breaking news
Nalgonda District News
-
బీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే..
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్ పెంచే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్ వద్ద బీసీ జేఏసీ నిర్వహించిన అర్ధనగ్న ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని, ఎస్సీ, ఎస్టీ అగ్రకులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రం ఎంతకు కల్పించరని ప్రశ్నించారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెరువు వెంకన్నగౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్గౌడ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య, దుడ్డు కృష్ణమూర్తి, పుట్ట వెంకన్నగౌడ్, కట్టెకోలు దీపేందర్, చిలకరాజు సతీష్ కుమార్, కర్నాటి యాదగిరి, తల్లారి యాదగిరి, ఎంఏ.ఖదీర్, చెన్నూరి భరద్వాజ, నీలకంఠం నాగరాజు, మార్గం సతీష్ కుమార్, చెన్నోజు రాజు, పి.నాగరాజు, బి.ధర్మేందర్, ఆర్.బాలాజీ పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి
రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలోని ప్రధాన గ్రంథాలయ అభివృద్ధికి కృషిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాఫీస్ ఖాన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని జిల్లా గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ప్రతీక్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతుందన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ గ్రంథాలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించామన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 20 వరకు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్రెడ్డి, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అసోసియేషట్ ప్రెసిడెంట్ ఎస్.వేణుగోపాలచార్యులు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఎంఎస్.శ్రవణ్కుమార్, మాజీ కౌన్సిలర్లు బషీరుద్దీన్, సమద్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్రెడ్డి, అల్లి సుభాష్, చొల్లేటి ప్రభాకర్, లైబ్రేరియన్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలికేతేపల్లి: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నకిరేకల్ సీనియర్ జవిల్ జడ్జి, న్యాయసేవా అధికారిణి మంజుల సూర్యావర్ అన్నారు. నకిరేకల్ మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కేతేపల్లి మండలంలోని చెర్కుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు ప్రకాశ్రావు, దోడ సోమయ్య, చౌగోని నాగరాజు, వంగూరి వెంకన్న, కేతేపల్లి ఏఎస్ఐ ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు
నల్లగొండ టూటౌన్: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుకవ్రా రం నల్లగొండలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి, పాఠశాల ప్రిన్సి పాల్ ఉదయ్కుమార్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్రే స్కానింగ్ను సద్వినియోం చేసుకోవాలి నల్లగొండ: జిల్లా క్షయ నివారణ కేంద్రం సహకారంతో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కోసం ఏర్పాటు చేసిన ఏఐ టెక్నాలజీ ఎక్స్రే స్కానింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని పోలీస్ కార్యా లయంలో ఆధునిక ఏఐ టెక్నాలజి ఎక్స్రే స్కానింగ్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 14 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ మొబైల్ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఛాతీ ఎక్స్రే, రక్త పరీక్షలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, డాక్టర్ ప్రదీప్, రవి ప్రసాద్, జమా ల్, సూపర్వైజర్ బి.అనిల్ కుమార్, ఎం.సైదులు, వెంకట రెడ్డి, సయాదుద్దీన్, ఇనాయత్ అలీ, లెనిన్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో శుక్రవారం అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీశైలం, కోశాధికారి జి.మోహన్రెడ్డి, గాయం నారాయణరెడ్డి, రంగయ్య, మోహన్రావు, యుగేందర్రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కె.నారాయణరెడ్డి, బి.లింగయ్య, ఎండీ హుస్సేన్, ఎం.శంకర్రెడ్డి, సంతోష్రెడ్డి, యాదగిరి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలి
నల్లగొండ టూటౌన్: చదువే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలన్నారు.ఆడపిల్లలు మంచిగా చదువుకుంటే కలెక్టర్లుగా, డాక్టర్లుగా తయారు కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణ, నాగసేనారెడ్డి, డీసీపీఓ గణేష్, సరి త, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దు నల్లగొండ: ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇతర కళాశాలల్లనూ ర్యాగింగ్కు పాల్పడకుండా గట్టి నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జె.సత్యనారాయణ, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, కళాశాల అదనపు ప్రిన్సిపాల్ ఆర్.రాధాకృష్ణ, సురేస్ గుప్తా పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన
రామగిరి(నల్లగొండ): ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇందిరమమ్మ ఇళ్లు, సిమెంట్ రోడ్లు, నర్సరీ, ఐకేపీ సెంటర్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. వీరికి గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఎంపీడీఓ యాకుబ్నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జె.మహేష్, హిమబిందు, స్వర్ణలత, వేద రక్షిత, వంశీధర్ ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. -
మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్ట్
కొండమల్లేపల్లి: మేకలు, గొర్రెలు చోరీ చేస్తున్న దొంగల ముఠాను గురువారం చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లో దేవరకొండ ఏఎస్పీ మౌనిక విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందిన అమ్ములూరి విజయ్ప్రసాద్, అమ్ములూరి నందిని, నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన దాసర్ల వినోద్కుమార్, గుంజ కార్తీక, అనుముల మండలం అలీనగర్కు చెందిన సంపంగి శారద, సంపంగి వెంకటేష్, శబరీష్ ముఠాగా ఏర్పడి మేకలు, గొర్రెల చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున చింతపల్లి మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. అటుగా స్కార్పియో కారులో వచ్చిన వీరు పోలీసులను చూసి తప్పింకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకునే లోగా సంపంగి వెంకటేష్, శబరీష్ కారు దిగి పారిపోయారు. మిగతా ఐదుగురికి అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ స్కానర్తో చెక్ చేయగా.. గతంలో వారిపై మేకల దొంగతనం కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వారిని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు నిజం ఒప్పుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారు గతంలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి తిరిగి నేరాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారి నుంచి మూడు కార్లు, రూ.1.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న నాంపల్లి సీఐ రాజు, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తితో పాటు పోలీస్ సిబ్బందిని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించగా.. ఏఎస్పీ మౌనిక వారికి రివార్డు అందజేశారు. ఫ పరారీలో మరో ఇద్దరు -
కథల పోటీల్లో బహుమతుల పంట
చిట్యాల మండలం గుండ్రాంపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు ఉప్పల పద్మ పర్యవేక్షణలో పలువురు విద్యార్థినులు కథలు, రచనలు చేస్తూ రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. గతేడాది బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కథల పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థిని సీమ హన్సిక పాల్గొని కన్సొలేషన్ బహుమతి పొందింది. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థిని కంకాల శిరీష రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించింది. ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బాల సాహిత్య పరిషత్, మాచిరాజు బాల సాహిత్య పీఠం సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో గుండ్రాంపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కూరాకుల భావన రాసిన నాన్న కష్టం కథకు ప్రోత్సాహక బహుమతి లభించింది. తెలంగాణ సాహితి నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పాటల పోటీల్లో పాఠశాలకు చెందిన ఆర్. వాసవి ద్వితీయ స్థానంలో, అక్షిత కన్సొలేషన్ బహుమతులు పొందారు. -
వావ్.. వండర్ కిడ్స్
బాలల రక్షణకు ప్రత్యేక చట్టాలు చివ్వెంల(సూర్యాపేట): బాలల హక్కుల్ని కాపాడేందుకు 1989 నవంబర్ 20న ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల తీర్మాణాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశం కాబట్టి 1992 డిసెంబర్ 11న ఈ తీర్మాణాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం 18ఏళ్ల లోపు వయస్సు వారంతా బాలలే. బాలల రక్షణ కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. ఆర్టికల్ 1 నుంచి 52 వరకు బాలల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రక్షణ చట్టాలను అమలు చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు బాలబాలికలు బడిలో మాత్రమే ఉండాలి. గనులు, ఇటుక బట్టీలు, హైరిస్క్ ప్రాంతాలు, కిరాణా షాపుల్లో బాలల చేత పనులు చేయించరాదు. బాల కార్మిక చట్టం 1986, రూల్– 2బి ప్రకారం ఆర్టీఈ చట్ట ప్రకారం బాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పనిచేయరాదు. పెద్దలు చేసే పనికి ప్రత్యామ్నాయంగా పిల్లలు పని చేయరాదు. చట్టానికి వ్యతిరేకంగా బాలల చేత పనులు చేయిస్తే సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 సెక్షన్ 2(ఎ) ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయి, 21 ఏళ్లు నిండని అబ్బాయి బాల్య దశలో ఉన్నట్లుగా గుర్తించబడుతారు. బాల్య వివాహంలో యుక్త వయస్సు ఉన్న పురుషుడు, బాలిక తల్లిదండ్రులు, సంరక్షకులు, వివాహాన్ని జరిపించిన, ప్రోత్సహించిన వ్యక్తులు, వివాహ కార్యక్రమానికి హజరైన వ్యక్తులు దోషులుగా గుర్తించబడుతారు. వీరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లేదా రూ.లక్ష జరిమానా విధిస్తారు. పిల్లలపై లైంగిక దాడి చేయడం, అవమానించడం, వేధించడం నుంచి రక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్(పోక్సో)ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పిల్లలపై నేరానికి పాల్పడిన వారికి 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. నేరారోపణ ఎదుర్కొంటున్న బాలలతో పాటు నేరం చేసినట్లు రుజువైన బాలల సంరక్షణ, వారి పోషణ, అవసరమైన పిల్లలకు వారి ప్రాథమిక అవసరాలు తీర్చడం, వారితో స్నేహపూర్వకంగా మెలగడం, పునరావాసం, వారికి అవసరమైన న్యాయ నిర్ణయాలు తీసుకోవడం కోసం చేసిన చట్టాలను ఏకం చేస్తూ సవరించిన చట్టం ఇది. ఈ చట్టం ద్వారా అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడిన బాలలకు సరైన రక్షణ, సంరక్షణ దొరుకుంతుంది.అక్షయ సాధించిన తెలుగు, వరల్డ్ బుక్ రికార్డుల సర్టిఫికెట్లు అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఔరా అనిపించుకుంటున్న బాలలు తెలుగు, ఇండియా , వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు నేడు బాలల దినోత్సవంఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాధారణంగా రెండున్నర నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు అప్పుడప్పుడే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ బుడతడు జంతువులు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో సహా దాదాపు 10 అంశాలను గుర్తుంచుకుని అతి పిన్న వయస్సులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన వెల్గూరి రాజేష్, లిఖితకు 2022లో వివాహం జరిగింది. రాజేష్ సూర్యాపేటలోని యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. లిఖిత గృహిణి. వీరికి కుమారుడు అద్వైత్ జన్మించగా.. ప్రస్తుతం అతడి వయస్సు 27 నెలలు. చిన్నప్పటి నుంచి అద్వైత్ చాలా చురకుగా ఉండేవాడు. ఇది గమనించిన తల్లి లిఖిత ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని అద్వైత్కు చెబుతూ ఉండేది. ఇలా చెప్పిన విషయాలను మరునాడు అడిగితే తిరిగి చెప్పేవాడు. 10 అంశాలతో రికార్డుల్లోకి..! అద్వైత్ ఏడాది వయస్సు ఉన్నప్పుడే 10 మంది స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను చూపిస్తే వారిని గుర్తించి తిరిగి చెప్పేవాడు. అలాగే 10 శరీర భాగాలు, 10 రకాల జంతువులు, 12 రకాల ఫలాలు, ఏ నుంచి జెడ్ వరకు ఆంగ్ల వర్ణమాల పదాలు, 10 రకాల మంచి అలవాట్లు, 5 రకాల వాహనాల పేర్లు, 4 రకాల రంగులను వెంటనే గుర్తించి చెబుతాడు. వీటన్నింటిని రికార్డు చేసి తల్లిదండ్రులు అద్వైత్ 21 నెలల వయస్సులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపించగా.. రెండు నెలలకు అతడికి అందులో చోటు దక్కింది. ప్రస్తుతం ఇవే కాకుండా ఇంగ్లిష్లో నెలలు, వారాల పేర్లు చెబుతున్నాడు. మరో 10 దాకా వివిధ రాష్ట్రాల రాజధానులను అడిగితే టకీమని చెబుతూ అబ్బుర పరుస్తున్నాడు. -
బీసీ జేఏసీ ధర్మపోరాట దీక్ష
నల్లగొండ టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఎన్జీ కళాశాల వద్ద ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ఫ్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బాధ్యతను తీసుకుని పార్లమెంట్లో చట్టపవరణ చేయించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తండు సైదులుగౌడ్, సుంకరి మల్లేష్గౌడ్, పిల్లిరామరాజు, కేశబోయిన శంకర్ముదిరాజ్, కంది సూర్యనారాయణ, కొల్లోజు సత్యనారాయణ, నేటపట్ల సత్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నకిరేకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, జివ్వాజి ఇంద్రయ్య, సీతారాములు, శంకర్, సాయిబాబా, వెంకటేశ్వర్లు, నల్ల సోమమల్లయ్య, ఎల్లంరాజు, చొల్లేటి రమేష్, శ్యాంసుందర్, ఆదినారాయణ, మధుయాదవ్, రాములు, గోవర్ధనచారి పాల్గొన్నారు. -
బాల మేధావి అక్షయ
తిప్పర్తి: ఆడుతూ పాడుతూ మారం చేసే చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించి పలువురి మన్ననలు అందుకుటోంది. తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామానికి చెందిన నెలగొందరాశి రమేష్, దివ్యభారతి దంపతుల మొదటి సంతానం అక్షయ. రెండున్నరేళ్ల వయసున్న అక్షయ తన మేధోశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం అక్షయ నల్లగొండలోని ఆల్ఫా స్కూల్లో యూకేజీ చదువుతుంది. అక్షయ తండ్రి రమేష్ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తల్లి దివ్యభారతి మార్కెట్కు, షాపింగ్కు వెళ్లినప్పుడు అక్కడ కనపడిన వస్తువులను అక్షయకు పదేపదే చెప్పగా ఆమె వాటన్నింటినీ గుర్తుకుపెట్టుకుని తిరిగి చెప్పేది. అక్షయ జ్ఞాపకశక్తిని గ్రహించిన తండ్రి రమేష్ ఆమెకు ప్రపంచ దేశాల పేర్లు ఒకటి రెండుసార్లు చెప్పగా.. ఆమె వెంటనే టకీమని వాటిని తిరిగి చెప్పేది. రెండున్నరేళ్ల వయసులోనే 104 దేశాల పతాకాలను గుర్తించడంతో పాటు రసాయన మూలకాలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాపటాలను గుర్తించి వారి పేర్లు చెప్పేది. రాష్టాలు, వాటి రాజధానులు, పండ్లు, కూరగాయల పేర్లు, ప్రపంచ పటంలోని ఖండాలను గుర్తించి చెప్పేది. అక్షయ మేధోశక్తిని తండ్రి రమేష్ గుర్తించి తెలిసిన వారి ద్వారా 2022లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో పేరు నమోదు చేయించాడు. వారు అక్షయ మేధోశక్తిని గుర్తించి బుక్ ఆఫ్ ఛాంపియన్ వరల్డ్ రికార్డులో ఆమె పేరును ప్రకటించారు. అనంతరం ఆ సంస్థ చైర్మన్ బీవీ పట్టాభిరాం చిన్నారి అక్షయ పేరు వరల్డ్ రికార్డులో నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అక్షయ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ సైతం అందుకుంది. -
6,57,229 ఎకరాల్లో సాగు
యాసంగి ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయ శాఖనల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా ప్రస్తుత యాసంగి సీజన్లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విత్తనాలకు ఇండెంట్ యాసంగి సీజన్కు సంంధించిన వరి, పెసర, వేరుశనగ విత్తనాల కోసం జిల్లా వ్వవసాయ శాఖ అంచనా లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపించింది. వరి విత్తనాలైన ఎంటీయూ 1010, బీపీటీ, ఆర్ఎన్ఆర్ 15048, జేజీఎల్ రకాలు 1,20,850 క్వింటాళ్లు, పెసర 1100 క్వింటాళ్లు, వేరుశనగ 22,180 క్వింటాళ్లు అవసరంగా గుర్తించిన వ్యవసాయ శాఖ దానికి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. 1,62,200 టన్నుల ఎరువులు అవసరం జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్కు 1,62,200 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా జిల్లా వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. అందులో యూరియా 74,955.08 మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,582.69 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,600.68 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 46,628.22 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 7433.07 మెట్రిక్ టన్నులు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.యాసంగి సాగు అంచనా వివరాలు ఇలా పంట ఎకరాలు వరి 5,64,678 సజ్జ 50 జొన్న 1,400మొక్కజొన్న 825పెసర 1,100వేరుశనగ 22,180 ఉదాన పంటలు 65,794 ఇతర పంటలు 1,202మొత్తం 6,57,229 యాసంగి సీజన్కు అవసరమైన విత్తనాలు,ఎరువులను ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించాం. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
గంజాయి నిందితుల రిమాండ్
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డ నిందితులును గురువారం రిమాండ్కు తరలించినట్లు తరలించారు. హైదారాబాద్కు చెందిన అల్లం సాంబశివుడు, కర్రీ శ్రీనివాస్(24), కర్రీ రేషిత సంధ్య గంజాయిని ఏపీలోని సీలేరులో కొనుగోలు చేసి హైదారాబాద్కు తరలిస్తుండగా పంతంగి టోల్ప్లాజా వద్ద పట్టుకున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. వారి నుంచి 24 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు, లాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి వేములపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండల కేంద్రానికి చెందిన పెదపంగ జానమ్మ(65) ఈ నెల 7న మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం సమీపంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జానమ్మను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దర్వేశిపురంలో నేడు బహిరంగ వేలం
కనగల్ : మండల పరిధిలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఏడాది కాలానికి (2026) వస్తు విక్రయ హక్కులను కల్పించేందుకు శుక్రవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయల వేలంలో పాల్గొనే వారు రూ.10 లక్షలు, పూలుపండ్లకు రూ.3 లక్షలు, గాజుల అమ్మకాలకు రూ.1లక్ష, ఆలయ ఫంక్షన్హల్కు రూ.50 వేలు, దేవస్థానం వద్ద ఫొటోలు తీయడానికి రూ.20 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటలలోపు షీల్డ్ టెండర్కు డీడీని జతపరిచి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలని సూచించారు. బుద్ధవనం అద్భుతంఫ రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాలపెద్దవూర : సాగరతీరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం అద్భుతమైన శిల్పకళా నిర్మాణమని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల ప్రశంసించారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక ఆయన బుద్ధవనాన్ని సందర్శించి, బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహాస్థూపం సమావేశ మందిరంలో ప్రదర్శించిన బుద్ధవనం విశేషాలపై లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర ఎంపీ సిన్హాకు బుద్ధవనం నిర్మాణ విశేషాలను తెలియజేసి కండువాతో సత్కరించి, బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనదేశపు సంస్కృతికి, చరిత్రకు బుద్ధవనం ప్రతీకగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకుడు శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణరామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ ఏ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 76600 22517, 08682 244416 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షలకు 1160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలిమునుగోడు : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. గురువారం ఆయన మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా అమర్చిన టీబీ ఎక్స్రే మిషన్ పనితీరును పరిశీలించారు. ఆ మిషన్ ద్వారా ఎక్స్రే తీయించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటుచేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు
మునుగోడు : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆమె మునుగోడులో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వెంటనే కాంటా వేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పత్తి సాగుచేసిన రైతులు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునేందుకు 12 శాతంలోపు తేమతో ఉంటేనే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కిష్టాపురం గ్రామంలో ఓ యువ రైతు సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేసే పంటలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం ధరిచేరదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఎం గోపికృష్ణ, డీఎస్ఓ వెంకటేష్, డీసీఓ సత్యనాయక్, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, సీఈఓ సుఖేందర్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’..
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్న రీతిలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’ అని హోరింగ్పై పెద్ద అక్షరాలతో రాయించారు. దాని కింద ‘ఎవ్రీ లైఫ్ కౌంట్–నల్లగొండ పోలీస్ కేర్’ అని రాసి ఉంది. అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదానికి గురై తుక్కుగా మారిన కారును కూడా హోర్డింగ్కు ప్రత్యేకంగా అమర్చారు. ఈ హోర్డింగ్.. హైవే మీద ప్రయాణించే వారికి ఒక కిలోమీటర్ దూరం నుంచే కనిపించేలా 25ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారీ హోర్డింగ్ను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలకు అనుగుణంగా నియమిత వేగంతో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకోవాలన్నారు. -
కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం
ఫ బస్సు టైరు ఎక్కడంతో బుల్లెట్లా దూసుకొచ్చిన రాయి ఫ ప్రయాణికురాలి తలకు తగలడంతో తీవ్ర గాయాలు కోదాడ: కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో గురువారం సాయంత్రం ఊహించని ప్రమాదం జరిగింది. మేళ్లచెరువు మండలానికి చెందిన ఓ ప్రయాణికురాలు బస్సు కోసం కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో వేచి ఉండగా.. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు వేగంగా బస్టాండ్లోకి వచ్చింది. ఈ క్రమంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న గులకరాయి పైకి బస్సు టైరు ఎక్కడంతో రాయి బుల్లెట్ వేగంతో వచ్చి ప్లాట్ఫాం వద్ద నిల్చున్న ప్రయాణికురాలి తలకు తగిలింది. ఏం జరిగిందో తెలుసుకొనే లోపే మహిళ కుప్పకూలిపోయింది. తోటి ప్రయాణికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి మిర్యాలగూడ టౌన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మిర్యాలగూడ మండలంలో జరిగింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కేళ్లపాడు గ్రామానికి చెందిన గుండు సురేష్(25) తన ఇంటికి వచ్చి పక్కనే ఉన్న దొడ్డిలోకి ట్రాక్టర్లో నుంచి గడ్డి కట్టలు దింపే క్రమంలో అడ్డుగా ఉన్న విద్యుత్ సర్వీసు వైరును కర్ర సహాయంతో పక్కకు జరుపుతుండగా.. విద్యుత్ వైరు చేతిపై పడి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న గుండు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణంపాలకవీడు: బైక్పై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్ వెళ్లే రోడ్డు మార్గంలో అదానీ సిమెంట్ పరిశ్రమ సమీపంలో గురువారం జరిగింది. ఎస్ఐ ఆర్. కోటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహంకాళిగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల లింగయ్య(45) బైక్పై వెళ్తుండగా.. కంకర లోడ్తో శూన్యపహాడ్ వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనం ఢీకొని.. మిర్యాలగూడ: రోడ్డు దాటుతున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో గురువారం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తలపాలెం గ్రామానికి చెందిన పోలేపల్లి లక్ష్మయ్య(38) గ్రామ పరిధిలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి దాటుతుండగా గుంటూరు నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. బైక్పై వెళ్తూ డీసీఎంను ఢీకొని ఒకరు మృతి మునగాల: విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఒకరు మృతిచెందారు. మరొక వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతుడు కోదాడ మున్సిపాలిటీలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఎస్కే సిరాజ్గా పోలీసులు గుర్తించార. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తామునగాల: మునగాల మండలం నేలమర్రి–మాధవరం గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుపై గురువారం ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నేలమర్రి గ్రామానికి చెందిన రెణబోతు జానకిరెడ్డి తాను పండించిన ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా.. అప్రోచ్ రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా తరచూ ఈ అప్రోచ్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అప్రోచ్ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారాయని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు రోడ్డు మర్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను త్రిపురారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదేవులపల్లి మండల ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పిల్లి మణికంఠ, మాడుగులపల్లి మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన దండు వినోద్, బండి కోటేష్ స్నేహితులు. వీరు ముగ్గురు గంజాయి సేవించేవారు. వీరికి ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కొమ్మెర శివ తన స్నేహితుడైన చల్లా అంజి వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయించేవాడు. గురువారం శివ తన స్నేహితుడైన అంజి వద్ద 1.6 కిలోల గంజాయిని మాచర్లలో కొనుగోలు చేసి ఉదయం పది గంటల సమయంలో త్రిపురారం గ్రామ శివారులో గంగదేవరమ్మ గుడి వద్ద మణికంఠ, వినోద్, కోటేశ్కు విక్రయిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు త్రిపురారం ఎస్ఐ కె. నరేశ్ తన సిబ్బందితో వెళ్లి నలుగురిని పట్టుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న చల్లా అంజి పరారీ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హాలియా సీఐ డి. సతీష్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీను, చంద్రశేఖర్, నాగేశ్వర్రావు, ఆర్. శ్రీనివాస్, హోంగార్డులు ఉన్నారు. 250 గ్రాముల గంజాయి పట్టివేత మిర్యాలగూడ టౌన్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన అమరలింగంకు మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నివాసముంటున్న పులిజాల లక్ష్మీనారాయణ, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఎస్కే రియాజ్, రవీంద్రనగర్కు చెందిన కె. వంశీతో పరిచయం ఏర్పడింది. వీరంతా కలిసి ఈ నెల 12న మిర్యాలగూడ మండలం గుండూరు గ్రామ శివారులోని యాదాద్రి వెంచర్ వద్ద గంజాయి తీసుకురాగా.. పక్కా సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఎస్కే రియాజ్, వంశీని అరెస్ట్ చేశారు. అమరలింగం, లక్ష్మీనారాయణ పర్యారయ్యారు. పట్టుబడిన వారి నుంచి 250 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
ధాన్యం తూకాల్లో మోసాలు
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ : ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉండేవారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించి తూకాల్లో మోసాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ ఆరోపించారు. నకిరేకల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 2 కేజీలు అధికంగా తుకాలు వేస్తున్నారని, నిర్వాహకులకు కమీషన్ ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు కొప్పుల ప్రదీప్రెడ్డి, తలారి బలరాం, మారం వెంకట్రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, గొర్ల వీరయ్య, పేర్ల కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు. -
నీటి గుంతలో పడి రైతు మృతి
ఫ మృతుడి నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు కనగల్: నీటి గుంతలో పడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన గురువారం కనగల్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజీవ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండల కేంద్రానికి చెందిన రైతు నక్కల శంకరయ్య(64) ధాన్యం కాంటా వేయించేందుకు గురువారం తెల్లవారుజామున తన కుమారుడు రాజుతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. శంకరయ్యను వడ్ల రాశి వద్ద ఉండమని చెప్పి రాజు అమ్మగూడెం గ్రామంలో వడ్ల కాంటాను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. రాజు తిరిగి వచ్చేసరికి పొలం వద్ద తన తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతుండగా పొలం పక్కన గల నీటి గుంతలో శంకరయ్య పడిపోయి ఉన్నాడు. పక్కనే ఉన్న హమాలీలను పిలిపి వారి సహాయంతో శంకరయ్యను గుంత నుంచి బయటకు తీయగా.. అప్పటికే అతడు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజీవ్రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు శంకరయ్య నేత్రాలను నల్లగొండ లయన్స్ క్లబ్ ఐ డొనేషన్ చారిటబుల్ ట్రస్ట్కు కుటుంబ సభ్యులు దానం చేశారు. -
ఆడిట్తో అక్రమాలకు చెక్
ఫ ఎస్ఎల్ఎఫ్ సంఘాల పొదుపుపై కొనసాగుతున్న ఆడిట్ ఫ నీలగిరి పట్టణంలో 75 సంఘాలు నీలగిరి పట్టణంలో ఎస్ఎల్ఎఫ్ సంఘాలు 75 ఉండగా.. వీటిలో 750 మంది సభ్యులు ఉన్నారు. వీరు ప్రతినెలా పొదుపు చేసిన డబ్బులు, తీసుకున్న రుణం, ఇచ్చిన అప్పు తదితర లెక్కలు పక్కాగా తీయడానికి ఒక్కో పొదుపు సంఘానికి ఆడిట్ చేసే సిబ్బంది రూ.1000 చొప్పున తీసుకుంటున్నారు. అయితే పొదుపు సంఘాల మహిళలకు ఆడిట్ ఖర్చు ఎక్కువగానే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇద్దరు సిబ్బంది 75 సంఘాలను రెండు రోజుల్లోనే ఆడిట్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకు రూ.75 వేలు అవుతుండడం గమనార్హం. నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలోని స్లమ్ లెవర్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్) సంఘాల మహిళల పొదుపు లావాదేవీలపై ఆడిటింగ్ ప్రారంభమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ జరుగుతోంది. స్లమ్ లెవల్ ఫెడరేషన్ కింద నీలగిరిలో 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఇటీవల 40 సంఘాల ఆడిట్ పూర్తి కాగా, గురువారం 35 సంఘాల వారు ఆడిటింగ్ చేయించారు. ఏటా ఆడిటింగ్ చేయడం ద్వారా సంఘంలో జరిగే పూర్తి వివరాలు తెలియడంతోపాటు అక్రమాలకు సైతం చెక్ పడనుంది. రూపాయితో సహా అన్నింటిని సంఘ సభ్యులకు పేపర్పై రాసి లెక్కలు చెబుతున్నారు. రూ.1000 వరకు పొదుపు నీలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్లమ్ లెవల్ ఫెడరేషన్ కింద 75 పొదుపు సంఘాలు ఉన్నాయి. ప్రతి 15 సంఘాలు కలిసి ఎస్ఎల్ఎఫ్ సంఘంలో నెలకు రూ.100 నుంచి రూ.1000 వరకు పొదుపు చేసుకుంటున్నారు. బ్యాంకుతో సంబంధం లేకుండానే పొదుపు చేసుకున్న డబ్బులను సంఘంలో వ్యాపార అవసరాలు ఉన్న మహిళలు అప్పుగా ఇస్తారు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీతో సహా నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వారి వ్యాపారాన్ని బట్టి ఒకొక్కరికి రూ.లక్ష వరకు రుణం ఇస్తుంటారు. ఆయా సంఘాల వారు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, తీసుకున్న రుణం, చెల్లింపులు, అప్పు తదితర వాటిపై ఆడిటింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో 75 ఎస్ఎల్ఎఫ్ సంఘాల లావాదేవీలను ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది ఆడిట్ చేస్తున్నారు. ఏటా ఆడిటింగ్.. పొదుపు సంఘాల మహిళలు తమ అవసరాల కోసం తీసుకుంటున్న రుణాలను తిరిగి చెల్లింపులు జరుపడం, 15 సంఘాల వారు కలిసి పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా తీసుకుంటున్న రుణం, వడ్డీ తదితర వాటికి సంబంధించిన డబ్బుల లావాదేవీలు పారదర్శకంగా ఉండాల్సి ఉంటుంది. దాంతో ప్రతి సంవత్సరం ఆడిటింగ్ ప్రక్రియ చేపట్టి అవకతకలను గుర్తిస్తుంటారు. ఎస్ఎల్ఎఫ్ సంఘాలు పొదుపు చేసుకుంటున్న డబ్బులు, ఇచ్చే రుణం, అప్పు తదితర వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సర ఆడిటింగ్ నడుస్తుంది. చిన్న, చిన్న పొరపాట్లు ఉన్నా.. గుర్తించి లెక్కలు సరిచేస్తారు. పారదర్శకత కోసమే ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం. – శ్రీనివాస్, మెప్మా టీఎంసీ, నల్లగొండ -
‘కథ’నరంగంలో సత్తా చాటుతున్న విద్యార్థులు
చిట్యాల: వారంతా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులలో పలువురు ప్రవృత్తిగా కవిత, రచనలు రాసే వారున్నారు. ఆ ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో విద్యార్థులు సైతం కవితలు, కథలు రాస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి జెడ్పీహెచ్ఎస్కు చెందిన నలభై మంది విద్యార్థులు 2019లో ఖమ్మం జిల్లాలోని పాపికొండలు ప్రాంతానికి ఉపాధ్యాయులతో కలిసి విజ్ఞాన, విహారయాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో విద్యార్థులు పొందిన అనుభవాలను, అనుభూతులను కథ రూపంలో రాసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఆ పాఠశాలలో భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్న పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకులుగా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు రాసిన వ్యాసాలు, కవితలతో ‘రెక్క విప్పిన బాల్యం’ పుస్తకాన్ని ప్రచురించి ప్రముఖ కవి, రచయిత ఏనుగు నర్సింహారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు.. అదే పాఠశాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు కూడా కథలు రాసేందుకుగాను ఆసక్తితో ఉండటంతో 2022లో కవులు, రచయితలతో ప్రత్యేక శిబిరాన్ని ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. ఆ శిబిరంలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు పలు కథలు రాయగా.. ఆ కథలతో ‘కథల బండి’ పుస్తకాన్ని ముద్రించారు. 2024లో జర్నీ పుస్తకం.. 2023లో మరోసారి పాఠశాల విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రలో భాగంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ యాత్ర నేపథ్యంలో విద్యార్థులు రచించిన కథలతో ‘జర్నీ’ పుస్తకాన్ని ఉపాధ్యాయులు పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణ సంపాదకీయంలో ముద్రించారు. ఈ పుస్తకాన్ని 2024 నవంబర్ 14న ఆవిష్కరించారు. -
నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలే..
● పాఠశాలలు, ఆస్పత్రుల్లోనూ అరకొర వసతులే.. ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితనల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూసేకరణ చేసినా.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నల్లగొండలో ఆమె పర్యటించారు. మేధావులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. నక్కలగండి, మోత్యతండాను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సందర్శిస్తే వారి సమస్యలు అర్థమవుతాయన్నారు. అక్కడ భూమి సేకరించారు వృథాగానే ఉందని, అలాంటప్పుడు రైతులకు సేద్యం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించానని ఎంఆర్ఐ లేకపోవడం దారుణమన్నారు. అరకొర సదుపాయాలు ఉన్నా వైద్యులు, నర్సులు సేవలు అందిస్తున్నారని వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. దేవరకొండ మండలం కొమ్మేపల్లి గురుకులంలో వసతులు లేవని, 450 మంది ఉంట్లే ఇద్దరు వర్కర్లు ఉన్నారని పిల్లల దుస్తులు లాండ్రీ చేసేవారు లేరన్నారు. అధికారులు, మంత్రులు ఒక రోజైన హాస్టల్, గురుకులాల్లో నిద్రిస్తే వారి బాధలు తెలుస్తాయన్నారు. సాగర్లోని నాగార్జునకొండ మీద, నల్లగొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయంలో పలు చారిత్రక నిర్మాణాలను ఏపీలోని గుంటూరు మ్యూజియానికి తరలించారని వాటిని వెనక్కు తేలేకపోయారన్నారు.ఎంసీహెచ్ సందర్శననల్లగొండ టౌన్ : జాగృతి జనంబాటలో భాగంగా ఎమ్మెల్సీ కవిత బుధవారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని ఎస్ఎన్సీయూ, ఐసీయూ, మెటర్నటీ వార్డులను సందర్శించి రోగులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది తమకు గత నాలుగు నెలలుగా వేతనాలను అందడం లేదని, వేతనాలను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
నేడు బీసీ జేఏసీ ధర్మ పోరాట దీక్షలు
నల్లగొండ టౌన్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్మపోరాట దీక్షలను నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీక్షల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీలో పదోన్నతులునల్లగొండ : నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం 9 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కొప్పు రాంబాబు, తెలంగాణ పంచాయతీ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నరేందర్రెడ్డి పాల్గొన్నారు. పిల్లలపై ప్రత్యేక దృషి సారించాలికొండమల్లేపల్లి : చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృషి సారించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. బుధవారం కొండమల్లేపల్లి, దేవరకొండలో గల పలు కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆయన వెంట సతీష్, దుండిగళ్ల అశోక్, యర్రమద గోవర్ధన్రెడ్డి తదితరులున్నారు. ‘కలల సందుక’ కవితా సంపుటి ఆవిష్కరణచిట్యాల : మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి, రచయిత డాక్టర్ మండల స్వామి రచించిన ‘కలల సందుక’ కవితా సంపుటిని మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్వామి సమసమాజాన్ని కాంక్షించే కవిత్యాన్ని రచించారనొ కొనియాడారు. డాక్టర్ నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ వృత్తిదారుల జీవితాన్ని కవిత్వంలో నిలిపారని చెప్పారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలచారి, మోత్కూరి నరహరి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, వేముగంటి మురళీకృష్ణ, ప్రవీణ్కుమార్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ ఉప్పల పద్మ, డాక్టర్ కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్, ప్రకాష్ పాల్గొన్నారు. 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలురామగిరి(నల్లగొండ) : ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
● కూత.. మోత
చందంపేట : మండలంలోని గన్నెర్లపల్లి గ్రామ పరిధిలోని చెంచుకాలనీలో 65 కుటుంబాలు.. 200 జనాభా ఉంది. ఈ కాలనీకి రెండు నెలలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీలో ఉన్న రెండు బోర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో గుక్కెడు నీటి కోసం ఈ కాలనీ ముందు నుంచి పారుతున్న డిండి ప్రాజెక్టు నీటిని పట్టుకొని దప్పిక తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ వాగులో నీరుంది. లేకుంటే బిందెలు తీసుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిందే. నీటి సమస్య తీర్చాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఖాళీ బిందెలతో బుధవారం కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని దేవరకొండ – శ్రీశైలం వెళ్లే రోడ్డు వద్దకు నడిచి వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఎస్ఐ లోకేష్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామని చెప్పడంతో వెనుదిరిగారు.గుక్కెడు నీటికి గిరిజనుల గోస -
సదరం నూతన భవనం ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన సందరం కార్డుల జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత ఎక్కువగా ప్రసవాలు నల్లగొండ జీజీహెచ్లో అవుతున్నాయని చెప్పారు. సదరం నూతన భవనాన్ని ప్రారంభించామని, వైకల్యం కలిగిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ : ధాన్యం దిగుమతి చేసుకోవడంతో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతోందని, కొనుగోళ్లు ఆలస్యమైతే రైతులకు సమాధానం చెప్పలేమని.. అవసరమైతే రాత్రింబవళ్లు కాంటాలు వేయాలని అధికారులను ఆదేశించారు. రోజుల తరబడి మిల్లుల వద్ద లారీలు నిలపడం వల్ల కేంద్రాల్లో కాంటా వేసిన బస్తాలు తరలించడం సాధ్యం కాదని.. మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిల్లర్లు నారాయణ, ఇంద్రారెడ్డి, భద్రాద్రి ధాన్యం తడవడం వల్ల నూకలు అవుతున్నాయని.. బాయిల్డ్రైస్ సరఫరాకు అనుమతి ఇప్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆరు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మిల్లింగ్ చార్జీలు రావాలని, రవాణా బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్పందించిన మంత్రి కేంద్ర మంత్రితో మాట్లాడి బాయిల్డ్ రైస్ పెట్టేందుకు అనుమతి కోసం కృషి చేస్తానని, ముఖ్యమంత్రితో మాట్లాడి బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిల్లర్లు మిల్లు పాయింట్కు వచ్చిన ధాన్యం తిరిగి పంపించడం సరి కాదన్నారు. ఏదైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడుకోవాలని పేర్కొన్నారు. గత సీజన్ సీఎంఆర్ తీసుకోకపోవడం వల్ల మిల్లుల్లో స్థలం లేదని సీఎంఆర్ తీసుకుంటే ధాన్యం దిగుమతికి ఇబ్బంది ఉండదని మిల్లర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీసీఓ పత్యానాయక్, ఆర్డీఓ అశోక్రెడ్డి, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన రామగిరి(నల్లగొండ) : నల్లగొండ సమీపంలో చర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిశీలించారు. ధాన్యం తేమశాతాన్ని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, హమాలీలతో మాట్లాడారు. గడచిన 20 రోజులు వర్షానికి ధాన్యం తడవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ప్రస్తుతం రోజూ 10,000 మెట్రిక్ టన్నులకు పైగానే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేట్లో ధాన్యం అమ్మవద్దని సూచించారు. బ్రాహ్మణ వెల్లంలతోపాటు, కాల్వలు పూర్తయితే చర్లపల్లి, మర్రిగూడెం, అన్నెపర్తి, కంచనపల్లి చెరువులను నింపుతామని తద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చుట్టుపక్కల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణకు రూ.17 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫ ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
బాలికలకు అథ్లెటిక్స్ లీగ్
విద్యార్థినుల్లో క్రీడా ప్రతిభను వెలికితీ సేందుకు కేంద్రం ‘అస్మిత ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టిందిపూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 587.60 అడుగులు ఇన్ఫ్లో : 50,933 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 50,933 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,779 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,654 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్వరిసాగులో చరిత్ర.. వరిసాగులో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. - 8లోదేశభక్తిని పెంచడంలో పటేల్ పాత్ర గొప్పది నల్లగొండ : దేశభక్తిని పెంపొందించడంలో వల్లభాయ్ పటేల్ పాత్ర ఎనలేనిదని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఆవరణలో ‘యూనిట్ మార్చ్’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి అక్బర్ అలీ, మై భారత్ స్టేట్ సభ్యులు అనుస్మాన్, ప్రసాద్దాస్, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జల సంరక్షణలో నల్లగొండకు రెండో స్థానం
జల సంరక్షణ కోసం జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలో అత్యధికంగా పనులు చేపట్టగా, ఆ తర్వాత స్థానంలో నాంపల్లి మండలం ఉంది. తిరుమలగిరి సాగర్లో 3,678 పనులు చేపట్టగా, నాంపల్లిలో 3,628 పనులను చేపట్టారు. అతి తక్కువగా మునుగోడు మండలంలో 1,410 పనులను చేపట్టారు. నల్లగొండ : జల సంరక్షణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అబియాన్ కింద చేపట్టిన జల్ సంచయ్–జల్ భాగీదారీ (జేఎస్జేబీ) పథకం కింద డీఆర్డీఏ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పనులు చేపట్టారు. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో అత్యధికంగా పనులు చేసినందుకుగాను నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. జిల్లాకు అవార్డు దక్కడంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ శేఖర్రెడ్డిని అభినందించారు. జల శక్తి అభియాన్ కింద 13 రకాల పనులు కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కింద జల సంరక్షణ కోసం జల్ సంచయ్–జల్ భాగీదారీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో నీటి సంరక్షణ కోసం గృహాల్లో మ్యాజిక్ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పత్తి చేలలో కుంటలు, ఎంఐ ట్యాంకులు, చెరువుల పూడికతీత, ఊట కుంటలు, చెక్ డ్యామ్లు, గుట్టల వద్ద కందకాలు, వరద కట్టలు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు, రూప్ వాటర్ ఇంకుడు గుంతలను నిర్మించి నీటి సంరక్షణ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపునకు చర్యలు చేపట్టింది. మొత్తంగా 84,827 పనులు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ పథకం కింద జిల్లాలోని 31 మండలాల పరిధిలో మే 2025 వరకు 84,827 పనులను చేపట్టారు. ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జల్ సంచయ్–జల్ భాగిదారి పోర్టల్లో అప్లోడ్ చేసింది. చేసిన పనులకు సంబంధించి 99 శాతం వెరిఫికేషన్ పూర్తి చేయడంతో పాటు 31 మండలాల పరిధిలో 849 పనుల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కేంద్ర అధికారులు బొల్లం సంతోష్కుమార్, ఆనంద్ ఆధ్వర్యంలో రెండు బృందాలు ఈ ఏడాది జూన్ 19వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. ఆగస్టు 8వ తేదీన పరిశీలన పూర్తయింది. అవార్డుకు నల్లగొండ ఎంపిక రాష్ట్రంలోనే అత్యధికంగా 96 వేల పనులు చేపట్టి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా 84,827 పనులతో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మంచిర్యాల జిల్లా మూడో స్థానంలో ఉంది. ఈ మూడు స్థానాలు దక్కించుకున్న జిల్లాలకు అవార్డుతోపాటు రూ.2 కోట్ల చొప్పున నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన పనులు విజయవంత మయ్యాయి. నీటి బొట్టును ఒడిసిపట్టడంలో జిల్లా బెస్ట్గా నిలిచింది. జలసంరక్షణ పనుల నిర్వహణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి.. అవార్డుకు ఎంపికై ంది. ఫ జల్ సంచయ్ – జల్ భాగీదారీ పథకం కింద అవార్డు ఫ 31 మండలాల్లో 13 కేటగిరీల్లో 84,827 పనుల నిర్వహణ ఫ పెద్ద ఎత్తున భూగర్భ జలాల సంరక్షణకు కృషి ఫ 18న రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోనున్న కలెక్టర్ -
ప్రతి ఇంటినీ సర్వే చేయాలి
తిప్పర్తి : ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేయాలని తెలంగాణ రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. 2027 జనగణనలో భాగంగా బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన ఎంతో ముఖ్యమైనదని, ఎన్యూమరేటర్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని జియోటాగ్ చేయాలని, ఇల్లు వివరాలను స్టేటస్ను పొందుపర్చాలన్నారు. మొదట ఇళ్లకు నంబర్ వేయాలని చెప్పారు. ఈ సర్వే ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సులువు అవుతుందన్నారు. ప్రతి ఎన్యూమరేటర్ జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. కార్యక్రమం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్ఐ శంకర్, ఆర్ఐ ద్రోణార్జున తదితరులు పాల్గొన్నారు. -
అబుల్ కలాం ఆజాద్కు నివాళి
నల్లగొండ : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధి ప్రదాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ప్రజలు ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఆజాద్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్రెడ్డి, డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, డాక్టర్ ఎంఏ.ఖాన్, సయ్యద్హసన్, ఎండీ.సలీం, ఎంఏ రఫీ ఉన్నారు. -
అమ్మా నేనెందుకు ఇలా..
చిన్నారులను జోలెలో వేసుకుని భిక్షాటన చేస్తున్న మహిళలు పిల్లలు నిద్ర లేవకుండా మత్తు పదార్థాలు ఇస్తున్నారు. - 8లోమిల్లుకు తరలిన ధాన్యంరామగిరి(నల్లగొండ) : మండలంలోని జీకె అన్నారం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని మంగళవారం మిల్లులకు తరలించారు. ‘సాక్షి’లో ‘నిలిచిన ధాన్యం ఎగుమతులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు లారీలు లేక ఎగుమతి ఆగిపోవడంతో వెంటనే లారీ కాంట్రాక్టర్తో మాట్లాడారు. మంగళవారం మూడు లారీలను పంపి.. కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించారు. లారీపైకి బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీలు -
ధాన్యం ఇవ్వకున్నా..
ఫ ఆరు మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టిన అధికారులు ఫ ఆయా మిల్లులకు ఈ సీజన్లో ధాన్యం కేటాయింపు నిలిపివేత ఫ వేరే మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని తీసుకొని మరాడిస్తున్న.. ఆ మిల్లులు ఫ సీఎంఆర్ ధాన్యం అమ్ముకున్నారని తేలినా.. చర్యలకు అధికారుల వెనుకంజ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కొందరు మిల్లర్లు అక్రమాల బాటను వీడడం లేదు. గతంలో జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం నుంచి 4.5 లక్షల క్వింటాళ్ల ధాన్యం తీసుకుని దానికి సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వలేదు. దీంతో వారికి ఈ వానాకాలం సీజన్లో అధికారులు ధాన్యం కేటాయించలేదు. అయినా వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇతర మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మరాడించి తమ పని కానిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇతర జిల్లాల్లో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం రాకపోవడంతో రూ.కోట్లలో నష్టం తప్పడం లేదు. కొంతమంది అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కై చర్యలకు వెనుకంజ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆరు మిల్లులకు ధాన్యం కేటాయింపు లేదు రెండేళ్ల కిందట జిల్లాలోని ఆరు మిల్లులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఆ మిల్లర్లను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈ వానాకాలం సీజన్లో ఆ మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా ఆపేశారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఆయా మిల్లులు ఇతర మిల్లుల నుంచి ధాన్యం తీసుకుంటున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో నల్లగొండలో అధికారులు ధాన్యమే కేటాయించని ఓ మిల్లుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించారు. అప్పట్లో ఈ విషయంలో బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్నీ ప్రభుత్వమే ఇస్తున్నా.. ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యం కొని రైతులకు డబ్బులు ఇస్తోంది. లారీల ట్రాన్స్పోర్టుకు డబ్బు ఇస్తోంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపుతోంది. మిల్లర్ దానిని మరాడించి సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చినందుకు డబ్బులు చెల్లిస్తోంది. ఈ ప్రక్రియలో ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. మిల్లర్లు మాత్రం రూపాయి పెట్టుబడి పెట్టకుండా ధాన్యం తీసుకొని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. అయినా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతునఆన అధికారుల్లో చలనం లేకుండాపోతోంది. ప్రభుత్వ ధాన్యాన్ని మింగేశారని తేల్చిన అధికారులు చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు. మిల్లర్ల నుంచి అందే అమ్యామ్యాల కారణంగానే కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బియ్యం ఇవ్వకుండా ఏళ్ల తరబడి కాలం గడుపుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చాక, తనిఖీలు చేశాక, అక్రమాలు జరిగినట్లు తేలాక కూడా చర్యలు చేపట్టడం లేదంటే.. మిల్లర్ల లాబీ ప్రభావం అధికారులపై ఏస్థాయిలో ఉందో అర్థఽం చేసుకోవచ్చని పౌర సరఫరాల విభాగంలో చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రాబట్టడం లేదని, గతేడాది కూడా అక్రమాలకు పాల్పడిన కొన్ని మిల్లులకు ధాన్యం కేటాయించి వారి అక్రమాలకు మరింత వత్తాసు పలికారన్న ఆరోపణలు ఉన్నాయి. ధాన్యం కాజేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి, మిల్లులను సీజ్ చేస్తే అక్రమాలకు పుల్స్టాప్ పడే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. -
ఊరి చివరనే మద్యం
మునుగోడు : మునుగోడు పట్టణంలో ఇప్పటి వరకు కొనసాగిన మద్యం దుకాణాలు ఇక, నుంచి గ్రామ శివారుకు తరలనున్నాయి. ఈ నెల చివరి నాటికి మద్యం దుకాణాల లీజు ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నియంత్రించాలనే ఆలోచనతో కొన్ని సూచనలు చేశారు. దీంతో నూతన టెండర్లలో వైన్ షాపులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యే సూచనలు పాటించేందుకు ఇప్పటికే గ్రామ శివారులో దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్ 1వ నూతన షాపులు.. మునుగోడు మండలంలో నాలుగు మద్యం దుకాణాలు ఉండగా.. చౌటుప్పల్ రోడ్డులో ఒకటి, నల్లగొండ రోడ్డులో రెండు, చండూరు రోడ్డులో ఒకటి ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన దుకాణాలు ప్రారంభించాల్సి ఉండడంతో.. అందుకు అవసమైన నిర్మాణాలను వేగవంతం చేశారు. అయితే ఎంతో కాలంగా జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేస్తుండడంతో మహిళలు, మద్యం వ్యతిరేకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలను గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో పాటు.. మధ్యాహ్నం తరువాతే మద్యం విక్రయాలు చేపట్టాలని నూతన వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మద్యం దుకాణాల్లో సిట్టింగ్లు కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగించేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు గతంలో మాదిరి బెల్ట్ దుకాణాలకు మద్యం విక్రయించకుండా.. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులే గ్రామాల్లో ప్రత్యేకంగా మినీ దుకాణాలను ఏర్పాటుచేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. మినీ దుకాణాల ఏర్పాటు కోసం సంబంధిత అధికారులను కూడా కలిసినట్లు సమాచారం. విచ్చలవిడి మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసేలా వ్యాపారులు కూడా సిద్ధం కావడంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పలువురు కృతజ్జతలు తెలుపుతున్నారు. ఫ మునుగోడు శివారులో ఏర్పాటుకు నూతన వ్యాపారుల నిర్ణయం ఫ మద్యం అమ్మకాలు నియంత్రించేలా సన్నాహాలు -
ఆంధ్రా ధాన్యం రాకుండా చెక్పోస్టులు
మిర్యాలగూడ : ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి శివారు సూర్య రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మిల్లులో ధాన్యం ట్రాక్టర్ల వద్ద ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా నుంచి ధాన్యం రాకుండా వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సీజన్లో రైతులకు ఇబ్బందులు రాకుండా మిల్లర్లు సాఫీగా కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు రైస్ మిల్లర్లు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, ఉపాధ్యక్షుడు గోళ్ల రామ్శేఖర్, మోహన్రావు తదితరులు ఉన్నారు. ఫ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ -
ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా?
చందంపేట, నాంపల్లి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ప్రజల గోస ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాక రైతులు, పరిహారం అందక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో మంగళవారం ఆమె జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించారు. నాంపల్లి మండలంలోని లక్ష్మాపురంలో నిర్మిస్తున్న కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ను, చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టును, తిరుమలగిరిసాగర్ మండలంలోని నెల్లికల్లు లిఫ్టు పనులను పరిశీలించారు. ఆయా చోట్ల నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలువురు రైతులు మోంథా తుపాన్ కారణంగా పంట నష్టపోయామని ఆమెకు వివరించారు. ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లా మంత్రిగా పనిచేసిన జగదీశ్రెడ్డి నెల్లికల్లు లిఫ్టును పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి చేస్తానని చెప్పారని.. ఆ తర్వాత ఎటుపోయారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగలేదన్నారు. నెల్లికల్లు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో ఈ జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న సోయి ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని, తేమశాతం అఽధికంగా ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూతవేటు దూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా నేటికి సాగునీరు ఈ ప్రాంత రైతులకు అందకపోవడం ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. భూ నిర్వాసితుల తరఫున తాను ముందుండి కొట్లాడుతానన్నారు. కార్యక్రమాల్లో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్యాదవ్, రూప్సింగ్, రవీందర్, నిరంజన్, శంకర్, రామ్కోటి, శివారెడ్డి, జితేందర్, ప్రజాపతి, నరేష్ తదితరులు ఉన్నారు. ఫ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ జాగృతి జనం బాటలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలన -
ఇసుకను బ్లాక్ చేస్తే కేసులు పెడతాం
నల్లగొండ : ఇసుకను బ్లాక్ చేసి బ్రోకర్లు అమ్మితే కేసులు నమోదు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ హెచ్చరించారు. నీలగిరి పట్టణంలో ఇసుక సరఫరాలో అక్రమాలపై ‘సాక్షి’లో ఈనెల 8న ‘ఆన్లైన్ ఇసుక అధ్వానం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో మైనింగ్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ అధికారి జాకబ్ మాట్లాడుతూ ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సరఫరా చేయాలని అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కొందరు డ్రైవర్లు.. ఇసుక బాగలేదని, దూరంగా ఉందని మాయమాటలు చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని సహించమన్నారు. అధికంగా డబ్బులు వస్తాయని ఇసుకను బ్రోకర్లకు అమ్మితే డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని, ఆ ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న చిరునామాకు అలాట్ అయిన వెంటనే డెలివరీ చేయాలన్నారు. ఇకనుంచి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలని ఎంట్రీ, ఎగ్జిట్ కచ్చితంగా నమోదై ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మైనింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ మైనింగ్ ఏడీ జాకబ్ -
గురుకులాల్లో వసతులు కల్పిస్తాం
పెద్దవూర : మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల క్రీడామైదానంలో అండర్–14, అండర్–19 జిల్లాస్థాయి క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించే విద్యార్థులకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా ఆమె మహాత్మాజ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే చిత్రపటాల వద్ద జ్యోతిప్రజ్వలన చేసి జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, బీసీ గురుకులా ఆర్సీఓ స్వప్న, పెద్దవూర ఎంఈఓ తరిరాములు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, నందికొండ మున్సిపల్ కమిషనర్ వేణు, ప్రిన్సిపాల్స్ రవికుమార్, భవాని, ఎస్ఐ ముత్తయ్య పాల్గొన్నారు. నల్లగొండ : వానాకాలం ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంగళవారం వివిధ సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఏఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడినా.. నిర్లక్ష్యం వహించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం గోపికృష్ణ, డీసీఓ పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీఈఓ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్లో 5,400, మూడవ సెమిస్టర్లో 5,830, ఐదవ సెమిస్టర్లో 5,597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేటలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజాబాటలో విద్యుత్ శాఖనల్లగొండ : పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ఆ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నల్లగొండలోని 21 వార్డులో పర్యటించారు. వార్డులో ఉన్న విద్యుత్ లూజ్ లైన్లు, దెబ్బతిన్న కరెంట్ స్తంభాలను పరిశీలించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, విద్యుత్ డీఈ అన్నయ్య, సలీం, షామిర్ పాల్గొన్నారు. నల్లగొండకు నేడు మంత్రి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బుధవారం నల్లగొండకు రానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దుబ్బ రూప కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, వర్షాల వల్ల వాటిల్లిన నష్టంపై సమీక్షిస్తారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తారు. ట్రక్షీట్ జారీపై విజిలెన్స్ విచారణమిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆలగడప పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ జారీ చేయడంపై మంగళవారం విజిలెన్స్ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైతులు మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి సైదిరెడ్డి, త్రిపురారం మండలం అప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన ధనావత్ తులస్యనాయక్ను విచారించారు. పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ సైదులు, వ్యవసాయ విస్తరణాధికారి ఆఫ్రీన్ను ధాన్యం రాకుండా ట్రక్ షీట్ ఎలా మంజూరు చేశారని, ట్యాబ్లో ఎలా అప్లోడ్ చేశారని ప్రశ్నించారు. 741బస్తాలు(296.40 క్వింటాళ్లు) ధాన్యం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని శ్రీశివసాయి రైస్ ఇండస్ట్రీస్కు తరలించినట్లు విచారణలో రైతులు పేర్కొన్నారు. కాగా పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం శ్రీశివసాయి రైస్ మిల్లును తనిఖీ చేశారు. రైస్మిల్లు తనిఖీచిట్యాల: కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు సకాలంలో అన్లోడింగ్ చేసుకోవడం లేదని ఓ రైతు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ వెంటనే స్పందించి ధాన్యం రైస్ మిల్లును తనిఖీ చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ను ఆదేశించారు. దీంతో ఆయన చిట్యాల పట్టణంలో భువనగిరి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును తనిఖీ చేశారు. ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం చిట్యాల శివారులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి ఉన్నారు. -
నిలిచిన ధాన్యం ఎగుమతులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల కొరత ఏర్పడింది. అనేక కేంద్రాల్లో ధాన్యం బస్తాల ఎగుమతి కాక ఎక్కిడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నల్లగొండ మండలంలోని జీకే అన్నారం కొనుగోలు కేంద్రానికి మూడు రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో సుమారు 5 వేల బస్తాలు ఎగుమతి కాకుండా నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలను ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ రవాణా చేయాల్సి ఉంది. మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ చేసుకోవడంలో ఆలస్యం చేస్తుండడంతో లారీలు అక్కడే ఉండిపోతున్నాయి. అదేవిధంగా లారీలను కాంట్రాక్టర్ సరిపడా అందుబాటులో ఉంచకపోవడం కూడా కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని అధిక లారీలను పంపాలని రైతులు కోరుతున్నారు. -
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో వ్యక్తిగత శ్రద్ధ వహించి పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్అండ్బి, నేషనల్ హైవే అథారిటీ, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి స్కూల్ బస్సుకు సైడ్ మిర్రర్లు ఏర్పాటు చేసుకోవాలని, సహాయకుడిని నియమించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని వాహనాలకు రేడియం స్టిక్కర్లు అంటించుకోవాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్అండ్బి ఈఈ శ్రీధర్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం కె.జానిరెడ్డి, డీఈఓ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, డీఎస్పీ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘బ్రాండ్’కు మిర్యాలగూడ ఆస్పత్రి
● ఆస్పత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు ● అబ్డమిన్ స్కానింగ్ మిషన్ అందుబాటులోకి తేవడం ● రోగి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో అందించే ట్రామాకేర్ సిస్టమ్ ఏర్పాటు ● ఆస్పత్రిలో, ఆస్పత్రి బయట విద్యుదీకరణ ● ఆస్పత్రి సుందరీకరణ పనులు ● ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా రిసెప్షనిస్టులను ఏర్పాటు చేసి.. వారిద్వారా రోగులకు వైద్యులచే వైద్య సేవలు అందించడం ● రోగులు, వారి సహాయకుల కోసం అధునాతన క్యాంటిన్ ఏర్పాటు చేయడం మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రాండ్’ పథకానికి ఎంపికై ంది. ఈ పథకంలో భాగంగా ఏరియా ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. సుమారు రూ.10 కోట్ల నిధులతో ఆధునిక యంత్రాలతో పాటు ఆస్పత్రిలోని మౌలిక వసతులు కల్పించనున్నారు. బ్రాండ్ పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. రెండు వందల పడకల ఆస్పత్రిగా మార్పు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ కావడంతో జిల్లా ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులోకి తెవడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రూ.16 కోట్లలో చేపట్టిన నూతన భవన నిర్మాణం పూర్తి కావచ్చింది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో నూతన వంద పడకల భవనాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఏరియా ఆస్పత్రిలో పీజీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బ్రాండ్ పథకంలో కూడా ఏరియా ఆస్పత్రికి చోటు దక్కడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బృందం తనిఖీలు.. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బ్రాండ్ పథకంలో భాగంగా ఇప్పటికే వైద్య, ఇంజనీర్ల బృందం ఏరియా ఆస్పత్రిని సందర్శించినట్లు తెలిసింది. ఆస్పత్రిలోని వార్డులు కాన్పులు జరిగే తీరు, ఆపరేషన్ థియేటర్, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న పనులపై ఆంచనా రూపొందిచుకుని వెళ్లినట్లు సమాచారం. బ్రాండ్ పథకానికి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ఎంపిక కావడం శుభ పరిణామం. ఈ పథకం ద్వారా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలతో పా టు అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా పరికరాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే జిల్లా అస్పత్రిగా అప్గ్రేడ్ కావడం, పీజీ కళాశాల అనుమతి రావడంతో బ్రాండ్ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ఇంజనీర్ల బృందం ఆస్పత్రిని పరిశీలించింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. – డాక్టర్ మాతృనాయక్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఫ ఇప్పటికే జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్.. ఫ పూర్తికావచ్చిన నూతన భవన నిర్మాణం ఫ పీజీ కళాశాల సైతం ఏర్పాటు చేసేందుకు ఆమోదం ఫ బ్రాండ్ పథకంతో కార్పొరేట్ స్థాయిలో సమకూరనున్న వసతులు -
ఏఈఓ, ఇన్చార్జి సీఈఓ సస్పెన్షన్
మిర్యాలగూడ : ధాన్యం సేకరణ నిబంధనలు ఉల్లంఘించిన ఆలగడప క్లస్టర్ వ్యవసయ విస్తరణ అధికారి (ఏఈఓ) కుమారి ఆఫ్రీన్, అవంతీపురం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి, ఆలగడప పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓ కె.సైదులును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కాకుండా నేరుగా మిల్లులకు పంపించినట్లు వచ్చిన కథనాలపై జిల్లా సహకార అధికారి పత్యానాయక్ ఈనెల 9న అవంతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో విచారణ చేపట్టారు. 750 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ట్రక్షీట్తో రైతుల పొలం నుంచే నేరుగా మిర్యాలగూడలోని శ్రీ శివసాయి రైస్ ఇండస్ట్రీస్కు పంపించినట్లు విచారణ తేలింది. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దింపుకున్నట్లుగా అనుమతి షీట్ జారీ చేయడంతో ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయింది. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఏఈఓ, పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నంత వరకు ముందస్తు అనుమతి లేకుండా పనిచేస్తే స్థానం వదిలి వెళ్లవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణనల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 30 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహిరించాలని ఆదేశించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుభాష్ యాదవ్ నల్లగొండ టౌన్: అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అల్లి సుభాష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో అల్లి సుభాష్ యాదవ్, గౌరవాధ్యక్షుడు రావుల భిక్షం యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేష్యాదవ్కు జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు నియామక పత్రం అందజేశారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. మొత్తం 94 ఫిర్యాదులు రాగా.. 31 జిల్లా శాఖలకు సంబంధించినవి, 63 ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపై వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఒకవేళ పరిష్కారానికి అవకాశం లేకపోతే సరైన కారణాలను సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలుపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడొద్దు
నల్లగొండ టౌన్ : విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. సోమవారం నల్ల గొండలోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. నేటి సీనియర్లు ఒకప్పుడు జూని యర్లు అనే విషయం మరచిపోవద్దని హితవు పలికారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం, ర్యాగింగ్కు పాల్పడితే ఒకసారి కేసు నమోదైతే, 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. మానసికంగా, శారీరకంగా అవమానపరచడం, భయపెట్టడం, భయం కలిగేటట్లు చేయడం, అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుంచి తరిమేయాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాదాకృష్ణ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
ట్రక్ షీట్ జారీపై డీసీఓ విచారణ
మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అడ్డదారుల్లో ట్రక్ షీట్ జారీ చేయడంపై జిల్లా కోఆపరేటివ్ అధికారి (డీసీఓ) ఎం.పత్యానాయక్ ఆదివారం విచారణ చేపట్టారు. ఆదివారం ‘సాక్షిశ్రీలో శ్రీబోనస్ కాజేసేందుకు పన్నాగం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన డీసీఓ పత్యానాయక్ అవంతీపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు వివరాలను సేకరించారు. కొనగోలు కేంద్రానికి ధాన్యం రాకుండానే నేరుగా రైతు కల్లం వద్దకు బస్తాలు ఇవ్వడం, పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీ శివసాయి రైస్ ఇండస్ట్రీస్కు తరలించడం, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్ షీట్ జారీ చేయడంపై ప్రశ్నించారు. పీఏసీఎస్ సీఈఓ సైదులును విచారించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 300 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సాగుతున్నాయని, మరో 75 కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు 96వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.158 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఆయన వెంట ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, ఆలగడప పీఏసీఎస్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగ సవరణ చేయాలి
నల్లగొండ : బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని టీఎన్జీవో భవన్లో 40 కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 10 నుంచి జిల్లా వ్యాప్తంగా బీసీలంతా ఉద్యమించాలన్నారు. డిసెంబర్ 1 నుంచి నిర్వహించే పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో అపాయిట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుంటోజు వెంకటాచారి, చిలుకరాజు చెన్నయ్య, వైద్యుల సత్యనారాయణ, పాల్వాయి రవి, ఎరుకల శంకర్గౌడ్, కర్నాటి యాదగిరి, చెన్నూరి భరద్వాజ్యాదవ్, నవీన్ కుమార్, దుడ్డు కష్ణమూర్తి, అంబటి శివకుమార్, ఖదీర్, పందుల సైదులుగౌడ్, గండిచెరువు వెంకన్నగౌడ్, అయితగోని జనార్దన్గౌడ్, పుట్ట వెంకన్నగౌడ్, మార్గం సతీష్కుమార్, శంకర్, దుర్గ, విజయ్చారి, చెన్నోజు రాజు, గిరి, నాగరాజ్గౌడ్, యాదగిరి, అంజయ్య పాల్గొన్నారు. -
సెయింట్ ఆల్ఫోన్సస్లో సాంస్కృతిక సందడి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాలలో మోలిక్యూల్ ఫెస్ట్ సందర్భంగా ఆదివారం విద్యార్థుల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి. మూడు రోజులు గా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు కార్యక్రమానికి హై కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రాజశేఖర్రెడ్డి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. నాటి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ రమేష్, ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ హృదయ్కుమార్రెడ్డి, శాజన్ ఆంథోని, షైని అలెక్స్, విన్సెంట్రెడ్డి, సంతోష్కుమార్, బాల ఇన్నా, సెబాస్టియన్, వినోద్రెడ్డి, శ్యాంపాల్రెడ్డి, సీతారాంగోరే, విజయకుమార్రెడ్డి, బాలశౌరిరెడ్డి పాల్గొన్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
రామగిరి (నల్లగొండ) : పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి పురుషోత్తంరావు అన్నారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన న్యాయసేవా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తామన్నారు. లోక్ అదాలత్ నిర్వహిచడం వివాదాలను పరిష్కరించవచ్చన్నారు. న్యాయ సహాయం అవసరం ఉన్న వాళ్లు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్లో సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంతరెడ్డి, ఎన్.భీమార్జున్రెడ్డి, కట్ట వెంకట్రెడ్డి, ఎం.లెనిన్ బాబు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో విలువలను పరిరక్షించేది సాహిత్యంరామగిరి (నల్లగొండ) : సమాజంలో విలువలను పరిరక్షించేదే సాహిత్యమని సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండలోని టీఎస్యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సాహిత్యం అభ్యుదయ సమాజాన్ని కాంక్షించేలా ఉండాలన్నారు. పాఠశాల స్థాయి పిల్లలనుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు తెలంగాణ సాహిత్య సమావేశంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రంథాలయ ఉద్యమకారుడుగా, పుస్తక ప్రచురణ కర్తగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా వట్టికోట ఆల్వార్ స్వామి కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు మునాస్ వెంకట్, బెల్లి యాదయ్య, తండు కృష్ణకౌండిన్య, కుకుడాల గోవర్ధన్, చొల్లేటి ప్రభాకర్, కృష్ణమాచార్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ జిల్లా కార్యవర్గం ఎన్నికనకిరేకల్ : అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం నకిరేకల్లో జరిగిన జిల్లా మహాసభలో ఎనుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా పొడిచేటి నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.పార్వతి రెండోసారి ఎన్నికయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా ఇంద్రవల్లి సైదమ్మ, దాడి అరుణ, మణెమ్మ, ఎల్.రాజు, సహాయ కార్యదర్శులుగా సముద్రమ్మ, పద్మ, ఫాతిమా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అవుట రవీందర్, ప్రచార కార్యదర్శిగా సుభాషిని, కోశాధికారిగా సునంద, సోషల్ మీడియా కన్వీనర్గా రషీదా, జిల్లా కమిటీ సభ్యులుగా చంద్రమ్మ, ఎల్లమ్మ, లలిత, రాధాబాయి, అప్పనబోయిన మంగమ్మ, కృష్ణవేణి, అండాలు, కల్యాణి, యాద మ్మ, పరిపూర్ణమ్మ, శ్రీదేవిలు ఎన్నికయ్యారు. శ్రీనృసింహుడికి విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేపట్టారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు జరిపించి, అనంతరం గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్యన ఊరేగించారు. పొడిచేటి నాగమణి, జిల్లా అధ్యక్షురాలుపార్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇందిరమ్మ ఇల్లు జీప్లస్ వన్!
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఊరట లభించింది. ఇందిరమ్మ ఇంటిని కనీసం 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించుకోవాలనే నిబంధన ఉండడంతో గ్రామాలతోపాటు పట్టణాల్లోని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సరిపోయేంత స్థలం లేక ఆసక్తిచూపడం లేదు. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని నిబంధన సడలించింది. 400 చదరపు అడుగుల స్థలం ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. ఈ మేరకు ఇటీవల జీఓ 69ని విడుదల చేసింది. 323 చదరపు అడుగులకు తగ్గకుండా.. ప్రభుత్వ నిర్ణయంతో 50 గజాల స్థలం ఉన్న వారు కూడా జీప్లస్వన్ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. ఈ నిర్ణయంతో పేదలకు మేలు చేకూరుతుంది. అయితే ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో కేంద్రం వాటా ఉన్నందున కనీసం 323 చదరపు అడుగుల విస్తీర్ణం తగ్గకుండా నిర్మించుకోవాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకోవచ్చు. జీప్లస్ వన్ విధానంలో పెద్ద గది, కార్పెట్ ఏరియా, వంట గది, మరుగుదొడ్డి, స్నానాల గది నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటిని ఆర్సీసీ స్లాబ్తో మాత్రమే నిర్మించాలి. ఇంటి ప్లాన్ రెడీ చేసుకున్నవారు.. హౌసింగ్ డీఈఈని కలిసి ప్లాన్ చూపించి.. ఆయన అనుమతితో ఇంటి నిర్మా ణం చేపట్టవచ్చు. జీప్లస్ వన్ పద్ధతిలో నిర్మించే ఇంటికి రూ.5 లక్షల సాయాన్ని 4 విడతల్లో అందజేయనున్నారు. దిగువ అంతస్తు పైకప్పు పూర్తయ్యాక రూ.లక్ష, మొదటి అంతస్తులో కాలమ్స్ పూర్తయ్యాక రూ.లక్ష, పైఅంతస్తు పైకప్పు, 2 అంతస్తుల గోడలు పూర్తయ్యాక రూ.2లక్షలు, పూర్తి నిర్మా ణం అయ్యాక మిగతా రూ. లక్ష విడుదల చేయనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల పేదలకు మేలు కలుగుతుంది. 50 గజాల స్థలం ఉన్న వారు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చు. చాలా మంది కొద్ది స్థలం ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంతో మరింత మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. – రాజ్కుమార్, హౌసింగ్ పీడీ, నల్లగొండ ఫ ఇంటి నిర్మాణానికి నిబంధనల సడలింపు ఫ 50 గజాలలోపు స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోవచ్చు ఫ ఇటీవల జీఓ 69 విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వివరాలు ఇలా.. కేటాయించినవి 19,697 మంజూరైనవి 17,246 గ్రౌండింగ్ 13,499బేస్మెంట్ లెవల్ 7,452రూఫ్ లెవల్ 1808స్లాబ్ లెవల్ 624పూర్తయినవి 5వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నవి 9787రూ.లక్ష అందినవి 6,000 రూఫ్లెవల్ బిల్లు వచ్చినవి 2,800 స్లాబ్ లెవల్ బిల్లు వచ్చినవి 1,765 -
ముంచుకొస్తున్న పరీక్షలు.. పూర్తికాని పాఠాలు!
తిప్పర్తి, కనగల్ మండలాల్లోని జూనియర్ కళాశాలల్లో డిప్యూటేషన్ మీద అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక కాలేజీలో మూడు రోజులు, మరో కాలేజీలో మూడు రోజులు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. విద్యా సంస్థల ప్రారంభ దశలోనే పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయిస్తే దానికి తగ్గట్లుగా సిలబస్ పూర్తి చేసేందుకు అధ్యాపకులు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ ముంచుకు వస్తుండడంతో అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఒత్తిడి పెరుగుతుంది. నల్లగొండ టూటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరిలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఓ వారం ముందుకు జరపడంతో విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 140 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా, వాటిలో 12వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కాలేజీల్లో 50 శాతం సిలబస్ పూర్తి కాగా, మరికొన్ని చోట్ల 60 శాతమే పూర్తయినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. కాలేజీలు జూన్లో ప్రారంభమయ్యాయి. ఈ ఐదు నెలల్లో సిలబస్ 60 శాతమే పూర్తి కావడంతో మిగతా 40 శాతం పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇంటర్ సిలబస్ పూర్తయ్యేది ఎలా అనే చర్చ జరుగుతోంది. రెండు నెలల్లో సిలబస్ పూర్తి అసాధ్యం... ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల ప్రకారం చూసుకుంటే నవంబర్ నెలాఖరులోగా సిలబస్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. జవనరిలో ప్రాక్టికల్స్ ఉన్నందున డిసెంబర్లో విద్యార్థుల చేత ప్రాక్టికల్స్ చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో అయితే ప్రాక్టికల్స్ ముందుగానే చేయిస్తున్నా.. నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఐఐటీ, ఎన్ఐటీ విద్యాబోధన మాత్రమే ముందుగా చేస్తారు. ఆయా కాలేజీల్లో ఇప్పటి వరకు విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించలేని తెలుస్తోంది. గురుకుల కాలేజీల్లో ప్రాక్టికల్ చేయడానికి సామగ్రి లేకపోవడంతో విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు తీసుకెళ్లి చేయించాల్సి ఉంది. కానీ ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. పరీక్షలకు ముందు ప్రాక్టికల్స్ మమ అనిపించే అవకాశం ఉందనే చర్చ లేకపోలేదు. 100 మందికిపైగా విద్యార్థులు ఉంటే వారి కాలేజీల్లోనే సెంటర్ పడే అవకాశం ఉండడంతో ఇది వారికి బాగా కలిసి రానుంది. ఫ ఇంటర్మీడియట్ సిలబస్ 60 శాతమే పూర్తి ఫ వచ్చేఏడాది ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు.. జనవరిలో ప్రాక్టికల్స్ ఫ డిసెంబర్లో మిగతా సిలబస్ పూర్తికావడం కష్టమే.. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరిలో ఉన్నందున అన్ని కాలేజీల్లో డిసెంబర్లోగా సిలబస్ పూర్తి అవుతుంది. ప్రతి కాలేజీలో తప్పనిసరిగా సిలబస్ డిసెంబర్లోగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటికే 90 శాతం సిలబస్ పూర్తయినట్లు కాలేజీల యాజమాన్యం చెబుతోంది. – దస్రూనాయక్, ఇంటర్మీడియట్ అధికారి -
వెజిటబుల్.. రేటు డబుల్!
కూరగాయ తుపాన్కు ప్రస్తుతం ముందు దోస 60 80 దొండ 50 80 కాకర 50 80 బీరకాయ 60 80 గోకర 60 120 బెండకాయ 60 80 క్యాప్సికం 80 120 బీన్స్ 60 150 క్యారెట్ 60 100 మునగ 100 150 సొర 40 60 పచ్చిమిర్చి 60 60 టమాట 20 30పది రోజుల క్రితం, ప్రస్తుతం కూరగాయల ధరలు నల్లగొండ టూటౌన్ : కూరగాయల ధరలు మండిపడుతున్నాయి. పది రోజుల క్రితంతో పోల్చుకుంటే రేట్లు రెట్టింపు అయ్యాయి. ఏ కూరగాయ చూసినా కిలో రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. కూరగాయల ధర.. చికెన్ రేటుకు దగ్గరగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం నల్లగొండ పరిసర ప్రాంతాల్లో వరి, పత్తి చేలతోపాటు కూరగాయల సాగుపై కూడా పడింది. తుపాన్ తరువాత కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు కూరగాయల సాగు మొదలు పెట్టినా.. అవి కాతకు రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూరగాలయల ధరలు ఎక్కువగానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. మోంథా తుపాన్ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసే రైతులను నిండి ముంచింది. వర్షానికి ఆకుకూరలు ఎర్రబారి పోవడంతోపాటు చేలు పాయిపోయాయి. నేల మీద కాసే కూరగాయలపై మట్టి పడి పాడయ్యాయి. ఏటా ఈ సీజన్లో కూరగాయలు పుషల్కంగా పండుతాయి. అన్ని కూరగాయల ధరలు ఓ మోస్తారులోనే ఉంటాయి. కానీ తుపాన్ ప్రభా వంతో పంటలు దెబ్బతిని ధరలు కొండెక్కాయి. నల్లగొండ జిల్లా కేంద్రానికి ఎక్కువగా కనగల్, మాడ్గులపల్లి, అనుముల, పెద్దవూర, గుర్రంపోడు, నకిరేకల్, కట్టంగూరు, తిప్పర్తి మండలాలకు చెందిన రైతులు కూరగాయలు పండించి ప్రకాశం బజార్ మార్కెట్కు తీసుకొస్తారు. కొందరు ఇక్కడి వ్యాపారులకు విక్రయిస్తారు. మరికొందరు ఉదయం సమయంలో నేరుగా వినియోగదారులకు విక్రయించి ఉపాధి పొందుతారు. ఇక్కడ రైతులు దోస, దొండ, బెండ, సొర, బీర, కాకర, గోకెర కాయ, పచ్చిమిర్చి పండిస్తారు. క్యాప్సికం, బీన్స్, క్యారెట్, మునగ, ఆలుగడ్డను హైదరాబాద్ నుంచి వ్యాపారులు తెప్పించి విక్రయిస్తారు. కానీ రాష్ట్రమంతా భారీ వర్షాలు కురవడంతో కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం పాడైయిపోయాయి. దాంతో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. పంటలు తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. తాము హోల్సేల్లో రిటైల్గా అమ్మే ధరలో రూ.10 తగ్గించి అమ్ముతున్నామని పేర్కొంటున్నారు.కొండెక్కిన కూరగాయల ధరలు ఫ మోంథా తుపాన్తో దెబ్బతిన్న పంటలు ఫ మార్కెట్కు తగ్గిన కూరగాయల రాక ఫ ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు -
భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలి
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే నిజాభిషేకంలో పాల్గొనే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకునేలా చూడాలని ఆలయ అధికారులను ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. శనివారం ఆయన కొండ పైన పరిసరాలు, క్యూలైన్లు, కొండ కింద వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని ఈఓ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యనారాయణస్వామి వ్రత మండపంలో భక్తులకు ఇచ్చే పూజ సామగ్రి నాణ్యతను పరిశీలించినట్లు తెలిపారు. శని, ఆదివారాల్లో వ్రతాలు చేసుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సంబంధింత అధికారులను ఈఓ ఆదేశించారు. లక్ష్మీ పుష్కరిణిలోని నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టరింగ్ చేయాలని సంబంధింత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రాత్రి సమయంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అదనంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణులకు ఎలాంటి డబ్బులు చెల్లించొద్దనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావ్ -
అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిన లారీ
హుజూర్నగర్: లారీ అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై హుజూర్నగర్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి మిర్యాలగూడ వెపు వెళ్తున్న లారీ హుజూర్నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద మలుపు తప్పే క్రమంలో అదుపుతప్పి రోడ్డు వెంట విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. లారీ ముందు టైర్లు డ్రెయినేజీ కాలువలో ఇరుక్కుపోవడంతో అక్కడే ఆగిపోయింది. అర్ధరాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. విద్యుత్ స్తంభంత విరిగిపోవడంతో ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మోహన్బాబు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ ఏఈ రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తరుచూ ప్రమాదాలు..హుజూర్నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో మూలమలుపు ఎక్కువగా ఉండటంతో తరచూ ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడ ప్రత్యేకంగా సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ఫ అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు ఫ అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు ఫ పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్ ఫ ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలిని ఆకట్టుకున్న దుబీయన్ ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు రఘునాథపురంలో నిలువ ఉన్న కడలుంగీలు -
బోనస్ కాజేసేందుకు పన్నాగం
మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయిస్తే ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించగా దాన్ని కాజేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కారు. తమ పొలాల్లో పండిన సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించకుండా అనధికారికంగా ట్రక్ షీట్ రాయించుకుని నేరుగా మిల్లుకు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ, త్రిపురారం మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ పొలంలో పండిన 741బస్తాలు(296 క్వింటాళ్ల) ధాన్యాన్ని మిర్యాలగూడలోని అవంతీపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు ట్రక్షీట్ రాయించుకుని మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. కాగా ఆ కొనుగోలు కేంద్రంతోపాటు ఇతర ఏ కొనుగోలు కేంద్రాల్లోనూ ఇప్పటివరకు సన్నరకం ధాన్యాన్ని గింజ కూడా కొనుగోలు చేయలేదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అవంతీపురం కొనుగోలు కేంద్రంలో 296 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించి మిల్లుకు తరలించడంతో బోనస్ను కాజేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఫ సన్నధాన్యం నేరుగా మిల్లుకు తరలింపు.. కొనుగోలు కేంద్రం నుంచి ట్రక్షీట్ ఫ అవంతీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన -
కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య
కొండమల్లేపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని పశువుల సంతలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ(55) భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతిచెందింది. నరసింహ హైదరాబాద్లో తన కుమారుడు జెట్టమోని ఆంజనేయులు, కోడలు మాధవి వద్ద ఉంటూ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కుమారుడు, కోడలు తరచూ గొడవ పడుతుండడంతో మనస్తాపానికి గురైన నరసింహ శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి కొండమల్లేపల్లికి వచ్చాడు. అర్ధరాత్రి స్థానిక పశువుల సంతలోని రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి జేబులో నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ ద్వారా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మూసీ నదిలో బాలిక గల్లంతునేరేడుచర్ల: మూసీ నదిలో ఈతకు వెళ్లి బాలిక గల్లంతైంది. ఈ ఘటన శనివారం నేరేడుచర్ల మ ండలం బురుగులతండా వద్ద జరిగింది. స్థానిక ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం సోమావరం గ్రామానికి చెందిన కోమరాజు సుష్మిత (13)తో పాటు దీక్షిత, అశ్విని కలిసి బురుగులతండా వద్ద గల సోమప్ప ఆలయం వెనుక భాగంలో మూసీ నదికి ఈత కొట్టేందుకు వెళ్లారు. సుష్మిత ఈత కొడుతూ నదిలో గల్లతైంది. ఆమె వెంట బాలికలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శనివారం రాత్రి వరకు కూడా సుష్మిత ఆచూకీ లభించలేదు. -
పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు. -
షార్ట్ సర్క్యూట్ తో ఆర్ఎంపీ క్లినిక్ దగ్ధం
నార్కట్పల్లి: షార్ట్ సర్క్యూట్తో ఆర్ఎంపీ క్లినిక్ దగ్ధమైంది. ఈ ఘటన నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తాడోజు శంకరాచారి అదే గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. శనివారం అతడు క్లినిక్లో లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి కంప్యూటర్, ఫ్రిజ్, మందులు కాలిపోయాయి. సుమారు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు శంకరాచారి తెలిపారు. పశు ఔషధ బ్యాంకుకు ‘నియోస్పార్క్’ సహకారంకోదాడరూరల్: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకుకు సహకారం అందించేందుకు పశు ఔషధ కంపెనీ నిమోస్పార్క్ ముందుకొచ్చింది. శనివారం స్థానిక పశు వైద్యశాలలో ఆ కంపెనీ తెలంగాణ రీజనల్ మేనేజర్ చల్లా వెంకటేశ్వర్లు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్తో కంపెనీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. తక్కువ ధరలకే మందులు అందజేసేందుకు పశు ఔషధ బ్యాంకు ఏర్పాటు చేసిన పెంటయ్యతో పాటు పశుపోషకులకు అండగా ఉంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ తయారీ ధర కంటే తక్కువకే ఐరన్, మల్టీవిటమిన్ ఫెర్ాట్సన్ టానిక్ను అందజేసేందుకు ముందుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సిరిపురపు సురేంద్ర, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. -
తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్గా వినియోగిస్తుంటారు. -
ఆయన ఇంట్లో రెండు వేల పుస్తకాలు
మోత్కూరు: పుస్తకాలపై ఆయనకు ఉన్న మక్కువతో ఏడు పదుల వయస్సులోనూ పుస్తక పఠనం కొనసాగిస్తున్నారు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన చెరుకు అగ్గిరాములు. మోత్కూరులో 6వ తరగతి వరకు చదువుకున్న అగ్గిరాములు పేదరికం కారణంగా అక్కడితో చదువు మానేశారు. హైదరాబాద్కు వెళ్లి హోటల్లో కొన్నేళ్లు పనిచేసి, 1973లో బతుకుదెరువు కోసం చైన్నెకి వెళ్లారు. అక్కడ రిక్షా తొక్కుతూ జీవనం సాగించారు. ఆ సమయంలో చైన్నెలో రామస్వామి పెరియార్, అన్నాదొరై, ఎంజీఆర్ వంటి నాయకుల సభలకు వెళ్లి వారి ప్రసంగాలు విని కమ్యూనిజంపై అభిమానం పెంచుకుని తదనంతరం మోత్కూరుకు వచ్చి సీపీఐలో చేరారు. ఆ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖ ఆంధ్ర పత్రికను పోస్టులో తెప్పించుకొని ఆయన చదివేవారు.. యక్షగానాలు, కీర్తన పుస్తకాలు, కమ్యూనిస్టు ఉద్యమ పుస్తకాలు, ఉద్యమ నాయకుల జీవిత చరిత్రల పుస్తకాలు కొని చదివారు. కమ్యూనిస్టు సభలు, సమావేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏర్పాటు చేసే పుస్తక ప్రదర్శనలో పలు రకాల పుస్తకాలను కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సుమారు రెండు వేల పుస్తకాలు సేకరించారు. పుస్తకాలకు బైండింగ్ చేయడంతో పాటు కొన్ని ఆర్టికల్స్కు నామినేషన్లు కూడా చేయించారు. ఆయన సేకరించిన పుస్తకాలను ఇంట్లోని బీరువా, పెట్టెల్లో భద్రపరిచేవారు. హైదరాబాద్, చైన్నె పట్టణాలకు బతుకుదెరువు కోసం వెళ్లినప్పుడు వివిధ దేశాలకు చెందిన నాణేలు, వివిధ కంపెనీలకు చెందిన పెన్నులు, అగ్గిపెట్టెలు సేకరించారు.గ్రంథాలయానికి అప్పగిస్తా నా వద్ద ఉన్న సుమారు రెండు వేల పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి అప్పగిస్తా. అదేవిధంగా ఎవరైనా అధి కారులు అడిగితే వివిధ దేశాలకు చెందిన నాణాలను కూడా ఇచ్చేస్తా. కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి నాయకులు నాకు ఆదర్శం. వారి జీవిత చరిత్ర పుస్తకాలు చదివాను. – చెరుకు అగ్గిరాములు, కొండగడప పుస్తక పఠనంపై మక్కువతో సేకరించిన అగ్గిరాములు వివిధ దేశాల నాణేలు, పెన్నులు, అగ్గిపెట్టెలు సైతం.. -
మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: మత్తు ట్యాబెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని శనివారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ స్నేహితులు. వీరు కొంతకాలంగా ఏపీలోని పల్నాడు జిల్లా కారెంపూడిలోని వీరభద్ర మెడికల్ షాపులో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మోప్రోగ్జావిన్ అనే మత్తు ట్యాబ్లెట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిర్యాలగూడకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో కొద్దిరోజులుగా వారిద్దరిపై నిఘా పెట్టారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ వద్ద వన్టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నవీన్, మహేష్ ఒక కవర్లో మత్తు ట్యాబ్లెట్లు తీసుకుని వెళ్తూ పట్టుబడ్డారు. వారిద్దరితో పాటు కారెంపూడిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న శెట్టి హనుమంతరావు, శెట్టి జయరామచంద్ర ప్రసాద్పై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నవీన్, మహేష్, శెట్టి హనుమంతరావును అరెస్ట్ రిమాండ్కు తరలించామని, మరో నిందుతుడు శెట్టి జయరామచంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ వన్టౌన్ సీఐ నాగభూషణ్రావు, ఎస్ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు రాజామ్, వీరబాబు, నరసింహ, ప్రసాద్, శ్రీను, ఉన్నారు. -
నేడు లీగల్ సర్వీస్ డే
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం లీగల్ సర్వీస్ డే నిర్వహించనున్నట్లు సెక్రటరీ పి.పురుషోత్తంరావు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టులోని న్యాయ సేవా సదన్లో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక లోపంతో ఆగిన చార్జింగ్ బస్నార్కట్పల్లి : నల్లగొండ డిపోనకు చెందిన చార్జింగ్ బస్ శనివారం ఉదయం నల్లగొండ నుంచి భువనగిరికి వెళ్తున్న సమయంలో నార్కట్పల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి నల్లగొండకు వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నార్కట్పల్లి చెందిన వాకర్స్, ప్రయాణికులు ఆగిన బస్ను నెట్టడంతో బస్ట్ స్టార్ట్ అయి యథావిధిగా వెళ్లిపోయింది. యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. వేకువజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. గర్భాలయంలో కొలువైన స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నిత్యతిరుకల్యాణ వేడుక ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన భువనగిరి : పట్టణ పరిధిలోని రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం సాంస్కృతిక శాఖ నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్కు చెందిన వీణఅయ్యర్ బృందం కళాకారిణుల కూచిపూడి నృత్యం కనువిందు చేసింది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో శిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడంతో పాటు చెరువులో బోటింగ్ చేసి ఉల్లాసంగా గడిపారు. నిండుకుండలా పులిచింతలమేళ్లచెరువు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండుకుండలా దర్శనమిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45 టీఎంసీలు కాగా శనివారం 44.897 టీఎంసీలుగా ఉంది. ఇన్ప్లో 34,274 క్యూసెక్యులు ఉండగా ప్రాజెక్టు నుంచి 58,736 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. టీఎస్జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్లాంట్ వద్ద 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు తెలిపారు. -
నల్లబెల్లం, పటిక పట్టివేత
సూర్యాపేట: నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం శనివారం చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద పట్టుకుంది. వారి నుంచి నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు ప్రాంతం నుంచి మోతె మండలానికి నల్లబెల్లం, పటిక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సహాయ కమిషనర్ సంతోష్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో చివ్వెంల మండలం దురాజ్పల్లి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు టాటా ఇంట్రా మినీ ట్రక్లో 17 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కేజీల పట్టిక తీసుకొస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన విచారించగా.. కూడలి, గోపతండాలకు చెందిన మరో నలుగురి పేర్లు చెప్పారని, వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి. వెంకటేశ్వర్లు, ఎస్ఐ పి. గోపాలరావు, హెడ్ కానిస్టేబుల్ అఫ్సర్ అలీ, కానిస్టేబుల్స్ బ్రహ్మం, రమేష్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
ముగిసిన గురుకుల జోనల్ స్థాయి క్రీడాపోటీలు
రాజాపేట : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న 11వ జోనల్ స్థాయి బాలుర క్రీడా పోటీలు శనివారం ముగిసాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడాపోటీల్లో ఐదవ జోన్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 13 గురుకులాలకు చెందిన 1105 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యక్షతన ముగింపు సమావేశం నిర్వహించగా స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ ముఖ్య అథిదిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, క్రీడల సమన్వయకర్త శ్రీనివాస్, పీడీలు కిషన్, వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ వేణు, ఉపాధ్యాయులు రాజు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్ 14, 19 విభాగాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ స్టేషన్ఘన్పూర్ గురుల విద్యార్థులు నిలిచారు. అండర్ 19 విభాగాల్లో మిర్యాలగూడ గురుకుల విద్యార్థులు, అథ్లెటిక్స్ అండర్ 14లో చండూరు, అండర్ 17, 19 విభాగాల్లో స్టేషన్ ఘన్పూర్ గురుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. కబడ్డీ అండర్ 14లో అనుముల విద్యార్థులు ప్రథమ స్థానం, అండర్ 17, 19 విభాగాల్లో రాజాపేట ప్రథమ స్థానం సాధించింది. ఖోఖో అండర్ 14లో ఘన్పూర్, అండర్ 17, 19లో మిర్యాలగూడ, వాలీబాల్ అండర్ 17లో మునగాల, అండర్ 19లో భువనగిరి, బాల్బాడ్మింటన్ అండర్ 17లో చండూరు, అండర్ 19లో మిర్యాలగూడ, హ్యాండ్బాల్ అండర్ 17లో రాజాపేట, అండర్ 19లో జనగాం. ఫుట్బాల్ అండర్ 17లో చండూరు, అండర్ 19లో జనగాం, టెన్నికై ట్ అండర్ 14, 17, 19లో ఘన్పూర్, చెస్ సింగిల్ అండర్ 14లో హుజూర్నగర్, అండర్ 17లో మునగాల, అండర్ 19లో ఘన్పూర్, చెస్ డబుల్ అండర్ 14లో మోత్కూర్, అండర్ 17, 19లో హుజూర్నగర్ గురుకులాలు ప్రథమ స్థానం సాధించాయి. -
ఓటమి.. గెలుపునకు నాంది
హాలియా : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రతి ఓటమి గెలుపునకు నాంది అవుతుందని మహాత్మా జ్యోతిరావుపూలే (ఎంజేపీ) గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ (ఆర్సీఓ) స్వప్న తెలిపారు. నాగార్జునసాగర్ గురుకులంలో మూడు రోజులుగా సాగుతున్న జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గురుకులాల్లో విద్యతో పాటు ఆటలు, ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ తరి రాములు, సాగర్ గురుకులం ప్రిన్సిపాల్ రవికుమార్ పాల్గొన్నారు. విజేతలు వీరే.. జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో అనంతారం గురుకులం ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. వాలీబాల్, చెస్, 1500 మీటర్ల పరుగు పందెం, షాట్ఫుట్, డిస్కస్త్రో, 800 మీటర్ల పరుగు పందెం, 400 మీటర్ల పరుగుపందెంలో అనంతారం విద్యార్థులు విజయం సాధించారు. కబడ్డీలో అనంతారం ప్రథమ బహుమతి, నేరేడుచర్ల ద్వితీయ బహుమతి సాధించాయి. ఖోఖోలో కోల్ముంతలపహాడ్ మొదటిస్థానంలో నిలవగా, నాగార్జునసాగర్ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎంజేపీ గురుకులాల ఆర్సీఓ స్వప్న ముగిసిన జిల్లాస్థాయి క్రీడాపోటీలు -
మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతి
భూదాన్పోచంపల్లి: మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతిచెందిన విషాద ఘటన భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జలాల్పురం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్గౌడ్(68)కు భార్య మణెమ్మ, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ వివాహాలు చేశాడు. ప్రభాకర్గౌడ్ అక్టోబర్ 30న తన భార్య మణెమ్మతో కలిసి స్కూటీపై పోచంపల్లికి వచ్చి తిరిగి జలాల్పురం వెళ్తుండగా.. గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన కోతిని తప్పించబోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ప్రభాకర్గౌడ్ తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. అతడి భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభాకర్గౌడ్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రభాకర్గౌడ్ చిన్న కుమారుడు మహేందర్(38) కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు మహేందర్కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్గౌడ్ కూడా శనివారం తెల్ల వారుజామున మృతిచెందాడు. మూడు రోజుల్లోనే కుమారుడు, తండ్రి మృతిచెందడంతో జలాల్పురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి
నకిరేకల్ : భారత విప్లవోద్యమానికి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చుక్కాని అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్కుమార్ అన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాట నిర్మాత, భారత విప్లవోద్యమ అగ్రనేత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను నకిరేకల్లో యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం తపించిన విప్లవ సిద్ధాంత కర్త చండ్ర పుల్లారెడ్డి అని గుర్తు చేశారు. 14 రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర కీలకమన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బీవీ చారి, జిల్లా నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, బోమ్మడి నగేష్, కనుకుంట్ల సైదులు, గజ్జి రవి, గద్దపాటి శంకర్, మామిడి ఎల్లయ్య, అంబటి నర్సయ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, జానయ్య, వేముల శంకర్, రావుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
మర్రిగూడ : గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు అందిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. జ్వర పీడితులకు తప్పకుండా స్క్రీనింగ్ చేయాలన్నారు. అనంతరం కమ్యూనిటి హెల్త్ సెంటర్ ఆవరణలో వైద్య సిబ్బందితో కలిసి వందేమాతరం ఆలపించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కల్యాణ్ చక్రవర్తి, సూపరింటెండెంట్ శంకర్నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాలిని, వైద్యులు దీపక్, రుబీనా, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పలువురు జడ్జిల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు శుక్రవారం బదిలీ అయ్యారు. నల్లగొండ జిల్లా కోర్టు మూడవ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ నిజామాబాద్కు, మిర్యాలగూడ కోర్టు ఐదవ అదనపు జడ్జి జి.వేణు సికింద్రాబాద్కు, సీనియర్ సివిల్ జడ్జి బి.సుజయ్ హైదరాబాద్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న కెవి.చంద్రశేఖరరావు మిర్యాలగూడ కోర్టుకు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం.రాధాకృష్ణచౌహన్ సూర్యాపేట కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు. కొండమల్లేపల్లి పోలీస్స్టేషన్ తనిఖీకొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పోలీస్స్టేషన్ను ఎస్పీ శరత్చంద్ర పవార్ శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్లో రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్తో పాటు స్టేషన్ పరిసరాలను, సిబ్బంది కిట్లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఆయన వెంట ఏఎస్పీ మౌనిక, సీఐ నవీన్కుమార్, ఎస్ఐ రమేష్ తదితరులున్నారు. కొబ్బరికాయల వేలం వాయిదా నార్కట్పల్లి : మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే కొబ్బరికాయ టెండర్ వేలం ఈ సంవత్సరం నాలుగోసారి వాయిదా పడింది. 2025 –2026 సంవత్సరానికి గాను టెండర్ను ప్రభుత్వం రూ.53 లక్షల 26 వేలుగా నిర్ణయించింది. డీపీఓ వెంకటయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నాలుగోసారి వేలంపాట నిర్వహించారు. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిక్కుల శివ రూ.33 లక్షల 50 వేలకు పాట పాడాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రాక పోవడంతో మళ్లీ వాయిదా వేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీఓ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, మాజీ సర్పంచ్ సాగర్ల సైదులు, మాజీ ఉపసర్పంచ్ వడ్డె భూపాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ అనిత, వెంకన్న పాల్గొన్నారు. ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని వినతి ఎల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టుకు వెళ్లే ఆర్చికి ఇరువైపులా కొబ్బరికాయలు విక్రయించేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అధికారులకు విన్నవించారు. ప్రత్యేక స్థలం కేటాయించకుండా టెండర్ అధికంగా పెడుతున్నారని పేర్కొన్నారు. సాగర్ రెండు గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శుక్రవారం ఎగువనుంచి వరద పెరగడంతో.. రెండు రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా కృష్ణానదిలోకి నీటిని వదులుతున్నారు. సాగర్ జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 590 (312.0450టీఎంసీలు) అడుగులుగా ఉంది. ఎగువనుంచి 67,471 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా రెండు క్రస్ట్గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 34,104 క్యూసెక్కులు, మొత్తం 50,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శుక్రవారం మూసీకి 4,132 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లను పైకెత్తి 3,917 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 (4.46 టీఎంసీలు) అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 644 (4.18 టీఎంసీలు) అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడువల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. -
ర్యాగింగ్కు పాల్పడితే సహించం
నల్లగొండ టౌన్ : విద్యా సంస్థలో ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలంపై శుక్రవారం ఆమె.. స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయన్ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, హెచ్ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమను ఎవరూ ర్యాగింగ్ చేయలేదని జూనియర్ విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగ కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎంబీబీఎస్ చదవి ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిన విషయం దృష్టిలో ఉంచుకుని మంచిగా మసలుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన నల్లగొండ : నల్లగొండలోని ఎస్ఎల్బీసీ కాలనీలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. పనులను ప్రతినెలా పర్యవేక్షించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఇంజనీరు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
నల్లగొండ టౌన్ : బీసీలకు.. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండలోని గడియారం సెంటర్లో శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఈనెలాఖరున జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గండిచెరువు వెంకన్నగౌడ్, జనార్దన్గౌడ్, ఎంఏ.ఖదీర్, పుట్ట వెంకన్నగౌడ్, కర్నాటి యాదగిరి, చిలుకరాజు సతీష్, మార్గం సతీష్ కుమార్, కొంపల్లి రామన్నగౌడ్, చెన్నోజు రాజు, చెన్నోజు భరద్వాజ, కల్లూరి సత్యనారాయణగౌడ్, నీలం వెంకటమధు, అనంత నాగరాజుగౌడ్, గడగోజు విజయ్, తలారి రాంబాబు, ఆమంచి స్వామి, అంబటి శివ, పుల్లెందుల అంజయ్య, గడ్డం మారయ్య తదితరులు పాల్గొన్నారు. -
డీసీఎంఎస్ ఎత్తివేత!
ఎన్డీసీఎంఎస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరిన విధంగా ఆస్తులు, ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. – నాగిళ్ల మురళి, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) దివాళా తీసింది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న డీసీఎంఎస్ నిర్వహణ కష్టంగా మారడంతో.. దాన్ని వేరే కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచన చేస్తోంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు ధాన్యం కొనుగోళ్లు తదితర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1987లో డీఎసీఎంఎస్ను ఏర్పాటు చేసింది. కానీ దీనికి.. సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అభివృద్ధి చెందలేదు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టినా ఎక్కడా విజయవంతం కాలేదు. ఉద్యోగుల కొరత, పాలకవర్గాలు అనాసక్తితో వీటి నిర్వహణ భారంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడంతో.. వీటిని రద్దు చేసేందుకుగాను ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. నిలిచిన ఎరువుల అమ్మకాలు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో గతంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు అమ్మాకాలు సాగేవి. వాటి ద్వారా వచ్చే కమీషన్తో లాభాలు వచ్చేవి. కానీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం యూరియా, ఎరువుల అమ్మకానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ భారం డీసీఎంఎస్ మీదే వేసింది. ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన పెట్టింది. కానీ, పీఏసీఎస్లకు మాత్రం ట్రాన్స్పోర్ట్ భారం ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు నిలిచిపోయాయి. రెండేళ్లుగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకపోడంతో డీసీఎంఎస్ దివాళా తీసింది. ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు.. డీసీఎంఎస్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 3 ఎకరాల భూమి, యాదాద్రి జిల్లా భువనగిరిలో దుకాణాల సముదాయం ఉంది. ఈ ఆస్తుల విక్రయం గతంలో వివాదాస్పదంగా మారి కోర్టుల వరకు వెళ్లింది. నల్లగొండలోని గడియారం సెంటర్ సమీపంలో లతీఫ్ సాబ్ గుట్ట మెట్ల వద్ద విలువైన ఆస్తులతో పాటు నిడమనూరులో 3 ఎకరాలు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో గోదాములు ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్కు సంబంధించిన సమాచారాన్ని ఆ సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఆస్తుల వివరాలు, పని చేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, జీత భత్యాలు తదితర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఫ నిర్వహణ కష్టంగా మారడంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఫ కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం -
పామాయిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా
గరిడేపల్లి: పామాయిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడేనికి చెందిన షేక్ అస్గర్(40) హాలియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని అంపాపురం పామాయిల్ ఫ్యాక్టరీకి డీసీఎంలో పామాయిల్ పంట లోడ్ను తరలిస్తున్నాడు. అప్పన్నపేట గ్రామ శివారులో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలుమోటకొండూర్ : సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని తేర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. తేర్యాల గ్రామానికి చెందిన నల్ల శంకరయ్య వ్యవసాయ బావి వద్దకు సైకిల్ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇసుక లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్ను తప్పించి వెనకాల వస్తున్న సైకిల్ను ఢీ కొట్టింది. దీంతో శంకరయ్యకు కాలికి బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని ట్రాక్టర్ డ్రైవర్ పంజాల సాయి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితుల అరెస్ట్చండూరు: ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చండూరు మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్హాల్ పక్కన కారుంగు క్రాంతికుమార్, మహమ్మద్ సాజిద్బాబా, మహమ్మద్ నాసర్పాషా అనే ముగ్గురు వ్యక్తులు ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో మద్యం బాటిళ్లతో ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సూచించగా సదరు వ్యక్తులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ విషయమై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ కారింగు వెంకన్నగౌడ్ శుక్రవారం తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సూర్యాపేట : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పెన్పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ శుక్రవారం తెలిపారు. పెన్పహాడ్ మండలంలోని దోసపహాడ్ మూసీ నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దోసపహాడ్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు చౌటుప్పల్ : అక్రమంగా ఇసుకను నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్రోడ్డులో ఇసుకను కుప్పలుగా పోసి అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బలికె సత్యనారాయణ అనే వ్యక్తి నిల్వ చేసిన 15 టన్నుల ఇసుకను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుకను సీజ్ చేసి సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
ఉపాధికి ప్రణాళికలు
నల్లగొండ : ఉపాధి హామీ పథకంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే సంవత్సరంలో ఉపాధి హామీ కింద చేపట్టనున్న పనులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించి గ్రామసభల తీర్మానం మేరకు పనులను ఖరారు చేస్తారు. దానికి అనుగునంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ నెలాఖరులోగా పనుల గుర్తింపు.. ఉపాధి హామీలో వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రక్రియ అక్టోబర్ 2న ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామసభల్లో తీర్మానం చేసి గుర్తించిన పనుల జాబితాను బ్లాక్ పంచాయతీకి పంపిస్తారు. అక్కడ వాటన్నింటిని పరిశీలించి డిసెంబరు 20వ తేదీలోగా ప్రాజెక్టు కోఆర్డినేటర్, కలెక్టర్లకు పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా మంత్రికి, తిరిగి కలెక్టర్ ద్వారా 2026 జనవరి 21లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఆ శాఖ అధికారులు వాటిపై చర్చించి కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆమోదంతో మార్చి చివరి నుంచే కొత్త పనులను చేపట్టేందుకు అనుమతులు వస్తాయి. గత సంవత్సరం పని దినాలు కదింపు జిల్లాలో మొత్తం 3.5 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వాటి పరిధిలో 7.46 లక్షల మంది మంది ఉపాధి పనులు చేస్తున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పని దినాలను కుదించింది. జిల్లాలో 82 లక్షల పని దినాలను చేపట్టాలని నిర్ణయించగా కేవలం 38 లక్షల పని దినాలు చేపట్టారు. రూ.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేంద్రం నుంచి రూ.6 కోట్లే విడుదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు వలస వెళ్లకుండా గ్రామంలోనే పని కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తోంది. గత సంవత్సరం సగానికి ఎక్కువగానే పని దినాలను కుదించింది. ఈసారి కూలీలకు 82 లక్షల పని దినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించి గ్రామసభలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈసారైన కూలీలకు పూర్తిస్థాయిలో పని కల్పిస్తుందో లేదో.. వేచి చూడాల్సిందే.ఫ 2026–27లో చేపట్టాల్సిన పనులు ఖరారు ఫ 30వ తేదీలోగా గ్రామసభల్లో తీర్మానాలు ఫ 82 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం -
వందేమాతరం ఆలాపన
నల్లగొండ : ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు వందేమాతర జాతీయ గేయం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో సిబ్బంది, వివిధ శాఖల అధికారులతో కలిసి వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా సామూహిక వందేమాతర గేయాలాపన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అతివకు అక్షరాలు
ఉల్లాస్ పథకం త్వరలో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామస్థాయిలో వీఓఏలు నిరక్షరాస్యులను గుర్తించి వివరాలను ఉల్లాస్ యాప్లో నమోదు చేశారు. ఎంపిక చేసిన వలంటీర్లు.. నిరక్షరాస్యులకు చదువు నేర్పించే బాధ్యత వహిస్తారు. స్థానిక ఉపాధ్యాయులు కూడా పాఠాలు చెప్పేందుకు సహకరిస్తారు. – ఎం.శ్రీనాథ్, ఉల్లాస్ పథకం జిల్లా కోఆర్డినేటర్ రామగిరి(నల్లగొండ) : మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని తీసుకొచ్చింది. 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించింది. రాష్ట్రంలో 2025–26 నుంచి ఈ పథకాన్ని ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో 15 సంవత్సరాల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి ప్రత్యేక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్షరాస్యత పెంపుతో పాటు జీవన నైపుణ్యాలు, మహిళల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు, వయోజన విద్య, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను భాగస్వాములుగా చేర్చారు. 61,179 మంది నిరక్షరాస్య మహిళల గుర్తింపు జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయ సంఘాల్లో 61,179 మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించారు. సంఘాల్లో చదువు వచ్చిన మహిళను వలంటీర్గా ఎంపిక చేశారు. 10 మంది మహిళలు ఒక వలంటీర్ను కేటాయిస్తారు. ఇప్పటికే 6,118 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వలంటీర్లకు మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 10వ తేదీ వరకు ఈ శిక్షణ పూర్తి కానుంది. బోధన కోసం 16 అంశాలతో కూడిన అక్షర వికాసం అనే పుస్తకాన్ని రూపొందించారు. శిక్షణ పొందిన వలంటీర్ రోజూ రెండు గంటల బోధన చేయాలి. చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రం నేర్పించడం, ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. డిజిటల్ నైపుణ్యాలు కూడా నేర్పిస్తారు. గామంలో సామాజిక చైతన్య కేంద్రంలో వీరికి బోధన చేస్తారు. ఈ పుస్తకాన్ని 200 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఫ మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ‘ఉల్లాస్’ అమలు ఫ జిల్లాలో 61 వేల నిరాక్షురాస్య మహిళల గుర్తింపు ఫ వలంటీర్ల ద్వారా విద్యా బోధన -
పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, కార్తీక దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం, రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మదన వేణుగోపాల స్వామికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం, పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్లో మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో మానవ, జంతు ఆరోగ్యం, పర్యావరణ పరస్పర అనుసంధానంపై ఎంబీబీఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనోటిక్ వ్యాధులను నివారించడానికి ఆహారభద్రతను నిర్ధారించడం, వ్యాధుల విచ్ఛిన్నం చేయడంపై వివరించారు. అనంతరం ఆరోగ్య విధానాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదే విధంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రేడియేషన్, అంకాలజీ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. క్యాన్సర్ నివారణకు వైద్యులు, నర్సులు కృషి చేయాలని డైరెక్టర్ అమితా అగర్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్నారంగ్, ప్రొఫెసర్ శ్యామల, వైద్యులు లక్ష్మీజ్యోతి, రుద్రేష్కుమార్, చావాన్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
మిర్యాలగూడ టౌన్ : ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ఈ సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో అవంతీపురం వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన పొరెడ్డి అప్పిరెడ్డి ట్రాక్టర్లో ధాన్యాన్ని మిర్యాలగూడకు తీసుకువస్తున్నాడు. ఈక్రమంలో మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుటకు రాగానే మిర్యాలగూడ నుంచి మార్కెట్ యార్డు వైపు వెళ్తున్న ధాన్యం లారీ ట్రాక్టర్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతినగా రోడ్డుపై ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కాగా.. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫ ట్రాక్టర్ పల్టీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిన ధాన్యం -
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పర్వాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
పశుసంపదను కాపాడేందుకే టీకాలు
భూదాన్పోచంపల్లి: పశుసంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరులో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, పశుసంవర్థకశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువుల్లో నోరు, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే ఇతర పశువులకు వ్యాపిస్తుందన్నారు. వ్యాధి నివారణకే టీకాలు వేస్తున్నామని, రైతులు అపోహపడవద్దని సూచించారు. పశుసంపదను పెంచాలని, పశుసంవర్థకశాఖలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వెటర్నరీ అధికారులపై ఉందన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు మరింత చేరువ కావాలని సూచించారు. పశువులకు ఉచిత టీకాలు, ఫీడు అందజేయడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శిబిరంలో 700 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, 150 పశువులకు వైద్య చికిత్స, 800 మూగజీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఉచిత కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఉదయ్కుమార్, అసోసియేట్ డాక్టర్లు డి.మాధురి, కల్యాణి, విశ్వేశ్వర్, కవిత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, పశువైద్యులు కిషోర్, రాంచంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి, పృథ్వి, శ్రీకాంత్, అశోక్బాబు, శ్రీనివాస్, రఘు, ఏఓ శైలజ, జమీల్, గోపాలమిత్రలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘స్నాన సంకల్పానికి మంగళం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఈఓ విష్ణు పుష్కరిణిని పరిశీలించారు. పుష్కరిణిలో స్నాన సంకల్పంకు సంబంధించిన ఏర్పాట్లు చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణి ప్రదేశం వద్ద భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలో పాల్గొన్నారు. అంతరాయం లేకుండా ప్రసాదం అందించాలి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు నిరంతరం పులిహోర ప్రసాదం ఉచిత పంపిణీ అంతరాయం లేకుండా చూడాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. యాదగిరీశుడి ఆలయ సన్నిధిలోని ఉచిత ప్రసాద వితరణ, పుష్కరిణి, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూలైన్ మూమెంట్కు భక్తులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు, ఎస్పీఎఫ్ భద్రత సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుందని, సోమవారాలు, మాస శివరాత్రి, ఏకాదశి రోజులలో శివాలయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం తయారీ, కౌంటర్స్ పరిశీలించి భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం తయారు చేయాలన్నారు. కొండపైన దుకాణాలలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేకుంటే టెండర్లు రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఈఈ జె.దయాకర్రెడ్డి, ఇన్చార్జ్ డీఈఓ కృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి నవీన్కుమార్, మహేష్, శంకర్ నాయక్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. ఫ ‘సాక్షి’ కథనంతో విష్ణు పుష్కరిణిని పరిశీలించిన ఈఓ వెంకట్రావ్ -
ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: ఫైనాన్స్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చెందిన చీకూరి కృష్ణంరాజు(49) కొంతకాలంగా హైదరాబాద్లోని వనస్థలిపురంలో గల హుడా సాయినగర్ కాలనీలో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం దామెర గ్రామంలో తన వ్యవసాయ పొలానికి వచ్చాడు. అక్కడే ఉన్న పనిమనిషితో గడ్డిమందు తెప్పించుకున్నాడు. కృష్ణంరాజు తనతోపాటు తెచ్చుకున్న కూల్డ్రింక్లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. అనంతరం సాయినగర్ కాలనీలోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కృష్ణంరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అతని స్నేహితులు చెబుతుండగా.. నడుమునొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడని మరికొంత మంది చెబుతున్నారు. -
శిశు విక్రయాలు జరగకుండా చూడాలి
నల్లగొండ : జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జి.చందన, జి.సరిత అన్నారు. గురువారం ఉదయాదిత్య భవన్లో మహిళా, శిశు, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలలు, అంగన్వాడీ, శిశు సంరక్షణ కేంద్రాలు సందర్శించి పిల్లల సంక్షేమం, భద్రత, విద్యా సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. చదువుకుంటే జీవితం బాగుంటుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి రూపాయ చివరి పిల్లవాడి వరకు అందేలా చూడాలని కోరారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, హౌసింగ్ పీడీ, బీసీ సంక్షేమ అధికారి రాజ్కుమార్, డీఈఓ భిక్షపతి, డీటీడీఓ చత్రునాయక్, ట్రైబల్ ఆర్సీఓ బలరాం, డీసీపీఓ గణేష్, ఎంఈఓ, అంగన్వాడీలు పాల్గొన్నారు. బాలల విద్యపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, వారి విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జి.చందన, జి.సరిత జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కేజీబీవీల ద్వారా అందిస్తున్న విద్య, పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాలల విద్య, పరిరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. నియమ, నిబంధనల ప్రకారం పిల్లల దత్తత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారివెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఫ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత -
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దీప్తి నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి మోసపోతున్నారన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల తీరును కళాశాల విద్యార్థినుల ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సైబర్ నేరా లకు గురైన వెంటనే స్పందించి 1930కు, పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జంప్డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్టిమెంట్ ప్రాడ్, సైబర్ బుల్లింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బ్యాంక్ అదికారులు ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరని, బ్యాంక్ వారు ఎలాంటి మెసేజ్లు, లింక్స్ పంపరని ఈ విషయాలు గుర్తుంచుకుని మీ కుటుంబ సభ్యులకు తెలుపాలన్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్బీ సీఐ రాము, వన్టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ విష్ణు, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నల్లగొండ డిపో నుంచి ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఆర్టీసీ డిపో నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీ, రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు రెండు డీలక్స్ బస్సులు ప్రారంభించనట్లు పేర్కొన్నారు. నల్లగొండ నుంచి వయా ఔటర్ రింగ్రోడ్డు మీదుగా విప్రో హైటెక్ సిటీకి, ఎల్బీ నగర్ మీదుగా ఎయిర్పోర్టు మధ్య ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీకి ఉదయం 6.45, మధ్యాహ్నం 2 గంటలకు, హైటెక్ సిటీ నుంచి ఉదయం 10, సాయంత్రం 6 గంటలు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. నల్లగొండ నుంచి ఎయిర్పోర్టుకు ఉదయం 10, మధ్యాహ్నం 6.30 గంటలకు, ఎయిర్పోర్టు నుంచి నల్లగొండకు మధ్యాహ్నం 1 గంటకు, ఉదయం 5 గంటల ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి దేవరకొండ: డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సీపీఐ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయ మాట్లాడారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్రెడ్డి, మైనొద్దీన్, తూం బుచ్చిరెడ్డి, వెంకటరమణ, కనకాచారి, సుదర్శన్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటయ్య, జయరాములు పాల్గొన్నారు. ‘ముదిమాణిక్యం’ మరమ్మతుల పరిశీలన నిడమనూరు : సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్ మరమ్మతులను గురువారం ఎన్ఎస్పీ ఎస్ఈ మల్లికార్జున్రావు, ఈఈ గోపినాథ్, డీఈ మాలూనాయక్ పరిశీలించారు. రెండో రోజు సిబ్బంది మేజర్ తూములోకి 20 అడుగుల కిందకు దిగి తూము గేటుకు మరమ్మతులు చేయడానికి యత్నించగా సాధ్యం కాలేదు. కొంత మేర గేటును దించి నీటి ప్రవాహన్ని నియంత్రించినట్లు తెలిసింది. వీటిని అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం మేజర్ దుస్థితిపై ఎన్ఎస్పీ ఉన్నతాధికారులతో ఎస్ఈ, ఈఈ సమీక్షించారు. సాగర్ ఆధునికీకరణ పనుల్లో కొత్త షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో నీటి ఉధృతికి షట్టర్ దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మిర్యాలగూడ పట్టణానికి తాగునీరు, ఆయకట్టు చివరి భూములకు నీటి అవసరాల నిమిత్తం సాగర్ ఎడమ కాల్వకు 5 వేల క్యూసెక్కులు నీటి విడుదల చేయించినట్టు డీఈ మాలూనాయక్ తెలిపారు. జైలు పెట్రోల్ బంక్లో సక్రమంగానే కొలతలునల్లగొండ టూటౌన్ : జిల్లాకేంద్రంలోని జైలు ఖానా పెట్రోల్ బంక్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో ఎలాంటి అవకతకలు లేవని, అన్ని సక్రమంగానే ఉన్నట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెపెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బంక్పై వచ్చి న ఫిర్యాదు మేరకు గురువారం లీగల్ మెట్రా లజీ అధికారులు పెంట్రోల్ బంక్లో పెట్రోల్, డీజిల్ను ఐదు లీటర్ల క్యాన్లో పట్టి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంక్లో ఓ పైప్ కారణంగా డీజిల్ ట్రాక్టర్లోకి రాలేదని, దాని ఆధారంగా ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసినట్లు తెలిపారు. జిల్లా జైలు సూపరిండెంటెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బంక్లో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు. -
రేషన్ డీలర్ల నియామకమెప్పుడో!
నల్లగొండ: కొత్త రేషన్ షాపులకు డీలర్ల నియామకంపై సందిగ్ధం నెలకొంది. జిల్లాలో కొత్తగా 54 రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయినప్పటికీ ఇప్పటి వరకు డీలర్ల నియామకంలో మాత్రం ముందడుగు పడటం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 4.87 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తోంది. 2015లో కొత్త పంచాయతీలు ఏర్పడినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2015లో కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. పంచా యతీలైతే ఏర్పడ్డాయి కానీ, వాటిల్లో కొత్త రేషన్ షా పుల ఏర్పాటు చేయొద్దని, తద్వారా తమకు నష్ట జరగుతుందని డీలర్ల సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో అప్పట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ షాపులకు డీలర్ల నియామకాన్ని పక్కన బెట్టింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ షాపులు ఏర్పాటు చేయాలో గుర్తించి నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లాలో 54 గ్రామాల్లో కొత్తగా రేషన్ షాపులు ఏర్పాటు చేయవచ్చని నివేదిక పంపింది. డివిజన్ల వారీగా ఆర్డీఓలకు నోటిపికేషన్ ద్వారా రేషన్ డీలర్ల ఎంపిక చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆర్డీఓలకు ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రక్రియ మొదలు కాలేదు. కొత్త పంచాయతీలు ఏర్పడినా తీరని కష్టాలు కొత్త గ్రామ పంచాయతీలు ఆవిర్భవించినప్పటికీ ఆయా చోట్ల కొత్త రేషన్ షాపులు ఏర్పాటు కాలేదు. దీంతో ఆయా గ్రామాలు, గూడేలు, తండాలకు చెందిన కార్డుదారులు పాత పంచాయతీలకే వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నడక యాతన అనుభవిస్తున్నామని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడినా కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. పాత డీలర్లతో బియ్యం ఇచ్చేలా చూడాలి నిబంధనల ప్రకారం 500 కార్డులు పైచిలుకు ఉంటేనే కొత్త షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో కొన్ని చోట్ల 100 కార్డులులేని పరిస్థితి. అలాంటప్పుడు 40 క్వింటాళ్ల బియ్యమే ఆ గ్రామానికి ఎలాట్ అయితే క్వింటాకు డీలర్కు వచ్చేది రూ.140. అంటే డీలర్కు రూ.4,500 ప్రభుత్వం నుంచి కమిషన్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త రేషన్ షాపులకు డీలర్లను ఏర్పాటు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఇప్పటికే ప్రభుత్వానికి, కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. కొత్త పంచాయతీల్లోనూ పాత పంచాయతీ డీలర్లతోనే బియ్యం ఇప్పించేలా చూడాలని కోరుతున్నారు. ఫ కొత్తగా 54 షాపుల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక ఫ నేటికీ మొదలుకాని డీలర్ల ఎంపిక ప్రక్రియ ఫ బియ్యం కోసం పాత పంచాయతీలకే వెళ్తున్న కార్డుదారులు -
కార్పొరేషన్గా నీలగిరి!
నల్లగొండ టూటౌన్: రాష్ట్రంలో పెద్ద పట్టణంగా వెలుగొందుతున్న నీలగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కార్పొరేషన్లుగా మార్చిన విషయం తెలిసిందే. ఇందులో మహబూబ్నగర్తోపాటు నీలగిరి కన్నా చిన్నవైన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా నీలగిరి మున్సిపాలిటీని కూడా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నీలగిరి చుట్టూ పక్కల ఉన్న గ్రామాలను విలీనం చేయకుండానే ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీనే కార్పొరేషన్గా మార్చాలని మంత్రి విన్నవించారు. అయితే ముఖ్యమంత్రి నుంచి సీడీఎంఏకు మంత్రి ప్రతిపాదన వెళితే కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగుమం కానుంది. 1950లో లోకల్ ఫండ్గా ఏర్పాటు స్వాతంత్య్రానంతరం 1950లో నీలగిరి లోకల్ ఫండ్ (మున్సిపాలిటీ)గా అవతరించింది. ఆ తర్వాత 1956లో 12 వార్డులతో పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి ప్రస్తుతం 48 వార్డులతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. అప్పట్లో చిన్న పట్టణంగా ఉన్న నీలగిరి పెరుగుతూ వచ్చింది. దశాబ్ద కాలంగా పిల్లల చదవులు, ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ధ సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి స్థిర పడుతున్నారు. పట్టణాల జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మున్సిపాలిటీలను గ్రేడ్ల వారీగా విభజించింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నీలగిరి 75 ఏళ్ల తరువాత కార్పొరేషన్గా అవతరించే అవకాశం వచ్చిందని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడున్న 48 వార్డులను జనాభా ఆధారంగా మొత్తం 50 డివిజన్ల వరకు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. నీలగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో నిధులు మంజూరైతే పట్టణ అభివృద్ధితోపాటు అన్ని వార్డులో మౌలిక సదుపాయాలు సమకూరున్నాయి. అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా రెండు శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు వార్డులు 48 జనాభా 2.50 లక్షలు ఓటర్లు 1.50 లక్షలకుపైగా సీఎం రేవంత్రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి విన్నపం ఫ రాష్ట్రంలో కార్పొరేషన్కాని ఏకై క ఉమ్మడి జిల్లా కేంద్రం ఫ 1950లోనే మున్సిపాలిటీగా ఏర్పాటు ఫ ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్గా కొనసాగింపు ఫ త్వరలో కార్పొరేషన్గా అవతరణఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న మున్సిపాలిటీల్లో నీలగిరి ముందంజలో ఉంది. గతంలో 107 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నీలగిరి మున్సిపాలిటీ ప్రస్తుతం 200 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పదేళ్ల క్రితం 1.65 లక్షల జనాభా ఉన్న పట్టణం ఇప్పుడు 2.50 లక్షల జనాభాకు చేరుకుంది. గడిచిన పదేళ్లలోనే దాదాపు లక్ష జనాభా పెరిగింది. ప్రస్తుతం ఆదాయం కూడా ఏటా రూ.40కోట్లకుపైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో కాలనీలు, భవనాలు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు, కొత్త వెంచర్లు భారీగా పెరిగాయి. డీవీకే రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవనాలు నిర్మించారు. ఒకప్పుడు కాలనీల్లో ఖాళీ ప్లాట్లు అధికంగా కనిపించే ఇప్పుడు భవనాలు పెరిగిపోయాయి. హైదరాబాద్ రోడ్డులో అన్నెపర్తి స్టేజి వరకు, దేవరకొండ రోడ్డులో కతాల్గూడ వరకు, మిర్యాలగూడ రోడ్డులో దుప్పలపల్లి వరకు, అద్దంకి రోడ్డులో కేశరాజుపల్లి వరకు కాలనీలు పెరిగాయి. -
పిల్లలు స్కూళ్లకు పోవడం లేదు
మోంథా తుపాను ప్రభావంతో వచ్చిన వర్షాలకు తండాకు వచ్చే రోడ్డులో ఉన్న వంతెన తెగిపోయింది. దీంతో తండాలోని పిల్లలు 15 రోజులుగా స్కూళ్లకు పోవడం లేదు. ప్రతిఏటా వానాకాలం వచ్చిందంటే వరద ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం తెగిపోయిన వంతెన వద్ద కొత్త బ్రిడ్జి నిర్మించాలి. మా తండాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి. – రమావత్ పూల్య, ఊరబాయితండా 15 రోజులుగా మా తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వంతెన తెగిపోయిన ప్రదేశం నుంచి కాలినడకన ఇబ్బందులు పడుతూ రావాల్సిన పరిస్థితి. నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లిపాయ కారంతోనే అన్నం తింటున్నం. అధికారులు స్పందించి వెంటనే తండాకు రోడ్డు వేయించాలి. – కరెంటోతు శంకర్, గాజుబెడంతండా -
వాగు పారి.. వంతెన తెగి..
చందంపేట : మోంథా తుపాను కారణంగా ఇటీవల కురిసిన వర్షాలతో నేరెడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరబాయితండా, గాజుబెడం తండాల మధ్య వంతెన తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఇరవై రోజుల క్రితం భారీగా కురిసిన వర్షాల వల్ల ఈ రెండు తండాల మధ్య ఉన్న వాగు పోటెత్తింది. వరద ధాటికి ఆయా తండాల మధ్య ఉన్న లోలెవల్ వంతన పూర్తిగా తెగిపోయింది. ఫలితంగా ఆయా తండాల్లో 60 కుటుంబాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి గడుపుతున్నాయి. కనీసం సెల్ సిగ్నల్ కూడా రాకపోవడంతో సమాచారం తెలుపడం కూడా కష్టతరంగా మారింది. తెగిన వంతెన మీదుగా పారుతున్న వదర తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే గిరిజనులు అతికష్టమీద కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వంతెన వద్ద రోడ్డంతా ధ్వంసం కావడంతో వాహనాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తెగిన వంతెన దాటి వాగు అలుగు మీదుగా గాజుబెడం తండాకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కూడా వాగు పారుతుండడంతో గాజుబెడంతండా వాసులకు ఇటు వాగుదాటి రావడం ప్రాణసంకటంగా మారింది. ఒకవేళ వాగు దాటి వచ్చినా మళ్లీ తెగిపోయిన వంతెన వద్ద వరదలోంచి రాకపోకలు సాగించాలి. ప్రస్తుతం వాగు పారుతుండడం.. వంతెన తెగి రోడ్డు ధ్వంసౖం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసర సరులకు లేక అష్టకష్టాలు వరద ధాటికి వంతెన తెగిపోవడంతో ఊరబాయితండా, గాజుబెడంతండాలోని గిరిజనులు నిత్యావసర సరుకులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా తండాలకు చెందిన విద్యార్థులు కూడా స్కూళ్లకు వెళ్లేలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే రెండు నెలల నుంచి కృష్ణానీటి సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నామని ఆయా తండాల వాసులు వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు 70 ఏళ్లుగా తండాల్లో ఉంటున్న తమకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని..ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆయా తండాల వాసులు అంటున్నారు. తాజాగా కాచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఊరబాయితండా, గాజుబెడంతండాలకు రాకపోకలు నిలిచిపోయి 15 రోజులు కావస్తున్నా ఏ ఒక్క అధికారి తమ తండాల వైపు కన్నెత్తిచూసిన పాపన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం స్పందించి రెండు తండాల మధ్య ధ్వంసమైన వంతెనకు మరమ్మతులు చేపట్టి శాశ్వత రోడ్డు ఏర్పాటు చేయడంతోపాటు తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆయా తండాల వాసులు కోరుతున్నారు. ఫ ఊరబాయితండా, గాజుబిడంతండాల మధ్య స్తంభించిన రాకపోకలు ఫ 15 రోజులుగా దిగ్బంధంలో 60 కుటుంబాలు ఫ ఇప్పటికీ పారుతున్న గాజుబిడంతండా వాగు ఫ స్కూళ్లకు కూడా పోలేని చిన్నారులు ఫ నిత్యావసర సరుకులకు అలమటిస్తున్న గిరిజనులు -
కబడ్డీ జూనియర్ జిల్లా జట్ల ఎంపిక
హాలియా : కబడ్డీ జూనియర్ బాలబాలుర జిల్లా జట్లను బుధవారం అనుముల మండలంలోని మధారిగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు 21 మంది బాలురు. 21 మంది బాలికలను ఎంపికయ్యారు. బాలుర జట్టుకు కోచ్గా మధారిగూడెం గ్రామానికి చెందిన తూళ్ల ఉదయరాజు, ఆర్గనైజర్గా సత్యనారాయణ, బాలికల జట్టుకు కోచ్గా ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన షేక్ అన్వర్, ఆర్గనైజర్గా ఆవుల చంద్రశేఖర్ వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, కర్తయ్య, సభ్యులు మాచర్ల ఏడుకొండలు, హాలియా, చందంపేట ఎస్ఐలు సాయి ప్రశాంత్, లోకేష్ యాదవ్, నిరంజన్, అమీర్ అలీ, ఉదయరాజు, సత్యనారాయణ, అన్వర్, పీఈటీలు సయ్యద్, ఎల్లయ్య, యడవెల్లి రాంబాబు, రమేష్, లెనిన్, తస్లీం, సైదులు, శ్రీను, నరేష్, చంద్రశేఖర్, రవి, లక్ష్మణ్ ఉన్నారు. -
గుర్రంపోడు మోడల్ స్కూల్కు ఉత్తమ అవార్డు
హాలియా : గుర్రంపోడు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు పీఎం శ్రీ ఉత్తమ అవార్డు లభించింది. జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన 60 పీఎంశ్రీ పాఠశాలల్లో జిల్లా నుంచి గుర్రంపోడు మోడల్ స్కూల్ ఉత్తమ అవార్డుకు ఎంపికై ంది. పీఎం శ్రీ పథకం క్రింద నిర్ధేశించిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేయడం, ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్ధాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం, కిచెన్ గార్డెన్, ఇతర పాఠశాల మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చుకోవడం, మెరుగైన ఫలితాలు తదితర ప్రమాణాలన్నీ పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. రాగిణి మంగళవారం అవార్డును పాఠశాల విద్య కమిషనర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా హైదరాబాద్లో అందుకున్నారు. మోడల్ స్కూలఖు ఉత్తమ అవార్డు రావడంపై ఎంఈఓ నోముల యాదగిరి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో జట్టుకు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలను గురువారం నల్లగొండ పట్టణంలోని ఎలిమినేటి మాధవరెడ్డి పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి తైక్వాండో జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అరుణాచల్ప్రదేశ్లో జరుగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి, నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదులు, డీఎస్డీఓ అక్బర్అలీ, ఎం.ఈశ్వర్, తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.యూనుస్ కమాల్, అంబటి ప్రణీత్ పాల్గొన్నారు. సీపీఐ శతాబ్ది సభను జయప్రదం చేయాలి నకిరేకల్ : ఖమ్మంలో డిసెంబర్ 26న నిర్వహించే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. నకిరేకల్లోని గుడిపాటి పంక్షన్ హాల్లో బుధవారం జరిగిన సీపీఐ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిందని.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన ఉండేది కమ్యూనిస్టులేనని గుర్తుచేశారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరికి ఎకరానికి రూ.40 వేలు, పత్తికి ఎకరానికి రూ.60 వేలు పరిహారం అందించాలని కోరారు. సీపీఐ మండల కార్యదర్శి గౌని లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్, నాయకులు బుడిగె సైదులు, శాంతి, జిల్లా యాదయ్య, పెండ్యాల శంకర్, ఎండీ.అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక వెలుగులు
హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణించే వారికే కాకుండా, ఈ హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాతీయ రహదారిని ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించడంతో పాటు ఏఐ ఆధారిత హైసెక్యూరిటీ స్మార్ట్ హైవేగా తీర్చిదిద్దనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,391 కోట్లు ఖర్చు చేయనుంది. విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గుతుంది. లేన్లహైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు నోటిఫికేషన్ ఫ దండుమల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు విస్తరణ ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 151 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఫ ఆరు వరుసలుగా మారితే తగ్గనున్న ప్రమాదాలు, తొలగనున్న ప్రయాణ కష్టాలు రాష్ట్రస్థాయి ‘ఆర్చరీ’కి 20 మంది ఎంపిక -
బడికి తీసుకెళ్తాడు.. వండిపెడతాడు!
కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న బాలరాజు బైక్పై పిల్లలను పాఠశాలకు తీసుకొస్తున్న ఉపాధ్యాయుడు బాలరాజు డిండి : విద్యార్థుల భవిష్యత్ కోసం ఓ ఉపాధ్యాయుడు తపన పడుతున్నాడు. తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు డిండి మండల పరిధిలోని కొత్తతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు. ఈ ఉపాధ్యాయుడు రోజూ విద్యార్థులంతా పాఠశాలకు చేరుకునేలా చూస్తాడు. స్కూల్కు రావడానికి ఇబ్బంది పడే పిల్లలను.. వారి ఇళ్ల వద్దకే వెళ్లి తన బైక్పై ఎక్కించుకుని తీసుకొస్తాడు. తండాల్లోని పిల్లలు కూలి పనికి వెళ్లకుండా రోజూ పాఠశాలకు పంపాలని, చదువుకుంటే భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాడు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు గైర్హాజరైతే.. విద్యార్థులు ఆకలితో ఉండకూడదని భావించి.. ఉపాధ్యాయుడు బాలరాజు కట్టెల పొయ్యిపై వంట చేసి పిల్లలకు వడ్డిస్తారు. ఉపాధ్యాయుడు అందిస్తున్న సేవలతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుకుంటేనే మార్పు వస్తుందని, తాను చేసే సేవ చిన్నదే కానీ.. వాళ్ల భవిష్యత్కు బాట వేస్తుందనే నమ్మకం ఉందని.. ఉపాధ్యాయుడు బాలరాజు పేర్కొంటున్నారు. -
దెబ్బతిన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్
నిడమనూరు : సాగర్ ఎడమకాల్వపై ఉన్న ముదిమాణిక్యం మేజర్ షట్టర్ నీటి ప్రవాహానికి దెబ్బతిన్నది. ప్రధాన కాల్వలో నీటి ప్రవాహంతో మరమ్మతులు సాధ్యం కాలేదు. బుధవారం ముది మాణిక్యం మేజర్ను ఎన్నెస్పీ డీఈడి మాలూ నాయక్, ఏఈ అశోక్, పలువురు మేజర్, మైనర్ల ఏఈలు, డీఈలు పరిశీలించారు. తూము షట్టర్ మరమ్మతుల కోసం సాగర్ ఎడమకాల్వ నీటిని నిలిపివేశారు. కాల్వలో అంతర్భాగమైన పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి మిర్యాలగూడ పట్టణానికి నీరందించే పైపులైన్లకు నీరు అందడం లేదు. దీంతో పట్టణంలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడమకాల్వలో నీటి పూర్తిగా పోవడానికి మరికొంత సమ యం పడుతుందని నిర్ధారణకు వచ్చిన అధికా రులు గురువారం మరోసారి తూము షట్టర్ పరిశీ లించి, మరమ్మతులు చేస్తామని చెబుతున్నారు. ఒకవేళ షట్టర్ మరమ్మతులు సాధ్యం కాకపోతే దెబ్బతిన్న షట్టర్ పూర్తిగా మూసివేసి, రెండో షట్టర్ ద్వారా కాల్వకు నీటి విడుదల చేస్తామని అధి కారులు చెబుతున్నారు. వేసవిలో కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని నిలిపివేసిన అనంతరం షట్టర్ మరమ్మతులు చేస్తామని పేర్కొంటున్నారు. 2019 లో ఒకసారి ముదిమాణిక్యం మేజర్ షట్టర్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఎన్నెస్పీ అధికారులు పాత షట్టర్కు మరమ్మతులు చేసి బిగించడంతో.. ఇప్పుడు మళ్లీ దెబ్బతిందని.. అప్పుడే కొత్త షట్టర్ బిగిస్తే బాగుండేదని రైతులు అంటున్నారు. -
రైతులకు ఇబ్బంది కలగొద్దు
నల్లగొండ : జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో మార్కెటింగ్, సీపీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమానులతో సమావేశమయ్యారు. ఎల్1, 2, 3 నిబంధన లేకుండా చూడాలని, తేమశాతంలో సడలింపు ఇవ్వాలని జిన్నింగ్ మిల్లుల యజమానులు కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి కొనుగోలు పూర్తిగా సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున నిబంధనల సడలింపులు తన పరిధిలో లేదన్నారు. పత్తి రైతులు సరైన తేమ శాతంతో జిన్నింగ్ మిల్లులకు తీసుకువచ్చేలా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా చూడాలని వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ను ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సమ్మెకు వెళ్లకుండా పత్తిని కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, సీపీఐ అధికారి నింజే, జిన్నింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీదర్రెడ్డి పాల్గొన్నారు. 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లో రైతులకు డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలంలో ఇప్పటి వరకు 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేశామని, అందులో 46,568 మెట్రిక్ టన్నుల ధాన్యం ఓపీఎంఎస్లో ఎంట్రీ చేసి.. 5,657 మంది రైతులకు రూ.102 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఈసారైనా.. అందేనా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంట నష్ట పరిహారం పరిహాసంగా మారింది. అకాల వర్షాలతో ఆగమైన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు ఇవ్వదో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మూడేళ్ల కాలంలో అకాల వర్షాలు, తుపాన్ల ప్రభావంతో ఆరుసార్లు పంటలు నష్టపోతే ఇప్పటివరకు ప్రభుత్వం రెండుసార్లు మాత్రమే పరిహారం చెల్లించింది. మూడుసార్లు చెల్లించలేదు. ఇక మొన్నటి అక్టోబర్ నెలలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈసారైనా ప్రభుత్వం పరిహారాన్ని ఇస్తుందా? లేదా? అని నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చేదే అరకొర.. అదీ సరిగ్గా ఇవ్వని ప్రభుత్వం జిల్లాలో ఏటా వేల మంది రైతులు అకాల వర్షాలతో పంటలను నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడిని కోల్పోవడంతోపాటు దిగుబడి తగ్గిపోయి అప్పులపాలు అవుతున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్టం విషయంలో పక్కాగా వ్యవహరించడం లేదు. 33 శాతానికి కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లితేనే నష్టం జరిగినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. దీంతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరగడం లేదు. రైతులు ఎకరం వరి, పత్తి పంటలకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం రైతులకు పంట నష్ట పరిహారం కేవలం రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడంతో నిరాశ చెందుతున్నారు. మూడేళ్లలో రెండుసార్లే పరిహారం చెల్లింపు.. జిల్లాలో 2023 నుంచి ఇప్పటివరకు వరకు అకాల వర్షాలు, తుపాన్ల కారణంగా ఆరుసార్లు పంట నష్టం వాటిల్లింది. కేవలం రెండుసార్లు జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం చెల్లించింది. 2023 మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కార ణంగా జిల్లాలో 323 రైతులకు చెందిన 371.24 ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లగా, వారికి మాత్రం రూ.37.16 లక్షలు పరిహారంగా ఎకరాకు రూ.10 చొప్పున చెల్లించింది. ఇక 2024 ఏప్రిల్లో వర్షాల కారణంగా 31 మంది రైతులకు చెందిన 32.08 ఎకరాల్లో పత్తి, వరికి నష్టం వాటిల్లగా రూ.3.22 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. అదే ఏడాది సెప్టెంబర్లో అకాల వర్షాలతో 413.12 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా 454 మంది రైతులకు రూ.41.33 లక్షలు పరిహారం కింద చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్లో అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇక ఆగస్టులోనూ అకాల వర్షాలతో పంటల నష్టం వాటిల్లింది. దానికి సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. తాజాగా అక్టోబర్ నెలాఖరులోనూ పంట నష్టపరిహారం వాటిల్లింది. అయినా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా 679 మంది రైతులకు చెందిన 726.36 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ వేసిన అంచనా ప్రకారం రూ.72.69 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దానిపై నిర్ణయమే తీసుకోలేదు. మరోవైపు ఆగస్టు నెలలోనూ అకాల వర్షాలతో 10.38 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దానికి పరిహారం ఇవ్వలేదు. ఇక గత నెలలోనూ మోంథా తుపాన్ కారణంగా రైతులు పెద్ద ఎత్తున పంటలను నష్టపోయారు. వ్యవసాయ శాఖ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపించింది. దాని ప్రకారం 310 గ్రామాల్లో 30,359 మంది రైతులకు చెందిన 61,511 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అందులో అత్యధికంగా 35,487 ఎకరాల్లో వరి, 25,919 ఎకరాల్లో పత్తి, 105 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఆయా రైతులకు రూ.61.51 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్ట పరిహారాన్ని అయినా ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ మూడేళ్లలో ఆరుసార్లు పంటలు నష్టపోతే ఇచ్చింది రెండుసార్లే.. ఫ వర్షాలతో నష్టపోతున్న రైతులు.. అంచనా వేసి పంపుతున్నవ్యవసాయ శాఖ ఫ ఎకరాకు రూ.30 వేలకుపైగా వెచ్చిస్తున్నా.. రూ.10వేలే ఇస్తామని ప్రకటన ఫ అది కూడా సరిగ్గా అందక రైతుల ఆవేదన -
పెద్దదేవులపల్లి చెరువులు ఖాళీ !
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలోని చెరువులు ఖాళీ అయ్యాయి. చెరువుల్లో నీటిని సంబంధిత అధికారులు ఎడమ కాలువ గుండా దిగువకు వదులుతున్నారు. చెరువులకు ఎగువన సాగర్ ఎడమ కాలువకు అనుసంధానంగా ఉన్న ముదిమాణిక్యం మేజర్ వద్ద మరమ్మతులు చేపడుతుండడంతో చెరువు నీరు దిగువకు వదులుతున్నట్లు సమాచారం. అయితే పెద్దదేవులపల్లి గ్రామంలోని చిన్న చెరువు, పెద్ద చెరువులు సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. చెరువు కింద వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది. సుమారు 900 మంది మత్స్యకారులు ఈ చెరువులపై జీవనాధారం పొందుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి కూడా ఇక్కడి నుంచే పైపులైన్ల ద్వారా తాగునీరు అందిస్తారు. ప్రస్తుతం ఎన్నెస్పీ అధికారులు చెరువుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తూములకు నీరందక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చేపలు దిగువకు వెళ్లి మత్స్యకారులకు ఉపాధి దొరక్క రోడ్డున పడే అవకాశం ఉందని మత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షుడు సింగం ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు చెరువు నీటిని పూర్తిగా వదలకుండా చర్యలు తీసుకోవాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు. -
అమ్మేందుకు.. లక్కీడ్రా
స్థిరాస్తి విక్రయానికి కొత్త పంథా సూర్యాపేటటౌన్ : ఇప్పటి వరకు వినాయక మండపాలు, దుర్గమాత మండపాల వద్ద, దసరా పండుగ వేళలో స్కూటీలు, బైక్లు, లడ్డూలు, చీరలు, గొర్రెపోతులంటూ లక్కీ డ్రా నిర్వహించడం చూశాం. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. ఏకంగా కొందరు తమ స్థిరాస్తిని విక్రయించడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ప్లాట్లు, ఇళ్లకు సైతం లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000దాకా కూపన్లకు ధర నిర్ణయించి దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇది హాట్టాపిక్గా మారింది. అదృష్టం కలిసి వస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాటు, ఇళ్ల యజమానులు తమకు సంబంధించిన ప్రాపర్టీని అమ్ముకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టడం, ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని ఎలాగైనా అమ్ముకునేందుకు కొత్త దందాకు తెరలేపారు. పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ఇల్లు అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రా కూపన్లతో వారికి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఈ స్కీంలు పెడుతున్నారు. రూ.వెయ్యి పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తే డ్రాలో ఇల్లు గెలుపొందవచ్చనే ఆశతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాపారులు, యజమానులు ఎక్కువ డబ్బులు రావాలనే ఆలోచనతో ఈ లక్కీ డ్రా స్కీం పెడుతున్నప్పటికీ చట్టబద్ధంగా ఇది ఎంత వరకు నిజమనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. కొత్త దందా నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ లక్కీ స్కీంల దందా ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది. సంబంధిత ప్లాట్ల వద్ద యజమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కరపత్రాలను విరివిగా పంచిపెడుతున్నారు. చౌటుప్పల్లో మూడు నెలల క్రితం ఓ యజమాని లక్కీ డ్రాం స్కీం ప్రారంభించి గత ఆదివారం లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో 3,600 మంది రూ.500 చొప్పున కొనుగోలు చేసి పాల్గొనగా ఆ యజమానికి రూ.18లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. అతని ప్లాటుకు రూ.12లక్షల వరకు ధర చెప్పినా ఎవరూ కొనకపోవడంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాగా, ప్లాటు, ఇల్లుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా.. లేవా అనేది, చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రజలు ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోవద్దు. ఎవరూ కూడా ఇలాంటి స్కీంలలో పాల్గొనవద్దు. లక్కీ డ్రా స్కీంల పేరుతో ప్రజలను మోసం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేటఫ పోతే వెయ్యి.. వస్తే ఇల్లు అని సోషల్ మీడియాలో ప్రచారంఫ చౌటుప్పల్లో ఇప్పటికే డ్రా తీసిన ఇంటి యజమాని ఫ సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో మూడు నెలల గడువుతో లక్కీడ్రా పెట్టిన ఇద్దరు యజమానులు ఫ లక్కీడ్రాలు నేరం అంటున్న పోలీసులు -
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
నల్లగొండ టౌన్ : తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని, పత్తిని ఎలాంటి షరుతులు లేకుండా మద్దతు ధరకు కోనుగోలు చేయాలన్నారు. వరి ఎకరానికి రూ.40 వేలు, పత్తికి ఎకరానికి రూ.60 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో నిర్వహించే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు వేలాదిగా తరలా లని పిలుపునిచ్చారు. ఈ నెల 17న బహిరంగ సభ ప్రచార జాత జిల్లాలోని డిండి మండల కేంద్రానికి చేరుకుని జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల సాగుతుందన్నారు. కార్యక్రమంలో బొలుగూ రి నర్సింహ, పబ్బు వీరస్వామి, కెఎస్రెడ్డి, గంట సత్యనారాయణ, దోటి పాండరి, రాంకోటి, జిల్లా యాదయ్య, జోగు సురేందర్, కట్ట వెంకన్న, యా ద య్య, లెనిన్, ముత్యాలు, కౌసల్య, యూసూఫ్, విజ య, నాగమ్మ, లక్ష్మి, నందన్ అశోక్ పాల్గొన్నారు. -
ఒకేషనల్ కోర్సులూ అవసరమే..
నల్లగొండ : విద్యార్థులకు అకాడమిక్ విద్య, ఒకేషనల్ కోర్సులు రెండూ అవసరమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని రాంనగర్లో మైనార్టీ గురుకులంలో విద్యార్థినులకు ఒకేషనల్ కోర్సుల శిక్షణను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రెసిడెన్షియల్, కేజీబీవీల్లో చదివే 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులపై శిక్షణ ఇస్తామని తెలిపారు. వెబ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫికేషన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ కోర్సులు ఉంటాయని, శిక్షణకు సెట్విన్ సంస్థ సగం ఫీజు రాయితీ ఇస్తుందని, తక్కిన సగం ఫీజును జిల్లా యంత్రంగా తరఫున చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, వివిధ శాఖ అధికారులు విజయేందర్రెడ్డి, డాక్టర్ రమేష్, డీఈఓ భిక్షపతి, డీఐఈఓ దస్రూనాయక్, చత్రునాయక్, సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపాల్ కుబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఫ పరిమితికి మించి
నేడు కబడ్డీ జిల్లా జట్ల ఎంపికహాలియా : నల్లగొండ జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక అనుముల మండలం మదారుగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, కర్తయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల, బాలికల జట్లను ఎంపిక చేస్తామని, బాలురు 75 కిలోలు, బాలికలు 70 కేజీలు, వయస్సు 20 సంవత్సరాలు మించని వారు అర్హులని తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణనల్లగొండ టూటౌన్ : నల్లగొండ 31వ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు శిక్షణకు హాజరు కాగా వారికి డ్రిల్ మెళకువలు, దేశసేవ, ఆర్మీ ఉద్యోగాల సమాచారం, యోగా, ఫిజికల్ వ్యాయామ నియమాలు తదితర అంశాలపై కల్నల్ లక్ష్మారెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సేబేదార్ మేజర్ మాధవరావు, కొమ్ము శ్రీధర్రావు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, ఎన్సీసీ ఆఫీసర్ మశ్చేందర్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్కు షోకాజ్ నోటీసుకేతేపల్లి: ఐసీడీఎస్ కేతేపల్లి మండల సూపర్వైజర్ కళావతికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి మంగళవారం షోకాజ్ నోటీసు వచ్చింది. కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో ఈ నెల 3న అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు కుంచం అయాన్ ఆరుబయట ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ లోపం, కేంద్రాల నిర్వహణపై అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సరైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంలో సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కళావతిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీలోగా వివరణ సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతోపాటు ఘటన జరిగిన కాసనగోడు అంగన్వాడీ కేంద్రం ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి, కేంద్రం నిర్వహణ బాధ్యతలను బొప్పారం అంగన్వాడీ టీచర్కు అప్పగించారు. మెరుగైన వైద్యం అందించాలినిడమనూరు : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ కోరారు. మంగళవారం నిడమనూరు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. డయాబెటిక్, బీపీ బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు సక్రమంగా అందించాలని సూచించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ అరవింద్, డాక్టర్ రమ్య, సీహెచ్ఓ రమేష్, ల్యాబ్ టెక్నిషియన్ కృష్ణయ్య, ఎన్సీడీ సూపర్వైజర్ సోమయ్య, జలీల్ ఉన్నారు. -
భూసార పరీక్ష కార్డులను ఉపయోగించుకోవాలి
మిర్యాలగూడ : రైతులు ప్రభుత్వం అందించే భూసార పరీక్ష కార్డులను ఉపయోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ అన్నారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించి మాట్లాడారు. కార్డులో సూచించిన విధంగా రైతులు ఎరువులను వినియోగిస్తే పంటలో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్, ఏవో మేకల రుషేంద్రమణి, ఏఈఓలు సైదులు, పార్వతి, ప్రియాంక, రైతులు నామిరెడ్డి మట్టారెడ్డి, కొడాలి ప్రభాకర్, రాంబాబు, నాగరాజు, రాములు తదితరులు పాల్గొన్నారు. -
జనగణన పారదర్శకంగా చేపట్టాలి
తిప్పర్తి: జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా చేపడితేనే అర్హులైన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు సులువుగా అందించవచ్చని సెన్సెస్ ఆపరేషన్ తెలంగాణ డైరెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణనపై ఎన్యుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణలో ఆమె మాట్లాడారు. జనగణన చేయడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏయే సౌకర్యాలు అవసరమో గుర్తించి కల్పించవచ్చన్నారు. వారి స్థితిగతులు, ఆహారపు అలవాట్లను కూడా తెలుసుకుని కల్పంచవచ్చన్నారు. ఇది డిజిటల్ సెన్సెస్ కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం ఎన్యుమరేటర్లు జనగణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గణాంకాల జేడీ లాజరస్, తహసీల్దార్ రామకృష్ణ, ఆర్ఐ ద్రోణార్జున శ్రీకృష్ణ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై డివైడర్ తొలగింపు
చిట్యాల పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారుల ఇక్కట్లను తొలగించేందుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే మెయింటెనెన్స్ అధికారులు రైల్వే అండర్ పాస్ నుంచి వంద మీటర్ల దూరంలో హైదరాబాద్ వైపు వెళ్లే రహదారి మధ్యలోని డివైడర్ను సోమవారం తొలగించారు. ప్రమాద హెచ్చరిక హోర్డింగ్ ఏర్పాటు చిట్యాలలో హైవేపై ప్రమాదాల నివారణకు చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఓ దాబా హోటల్ ఎదురుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాలు జరిగే తీరుతోపాటు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఈ హోర్డింగ్ ఏర్పాటు చేయనున్నారు. హోర్డింగ్ నిర్మాణ పనులను సోమవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. -
కొబ్బరికాయ రూ.40కే..
యాదగిరి కొండపైన కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని ఆలయ అధికారులు దుకాణదారులకు సూచించారు. మంగళవారం శ్చ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025- 10లోఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రిగా నేను, మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇంకెప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తవదు. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తిచేసి తీరుతాం. – మన్నెవారిపల్లి ఔట్లెట్ వద్ద సర్వే ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించేందుకు చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి హామీతో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ కారణాలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పనులను ప్రారంభించేందుకు చేపట్టిన అత్యాధునిక వీటెమ్ ప్లస్ హెలీబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ జియోఫిజికల్ సర్వే పనులను ఆయన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి ఔట్లెట్ వద్ద ప్రారంభించారు. ప్రాజెక్టుకు పూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో పనులు ప్రారంభం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు నీటిని తరలించి సస్యశ్యామలం చేసేందుకు 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. 2005లో పనులు ప్రారంభం అయ్యాయి. వైఎస్సార్ మరణం తరువాత పనులు నెమ్మదించాయి. ఆ తరువాత రాష్ట్రం ఏర్పడింది. పనులు వేగంగా జరుగుతాయని భావించినా జరగలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రమాదంతో ప్రత్యామ్నాయ చర్యలు నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని దోమలపెంట ఇన్లెట్ నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఔట్లెట్ వరకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగాన్ని 10 మీటర్ల డయాతో (వెడల్పు) రెండు వైపులా తవ్వేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 34.37 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఔట్లెట్ గట్టి రాయి కారణంగా తరచూ బేరింగ్ పాడయిపోతుండగా, ఇన్లైట్లో సీపేజీ కారణంగా 2019లోనే పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులను చేపట్టగా టన్నెల్ కూలిపోయింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోయారు. దీంతో అక్కడ ఇక మళ్లీ పనులు కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా కార్యాచరణ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం టన్నెల్ ఇన్లెట్ జరిగిన ప్రమాదం తరువాత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం నిఫుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ టన్నెల్ బోరింగ్ మిషన్తో ఇక తవ్వడం కుదరదని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వాలని సూచించింది. అందులో భాగంగానే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను సోమవారం ప్రారంభించింది. భూమి లోపల వెయ్యి మీటర్ల వరకు పరిస్థితి అంచనా వేసి పనులు చేపట్టనుంది. ఈ సర్వే పూర్తయ్యాక వచ్చే నివేదికంగా ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయనుంది. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేస్తామని సీఎం వెల్లడించారు. ఫ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ సర్వే పూర్తికాగానే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు మొదలుపెట్టేలా కసరత్తు ఫ 2028 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం స్పష్టీకరణ -
సర్వే ప్రారంభం
చందంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గంలో భూమిలో పరిస్థితులను అంచనా వేసేందుకు వీటెమ్ ప్లస్ హెలీబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ జియో ఫిజికల్ సర్వే సోమవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ప్రారంభమైంది. ఆర్మీ అధికారుల సహకారంతో చేపడుతున్న ఈ సర్వే ద్వారా టన్నెల్ మార్గంలో భూమి లోపల ఏం ఉన్నాయి.. బండరాళ్లు ఉన్నాయా.. షియర్ జోన్ ఉందా.. నీటి ఆనవాళ్లు ఉన్నాయా.. తవ్వకం పనులను కొనసాగించడానికి వీలుందా..? అనే అంశాలు తెలియనున్నాయి. వెయ్యి మీటర్ల లోతు వరకు ప్రతి అడుగున్నరకు ఒక స్కాన్ ద్వారా ఒక ఈమేజ్ను తీయనుంది. వారం రోజుల పాటు సాగనున్న సర్వే ద్వారా సొరంగం పనులు నిర్వహించేందుకు గల అనుకూలమైన ప్రాంతాన్ని గుర్తించనున్నారు. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి టన్నెల్ తవ్వకం పనులను ప్రభుత్వం చేపట్టనుంది. కాగా సోమవారం ప్రారంభమైన సర్వే తీరును సీఎం, మంత్రులు, అధికారులు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. -
చెర్వుగట్టు అభివృద్ధిపై మంత్రుల సమీక్ష
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్పై సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సురేఖ చర్చించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గట్టుపైన, కింద కల్పించాల్సిన సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఈ సమీక్షలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి తరలొచ్చిన జనం
నల్లగొండ టూటౌన్: కలెక్టర్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లు వెత్తాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠికి మొర పెట్టుకుంటున్నారు. ఆసరా పించన్లు, సదరమ్ సర్టిఫికెట్లు, ప్రధానంగా భూ సమస్యలపై ఎక్కువగా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. తమ సమస్యలపై మాటిమాటికి వినతి పత్రాలు అందిస్తున్నా పరిష్కారం చూపడంలేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలినల్లగొండ: బాధితులకు అండగా ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో 45 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులతో ఫోన్లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హాస్టళ్లలో బాలికలకు అసౌకర్యం కలిగించొద్దుతిప్పర్తి : సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎస్సీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) శశికళ అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని బాలికల హాస్టల్ను సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అమ్మాయిల పట్ల మర్యాదగా నడుచు కోవాలని, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఆమెవెంట హాస్టల్ వార్డెన్ ఉన్నారు. ఫ శివ పూజ నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ వద్ద ఛాయా సోమేశ్వరాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శివలింగం -
అండర్పాస్ వద్ద ట్రాఫిక్ జామ్ కానివ్వం
నీటిని తోడుతున్న మోటార్ను పరిశీలిస్తున్న అర్డీఓ, మున్సిపల్ కమిషనర్ చిట్యాలలో రైల్వే అండర్ పాస్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న ఎస్పీ శరత్చంద్ర పవార్చిట్యాల: పట్టణంలోని రైల్వే అండర్ పాస్ వద్ద నిలిచిన వరద నీటితో ట్రాఫిక్ జామ్ కాకుండా.. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. చిట్యాల పట్టణంలో జాతీయ రహదారి –65పై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరునిలిచి హైవేపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ ఇబ్బందులపై ఆదివారం సాక్షి పత్రికలో ‘లోతట్టుగా రైల్వే అండర్ పాస్’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, తహసీల్ధార్ విజయ, నేషనల్ హైవే మైయింటెనేన్స్ అధికారి ఇమ్రాన్, చిట్యాల మున్సిపాలిటి కమిషనర్ శ్రీను స్పందించి సోమవారం రైల్వే అండర్ పాస్ ప్రాంతాన్ని వేర్వేరుగా పరిశీలించి అక్కడ నిలిచిన నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన మోటార్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైల్వే అండర్ పాస్కు వంద మీటర్ల దూరంలో రహదారిపై ఒకవైపు నుంచి ట్రాఫిక్ను మళ్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ పరిశీలించి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పోతరాజు కుంట ఆక్రమణకు గురికావడంతో పాటు మున్సిపల్ సిబ్బంది చెత్తను వేయటంతోనే రైల్వే అండర్ పాస్ వద్ద పైనుంచి వచ్చిన వరద నీరు సాఫీగా పోకపోవడంతోనే నీరు నిలిచి హైవేపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కలెక్టర్ ఆదేశాల మెరకు పోతరాజుకుంట ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, చిట్యాల ఇన్చార్జి తహసీల్దార్ విజయ, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పత్తి కొనుగోళ్లలో కొర్రీలు.. రైతుల నిరసన
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి వద్ద పత్తి మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రం వద్ద తేమ పేరుతో కొర్రీలు పెడుతూ పత్తి కొనడం లేదని నిరసిస్తూ కోదాడ–జడ్చర్ల రహదారిపై రైతులు సోమవారం ధర్నా చేశారు. పత్తి మిల్లు యజమానులు, దళారులు కుమ్మకై ్క సీసీఐ కేంద్రాలలో పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా.. తేమ ఉందని చెబుతూ రూ.6వేల నుంచి రూ.6,500 కే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పారు. తేమ శాతం 15 నుంచి 20 శాతం ఉంటుందని, 8 నుంచి 12 శాతం ఉంటేనే పత్తి కొంటామని సీసీఐ అధికారులు చెప్పడంతో మళ్లీ పత్తిని తీసుకెళ్లి ఆరబెట్టాలంటే బండి కిరాయిలు, కూలీల ఖర్చులు భారం అవుతాయని, దీనికి తోడు కురుస్తున్న వర్షాతో రైతులు చేసేదేమీ లేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొన్నారు. పత్తిని ఎంత ఆరబెట్టినా తేమ శాతం 8 నుంచి 12 శాతానికి తగ్గడం లేదని 14 నుండి 20 శాతం వరకు వస్తుందని, దీంతో కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనడం లేదని మళ్లీ తీసుకెళ్లి ఆరబెట్టాలంటే దాదాపు రూ.20వేల వరకుఖర్చు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 శాతం వరకు తేమ శాతం ఉన్నా పత్తి కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తేమను కొలిచే మిషన్లో కూడా తేడా వస్తుందని తేమ శాతం సరిగా చూపించడం లేదని రైతులు చెప్పారు. ఎస్ఐ అజ్మీరా రమేష్, తహశీల్దార్ నరేందర్ రైతుల ఆందోళన విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనే విధంగా చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. -
చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు. కార్తీక పూజలు, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవుని పాదాల వద్ద ఉదయం 8 గంటల వరకు కూడా చెత్త తొలగించకపోవడంతో అక్కడ దీపాలు వెలిగించేందుకు మహిళలు ఇబ్బందులు పడ్డారు. గట్టు కింద టోల్గేట్ నిర్వాహకులు టోల్ రుసుము తీసుకుని వాహనాలను గట్టుపైకి పంపి అక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్లు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, యాదయ్య, రాజ్యలక్ష్మి, నరేష్, మహేందర్రెడ్డి, అర్చకులు శ్రీకాంత్, సురేష్, సతీష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమలు తీరును పర్యవేక్షించాలి
నల్లగొండ: ప్రత్యేక అధికారులు మండలాల్లో పర్యటిచేస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కేజీబీవీలు, ఇతర విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్షలు తప్పవని అధికారులు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఉపాధి కల్పనకు సెట్విన్ ద్వారా శిక్షణ పది, ఇంటర్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సెట్విన్ ద్వారా ఇచ్చే వృత్తిపర కోర్సుల శిక్షణపై సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించి సమావేశంలో ఆమె మాట్లాడారు. మంగళవారం (ఈనెల 4న) నల్లగొండలోని రామ్నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 26 రకాల కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్, కేజీబీవీ విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, చండూరు, దేవరకొండ ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
చండూరు: వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం చండూరులో జరిగిన ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ స్థాయి మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన పత్తి, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో నలపరాజు రామలింగయ్య, అంజయ్యచారి, రామమచంద్రం, నరసింహ, వెంకటేశ్వర్లు, సతీష్కుమార్, రమేష్, శేఖర్, చలపతి, లాలు, రామములు, సురేష్, భిక్షంరెడ్డి, వెంకటేశ్, యాదయ్య పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కుదింపు సరికాదు మునుగోడు: పాత నిబంధన ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని, అలా కాకుండా కేవలం 7 క్వింటాళ్లకు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఎమ్మెల్సే నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడుకు వచ్చిన ఆయనకు స్థానిక రైతులు ఈ విషయాన్ని తెలిపి తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎకరాకు కనీసం 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. దానిని సీసీఐ అధికారులు గుర్తించి గతంలో కంటే మరో 3 క్వింటాళ్లు పెంచి ఎకరానికి 15 క్వింటాళ్లకు తగ్గకుండా కొనుగోలు చేయాలన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైన కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని ఆలయ అధికారులు దుకాణదారులకు సూచించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘అంతా ఇష్టారాజ్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయాధికారులు స్పందించారు. దీంతో ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ దూశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ ఎంతకు అమ్ముతున్నారనే అంశాలను పరిశీలించారు. ఒక్క కొబ్బరికాయ రూ.40కే విక్రయించాలని, రూ.100కు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవస్థానం నిర్ణయించిన రూ.40కే కొబ్బరికాయ అమ్మాలని స్టిక్కర్లు సైతం అతికించారు. మరోసారి అధిక ధరలకు విక్రయిస్తే దేవస్థానం యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, టెండర్ సైతం రద్దు చేస్తామన్నారు. ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ వెంట ఏఈఓ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ రాకేష్రెడ్డి, అడ్మినిస్టేషన్ ఏఈఓ మహేష్ తదితరులున్నారు. ఫ కొండపైన దుకాణాదారుల వద్దకు వెళ్లి పరిశీలించిన ఇన్చార్జ్ డిప్యూటీ ఈఓ -
వైభవంగా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం యాగ్నికులు సముద్రాల వెంకటరమణ ఆధ్వర్యంలో స్వామివారిని ఊరేగింపుగా తోడ్కొని వచ్చి తిరు కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణానికి ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూరుకు చెందిన నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. కల్యాణానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఘాట్ రోడ్డుకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రేలింగును ప్రారంభించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ దశరథ, వాకిటి అనంతరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, గుర్రం లక్ష్మ రెడ్డి, బోల శ్రీనివాస్, బత్తిని సహదేవ, కంకల కిష్టయ్య పాల్గొన్నారు. -
రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా భార్గవచారి
హుజూర్నగర్ : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయినిగూడేనికి చెందిన కన్నెకంటి భార్గవచారి రోప్ స్కిప్పింగ్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని అల్వాల్లో గల పల్లవి మోడల్ స్కూల్లో తెలంగాణ రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా కన్నెగంటి భార్గవచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు నియామక పత్రం అందజేశారు. మహిళ అదృశ్యంచౌటుప్పల్ : పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత మహిళ అదృశ్యమైంది. ఆమె భర్త సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం గ్రామానికి చెందిన మహిళ(35) కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో నివాసం ఉంటుంది. భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లిన భర్త ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇల్లు కూల్చారని నిరసన మోత్కూరు : అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబం పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపింది. ఈ సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని కాశవారిగూడెం కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాశవారిగూడెంలోని ప్రభుత్వ భూమి అయిన సర్వే నంబర్ 402లో మహ్మద్ పకీర్ అహ్మద్ గత 30 సంవత్సరాలుగా గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నాడు. గత పది సంవత్సరాల క్రితం దశల వారీగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే ఆ స్థలం తనదని, అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన బెల్లి నగేష్ తహసీల్దార్ను సంప్రదించాడు. కాశవారిగూడెంలో సర్వే నంబర్ 402లోని 242 గజాల భూమి తనదేనని, ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో 2020లో తనకు కేటాయించిందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరాడు. దీంతో తహసీల్దార్ అనుమతులతో మున్సిపాలిటీ వారు ఆ ఇంటిని జేసీబీ సాయంతో సోమవారం నేలమట్టం చేశారు. దీంతో మహ్మద్ పకీర్ అహ్మద్ కుటుంబం కాలనీవాసులతో కలిసి కాలనీ ఎదుట పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై బైఠాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ విషయంపై తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. కాశవారిగూడెంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కూల్చివేసినట్లు తెలిపారు. యువకుడిపై కేసు నమోదుచౌటుప్పల్ : మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ సోమవారం తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్కు చెందిన యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో మహిళలు నిల్చున్నప్పుడు, బస్సు ఎక్కే సమయంలో తన సెల్ఫోన్తో వారి ఫొటోలను తీస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ మహిళ గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వారు బస్టాండ్కు చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి సెల్ఫోన్లో మహిళలు, యువతుల ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
నీటి గుంతలో పడి బాలుడు మృతి
కేతేపల్లి: అంగన్వాడీ పాఠశాలకు వెళ్లిన బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసనగోడు గ్రామానికి చెందిన కుంచం జగదీష్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆయాన్(4)ను స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆయాన్ను బహిర్భూమి కోసం సిబ్బంది ఆరుబయటికి తీసుకెళ్లారు. పాఠశాల పక్కనే నీటి గుంత వద్దకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన అంగన్వాడీ ఆయా ఆయాన్ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసేందుకు యత్నించారు. వారు భయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అంగన్వాడీ కేంద్రం సిబ్బందిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి తండ్రి జగదీష్ ప్రస్తుతం పనినిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లినట్లు తెలిసింది. నలుగురు సిబ్బంది ఉన్నా.. కాసనగోడు గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండింటిలో కలిపి పది మందికి లోపే పిల్లలు ఉండడంతో రెండు కేంద్రాలను కలిపి ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. కేంద్రం నిర్వహణకు ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలు మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. సోమవారం పాఠశాలకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే వచ్చినప్పటికీ వారి పర్యవేక్షణపై సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం, ప్రహరీ, మరుగుదొడ్లు సౌకర్యం ఉన్నప్పటికీ బాలుడిని బహిర్భూమికి ఆరుబయటకు ఎందుకు తీసుకెళ్లారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందాడని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు, అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట బాలుడి మృతదేహాన్ని ఉంచి ఆందోళకు దిగారు. బాలుడి మృతికి కారణమైన సిబ్బందిని సస్పెండ్ చేయటంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేతేపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి వరకు మృతదేహంతో ఆందోళన చేశారు. ఫ అంగన్వాడీ విద్యార్థిని బహిర్భూమి కోసం ఆరుబయటికి తీసుకెళ్లిన సిబ్బంది ఫ కేతేపల్లి మండలంలో ఘటనబాధ్యులపై చర్యలు తీసుకుంటాం నల్లగొండ: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సంఘటన అంగన్ వాడీ కేంద్రం బయట జరిగినప్పటికీ సంబంధిత అంగన్వాడీ టీచర్, ఆయాలపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. -
దుందుభి వాగులో చిక్కుకున్న గొర్రెలకాపరులు
డిండి: దుందుభి వాగు మధ్యలో చిక్కుకున్న గొర్రెల కాపరులకు సోమవారం రెవెన్యూ అధికారులు డ్రోన్ సహాయంతో ఆహారం, నిత్యావసర సరుకులను చేరవేశారు. డిండి మండలం గోనబోయనపల్లి గ్రామానికి చెందిన బద్దెల వెంకటయ్య, సిగ వెంకటయ్య, రగడంపల్లి పెద్దయ్యకు దాదాపు 300 వరకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలను మేపేందుకు సదరు గొర్రెల కాపరులు పది రోజలు క్రితం గ్రామ సమీపంలో దుందుభి వాగు మధ్యలో ఉన్న బీడు భూముల్లోకి తోలుకెళ్లారు. కాగా మోంథా తుపాన్ కారణంగా ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు అలుగు పోసింది. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న దుందుభి వాగు వరద ప్రవాహం అధికమైంది. దీంతో గొర్రెల కాపరులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. అయితే తమ వెంట తెచ్చుకున్న ఆహార సరుకులు అయిపోవడంతో గ్రామానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారు జామున నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ శివారులోని వాగు వెంట వ్యవసాయం చేస్తున్న ఓ రైతు తాడు సహాయంతో దుందుభి వాగు దాటుకుంటూ గొర్రెల కాపరుల వద్దకు చేరాడు. రైతు వద్ద ఉన్న ఫోన్తో తమకు ఆహార సరుకులు కావాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎస్ఐ.బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వాగు మధ్యలోంచి సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తామని గొర్రెల కాపరులకు తెలియజేశారు. గొర్రెలు తీసుకురావడం ఇబ్బందికరంగా ఉందని, గొర్రెలను విడిచి తాము రాలేమని గొర్రెల కాపరులు తేల్చి చెప్పారు. దీంతో వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అధికారులు డ్రోన్ ద్వారా పంపించారు. వాగు మధ్యలో చిక్కుకున్నందున ఆహారం, ఇతర సరుకులను పంపించటం పట్ల గొర్రెల కాపరులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల వెంట స్థానికుడు బద్దెల శ్రీనువాస్ ఉన్నాడు. ఫ డ్రోన్ సాయంతో ఆహారం, సరుకులు పంపిన అధికారులు -
భువనగిరి–చిటా్యల రోడ్డు యమ డేంజర్!
అధికంగా మూలమలుపులు.. తరచూ ప్రమాదాలుసాక్షి యాదాద్రి: భువనగిరి – చిట్యాల రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఉత్తర – దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా ఉన్న ఈ మార్గంలో నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరుకు రోడ్డు, కిలో మీటరుకు ఒక మలుపు, భద్రతాచర్యల లేమితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా.. రహదారి విస్తరణకు నోచడం లేదు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడో, ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో భువనగిరి–చిట్యాల రహదారిపై భద్రత చర్చనీయాంశమైంది. రోజూ 10వేలకు పైగా వాహనాల రాకపోకలు ఉత్తర– దక్షిణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరుకు రవాణాకు ప్రధాన మార్గం భువనగిరి – చిట్యాల రోడ్డు. దీనికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి వివిధ రకాల వాహనాలు, బస్సులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. 43 కిలో మీటర్ల ఈ మార్గంలో రోజూ 12 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రాణాలు తీస్తున్న మలుపులు చిట్యాల నుంచి రామన్నపేట వరకు 10 చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇందులో అతి ప్రమాదకరమైనది ఇంద్రపాలనగరం నుంచి నిధానపల్లి గ్రామానికి వెళ్లే చౌరస్తా ఒకటి. 2015 అక్టోబర్ 7న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. చిట్యాల సమీపంలోని ఐడీఎల్ ప్యాక్టరీ వద్ద రెండు మలుపులు, రామన్నపేట డిగ్రీ కళాశాల వద్ద, రామన్నపేట హరిహరపుత్ర రైస్ మిల్ వద్ద, ఇంద్రపాలనగరం చెరువు, రామన్నపేట కుంట, ఇంద్రపాలనగరం అయ్యప్ప దేవాలయం, గుర్జాలబావి, వలిగొండ మండలం నాగారం–మూసీ బ్రిడ్జి, వలిగొండ జూనియర్ కళాశాల, అక్కంపల్లి అంజనేయస్వామి టెంపుల్, భువనగిరి మండలం నందనం పోచమ్మగుడి, నందనం–అనాజిపురం హన్మాన్గుడి వద్ద, నాగిరెడ్డి రైల్వే స్టేషన్ ముందు, మాందాపురం దుర్గమ్మగుడి టెంపుల్, అనాజిపురం వద్ద మూల మలుపులు అతి ప్రమాదకరంగా ఉన్నాయి. అలాగే భువనగిరి మండలం వడపర్తి, తిర్మలాపురం, సంగ్యాతండా వద్ద ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న మలుపులు 30 వరకు ఉంటాయి. జాతీయ రహదారిగా గుర్తింపు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా గజ్వేల్ వరకు రోడ్డు ఉంది. జిల్లాలోని ఎన్హెచ్–65 నుంచి ఎన్హెచ్– 163 మీదుగా బెంగళూరు నుంచి నాగ్పూర్ జాతీయ రహదారి వెళ్లే నేషనల్ పర్మిట్ వాహనాల ప్రయాణానికి అనుసంధానంగా ఉంటుంది. ఇందులో గజ్వేల్నుంచి తుర్కపల్లి, భువనగిరి మీదుగా నాగిరెడ్డిపల్లి, చౌటుప్పల్ వరకు జాతీయ రహదారి 161 ఏఏగా నామకరణం చేసి వదిలేశారు. నాగిరెడ్డిపల్లి నుంచి వలిగొండ, రామన్నపేట చిట్యాలవరకు రాష్ట్ర రహదారిగానే ఉంది. ఈ మార్గంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, డిల్లీ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఆంధ్రదప్రదేశ్.. ఇలా దేశ నలుమూలలకు సరుకు రవాణాకు చెందిన భారీ వాహనాలు నిత్యం ప్రయాణిస్తాయి. అయితే ఇదే మార్గంలో స్థానిక ప్రయాణికులు ఆర్టీసీ బస్లు, కార్లు,ఆటోలు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణిస్తారు. పలుమార్లు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో 2015 అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. 18 మంది తీవ్రగాయాల పాలయ్యారు. నార్కట్పల్లి డిపోకు చెందిన బస్ భువనగిరి నుంచి మధ్యాహ్నం 2.45గంటలకు 40మంది ప్రయాణికులతో నల్లగొండకు బయలు దేరింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దాటిన తరువాత నిధానపల్లికి వెళ్లే దారి వద్ద ఉన్న మూలమలుపునకు రాగానే రామన్నపేట నుంచి భువనగిరి వైపు అతివేగంగా పుస్తకాల లోడుతో వచ్చిన లారీ బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలు ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ ఇంద్రపాలనగరం వద్ద పదేళ్ల క్రితం జరిగిన ఘటనలో పది మంది మృతి, ఫ చేవెళ్ల ఘటన నేపథ్యంలో రోడ్డు భద్రతపై చర్చ భువనగిరి – చిట్యాల వరకు హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 43 కిలో మీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. భువనగిరి నాగిరెడ్డిపల్లి, టేకులసోమారం, వలిగొండ, నాగారం, తుమ్మలగూడెం, బోగారం, రామన్నపేట, చిట్యాల వరకు రోడ్డును అభివృద్ధి చేస్తారు. రోడ్ల వెడల్పు, మధ్యలో డివైడర్లు, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, జంక్షన్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న జంక్షన్లను వెడల్పు చేస్తారు. -
సాగర్కు తగ్గిన వరద
పెద్దవూర: ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్గేట్లను పూర్తిగా మూసి వేశారు. జలాశయం నీటిమట్టం సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు 589.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీ) కాగా ప్రస్తుతం 589.40 అడుగుల(310.2522 టీఎంసీ)లుగా ఉంది. జలాశయం నుంచి కుడి కాల్వకు 8023 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 31424 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 40047 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 31424 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏడవ యూనిట్లో వందరోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు నాగార్జునసాగర్ జెన్కో చీఫ్ ఇంజనీర్(సీఈ) మంగేష్కుమార్ తెలిపారు. సోమవారం నాగార్జునసాగర్ జెన్కో ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ జలాశయానికి నీటి రాక ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏడవ నంబర్ యూనిట్లో ఎలాంటి అంతరాయం లేకుండా సోమవారం వరకు విద్యుదుత్పత్తి కొనసాగించినట్లు తెలిపారు. ఈ వంద రోజుల్లో ఈ యూనిట్ ద్వారా 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్కో ఎస్ఈలు రఘురాం, శ్రీనివాస్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ క్రస్ట్గేట్లను మూసివేసిన అధికారులు -
అంతా ఇష్టారాజ్యం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ పైన కొబ్బరికాయల వ్యాపారులు నిలువునా దోచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు కొబ్బరికాయ కొనేందుకు వెళ్తే.. స్వామివారికి తులసి మాల సమర్పించటం ఎంతో శ్రేష్టమంటూ సెంటిమెంట్ మాటలు చెప్పి కొబ్బరికాయతో పాటు తులసి మాలను కూడా వ్యాపారులు కొనిపిస్తూ కొత్త దందాకు తెర తీశారు. ఆదివారం రూ.50కి అమ్మాల్సిన కొబ్బరికాయ రూ.100కు అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో భక్తులు వీడియోలు తీసి వైరల్ చేశారు. యాదగిరి కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్లో, ప్రధాన బుకింగ్ కౌంటర్ సమీపంలో కొబ్బరికాయల దుకాణాలు నడిపిస్తున్నారు. ఒక్క కొబ్బరికాయ రూ.50కే విక్రయించాలని దేవస్థానం అధికారులు సూచించినప్పటికీ వ్యాపారులు మాత్రం కొబ్బరికాయతో పాటు తులసీ మాల ఇస్తున్నామని చెప్పి ఒక్కో కొబ్బరికాయను రూ.100కు విక్రయిస్తున్నారు. గతంలో రెండు కొబ్బరికాయలు, చిన్న తులసి మాల కలిపి రూ.100కు విక్రయించేవారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండపైన ఇన్చార్జి ఈఓ, డిప్యూటీ ఈఓ లేకపోవడంతో పాటు ఇతర అధికారుల పర్యవేక్షణ లేక వ్యాపారులు భక్తుల వద్ద అధిక ధరకు కొబ్బరికాయలు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో నోటీసులు ఇచ్చినా..యాదగిరి కొండపై కొబ్బరికాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని గతంలో సైతం విమర్శలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు దుకాణాల వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. దేవస్థానం నిర్ణయించిన రూ.50కే కొబ్బరికాయలు అమ్మాలని వ్యాపారులకు సూచించారు. అప్పట్లో దుకాణదారులు రూ.50తో కూడిన స్టిక్కర్లు అక్కడ వేసుకున్నారు. ఆ తర్వాత ఈఓ మారడం, ఇన్చార్జి ఈఓలు రావడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇప్పటికై నా ఆలయాధికారులు పర్యవేక్షించి కొబ్బరికాయలు తక్కువ ధరలకు అమ్మేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. యాదగిరి కొండపై భక్తుల నిలువు దోపిడి ఒక్క కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్న దుకాణదారులుయాదగిరి కొండ పైన వ్యాపారస్తులు ఒక్కో కొబ్బరికాయను రూ.50కే భక్తులకు అమ్మాలి. ఇది దేవస్థానం నిర్ణయించిన ధర. రూ.100కు ఒక్క కొబ్బరికాయ అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధిక ధరలకు కొబ్బరికాయలు అమ్ముతున్న వ్యాపారులను పిలిచి మాట్లాడాం. తులసీ మాల, పూలు, కొబ్బరికాయ కలిపి రూ.100కు అమ్ముతున్నామని వ్యాపారస్తులు మా దృష్టికి తీసుకొచ్చారు. కానీ దేవస్థానం నిర్ణయించిన ధర రూ.50కే విక్రయించాలని లేదంటే దుకాణాలు మూసివేస్తామని హెచ్చరించాం – జి. రఘు, ఏఈఓ, యాదగిరి క్షేత్రం -
కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరు మృతి
నకిరేకల్: నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో 365వ నంబర్ జాతీయ రహదారిపై ఆది వారం ఉదయం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిలా కేంద్రంలోని గొర్రెకుంటకు చెందిన పొనుగంటి కిరణ్కూమార్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్బీఐ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం కిరణ్కుమార్ తన భార్య సంధ్యారాణి(36)తో కలిసి కారులో మిర్యాలగూడ నుంచి వరంగల్లోని గొర్రెకుంటకు బయల్దేరాడు. అదేవిధంగా కట్టంగూర్ మండల అయిటిపాముల గ్రామానికి చెందిన వానరాశి మహేందర్(19) ముగ్గు అమ్మేందుకు శాలిగౌరారం మండలం పెర్కకొడారం గ్రామానికి వెళ్లి తిరిగి టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో 365వ నంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో కిరణ్కుమార్ కారు మహేందర్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్తి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కిరణ్కూమార్ భార్య సంధ్యారాణి అక్కడికక్కడే మృతిచెందింది. మహేందర్కు, కిరణ్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మహేందర్ మృతిచెందాడు. మృతుడు మహేందర్ పెద్దనాన్న కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.ధ్వంసమైన కారు ఒకరికి తీవ్ర గాయాలు -
అదృశ్యమై.. కృష్ణా నదిలో శవమై తేలి..
మేళ్లచెరువు: ఇంట్లో నుంచి అదృశ్యమైన వ్యక్తి ఆదివారం కృష్ణా నదిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన మేడతి ఆంజనేయులు(36) గత నెల 30న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మఠంపల్లి మండలం మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఆంజనేయులు బైక్, చెప్పులను పోలీసులు గుర్తించారు. కాగా ఆదివారం మేళ్లచెరువు మండలం పాత కిష్టాపురం వద్ద కృష్ణా నదిలో వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆంజనేయులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా.. వారు వచ్చి చూసి మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. ఈ మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్రెడ్డి తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
పెన్పహాడ్ : ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. దూపహాడ్ గ్రామానికి చెందిన బిట్టు వీరభద్రయ్య చిన్న కుమారుడు బిట్టు అభివర్మ(24) గ్రామంలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆది వారం ఉదయం గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ వైరు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాపేట: పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేశ్(45)కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్ పెయింటింగ్, కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తన అత్తగారి ఊరైన చల్లూరుకు వెళ్లొచ్చిన వెంకటేశ్ ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి తల్లి గమనించి గ్రామస్తులకు విషయం చెప్పడంతో వారు అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. బెయిల్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్సూర్యాపేటటౌన్: బెయిల్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 22న సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్ రోడ్డులో గల తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని, మహిళను రూరల్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వారికి కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన వంగూరి సురేష్ బెయిల్ ఇప్పిస్తానని రూ.70వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. ఇంకా రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సురేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సురేష్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. జూదరుల అరెస్ట్ సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలం వెంకబావితండా పరిధి లోని రాచకొండ గుట్టల్లో పేకాట స్థావరంపై ఆదివారం భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నారు. సుమారు 15మంది పేకాట ఆడుతుండగా.. నిర్వాహకుడు ప్రసాద్తో పాటు మరో 8మంది పారిపోయినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి ఆరు కార్లు, 7 సెల్ఫోన్లు, రూ.37,010 నగదు, స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు బంద్ భువనగిరి: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, నర్సింగ్ కళాశాలలు బంద్లో పాల్గొంటాయని పేర్కొన్నారు. కళాశాలల బంద్కు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
బీబీనగర్, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లోని టెలిఫోన్ కాలనీలో నివాసముంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలిద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు యువకులకు గాయాలు బీబీనగర్లో ఘటన -
కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి..
– ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతినడిగూడెం: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. నడిగూడెం ఎస్ఐ గంధమళ్ల అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన తంగెళ్ల సునీత, వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె ఈశ్వరమ్మ(24)ను కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన దాచేపల్లి గోపికి ఇచ్చి 2017లో పెళ్లి చేశారు. ఈశ్వరమ్మపై ఆమె భర్త గోపి అనుమానం పెంచుకున్నాడు. ఆరు నెలల కింద ఈశ్వరమ్మను భర్త గోపి, అత్త సీతారామమ్మ, మామ వీరబాబు కొట్టారు. దీంతో ఈశ్వరమ్మ తన తల్లి సునీతకు విషయం చెప్పింది. దీంతో సునీత తన తల్లిగారి ఊరైన నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి ఈశ్వరమ్మను తీసుకొచ్చింది. అప్పటి నుంచి తన కుటుంబంలోని కలహాల గురించి చర్చించడంలేదని మనస్తాపానికి గురై ఈశ్వరమ్మ గత నెల 26న కూల్డ్రింక్లో పురుగు మందు కలుపుకుని తాగింది. అనంతరం తన సమీప బంధువు రమాదేవి ఫోన్ చేసి తాను పురుగుల మందు తాగినట్లు చెప్పింది. వెంటనే ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం కోదాడకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి తల్లి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగిసిన రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు
చౌటుప్పల్ : 10వ అంతర్ జిల్లా రోడ్ సైక్లింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు ఆదివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ముగిశాయి. అండర్–14, అండర్–16, అండర్–19 విభాగాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల క్రీడాకారులు సంయుక్తంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని అంబిటస్ స్కూల్, జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. సైక్లింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఒలంపిక్ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను తిలకించారు. అనంతరం అంబిటస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబిటస్ స్కూల్ చైర్మన్ కె. జైపాల్రెడ్డి, డైరెక్టర్ పిసాటి శ్రీకాంత్రెడ్డి, జేబీ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేందర్, సైక్లింగ్ సంఘం ప్రతినిధులు విజయకాంత్, దత్తాత్రేయ, రమేష్, పాష, మనోహర్కుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లల మర్రి గ్రామంలో ఓ ఇంట్లోకి ఆదివారం కారు దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పిల్లల మర్రి శివాలయాలకు ఆదివారం కారులో వచ్చిన భక్తులు బొడ్రాయి దగ్గర ఓ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు ప్రతిరోజు ఇంటి ముందు కూర్చునేదని అదృష్టశాత్తు ఆదివారం అక్కడ కూర్చోలేదని స్థానికులు పేర్కొన్నారు. క్లచ్ బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెప్పాడు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నం
చౌటుప్పల్ : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్మిల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లడ్డూ ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లిన ఇద్దరు నిందితులు బాలిక రోదనలు విని అప్రమత్తమైన తల్లి పక్కింటి బాలిక సమాచారంతో నిందితుల ఇంట్లో చిన్నారి గుర్తింపు -
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన వాట్సాప్ చానల్ అన్నదాతలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పంటల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు మంచి దిగుబడులు కూడా పొందవచ్చు. – శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ ఫ అధికారిక చానల్ ప్రారంభించిన వ్యవసాయ శాఖ ఫ దీని ద్వారా అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు దేవరకొండ: పంటల సాగులో తరుచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించ లేక నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచారాన్ని అందించేందుకు ఈ ఏడాది ఆగస్టు 8న ప్రత్యేక అధికారిక వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. రైతు వేదికల ద్వారా ఇప్పటికే సమాచార కల్పన ప్రారంభమైంది. త్వరలో వాట్సాప్ చానల్పై ప్రతి గ్రామంలో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు. చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు ఫ తెగుళ్ల గుర్తింపు, నివారణకు సరైన సలహాలు ఫ రోగ నిరోధక వంగడాలు, గుణాత్మక విత్తనాల ఎంపికలో మార్గదర్శకత్వం ఫ పంటల రక్షణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సూచనలు ఫ వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు ఫ రాయితీ విత్తనాల లభ్యత, మౌలిక వసతులపై తాజా సమాచారం నిపుణుల సలహాలు రైతులు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్కు పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్లో చేరేందుకు ఆయా గ్రామ రైతులు తమ క్లస్టర్ పరిధిలోని అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారి (ఏఈవో)ను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి సదరు రైతు తమ మొబైల్ నంబర్ అందిస్తే వారు వాట్సాప్ చానల్లో చేరుస్తారు. -
సార్.. మీరు వెళ్లొద్దు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ● హెచ్ఎం ఉద్యోగ విరమణ పొంది వెళ్లిపోతుండడంతో రోదించిన విద్యార్థులు -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన బానోతు మహేందర్(24) సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలోకి వెళ్లి బ్లాంకెట్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల అధ్యాపకులకు చెప్పగా, వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మహేందర్ తండ్రి చెన్వేశ్వర్రావు అక్కడకు చేరుకున్నారు. మహేందర్ బాగానే చదువుకునేవాడని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వానందరాజు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేందర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఫ హాస్టల్ గదిలో ఉరివేసుకున్న మహేందర్ ఫ సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో ఘటన -
మనోవిజ్ఞాన నిపుణుల అవసరం ఎంతో ఉంది
నల్లగొండ టూటౌన్: మనుషులు అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులకు గురవుతున్న సందర్భంలో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సైకాలజీ విభాగం నూతన ల్యాబొరేటరీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలతోపాటు, వృద్ధుల్లో పెరుగుతున్న కుంగుబాటు, నిరుత్సాహం, పిల్లలకు మొబైల్ వినియోగం లాంటి అలవాట్లు కాకుండా ఉండటానికి మనో వైజ్ఞానికులు దిక్సూచిగా సహాయకారిగా నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో అలువాల రవి, అరుణప్రియ, అంజిరెడ్డి, ఆకుల రవి, సైకాలజీ విభాగం అధ్యాపకులు అరవింద్, తన్వీర్, నారాయణరెడ్డి, చక్రి పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
ఫ మహాశివుడికిలక్ష్మీ అలంకరణ
చెర్వుగట్టు ఇన్చార్జి ఈఓగా మోహన్బాబునార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇన్చార్జి ఈఓగా మోహన్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ఆంథోల్ మైసమ్మ, వేములకొండ ఆలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జి ఈఓగా పనిచేసిన నవీన్కుమార్ను చెర్వుగట్టు బాధ్యతల నుంచి తప్పిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని పేర్కొన్నారు. ఫుట్బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం ఎస్జీఎఫ్ అండర్–14, 17 ఫుట్బాల్ బాల, బాలికల ఫుట్బాల్ సెలక్షన్ పోటీలను ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ అక్బర్ అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు, యుగందర్రెడ్డి, గఫార్, రేణుక, భావన, మాణిక్యం, అలిమ్, కళావతి, కవిత, నుస్రత్ సుల్తానా పాల్గొన్నారు. జీఎన్ఎం శిక్షణకు దరఖాస్తులునల్లగొండ టౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరి (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డీఎంహెచ్ఓ కార్యాలయ ప్రిన్సిపాల్ను సంప్రదించాలని సూచించారు. ఎన్జీ కళాశాలకు ద్వితీయ బహుమతినల్లగొండ : జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన పోటీల్లో ఎన్జీ కళాశాల ఫిజిక్స్ విభాగం విద్యార్థులు అగ్రికల్చర్ వీడర్ యంత్రాన్ని రూపొందించి ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ద్వితీయ బహుమతి సాధించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ విద్యార్థుల తరఫున బహుమతి అందుకున్నారు. ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను శుక్రవారం ఆయన అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, వెంకటేశం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రవిప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అండ చూపరు.. ఆదుకోరు
చందంపేట : చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురైన నక్కలగండితండా వాసుల్లో ఎవరిని కదిలించిన కన్నీటి వరద పారుతోంది. 2008లో ప్రారంభమైన నక్కలగండి ప్రాజెక్టు పనులు నేటికీ నత్తనడకన సాగుతుండడంతో.. ఇక్కడ ముంపునకు గురవుతున్న గిరిజనులు తండాలోనే ఉంటూ భూములు సాగు చేసుకుంటున్నారు. మంగళ, బుధ వారాల్లో కురిసిన వర్షాల వల్ల వారు సాగు చేసిన పంటలు నీటి పాలయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రెవెన్యూ అధికారులు తెల్దేవర్పల్లిలోని ఆశ్రమ పాఠశాలలో వారికి తాత్కాలిక పునరావాసం కల్పించారు. ఇళ్లస్థలాలు ఇవ్వలే.. నక్కలగండి నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు వారికి అక్కడ ప్లాట్లను ఇవ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో వారు నక్కలగండితండాలో ఉంటున్నారు. చింతపల్లి వద్ద ప్లాట్లను కేటాయిస్తే.. కూలీనాలి చేసుకొని బతుకుతామని, ఇక్కడ పంట పొలాలు నీటిలో మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఫ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ ఫ దిక్కుతోచని స్థితిలో నక్కలగండి నిర్వాసిత కుటుంబాలు -
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని తెలిపారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల, అసైన్డ్ భూముల ఫిర్యాదులను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థలు ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు వై.అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆయాసంతో బాధపడుతూ ఆస్పత్రిలో మహిళ మృతి
మిర్యాలగూడ అర్బన్: తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం శుక్రవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. మిర్యాలగూడ మండలంలోని ముల్కలకాల్వ గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటమ్మ(35) తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆమె కుమారుడు శుక్రవారం ఉదయం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఓపీ నమోదు చేయించుకుని ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. అయితే ఆయాసం ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతోనే మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం అందించలేదని పేర్కొన్నారు. సకాలంలో ఆక్సిజన్ అందించి వైద్యం చేస్తే మా అమ్మ బతికేదని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సీపీఐ డివిజన్ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందించడంతో నిర్లక్ష్యం వహించిన వైద్యులను తక్షణమే సస్పండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆస్పత్రి ఎదుట రోగి బంధువులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా రోగి ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను పరీక్షించి వైద్యం అందించే లోపే మృతి చెందిందని తెలిపారు. ఫ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
దేవలమ్మనాగారంలో హైనా సంచారం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామ పరిసరాల్లో హైనా సంచారం హల్చల్ చేసింది. గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని కొంతమంది గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని మొదటగా పాఠశాల విద్యార్థులు చూసి చెప్పడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఓ గొర్రెల కాపరి అది హైనా అని అటవీశాఖ సిబ్బందికి, పోలీసులకు చెప్పాడు. చిరుతపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అధికారులు తిరిగి వచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఫ చిరుతపులి అనుకొని భయాందోళన చెందిన గ్రామస్తులు -
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం విశేషంగా జరిపించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆండాళ్ అమ్మవారిని అలకరించిన తరువాత ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు మంగళ హారతులతో స్వాగతం ఫలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం, ఇతర పూజలు నిర్వహించారు. శివాలయంలో కార్తీక దీపారాధనలు యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదగిరి కొండపై శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించారు. మహాశివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఉప ఆలయం ఎదుట భక్తులు శ్రీ ఆకారంలో దీపాలు వెలిగించారు. -
5.98 కోట్ల చేప పిల్లలు
జిల్లాకు 5.98 కోట్ల ఉచిత చేప పిల్లలు మంజూరయ్యాయి. ఆదివారం నకిరేకల్లోని పెద్ద చెరువులో చేప పిల్లలను పోస్తాం. జిల్లాలో నిండిన అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేపపిల్లలను పోయడం ద్వారా మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. నాణ్యమైన పిల్లలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రాజారాం, మత్స్యశాఖ జిల్లా అధికారి నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి జిల్లా యంత్రాంగం ముహూర్తం ఫిక్స్ చేసింది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్య శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈనెల 2వ తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నకిరేకల్లో ఎమ్మెల్యే వేములు వీరేశం చెరువులో చేపపిల్లలు పోయనున్నారు. ఇందుకోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగానే జలకళ జిల్లా వ్యాప్తంగా డిపార్ట్మెంట్ చెరువులు, రిజర్వాయర్లు, గ్రామ పంచాయితీ చెరువులు, కుంటలు కలిపి మొత్తం 1160కి పైగానే ఉన్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, రిజర్వాయర్లకు వరద పోటెత్తడంతో ఆగస్టు నెలాఖరులోనే అన్ని చెరువులు, కుంటలు నిండాయి. కానీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయింది.జిల్లాలోని అన్ని చెరువులు, జలాశయాల్లో మత్స్యకార సొసైటీల ద్వారా చేప పిల్లలను వదలనున్నారు. 260 సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా 260 వరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, అందులో 28 వేల మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీల్లో సభ్యత్వం ఉన్న వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 55 వేల నుంచి 60 వేల మంది వరకు ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది. నిండిన అన్ని చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. జిల్లాలోనే అతి పెద్ద రిజర్వాయర్లు అయిన నాగార్జునసాగర్, డిండి, పెద్దదేవులపల్లి, మూసీ, అయిటిపాముల, కనగల్ జలాశయాల్లో కూడా ఉచిత చేప పిల్లలను వదలనున్నారు. ఆలస్యంగా మొదలవుతున్న ప్రక్రియ.. ఈ ఏడాది ముందుగానే వర్షాలతో కురిసి రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోలేదు. ఇక, టెండర్ల ప్రక్రియలో గుత్తేదారులు మొదటిసారి పాల్గొనకపోవడం కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమయ్యింది. వరుణుడు ముందుగానే కరుణించిగా ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చెరువులు, కుంటల్లో మార్చి వరకు మాత్రమే నీరు ఉంటుంది. ఆ తరువాత నీరు తగ్గుతుందని అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే.. ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం పాటు నీటిలో ఉంటేనే చేప పిల్లలు తగిన స్థాయిలో బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే చెరువుల్లో నీరు తగ్గితే పెద్దగా ప్రయోజనం ఉండదు.చెరువుల్లో పోసేందుకు ప్రణాళిక ఫ రేపు నకిరేకల్ పెద్ద చెరువులో చేపపిల్లలు వదలనున్న ఎమ్మెల్యే వీరేశం ఫ నెల రోజుల్లోగా అన్ని చెరువుల్లోకి చేరనున్న చేపపిల్లలు -
రైతుల గోస పట్టని పాలకులకు బుద్ధి చెప్పాలి
మిర్యాలగూడ : వర్షాలతో పంట నష్టపోయి ఆందోళనలో ఉన్న రైతుల గోస పట్టకుండా ఎన్నిక ప్రచారం చేస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నల్లగొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా పంట నీటిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో రైతులను ఓదార్చి అండగా నిలవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం సరైంది కాదన్నారు. పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, వినోద్నాయక్, పోలెబోయిన వరలక్ష్మి, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్రెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, అరుణ, దయానంద్, కోటిరెడ్డి, వెంకన్న, కృష్ణయ్య, రామకృష్ణ, సూర్యం, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
ధాన్యం ఎలా ఉన్నా కొనుగోలు చేయాలి
చిట్యాల, నకిరేకల్ : అకాల వర్షంతో ధాన్యం తడిసినందున.. ఏ విధంగా ఉన్నా వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ధాన్యం, పంటల పరిశీలన భాగంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన చిట్యాల, నకిరేకల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు 20 రోజులుగా కేంద్రాలకు ధాన్యం తెచ్చి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధాన్యం తూకంలో తేడాల విషయంలో రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మకై ఉంటే వారిపై చర్యలు తీసుకుని జైలు పంపించాలన్నారు. తేమశాతం ఎలా ఉన్నా తూకంలో మోసాలు జరగకుండా దిగుమతులు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర నేతలు గంగడి మనోహర్రెడ్డి, చికిలంమెట్ల అశోక్, పిల్లి రామరాజ్యాదవ్, వీరెళ్లి చంద్రశేఖర్, శ్యాంసుందర్, నకిరేకంటి మొగిలయ్య, గుడుగుంట్ల సాయన్న, మండల వెంకన్న, గర్రె మరళి మోహన్, బుడిగే సైదులు,యానాల శ్రీనివాస్రెడ్డి, కొండెటి శ్రీను, మైల నర్సింహ, పీక వెంకన్న, నర్సింహగౌడ్, గుండాల నరేష్గౌడ్, పాపని వాసుదేవ్, అంశల అనిల్కుమార్, కన్నేబోయిన మహాలింగం ఉన్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
డీఆర్డీఎల్ ల్యాబ్ డైరెక్టర్గా రాజాపేట వాసి
రాజాపేట : రాజాపేట మండల కేంద్రానికి చెందిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త అంకతి రాజు డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా శుక్రవారం నియామకమయ్యారు. ఆయన బెంగుళూరులో 1991 నుంచి 2002 వరకు 11 సంవత్సరాలపాటు డీఆర్డీఎల్లోని గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (జీటీఆర్ఈ)లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2022 వరకు డీఆర్డీఎల్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో లిక్విడ్ ప్రొఫెషన్ డివిజన్లో దీర్ఘశ్రేణి హేర్ టూ హేర్ మిసైల్ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2022లో ఈఆర్డీఈ (అర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్) డైరెక్టర్గా పూణెకు వెళ్లారు. ప్రస్తుతం డీఆర్డీడీఓకు విశిష్ట శాస్త్రవేత్తగా ఉంటూ డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిమోటకొండూర్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని నాంచారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ ఖరీమ్(46) ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు. ఇంటి పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. అతను తన కుటుంబంతో వేరే ఇంట్లో ఉంటున్నాడు. పనులు జరుగుతున్న ఇంటిలో కరెంట్ బల్బ్ వేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ముత్తిరెడ్డిగూడెంలో ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉంది. స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చనభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి ఆలయ అర్చకులు సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, సత్యనారాయణ వ్రతం, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తిప్పర్తి, మాడుగులపల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తిప్పర్తి, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె.. ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు. ఆయా చోట్ల రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తిప్పర్తిలో రైతులు తమ ధాన్యం కాంటా వేసి మూడు రోజులు అయ్యిందని, లారీలను ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యం బస్తాలు మొలకెత్తాయని కలెక్టర్కు వివరించగా వెంటనే స్పందించిన ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపిచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారిపోయిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన రైస్ మిల్లులతో సమన్వయం చేసుకుని ధాన్యం దించుకునేలా చూడాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్, డీఎం గోపికృష్ణ, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొర్రీలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలి మిర్యాలగూడ : ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికి ఎటువంటి కొర్రీలు పెట్టకుండా త్వరగా దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పరిధిలోని రామకృష్ణ రైస్ మిల్లును పరిశీలించి మిల్లర్లతో మాట్లాడారు. వానాకాలం సీజన్లో సన్న ధాన్యంతోపాటు ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వస్తున్నందున మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా త్వరితగతిన దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం స్టోరేజీ విధానాన్ని, డ్రై చేసే విధానాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ను అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని స్టోరేజీ చేస్తున్న విధానాన్ని గోదాముల్లో ఆమె పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు జి.రామశేఖర్, కార్యదర్శి పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, తహసీల్దార్ సురేష్కుమార్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నందనంలో విషాదఛాయలు
భువనగిరి: భువనగిరి మండలంలోని నందనం గ్రామానికి చెందిన రచ్చ కృష్ణవేణి(45) తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణవేణి తండ్రి రవీందర్ ఈ నెల 25న మృతిచెందగా అంత్యక్రియల నిమిత్తం ఇబ్రహీంపట్నం నెర్రపల్లి గ్రామానికి వెళ్లింది. గురువారం పంచదినకర్మ సందర్భంగా తండ్రి అస్థికలను వాడపల్లిలోని కృష్ణానదిలో కలిపేందుకు ఆమె భర్త ప్రభాకర్తో కలిసి వెళ్లింది. సాయంత్రం తిరిగి నెర్రపల్లి గ్రామానికి వచ్చారు. అనంతరం బైక్పై భర్తతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని మజీద్పూర–బాటసింగారం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో అందులో పడిపోయారు. స్థానిక యువకులు గమనించి ప్రభాకర్ను బయటకు తీయగా కృష్ణవేణిని కాపాడేలోపు ఆమె మృతి చెందింది. కృష్ణవేణి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉంది. ఫ తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వాగులో పడి మహిళ మృతి -
పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాం
నాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. జెన్కో లోని విజిలెన్స్ విభాగం వారు ఈనెల 21న నిఘా అవగాహన (విజిలెన్స్ అవేర్నెస్ వీక్) వారోత్సవాలు చేపట్టి నవంబర్ 2వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్లో సెంట్రల్ ఆఫీసులో ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. నైతిక వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తామని, నిజాయితీ, సమగ్రత సంస్కృతిని పెంపొందిస్తామని, సమాజం యొక్క హక్కులు, ప్రయోజనాలను రక్షిస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్కో సీఈ మంగేశ్కుమార్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు. -
ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధం
ఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం యాదగిరిగుట్ట రూరల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అజారుద్దీన్ను మంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన ప్రజాస్వామ్య పరిరక్షణ కన్వీనర్ గుజ్జుల రాంచంద్రారెడ్డి గురువారం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికా రికి వినతి పత్రం అందజేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గాన్ని ప్రలోభ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.


