెక్ జారీ చేస్తారు. చెక్ వివరాలు.. ఏ వ్యక్తికి ఎందుకు ఇచ్చారో వంటివి క్యాష్బుక్లో నమోదు చేసే బాధ్యత మున్సిపల్ అకౌంటెంట్ది. ఒకవేళ పాలకవర్గం గడువు ముగిస్తే ప్రత్యేకాధికారి అనుమతి తీసుకుని చెక్కులు జారీ చేస్తారు. ఇందులో ఏ నిబంధన ఉల్లంఘించినా నేరంగానే పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు, తప్పుడు సమాచారంతో చెక్కులు జారీచేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి నగదును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. -
వీఐపీ వార్డు
పొలిటీషియన్స్కు నిలయం.. కృష్ణానగర్సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు కృష్ణానగర్ కాలనీలో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎక్కువగా నివసిస్తుండటం విశేషం. 1980లో ఏర్పడిన ఈ కాలనీ కొత్త బస్టాండ్కు సమీపంలో ఉండటంతో ప్రముఖులు ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, గోదల రంగారెడ్డి, ప్రముఖ విద్యాసంస్థల అధినేత అంగిరేకుల నాగార్జున ఈ కాలనీలో నివాసముంటుండగా.. గతంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఇక్కడ ఉన్నారు. ఇదే వార్డులోని వెంకటేశ్వర కాలనీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 2737 మంది ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్ బీసీ జనరల్కు వచ్చింది. ఈ వార్డు నుంచి 18 మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. 14వ వార్డులో ఈ కాలనీతో పాటు మరో రెండు, మూడు కాలనీలు కలిసి ఉన్నాయి. ప్రముఖులకు కేరాఫ్ రెడ్డికాలనీ మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో ఉన్న రెడ్డికాలనీ ప్రముఖులకు కేరాఫ్గా మారింది. ఈ కాలనీలో 30 ఏళ్ల క్రితం మొదటగా సాయి అపార్ట్మెంట్, అహల్యా అపార్ట్ మెంట్ను నిర్మించారు. క్రమంగా జనసంఖ్య పెరిగి ఇప్పడు 15 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మిగతావి నివాస గృహాలు ఉన్నాయి. అపార్ట్మెంట్లలో గతంలో కేవలం 30 కుటుంబాలు ఉండగా.. ప్రస్తుతం 400కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం కాలనీ జనాభా 3500 మంది ఉండగా 2,321 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కాలనీలో ప్రముఖ వైద్యులు శ్రీనివాస్రావు, అశోక్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రమాదేవి, జేఏసీ కన్వీనర్ మాలి ధర్మపాల్రెడ్డితో పాటు ప్రముఖ మిల్లర్లు నివాసం ఉంటున్నారు. -
బీజేపీ అభ్యర్థుల ఖరారు గందరగోళం!
సాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : కార్పొరేషన్లో పలు డివిజన్ల అభ్యర్థుల ఖరారులో గందరగోళం నెలకొంది. నామినేషన్లు వేయని పలువురి పేర్లను పార్టీ తరఫున పోటీలో ఉంచుతున్నట్లు బీజేపీ శనివారం రాత్రి ప్రకటించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత విషయాన్ని గ్రహించిన బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 4వ డివిజన్ (ఎస్సీ మహిళ) బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా కత్తుల నాగేశ్వరి, 20వ డివిజన్ (జనరల్) కార్పొరేటర్ అభ్యర్థిగా నాంపల్లి అయ్యప్ప పేర్లను శనివరాం రాత్రి ప్రకటించారు. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయలేదని తెలిసింది. దీంతో నాలుక కరచుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఆదివారం 4వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా అన్నపూరి మౌనికను పోటీలో ఉంచుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ప్రకటించారు. 20వ డివిజన్ అభ్యర్థి విషయాన్ని ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. ఇక 34వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా దోనాల నాగార్జునరెడ్డి పేరును ప్రకటించారు. అయితే ఆదివారం మార్పు చేసి ఆర్.వెంకటేశ్వర్లును అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు సిట్టింగ్ కౌన్సిలర్లలో బండారు ప్రసాద్ పోటీ చేయనని వదిలేశారు. మరో సిట్టింగ్ కౌన్సిలర్, 35వ డివిజన్కు చెందిన గుర్రం ధనలక్ష్మి బీఆర్ఎస్కు వెళ్లిపోయారు. అక్కడ ఆమెకు టికెట్ ఇచ్చారు. 37వ డివిజన్కు చెందిన బొజ్జ నాగరాజు 36వ డివిజన్ కావాలని పట్టుబట్టారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఫ నామినేషన్లు వేయని పలువురి పేర్లు ప్రకటన నల్లగొండ కార్పొరేషన్లో 4వ, 20వ, 34వ డివిజన్ల అభ్యర్థుల పేర్లు టైప్ చేసేప్పుడు తప్పులు దొర్లాయి. అది టైపింగ్ ఎర్రర్ మాత్రమే. అభ్యర్థుల మార్పు కాదు. అన్ని కులాల వారికి అవకాశం కల్పిస్తున్నాం. సోమవారం మిగతా అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటిస్తాం. బి–ఫారాలు ఇచ్చేస్తాం. స్టార్ క్యాంపెయినర్లు రాబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం. – బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి -
కనుల పండువగా రథోత్సవం
యాదగిరిగుట్ట : పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగగా.. రాత్రి దివ్య విమాన రథంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. ఆలయంలో నిత్యారాధనల అనంతరం చతుర్వేద పారాయణములు, నిత్య హవనం, మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు, లక్ష్మీ అష్టోత్తర నామ జపములు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై తిరు వీఽధిలో ఊరేగించారు. సాయంత్రం రధాంగహోమం, రథబలి వేడుకలను నిర్వహించారు. అనంతరం రథంపై స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వేడుకల్లో ఆలయాధికారులు, అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రథోత్సవంలో యువత, భక్తులు అధికంగా పాల్గొన్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు. నేడు ప్రత్యేక పూజలు..సోమవారం ఉదయం 9గంటలకు ఆలయంలో పూర్ణాహుతి, మధ్యాహ్నం 12గంటలకు చక్రతీర్థం, సాయంత్రం 5గంటలకు దేవతోద్వాసన, పుష్పయాగం వంటి పూజలు నిర్వహిస్తారు. గరుడ వాహనంపై ఊరేగిన పూర్వగిరీశుడు నేడు చక్రతీర్థం -
కాకతీయుల సామ్రాజ్యంలో భాగం..
సూర్యాపేట : సూర్యాపేట పట్టణానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో పినవీరభద్రుడి పాలనలో పిల్లలమర్రి సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నాడు భానుపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలానుగుణంగా భానుపురిగా, సూర్యాపేటగా మారింది. 1902లోనే తాలూకాగా మారగా.. 1952లో సూర్యాపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రాంతం సూర్యాపేట. ఉద్యమాల గడ్డ సూర్యాపేట పూర్వం నుంచి ఉద్యమాల గడ్డగా ప్రాచూర్యం పొందింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో దేవులపల్లి వెంకటేశ్వర్రావు పార్లమెంట్ సభ్యడిగా, సూర్యాపేట ద్విసభ్య నియోజకవర్గంలో ధర్మభిక్షం, ఉప్పల మల్సూర్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించారు. 1957లో భీమిరెడ్డి నర్సింహారెడ్డితో పాటు ఉప్పల మల్సూర్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొదట తాలూకాగా..బ్రిటీష్ వారి పాలనలో హైదరాబాద్ నుంచి జగ్గయ్యపేటకు రాకపోకలు సాగించే సందర్భంలో సూర్యాపేట మీదుగా దండుబాట పడింది. ఈ సందర్భంలో భానుపురం ఈ రెండు ప్రాంతాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. నిజాం పాలనలో 1902లో నల్లగొండ సుభా(జిల్లా)గా ఏర్పడిన సమయంలో సూర్యాపేట తాలూకా అయ్యింది. అప్పటి భానుపురం కాలక్రమంలో భానుపురిగా, సూర్యాపేటగా మార్పు చెందింది. 1952లో మొదటిసారి 16 వార్డులతో గ్రేడ్ –3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 1969లో 20 వార్డులతో గ్రేడ్–2గా 1996లో 28 వార్డులతో గ్రేడ్ –1 మున్సిపాలిటీగా మారింది. ప్రస్తుతం 9 గ్రామాల విలీనంతో 48 వార్డులకు అప్గ్రేడ్ అయ్యింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో 1,06,805 మంది జనాభా ఉన్నారు. ఎనిమిది మంది చైర్మన్లు..1952లో ఏర్పడి సూర్యాపేట మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఎనిమిది మంది చైర్మన్లు పనిచేశారు. 1987, 1995, 2000లో చైర్మన్ స్థానానికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. పదవీలో ఉండగానే వెదిరె నర్సింహారెడ్డి, కాచర్ల లక్ష్మీకాంతారావులు మృతి చెందారు. 1987లో లక్ష్మీకాంతారావు చైర్మన్గా కొనసాగుతూ మృతి చెందడంతో వైస్ చైర్మన్ కట్కూరి గన్నారెడ్డి ఏడాదికి పైగా ఇన్చార్జి చైర్మన్గా పని చేశారు. పేట మున్సిపల్ చైర్పర్సన్లుగా ఇద్దరు మహిళలు గండూరి ప్రవళ్లిక, పెరుమాళ్ల అన్నపూర్ణ పని చేశారు. కర్పూరం శ్రీనివాసస్వామి మూడు సార్లు, మీలా సత్యనారాయణ రెండు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్లుగా పని చేశారు. గత మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట జనరల్గా రిజర్వ్ అయినప్పటికీ ఎస్సీ మహిళ అయిన పెరుమాళ్ల అన్నపూర్ణను చైర్పర్సన్గా చేయడం చర్చనీయాంశమైంది.ముఖచిత్రంప్రస్తుత ఓటర్ల సంఖ్య పురుషులు : 52,170 మహిళలు : 56,664 ఇతరులు : 14 మొత్తం : 1,08,848చైర్మన్లకు తప్పని వర్గపోరు పేట మున్సిపాలిటీ పాలకవర్గంలో ఎప్పుడూ వర్గపోరు తప్పడం లేదు. 2008లో మున్సిపల్ చైర్మన్గా మీలా సత్యనారాయణ, వైస్ చైర్మన్గా బీరవోలు రవీందర్రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన కౌన్సిలర్లు వారిద్దరిపై అవి శ్వాసం పెట్టారు. అప్పటి ఎంపీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండూరి ప్రవళిక, టీడీపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె టీఆర్ఎస్తో చేరారు. ఏడాదిన్నర తర్వాత సొంత పార్టీ కౌన్సిలర్లు ఆమైపె తిరుగుబాటు చేశారు. అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి జోక్యంతో వివాదం సద్దు మణిగింది. 2020లో టీఆర్ఎస్కు చెందిన పెరుమాళ్ల అన్నపూర్ణ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్కు చెందిన 16 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరి చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఓటింగ్ సమయంలో వారిలో ఒక్కరు సమావేశానికి రాకపోవడంతో సంఖ్యాబలం లేక వీగిపోయింది. ఫ కాలక్రమేణా సూర్యాపేటగా నామకరణం ఫ 124 ఏళ్ల క్రితమే తాలూకా కేంద్రం ఫ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఈ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఫ 1952లో మున్సిపాలిటీగా ఆవిర్భావం ఫ మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన హేమాహేమీలుక్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ 1 కర్పూరం శ్రీనివాసస్వామి 1952–54 పీడీఎఫ్ 2 కర్పూరం శ్రీనివాసస్వామి 1958–62 పీడీఎఫ్ 3 కర్పూరం శ్రీనివాసస్వామి 1962–67 కాంగ్రెస్ 4 వెదిరె నర్సింహారెడ్డి 1967–73 కాంగ్రెస్ 5 ప్రత్యేకాధికారి పాలన 1973 – 81 –– 6 గుర్రం విద్యాసాగర్రెడ్డి 1981–1987 కాంగ్రెస్ 7 రాచర్ల లక్ష్మీకాంతారావు 1987–90 టీడీపీ 8 మీలా సత్యనారాయణ 1990–92 (ఉప ఎన్నిక) కాంగ్రెస్ 9 ప్రత్యేక పాలన 1992 –95 –– 10 జుట్టుకొండ సత్యనారాయణ 1995–2000 టీడీపీ 11 జుట్టుకొండ సత్యనారాయణ 2000–05 బీజేపీ 12 మీలా సత్యనారాయణ 2005–10 కాంగ్రెస్ 13 ప్రత్యేక పాలన 2010–14 –– 14 గండూరి ప్రవళిక 2014–19 టీఆర్ఎస్ 15 పెరుమాళ్ల అన్నపూర్ణ 2020–25 టీఆర్ఎస్ -
నిరాశపర్చిన నిర్మలమ్మ!
నల్లగొండ : కేంద్ర బడ్జెట్లో ఈసారి జిల్లాకు నిరాశే మిగిలింది. ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. ముఖ్యమైన ప్రతిపాదనలు, డిమాండ్లలోనూ దేనికీ నిధులు విదిల్చలేదు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్ను ఉందని, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చే అంశాలు ఏ ఒక్కటీ లేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచడం, అన్ని జిల్లా కేంద్రాల్లో బాలికల వసతిగృహాలు ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఆయా వర్గాలకు ఊరటనిచ్చింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక పథకాలు లేవి బడ్జెట్లో ప్రకటించలేదు. గతంలో మాదిరిగానే పీఎం కిసాన్ సమ్మాన్నిధి కొనసాగనుంది. కిసాన్ సన్మాన్ నిధి కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వేల మంది రైతులకు నిరీక్షణే మిగిలింది. పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారనే విషయం ప్రస్తావనే లేకపోవడంతో వారిని నిరాశపరిచింది. ఇక ఆయిల్పామ్ సాగుకు గత ఆర్థిక సంవత్సరం ప్రత్యేక నిధులు కేటాయించినా.. ఈసారి ఆ ఊసే లేదు. జిల్లాలో చేపట్టదలిచిన పెద్ద ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. హైదరాబాద్ జంక్షన్గా మూడు హైస్పీడ్ కారిడార్లు హైదరాబాద్ మీదుగా వెళ్లడం విశేషం. కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశ పరిచింది. తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు. ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు లేవు. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేక బడ్జెట్. చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాకాలు లేవు. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన సంస్థకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. – పున్న కై లాష్, డీసీసీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వృద్ధులను నిరాశ పరిచింది. వృద్ధులకు రైలు, బస్ ప్రయాణాల్లో పూర్తి రవాణా రాయితీ కల్పించి ఉచితంగా వెళ్లేలా ప్రధాని జీఓ జారీ చేయాలి. వృద్ధులను గౌరవించి వారు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించేలా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. బస ఏర్పాటు చేయాలి. – సముద్రాల మల్లికార్జున్, జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పరిమాణం పెరిగినప్పటికీ పేదలె, మధ్యతరగతి ప్రజలకు తగిన కేటాయింపులు చేయలేదు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు తగినన్ని నిధులు కేటాయించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులిచ్చి.. ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలను విస్మరించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. – తుమ్మల వీరారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తారు. త్వరలో మున్సిపల్ పాలకవర్గాలు కూడా ఏర్పాటు కానుండటం, ఆ తరువాత పరిషత్ ఎన్నికలు కూడా జరగనుడంతో వాటికి కూడా ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ ఆదాయ పన్ను(ఐటీ) చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. సేవారంగ వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మూడు హైస్పీడ్ కారిడార్లు హైదరాబాద్ మీదుగా వెళ్లడం విశేషం. రాష్ట్రాల్లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్ర నిధులు అందనున్నాయి. – ముని స్వామి, అసోసియేట్ ప్రొఫెసర్, ఎకనామిక్స్, ఎన్జీ కాలేజీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో వెళ్తున్నా.. తిరిగి నిధులు కేటాయించడంలో కేంద్రం మరోసారి తెలంగాణపై వివక్ష చూపింది. విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర చట్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎరువుల సబ్సిడీలో కోత విధించి నల్లగొండ వంటి వ్యవసాయ ఆధారిత జిల్లాల రైతులపై పెనుభారం మోపింది. ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్. – నెల్లికంటి సత్యం, ఎమ్మెల్సీకేంద్ర బడ్జెట్పై జిల్లా ప్రజల పెదవి విరుపు ఫ కేటాయింపుల్లో సామాన్యులకు దక్కని ఊరట ఫ కొత్త పథకాలు లేవు.. పాతవే కొనసాగింపు ఫ వ్యవసాయ రంగానికి దక్కని ప్రాధాన్యం ఫ ఎంఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్, ఉపాధిహామీకి నిధుల పెంపుతో కాస్త మేలు -
కౌంటింగ్కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు. మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ను శనివారం డీఎస్పీ రాజశేఖర్రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు’ కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే ఆ పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి. పట్టణంలోని 14వ వార్డు బీసీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు స్థానిక నాయకులు నామినేషన్ వేశారు. మాజీ వైస్చైర్మన్ కందుల కోటేశ్వర్రావు గతంలో పోటీ చేసిన 6వ వార్డు ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. దాంతో ఆయన 14వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తమ వార్డుకు చెందిన వారిలో ఎవ్వరికిచ్చినా పర్వాలేదు గానీ వేరే వార్డు వారికి టికెట్ ఇవ్వవద్దంటూ నిరసన తెలిపారు. రామినేని శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమైన నాయకులు లోకల్ ముద్దు.. నాన్ లోకల్ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశంలో నాయకులు ఈదులు కృష్ణయ్య, వెంకట్రెడ్డి, పట్టాభిరెడ్డి, జైపాల్రెడి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి
భువనగిరిటౌన్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్ (20), జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని రామాంతాపూర్లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్ అమ్మమ్మ ఊరు కూడా శాంతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పాటు శాంతాపురం గ్రామానికే చెందిన మరో స్నేహితుడు సూర్యప్రసాద్ కూడా హైదరాబాద్లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్ పుట్టినరోజు కాగా.. బర్త్డే వేడుకలను మేడారంలో జరుపుకోవాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేష్, ఆనంద్, సూర్యప్రసాద్ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి శాంతాపురం గ్రామంలో ఆనంద్ బంధువుల వద్ద కారు తీసుకుని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాంతపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భవనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్ పైకి బైక్ అదుపుతప్పడంతో వెనుక కూ ర్చున్న రాజేష్, ఆనంద్ బైక్ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న సూర్యప్రకాష్ కొద్దిదూరం వెళ్లి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ కె. రమేష్కుమార్ తెలిపారు. ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ మరణంలోనూ వీడని స్నేహబంధం -
ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనువైన కేంద్రాన్ని చూడాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న ఎస్డబ్ల్యూసీ గోదామును పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న 6 మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ప్రతి చోట ఒక కౌంటింగ్ హాల్తో పాటు, స్ట్రాంగ్ రూమ్, సీలింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉండాలన్నారు. నల్లగొండలో ఆర్జాలబావి ఎస్డబ్ల్యూసీ గోదాంతో పాటు, ఇంకా ఏవైనా అనువైన భవనాల్లో ఓట్ల లెక్కింపునకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎస్డబ్ల్యూసీ రీజనల్ మేనేజర్ వీరమల్లు, మేనేజర్ మురళి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, తహసీల్దార్ పరశురాం పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కంట్రోల్ రూమ్ను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. సమస్యను సంబంధిత నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా యచూడాలన్నారు. అనంతరం ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, టోల్ ఫ్రీ నంబర్కు (18004251442) వచ్చిన ఫిర్యాదులు, వాట్సప్ నంబర్కు (6305951279) వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో తనిఖీ చేశారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
తల్లి మృతి.. అనాథలైన చిన్నారులు
మునగాల : తల్లి మృతి చెందడంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మునగాలకు చెందిన కోటయ్య కుమార్తె ఎల్లమ్మ (28)కు నడిగూడేనికి చెందిన కిరణ్తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలను ఎల్లమ్మ పోషిస్తోంది. గత మూడు నెలలుగా శ్యాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు అనన్య(6), హనీ(3), కుమారుడు అరవింద్(5) అనాథలయ్యారు. ఎస్సీ కాలనీకి చెందిన పలువురు యువకులు విరాళాలు సేకరించి శుక్రవారం ఎల్లమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్ల మ్మ తల్లి గతంలోనే మృతిచెందగా తండ్రి కోటయ్య కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నారులను తండ్రి చేరదీయకుంటే వారిని అనాథాశ్రమంలో చేర్పించే ఆలోచనలో కాలనీవాసులు ఉన్నారు. చిన్నారుల భవితవ్యానికి ఎవరైన సాయం అందిస్తే తాను పోషిస్తానని తాత కోటయ్య పేర్కొన్నాడు. -
మున్సిపల్ బరిలో బత్తుల బలగం
ఫ నామినేషన్లు వేసిన ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కుమారులు మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి, ఇద్దరు కుమారులు బత్తుల సాయిప్రసన్న, బత్తుల ఈశ్వరగణేష్కుమార్లు శుక్రవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో నామినేషన్లు వేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 28వ వార్డు నుంచి ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఈశ్వర గణేష్కుమార్, 39వ వార్డు నుంచి ఎమ్మెల్యే భార్య మాధవి, 40వ వార్డు నుంచి ఆయన పెద్ద కుమారుడు సాయిప్రసన్న నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. -
పాలకుల విధానాలతో సంక్షోభంలో వ్యవసాయం
మిర్యాలగూడ అర్బన్ : పాలకుల విధానాల వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు, పంటలకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస బాట పట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతులకు రుణ పరిమితి చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్కుల మట్టయ్య, హంసారెడ్డి, ఉపేందర్రెడ్డి, కుసుమ బాబురావు, గుండెబోయిన చంద్రయ్య, మల్లికార్జున్, ప్రభాకర్రెడ్డి, రవీందర్గౌడ్, అంజయ్య, సోమయ్య, మోహన్, కిషన్, సరసింహారెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ -
పూర్వగిరీశుడు పెళ్లి కొడుకాయనే..
యాదగిరిగుట్ట: పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం మూడవ రోజుకు చేరాయి. ఆలయంలో హవన పూజలు నిర్వహించి, అలంకార వాహన సేవలకు శ్రీకారం చుట్టారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం జరిపించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం నుంచే యాగశాలలో ఆరాధన, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అలంకార సేవలు నిర్వహిఆంచారు. శ్రీస్వామి అమ్మవార్లను సింహవాహనం పై అధిష్టింపజేసి హారతినిచ్చారు. ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. తిరు కల్యాణానికి ఏర్పాట్లు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 8గంటలకు గజవాహనం చేపట్టి శ్రీస్వామి అమ్మవార్ల తిరు కల్యాణ వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత సేవ నిర్వహించనున్నారు. ● నృసింహుడి ఆలయ ముఖ మండపంలో వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం ● నేడు స్వామి అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం -
గూడెం నుంచి పట్టణం
మిర్యాలగూడకు ఆసియాలోనే గుర్తింపు ఫ1984 నుంచి మున్సిపాలిటీ ఫ రాజకీయ చైతన్యం కలిగిన పట్టణంమిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్ : ఒకప్పుడు చిన్న గూడెంగా ఉన్న మిర్యాలగూడ నేడు దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రాజకీయంగానూ చైతన్యవంతమైన ప్రాంతంగా పేరుగాంచింది. మిర్యాలగూడెం 1956లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. 1983లో మేజర్ గ్రామ పంచాయతీగా మారింది. ప్రస్తుతం 34 వార్డులతో కూడిన గ్రేడ్–1 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. మిర్యాలగూడలో ఆసియాలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉండి దేశ, విదేశాలకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. రైస్ ఇండస్ట్రీస్ హబ్గా.. మిర్యాలగూడ రైస్ మిల్లుల ఏర్పాటులో ఆసియాలోనే రెండవ స్థానంలో నిలిచి రైస్ ఇండస్ట్రీస్ హబ్గా పేరు పొందింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలో 50, పరిసర ప్రాంతాల్లో మరో 40 రైస్ మిల్లులు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద సాగైన వరి పంటతో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి ప్రాంతాల్లో సాగైన వరి ధాన్యాన్ని మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు తీసుకొస్తారు. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ధాన్యాన్ని ఇక్కడి మిల్లర్లు సేకరించి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలతోపాటు వేరే దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. గ్రేడ్–1 మున్సిపాలిటీగా.. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మిర్యాలగూడ 1984లో 22 వార్డులతో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పాటైంది. పట్టణ జనాభా పెరగడంతో 1989లో వార్డుల సంఖ్యను 28కు పెంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా మార్చారు. 2005లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపి 36 వార్డులతో గ్రేడ్–1 మున్సిపాలిటీని చేశారు. వార్డుల పునర్విభజన అనంతరం ప్రస్తుతం 48 వార్డులకు పెంచారు. ఆరుగురు చైర్మన్లు 1984లో మిర్యాలగూడ మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటికీ మూడేళ్ల పాటు ప్రత్యేకాధికారి పాలనలోనే కొనసాగింది. 1987 మొదటి సారి ఎన్నికలు జరిగాయి. నేటి వరకు మున్సిపల్ చైర్మన్లుగా మొత్తం ఆరుగురు పనిచేశారు. రెండు పర్యాయాలు సీపీఎం పొత్తుతో టీడీపీ చైర్మన్ స్థానం కై వసం చేసుకోగా మూడోసారి సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ పార్టీల అభ్యర్థులు వేర్వేరుగా పోటీ చేశారు. దాంతో మూడవసారి సైతం టీడీపీ చైర్మన్ స్థానం కై వసం చేసుకుంది. ఒకసారి బీఆర్ఎస్, రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్గా ఎన్నికయ్యారు. రెండోసారి మహిళకు రిజర్వ్ మిర్యాలగూడ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఆరు పర్యాయాలు ఎన్నికలు జరగగా మున్సిపల్ చైర్మన్స్థానం రెండుసార్లు మహిళకు రిజర్వ్ అయ్యింది. తొలి సారి ఎస్టీ జనరల్, కాగా రెండవ, మూడవ సారి జనరల్, నాలుగవ పర్యాయం బీసీ జనరల్, ఐదవ పర్యాయం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది. ప్రస్తుతం కూడా జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మిర్యాలగూడ మున్సిపాలిటీకి 2014లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి 46వ వార్డు అభ్యర్థిగా విజయం సాధించిన తిరునగరు నాగలక్ష్మీభార్గవ్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆమె బీఆర్ఎస్లోకి మారారు. 2019లో మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్గా రిజర్వ్ కాగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన 36వ వార్డు కౌన్సిలర్ తిరునగరు భార్గవ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కూడా కాంగ్రెస్లోకి మారారు. భార్యాభర్తలిద్దరూ మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు. మొత్తం పురుషులు మహిళలు ఇతరులు 93,020 45,128 47,878 14 -
గాంధీ వర్ధంతి సంస్మరణ శాంతి ర్యాలీ
రామగిరి(నల్లగొండ): గాంధీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో సంస్మరణ శాంతి ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎం.వి. గోనారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్, నీరుడు దయాకర్రెడ్డి, పాముల అశోక్, కరుణాకర్ రెడ్డి, గిరిధర్ గౌడ్, గిరిబాబు, కందిమల్ల నాగమణిరెడ్డి, సుధారాణి, సరళ, జీనుగు జ్యోతి, వెంకట్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, జవహర్ లాల్, శ్రీనివాస్, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
ఫ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సతీమణి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యతో 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నల్లగొండలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 48 డివిజన్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులందరూ గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య మాట్లాడుతూ.. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సహకారంతో నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. -
ఆనాటి ఇంజనీర్ల కృషితోనే ఏఎమ్మార్పీకి జలకళ
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ గుర్రంపోడు డివిజన్ ఆవిర్భావం (1984) నుంచి పనిచేసిన ఇంజనీర్లు, కార్యాలయాల ఉద్యోగులు శుక్రవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని ఏఎమ్మార్పీ క్యాంపు కాలనీలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మేరెడ్డి శ్యామ్ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడి నాసిరకంగా పనులు చేపట్టేలా తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పటిష్టంగా పనులు చేయించామని తెలిపారు. ఇప్పటి వరకు డివిజన్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, కార్యాలయ సిబ్బంది తమ అనుభవాలను పంచుకున్నారు. స్థానికులు వారిని పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ సీఈ ఖగేందర్, రిటైర్డ్ సూపరింటెండెంట్ కోడిరెక్క మట్టయ్య, ఎస్ఈ సూర్యనారాయణ రెడ్డి, ఈఈ విజయానంద్, రిటైర్డ్ ఎస్ఈ నర్సింగ్రాజ్, ప్రస్తుత డివిజన్ ఈఈలు నెహ్రూనాయక్, బద్రూనాయక్, డీఈ పరమేష్ పాల్గొన్నారు. రిటైర్డు ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్ శ్యామ్ప్రసాద్ రెడ్డి -
మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి
హుజూర్నగర్ : హుజూర్నగర్ మున్సిపాలిటీ 4వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. దొంతిరెడ్డి పద్మ, దొంతిరెడ్డి నవీన్రెడ్డి కాంగ్రెస్లో చేరగా కార్యక్రమంలో నాయకులు యరగాని నాగన్న, తన్నీరు మల్లిఖార్జున్, దొంగరి వెంకటేశర్లు, గెల్లి రవి, మధిర ప్రతాపరెడ్డి, దాసా నాగేశ్వరరావు, గూడెపు శ్రీనివాస్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, పి. ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి యువత
చిట్యాల, నార్కట్పల్లి : చిట్యాల మున్సిపాలిటీ పదో వార్డుకు చెందిన నిమ్మనగోటి శ్రీను ఆధ్వర్యంలో యువశక్తి యువజన సంఘానికి చెందిన వంద మంది యువకులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నార్కట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, నాయకులు కొలను వెంకటేశ్గౌడ్, బొబ్బల శివశంకర్రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు. -
ప్రపంచంలో ఉత్తమ భాష తెలుగు
రామగిరి(నల్లగొండ) : ప్రపంచంలో తెలుగు భాష ఉత్తమమైనదని ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మాడభూషి సంపత్కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, తెలంగాణ తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ‘తెలుగు భాషా వికాసంలో వివిధ వైఖరులు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. మాతృభాషతో నైతిక విలువలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చన్నారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వాలు తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలని కోరారు. తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష చాలా విశిష్టమైందని, కేవలం ప్రామాణిక భాష రక్షణ వల్ల తెలుగు భాష బతకదని, తెలంగాణ పదజాలాన్ని రక్షిస్తేనే తెలుగుకు ఉనికి ఉంటుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం మాట్లాడుతూ భాష భావజాలానికి ఒక వాహిక అన్నారు. తెలంగాణలో మాట్లాడే భాష పుస్తక భాషగా మారాలని అన్నారు. మాట్లాడడం, రాయడం వంటి నైపుణ్యాలు ఉంటే యువతకు ఉపాది అవకాశాలు వస్తాయన్నారు. ఆచార్య రెడ్డి శ్యామల మాట్లాడుతూ మారుతున్న భాషను అందిపుచ్చుకోవాలన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పి.విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు భాష మధురమైందని.. దానిని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ కె.లావణ్య, కేంద్రియ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, ఎంజీయూ తెలుగు పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు బెల్లి యాదయ్య, కవి విమర్శకులు పగడాల నాగేందర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు సంగి రమేష్, ఎస్.రఘు, తండు కృష్ణకౌండిన్య, దీపిక, మామిడాల రమేష్బాబు, బకరం నర్సింహ, ఎం.ఆనంద్, నర్రా లవేందర్రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వెల్దండి శ్రీధర్, రవికుమార్, అంతటి శ్రీనివాస్, ముని స్వామి, బత్తిని నాగరాజు, అనిల్ బొజ్జ, మల్లేశం, అనిల్ అబ్రహం, జ్యోత్స్న పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ మాడభూషి సంపత్కుమార్ -
162 వార్డులు..1,796 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ కార్పొరేషన్, 6 మున్సిపాలిటీల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు 1,796 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. కొన్ని చోట్ల ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులంతా నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండేందుకు నామినేషన్లు వేశారు. విచిత్రంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య, ఇద్దరుకుమారులు మూరు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బీఫాం లేకుంటే స్వతంత్య్ర అభ్యర్థులుగానే.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 28వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు మూడు రోజులు అవకాశం ఇవ్వడంతో ఆశావహ అభ్యర్థులంతా పోటీలో ఉండేందుకు నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీ ఎవరికి బీఫాం ఇస్తే వారు పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉండనున్నారు. పార్టీ బీఫాం లేకుండా పోటీ ఉండేవారిని స్వతంత్య్ర అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు. చాలా చోట్ల శుక్రవారం కూడా ప్రధాన పార్టీలు అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నోడ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాల కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ తదితర మున్సిపాలిటీల్లో నామినేషన్ల ముగింపు సమయమైన సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ కేంద్రాల్లోకి చేరుకున్న వారు లైన్లలో ఉండాల్సి వచ్చింది. మొదటి రెండు రోజుల్లో 607 నామినేషన్లు జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో ఈ మూడు రోజుల్లో మొత్తంగా 1796 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు మందకొడిగా వచ్చినప్పటికి రెండో నుంచి ఊపందుకున్నాయి. మొదటి రెండు రోజుల్లో 607 నామినేషన్లు రాగా, చివరి రోజైన శుక్రవారం 1,189 నామినేషన్లు దాఖలయ్యాయి. పన్నుల రూపంలో భారీగా వచ్చిన ఆదాయం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంటి పన్ను, కుళాయి, ఇతర పన్నుల రూపంలో మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. పన్నులు క్లీయర్ చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. దీంతో పోటీచేసే అభ్యర్థులంతా పన్నులు చెల్లించి నోడ్యూస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇలా ఆస్తి పన్నులు, కుళాయి పన్నుల రూపంలో.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.12.89 లక్షల ఆదాయం సమకూరింది. దేవరకొండలో రూ.10.90 లక్షలు, హాలియాలో రూ.1.74, మిర్యాలగూడలో రూ.18.52 లక్షలు, చండూరులో రూ.5.30 లక్షలు, చిట్యాలలో రూ.6లక్షలు.. మొత్తంగా రూ.55.35 లక్షల ఆదాయం సమకూరింది. అయితే నందికొండ మున్సిపాలిటీలో నివాసలు అన్నీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్వార్టర్లు కావడంతో పన్నులు లేవు.నల్లగొండలో నామినేషన్ దాఖలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డినామినేషన్ వేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి చకిలం వసంత అనిల్కుమార్నామినేషన్ల వివరాలు ఇలా.. మున్సిపాలిటీ వార్డులు నామినేషన్ల సంఖ్య నల్లగొండ కార్పొరేషన్ 48 582 మిర్యాలగూడ 48 507 దేవరకొండ 20 254 హాలియా 12 135 చండూరు 10 117 చిట్యాల 12 106 నందికొండ 12 95 మొత్తం 162 1,796 కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఫ చివరి రోజు 1,189 నామినేషన్లు దాఖలు ఫ చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించని పార్టీలు ఫ పన్నుల రూపంలో రూ.55.35 లక్షలు చెల్లించిన అభ్యర్థులు -
చెర్వుగట్టులో ముగిసిన బ్రహ్మోత్సవాలు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సంద్భంగా గజవాహనముపై స్వామి, అమ్మవార్ల ఉంచి చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్బాబు, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఉప ప్రధానార్చకుడు ఉప్పల సతీష్ శర్మ, మామిళ్లపల్లి రాంబాబు శర్మ, మామిళ్లపల్లి సురేష్శర్మ, రెగిచేడు శ్రీకాంత్శర్మ, మామిళ్లపల్లి నాగయ్యశర్మ, పోతులపాటి జగదీష్శర్మ, పడింతులు రవితేజ, రాము, పోతులపాటి శశిశర్మ, పవన్ శర్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, రేగట్టె నవీన్రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, గడుసు శశిదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం టికెట్లు
సాక్షి, యాదాద్రి, ఆలేరు రూరల్ : మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం టికెట్లు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడంపట్ల శుక్రవారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో ీఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న రాహుల్గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్రెడ్డి చట్టం చేశారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తొక్కిపెట్టిందని ఆరోపించారు. గాంధీ పేరు తొలగించి దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. ఎన్నికల రాగానే హిందూ ముస్లింల మధ్యన లడాయి పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. హిందువులందరూ ఆరాదించే శ్రీరాముడికి బీజేపీలో ఏమైనా సభ్యత్వం ఉందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కడుపుకొట్టే ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంపీ కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్రం ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60శాతం తగ్గించి, మిగిలిన 40శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ విప్, భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్గౌడ్, అండెం సంజీవరెడ్డి, జనగాం ఉపేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్య, సర్పంచ్ సిరిమర్తి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు అత్మగౌరవం కల్పించింది కాంగ్రెస్సే పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ -
బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి
నల్లగొండ టూటౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. అభివృద్ధి బాధ్యత తనదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని ఒప్పించి నల్లగొండకు నిధులు తెస్తానన్నారు. నల్లగొండలో మంత్రి ఉన్నా.. 30 ఏళ్ల కిందట బీజేపీ చైర్మన్ కృష్ణారెడ్డి చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీ గాలి వీస్తోందని, దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలను మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిని కక్కిస్తానని చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి.. హామీలను మూసీలో ముంచాడన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ సొమ్ములో వాటాల కోసమే కేసుల దర్యాప్తును సాగదీస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, గోలి మధుసూదన్రెడ్డి, శ్యాంసుందర్, పిల్లి రామరాజుయాదవ్, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫ మోదీని ఒప్పించి నల్లగొండకు నిధులు తెస్తా ఫ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ -
మిర్యాలగూడ కాంగ్రెస్లో అలకలు
మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ కాంగ్రెస్లో నేతలు అలకబూనినట్లు తెలిసింది. ఒకవైపు వార్డుల రిజర్వేషన్లు సక్రమంగా లేదని ఇప్పటికే ఆవేదన చెందుతున్న ఆ పార్టీ నాయకులకు టికెట్లు కేటాయించే విషయంలోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారని సమాచారం. వార్డుల రిజర్వేషన్ తారుమారు చేశారనే ఆరోపణలతో రిజర్వేషన్ ప్రకటన నుంచి కాంగ్రెస్ పార్టీలో రచ్చ సాగుతోంది. మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై శుక్రవారం గడువు ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో 12 మంది మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, మాజీ చైర్మన్ మెరుగు రోశయ్యతోపాటు పీఏసీఎస్ మాజీ చైర్మన్ బంటు శ్రీనివాస్, ముఖ్య నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. మున్సిపల్ ఎన్నికల సమయంలో తిరునగరు భార్గవ్ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని పైకి చెప్పినప్పటికీ.. కౌన్సిలర్ టికెట్లు కేటాయించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ఆ వర్గానికి సంబంధించిన వారు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్ల గడువు ముగిసేంతవరకు భార్గవ్ వర్గానికి సంబంధించి వారికి తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో.. వారు అలకబూనారని సమాచారం. ఈనెల 31న నామినేషన్ స్క్రూట్నీ అనంతరం ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3వరకు ఉండడంతో ఈలోపు తమకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు మాజీ చైర్మన్ భార్గవ్ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది. అదే జరిగితే.. పార్టీకి నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఫ రాజీనామా యోచనలో పలువురు నేతలు! -
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం తగదు
మిర్యాలగూడ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు అందించడం హేయమైన చర్య అని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే కేసీఆర్కు సిట్ నోటీసులు అందించడం ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆరోపించారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసుల్లో ఇరికించడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని, ప్రజలు అసహించుకునే స్థితికి చేరిందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ అభివృద్ధి చెందిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. ఈ సమావేశంలో జొన్నలగడ్డ రంగారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, వీరకోటిరెడ్డి, పాలుట్ల బాబయ్య, కట్టా మల్లేష్గౌడ్, బాలాజీ నాయక్, మగ్దూం పాషా, మజీద్, ఇలియాస్, నల్లమోతు సిద్ధార్థ్, కోల రామస్వామి, సోము సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ -
అపరాలు అంతంతే..
ఏటా అపరాల సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తగ్గడం వల్ల పప్పుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పప్పు ధాన్యాల పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పిస్తాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో పప్పు ధాన్యాలైన కంది, బొబ్బెర, పెసర, మినుము (అపరాల) పంటల సాగు ఏటేటా గణనీయంగా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ రైతులు అపరాల సాగుపై ఆసక్తి చూపడం లేదు. కేవలం దేవరకొండ డివిజన్లో కొన్ని మండలాల్లో మాత్రమే పప్పు ధాన్యాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా కొన్ని సంవత్సరాలుగా సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో జిల్లా రైతులు వాణిజ్య పంటలైన పత్తి, వరి, మిరప పంటల సాగును పెద్ద ఎత్తున చేస్తున్నారు. సాగు తగ్గడంతో పప్పుల ధరలు పెరుగుదల జిల్లాలో గతంలో రైతులు కంది, పెసర, మినుము, బొబ్బర్ల వంటి పప్పు ధాన్యాల పంటలను పెద్ద ఎత్తున సాగు చేసేవారు. కందులను రికార్డు స్థాయిలో లక్షల క్వింటాళ్లను పండించిన చరిత్ర జిల్లా రైతులకు ఉంది. అయితే పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకోవడానికి అప్పట్లో మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అప్పటి ప్రభుత్వాలు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడం, డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో సాగు చేసేందుకు రైతులు వెనుకాడేవారు. అలాగే పెసర్లు పండించిన అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చేది. దీంతో రైతులు పప్పు ధాన్యాల పంటలను తగ్గించి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పప్పు ధాన్యాల సాగు తగ్గడం వల్ల కంది, పెసర, మినుము తదితర పప్పుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. పప్పు ధాన్యాల సాగు పెంచేందుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు పంటల సాగుపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం లేదు. ఒకవేళ పప్పు ధాన్యాలు పండించినా వాటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించి సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే పప్పు ధాన్యాల సాగు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటేటా తగ్గుతున్న పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం ఫ సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించకపోవడమే కారణం ఫ వాణిజ్య పంటలైన వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గుజిల్లాలో పప్పు ధాన్యాల సాగు ఇలా.. (ఎకరాల్లో..) సంవత్సరం సీజన్ కంది మినుము పెసర 2021 వానాకాలం 10,807 08 329 యాసంగి 28 1,214 2,213 2022 వానాకాలం 3,273 38 88 యాసంగి 05 55 1,252 2023 వానాకాలం 942 76 548 యాసంగి 176 203 649 2024 వానాకాలం 2,479 526 1,330 యాసంగి 77 600 890 2025 వానాకాలం 1,780 28 403 యాసంగి 45 325 418 మొత్తం 19,612 3,073 5,819 -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
కొండమల్లేపల్లి : వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలందించాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ రాహుల్, వేణుగోపాల్, డాక్టర్ కళ్యాణ్, మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, సూపర్వైజర్స్ సుగుణబాయి, రాణి, హరీష్ ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఎ–ఫారం సమర్పించిన పున్న కై లాష్నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఎ–ఫారం (పార్టీ తరుఫున అభ్యర్థులకు బీ–ఫారం జారీ చేసే అధికారం ఉందని తెల్పడం) సమర్పించారు. ఈ మేరకు గురువారం నల్లగొండలోని కలెక్టరేట్లో డీఆర్ఓ అశోక్రెడ్డికి ఎ–ఫారం అందజేశారు. వాహనాలు జాగ్రత్తగా నడపాలిమిర్యాలగూడ : వాహనాలను నడిపేటప్పుడు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) వాణి, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి (డీటీఓ) లావణ్య, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) చంద్రశేఖర్గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులో డ్రైవర్లు, క్లీనర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి వారు హాజరై మాట్లాడారు. వాహనదారులు ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వాహనంలో ప్రయాణించే అనేక మందికి జరగరాని ప్రమాదం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. వేగం కంటే గమ్యస్థానం ముఖ్యమని భావించి సురక్షితంగా ప్రయాణం సాగేలా వాహనాలు నడపాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ మల్లిఖార్జున్, ఏఎంవీఐ సతీష్, అలీతోపాటు వైద్య సిబ్బంది, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో దోపోత్సవం
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఘనంగా దోపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహా బలిహారణ, మహా పూర్ణాహుతి, హోమం, ధ్వజారోహణం, ఏకాదశ రుద్రభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంత సేవ వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి మోహన్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనరెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరెడ్డి, యాదగిరి, నర్సిరెడ్డి, వెంకటయ్య, రాజలక్ష్మి, మహేందర్రెడ్డి, నరేష్, గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఉప ప్రధానార్చకులు ఉప్పల సతీష్ శర్మ, మామిళ్ళపల్లి రాంబాబు శర్మ, మామిళ్లపల్లి సురేష్శర్మ, రెగిచేడు శ్రీకాంత్ శర్మ, మామిళ్లపల్లి నాగయ్య శర్మ, పోతులపాటి జగదీష్శర్మ, బుగ్వేద పడింతుడు రవితేజ, యజుర్వేద పండితుడు రాము పాల్గొన్నారు. -
నామినేషన్లకు నేడు ఆఖరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. మొదటి రోజు మందకొడిగానే దాఖలయ్యారు. రెండో రోజైన గురువారం మాత్రం జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు శుక్రవారం ఒక్క రోజే గడువు ఉంది. నల్లగొండ కార్పొరేషన్తోపాటు చిట్యాల, చండూరు, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో రెండు రోజుల్లో 607 నామినేషన్లు దాఖలు చేయగా, బుధవారం 44 నామినేషన్లు దాఖలు కాగా, గురువారం ఒక్కరోజే 563 దాఖలు చేశారు. ఊపందుకున్న నామినేషన్లు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 28వ తేదీ నాడే నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. మొదటి రోజైన బుధవారం కొద్ది మందే నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది ఆ రోజంతా నామినేషన్ల పత్రాలను ిసిద్ధం చేసుకునే పనిలోనే ఉండగా, ముందస్తుగా సిద్ధ్దమైన వారు కొన్ని సెట్లు వేశారు. రెండో రోజు నామినేషన్ల తాకిడి బాగా పెరిగింది. ఎన్నికల షెడ్యూల్, వెనువెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్లకు తక్కువ గడువే వచ్చింది. కేవలం మూడు రోజులే ఇవ్వడంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల్లో హడావుడి నెలకొంది. అంతా ఉరుకులు..పరుగులు. కొన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారు పూర్తి స్థాయిలో చేయలేదు. పోటీ చేయాలనుకున్న వారు మున్సిపాలిటీలో ఇళ్లు, నల్లా తదితర పన్నులు చెల్లించడం, బ్యాంకులో అకౌంట్లు తీసుకోవడం, ఇతర నోడ్యూస్ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో పడ్డారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో హడావుడి నెలకొంది. మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించని పార్టీలు జిల్లాలో అన్ని పార్టీలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. నల్లగొండ కార్పొరేషన్లో మాత్రం కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా చకిలం వసంతలక్ష్మి అనిల్కుమార్ ఉంటారనే చర్చ జరుగుతున్నా పార్టీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులతోపాటు మేయర్ అభ్యర్థులనూ ప్రకటించాల్సి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించాల్సి ఉంది. మున్సిపాలిటీ గురువారం బుధవారం మొత్తం నల్లగొండ కార్పొరేషన్ 168 11 179 మిర్యాలగూడ 176 04 180 దేవరకొండ 79 10 89 చిట్యాల 44 09 53 చండూరు 29 04 33 హాలియా 40 00 40 నందికొండ 27 06 33రెండు రోజుల్లో 607 దాఖలు ఫ మున్సిపాలిటీల్లో జోరుగా నామినేషన్లు ఫ మొదటి రోజు మందకొడిగానే.. ఫ రెండో రోజు వందల సంఖ్యలో.. ఫ నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద పటిష్ట చర్యలునామినేషన్లకు శుక్రవారమే చివరి గడువుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆఖరిరోజైన శుక్రవారం పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లకు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ బుధవారం 18 మంది అభ్యర్థులను ప్రకటించగా, గురువారం రాత్రి 24 మందిని ప్రకటించింది. మరో ఆరుగురిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. దీంతో పార్టీ నుంచి టికెట్ ఖరారుకాని వారు నామినేషన్లను గురువారం కూడా దాఖలు చేయలేదు. శుక్రవారం ఆఖరు తేదీ కావడంతో శుక్రవారం ఉదయం నాటికి ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు సమర్పించేందుకు వచ్చిన వారి పత్రాలను అధికారులు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వారివి తిరస్కరించనున్నారు. చివరి రోజు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎన్నికల అధికారులు కౌంటర్లు పెంచి నామినేషన్లు తీసుకోవాలని భావిస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ నల్లగొండ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు.గురువారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు రమేష్, వ్యయ పరిశీలకుడు వెంకట్ ఆదిత్యతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు వివిధ నోడల్ టీంలను నియమించి వాటికి శిక్షణ ఇచ్చామన్నారు. అంతకు ముందు కలెక్టరేట్కు వచ్చిన ఎన్నికల సంఘం సాధారణ, వ్యయ పరిశీలకులు జి.రమేష్, ఎస్.వెంకట్ ఆదిత్యకు కలెక్టర్ తన చాంబర్లో పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు నల్లగొండ మున్సిపాలిటీలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు
నల్లగొండ టూటౌన్ : కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపని ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కార్పొరేషన్లో 18 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశామని, మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి. మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డిలు మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ పట్టణానికి రూ.1300 కోట్లు తెచ్చి మెడికల్ కాలేజీ, రోడ్ల అభివృద్ధి, ఐటీ హబ్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, జంక్షన్ల విస్తరణ, పట్టణాన్ని సుందరీకరణ చేశామన్నారు. రూ.36 కోట్లు తెచ్చి ఎన్జీ కాలేజి భవనం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయకుండా మంత్రి గాలికి వదిలేశారన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే స్కూల్ కట్టి వాళ్ల పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, చీర పంకజ్యాదవ్, అబిమన్యు శ్రీనివాస్, పిచ్చయ్య పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ కోటిరెడ్డి -
నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుసరిస్తున్న విధానం, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణను తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, టూటౌన్ ఎస్ఐ సైదులు పాల్గొన్నారు. -
మున్సిపల్ వేడి.. పన్నుల రాబడి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు ఉండొద్దని ప్రభుత్వం షరతు విధించింది. అయితే బుధవారం మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు మున్సిపాలిటీకి బకాయి పడిని ఆస్తి, నీటి పన్నుల చెల్లింపునకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు బలపరిచే వారికి సంబంధించిన బకాయిలు చెల్లిస్తుండడంతో మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఒక్కరోజే రూ.13,70,493 పన్నులు వసూలయ్యాయి. ఆస్తి పన్ను కింద రూ.7,40,493, నీటి పన్ను 6,30,000 ఆదాయం సమకూరింది. పన్నుల చెల్లింపులతో మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడింది. పన్ను బకాయిలు చెల్లిస్తున్న ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఒక్కరోజే సమకూరిన రూ.13.70 లక్షల ఆదాయం -
రాజకీయ హడావిడి !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి బుధవారం మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే నోటిఫికేషన్ రావడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ హడావుడి పెరిగింది. అభ్యర్థులను ఎంపిక చేయడంతో నేతలు తలమునకలయ్యారు. పోటీ చేసే అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వచ్చి నామినేషన్ పత్రాలను తీసుకుంటున్నారు. పలు చోట్ల నామినేషన్ దాఖలు కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. అచితూచి అభ్యర్థుల ఖరారు షెడ్యూల్ వచ్చిన తర్వాతి రోజే నోటిపికేషన్ రావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సమయం లేకుండా పోయింది. ఇప్పటికే ఆయా పార్టీలు ఏఏ డివిజన్లు, వార్డుల్లో ఎవర్ని నిలబెట్టలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే.. కొన్ని డివిజన్లు, వార్డుల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ప్రకటన విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నాయి. నామినేషన్లకు ఇక, రెండు రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. అన్ని విధాలా సర్వే నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పోటీ చేస్తామని, టికెట్లు ఖరారైన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కావాల్సిన పత్రాలు సమకూర్చుకుంటున్నారు. ఇంటి, నల్లా బిల్లులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటన.. నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ 18 మంది కార్పొరేట్ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి 18 మంది జాబితాను విడుదల చేశారు. మిగతా వారిని గురువారం ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా గురువారం అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిసింది. భువనగిరిలో.. భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి బుధవారం ప్రకటించారు. మొత్తం 14 మంది కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అన్నీ సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇవ్వగా ఇప్పటికే బుధవారం ఒక రోజు పూర్తయింది. ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ వేసినా.. ఏ, బీ ఫారాలు ఇవ్వడానికి ఉపసంహరణ వరకు గడువు ఉండడంతో ముందుగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తొలిరోజు 93 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ కార్పొరేషన్లో మొదటి రోజు 11 నామినేషన్లు రాగా, మిర్యాలగూడలో 4, దేవరకొండలో 10, నందికొండలో 6, చిట్యాలలో 9, చండూరులో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. సూర్యాపేటలో 13, తిరుమలగిరిలో 9, మోత్కూర్లో 3, కోదాడలో 1, భువనగిరిలో 15, చౌటుప్పల్లో 6, పోచంపల్లిలో 2 నామినేషన్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఫ అభ్యర్థుల ఎంపికలో నాయకుల తలమునకలు ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 93 నామినేషన్లు దాఖలు ఫ నామినేషన్లకు రెండు రోజులే గడువు -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కోరారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, నామినేషన్ కేంద్రాల్లో డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఖర్చు బుక్ చేస్తామన్నారు. మున్సిపాలిటీలలో నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థులు డిపాజిట్ కింద రూ.2500, ఎస్సీ ఎస్టీలు రూ.1550, కార్పొరేషన్లో జనరల్ అభ్యర్థులు రూ.5000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థి రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీలో పోటీచేసే అభ్యర్థులు రూ.లక్ష వరకు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు ఉప సంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు ఏ, బీ ఫారాలు సమర్పించాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులు ఎవరు చేయకూడదన్నారు. జిల్లాకు జనరల్ అబ్జర్వర్గా రాష్ట్ర ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ఏర్పాటు చేసామన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. బాధ్యతల నిర్వహణలో అలసత్వం వద్దు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నోడల్ అధికారి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారి విధులకు సంబంధించి ముందే ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఏ మున్సిపాలిటీలోనూ రీ పోలింగ్కు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రమేష్, మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఆదిత్య, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
వనదేవతలకు పూజలు
పెద్దవూర : మండలంలోని పొట్టిచల్మ ఎక్స్ రోడ్డు వద్ద కృష్ణానది సమీపంలో వనదేవతలైన సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం వేకువ జామున ప్రారంభమైంది. ఏటా ఈ జాతరను ఆలయ ప్రధాన పూజారులు గుంజ అంజమ్మ, గుంజ కృష్ణంరాజు, నాగపురి లక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. తొలి రోజు సమీప గ్రామాల ప్రజలు వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. సమ్మక్క–సారలమ్మను, గద్దెల సమీపంలోని పుట్టను దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. -
పులి సంచారంపై ఆందోళన వద్దు
తుర్కపల్లి : పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్నాయుడు అన్నారు. తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, దయ్యంబండతండా గ్రామాల్లో బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులి మహరాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవి నుంచి తప్పించుకుని గత 10 రోజులుగా తుర్కపల్లి ప్రాంతంలో సంచరిస్తోందని అన్నారు. అటవీశాఖ అధికారులు బోన్లు, డ్రోన్లు ఉపయోగించి పులిని తిరిగి రిజర్వ్ ఫారెస్ట్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పులి పశువులపై మాత్రమే దాడి చేస్తుందని.. పఽశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ బయటకు వెళ్లరాదని సూచించారు. పులి జాతీయ జంతువు కాబట్టి దానికి ఏవిధమైన హాని తలపెట్టినా నేరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం. శంకర్, ఎస్ఐ మహ్మద్ తక్యుద్దీన్, డీఎఫ్ఆర్ఓ రమేష్నాయక్, జావీద్ హుస్సేన్, శ్రీనివాస్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య
నల్లగొండలో 45 మంది కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డిసాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డిని ప్రకటిస్తూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డితో సహా 45 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి ఆమోదంతో ప్రకటిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ అనుభవం ఇదీ.. బుర్రి చైతన్యరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో మొన్నటి వరకు కౌన్సిలర్గా పనిచేశారు. గతంలో ఆమె రెండుసార్లు నల్లగొండ రామగిరి రామాలయం చైర్మన్గా పని చేశారు. ఆమె భర్త బుర్రి శ్రీనివాస్రెడ్డి మూడుసార్లు కౌన్సిలర్గా, ప్లోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా, మూడుసార్లు రామగిరి రామాలయం చైర్మన్గా పని చేశారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బుర్రి శ్రీనివాస్రెడ్డిని ముందుగానే మంత్రి కోమటిరెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి దీటుగా 20 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ నుంచి 20 మంది అభ్యర్థులే గెలిచినా ఎక్స్అఫిషియో ఓట్లతో చైర్మన్ పీఠం బీఆర్ఎస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. దీంతో అప్పట్లో బీఆర్ఎస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో బుర్రి శ్రీనివాస్రెడ్డి చైర్మన్ అయ్యారు. మంత్రి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. -
టీఆర్పీతోనే అభివృద్ధి సాధ్యం
రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టె జానయ్యయాదవ్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్పీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు వార్డులకు చెందిన యువకులు టీఆర్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజాగౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, ప్రధాన కార్యదర్శి నారాయణదాస్ కవిత, ఆత్మకూర్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, ఉమ్మడి నల్లగొండ సోషల్ మీడియా కన్వీనర్ సాయి, వినోద్, చారి, రఫీ, షఫీ పాల్గొన్నారు. వరంగల్ హైవేపై మేడారం రద్దీభువనగిరిటౌన్ : హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే వారి వాహనాలతో బుధవారం బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. అంతేకాకుండా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున ఆశావహుల మద్దతుదారులు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. వీరికి తోడు వీఐపీల తాకిడి సైతం ఉందని టోల్ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. గురువారం, శుక్రవారం మేడారానికి తరలివెళ్లే వాహనాల రద్దీకి అనుగుణంగా ఆ మార్గంలో 8 టోల్బూత్లు ఓపెన్ చేయనున్నట్లు టోల్ నిర్వాహకులు తెలిపారు. -
తరలివచ్చిన భక్తజనం
పెన్పహాడ్ : మండల పరిధిలోని గాజులమల్కాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. గ్రామం నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా గద్దెల పైకి తీసుకొచ్చారు. మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు. బంగారం(బెల్లం) మొక్కు చెల్లించారు. కొబ్బరికాయలు, గొర్రె, మేక పొట్టేళ్లను, కోళ్లను బలిచ్చారు. గ్రామమంతా భక్తులతో కిటకిటలాడింది. ఎస్ఐ గోపికృష్ణ, ఏఎస్ఐ రాములు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నాగుల పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తులు పూనకంతో ఊగిపోయారు. గురువారం రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి కోలాటం, డ్యాన్స్ పోటీలను ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్రెడ్డి, సర్పంచ్ నాతాల వెంకట్రెడ్డి, బండి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సొంటి ఆంజనేయులు, వైస్ చైర్మన్ మండాది పాపయ్య, కుందూరు వెంకట్రెడ్డి, గుత్తికొండ రాంరెడ్డి, దేవిరెడ్డి మధుసూదన్రెడ్డి, బండి అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో అగ్నిగుండాలు
నార్కట్పల్లి : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్నిగుండాల ఘట్టాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, శ్రీకాంత్శర్మ, సురేష్, సిద్దుశర్మ, నాగయ్యశర్మ, జగదీష్శర్మ వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ గరుడ వాహనంపై స్వామి వారితో పాటు ఇరమూస్తి వార్ల ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం అగ్నిగుండాలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఓం నమః శివాయ అంటూ అగ్నిగుండంలో నడిచి మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రత్యేక అధికారి భాస్కర్, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, గడుసు శశిదర్రెడ్డి, రేగట్టె నవీన్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనరెడ్డి, ఉప సర్పంచ్ జలేందర్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హుండీ ఆదాయం రూ.6,22,696 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల హుండీలను బుధవారం లెక్కించారు. రూ.6,22,696 ఆదాయం సమకూరినట్లు ఈఓ మోహన్బాబు తెలిపారు. గత బ్రహ్మోత్సవాల సమయంలో రూ.1,03,365 ఆదాయం రాగా.. ఈ ఏడాది 6,22,696 వచ్చిందని గతేడాది కంటే రూ.5,19,331 ఆదాయం సమకూరిందని వివరించారు. -
గద్దె పైకి సారలమ్మ
రాజాపేట : మండలంలోని చిన్నమేడారం, చల్లూరు యాదాద్రి మేడారంలో గిరిజనుల ఆరాధ్యదైవం సారలమ్మను బుధవారం గద్దైపె అధిష్టింపజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు గ్రామ సమీపంలోని ఏదులగుట్టపై మూల దేవతలకు పూజలు చేశారు. అనంతరం సారలమ్మను డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మను వెదురు బొంగును పూజారులు గద్దైపెన ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తలనీలాలు, కొబ్బరికాయలు, నిలువెత్తు బెల్లం, కుంకుమ, పసుపు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం పులిగుట్ట నుంచి సమ్మక్క గద్దైపెకి చేరుతుందని పూజారులు తెలిపారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఎం. శంకర్గౌడ్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి చిన్నమేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఫ చిన్నమేడారంలో భక్తుల రద్దీ -
భువనగిరి మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య
క్ర.సం చైర్మన్ పేరు సంవత్సరం పార్టీ 1 ఎండీ. అబ్బాస్అలీ – – 2 అబ్దుల్రహమాన్ చిస్తీ – – 3 పట్నం వెంకటనర్సయ్య – కాంగ్రెస్ 4 పాదరాజు హన్మంతరావు – – 5 సున్నం యాదగిరి 1981 కాంగ్రెస్ 6 డాకూరి కృష్ణ 1983 కాంగ్రెస్ 7 సున్నం యాదగిరి 1985 టీడీపీ 8 ఏవీ శివనాగేందర్ 1989 టీడీపీ 9 హబీబ్ రహమాన్ చిస్తీ 1992 టీడీపీ 10 ఊట్కూరి దామోదర్గౌడ్ 1995 కాంగ్రెస్ 11 పెంట నర్సింహ 2000–05 టీడీపీ 12 దొనకొండ వనిత 2005– 08 కాంగ్రెస్ 13 కొలుపుల కమలాకర్ 2008–09 కాంగ్రెస్ 14 బర్రె జహంగీర్ 2009–10 కాంగ్రెస్ 15 సుర్వి లావణ్య 2014–18 బీజేపీ 16 నువ్వుల ప్రసన్న 2018–19 టీఆర్ఎస్ 17 ఏనబోయిన ఆంజనేయులు 2020– 23 టీఆర్ఎస్ 18 పోతంశెట్టి వెంకటేశ్వర్లు 2023– 25 కాంగ్రెస్ 2011 జనాభా లెక్కల ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో 59,844 మంది జనాభా ఉంది. ఇందులో 30,265 మంది పురుషులు కాగా 29,579 మంది మహిళలు. 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భువనగిరి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరిగింది. బొమ్మాయపల్లి, రాయిగిరి, పగిడిపల్లి గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాంతో గతంలో వార్డుల సంఖ్య 30 నుంచి 35కు పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. 2014లో భువనగిరి మున్సిపాలిటీలో 35, 326 మంది ఓటర్లు ఉండగా 2019లో 44,240కు పెరిగింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 47,831గా నమోదైంది. 2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక వార్డులను గెలుచుకుంది. మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కాగా కాంగ్రెస్కు చెందిన దొనకొండ వనిత చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2008లో కౌన్సిలర్లు ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. వైస్ చైర్మన్గా ఉన్న కొలుపుల కమలాకర్ ఇన్చార్జి చైర్మన్గా సంవత్సరం పాటు కొనసాగారు. 2009లో కాంగ్రెస్కు చెందిన బర్రె జహంగీర్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. 2014లో టీడీపీ పొత్తుతో బీజేపీకి చెందిన సుర్వి లావణ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2018లో ఆమైపె అవిశ్వాసం పెట్టడంతో పదవి కోల్పోయారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన నువ్వుల ప్రసన్న చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2020లో బీఆర్ఎస్కు చెందిన ఏనబోయిన ఆంజనేయులు చైర్మన్గా ఎన్నికవగా 2023లో అవిశ్వాసంతో ఆయన పదవి కోల్పోయారు. తర్వాత కాంగ్రెస్కు చెందిన పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వారు వెంకటనర్సయ్యశివనాగేందర్ పెంట నర్సింహ దామోదర్గౌడ్హబీబ్ రహమాన్ అబ్దుల్ రహమాన్దొనకొండ వనిత కమలాకర్ డాకూరి కృష్ణనువ్వుల ప్రసన్న సుర్వి లావణ్య ఆంజనేయలు బర్రె జహంగీర్ వెంకటేశ్వర్లు ముఖచిత్రంసంవత్సరం పురుషులు మహిళలు మొత్తం 2014 17612 17714 35326 2019 21635 22605 44240 2026 23037 24793 47831 -
పూర్వగిరికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధానల అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనలు మొదటి పూజగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు రక్షాబంధనం వేడుక జరిపించారు. స్థల, ద్రవ్య శుద్ధి కొరకు మూలవరులకు, ఆలయ పరిసర ప్రాంతంలో మంత్ర జపములను ప్రోక్షణ చేశారు. ప్రధానాలయంలో, ముఖ మండపంలో, కల్యాణ మండపం, ఆలయ పరిసరాలు, వేంచేపు మండపం, ధ్వజ స్తంభం ప్రాంతాల్లో శుద్ధ జలంతో పుణ్యాహవాచనం జరిపించారు. తొలి పూజలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కె. వినోద్రెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ప్రధానార్చకులు, పారాణీకులు, రుత్వికులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అంకురారోపణం.. సాయంత్రం ఆలయ మండపంలో అంకురారోపణం, మృత్సంగ్రహణ వేడుకలు నిర్వహించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా వేంచేపు మండపానికి చేరుకుని భూమాతను పూజించి, మృత్తికను(మట్టిని) సేకరించారు. తిరిగి ఆ మృత్తికను ప్రధానాలయంలోని ముఖ మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలోని పాలికలలో నింపి, వాటిలో నవధాన్యాలు చల్లారు. ఉత్సవ సమాప్తి వరకు పాలు, శుద్ధ జలాలలో పాలికలను తడిపి నిత్యం ఆరాధనలు గావిస్తామని అర్చకులు వెల్లడించారు. ఈ వేడుకలను ప్రధాన అర్చకులు, యజ్ఞచార్యులు, అర్చక బృందం, పారాయణీకులచే నిర్వహించారు. ఉత్సవాల్లో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానం జరిపిస్తారు. ధ్వజరోహణం జరిగే సమయంలో ఆచార్యులు ధ్వజ స్తంభం వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఫ స్వస్తీవాచనం, విష్వక్సేనారాధనతో ప్రారంభమైన ఉత్సవాలు ఫ నేడు ధ్వజారోహణం, భేరి పూజ, దేవతాహ్వానం -
కుమారుడికి అనారోగ్యం.. తండ్రి ఆత్మహత్య
నకిరేకల్ : కుమారుడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండడం, అతడి వైద్యం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనోవేదనకు గురైన తండ్రి గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన షేక్ జహంగీర్(60)కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జహంగీర్ కూమారుడు సయ్యద్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. గ్రామంలో పలువురి వద్ద అప్పు తెచ్చి మరీ తన కుమారుడికి వైద్యం చేయిస్తున్నా వ్యాధి నయంకాకపోవడంతో మనోవేదనకు గురైన జహంగీర్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో గుళికల మందు తాగాడు. మంచంపై పడి నురగలు కక్కుతున్న జహంగీర్ను కటుంబ సభ్యులు వెంటనే నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జహంగీర్ కుమారుడు సయ్యద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
శేషవాహనంపై రామలింగేశ్వరుడు
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగ్వేర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి సేవను శేషవాహనంపై ఊరేగించారు. ఉదయం సూర్య నమస్కారాలు, రుద్రహోమం, బలిహారణ, ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన పూజలను ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్శర్మ, శ్రీకాంత్శర్మ, సతీ ష్శర్మ, జగదీష్శర్మ అర్చకులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఈఓ మోహన్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ రేతగాని కృష్ణ, గడుసు శశిదర్రెడ్డి ఉన్నారు, దర్శనాల ద్వారా రూ.16,91,620 ఆదాయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణానికి వచ్చేసిన భక్తుల ప్రత్యేక దర్శనం ద్వారా ఆలయానికి రూ.16,91,620 ఆదాయం వచ్చినట్లు ఈఓ మోహన్బాబు తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.12,27,920, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,35,200, కల్యాణ టికెట్ల ద్వారా రూ.1,95,00, ఇతర సేవల ద్వారా రూ.33,500 ఆదాయం వచ్చినట్లు వివరించారు. -
ఎంజీయూకు లా కాలేజీ మంజూరు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి లా కాలేజీ మంజూరైంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీఓ 3ను మంగళవారం విడుదల చేసింది. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సును 60 మంది విద్యార్థులతో ప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్ఎల్ఎం 2 సంవత్సరాల కోర్సును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు కవుల మహాసభకు ఎంజీయూ విద్యార్థినల్లగొండ టూటౌన్ : ప్రపంచ తెలుగు కవుల మహాసభల(2026)కు ఎంజీయూలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కట్రావత్ గణేష్ ఎంపికై నట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ అంజిరెడ్డి మంగళవారం తెలిపారు. మన ఊరు – మన చరిత్ర అనే అంశంపై రాష్ట్రస్థాయిలో 3వ బహుమతి సాధించిన గణేష్ అచ్చంపేట గ్రామాలకు సంబంధించిన తెలుగు సాహిత్య రచనల ఆధారంగా సమగ్రమైన పరిశీలన అనంతరం ఈ మహాసభలకు ఎంపికకావడం గర్వంగా ఉందన్నారు. అంతర్జాతీయ మాతృబాష దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు గణేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్కు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. మోడల్ స్కూల్ తనిఖీశాలిగౌరారం : మండలంలోని వల్లాల గ్రామంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను డీఆర్డీఓ శేఖర్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో వంటలు, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. వసతులు, మెనూ అమలు, సిబ్బంది పనితీరు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఆహార తయారిలో సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సర్పంచ్ భూపతి తిరుపతమ్మ ఉపేందర్ ఉన్నారు. రసవత్తరంగా కబడ్డీ పోటీలుపెద్దవూర : మండలంలోని తుంగతుర్తి గ్రామంలో పార్వతి సమేత స్వయంభూ సోమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కబడ్డీ పోటీలను వీక్షించారు. ఈ పోటీల్లో 15 జట్లు పాల్గొంటున్నాయి. -
కాంగ్రెస్ పాలనలో కానరాని అభివృద్ధి
చిట్యాల : అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడా అభివృద్ధి కానరావట్లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. చిట్యాల మున్సిపాలిటీలోని రెండో వార్డులో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వార్డుకు చెందిన అజీముద్దిన్ యాబై కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం చిరుమర్తి మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభోత్సవాలు చేపట్టారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటర్ల మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేష్, బొబ్బల శివశంకర్రెడ్డి, కందాటి రమేష్రెడ్డి, కంభంపాటి సతీష్, సతీష్గౌడ్, శేఖర్, ఆనంద్, నరేందర్, మహ్మద్ గౌస్ పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి -
నా చిరకాల కోరిక నెరవేరింది
నల్లగొండ : ‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక. ప్రతి పేదవాడు చదువుకోవాలి. అప్పడే అభివృద్ధి సాధ్యం. అందుకోసమే పేద పిల్లలకు ఒత్తిడి లేని జ్ఞానవంతమైన విద్యను అందించేందుకు వాల్డార్ప్ విద్యను ఆదర్శంగా తీసుకుని సకల హంగులతో పాఠశాల నిర్మించాం’ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రకాశంబజార్లో రూ.8 కోట్లతో కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి పౌండేషన్ ద్వారా నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పిల్లల కోరిక మేరకు బొట్టుగూడ పాఠశాలను సందర్శించానని.. అద్దె భవనంలో ఆ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని భావించినా.. సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం తాను రోడ్లు భవనాల శాఖ మంత్రి కావడంతో పట్టణం నడిబొడ్డున ప్రకాశంబజార్లో 2005 గజాల్లో భూమిని ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా సకల హంగులతో పాఠశాల భవనం నిర్మించామన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేడాలని, ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు కావాలన్నారు. ప్రత్యేక ఎంట్రెన్స్ ద్వారానే పేద పిల్లలకు ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తామన్నారు. ఇక్కడ సంప్రదాయ విద్యతో పాటు పిల్లలు ఆలోచించే విధంగా విద్యను అందించాలనే.. వాల్డార్ప్ విద్యను ఆదర్శంగా తీసుకుని భవనం నిర్మించామన్నారు. అన్ని విధాలా నల్లగొండ అభివృద్ధి నల్లగొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎన్జీ కాలేజీ పనులు ఆగిపోయాయని, ఆ భవనాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ బాలికల కళాశాల భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందన్నారు. దీన్ని మోడల్గా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యార్థులను, భవన నిర్మాణానికి సహకరించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్రెడ్డి, పాశం రాంరెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రతి పేదవాడు చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యం ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ ‘కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల’ భవనం ప్రారంభం -
ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం జిల్లాలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా ఆర్డీఓలు పర్యవేక్షించాలన్నారు. నామినేషన్లు స్వీకరించేందుకు అవసరమైన పత్రాలు, సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ సెంటర్లను మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి పాఠశాలల విద్యార్థులంతా 30వ తేదీలోగా పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఎంఈఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో ప్రహరి గోడలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయా ఏజెన్సీలకు అప్పగించామన్నారు. పనులను క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి నివేదికలను సమర్పించాలన్నారు. అనుమతి లేకుండా స్థానిక సెలవు దినం ఇస్తే సంబంధిత హెచ్ఎంను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి, ఈఈలు గిరిధర్, శ్రీధర్రెడ్డి, బాలప్రసాద్ ఉన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
కార్మికులపై వేధింపులు ఆపాలి
నల్లగొండ టౌన్ : గ్రామపంచాయతీ కార్మికులపై ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచ్ల వేధింపులు ఆపాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కొత్తగా గెలిచిన సర్పంచులు తమకు నచ్చిని వారిని తొలగిస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని ఆపే విధంగా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అనంతరం డీపీఓ శంకర్నాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పొన్న అంజయ్య, చింతపల్లి బయన్న, పోలె సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, సింగపంగా లింగమ్మ, కొండేటి నరసయ్య, సర్వయ్య, ఎండీ.జహీర్, సురేష్, ఎర్ర అరుణ, నాంపల్లి శంకర్, కొండల్, శ్రీరాములు, పాలడుగు చంద్రయ్య, యాదయ్య, సైదమ్మ పాల్గొన్నారు.


