Nalgonda District News
-
నృసింహుడి సన్నిధిలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపం, మాడ వీధులు, కొండ కింద భక్తులు కిటకిటలాడారు. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 40వేలకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,88,217 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. యాదగిరీశుడిని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ పీఎస్సీ చైర్పర్సన్లక్ష్మీనరసింహస్వామిని ఛత్తీగఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ) చైర్పర్సన్ రీటా శాండిల్య శనివారం దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. రమణేశ్వరంలో నమక మంత్రాల ప్రవచనాలుభువనగిరి: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠంలో శనివారం సిద్ధ గురు రమణానంద మహర్షి 66 నమక మంత్రాలపై ప్రవచించారు. అనంతరం మహాపీఠం ఆవరణంలో రుద్ర హవనం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్ ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య
యాదగిరిగుట్ట: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి గంధమల్ల రవి(30) శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్, మృతుడి భార్య నవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గంధమల్ల రవి తన భార్య నవిత, పిల్లలతో కలిసి యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇక్కడకు రాక ముందు రవి సైదాపురం గ్రామంలోనే హోటల్ నిర్వహిస్తుండేవాడు. మద్యానికి బానిసైన రవి గురించి అతడి భార్య నవిత బీర్ల ఐలయ్యకు చెబితే ఆయన తన ఇంట్లోనే సహయకుడిగా పనిచేయాలని, మద్యం తాగడం మానేయాలని సూచించారు. దీంతో యాదగిరిగుట్టలోని ఐలయ్య ఇంట్లో రవి పనిలో చేరి పిల్లలను చదివిస్తున్నాడు. హోం లోన్ కట్టలేక.. అయితే మూడేళ్ల క్రితం రవి ప్రైవేట్ బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు రవి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సైదాపురం గ్రామంలో సైతం రవి పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో రవి మళ్లీ మద్యం తాగడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం రవి ఇంటికి బ్యాంక్ అధికారులు ఈఎంఐ కట్టడం లేదని నోటీసులు అంటించి వెళ్లారు. ఫోన్ చేస్తే లిఫ్టు చేస్తలేడని.. శుక్రవారం రాత్రి 9గంటలకు రవికి భార్య నవిత ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రవి తల్లికి నవిత ఫోన్ చేయగా.. రవి సైదాపురం వచ్చి వెంటనే యాదగిరిగుట్టకు వచ్చాడని ఆమె తెలిపింది. దీంతో మరోసారి ఫోన్ చేసినా రవి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి నవిత బీర్ల ఐలయ్య ఇంటి పైన పెంట్ హౌజ్లోకి వెళ్లి చూడగా.. రవి శాలువాతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె గన్మెన్లు, బీర్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చింది. వారు వెంటనే రవిని భువనగిరి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే రవి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవి భౌతికకాయానికి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బీర్ల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. పోస్టుమార్టం అనంతరం రవి మృతదేహాన్ని సొంత గ్రామమైన సైదాపురానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రవి అంత్యక్రియలో బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు.. మద్యానికి బానిస కావడంతో పాటు అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు రవి భార్య నవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు యాదరగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. రవి భార్యతో పాటు కుటుంబ సభ్యులు వాగ్మూలం సైతం నమోదు చేశామని, ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నాల్గో అంతస్తులో ఉరేసుకున్న సహాయకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ఫిర్యాదు -
నడిపించిన నాన్న
●ఆటో నడుపుతూ.. కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తూ.. భువనగిరి : భువనగిరి పట్టణంలోని పహడీనగర్కు చెందిన షేక్ జహంగీర్, నసీం దంపతులకు కుమారుడు అద్నాన్, కుమార్తె ఉన్నారు. తన కొడుకును డాక్టర్ చేయాలని జహంగీర్ సంకల్పించాడు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు భువనగిరి నుంచి చౌటుప్పల్కు వెళ్లి అక్కడ వెల్డింగ్ వర్క్షాపులో పనిచేస్తూ తమ పిల్లలను చదివిస్తూ, కుటుంబాన్ని పొషించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వలిగొండ నుంచి భువనగిరికి బైక్పై వస్తుండగా అనాజీపురం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న అనంతరం ఆటో కొనుగోలు చేసి భువనగిరిలో నడుపుకుంటూ పిల్లల చదువును కొనసాగించాడు. పిల్లల చదువుల కోసం అప్పులు సైతం చేశాడు. ఇంటర్ పూర్తయిన వెంటనే నీట్ ర్యాంకు రాలేదు. రెండేళ్లు కోచింగ్ ఇప్పించాడు. అద్నాన్ 2023లో నీట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం జనగాంలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలోనే బీటెక్ చదువుతోంది. పిల్లల చదువు కోసం రూ.లక్షలు అప్పు చేశాడు. అప్పులను తీర్చేందుకు ఆటో నడుతుతూనే ఉన్నాడు జహంగీర్. కొడుకు కలను నెరవేర్చి చౌటుప్పల్ : చౌటుప్పల్కు చెందిన వీరమళ్ల శ్రీమన్నారాయణ–విజయ దంపతులకు కుమారుడు దయాకర్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉన్నారు. శ్రీమన్నానారాయణకు ఆరుగురు అన్నదమ్ముళ్లు. ఉమ్మడి కుటుంబంలో మొదలైన కష్టాలు వారికి ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తాము అనుభవించిన కష్టాలు తమ బిడ్డలకు రావొద్దన్న ఆలోచనతో ఈ దంపతులు ఎంతో శ్రమించారు. ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు మార్కెటింగ్ చేస్తున్నాడు. దయాకర్ చిన్నతనం నుంచి కోరుకున్న విధంగా డాక్టర్గా తీర్చిదిద్దాడు. తనకు వచ్చిన సంపాదనతో ఉన్నంతలోనే ఖర్చు చేసుకొని కొంత మొత్తాన్ని కుమారుడి ఎదుగుదల కోసం వెచ్చించాడు. అలా వైద్య విద్య పూర్తి చేసుకున్న దయాకర్ చౌటుప్పల్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటూనే స్థానికంగా ఉన్న నాలుగు పరిశ్రమల్లో ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డాక్టర్గా మంచిస్థానంలోనే ఉన్నాడు. ఫ పిల్లల విజయాన్ని తమ గెలుపుగా భావిస్తున్న నాన్నలు ఫ సంతానాన్ని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టేందుకు కృషి ఫ బిడ్డల ఆశలే ఆయువుగా.. వారి గెలుపే లక్ష్యంగా ముందుకు నేడు ఫాదర్స్ డేనాన్న ఎంతో శ్రమించారు మాది పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నన్ను చిన్నతం నుంచి హైదరాబాద్లోనే హాస్టల్ ఉంచి చదివించాడు. డాక్టర్ కావాలన్న నా చిన్ననాటి కోరికను నెరవేర్చేందుకు అమ్మానాన్నలు పడిన కష్టం ఎన్నటికీ మరువలేను. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు పూర్తవ్వగా ప్రస్తుతం ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్నాను. ఇకపై నా తల్లితండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను. – వీరమళ్ల దయాకర్పెద్దవూర: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చినపాక లక్ష్మీనారాయణ–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు రాకేష్, రితీష్ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయాడు. కార్మిక నాయకుడిగా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. దీంతో తన కుమారులనైనా ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిన్నప్పటినుంచే చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించేవాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు.. ఆ అన్నదమ్ములు. గత విద్యాసంవత్సరంలో ఇద్దరూ ఒకేసారి ఎంబీబీఎస్లో సీట్లు సాధించారు. విద్యాభ్యాసాన్ని అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీట్లు సాధించి తమ తండ్రికి బహుమతిగా ఇచ్చారు. చినపాక రాకేష్ ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల మహేశ్వరంలో, రెండో కుమారుడు చినపాక రితీష్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కుత్బుల్లాపూర్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వైద్యం అంటే వ్యాపారంగా మారిన నేపథ్యంలో మంచి డాక్టర్లుగా తయారై ప్రజలకు సేవ చేస్తామని వారు పేర్కొంటున్నారు. ముగ్గురు పిల్లలను డాక్టర్లు చేసిన నాన్న.. మిర్యాలగూడ : పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందని ఎస్కె.సుబాని తొలుత ప్రైవేట్ టీచర్గా పని చేశారు. తర్వాత కలెక్టరేట్లో ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించారు. నిబద్ధతతో పని చేసి పలుమార్లు ఉత్తమ అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు తమ నలుగురు పిల్లలను డాక్టర్లను చేయాలన్న లక్ష్యంతో వారిని ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కూతురు ప్రభుత్వ డాక్టర్లుగా కొనసాగుతుండగా మరో కుమారుడు ఎఫ్సీఐలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య మహమూబాబేగంతో కలిసి ఎస్కె.సుబాని పిల్లలను సమాజంలో ఆదర్శంగా నిలిపారు. నాన్న ప్రోత్సాహంతోనే..మర్రిగూడ : మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్యాదవ్ ఆండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పదో తరగతి పూర్తి చేసిన శ్రీనివాస్ వ్యవసాయం చేసుకుంటూ.. లారీ డ్రైవర్గా పనిచేశాడు. ప్రస్తుతం మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు. నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె అయిన నక్క సంధ్య బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. రెండవ కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం మెట్రో పాలిటిన్ జలమండలి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కుమార్తె ప్రియాంక డిగ్రీ పూర్తి చేసి రాచకొండ కమిషనరేట్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. కుమారుడు సాయితేజ పెండెకంటి లా 4వ సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన స్వాతి, ప్రియాంక మాట్లాడుతూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించామని తెలిపారు. తల్లి లేని లోటు తెలియనీయకుండా.. మోత్కూరు: భార్య చనిపోయినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా తన పిల్లలకు తల్లి లేని లోటు తెలియనీయకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు మోత్కూరులోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన కురుమిళ్ల రమేష్. రమేష్కు మంజులతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీకళ, కుమారులు దేవేందర్, కరుణాకర్ ఉన్నారు. మంజుల అనారోగ్యంతో 18ఏళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు చిన్న వయస్సులోనే ఉండగానే భార్య చనిపోవడంతో రమేష్ తన బాధను దిగమింగుకుంటూ మేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు శ్రీకళ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. పెద్ద కుమారుడు దేవేందర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు కరుణాకర్ డీఎంఎల్టీ కోర్సు చదువుతున్నాడు. తన పిల్లలకు తల్లి లేని లోటును తీర్చడంతో పాటు వారిని బాగా చదివించి ప్రయోజకులుగా చేస్తున్న రమేష్ను పలువురు అభినందిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ వైద్య విద్య -
విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
● సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులునాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీలో గల జెన్కో కార్యాలయం వద్ద శనివారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను విజయపురిటౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీకి చెందిన జస్విత(28) భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం ఆమె కారులో ఒంటరిగా బయల్దేరి మధ్యాహ్నానానికి నాగార్జునసాగర్లోని పైలాన్కాలనీ జెన్కో కార్యాలయం వద్ద గల ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న విషయం తాగి కారులోనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను విషం తాగినట్లు చెప్పింది. హైదరాబాద్లోనే ఉంటున్న జస్విత తండ్రి సూర్య కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు నాగార్జునసాగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి టెక్నాలజీ సహాయంతో జస్విత ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని కారులో అపప్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన పోలీసులకు జస్విత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో సత్తాచాటారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల జాతీయ స్థాయిలో 501 మార్కులు, కె. ఇందు 428, ఎం. అశ్రిత 427, ఎం.శైని 407, అరిబా తబస్సుమ్ 385, మహీన్ 379 మార్కులు సాధించారని కాలేజీ చైర్మన్ చందాకృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు ఎ. నరేందర్బాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు. ‘గౌతమి’ విద్యార్థుల ప్రతిభ నీట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎండీ ఉజేర్కు 519 మార్కులు, పావని 472, యాస్మిన్ 467, పసుపులేటి లేఖన 428, అలీఖాన్ 397, తస్నీమ్ 385, హీబామైరుక్కు 347 మార్కులు పొందారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, రఘుపాల్రెడ్డి, వెంకటరమణారెడ్డి అభినందించారు. అదేవిధంగా జోసా మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో కళాశాలకు చెందిన ఆర్. శ్రీకర్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీటు సాధించాడని, తేజస్వినికి ఎన్ఐటీ కాంచిపురంలో ఈసీఈ, ఎం. శివాజీకి ఎన్ఐటీ అగర్తలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్లు పొందినట్లు యాజమాన్యం పేర్కొన్నారు. ‘జాస్రిత’ ప్రభంజనం నల్లగొండ : నీట్లో నల్ల గొండలోని జాస్రిత అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆఫియా సదాఫ్ 429మార్కులు, ఫహాద్ 416, రుమానా మారియ 412, వర్షిత 410, మారియ్ 410, సిరి 403 మార్కులు సాధించారు. ఆర్షియా తబస్సుమ్ 401, పల్లవి 381, అక్షర 380, దానియా 380, ఫరియా మేహవీష్ 377, బృందా 371, అనన్య శరోణ్ 360, రేష్మ 348, దీక్షిత 344, అక్షిత 331 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. -
బైక్లు చోరీ చేస్తున్న బాలుడి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: బైక్లు చోరీ చేస్తున్న బాలుడిని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్టౌన్ సీఐ మోతీరాం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన నందిపాటి తరుణ్ మిర్యాలగూడలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. తన బైక్ను గత నెల 29న రాత్రి హాస్టల్లో పెట్టి నిద్రించాడు. మరుసటిరోజు చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. అటుగా బైక్పై వచ్చిన బాలుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు గతంలోనూ హైదరాబాద్లో, ఏపీలోని పెనుగంచిప్రోలులో బైక్లు చోరీ చేశాడని, ఎస్ఆర్నగర్ పోలీసులు అతడి అరెస్ట్ చేసి నాంపల్లిలోని జువైనల్ కోర్టులో హాజరుపరిచే క్రమంలో కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సీఐ తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
‘జయ’ విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు శనివారం వెలువడిన నీట్ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాలకు చెందిన వి. నీతు 22,360, అవనీష్ 31,548, డి. వంశీ 80,101, జి. రాహుల్ 1,55,808, టి. తరుణ్ 1,61,298వ ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. 13 మంది విద్యార్థుల్లో ఐదుగురు మెడికల్ సీట్లు పొందినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
ఆటోలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలోని కొత్తూరు(బొద్దుగుట్ట)కు చెందిన అందుగుల సైదులు మూడు నెలల క్రితం కొత్త ఆటో కొన్నాడు. తన ఆటోలో దివ్యాంగులకు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాడు. గతంలో పాత ఆటో నడిపే సమయంలో ఓ దివ్యాంగుడు రోడ్డుపై ఎండలో నిలబడగా, అతడిని వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగానని.. దానికి అతడు తన వద్ద డబ్బులు లేవు అని చెప్పడంతో ఎంతో బాధ అనిపించిందని సైదులు పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి దివ్యాంగులజీ తన ఆటోలో వారిని గమ్యస్థానాలకు ఉచితంగానే చేరవేస్తున్నట్లు సైదులు తెలిపాడు. -
21,660 కేసులు పరిష్కారం
రామగిరి(నల్లగొండ): జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గం అన్ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 38 సివిల్, 15,837 క్రిమినలు, 85 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 28 బ్యాంకు కేసులు, 25 సైబర్ క్రైమ్ కేసులు, 80 ట్రాన్స్కో, 5,567 ట్రాఫిక్ చలాన్ కేసులతో కలిపి మొత్తం 21,660 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించామన్నారు. ప్రమాద బీమా కేసుల్లో బాధితులకు రూ.4,75,29,000 నష్టపరిహారం ఇప్పించగా రూ.30,21,000 బ్యాంకు కేసులలో రుణపరిహారం అందజేశారు. సైబర్ క్రైం కేసులో రికవరీ డబ్బులు రూ.2,03,112 అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి పి.పురుషోత్తమ్రావు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన జడ్జి నాగరాజు ఫ 12 ప్రత్యేక బెంచ్లలో లోక్అదాలత్ -
హోటళ్ల యజమానులు నిబంధనలు పాటించాలి
నల్లగొండ: హోటల్స్, దాబాలు, రెస్టారెంట్ల యజమానులు నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దాబా హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో హైవేపై ఉన్న హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. దాబాల వద్ద వాహనదారులు ఆగే సమయంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు హైవేపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. హోటల్స్ వద్ద సరైన పార్కింగ్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని దాబా హోటళ్ల యజమానులను ఆదేశించారు. దాబాల వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాహనదారుల వివరాలు తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్కు అప్పగించాలన్నారు. దాబాలు, రెస్టారెంట్లలో మద్యం, గంజాయి విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్బీ సీఐ రాము, ఎస్ఐ సైదులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలుకట్టంగూర్ : ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ప్రాంతీయ ఉద్యాన అధికారి శ్వేత అన్నారు. శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో చెరుకు లక్ష్మి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ఆయిల్ పామ్ అధిక దిగుబడులు ఇస్తుందని, మార్కెట్ సంబంధం లేకుండా కంపెనీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎకరం ఆయిల్ పామ్ సాగుతో రూ.1.25 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పతంజలి ఫుడ్స్ నల్లగొండ జిల్లా మేనేజర్ నర్రా రవీందర్రెడ్డి, చిట్యాల డివిజన్ అధికారి వినయ్కుమార్, రామదాసు, శీను, ప్రసాద్ ఉన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, స్వామి,అమ్మవార్ల నిత్యకల్యాణం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముఖ మండపంలో బ్రహ్మోత్సవం నిర్వహించారు. -
నడిపించిన నాన్న..
పిల్లలను పక్షి వలే తన రెక్కలతో కాపాడుతూ.. వారి కష్టసుఖాల్లో నేనున్నానంటూ వెన్నుతట్టి నడిపించేది నాన్న. పిల్లల విజయాన్ని తన గెలుపుగా భావించి వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు నాన్న. పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు తాను కొవ్వొత్తిలా కరుగుతాడు నాన్న. ఓర్పుకు మారుపేరు.. మార్పుకు మార్గదర్శి.. నీతికి నిదర్శనం.. మన ప్రగతికి సోపానం నాన్నే. నేడు ఫాదర్స్డే సందర్భంగా ప్రత్యేక కథనాలు 8లో -
కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయాలి
ఫ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పదవుల్లో నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రంలో భాగంగా దేవరకొండ రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని లైన్వాడ కాలనీలో గల కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నాయకురాళ్లు దుబ్బ రూప, నాగమణి, జాన్, సుజాత, రాజ్యలక్ష్మి, సురెడ్డి సరస్వతి పాల్గొన్నారు. -
డ్రైవింగ్ ట్రాక్.. తరలింపు!
కలెక్టరేట్ విస్తరణకు ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్ తొలగించాలని నిర్ణయం దండంపల్లికి మార్చేలా.. ప్రస్తుతం కలెక్టరేట్ వెనుక భాగంలో రూ.33 కోట్లతో కలెక్టరేట్ అదనపు భవనాన్ని నిర్మిస్తున్నారు. రెండు నెలల కిందట జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి ఆ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని చదును చేస్తున్నారు. అందులో భాగంగా కలెక్టరేట్కు ఆర్టీఏ కార్యాలయానికి మధ్య ఉన్న ప్రహరీని తొలగించారు. దాంతోపాటు ఆర్టీఏ కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్టులు నిర్వహించే ట్రాక్ను కూడా అక్కడ నుంచి తొలగించి ఆ స్థలాన్ని కూడా కలెక్టరేట్కు వినియోగించేలా పక్కనే చదును చేస్తున్నారు. ట్రాక్ కోసం అధికారులు ఇప్పటికే నల్లగొండ పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డులో, అలాగే దండెంపల్లిలో స్థలాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న స్థలం లిటిగేషన్లో ఉండటంతో దండెంపల్లిలో గతంలో కోళ్ల పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలం సమీపంలోనే టెస్టింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కలెక్టరేట్ విస్తరణలో రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ మార్పు తప్పేలా లేదు. కలెక్టరేట్ విస్తరణలో భాగంగా కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఆర్టీఏ కార్యాలయంలోని ట్రాక్ ఉన్న స్థలంలో కలెక్టరేట్ అదనపు బ్లాక్ను నిర్మించాలని జిల్లా యంత్రాంగం ఇటీవల నిర్ణయించింది. ఇందుకు జిల్లా మంత్రులు శంకుస్థాపన చేశారు. దీంతో చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయం ప్రహరీని తొలగించారు. ట్రాక్ కూడా అక్కడ నుంచి తొలగించాల్సి వస్తోంది. ఊరి చివరలో ఉన్న దండెంపల్లికి ట్రాక్ను మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్టుల కోసం వచ్చే వారికి భవిష్యత్లో తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం నుంచి ఒకేచోట.. ఆర్టీఏ కార్యాలయం గతంలో హైదరాబాద్ రోడ్డులో ప్రైవేట్ భవనంలో ఉండేది. మరోవైపు ట్రాక్ మాత్రం ప్రస్తుతం ఉన్న ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో ఉండేది. దీంతో వాహనదారులు రెండు చోట్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వెనుక భాగంలోని ప్రభుత్వ స్థలంలో పదేళ్ల కిందట సొంత భవనాన్ని నిర్మించారు. దీంతో లైసెన్స్ల కోసం కార్యాలయ పనితోపాటు డ్రైవింగ్ టెస్టులు ఒకేచోటకు రావడంతో ఇబ్బందులు తప్పాయి. ప్రస్తుతం మళ్లీ కలెక్టరేట్ విస్తరణలో ఆర్టీఏ కార్యాలయం మార్చాల్సి వస్తుందడంతో జనాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ట్రాక్ తరలిస్తే ఇబ్బందులే.. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ను దండెంపల్లిలో ఏర్పాటు చేసి, రవాణా కార్యాలయాన్ని మాత్రం అక్కడే ఉంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్ ఇతరత్రా కార్యాలయ పనులకోసం కలెక్టరేట్ వెనుక ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ఇక ట్రాక్ను దండెంపల్లికి తరలిస్తే డ్రైవింగ్ టెస్టు కోసం అక్కడికి వెళ్లాల్సిందే. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆర్టీఏ కార్యాలయానికి రావడమే కష్టం. అలాంటిది ఒక పనికోసం ఇటు ఆర్టీఏ కార్యాలయానికి, అటు దండంపల్లికి వెళ్లి టెస్టింగ్లు చేయాలంటే మరింత ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ టెస్టుల కోసం ప్రతినెలా వచ్చే వందల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాబోతోంది. ట్రాక్ వరకు స్థలాన్ని వదిలేయాలంటున్న ఆర్టీఏ సిబ్బంది ఆర్టీఏ కార్యాలయానికి గతంలోనే సొంత భవనం నిర్మించారు. స్థలం కూడా సరిపోను ఉంది. కలెక్టరేట్ విస్తరణలో కార్లు, ఇతర వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ టెస్టు నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న ట్రాక్ను వదిలేస్తే తమకు ఇబ్బందులు ఉండవని రవాణా శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఆ ట్రాక్ స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి ఉంచాలని కోరుతున్నారు. కావాలంటే ట్రాక్ పక్కనుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు వెనుకవైపు ఉన్న స్థలాన్ని తీసుకోవాలని, ట్రాక్ను అక్కడే ఉంచాలంటున్నారు. ఫ నల్లగొండ సమీపంలో దండెంపల్లిలో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఫ అదే జరిగితే.. లైసెన్స్ కోసం కార్యాలయానికి, టెస్టులకు దండెంపల్లి వెళ్లాల్సిందే.. ఫ వాహనదారులకు ఇబ్బందులే.. ఫ ట్రాక్ వరకు స్థలాన్ని వదిలేయాలంటున్న ఆర్టీఏ సిబ్బంది -
డిగ్రీలో ప్రవేశాలకు 23లోగా దరఖాస్తు చేసుకోవాలి
నల్లగొండ: నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశానికి ఇంటర్ పూర్తి చేసినవారు ఈ నెల 23లోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో శనివారం ఆమె డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, 5 పాస్ ఫొటోలతో పాటుగా జనవరి 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి నేరుగా కళాశాలలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణికర్ష, కళాశాల అడ్మిషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘రైతు నేస్తం’ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలి నల్లగొండ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులంతా వీక్షించేలా రైతు వేదికల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాట్ల విషయమై శనివారం ఆమె వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నల్లగొండ కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 140 రైతు వేదికల్లో 32 వీడియో కాన్ఫరెన్స్కు అనుగుణంగా ఉన్నాయన్నారు. ప్రతి రైతు వేదికను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, పూలతో అలంకరించాలన్నారు. రైతువేదికల్లో జరిగే రైతు నేస్తానికి సంబంధిత అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ
హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ పోటీల్లో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. -
నిజాయితీ చాటుకున్నకండక్టర్
చిట్యాల: బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన హ్యాండ్బ్యాగ్ను భద్రపరిచి తిరిగి ఆమెకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ జంగయ్య. వివరాలు.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుంచి చిట్యాలకు వస్తున్న యువతి తన హ్యాడ్బ్యాగ్ను మరిచిపోయి చిట్యాల బస్టాండ్లో దిగి వెళ్లిపోయింది. అనంతరం ఆ యువతి కార్గో సెంటర్ నిర్వాహకుడు పొలిమెర దశరథ ద్వారా కండక్టర్కు సమాచారం అందించింది. దీంతో హ్యాండ్బ్యాగును కండక్టర్ తీసుకుని తన వద్ద భద్రపరుచుకున్నాడు. వెంటనే రామన్నపేటకు వచ్చిన యువతికి కండక్టర్ జంగయ్య ఆహ్యాండ్బ్యాగు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. -
ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరం
నల్లగొండ టూటౌన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పరిధిలోని ఎంజీ యూనివర్సిటీలో రక్తదాన శిబిరరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పాల్గొని రక్తదానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్త దానం చేయండి.. మనిషి ప్రాణాలను నిలబెట్టండని సూచించారు. అనంతరం పలువురు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్, బి.వీరస్వామి, జి.సుధాకర్, అల్వాల రవి, మద్దిలేటి పసుపుల, రూప, తిరుమల, సత్తిరెడ్డి, ఆంజనేయులు, మాధురి తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మోత్కూరు : మోత్కూరు పట్టణానికి చెందిన దాసరి వెంకన్న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తన కుమారుడు రాహుల్ను శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థి సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని వెంకన్న చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్రెడ్డి విద్యార్థి రాహుల్కు అడ్మిషన్ అందజేశారు. కాగా, రాహుల్ 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివాడు. -
తాటిచెట్టు ఎక్కడం ఇక సులువే..
ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాగటి ఆనంద్ శ్రీకోకోనట్ కై ్లంబర్శ్రీ (కొబ్బరిచెట్లు ఎక్కే పరికరం) సహాయంతో తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో దీనిని తయారు చేయించి తీసుకొచ్చాడు. యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నానని, ఈ పరికరం ఐదు కిలోల బరువు ఉంటుందని, దీని ధర రూ.10,600 ఉందని ఆనంద్ చెప్పాడు. ఒక చెట్టు నుంచి మరో చెట్టు వరకు మోకును తీసుకెళ్లినట్టే సులభంగా తీసుకెళ్లవచ్చని, గీత కార్మికులకు రక్షణగా ఉంటుందని వివరించాడు. -
సైనిక్ గురుకుల కళాశాల విద్యార్థిని ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపిక
బీబీనగర్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల 2021–2024 బ్యాచ్ విద్యార్థిని వి.కావ్య ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు.ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జూన్ 28వ తేదీన దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి విధుల్లో చేరనున్నారు. కళాశాల నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఎంపికై న మొదటి విద్యార్థి కావ్య అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావ్యను ప్రన్సిపాల్ శ్రీలత, కళాశాల కార్యదర్శి వర్షిణి, సహాయ కార్యదర్శి పీఎస్ఆర్ శర్మ, ఉప కార్యదర్శి రజిని, అధ్యాపకులు అభినందించారు. వాట్సాప్ గ్రూపులో తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసుమోత్కూరు : మండలంలోని ముశిపట్ల గ్రామ వాట్సాప్ గ్రూపులో కాంగ్రెస్ నాయకులపై తప్పుడు పోస్టు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు. వివరాలు.. ఈ నెల 6వ తేదీన మావూరి ముచ్చట్లు (ముశిపట్ల) గ్రూపులో కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేర్లకంటి శ్రీనివాస్, బోనగిరి హరీష్ పోస్టు చేశారు. ఆ గ్రామానికి చెందిన నిమ్మల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భవన నిర్మాణ కూలీ మృతివలిగొండ : భవన నిర్మాణ పనికి వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులకు దినసరి కూలీగా వెళ్తున్నాడు. చిన్నపాక బాబు గురువారం వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. బైక్ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణంచివ్వెంల(సూర్యాపేట) : బైక్ ఢీకొట్టడంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చెరుపల్లి సత్యం (70) మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద రహదారి దాటుతుండగా మోతె నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం, తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్యంను సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైళ్లలో చోరీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
నల్లగొండ: నల్లగొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడ్ గ్రామానికి చెందిన జమ్మిగుంపుల శ్రీకాంత్ అనే యువకుడు నల్లగొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విచారించిన అనంతరం నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్, రూ.4930 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ రమణ, రైల్వే పోలీసులు పాల్గొన్నారు. ఫ ఫోన్, బంగారం, నగదు స్వాధీనం -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
వలిగొండ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వలిగొండ మండలంలోని అక్కంపెల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన అనిల్ (35) అనే వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డులో టోల్గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా పని ముగించుకుని రామన్నపేట మండలంలోని పల్లివాడలో బంధువుల ఇంటికి తన మోటారు సైకిల్పై వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో పడి మోటారు సైకిల్ అదుపుతప్పి అనిల్ కిందపడిపోయారు. అంతలో వెనుక నుంచి వస్తున్న లారీ అనిల్ కాలి పైనుంచి వెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గీత కార్మికుడికి తీవ్ర గాయాలు నకిరేకల్ : తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు కూలిపోవడంతో ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. చందుపట్లకు చెందిన కొప్పు పెద్ద శ్రీను(44) గీత కార్మికుడు రోజువారీ మాదిరిగా తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతున్న క్రమంలో గాలి రావడంతో అది కూలిపోయి కిందపడి గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనును కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు ట్రాక్టర్లు ఢీకొని డ్రైవర్కు.. వేములపల్లి: రెండు ట్రాక్టర్లు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం వేములపల్లి మండలంలోని మొల్కపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపెంట గ్రామం నుంచి మిర్యాలగూడ వైపు ఇసుక లోడ్తో అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. కారును తప్పించబోయి మిర్యాలగూడ నుంచి రావులపెంట వైపు ఇసుకను అన్లోడ్ చేసి వెళ్తున్న మరో ట్రాక్టర్ను మొల్కపట్నం గ్రామ శివారు వద్ద ఢీకొట్టింది. దీంతో ఇసుక లోడ్తో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ చంటికి తీవ్ర గాయాలయ్యాయి. మరొక ట్రాక్టర్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. రెండు ట్రాక్టర్లు రావులపెంట గ్రామానికి చెందినవే. స్థానికులు 108 వాహనం సహాయంతో తీవ్ర గాయాలపాలైన చంటిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంటకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి
తిప్పర్తి : రైతులు ఉద్యాన పంటలు సాగుచేసి అధిక లాభాలను పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం తిప్పర్తి మండలం అంతయ్యగూడం గ్రామంలో రైతు సిరిగిరి కమలాకర్రెడ్డి సాగు చేస్తున్న అంజీర పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు.. పంట ఎక్కడ అమ్ముతున్నారు.. మార్కెట్ ఎలా ఉంది.. నీటి సౌకర్యం ఉందా, ఫాం పాండ్ నిర్మించుకున్నారా.. బ్రాండింగ్.. మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు అంజీర పంటను బ్రాండింగ్ చేసేందుకు పరిశీలించామన్నారు. స్థానిక స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో వీలైతే ఒక రైతు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా మార్కెటింగ్ చేయించాలని ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు కమలాకర్రెడ్డి, సుగుణమ్మ దంపతులను సన్మానించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ.. తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి అనంతరెడ్డి, తహసీల్దార్ పరుశురాం, ఎంపీడీఓ వెంటేశ్వర్రెడ్డి, ఏఓ సన్నిరాజు, శ్రీనివాస్రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
క్షయ స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలి
నల్లగొండ : క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన క్షయ (టీబీ) ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025– 26 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చాలన్నారు. పరీక్షలను వేగవంతం చేసి క్షయ రోగులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీబీ పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి ఇస్తుందని.. టీబీ రోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో 3 వేల క్షయ కేసులు ఉన్నాయన్నారు. టీబీ నివారణకు ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఇంత వరకు 67 శిబిరాలను నిర్వహించి 13 వేల మందికి క్షయ పరీక్షలు చేసామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, బ్లేస్సి ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు. ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ -
మత్తు మందుల మాఫియా!
నల్లగొండ పట్టణానికి చెందిన యువకుడు ప్రణీత్కుమార్ (పేరు మార్చాం) ఇంజనీరింగ్ పూర్తి చేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ యువకుడు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై చిన్నచిన్న గొడవలు చేస్తున్నాడు. అతడికి గంజాయి దొరకపోవడంతో.. మందుల దుకాణాల్లో దొరికే మత్తు ఇంజక్షన్లు కొనుగోలు చేస్తూ రోజూ వాడుతున్నాడు. ప్రకాశం బజార్లోని ఒక మందుల దుకాణంలో రోజూ మత్తు ఇంజక్షన్ కొనుగోలు చేస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనతో వెల్లడైంది. ఇప్పుడు అతని ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు.. తమని ఆదుకుంటాడని భావించిన తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చాడు. మత్తు మందుల మాఫియా కారణంగానే తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ.. జిల్లాలో మత్తు మందుల విచ్చలవిడి విక్రయంతో జరుతున్న తీరు. ఇతరుల సర్టిఫికెట్లతో వ్యాపారం.. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వందలకు పైగా ఔషధ నియంత్రణ శాఖ ద్వారా లైసెన్స్ను పొందిన దుకాణాలు ఉన్నాయి. ఇవి కాక.. అనుమతులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరో 50 వరకు వరకు ఉంటాయి. మందుల దుకాణాలను నిర్వహించే వ్యాపారులు కచ్చితంగా డీ పార్మసీ లేదా ఎం.ఫార్మసీ సర్టిఫికెట్ పొందిన వారై ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సగం దుకాణదారులు ఫార్మసీ సర్టిఫికెట్లు ఉన్న వ్యక్తులకు నెలకు కొంత మొత్త ఇస్తూ.. వారి సర్టిఫికెట్లతో లైసెన్స్ను పొంది వ్యాపారం చేస్తున్నారు. దీంతో వారికి డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్ అర్థం కాక.. ఇష్టం వచ్చిన మందులను అమ్మి రోగుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇకడబ్రాండెడ్ కంపెనీల మందుల పేరుతో జనరిక్ మందులను కొందరు మందులను అంటగట్టి వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి.ఫ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మత్తు ఇంజక్షన్ల విక్రయం ఫ ఇష్టానుసారంగా వాడుతున్న యువత ఫ నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఔషధ నియంత్రణ శాఖ అధికారులు -
నేడు జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు తెలిపారు. జూన్ 9 నుంచి 14 వరకు చెక్ బౌన్స్ కేసులకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ వాహన ప్రమాద, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలు, సైబర్ క్రైం కేసులు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాంమునుగోడు : కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని కల్వకుంట్ల, కిష్టాపురం గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనపటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూపరాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్లు పగిళ్ల భిక్షం, నందిపాటి రాధారమేష్, నాయకులు బొందు రవి తదితరులు పాల్గొన్నారు. పథకాలపై ఆవగాహన కల్పించాలినాంపల్లి : ప్రభుత్వం అందిస్తున్న పథకలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. నాంపల్లిలోని సీ్త్రశక్తి భవనంలో మహిళా సమాఖ్య, వీఓల శిక్షణ కార్యక్రమనికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు పశువుల షెడ్లు, ఇండుకు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, అరుణ్కుమార్, ఏపీఎం వినోద్కుమార్, ఏపీఓ వెంకటేష్, సీసీలు తదితరులు ఉన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలివేములపల్లి : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్రెడ్డి, కేస రవి, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ అరుంధతి, టీడీ ఆఫీసర్ కల్యాణ్చక్రవర్తి, డాక్టర్ సుచరిత, సీనియర్ అసిస్టెంట్ సోమ్లానాయక్, సూపర్వైజర్ శాంతమ్మ, గీతావాణి, అరుణ, నరేష్ పాల్గొన్నారు. 15న ఉచిత వైద్యశిబిరంనల్లగొండ టౌన్ : పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి స్మారక ప్రజావైద్యశాల భవనంలో ఎంవీఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్టు కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ శిబిరానికి డాక్టర్ గోపాలం శ్రీమన్నారాయణ హాజరై రోగులకు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు చేస్తారని, ఫిట్స్, పక్షవాతం రోగులకు కూడా పరీక్షలు చేస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఇక్కడే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ
అనుముల మండలం యాచారంలో 30 ఎకరాల్లో నిరాణానికి అడుగులు ఫ ఇన్నాళ్లూ విజయవాడ అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు ఫ మంత్రి తుమ్మల చర్యలతో దిగొచ్చిన పతంజలి సంస్థ ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 15 వేల ఎకరాల్లో పంటసాగు ఫ తీరనున్న ఆయిల్పామ్ రైతుల కష్టాలు యాచారం గ్రామంలో ఫ్యాక్టరీ.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కలిపి 15,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగువుతోంది. నల్లగొండలోనే 70 శాతం పంట సాగవుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ ఇక్కడే ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో అనువైన రేట్లకు భూమి లభించడంతో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. 30 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి 20 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తంలోనే భూముల సేకరించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భూమి పూజ చేసేందుకు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. ఇన్నాళ్లూ స్థానికంగా ఫ్యాక్టరీ లేక రెండు జిల్లాల్లో పంట సాగుచేస్తున్న రైతులు విజయవాడలోని అంభాపురం ఫ్యాకర్టీ పైనే ఆధారపడ్డారు. ఇక్కడ సాగుచేస్తున్న పంటను రైతులు ఏపీకి రవాణా చేసి అమ్ముకోవడం కష్టమైంది. అప్పటి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం మూడేళ్ల క్రితమే నల్లగొండ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. కానీ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని పతంజలి సంస్థకు చెందిన జిల్లా ప్రతినిధులు జాప్యం చేశారు. గతేడాది నల్లగొండలో జరిగిన సమావేశంలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్యాక్టరీ నిర్మించకపోవడంపై పతంజలి అధికారులపై మండిపడ్డారు. రెండు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేస్తామని, యాదాద్రి జిల్లా తరహాలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిగొచ్చిన పతంజలి సంస్థ నాలుగైదు నెలల నుంచి స్థల సేకరణ కోసం అన్ని చోట్ల విచారణ చేపట్టింది. ఎట్టకేలకు స్థలాన్ని ఫైనల్ చేశారు. పంట దిగుబడి ఐదు వేల టన్నులు.. టార్గెట్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల్లో పంట సాగు చేయాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పైగా ఇక్కడ పండిన పంటను రైతులు సొంత ఖర్చులతో విజయవాడలోని అంభాపురం ఫ్యా క్టరీకి తీసుకెళ్లడం భారంగా మారింది. మొక్కలను మట్టితో నింపేందుకు అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వచ్చేది. పంటల సాగును ప్రోత్సహించాల్సిన పతంజలి సంస్థ వివిధ రకాల ఖర్చులన్నీ రైతుల పైన మోపడంతో రైతులు ఆసక్తి చూపలేకపోయారు. రైతులకు ప్రయోజనం జిల్లాలో పతాంజలి సంస్థ అయిల్పాం ఫ్యాక్టరి నిర్మాణం పూర్తి చేస్తే.. రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకురావాలి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఆయిల్పామ్ సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – పి.అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ధర తగ్గినా రైతులకు లాభమే.. దేశ, విదేశాల్లో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉంది. ఎకరా వరిసాగుకు ఉపయోగించే నీళ్లతో నాలుగు ఎకరాలు ఆయిల్పాం సాగు చేయవచ్చు. పైగా డ్రిప్, మొక్కలకు రాయితీ లభిస్తుంది. పామాయిల్ ఎగుమతి, దిగుమతులను కేంద్ర ప్రభుత్వం బేరీజు వేస్తుంది. డిమాండ్ను బట్టి ప్రతి నెల రేట్లను నిర్ణయిస్తుంది. ఇటీవల ఆయిల్పాం ఎగుమతి, దిగుమతుల పైన సుంకాలను కేంద్రం తగ్గించింది. దీంతో టన్ను ధర రూ.13000 పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.18,778 కాగా గత నెలలో రూ.20 వేలు పలికింది. అయితే రూ.15 వేల వరకు అయిన రైతులకు నష్టం ఉండదని, ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పతంజలి సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో 6,500 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
కొత్త రేషన్ కార్డులకు.. మూడు నెలల తర్వాతే బియ్యం
నల్లగొండ : కొత్తగా రేషన్ కార్డులు మంజూరవుతున్న వారికి మూడు నెలల తర్వాతే బియ్యం అందనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని జూన్లోనే ఒకే సారి ఇస్తుడడంతో.. మే 20వ తేదీ తర్వాత కార్డులు పొందిన వారికి సెప్టెంబర్లోనే సన్నబియ్యం అందనున్నాయి. గతంలో ఉన్న కార్డులతోపాటు అయితే మే 20వ తేదీ కంటే ముందు కార్డులు పొందిన వారికి కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం విడుదల చేసింది. కానీ ఆ తర్వాత కార్డులు పొందిన వారికి కోటా ఇవ్వకపోవడంతో.. వారంతా మూడు నెలలపాటు ఆగాల్సిందే. జిల్లాలో 4,84,216 రేషన్కార్డులు ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి ప్రభుత్వం కార్డులను మంజూరు చేస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని స్థాయిలో పరిశీలన పూర్తయ్యాక కార్డులు జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించింది. ఇలా మే 20వ తేదీ వరకు జిల్లాలో కొత్తవి, పాతవి కలిపి మొత్తం 4,84,216 రేషన్కార్డులు ఉన్నారు. అయితే వీటికి సంబంధించి 26 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం మూడు నెలల కోసం అలాట్ చేసింది. ఆయా కార్డుదారులకు ప్రస్తుతం బియ్యం పంపిణీ కొనసాగుతోంది. 60 శాతం కోటా పంపిణీ పూర్తి మూడు మాసాలకు సంబంధించి బియ్యం పంపిణీని ఈ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు 80 శాతం బియ్యం సరఫరా అయ్యాయి. అందులో 60 శాతం బియ్యం శుక్రవారం సాయంత్రానికి రేషన్కార్డుదారులకు పంపిణీ చేశారు. 41,806 మంది కొత్తగా దరఖాస్తు.. జిల్లాలో ప్రస్తుతం 41,806 మంది కొత్త రేషన్కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 819 రిజక్ట్ అయ్యాయి. 31,530 కార్డులు అప్రూవల్ అయ్యాయి. ఇందులో పరిశీలన కోసం 9,422 కార్డులు ఉండగా.. తహసీల్దార్ లాగిన్లో 498, డీఎస్వో లాగిన్లో 195 ఉన్నాయి. ఇవి కూడా ఆయా స్థాయిల్లో అప్రూవల్ కానున్నాయి. అయితే మే 20వ తేదీ తర్వాత సుమారు 20 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. వారందరికీ సెప్టెంబర్లోనే బియ్యం అందనున్నాయి. మూడు మాసాలకు సంబంధించిన బియ్యం ఇప్పటికే అలాట్ చేసినందున మే 20 తర్వాత వచ్చిన కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ మే 20వ తేదీ తర్వాత మంజూరైన కార్డులకు సెప్టెంబర్లో కోటా ఫ సుమారు 20 వేల మంది మూడు నెలలు ఆగాల్సిందే ఫ ప్రస్తుత కోటా 60 శాతం పంపిణీ పూర్తి -
పనిచేసే వారికి పార్టీ పదవులు
నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి చేసే వారందరికీ పార్టీ పదవుల్లో సుముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, క్రీడల యువజన సర్వీస్ల శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్చార్జి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం సాయంత్రం తొలిసారి ఆయన నకిరేకల్ వచ్చారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ స్థాయి నుంచి నేడు మంత్రిగా ఎదిగానని.. అదే పార్టీ గొప్పతనం అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ నేతృత్వంలో ప్రజలు, నాయకుల మధ్యే పార్టీ కమిటీల ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తొలిసారిగా కార్యకర్తలు, నాయకుల సమక్షంలో జిల్లా, మండల, పట్టణ, గ్రామ అధ్యక్షులను, ఇతర కమిటీలను ఎన్నుకోనున్నామని చెప్పారు. ప్రతి పదవికి మూడు పేర్లు తీసుకుని ఎన్నిక చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. పనిచేసే వారంతా పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ కమిటీల నియమకం చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, పార్టీ జిమ్లే పరిశీలకుడు నాసర జయబాబా, మార్కెట్, మున్సిపల్ చైర్ పర్సన్లు గుత్తా మంజుల మాధవరెడ్డి, చౌగోని రజితా శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, ఏసుపాదం, వెంకన్న, సుక్కయ్య, ఉశయ్య, శ్రీని వాస్, గంగధర్రావు, కొండయ్య, నర్సింహ, యాదగిరి, మల్లికార్జున్, పన్నాల రాఘవరెడ్డి, సత్తయ్య, సుందర్, నకిరెకంటి నరేందర్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్
భూదాన్పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది.. కాటన్, సెమికాటన్, సిల్క్తో అనేక వైరెటీలలో ఇక్కత్ వస్త్రాలు తయారు చేయడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొనియాడారు. గురువారం ఆయన తన సతీమణి సుధా డెబ్బార్మతో కలిసి భూదాన్పోచంపల్లిని సందర్శించారు. టూరిజం పార్కులోని చేనేత కాన్ఫరెన్స్ హాలులో చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. దేశంలో ఏ మూలకుపోయినా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరిస్తున్నారని అభినందించారు. పోచంపల్లి ఇక్కత్, కంచి, ఒడిశా తదితర చేనేత వస్త్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గుర్తింపు ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఎక్చేంజ్లో చేనేత వస్త్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేనికై తే పేరుంటుందో వాటికి నకిలీల బెడద దేనికై తే పేరుంటుందో దానికి నకిలీల బెడద ఉంటుందని, దాంతోనే పోచంపల్లి ఇక్కత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్పదనం అర్థమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రింట్ఫొటోకు, పెయింటింగ్ ఫొటోకు తేడా ఉన్నట్లే మిల్లులో తయారైన వస్త్రానికి, మగ్గంపైన తయారైన వస్త్రానికి ఉన్న తేడా, నాణ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎప్పుడైనా చేనేత వస్త్రాలను మిల్లులో తయారైన వస్త్రంతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రస్తుతం మార్కెటింగ్, డుప్లికేషన్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పోచంపల్లికి వచ్చి ప్రత్యక్షంగా వస్త్రాల తయారీని చూడడం ఎంతో ఆనందంగా ఉందని, మళ్లీ పోచంపల్లికి వస్తానని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు.. చేనేత నాయకుడు తడక వెంకటేశం ఇచ్చిన వినతి మేరకు గవర్నర్ స్పందిస్తూ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాఽధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు గర్దాస్ ఉపేందర్, కుంట్లగూడెంకు చెందిన భాగ్యలక్ష్మి, వనం యాదగిరికు నేతన్న బీమా, కూర పాటి నిర్మల, పొట్టబత్తిని సుగుణ, దోర్నాల ధనుంజయ్యకు త్రిఫ్ట్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఫ ప్రపంచం, దేశంలో ఏ మూలకెళ్లినా ఇక్కత్ వస్త్రాలు ధరిస్తున్నారు ఫ చేనేత డిజైన్ల అభివృద్ధి, ఉపాధి కల్పనకు సహకరిస్తా ఫ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఫ సతీమణితో కలిసి భూదాన్పోచంపల్లి సందర్శన చేనేత గృహాల సందర్శన గవర్నర్ పోచంపల్లికి రాగానే తొలుత చేనేత కార్మికులు పెండెం కృష్ణ, భారత మధు, భారత భాస్కర్ గృహాలను సందర్శించారు. వారు గవర్నర్ దంపతులకు బొట్టుపెట్టి ఇంట్లోకి స్వాగతం పలికారు. ఎన్నేళ్ల నుంచి ఈ వృత్తిని చేస్తున్నారని, ఎంత గిట్టుబాటు అవుతుందని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టూరిజం పార్కులోని మ్యుజియంను సందర్శించారు. అక్కడ కొకూన్స్, నూలు, నూలువడకడం, చిటికికట్టడం, ఆసుపోయడం, రంగులద్దకం, మగ్గాలపై వస్త్రాలను తయారు చేయడం ప్రక్రియలన్నింటినీ నిశితంగా పరిశీలించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్, తేలియా చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్డిజైన్లను చూసి చేనేతకళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. గవర్నర్ స్వయంగా మగ్గం నేసి అబ్బురపర్చారు. అనంతరం పోచంపల్లి చేనేత ప్రాముఖ్య ఏవీని తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, ఆర్డీడీ పద్మ, డీసీపీ అక్షాంశ్యాదవ్, ఏడీ శ్రీనివాసరావు, ఏడీఎం కళింగరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్థన్, గజం అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్రెడ్డి, తహసిల్దార్ పి.శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ మధుసూధన్రెడ్డి, చేనేతనాయకులు తడక వెంకటేశం, తడక రమేశ్, భారత లవకుమార్, ఎన్నం శివకుమార్, అంకం పాండు పాల్గొన్నారు. -
వెల్నెస్ సెంటర్లో మందుల్లేవ్!
గంటల తరబడి నిరీక్షణ.. ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లోని ఫార్మసీలో ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యులకు చూపించుకున్న వారు మందులు తీసుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కొన్ని కుర్చీలు మాత్రమే ఉండడం, ఫ్యాన్లు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అదనంగా ఫార్మసిస్టులను నియమించి ఇబ్బందులు తొలగించాలని వెల్నెస్ సెంటర్కు వచ్చే రోగులు కోరుతున్నారు. నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్లో మందుల కొరత ఏర్పడింది. గత పదిహేను రోజులుగా కేవలం రెండు, మూడు రకాల మందులు మాత్రమే ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు సుమారు 200 నుంచి 500 మంది వరకు హెల్త్కార్టు కలిగిన వారు వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కీళ్లు, మోకాళ్ల నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెల్నెస్ సెంటర్లో నెలనెలా ఉచితంగా ట్యాబ్లెట్లు తీసుకువెళ్తుంటారు. గత పదిహేను రోజులుగా ట్యాబ్లెట్లు, ఇతర సిరప్లు లేని కారణంగా కేవలం ఒకటి, రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపుతున్నారు. ట్యాబ్లెట్లు వచ్చిన తరువాత అందిస్తామని, ఫోన్ చేసి రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుల గురించి అడిగితే ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఇండెంట్ పెట్టామని వెల్నెస్ సెంటర్ బాధ్యులు పేర్కొంటున్నారు.ఫ అందుబాటులో ఉన్నవి రెండు, మూడు రకాల మందులు మాత్రమే ఫ నెల ప్రారంభం నుంచి కొరత ఫ ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక రోగులు ఫ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఇండెంట్ పెట్టిన అధికారులు ఇండెంట్ పంపించాం మందుల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందుల కోసం ఇండెంట్ పంపించాం. రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తారు. సరఫరా కాగానే మిగతా మందులను రోగులకు అందిస్తాం. – డాక్టర్ లావణ్య, వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ -
విద్యార్థులను క్రమం తప్పకుండా తీసుకురావాలి
గుర్రంపోడు : తల్లిదండ్రులు విద్యార్థులను క్రమంతప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో భవిత విద్యావనరుల కేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో ముచ్చటించారు. ఒక్కో విద్యార్థి పేరు అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి కలెక్టర్ రెండు పెంపుడు కుక్కలను తెప్పించారు. పిల్లలు వాటితో ఆడుకుంటూ ఉత్సాహంగా ఉండటాన్ని గమనించారు. కుక్కకు పేరు ఏమి పెడతారని పిల్లలను ప్రశ్నించగా.. వారు మ్యాంగో అని పెడతామని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంకా ఏమేం కావాలో ఐఈఆర్పీ శారదను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మోడల్ స్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. కేజీబీవీలో వంట గదులు, వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ మంజుల, ఎంఈఓ నోముల యాదగిరి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాగిణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీ, ఏఈ రవికుమార్ తదితరులున్నారు. ఫకలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు.రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణనల్లగొండ అగ్రికల్చర్: కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు వానాకాలం సీజన్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు అకౌంట్ను మార్చుకోవాలనుకునేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత వ్యవసాయ విస్తరణాధికా రులకు పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ను అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం నేరంరామగిరి(నల్లగొండ): మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడి బయట ఉన్న బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. బాల కార్మిక నిర్మూలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి కృష్ణవేణి, లేబర్ అధికారి అరుణకుమారి, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భీమార్జున్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా తిరుపతిరావునల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా డాక్టర్ తిరుపతిరావు నియామకమయ్యారు. శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా.. ఆయన గతంతో కూడా మాస్ మీడియా అధికారిగా పనిచేశారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధిత చట్టం, గర్భవి చ్చిత్తి చట్టం, బాల్యవివాహాల నిషేధిత చట్టం, పొగాకు, గుట్కా ఉత్పత్తుల నిషేధిత చట్టాలను అమలు చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఈమేరకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మాస్ మీడియా అధికారిగా అవార్డు అందుకున్నారు.గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ, రామగిరి : నల్లగొండలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాతత్వ శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సామాన్య శాస్త్ర బోధనా పద్ధతులు, గణిత శాస్త్ర బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, తెలుగు భాష బోధన పద్ధతులు, ఆరోగ్య, వ్యాయామ విద్య, దృశ్య కళలు, కళా విద్య సబ్జెక్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతో పాటు జీరాక్స్ సర్టిఫికెట్లను జతపరచి ఈనెల 19 లోపు డైట్ కళాశాలలో సమర్పించాలని తెలిపారు.ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..నల్లగొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఈనెల19 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9948215991 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.63,09,560
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. 79 రోజులకు గాను రూ.63,09,560 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్కుమార్ వెల్లడించారు. అన్నదానానికిగాను రూ.49,512 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది శ్రీనివాస్రెడ్డి, నర్సిరెడ్డి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అక్షర లోగిలిలో ఆనంద పండుగ
‘ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామంలోకి రావొద్దు’ తిప్పర్తి : పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం మాజీ సర్పంచ్ ముత్తినేని శ్రీదేవిశ్యాంసుందర్, గ్రామపెద్దలు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1నుంచి 5వ తరగతి వరకు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేయించాలని, గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దంటూ గ్రామ స్టేజీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నల్లగొండ: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తోటి స్నేహితులు కలవడంతో విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ.. ఉపాధ్యాయులు చెప్పే విశేషాలు వింటూ గడిపారు. మొదటి రోజు కావడంతో జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. జిల్లాలో 1,483 పాఠశాలు ఉండగా వాటి పరిధిలో 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. పండుగ వాతావరణంలో.. విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు నుంచే బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే డీఈఓ భిక్షపతి ఆదేశాల మేరకు విద్యార్థులు మొదటి రోజు పాఠశాలలకు వస్తున్నందున తరగతి గదులను శుభ్రపరచడం, మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించి పండగ వాతావరణంలో ప్రారంభించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు స్కూల్ యూనిఫాం అందజేశారు. పలు పాఠశాలల్లో వినూత్నంగా ఇలా.. ● నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మావిడాకులు కట్టి అందంగా అలంకరించారు. ● ఖతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు పంపిణీ చేసి స్వాగతం పలికారు. ● పెద్దవూరలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హౌజింగ్ పీడీ, మండల ప్రత్యేకాధికారి ఎస్పీ రాజ్కుమార్ కేక్ కట్ చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ● నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో పాఠశాల గేట్ ఎదుట రిబ్బన్ కట్ చేసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.ఫ పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పూలు, మామిడి తోరణాలతో అలంకరణ ఫ పుష్పగుచ్ఛాలు అందజేసి విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఫ మొదటిరోజు 15 శాతం మంది మాత్రమే హాజరు ఫ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్తోపాటు స్కూల్ యూనిఫాం పంపిణీ -
సాగర్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశ యం రేడియల్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. గత నెలలోనే క్రస్ట్ గేట్లకు సీల్స్ వేయడం బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగిస్తున్నారు. వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్ పనులు చేస్తున్నారు. ఒక్కోగేటు పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేశామని, ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్ల పనులు ముమ్మరం చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
నా రాజీనామా ప్రచారం అబద్ధం
నల్లగొండ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, అయితే తనకు ఆ పదవి తగదని సీనియర్లకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యఽక్షుడిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు గతంలో ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అవకాశం ఉంటే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడిని, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలను కోరినట్లు చెప్పారు. అవకాశం లేకపోతే కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. కోమటిరెడ్డికి దూరం అవుతున్నానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అఽధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉంటానని, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకపోయినా, ఎవరు ఉన్నా, లేకున్నా తాను కార్యకర్తల వెంట ఉన్నానన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మల మోహన్రెడ్డిది న్యాయబద్ధమైన కోరిక అని అన్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదని, ఈ విషయంలో గతంలో కూడా హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, జూలకంటి వెంకట్రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పోలె జయకుమార్, జహంగీర్ పాల్గొన్నారు. ఫ అవకాశం ఉంటే అధ్యక్ష పదవి ఇవ్వాలని అడిగా ఫ పదవి లేకపోయినా కార్యకర్తగా ఉంటా ఫ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
నార్కట్పల్లి : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నార్కట్పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామంలో నిర్వహించిన రెవవెన్యూ సదస్సుకు ఆమె హాజరై రైతులతో మాట్లాడి.. భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేకపోతే ఈనెల 20వ తేదీ వరకు నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా చట్ట ప్రకారం వెసులుబాటు ఉంటే రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరావు, అధికారులు ఉన్నారు. -
68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యం
నల్లగొండ : వనమహోత్సవం కింద జిల్లాలో 68,70,800 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వెల్లడించారు. వనమహోత్సవ కార్యక్రమంపూ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నాటనున్న 68,70,800 మొక్కల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు 39,51,700 వ్యవసాయ శాఖ 7,66,000, ఉద్యాన శాఖ 6,38,000, మున్సిపాలిటీలు 8,20,00 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద ఆయా శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడమే కాకుండా, జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, ఎకై ్సజ్ అధికారి సంతోష్, డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ -
ఊరూరా.. అంగన్వాడీ బాట
మిర్యాలగూడ టౌన్ : రెండున్నరేళ్లు నిండిన పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరుతూ ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంగన్వాడీల్లో పిల్ల పెంపే లక్ష్యంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ, సహయ కమిటీ బృందాలు పిల్లల నమోదును పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, కొండమల్లేపల్లి, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు ఇలా.. ● అంగన్వాడీలు, ఎన్జీఓ సంఘాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషణ్ అభియాన్ సిబ్బంది ర్యాలీల నిర్వహణ. ● పట్టణ, గ్రామీణ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం. ● పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి వారిని ప్రోత్సహించడం. ● అంగన్వాడీ కేంద్రాల్లో చదువు పూర్తయిన పిల్లలకు సర్టిఫికెట్లు అందించి. వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించడం. ● స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం పేరుతో కేంద్రాలను శుభ్రం చేయడం. ● అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో మొక్కలను నాటడం. ● సామూహిక అక్షరభ్యాసం నిర్వహించడం. ● పిల్లలకు పాఠాలు, టైం టెబుల్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించడం. ● స్టడి మెటీరియల్ను పంపిణీ చేయడం. ఫ 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఫ రెండున్నరేళ్లు దాటిన పిల్లలు అంగన్వాడీలో చేర్పించేలా ప్రణాళిక -
బడికి వేళాయే..
నేడు పాఠశాలలు పునః ప్రారంభం ఫ ప్రభుత్వ స్కూళ్లను ముస్తాబు చేయించిన విద్యాశాఖ ఫ వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన బాలలు.. ఇక బడికి పయనం నల్లగొండ : బడి గంట వేళయింది. ఇన్ని రోజులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద 1483 పాఠశాలలు ఉన్నాయి. అవి గురువారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే శుభ్రపరిచి ప్రారంభానికి సిద్ధం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే ఆయా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలలను తోరణాలు, బెలూన్లతో ఆలంకరించనున్నారు. పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదవే విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే యూనిఫామ్తోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వాటిని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆయా పాఠశాలలకు చేర్చారు. మొదటి రోజే విద్యార్థులకు వాటిని అందించనున్నారు.కొండమల్లేపల్లి పాఠశాల ప్రత్యేకం కొండమల్లేపల్లి : జిల్లాలో కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. కొండమల్లేపల్లి నాలుగు రోడ్ల కూడలి కావడం, చుట్టుపక్క మండలాల నుంచి కూడా అడ్మిషన్లు రావడమే కాక ఉత్తమ బోధన, పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించడం, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఉన్నత స్థానాల్లో ఉండడం కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు నమోదు కలిగిన పాఠశాలగా కొండమల్లేపల్లికి పేరు సాధించింది. కొండమల్లేపల్లి జెడ్పీహెచ్ఎస్లో గత సంవత్సరం 956 మంది విద్యార్థులు ఉన్నారు. 54 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారు. క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఈ పాఠశాలలో పలు పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించడం ఉపాధ్యాయుల ఉత్తమ బోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పాఠశాల సైన్స్ ప్రయోగాలు, కంప్యూటర్ ల్యాబ్లు, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ కూడా ఉండడంతో పాఠశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతుంటారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థుల నమోదు ఈ పాఠశాలలో ఉండడంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల జాబితా సమర్పించాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల పనులు ఏస్థాయిలో ఉన్నాయో జాబితాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భవిత కేంద్రాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక వాగుల నుంచి నేరుగా ఇసుకను తీసుకోవద్దని, ముందుగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆయా మండలాల వారీగా ఇసుక లభ్యమయ్యే వనరుల జాబితా సమర్పించాలని జిల్లా మైనింగ్ అధికారిని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల వివరాలను సమర్పించాలని జిల్లా ఇరిగేషన్ అధికారికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా మైనింగ్ అధికారి శామ్యూల్ జాకబ్, గృహ నిర్మాణ సంస్థ ిపీడీ రాజ్కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
12 నుంచి ‘ఇగ్నో’ పరీక్షలు
రామగిరి(నల్లగొండ) : జూన్ 12వ తేదీ నుంచి ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ్మారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు నల్లగొండలోని కాకతీయ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి అర గంట ముందే అభ్యర్థులు రావాలని సూచించారు. ‘భగీరథ’ పనుల పరిశీలనఅడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి మండలంలో ఉపాధి హామ పథకం చేపట్టిన ‘జల సంచాయి–జల భగీరథ’ పనులను బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. దాంతోపాటు కేంద్ర బృందం సభ్యులు అడవిదేవులపల్లి, ఉల్సాయిపాలెం, కొత్తనందికొండ, మొల్కచర్ల, బాల్నేపల్లి, చిట్యాల తదితర గ్రామాల్లో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను 18 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీడబ్ల్యూసీ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన సాగింది. కేంద్ర బృందం వెంట క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీడీఓ మాతంగి రమేష్, ఎంపీఓ సూరానాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు చారి, రాధ, వినోద్ తదితరులు ఉన్నారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారంతిప్పర్తి : రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండలంలోని సర్వారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన రైతుల సమస్యలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 3వ తేదీ నుంచి సదస్సులు నిర్వహిస్తున్నామని.. ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తిప్పర్తి మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయని.. మండల వ్యాప్తంగా మొత్తం 939 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లపైఅప్రమత్తత అవసరంమర్రిగూడ : ప్రజలకు సైబర్ నేరగాళ్లపై అపమ్రత్తంగా ఉండాలని దేవరకొండ ఏఎస్పీ మౌనిక అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ను ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలను పిలిపించి భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని సూచించారు. దారి సమస్యలు ఉంటే సర్వేయర్ ద్వారా హద్దురాళ్లు పెట్టుకుని తగాదాలకు తావు లేకుండా ఉండాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నాంపల్లి సీఐ డి.రాజు, ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది సైదులు, వాహిద్, సత్యనారాయణ, శిరీష, గీత, రత్నం, కోటేష్, హుస్సేన్ ఉన్నారు. ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం కనగల్ : కనగల్ మండల కేంద్రంలో ఆయిల్పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగల్ మండలంలో రైతులు 350 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేస్తున్నారని తెలిపారు. 2021 – 22 సంవత్సరం నుంచి ఎన్ఎంఈఓపీ కింద 80 శాతం రాయితీపై ఆయిల్పామ్ మొక్కలు అందిస్తున్నామన్నారు. నాలుగు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేస్తామని.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పతాంజలి ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ శివాజీ పాల్గొన్నారు. -
స్కూల్కు నడుచుకుంటూ వెళ్లే వాడిని
మాడ్గులపల్లి: మాది చిరుమర్తి గ్రామం. నేను మా గ్రామం నుంచి ఆగామోత్కూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు రోజూ టిఫిన్ బాక్స్ పట్టుకోని నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఆ పాఠశాల నిజాం కాలం నాడు కట్టించింది. ఆ పాఠశాలలో నేను పదో తరగతి వరకు చదువుకున్నాను. పదో తరగతి వార్షిక పరీక్షలో నేను మండల ఫస్ట్ ర్యాంకు సాధించాను. పాఠశాలలో నా స్నేహితులతో కలిసి బాగా ఆడుకునేవాడిని. ఆగామోత్కూర్ పాఠశాలలో చదువుకున్న వారు నేడు ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా టీచర్లు, ఎంఈఓలు, విద్యా శాఖ డైరెక్టర్లు కూడా అయ్యారు. ఫ ఎన్.శంకర్, సినీ డైరెక్టర్ -
గుణాత్మక విద్య అందిస్తాం
ఫ ఉపాధ్యాయులకు వేసవిలో వృత్యంతర శిక్షణ పూర్తి చేశాం ఫ ఈసారి అన్ని పాఠశాలల్లో ఏఐ బోధన ఫ విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట నిర్వహిస్తున్నాం ఫ విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపడతాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ భిక్షపతి నల్లగొండ : ‘ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తాం. నూతన పద్ధతిలో సాంకేతికతతో కూడిన బోధన చేసే విధంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చాం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది నుంచి అన్ని స్కూళ్లలో ఏఐ బోధన ప్రారంభిస్తాం’ అని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాఠశాలలు పునః ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లలో ఇప్పటికే శుద్ధీకరణ పనులు చేయించాం. శానిటేషన్తో పాటు మధ్యాహ్న భోజన వంట పాత్రలు శుభ్రం చేయించాం. బడి ఈడు పిల్లలందర్ని బడిలో చేర్పించే విధంగా జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. గతంలో కంటే ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాం. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి పిల్లలు అధిక సంఖ్యలో చేరే విధంగా చర్యలు తీసుకుంటారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం.. పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, నోట్బుక్స్ అందజేస్తాం. పాఠశాలలు ప్రారంభమైన మొదటి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తాం. మొదటి రోజున ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలి. తోరణాలు, బెలున్లతో పాఠశాలను అలంకరించుకుని గ్రామంలోని ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువతను ఆహ్వనించి సమావేశం నిర్వహించాలి. ఏ పాఠశాలోనైతే జీరో ఎన్రోల్మెంట్ ఉందో, తక్కువ విద్యార్థులు ఉన్నారో ఆ పాఠశాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, సీఆర్పీలు ఆ పాఠశాలలను తిరిగి తెరిచే విధంగా చర్యలు తీసుకుంటారు. 13వ తేదీన సామూహిక అక్షరాబ్యాసం.. 13వ తేదీన బాలసభ నిర్వహించి సామూహిక అక్షరాబ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంస్క్రతిక కార్యక్రమాలతో పాటు విద్యపై అవగాహన, డ్రాయింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పాఠశాలలో లెర్నింగ్ ఇంప్రూమెంట్ నేర్పిస్తారు. అదే విధంగా ఫన్ స్టోరీలు నేర్పిస్తారు. 17వ తేదీన పాఠశాలల్లో గర్ల్స్ చైల్డ్ పంక్షన్ నిర్వహిస్తున్నాం. యాక్టివిటీ విధానంలో బోధన జరిగేలా ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఎన్రోల్మెంట్ ఎక్కువగా అయిన పాఠశాలల్లో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం. అన్ని పాఠశాలల్లో ఏఐ అమలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆమోదంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏఐ పాఠాలు అమలు చేయబోతున్నాం. ఇది పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంవత్సరం పదో తరగతి విద్యార్థుల తరహాలోనే ఈ సారి 6వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. కలెక్టర్ ఇలా త్రిపాఠి సలహాలు, సూచనలతో రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతాం. -
పది రోజుల్లో భవనాలకు నిధులు
మిర్యాలగూడ : మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనల మేరకు పది రోజుల్లో సబ్ కలెక్టర్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలం కేటాయింపుతోపాటు భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, ఆర్అండ్పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ, భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నీటిపారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి పొంగులేటి మాట్లాడారు. పేదోడి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అప్పుల తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడ్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి నాలుగు విడతల్లో రూ.5లక్షలు చెల్లిస్తామన్నారు. ఇస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ప్రొసీడింగ్స్ అందజేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యం – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మంజూరు పత్రాలు అందుకునే లబ్ధిదారుల మొఖాలు చూస్తే సంతోషంగా ఉందన్నారు. పేదలందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీబడిబాట పోస్టర్ ఆవిష్కరణ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం పోస్టర్, కరపత్రాలను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం దీరావత్ ధర్మానాయక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవినాయక్, ఉపాధ్యాయులు కొర్ర కృష్ణకాంత్నాయక్, తావుర్యా, అనిత, జ్యోతి, ధనలక్ష్మి, స్పందన, భవాని, మీనా, రేణుక పాల్గొన్నారు. -
జీపీఓలు ఎప్పుడొస్తరో!
జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాలు.. జిల్లాలో మొత్తం 566 రెవిన్యూ గ్రామాలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. కానీ 184 మంది మాత్రమే పరీక్షలో అర్హత సాధించారు. అంటే ప్రభుత్వం అన్ని గ్రామాలకు జీపీఓలను నియమించాలంటే గతంలో జూనియర్ అసిస్టెంట్లుగా ఇతర శాఖల్లోకి వెళ్లిన వారిని తిరిగి నేరుగా తీసుకుని భర్తీ చేస్తుందా.. లేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుందా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. లేదా కొన్ని రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి.. ఆ క్లస్టర్కు ఒక జీపీఓను నియమిస్తుందా అన్న చర్చ సాగుతోంది. నల్లగొండ : రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారులను (జీపీఓ) నియమించాలని నిర్ణయించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్ఓలుగా పని చేసిన వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదలాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి.. భూ భారతిని తీసుకొచ్చింది. అందులో భాగంగానే రెవెన్యూ వ్యవస్థకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్ఓలు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చే వారి నుంచి దరఖాస్తులు కోరిన విషయం తెలిసిందే. అయితే వారికి పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించినా.. నియామకాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పరీక్షలో 184 మంది అర్హత రెవిన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు వెళ్లిన వారు తిరిగి రెవెన్యూ శాఖకు వచ్చేందుకు 241 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిని ఆ శాఖలోకి నేరుగా తీసుకోకుండా మే 27న పరీక్ష నిర్వహించింది. అందులో 241 మందికి గాను 184 మంది మాత్రమే అర్హత సాధించారు. కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భూ భారతిని ప్రారంభించింది. 3వ తేదీ నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే అదే రోజున గ్రామ పాలన అధికారులను కూడా నియమిస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో.. పరీక్షలో అర్హత సాధించిన వారంతా ఎదురుచూపుల్లోనే ఉన్నారు.ఫ గ్రామ పాలనాధికారుల నియామకంపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఫ ఎదురుచూపుల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్ : భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని జంకుతండాకు చెందిన బుడిగపాక నరేష్, శోభ దంపతుల కుమార్తె దివ్య(23) మిర్యాలగూడ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తుండగా.. యాద్గార్పల్లి గ్రామానికి చెందిన బొంత నాగరాజు, లక్ష్మి దంపతుల కుమారుడు బొంత వెంకటేష్తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె లాస్య, కుమారుడు తరుణ్కుమార్ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా యాద్గార్పల్లి గ్రామానికే చెందిన మహిళతో వెంకటేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి దివ్య భర్తను నిలదీసింది. దీంతో ‘నీవు కట్నం ఏమైనా తెచ్చావా.. నీవు తక్కువ కులం దానివి’ అంటూ దివ్యను కొంతకాలంగా వెంకటేష్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య మరో సారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన దివ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. -
మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేసి మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. సోమవారం నీలగిరి మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి ప్రతి విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగానికి వెళ్లిన మంత్రి అక్కడి ఈఈ, ఏఈలతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన 180 పంచాయతీరాజ్ పనుల్లో నాణ్యత లేవంటూ వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్కు ఫోన్లో ఆదేశించారు. రెవెన్యూ విభాగంలో ఆస్తి పన్ను వసూలు, గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీదాలు ఇస్తున్నారా.. లేదా అని ఆరాశీశారు. అక్కడ వివిధ రికార్డులను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు.ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ నీలగిరి మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం రాత్రి విత్తన స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. షాపుల్లో నిర్వహించే స్టాక్ రికార్డులు, బిల్ బుక్లు, ఇన్ అవుట్ రిజిస్టర్లను పరిశీలించింది. ఈ సందర్భంగా మునుగోడు ఏడీఏ వేణుగోపాల్, నకిరేకల్ ఇన్చార్జి ఏడీఏ జానిమియా మాట్లాడుతూ విత్తన అమ్మకాల్లో డీలర్లు ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడితే విత్తన నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట డీలర్ల సంతోష్, నాతి సైదులు, పన్నాల శేఖర్రెడ్డి, తీపిరెడ్డి ఇంద్రారెడ్డి, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. వైభవంగా నమ్మాళ్వార్ తిరునక్షత్ర వేడుకయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నమ్మాళ్వార్ తిరునక్షత్ర వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వైభవంగా నిర్వహించారు. ఉదయం స్నపనం చేపట్టిన అర్చకులు, రాత్రి ఆళ్వారు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఈ సేవలో పాల్గొని, ఆధ్యాత్మిక చింతన పొందారు. నమ్మాళ్వార్ల తిరునక్షత్ర విశిష్టతను ఆలయ ముఖ మండపంలో అర్చకులు భక్తులకు వివరించారు. సేవకు ముందు పారాయణీకులు నమ్మాళ్వార్లకు పారాయణం పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట–మల్లాపురం రహదారిలో సోమవారం గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పరిధిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి సోమవారం యాదగిరిగ్టుట–మల్లాపురం రహదారిలో ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద ఆవుల కృష్ణకు చెందిన పశువుల కొట్టం విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుకు గురై మహిళ మృతి వలిగొండ: పాముకాటుకు గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన వలిగొండ మండలం గుర్నాథపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్నాథపల్లి గ్రామానికి చెందిన తోట జయమ్మ(65) ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించగా.. రాత్రి 10గంటల సమయంలో ఆమెను పాము కాటేసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. అన్నివర్గాల మద్దతుతోనే ఎస్సీ వర్గీకరణ● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ చిట్యాల: అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల మద్దతుతోనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ అన్నారు. చిట్యాలలో సోమవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంద కృష్ణమాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా చేసిన రాజీలేని పోరాటంతో చివరికి విజయం దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఏర్పాటైన ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఫలితంగానే మంద కృష్ణమాదిగను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందని అన్నారు. ఈ సమావేశంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎరసాని గోపాల్, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం, జీడిమెట్ల రవీందర్, కావలి కృష్ణ, జోగు ప్రవీణ్, మేడి లింగస్వామి, మేడి నర్సింహ, జనగాం అర్జున్, రుద్రవరం లింగస్వామి, మేడి ధనుంజయ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కమిటీలో అగ్రస్థానం
ఫ ఉపాధ్యక్షులుగా ముగ్గురు ఫ ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. పార్టీ ఉపాధ్యక్ష పదవుల్లో ముగ్గురిని నియమించగా, ప్రధాన కార్యదర్శులు ఐదుగురికి స్థానం లభించింది. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్రెడ్డి, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి నియమితులయ్యారు. కొండేటి మల్లయ్య ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుమ్ముల మోహన్రెడ్డి నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ సంధ్యారెడ్డి, దైద రవీందర్, చనగాని దయాకర్, వి.రామారావుగౌడ్, చకిలం రాజేశ్వర్రావుకు అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే, ఇందులో గుమ్ముల మోహన్రెడ్డి, కొండేటి మల్లయ్య, చనగాని దయాకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ నియామకాలతో వారు డీసీసీ అధ్యక్ష పదవికి దూరం అయినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వినతుల స్వీకరణనల్లగొండ : గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 35 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి.. చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. నేటి నుంచి ‘అమ్మ మాట –అంగన్వాడీ బాట’నల్లగొండ : ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ మంగళవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మూడేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ బడిలో చేర్పించే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. 10న అంగన్వాడీ కేంద్రాల అలంకరణ, తల్లిదండ్రులు పిల్లలతో సెల్ఫీ దిగడం, 11న ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని అంగన్వాడీలో చేర్చకోవడం, 12వ తేదీ నుంచి 16 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ కిచెన్ గార్డెన్ల అభివృద్ధి, పౌష్టికాహార ప్రాముఖ్యత తెలియజేయడం, 17వ తేదీన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు. హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : ప్రభుత్వ వికలాంగుల బాలుర కళాశాల వసతి గృహంలో దివ్యాంగులు, అంధులు, బధిర విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత, తదితర వివరాల కోసం 9154759888 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. 30వ తేదీ వరకు బియ్యం పంపిణీనల్లగొండ : జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో జూన్, జూలై, ఆగస్టు (3 నెలలు)లకు సంబంధించిన సన్న బియాన్ని ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుదారులు సన్నబియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ నెల 30 వరకు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఉపకరణాలకు దరఖాస్తులునల్లగొండ : శారీరక, బధిర, అంధ, మానసిక దివ్యాంగుల్లో అర్హులైన వారి నుంచి ఉపకరణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిఽశు వికలాంగుల సంక్షేమ అధికారి కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్లైన్ వెబ్సైట్ ్టటౌ bmms. cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత, తదితర వివరాలకు 9441032444 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
పశుగ్రాసం సాగులో మెళకువలు
పెద్దవూర: పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటి సాగుకు ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే శాసీ్త్రయ పద్ధతిలో పశుగ్రాసం సాగు చేస్తే ఖర్చు తగ్గించవచ్చని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్రెడ్డి చెబుతున్నారు. డెయిరీ ఫాంల నిర్వహణ వ్యయంలో 70శాతం వరకు పశువుల మేతకే సరిపోతుందని, మేత ఖర్చును తగ్గిస్తే లాభాలు పెంచుకునే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. పాలశీతలీకరణ అధికారులు పాలు సప్లై చేసే రైతులకు 50 శాతం సబ్సిడీపై, అదేవిధంగా పశుసంవర్ధకశాఖ అధికారులు సైతం 50శాతం రాయితీపై పాడి రైతులకు విత్తనాలు ఇస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని పశుగ్రాసం సాగు చేస్తే గడ్డి కొరత తీరుతుందని ఆయన సూచిస్తున్నారు. పశుగ్రాసం సాగు చేసే విధానం● పశుగ్రాసం విత్తనాల్లో ప్రధానమైనవి సూపర్ నైపర్, కో1, కో 2, ఎస్ఎస్జీ–825 రకాలు. ● 85శాతం పచ్చిమేతను ఈ రకాల ద్వారా తీర్చుకోవచ్చు. ● ఒకసారి నాటితే 4 నుంచి 5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ● జనవరి నుంచి ఆగస్టు నెల వరకు విత్తనాలు విత్తుకోవచ్చు. ● అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆమ్ల గుణాలు గల నేలల్లో అధిక దిగుబడి ఉంటుంది. ● పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేని వారు తోటలు, కూరగాయ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ● ఎకరాకు 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ● దుక్కిలో 4 నుంచి 5 టన్నుల కంపోస్టు ఎరువు, 22 కిలోల యూరియా, 16 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ● విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 22 కిలోల యూరియా వేయాలి. ఎకరానికి 20 టన్నుల దిగుబడి వస్తుంది. ● అధిక విస్తీర్ణంలో సాగు చేసి సైలే జీ లేదా ఎండి గడ్డి రూపంలో నిల్వ చేసి వాడుకోవచ్చు. పాల దిగుబడి ఎక్కువే..పశుగ్రాసం సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరం అవుతుంది. విత్తనాలు నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకు వస్తుంది. పచ్చి మేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి. సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చి మేత వలన పాల దిగుబడులు 25 శాతం వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దాణా అవసరం లేకుండా కేవలం పచ్చి మేత ద్వారా 5 నుంచి 6లీటర్ల పాల దిగుబడి సాధించవచ్చు. పచ్చి మేతలో కాల్షియం, భాస్వరం వంటి మాంసకత్తులతో పాటు ఏ, డీ, ఈ విటమిన్లు, పిండి, కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. నీరు తక్కువగా ఉన్న పాంతాల్లోనూ పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. -
యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్ అధికారులు
యాదగిరిగుట్ట: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 2024 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు సౌరబ్ శర్మ, సలోని ఛబ్రా, హర్ష చౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్కుమార్ సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు ట్రైనీ ఐఏఎస్ అధికారులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. జైన మందిరంలో పూజలు.. ఆలేరురూరల్: ఆలేరు మండలం కొలనుపాకలోని జైన మందిరం, సోమేశ్వరాలయాన్ని కూడా ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పరిసరాలను పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ తదితరులు ఉన్నారు. -
నల్లగొండకేవీ నిధులు!
సాగర్ ఎడమకాల్వ మరమ్మతును పట్టించుకోని ప్రభుత్వం మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా 10.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ 0 కి.మీ నుంచి ఎడమకాల్వ పొడవు 179 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ కాల్వపైన మేజర్లు, మైనర్లు ద్వారా పొలాలకు నీరందుతుంది. లక్షల ఎకరాలకు నీరందించే ఈ కాల్వ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వారి సొంత జిల్లాల పరిధిలో ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు విడుదల చేయించుకున్నారు. కానీ.. అసలు కాల్వ మొదటి భాగం అయిన నల్లగొండ జిల్లా పరిధిలో మరమ్మతులకు మాత్రం నిధులు ఇవ్వలేదు. దీంతో నల్లగొండ జిల్లా పరిధిలో మెయిన్ కెనాల్తోపాటు మేజర్లు, మైనర్లు ఆనవాలు కోల్పోయే పరిస్థితి దాపురించింది. చివరి భూములకు అందని నీరు సాగర్ ఎడమకాల్వకు గతంలో చేపట్టిన ఆధునీకరణలో భాగంగా ఇరువైపులా 90శాతం మేర సీసీ లైనింగ్ చేశారు. కొన్నిచోట్ల వదిలేశారు. ఎడమకాల్వకు 14వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ, కట్టలు బలహీనంగా ఉండడంతో 11వేల క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ఎడమకాల్వ కింద మేజర్లు, మైనర్ల పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా పరిధిలో ప్రధానంగా వజీరాబాద్, కిష్టాపురం, ముల్కలకాల్వ మేజర్ పరిధిలో కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. సీసీ లైనింగ్ ఏర్పాటు చేయకపోవడంతో నీటి విడుదల కారణంగా కోతకు గురవుతున్నాయి. కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడంలేదు. దీంతో చివరి భూములకు ప్రతి సీజన్లో నీరందకుండా పోతోంది. ఈ సీజన్లో కూడా అదే పరిస్థితి దాపురించింది. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు.. ● ఎడమకాల్వ పరిధిలోని నల్లగొండ మినహా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో ఉన్న కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాలో కాల్వల అత్యవసర మరమ్మతుల కోసం రూ.1.26కోట్ల నిధులు కేటాయించారు. కాల్వలో ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగించి లైనింగ్ ఏర్పాటు చేసి దెబ్బతిన్న తూములకు, షట్టర్లకు మరమ్మతులు చేస్తున్నారు. పెన్పహాడ్ మండలం దోసపాడు వద్ద కాల్వ 74కి.మీ నుంచి నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం రంగుల వంతెన 133కి.మీ వరకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఆ పరిధిలోని 24 మేజర్ కాల్వలు, తూములకు పాత షట్టర్లను తొలగించి కొత్త షట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ● ఖమ్మం జిల్లాలో ఎడమకాల్వలో ముళ్ల కంప తొలగింపునకు నిధులు మంజూరయ్యాయి. వైరా, పాలేరు, లంకసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేపడుతున్నారు. క్రాస్ రెగ్యులేటర్ షట్టర్ల మరమ్మతుకు టెండర్లు పూర్తి చేశారు. ఖమ్మం, కల్లూరు సర్కిల్లో 15 ఎత్తిపోతల మరమ్మతులకు 1.50కోట్లు మంజూరయ్యాయి. పాలేరు ప్రధాన కాల్వపై కొట్టుకపోయిన్ అండర్ టన్నెల్ మరమ్మతులకు రూ.14కోట్లు కేటాయించారు. ఫ ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకే నిధులు కేటాయింపు.. ఫ నల్లగొండలో ఆనవాలు కోల్పోతున్న మెయిన్ కెనాల్, మేజర్, మైనర్ కాల్వలు ఫ సాగునీటి విడుదలపై ప్రభావంప్రభుత్వానికి ప్రతిపాదించాం నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమకాల్వ, మేజర్లు, మైనర్ల కట్టలకు మరమ్మతులు చేసేందుకు ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు మంజూరు కాకపోవడంతో ఈ వేసవిలో పనులు చేపట్టలేకపోయాం. నిధులు మంజూరైతే వెంటనే పనులు ప్రారంభిస్తాం. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో నిధులు మంజూరయ్యాయన్న విషయం మా దృష్టికి రాలేదు. సాగునీరు వృథా కాకుండా, చివరి భూములకు నీరందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – అజయ్కుమార్, ఎన్ఎస్పీ, సీఈ పొంచి ఉన్న ముప్పు ఇటీవల మిర్యాలగూడలో ఉమ్మడి జిల్లా నీటి పారుదలపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. ఎడమకాల్వ మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు ఆ జాడ చేయలేదు. త్వరలోనే సాగర్కు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉండగా వానాకాలం సీజన్ పంటలు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటిని విడుదల చేస్తే ఎడమకాల్వ పరిధిలోని కాల్వకట్టలకు ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
సమస్యలపై ప్రశ్నించేది కమ్యూనిస్టులే..
చింతపల్లి : ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలను ప్రశ్నించేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర నగర్లో నిర్వహించిన సీపీఐ 14వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మొదటి శత్రువు ముస్లింలు, రెండవ శత్రువు క్రైస్తవులు, మూడవ శత్రువు కమ్యూనిస్టులు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. రాష్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులనుంచి బయటకు రావడం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్రెడ్డి, అంజయ్యనాయక్, కలకొండ కాంతయ్య, ఉజ్జిని యుగేందర్రావు, పోలె వెంకటయ్య, ఉజ్జిని అంజల్రావు, చెల్లం పాండురంగారావు, కొలుకులపల్లి కొండలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం
మిర్యాలగూడ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంపై కోర్టుకు వెళ్తామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణ కమిటీ ముందు హరీష్రావు అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ అప్పులు మిగిల్చిపోయాడని, కాంగ్రెస్ ప్రభుత్వం 16నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఇటీవల రూ.5వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. రూ.22వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల భారం పడిందన్నారు. రాబోయే మూడేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీళ్లు అందిస్తామన్నారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందని, ఆ దయ్యాలెవరో ఇంతవరకు బయటకు రాలేదన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 68 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం లేకుండా, రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిర సౌర గిరి జల వికాస పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లోని 14 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. 6800 మంది గిరిజనులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో ఈ పథకం కింద సాగు చేసుకునే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన, రెండున్నర ఎకరాల పొలం ఉన్న గిరిజన రైతులకు సోలార్ యూనిట్ ఇస్తారమని తెలిపారు. మొదటి సంవత్సరం జిల్లాలో 270 మంది గిరిజనులకు ఈ పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అనంతరం ఈసీఐఎల్ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్న మోటార్ బ్యాటరీ సైకిళ్లు, తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రయత్నాలు
యాదగిరిగుట్ట: అమెరికా తరహాలో మన దేశంలోనూ అధ్యక్ష పాలన దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం. సాయిబాబా అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ప్రారంభమైన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. బీజేపీ విధానాలను తిప్పి కొట్టాలని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 14 మంది ప్రధాన మంత్రులు రూ.50లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోదీ ఒక్కరే రూ.170 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. మన దేశం ఆకలి సూచీలో ప్రపంచంలోనే 104 స్థానంలో ఉందని, దీనిని అభివృద్ధి అనాలి అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాక ముందు దేశంలో 100 మంది కోటీశ్వరులు ఉంటే ఇప్పుడు 200మంది అయ్యారని దుయ్యబట్టారు. మోదీ పేదల సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. భద్రతా లోపం వల్లే పహల్గాంలో ఉగ్రదవాదుల దాడిలో 21 మంది అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. శిక్షణ తరగతులకు ముందు పార్టీ మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి పార్టీ జెండాను ఎగురవేశారు. పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా -
కోతుల దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
మోత్కూరు : కోతుల దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి భిక్షమయ్య(75) తన ఇంటి ఆవరణలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డాయి. అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. భిక్షమయ్య కుటుంబ సభ్యులు గమనించి కోతులను తరిమేసి అతడిని మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా గ్రామంలో కోతుల సంచారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, కోతుల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. -
కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి
గట్టుప్పల్: కుక్కల దాడిలో కృష్ణ జింక మృతిచెందింది. ఈ ఘటన గట్టుప్పల్ మండల పరిధిలోని నామాపురం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాపురం గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం సమీపంలో గడ్డి మేస్తున్న కృష్ణ జింకను కుక్కలు వెంటాడి చంపాయి. సమీపంలోని రైతులు గమనించి కృష్ణ జింకను విడిపించే ప్రయత్నం చేయగా.. కుక్కలు రైతుల వెంటపడడంతో వారు తప్పించుకున్నారు. అటవీశాఖ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి జింకల పార్కు ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, భీమనపల్లి రాములు డిమాండ్ చేస్తున్నారు. బాలుడికి గాయాలు..నేరేడుచర్ల: కుక్కల దాడిలో బాలుడు గాయపడిన ఘటన సోమవారం నేరేడుచర్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రావిరాల మన్విత్ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నేరేడుచర్ల మున్సిపాలిటీలోని చింతబండకు వచ్చాడు. బంధువుల ఇంటి వద్ద పిల్లలతో కలిసి మన్విత్ ఆడుకుంటుండగా.. కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే మన్విత్ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి పున్న నాగిని తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం వలిగొండ: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దాపురం గ్రామానికి చెందిన సోలిపురం నర్సిరెడ్డి(55) ఆదివారం సాయంత్రం తన ఇంటి నుంచి వ్యవసాయ బావి వద్దకు తొర్రూరు–వలిగొండ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
‘వ్యవసాయ పాలిటెక్నిక్’లో ప్రవేశాలు
త్రిపురారం: అగ్రికల్చర్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థుల కోసం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా త్రిపురారం మండలం కంపాసాగర్లో గల వ్యవసాయ పరిశోధనా స్థానంలో పాలిటెక్నిక్ కళాశాలను 2007లో ప్రారంభించారు. పదో తరగతి ఉత్తీర్ణులై, అగ్రికల్చర్ విభాగంలో పాలిసెట్–2025లో ర్యాంకు సాధించిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరేందుకు గాను ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు :దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు. పదో తరగతిలో వచ్చిన మార్కులు, పాలిసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అర్హత సాధించిన వారికి మాత్రమే సమాచారం అందిస్తారు. వివరాలకు www.pjtsau. edu.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల వ్యవధి రెండేళ్లు కాగా.. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి మూడేళ్లు ఉంటుంది. కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ● దరఖాస్తు ఫీజు : దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఇతర అభ్యర్థులకు రూ.1200, ● ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : జూన్ 28● ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ : జూన్ 29● దరఖాస్తులు తప్పుల సవరణకు చివరి తేదీ : జూన్ 30 ఆన్లైన్లో దరఖాస్తునకు ఈ నెల 29 వరకు గడువు పదో తరగతి మార్కులు, పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ఎంపికయూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎంపికవిద్యార్థుల ఎంపిక యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. కంపాసాగర్ పాటిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ప్రశాతం వాతావరణంలో విద్యా బోధన ఉంటుంది. విద్యార్థులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులపై క్షేత్రస్థాయిలో మెళకువలు నేర్చుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ లింగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం -
ఇందిరమ్మా.. ఇదేమిటమ్మా!
ఇళ్ల నిర్మాణానానికి నిబంధనల చిక్కులు● 600 చదరపు అడుగుల్లోనే నిర్మించుకోవాలంటున్న అధికారులు ● అంతకు మించితే బిల్లులు ఇవ్వమని స్పష్టీకరణ ● పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో కొంత సడలింపు ● అయోమయంలో లబ్ధిదారులు ● నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నవీ నత్తనడకనే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనల చిక్కు వచ్చింది. సొంత స్థలం ఉన్న పేదలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి తాము కొంత కలుపుకొని ఇంటిని పెద్దగా నిర్మించుకుందామంటే.. నిబంధనలు ఒప్పుకోమంటూ అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారులు గందరగోళంలో పడ్డారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఇళ్లు మంజూరైన గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ నిబంధనల నుంచి ఊరట లభించినా.. మిగతా వారికి మంజూరైన ఇళ్ల విషయంలో నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ప్రతి నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. దాంతో జిల్లాలో మొత్తం 19,698 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామంలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇళ్లను కేటాయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో 1753 ఇళ్లను మంజూరు చేసింది. వాటి నిర్మాణాలు కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉంటే, మరికొన్ని రూప్ స్థాయిలో ఉన్నాయి. 250 ఇళ్లకు బిల్లులు చెల్లింపు జిల్లాలో 350 ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ స్థాయిలో ఉండగా, మూడు ఇళ్లు రూప్ లెవల్కు చేరకున్నాయి. మిగిలినవి ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. వాటిల్లో 250 ఇళ్లకు ఇప్పటికే మొదటి విడత బిల్లును హౌసింగ్ అధికారులు మంజూరు చేశారు. లబ్ధిదారుల అయోమయం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు లబ్ధిదారులు కొంత డబ్బును కలుపుకొని ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు రూ.5 లక్షలతో 600 చదరపు అడుగలలోనే (ఎస్ఎఫ్టీ) ఇల్లు నిర్మించాలనే నిబంధన విధించింది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో కొందరు 600 ఎస్ఎఫ్టీకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే వారు కింద ఎంత వెడల్పులో నిర్మాణం చేపట్టినా.. పైన స్లాబ్ లెవల్లో మాత్రం 600 ఎస్ఎఫ్టీలోపే నిర్మించుకుంటామని రాత పూర్వకంగా లేఖలు ఇచ్చిన వారికి మొదటి విడత బిల్లులు చెల్లించారు. మిగిలిన ఇళ్ల విషయంలో మాత్రం 600 ఎస్ఎఫ్టీకి మించితే బిల్లులు ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు నిర్మాణాల విషయంలో అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి తోడు మరికొంత అప్పు చేసి ఇంటిని పెద్దగా నిర్మించుకోవాలన్న ఆలోచనల్లో ఉన్నా.. కానీ ప్రభుత్వ నిబంధన వారిని ఇరకాటంలోకి నెట్టింది.600 ఎస్ఎఫ్టీలోపు నిర్మించాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉంటేనే బిల్లులు మంజూరవుతాయి. 600 ఎస్ఎఫ్టీకి మించి నిర్మాణాలు చేయొద్దు. అంతకు మించితే చెల్లింపులకు నిబంధనలు ఒప్పుకోవు. ప్రతి లబ్ధిదారుడు నిబంధనల ప్రకారం ఇంటిని నిరించుకోవాలి. – రాజ్కుమార్, హౌసింగ్ పీడీ 17,945 ఇళ్లకు ప్రొసీడింగ్స్ పైలెట్ ప్రాజెక్టులో మంజూరు చేసిన ఇళ్లు పోగా, మిగిలిన 17,945 ఇళ్ల నిర్మాణాలకు జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రొసీడింగ్స్ అందజేసింది. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు గుర్తించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో గెజిటెడ్ అధికారులు పరిశీలించి ఫైనల్ చేసి, ఆ జాబితాను జిల్లాస్థాయికి పంపితే కలెక్టర్ ఆమోదంతో ఇన్చార్జి మంత్రికి పంపించారు. ఆయన ఆమోదంతో ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రొసీడింగ్స్ అందజేశారు. మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలు ముగ్గు పోసి నిర్మాణాలు ప్రారంభిస్తుండగా నల్లగొండ, ఇతర నియోజక వర్గాల్లో లబ్ధిదారులే ముగ్గు పోసుకొని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. -
ఆర్థిక స్వావలంభనే లక్ష్యం
రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తున్నారు. - 10లోపటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం : ఎస్పీనల్లగొండ : బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం నల్లగొండలోని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్, అవసరమున్న చోట పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. -
జిగేల్.. జిగేల్..
ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధ రకాల డిజైన్లతో సీలింగ్, ఇతర పనులను చేయిస్తున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీఓపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్పై లామినేట్స్ తెప్పించి కంటికి అందంగా కనిపించేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న ఆకర్షణీయమైన వస్తువులు, స్థానికంగా లభించే అందమైన కళాకృతులు, వేలాడే లైట్లు, కిటికీలు, టీ పాయ్ సొగసులు, ప్రత్యేక లైట్లతో సీలింగ్ డిజైన్లు ఆకర్షించేలా నిర్మించుకుంటున్నారు. విద్యుత్ దీపాల వెలుగులో ఇల్లంతా మరింత జిగేల్.. జిగేల్ మనేలా మార్చుకుంటున్నారు. ఇలా ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కాలానుగుణంగా ఒకరిని చూసి మరొకరు ఇంటిని నిర్మాణాన్ని చేపడుతున్నారు. -
చెరువు శిఖం ఆక్రమణ పరిశీలన
శాలిగౌరారం : మండలంలోని మాధారంకలాన్లో ఆక్రమణకు గురైన రామసముద్రం చెరువు శిఖం భూమిని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి శనివారం పరిశీలించారు. చెరువు ఆయకట్టు రైతులు చెరువు శిఖం ఆక్రమణపై కలెక్టర్, ఎస్పీలతోపాటు ముఖ్యమంత్రికి రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశానుసారం నల్లగొండ ఆర్డీఓ ఆశోక్రెడ్డి శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఎస్ఐ సైదులు, మండల సర్వేయర్ పద్మ, నీటిపారుదలశాఖ ఏఈ విక్రమ్ ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమిని పరిశీలించారు. ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమిని స్వాధీన పరుచుకొని చెరువు శిఖం హద్దు వరకు గోతిని తవ్వేందుకు జేసీబీని పిలిపించారు. చెరువు హద్దును నిర్ణయించే క్రమంలో వరికుప్పల జానకమ్మ, ఆమె కుటుంబీకులు జేసీబీని అడ్డుకోవడంతో పాటు ఆర్డీఓతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇద్దరిపై కేసు నమోదు ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూమి స్వాధీన పరుచుకునేందుకు ఆర్డీఓ ప్రయత్నించగా వరికుప్పల జానకమ్మ, వరికుప్పల శ్రీనివాసు కలిసి అధికారులకు అడ్డుగా నిలిచి వారి విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీనిపై తహసీల్దార్ యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదులు వివరించారు. -
ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పూజలు
కనగల్ : దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ పుట్ట మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయంతోపాటు దర్వేశిపురం, కనగల్లు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జల్లెపల్లి జయరామయ్య, చైర్మన్ చిదేటి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, ధర్మకర్తలు నగేష్గౌడ్, నవీన్గౌడ్, శంకర్రెడ్డి, రాజు, నరేష్, వెంకటయ్య, బాబు, రమేష్, దుర్గమ్మ, అర్చకులు మల్లాచారి, శ్రవణ్కుమార్, ఉమామహేశ్వరరావు, దామోదర్, పణి, నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య, నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్రెడ్డి, ఆంజనేయులు, రాజయ్య, రాజు, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్
అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కిచెన్, లివింగ్ రూం, డబుల్బెడ్ రూమ్కు ఉడ్ వర్క్కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఉడ్వర్క్కు సంబంధించి బెంగళూరు, ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. ఇంటికి ఇటాలియన్ టైల్స్ వాడితే లుక్కింగ్ గ్రాండ్గా ఉంటుంది. సీలింగ్లో ప్రొఫైల్ లైట్స్, బాల్కనీలో డబ్ల్యూ పీవీసీ సీలింగ్ బాగుంటుంది. ఉడ్ వర్క్లో కిచెన్, బెడ్ రూమ్లో 6 ఎంఎం డబ్ల్యూపీవీసీ వాడితే చెదలు రాకుండా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్లు చూపించిన ఇంటిని ముస్తాబు చేసి ఇస్తున్నాం. – జి.దినేష్, ఇంటీరియర్ డిజైనర్, నల్లగొండ ఆహ్లాదకర వాతావరణం ఉండాలి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అనుభవం ఉంటే తప్ప అందమైన ఇల్లు నిర్మించలేం. ఇంటికి కావాల్సిన డిజైన్లు అన్నీ డిజైనర్లు, అర్కిటెక్షర్ల వద్ద అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్స్ కోసం ఒకప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నల్లగొండలోనే లభ్యమవుతున్నాయి. – వై.పద్మ, ఇంటి యజమాని, నల్లగొండ -
నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నీటి విడుదల
శాలిగౌరారం : జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వానాకాలం పంటల సాగుకు ఆదివారం నీటి విడుదల చేయనున్నట్లు నీటిపారుదలశాఖ డీఈ సత్యనారాయణ శనివారం సాయంత్రం తెలిపారు. నీటి విడుదల కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, రైతుప్రతినిధులు హాజరు కావాలని కోరారు. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా.. ప్రస్తుతం 18 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు కింద మండలంలోని తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రైతు భరోసా విడుదల చేయాలినల్లగొండ టౌన్ : రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఆయన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసా విడుదల చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటలను సాగు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని నకిలీ విత్తనాలను పురుగుల మందులను అరికట్టాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, పాలడుగు నాగార్జున, ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాసం, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలిసంస్థాన్ నారాయణపురం: మునుగోడు ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించాలని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుర్విరాజుగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేకు ఏమైనా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, రైతు కూలీలు హైదరాబాద్కు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు దోనూరు వీరారెడ్డి, సోమ నరసింహ, బచ్చనబోయిన దేవేందర్, జక్కలి రాజు, దర్శనం వేణు, భాస్కర నరసింహ, వంగరి రఘు, సూరపల్లి శివాజీ, నందగిరి పాల్గొన్నారు. -
ఇక్కడి ప్రజల అదృష్టం
– ప్రభుత్వ విప్ అయిలయ్య ఆలేరు పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని, ఒకేసారి రూ.1000 కోట్లపైనా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గంధమల్లను రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజాప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 100కు పైగా చెరువును నింపుకున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలకు బదులుగా మద్యం దుకాణాలు ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తుందన్నారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
మూసీని ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపుతాం ● గత ప్రభుత్వం గంధమల్లను పట్టించుకోలేదు ● ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. ● తిర్మలాపూర్ సభలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రులతో కలిసి గంధమల్ల రిజర్వాయర్తో పాటు సుమారు రూ.1051.45 కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. గంధమల్లకు నీరెక్కడినుంచి ఇస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుల తీరును ఆయన దుయ్యబట్టారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి గంధమల్ల జలాశయానికి నీటిని అందిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తిచేసి తీరుతామన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు, బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువలను పూర్తి చేస్తామన్నారు. గత సర్కార్ యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను సకాలంలో ప్రారంభించలేకపోయిందన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా.. నా పుట్టిన రోజు సందర్భంగా మూసీ వెంట పాదయాత్ర చేశానని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. మూసీ కాలుష్యం నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు గోసపడుతున్నారని, ప్రజల కన్నీటిగోస తీర్చడానికి ఆరునూరైనా మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపి తీరుతానని అన్నారు. గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం యాదగిరిగుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలోభక్తులకు కల్పించని సౌకర్యాలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గుట్టమీద ఎవరూ నిద్రించ వద్దని గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాము అధికారంలోకి రాగానే ఎత్తివేశామన్నారు. గుట్టపైకి ఆటోలను అనుమతించామని గుర్తుచేశారు. మహిళల అభివృఽధ్ధిలో భాగంగా ఇందిరామహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, విద్యార్థులకు యూనిఫాం కుట్టే పనులను అప్పగించామన్నారు. మహిళలపేరునే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, గహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కుంభం అనిల్కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, బండ్రు శోభారాణి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, భువనగిరి డీసీసీ అక్షాంశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన జనంశంకుస్థాపన చేసిన పనులు ఇవే.. రూ.574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి పనులకు రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.8.25 కోట్లతో మోటకొండూరులో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నిర్మాణం పనులకు రూ.22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు రూ.21.14 కోట్లతో ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణ పనులకు -
వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు చాలా పవర్ఫుల్ అని, ఆయన దీవెనలతోనే తమ ప్రభుత్వం వచ్చిందన్నారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులు కల్పించాలని సౌకర్యాలపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయడంతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో ఐదేళ్లు కాంగ్రెస్దే అధికారమన్నారు. ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
పెద్దఅడిశర్లపల్లి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండలంలోని కేశంనేనిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న కేశంనేనిపల్లిలో 98 ఇళ్లు మంజూరు కాగా 42 ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం ఘనిపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఆర్డీవో రమణారెడ్డి, తహసీల్దార్ మధుహాసిని పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన గుర్రంపోడు : మండలంలోని జూనూతులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధివిదానాలకు లోబడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటే పూర్తిగా డబ్బులు వస్తాయని తెలిపారు. జూనూతుల గ్రామంలో మొదటి విడతలో 30 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. అందులో 23 మంది నిర్మాణాలు మొదలు పెట్టగా 12 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడీఓ మంజుల తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రోడ్లు, భవనాలు, ఎకై ్సజ్, ఆర్టీఏ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలపై శుక్రవారం కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మీదుగా వెళ్లే 65, 167, 565, 365, 575వ నంబర్ జాతీయ రహదారులతోపాటు నార్కట్పల్లి – అద్దంకి రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమతున్న తరుణంలో ప్రైవేట్ పాఠశాలలు వారి బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు. రహదారుల వెంట కంపచెట్లు తొలగించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అమ్మే, వినియోగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మిషన్ పరివర్తన్ కింద అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాము, డీటీఆర్బీ రిటైర్ సీఐ అంజయ్య, ఆర్అండ్బీ, నేషనల్, స్టేట్ హైవే ఇంజనీర్, ఎకై ్సజ్, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ప్రతి పేదవాడికి ఆహారభద్రత
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆహారభద్రత కల్పించడమే ధ్యేయమని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కల నేరవేర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకువచ్చి, అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి వ్యక్తి, ప్రతి రైతు మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేస్తామని, భూసేరణ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. గంధమల్ల రిజర్వాయర్ను ముంపు లేకుండా సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
వర్షాలు కురిస్తేనే విత్తనాలు పెట్టాలి ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వర్షాలు కురిసిన తరువాతనే రైతులు పత్తి విత్తనాలు పెట్టుకోవాలి. వర్షాలు పడకుండా విత్తనాలు పెట్టుకుంటే అవి మాడిపోయే ప్రమాదం ఉంటుంది. రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకుని నష్టపోవద్దు. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ నల్లగొండ అగ్రికల్చర్ : వర్షాలు ముఖం చాటేసాయి. ఈ ఏడాది వర్షాలు ముందస్తుగానే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం.. అందుకు తగ్గట్టుగానే వారం క్రితం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వారంలో వర్షం కురవకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం కురిసిన వాన.. జిల్లాలో గత నెల చివరి వారంలోనే రెండు రోజుల పాటు జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను పెట్టుకునేందు సిద్ధంగా ఉన్నారు. అప్పటికే దుక్కులు దున్నుకున్నవారు పత్తి విత్తనాలు పెట్టారు. బోరు బావుల కింద వరినార్లు కూడా పోసుకున్నారు. ఈ నెల 8న ఆదివారం మృగశిర కార్తి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రైతులు ఏరువాక ప్రారంభించనున్నారు. కానీ ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో ఇప్పటికే విత్తిన పత్తి విత్తనాలు మాడిపోయే ప్రమాదం ఉంది. మారిన వాతావరణం వానాకాలంలో ప్రస్తుతం వాతావరణం వేసవిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. ఉక్కపోత, ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే తప్ప వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు సాధారణ వర్షం కూడా కురవలేదు. కేవలం కట్టంగూరు మండంలో అధిక వర్షం కురవగా.. నకిరేకల్ మండలంలో సాధారణ వర్షపాతం నమొదైంది. మిగతా 14 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. 17 మండలాల్లో వర్ష ప్రభావమే కనిపించలేదు. దీంతో వర్షాల కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఫ కనిపించని చినుకు జాడ ఫ ప్రారంభమైన వానాకాలం సీజన్ ఫ వాన కోసం రైతుల ఎదురుచూపులు -
మంత్రి కోమటిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు
నల్లగొండ : త్యాగానికి ప్రతీక అయిన ఈద్ ఉల్ అదా (బక్రీద్) సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతిని చాటే బక్రీద్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించుకోవాలికేతేపల్లి : రెవెన్యూ సదస్సులో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కేతేపల్లి మండలంలోని భీమవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా భూమికి సర్వే నంబర్లు తప్పుగా ఉండటం, ఆన్లైన్లో భూమి నమోదు కాకపోవడం తదితర భూ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీటీ సత్తార్, పంచాయతీ కార్యదర్శి అనిల్, రెవెన్యూ అధికారులు ఆనంద్, అశ్విని, సంధ్య, విజయ్, బడుగుల నరేందర్యాదవ్ ఉన్నారు. రైతులకు రుణాల మంజూరు సులభతరంనల్లగొండ టౌన్ : రైతులకు రుణాల మంజూరు సులభం చేయడం కోసం పాలసీల్లో మార్పులు చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార బ్యాంకు అంటేనే రైతుల బ్యాంక్ అని రైతుల అభివృద్ధికి బ్యాంకు సహాయ పడుతుందని తెలిపారు. రైతులు బ్యాంకులో రుణం పొంది ఏదైనా కారణం చేత మరణిస్తే వారికి ఓటీఎస్ (వన్టైం సెటిల్మెంట్) సదుపాయం కల్పించాలని తీర్మాణించినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రాఫ్ వైజ్గా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి, సీఈఓ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. డీఏ ప్రకటన నిరాశ పరిచిందినల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన డీఏ పెన్షనర్లను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూకల జగదీశ్చంద్ర, పందిరి శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం నుంచి ఐదు విడతల డీఏ పెంపు కోసం పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వ ప్రకటన పెన్షనర్లను ఎంతో నిరాశ పరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం రెండు డీఏలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిపికేషన్నల్లగొండ : డీఈఈ సెట్–2025లో ర్యాంకు సాధించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు నల్లగొండలోని డైట్లో సర్టిఫికెట్ వెరిపికేషన్కు హాజరుకావాలని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ ప్రిన్సిపాల్ కానుగుల నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించన వారికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరి ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్సీ) కోర్సుల్లో 2025–27 బ్యాచ్ మొదటి సంవత్సరంలో ప్రవేశం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. -
అట్టహాసంగా బడిబాట ప్రారంభం
నల్లగొండ : బడిబాట కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామసభలు నిర్వహించారు. అంతటా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులతో సభ నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిపై చర్చించడంతోపాటు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించే విధంగా అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభమైందని.. నాణ్యమైన విద్యను అందిస్తామన్న భరోసాను కల్పించారు. ప్రభుత్వ బడి – చదువుల గుడి : డీఈఓ కనగల్ : ప్రభుత్వ బడి–పేద పిల్లల చదువుల గుడి అని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం కనగల్ మండలంలోని దర్వేశిపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు, నోట్పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు. ఫ తొలిరోజు జిల్లా అంతటా గ్రామసభలు -
రోడ్డు విస్తరణకు సహకరించాలి
చండూరు: రోడ్డు విస్తరణ పనులకు స్థానిక దుకాణదారులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్లో భాగంగా బంగారిగడ్డ, చండూరులో ఎమ్మెల్యే పర్యటించారు. బంగారిగడ్డలో ఆరోగ్యకేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బంగారిగడ్డలోని గట్టుప్పల్–చౌటుప్పల్ కూడలి అభివృద్ధిపై చర్చించారు. చండూరు పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. మెయిన్ సెంటర్లో ఇంకా విస్తరణ పనులు చేయాల్సిన 400 మీటర్ల విషయంలో దుకాణదారులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ జరిగితే పట్టణ ప్రజలకే మేలు జరుగుతుందని, రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. ఇచ్చిన మాటప్రకారం చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పుష్పలత, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కొరిమి ఓంకారం, అనంత చంద్రశేఖర్గౌడ్, జిల్లా నాయకుడు కావలి ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాతవెంకటేశ్, కోడి శ్రీనివాసులు, కోడి గిరిబాబు, కల్లెట్ల మారయ్య, మల్లేశం, శేఖర్, వెంకటేశ్, దశరథ, సైదులు, లింగయ్య, వేణు, రాజశేఖర్, రామ్మూర్తి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
బడి బస్సుపై నిర్లక్ష్యం ఏలా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పాఠశాలల పునఃప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉన్నా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్య) పరీక్షలు చేయించుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించి ఆర్టీఏ కార్యాలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. గతంలో ఫిట్నెస్ లేకున్నా కొందరు బస్సులను నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి ఆర్టీఏ అధికారులు మాత్రం ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఐదు రోజులే గడువు..జూన్ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన బస్లను ముందుగానే ఫిట్నెస్ చేయించుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లాలో మొత్తం 706 బస్సులను ఆయా విద్యా సంస్థలు వినియోగిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 296 బస్సులను మాత్రమే పిట్నెస్ చేయించారు. ఇంకా 410 బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. ఈ నెల 12న స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవడానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఫ స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేయించుకోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫ పాఠశాలల పునఃప్రారంభానికి ముందే చేయించుకోవాలని నిబంధన ఫ జిల్లాలో 706 బస్సులకు, 296 బస్సులకే ఫిట్నెస్ ఫ వీటిలో 15 ఏళ్ల గడువు దాటినవి 349 బస్సులు ఫ వాటిని నడిపేందుకు వీల్లేందంటున్న ఆర్టీఏ అధికారులు15 ఏళ్లు దాటితే నడపొద్దు జిల్లాలోని స్కూల్ బస్సుల్లో 15 సంవత్సరాలు గడిచినవి 349 బస్సులు ఉన్నాయి. వాటిని ఫిట్నెస్ చేయడానికి అవకాశం లేదు. అవన్నీ ఉపయోగించడానికి వీల్లేదు. అవి కండీషన్లో ఉన్నా కాలపరిమితి తీరినందున నిబంధనల ప్రకారం వాటిని నడిపేందుకు అవకాశం లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే సీజ్ చేస్తాం ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపితే సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు ప్రారంభం నాటికే బస్లు అన్ని ఫిట్నెస్ చేయించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిపే బస్సులను గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తాం. పిట్నెట్ లేకుండా బస్సులు నడపడానికి వీల్లేదు. – లావణ్య, ఎంవీఐ, నల్లగొండ -
వేసవి శిక్షణతో నైపుణ్యాలు మెరుగు
నల్లగొండ టూటౌన్ : వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయని డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన హాజరై మాట్లాడారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో 500 మంది విద్యార్థులు పాల్గొని వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను మెరుగు పరిచే దిశగా క్రీడల శాఖ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఆర్డీఓ అశోక్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల, కోచ్లు నాగార్జున, నగేష్, శ్రీధర్, పవన్, శ్రీనివాసులు, సైదులు, అంబటి ప్రణీత్, ప్రేమ్, లోకేష్, లింగయ్య, సునీత, దాసు, నాగార్జున, ప్రకాష్నారాయణ, నజీరుద్దీన్ పాల్గొన్నారు. -
తక్కువ ధరకు సిమెంట్ ఇప్పిస్తా
మునుగోడు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చండూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీ యజమానులతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో మాట్లాడించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందేలా చేస్తానన్నారు. కొందరు అధికారుల అలసత్వం వల్ల కొన్ని గ్రామాల్లో అనర్హులకు ఇళ్లు మంజూరయ్యాయని.. వాటిని అధికారులు సరిద్దిది అర్హులకు అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఈ ప్రాంతానికి సాగునీరు అందించితీరుతానన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్రాని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చిందని.. అలాంటి తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అమిత్ నారాయణ్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, చండూరు ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ చైర్మన్ దొటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
బడిబాటను విజయవంతం చేయాలి
నల్లగొండ : జయశంకర్ బడిబాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న బటిబాట కార్యక్రమాలపై గురువారం నల్లగొండలో వివిధ శాఖల అధికారులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీ నాటికి పాఠశాలలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదే రోజున యూనిఫాం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో మండల, జిల్లాస్థాయి అధికారులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ -
నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక
యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సుమారు రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురం గ్రామం వేదిక కానుంది. అన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు తిర్మలాపూర్ వద్దనే ఆవిష్కరించనున్నారు. అక్కడే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందజేయనున్నారు. అనంతరం తిర్మలాపురం గ్రామంలో జరిగే సీఎం సభలో పాల్గొననున్నారు. శంకుస్థాపన చేసే పనులు ఇవే.. ● యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. టెంపుల్ సిటీలో 15 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం. దాతారుపల్లి రెవెన్యూ పరిధిలోని వైటీడీఏ స్థలంలో రూ.180కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం, దాతారుపల్లిలో రూ.15కోట్లతో ఏర్పాటు చేసే వేర్ హౌజ్ గోదాములకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ● తుర్కపల్లి మండలంలోని గంధమల్ల రిజర్వాయర్ పనులకు, రాంపూర్తండా సమీపంలో 15ఎకరాల స్థలంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన. ● ఆలేరు నియోజకవర్గంలో రూ.50 కోట్ల నిర్మించనున్న ఆర్అండ్బీ రోడ్లకు, రూ.14.50 కోట్లతో ఆలేరు మండలం కొలనుపాక, రాజాపేట మండలం కాల్వపల్లి వాగులపై హైలెవల్ బ్రిడ్జిలు, రూ.30 కోట్లతో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్లకు, మోటకొండూర్లో రూ.10కోట్లతో ఎంపీపీ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ భవనాలకు, ఆలేరులో రూ.15కోట్లతో నిర్మించే మార్కెట్ యార్డు గోదాములకు శంకుస్థాపన చేస్తారు. సీఎం వెంట రానున్న ప్రముఖులు వీరే.. సీఎం రేవంత్రెడ్డి వెంట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదరం రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నారు.ఫ రూ.1,500 కోట్ల పనులకు తుర్కపల్లి మండలంలో తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు ఫ అక్కడే సభలో ప్రసంగించనున్న సీఎం రేవంత్రెడ్డి ఫ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్ అందజేత సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్ సభాస్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. 2.40కి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి తిర్మలాపూర్ చేరుకుంటారు. 3.10కి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే బహిరంగసభలో పేదలకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్ అందజేస్తారు. 5 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. -
బధిరుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
నల్లగొండ : మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురం ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో చెవిటి, మూగ విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.నంద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్లో, 9, 10 తరగతులకు తెలుగులో బోధన ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఎలా చేయాలి, ప్రవేశాలకు గడువు, పాఠశాలలో సౌకర్యాలు తదితర వివరాల కోసం 9885842339 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్గా షరీఫ్నల్లగొండ టూటౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ –1 ప్రోగ్రాం ఆఫీసర్గా హిస్టరీ అధ్యాపకుడు డాక్టర్ మహమ్మద్ షరీఫ్ను నియమిస్తూ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి గురువారం నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంజిరెడ్డి, పనస రామకృష్ణ, కాసాని శ్రీనివాస్, డాక్టర్ మద్దిరాల సత్యనారాయణరెడ్డి, వివేక్, అభినవ్, అరవింద్ పాల్గొన్నారు. ప్రశాంతంగా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలునల్లగొండ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం నల్లగొండలోని రెండుకేంద్రాల్లో నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 66 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. 9న అప్రెంటిషిప్ మేళానల్లగొండ : ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ఉదయం 10 గంటలకు అనుములలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ప్రధాని జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.మల్లికార్జున్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను వెబ్సైట్ www.apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8686880100 పోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. మానవ మనుగడకు చెట్లే ఆధారంరామగిరి(నల్లగొండ) : మానవ మనుగడకు చెట్లే ఆధారమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో గురువారం రాయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తమరావు, న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్, దుర్గాప్రసాద్, రోజారమణి, కులకర్ణి, కవిత, ప్రమీలా జైన్, శిరీష, డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.భీమార్జున్రెడ్డి, లెనిన్బాబు, న్యాయవాదులు జి.శ్రీనివాసచక్రవర్తి, జనిగల రాములు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయిమెంట్ కార్డుతో ఉద్యోగావకాశాలు నల్లగొండ : ఎంప్లాయిమెంట్ కార్డు కలిగిన వారికి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాల కల్పనలో ప్రాధాన్యం ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి అర్హతలతో ఎంప్లాయిమెంట్ కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో, వెబ్సైట్ employment.telangana. gov.in వెబ్సైట్ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్డు పొందిన వ్యక్తి 54 సంవత్సరాలు వచ్చే వరకు, ఉద్యోగం పొందే వరకు మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కాలర్షిప్కు దరఖాస్తులు నల్లగొండ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వెబ్సైట్ telanganaepass.cgg.g ov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
రైతుకు రక్ష.. భూసార పరీక్ష
దేవరకొండ : వ్యవసాయంలో ఎరువుల వాడకంపై అవగాహన లేక దిగుబడులు తగ్గి రైతన్నలు కొన్ని సందర్భాల్లో నష్టాలపాలవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నేల స్వభావాన్ని తెలుసుకొని అందుకు అవసరమైన విధంగా రైతులు పంటలకు ఎరువులు అందిస్తే మేలంటున్నారు వ్యవసాయ అధికారులు. ఈ అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తూ భూసార పరీక్షలు చేపడుతున్నాయి. అందులో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ స్కీం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 మండలాలను ఎంపిక చేశారు. ఈ స్కీంలో భాగంగా ప్రతి మండలంలో 125 మంది రైతులను ఎంపిక చేసి వారి పొలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభించారు. రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించి మోతాదుకు మించి రసాయనాలు వాడకుండా చూడనున్నారు. మట్టి నమూనాల సేకరణ అనంతరం జియో ట్యాగింగ్ సైతం చేయనున్నారు. మట్టి పరీక్షల అనంతరం రైతులు పండించే పంటలకు ఎరువులు, రసాయనాల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఎంపికై న మండలాలు ఇవే.. నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, మునుగోడు, చండూరు, శాలిగౌరారం, అనుముల, నిడమనూరు, తిరుమలగిరి సాగర్, చింతపల్లి, త్రిపురారం, కట్టంగూర్.అధిక దిగుబడులు సాధించవచ్చు భూసార పరీక్షలు చేయడం ద్వారా రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పంటలకు అవసరమైన పోషకాలు అందించి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఎంపిక చేసిన ప్రతి మండలంలో 125 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి.. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు తగు సూచనలు అందిస్తాం. – శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ ఫ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద 15 మండలాలు ఎంపిక ఫ ఎంపిక చేసిన రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరణ ఫ సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన భూసార పరీక్షతో లాభాలు ఇలా.. భూసార పరీక్ష ద్వారా నేల స్వభావాన్ని గుర్తించి అవసరం మేరకు ఎరువులు ఉపయోగించవచ్చు. భూమిలో ఉన్న పోషకాలను తెలుసుకోవచ్చు తద్వారా రైతులు సాగు చేసిన పంట ఆరోగ్యవంతంగా ఉంటుంది. పంట సాగులో తక్కువ పెట్టుబడులు అవసరం పడుతాయి. సాంకేతిక సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రస్తుతం చేస్తున్న భూసార పరీక్షలతో ఎరువుల వాడకాన్ని అంచనా వేయడంతో పాటు పరీక్షల కోసం వచ్చే రైతులు తన భూమి వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ఆయా గ్రామాల్లో ఏఏ రకాల ఎరువులు ఎంత పరిమాణంలో అవసరం అనేది స్పష్టంగా అంచనా వేయవచ్చు. దీని వల్ల ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా పలు లాభాలు చేకూరనున్నాయి. -
మూడు నెలల బియ్యానికి.. ఆరుసార్లు వేలిముద్ర!
నల్లగొండ : రేషన్ బియ్యం పంపిణీ.. గతంలో రెండు, మూడు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యే ప్రక్రియ. ఇప్పుడు మాత్రం ఆలస్యమవుతోంది. మూడు నెలల బియ్యం ఇవ్వాల్సి రావడంతో అన్ని రేషన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది. దీనివల్ల ఇటు డీలర్లకు, అటు లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోంది. బియ్యం పంపిణీకి వినియోగించే ఈ–పాస్ యంత్రాల అప్డేట్ కావడం, మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ, మారిన సాఫ్ట్వేర్ తదితర కారణాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఒక్కో కార్డుదారుడికి బియ్యం పంపిణీ చేయాలంటే సుమారు 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద వినియోగదారులు విసుగు చెందుతున్నారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా కొన్ని దుకాణాల వద్ద డీలర్లు రాత్రి వేళ కూడా బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇన్చార్జి డీలర్లు ఉన్న 65 దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు ఈ పాస్ యంత్రం ఓపెన్ కావడం లేదు. దీంతో ఆయా దుకాణాల పరిధిలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. యూనిట్కు నెలకు ఆరు కిలోలు రేషన్ దుకాణాల్లో కార్డుదారుల్లోని ఒక్కో సభ్యుడికి నెలకు 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డు కింద 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ ఇస్తుండటంతో ఎవరూ డబ్బులు చెల్లించడం లేదు. తెల్లరేషన్ కార్డుదారుల్లో ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుంటే వారికి నిర్దేశిత కోటా ప్రకారం ప్రతినెలా 24 కిలోలు బియ్యం వస్తుంది. ఇందులో కేంద్రం వాటా కింద 20 కిలోలు, రాష్ట్ర వాటా 4 కిలోలు బియ్యం ఉంటాయి. (ఒకరికి వచ్చే 6 కిలోల్లో 5 కేజీలు కేంద్రం, మిగతా 1కిలో రాష్ట్ర వాటా). గతంలో ఒక్కసారి వేలిమద్ర వేస్తే 24 కిలోల బియ్యం ఇచ్చేవారు. ఒకేసారి కేటాయిస్తే.. కేంద్ర, రాష్ట్ర వాటాల కింద వచ్చే బియ్యానికి వేర్వేరుగా వేలిముద్రను తీసుకోవడం వల్ల జాప్యం ఏర్పడుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో డీలర్లు, లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో చిన్నచిన్న వాగ్వాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలంటే ఒక కార్డులో ఎంత బియ్యం ఉంటే అంత మొత్తానికి ఒకేసారి వేలిముద్ర వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డీలర్లు కోరుతున్నారు. దానికనుగుణంగా సాఫ్ట్వేర్ను మార్పు చేయాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో ఫలితముంటుందని చెబుతున్నారు. ఫ సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ఆలస్యం ఫ ఒక్కో కార్డుదారుడికి 15 నిమిషాలపైగా సమయం ఫ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు తప్పని పడిగాపులు ఫ సాఫ్ట్వేర్ మార్చాలంటున్న రేషన్ డీలర్లు ఫ ఇన్చార్జులు ఉన్న 65 దుకాణాల్లో ఓపెన్ కాని ‘ఈపాస్’ షాపుల వద్ద ఇబ్బంది పడుతున్నాం రేషన్ బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. సన్న బియ్యం తీసుకునేందుకు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. ఒక్కోసారి నెట్వర్క్ కూడా పనిచేయడం లేదు. గంటల తరబడి రేషన్ షాప్ వద్ద నిలబడాల్సి వస్తోంది. గతంలో ఇలా లేదు ఒకసారి తంబిస్తే బియ్యం మొత్తం ఇచ్చేవారు. – శంకరయ్య, లబ్ధిదారుడు, నల్లగొండ జిల్లాలో రేషన్ వివరాలు ఇలా.. రేషన్ దుకాణాలు 999 రేషన్కార్డులు 4,84,210 యూనిట్లు 15,02,656మూడు నెలలకు బియ్యం కేటాయింపు 28,718 టన్నులు కేంద్రం, రాష్ట్రానికి వేర్వేరుగా.. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చిన నేపథ్యంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కేంద్రం, రాష్ట్ర వాటాకు సంబంధించి వేర్వేరుగా (ప్రతి నెలకు రెండు సార్లు) వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారు ఆరు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తోంది. ఒక్కో వ్యక్తి ఇన్నేసి సార్లు వేలిముద్ర వేయడం, మధ్యలో ఎప్పుడైనా సరిగా ముద్ర పడకపోతే మరోమారు ప్రయత్నించాల్సి వస్తోంది. వారి బియ్యం కోటాను తూకం వేసివ్వాలి. ఈ ప్రక్రియంతా పూర్తి కావడానికి సగటున 15 నిమిషాలకు పైగానే సమయం పడుతోంది. ఫలితంగా లబ్ధిదారులంతా వారి వంతు వచ్చేవరకు ఎదురుచూడక తప్పటం లేదు. దీనికి తోడు సర్వర్ బిజీ, నెట్ సిగ్నల్ సక్రమంగా లేకపోవడం, బ్లూటూత్ కనెక్ట్ కాకపోవడం తదితర అంశాలు వేధిస్తున్నాయి. అంత్యోదయ కార్డులు కేంద్ర వాటా కింద రావడంతో వీరు ఒకసారి (మూడు నెలలకు మూడుసార్లు) వేలిముద్ర వేస్తే సరిపోతుంది. -
నేటి నుంచి రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
కనగల్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగుబంగారం దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి 7వ తారీకు వరకు కనులపండువగా జరగనున్నట్లు ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య, చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఎదుర్కోళ్ల మహోత్సవం, 6న శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి 23వ వార్షిక కల్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ డేరం భాస్కరశర్మ, ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణాచారి, గాదె ఉమామహేశ్వరరావు, దామోదర్రావుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 7న 108 కలశములతో అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 4 గంటలకు పర్వతగిరి, దర్వేశిపురం గ్రామాల నుంచి బోనాలు వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. -
కార్యదర్శులపై పనిభారం
ఫ రోజువారీ విధులను డీఎస్ఆర్ యాప్లో అప్లోడ్ చేయాలన్న ప్రభుత్వం ఫ ౖ డెలీ రిపోర్టు పెట్టడం మా వల్ల కాదంటూ కార్యదర్శుల గగ్గోలు ఫ పది రోజులుగా ‘డీఎస్ఆర్’ విధులకు దూరం ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని పథకాలకు కార్యదర్శులు విధులు నిర్వహించాల్సిందే. ప్రస్తుతం కొత్తగా తెచ్చిన డీఎస్ఆర్ రిపోర్టుతో అందరికీ ఇబ్బందులే. దాని వల్ల కార్యదర్శులు రిపోర్టు పంపడంతోపాటు.. అధికారులు కూడా గంటల తరబడి రిపోర్టు కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. గ్రామాల్లో నెట్వర్క్ తక్కువగా ఉండటం వల్ల రిపోర్టు పెట్టేందుకు సమయం అధికంగా పడుతోంది. ఈ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – ఖాసిం, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాలి డీఎస్ఆర్ యాప్లోనే డెయిలీ విధులకు సంబంధించిన నివేదికను పంపాలని ప్రభుత్వం మార్గదర్శకాలను తెచ్చింది. దానిపై కార్యదర్శులు కూడా వారి ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వానికి చెప్పుకున్నారు. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం డీఆఎస్ఆర్ యాప్లో కార్యదర్శులు డెయిలీ రిపోర్టు పెట్టాలి. – వెంకయ్య, డీపీఓ నల్లగొండ : ప్రభుత్వం మాపై పనిభారం మోపుతోంది. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నిర్వహించే విధులను ఏరోజుకారోజు డీఎస్ఆర్ (డెయిలి శానిటేషన్ రిపోర్టు) యాప్లో ఐరిష్ పద్ధతిన అప్లోడ్ చేయాలని ఇటీవల మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న పనులతోనే ఇబ్బందులు పడుతున్నామని.. ఈ డీఎస్ఆర్ యాప్తో ఉన్న సమయం కూడా రిపోర్టు పెడతానికే సరిపోతుందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారంతో ఇబ్బందులు పడుతున్నామని.. పదిరోజుల నుంచి కార్యదర్శులు ఈ డీఎస్ఆర్ అప్లోడ్ చేయడాన్ని బహిష్కరించారు. జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు జిల్లాలో 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో ప్రతి పంచాయతీకి ప్రభుత్వం కార్యదర్శులను నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో కార్యదర్శి ఉదయం 7 గంటలకే ఆన్లైన్ హాజరు వేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాంతో కార్యదర్శులంతా ఉదయం సమయంలో తాము వెళ్లలేమని ప్రభుత్వానికి విన్నవించడంతో అధికారులు కొంత వరకు సడలించి ఆన్లైన్లో హాజరు నమోదుకు అంగీకరించారు. అలా పంచాయతీ కార్యదర్శులు విధులు కొనసాగిస్తున్నారు. మే 24న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యదర్శుల విధులపై కొత్తగా మార్గదర్శకాలను రూపొందించింది. గ్రామాల్లో నిర్వహించే శానిటేషన్తో పాటు డంపింగ్ యార్డులు, మొక్కల పెంపకం, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాల్లో చేసే పనులతో పాటు గ్రామంలో ఉండే గృహాల నుంచి తడి, పొడి చెత్త ఎన్ని గృహాల నుంచి సేకరించారు, ఎంత మోతాదులో సేకరించారు అనే రిపోర్టును ఈ డీఎస్ఆర్ యాప్లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యాప్లో అప్లోడ్ చేయాలంటే కార్యదర్శి ఎక్కడైతే పని జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్లి ఐరీష్, లేదా వేలిముద్ర ద్వారా మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ తదితర ప్రభుత్వం పెట్టే కొత్త పథకాలకు కార్యదర్శులను వినియోగిస్తుంది. ఈ తరుణంలో కొత్త మార్గదర్శకాలతో వారు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. 10 రోజుల నుంచి యాప్ బహిష్కరణ పంచాయతీ కార్యదర్శులు 10 రోజుల నుంచి డీఎస్ఆర్ యాప్లో రిపోర్టును అప్లోడ్ చేసే విధులను బహిష్కరించారు. ఇప్పటికే పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని.. చేతి నుంచే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని.. ప్రభుత్వం తెచ్చే ప్రతీ పథకానికి కార్యదర్శి తప్పనిసరిగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని.. ఈ తరుణంలో పని వద్దకు వెళ్లి డీఎస్ఆర్ అప్లోడ్ చేయాలంటే ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయమంతా రిపోర్టులకే సరిపోతుందని.. ఈ పద్ధతిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సదస్సులతో భూసమస్యల పరిష్కారం
పెద్దవూర : అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. సాదా బైనామాలు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సేషన్స్, విస్తీర్ణంలో తప్పోప్పొల సవరణ, భాగ పంపిణీ తదితర అన్ని రకాల సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. పాసుబుక్లలో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చునని, చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. లావుణి పట్టా భూములు పట్టా చేయడం, ప్రభుత్వ భూములు కొన్నవారికి రెగ్యులరైజేషన్ చేయడం కుదరని తెలిపారు. కలెక్టర్ రైతుల నుంచి దరఖాస్తులను స్వయంగా స్వీకరించటమే కాకుండా వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసీల్దార్ జె.శ్రీనివాసరావు, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, హబీబ్అలీ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
డిండి : భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. బుధవారం డిండి మండలంలోని ఖానాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై అవగాహన కల్పించటంతోపాటు వివిధ కారణాలతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు. ఎన్జీ కాలేజీ డిగ్రీ ఫలితాలు విడుదలరామగిరి(నల్లగొండ) : ఎన్జీ కాలేజీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల ఫలితాలను బుధవారం ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు ఫలితాలను విశ్లేషించారు. బీబీఏ, బీకామ్ విభాగాల్లో అత్యధికంగా 87 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని.. చివరి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థుల్లో బీబీఏ 83శాతం, బీకామ్ 80 శాతం, బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ విద్యార్థులు 69శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అడిషన్ సీఓఈ డాక్టర్ వైవి.ప్రసన్నకుమార్, అధ్యాపకులు కోటయ్య, చంద్రయ్య, నాగరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎర్రజెండాతోనే సమసమాజం సాధ్యంమిర్యాలగూడ : ఎర్రజెండా ద్వారానే అసమానతలు లేని సమసమాజం సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో జరిగిన సీపీఐ మండల 10 మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మండలాల కార్యదర్శులు ఎండీ.సయీద్, డి.లింగానాయక్, జిల్లా యాదయ్య, నాయకులు బిల్లా కనకయ్య పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి మాడ్గులపల్లి : మండలంలో పార్టీ బలోపేతానికి సీపీఐ కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం మాడ్గుపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వీరస్వామి, ఆర్ఎస్.రెడ్డి, కట్టా వెంకట్రెడ్డి, రఘునాధచార్యులు, పుల్లెంల అబ్రహం, జిల్లా యాదమ్మ, కంకణాల శ్రీనివాస్రెడ్డి, లెనిన్, పుష్పలత, శిరీష, యాదమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు తుర్కపల్లి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన, బహిరంగ సభకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని తిర్మలాపూర్లో సభా స్థలిని బుధవారం ఆయన పరిశీలించారు. పోలీసు అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు రాహుల్రెడ్డి, శ్రీనివాస్నాయుడు, సీఐలు శంకర్గౌడ్, ఎలగొండ కృష్ణ, ఎస్ఐ తకియొద్దీన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స అందించేందుకు ముందుకు రావాలి
నల్లగొండ : దివ్యాంగులు, రక్తహీనతతో బాధపడే రోగులకు చికిత్స అందించేందుకు ముందుకు రావాలని ఈసీఐఎల్కి చెందిన చీఫ్ మెడికల్ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 52 వేల మంది దివ్యాంగులు ఉన్నారని.. గతంలో ఫ్లోరోసిస్కు గురైన వారు, మానసిక వికలాంగులు, నరాల బలహీనత ఉన్న వారు, కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన వారు ఉన్నారని తెలిపారు. దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం అటవీ ప్రాంతం నుంయి దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండకు రావాల్సి వస్తోందన్నారు. ఎంతోమంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తహీనతను తగ్గించేందుకు వారిని చైతన్యవంతులను చేసే విషయంలో సామగ్రిని అందిస్తే బాగుంటుందని సూచించారు. అనంతరం ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలపై ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలన్నారు. బేస్ లైన్ సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ను సమర్పిస్తామని కలెక్టర్కు తెలిపారు. నల్లగొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీడీపీఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం ప్రోగ్రాం అధికారి నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో హాలియా, ఆలేరు మున్సిపాలిటీల్లో కూడా వార్డుల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ మున్సిపాలిటీల్లో 12 చొప్పున వార్డులు ఉన్నాయి. పునర్విభన ద్వారా ఆ వార్డుల సంఖ్య మారనప్పటికీ.. వార్డు విస్తీర్ణంలో కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఈనెల 4వ తేదీన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు లేఖలు పంపడంతో పాటు ప్రజలకు మాత్రం పబ్లిక్ నోటీసు ఇవ్వనున్నారు. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాత పూర్వకంగా సలహాలు, అభ్యంతరాలు తీసుకోనున్నారు. 12 నుంచి 16వ తేదీవరకు వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరిస్తారు. 17, 18 తేదీల్లో ఆ తుది జాబితా కలెక్టర్కు పంపుతారు. 19న కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు నివేదిక అందిస్తారు. 20న సీడీఎంఏ ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతుంది. 21న తుది నోటిఫికేషన్ జారీ కానుంది. గ్లోబల్ యూత్ సమ్మిట్కు వలంటీర్లు ఎంపికనల్లగొండ టూటౌన్ : కర్నాటక రాష్ట్రంలోని మంగళూరులో ఈనెల 5,6 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ యూత్ సమ్మిట్కు ఎంజీ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం వలంటీర్లు మనీషా, సిరివెన్నెల ఎంపికై నట్లు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త పసుపుల మద్దిలేటి తెలిపారు. గ్లోబల్ యూత్ సమ్మిట్కు ఎంపికై న విద్యార్థులు మనీషా, సిరివెన్నెలను మంగళవారం యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ మెటీరియల్ కాంట్రాక్ట్కు టెండర్ల ఆహ్వానంనల్లగొండ : జిల్లాలోని 868 గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేపట్టడానికి అవసరమైన శానిటేషన్ మెటీరియల్ను సరఫరా చేయడానికి ఆసక్తి గల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో టెండర్లు సమర్పించాలని సూచించారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటల టెండర్లను తెరుస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా పంచాయతీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జి.మునేష్ను, లేదా 9014643085 ఫోన్ నంబన్లో కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకంయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. -
మా భూములు.. మాకే ఇవ్వాలి
కొండమల్లేపల్లి : మా భూమాలు.. మాకే ఇవ్వాలని కొండమల్లేపల్లి మండలం జానిగానితండా, దేవరోనితండా గిరిజన రైతులు మంగళవారం దేవరకొండ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండ్లిపాకల రిజర్వాయర్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురవుతున్న గుడితండాకు ఆర్ఆర్అండ్ ప్యాకేజీ కింద గుమ్మడవెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 86లో గల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే ఈ అంశాన్ని నిలిపివేయాలని కోరారు. గుడితండావాసులకు వేరే చోట పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రమావత్ రమేష్, రమావత్ రాజు, కోటియా, హనుమంతు, మల్లేష్, ధర్మ, భాను, శంకర్ పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం కోరారు. మంగళవారం దేవరకొండ మండలం గొట్టిముక్కలలో నిర్వహించిన సీపీఐ మండల 14వ మండల మహాసభలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలే అజెండాగా సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహ్మారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, పల్లె నరసింహ, రమావత్ అంజయ్యనాయక్, దేప సుదర్శన్రెడ్డి, నూనె రామస్వామి, వలమల్ల ఆంజనేయులు, పల్లా సులోచన, పల్లా రంగారెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం తిప్పర్తి రైతు వేదికలో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతులకు ఫౌండేషన్ వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 430 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో తయారు చేసిన విత్తనాలను రాష్ట్రంలోని 11వేల రెవెన్యూ గ్రామాల్లో 40 వేల మంది రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు మంచి దిగుబడి సాధిస్తే.. వచ్చే సీజన్కు ఇతర రైతులకు కూడా సరఫరా చేయవచ్చన్నారు. యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు పండించాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫౌండేషన్ విత్తనాలను జిల్లాలో 564 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురికి చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ఈ విత్తనాలు రైతులకు మేలు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, తహసీల్దార్ పరుశురాం, ఏఓ సన్నిరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ జానయ్య -
తొలిరోజు 3,263 దరఖాస్తులు
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం –2025ను అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంగళవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లాలోని 55 గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వివిధ సమస్యలపై 3,263 దరఖాస్తులను రైతులు సమర్పించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి తిప్పర్తి, కేతేపల్లి మండలాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అమిత్నారాయణ్, ఆర్డీఓలు పలు సదస్సులకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి మండలంలో రెండు బృందాలు పత్రి మండలంలో రెండు బృందాలు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా గ్రామాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసిన దరఖాస్తు ఫారాలను రైతులకు ఇస్తూ.. సమస్యలపై రైతులు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ధరణి కష్టాలు తీరుతాయని ఆశ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో ఏర్పడిన ఇబ్బందులు తీర్చాలని ఇప్పటి వరకు రైతులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కానీ అవి పరిష్కారం కాక నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఉన్నారు. దీంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఫ భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభం ఫ 55 గ్రామాల్లో నిర్వహణ రైతులు సద్వినియోగం చేసుకోవాలి తిప్పర్తి : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని భూసమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును ఆమె సందర్శించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరుశురాం, డీటీ ఆబేదాబేగం తదితరులు ఉన్నారు. -
రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి
కేతేపల్లి : భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులపై ఆమె సమీక్షించారు. మొదటి రోజు నిర్వహించిన రెవెన్యూ సదస్సులపై ఇన్చార్జి తహసీల్దార్ ఎంఏ సత్తార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు హాజరయ్యారు.. ఎలాంటి దరఖాస్తులు వచ్చాయి..? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాన్ని గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రజలకు ముందు తెలియ చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులను సాధ్యమైన వేగంగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఆర్ఐలు వెంకన్న, రామచంద్రయ్య, సర్వేయర్ టి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని మించి కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాసంగిలో ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వెల్లువలా వచ్చింది. ప్రభుత్వం ఈ సీజన్లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైన యాసంగి కొనుగోళ్లు డిండి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా అంతటా ముగిసాయి. డిండి మండలంలో కోతలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ ఆరు కేంద్రాలు తెరిచి ఉన్నాయి. బుధవారంతో అక్కడ కూడా కొనుగోళ్లు పూర్తికానున్నాయి. జిల్లాలోనే మొదట ప్రారంభం నల్లగొండ జిల్లాలో వరి కోతలు మార్చి రెండో వారంలోనే ప్రారంభం కావడంతో ధాన్యం అప్పటికే పెద్ద ఎత్తున కేంద్రాలకు వచ్చింది. దీంతో మార్చి 24వ తేదీన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్రంలోనే మొదటి కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఆ తర్వాత తిప్పర్తిలో ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికే 5.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 600 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే దాదాపు జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులకు వేగంగా చెల్లింపులు యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 375 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలో ఇప్పటివరకు 5.97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సన్నాలు 20,772 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 5,76,228 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం 84,619 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వాటి విలువ రూ.1,375 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతులకు రూ.1,296 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 369 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 369 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. దేవరకొండ నియోజకవర్గంలో డిండి మండలంలో ఆరు కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో దాదాపు 600 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ మిగిలిన ధాన్యాన్ని బుధవారం కొనుగోలు చేసి ఆయా కేంద్రాలను కూడా మూసివేయనున్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు ఇలా.. కేంద్రాలు 375కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం 5.97 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు 20,772 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం 5,76,228 మెట్రిక్ టన్నులు ధాన్యం అమ్మిన రైతులు 84,619 మంది కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.1,375 కోట్లు రైతులకు చెల్లించినది రూ.1,296 కోట్లుబోనస్ చెల్లింపు ఆలస్యం ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో యాసంగి సీజన్లో 20,772 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా రైతులకు ప్రస్తుతం మద్దతు ధర మాత్రమే జమవుతోంది. బోసన్ ఆగస్టు మాసంలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ కేంద్రాలకు వెల్లువలా వచ్చిన ధాన్యం ఫ లక్ష్యం 5.50 లక్షల మెట్రిక్ టన్నులు.. కొన్నది 5.97 లక్షల మెట్రిక్ టన్నులు ఫ రైతులకు వెంటనే చెల్లింపులు ఫ సన్నాల బోనస్ మాత్రం ఆలస్యం ఫ నేటితో ముగియనున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లు కొనుగోళ్లు సజావుగా సాగాయి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ల సూచనలతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయి. ఆరు కేంద్రాలు మినహా అన్ని గ్రామాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా 600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది. బుధవారంతో ధాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఈసారి లక్ష్యాన్ని మించి ధాన్యం కొనుగోలు చేశాం. – హరీష్, డీఎం పౌర సరఫరాల శాఖ -
త్యాగాలతోనే స్వరాష్ట్రం
షిర్డీ వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి.. షిర్డీ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో మంటలు చెలరేగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనమయ్యాడు. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.గురితప్పని లక్ష్యం నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన కాంత్రికుమార్ భారత ఆర్చరీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు. - IIలోమంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025వందలాది మంది యువకుల ప్రాణ త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. గత పదేళ్ల పాటు రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగింది.. ప్రస్తుతం అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోంది. – మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం.. సోనియగాంధీ సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల సభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. నల్లగొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం అన్నారు. అభివృద్ధిలో నల్లగొండను అగ్రపథాన నిలుపుతామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ భగవద్గీతలా పనిచేయనుందని పేర్కొన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేలా.. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో అయిటిపాములలో స్వయం సహాయక మహిళా సంఘాలతో సోలార్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయించామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటిన్ల నిర్వహణ, పెట్రోలు బంక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతులకు రుణ విముక్తి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చరిత్రలో నిలిచిపోయేలా జిల్లాలో 2,33,981 మంది రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి రుణ విముక్తులను చేశామన్నారు. యాసంగి సీజన్లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. ధాన్యం కొనుగోళ్లు, డబ్బుల చెల్లింపుల్లోనూ ఈ సారి ముందున్నామన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. బీసీలకు కూడా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. 4 ఐటీఐలు అభివృద్ధికి రూ.6.77 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ.20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే బ్రాహ్మణవెల్లెంల, ఉదయ సముద్రం లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించామన్నారు. ఈ లిఫ్టు ద్వారా 3.61 ఎకరాలకు సాగునీరు.. 200 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. పేద విద్యార్థులు వైద్యవిద్య చదివేలా.. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేలా నల్లగొండలోని ఎస్ఎల్బీసీ వద్ద 37 ఎకరాల్లో నిర్మించిన వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారన్నారు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.24 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారభించి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు రూ.వందల కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థినులు న్యూస్రీల్ఫ తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీది సాహసోపేత నిర్ణయం ఫ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశా.. ఫ గత పదేళ్లు దోపిడీ పాలన సాగింది ఫ తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళ్తున్నాం ఫ అభివృద్ధిలో నల్లగొండను అగ్రపథాన నిలబెడతాం ఫ రాష్ట్ర అవతరణ వేడుకల్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సక్సెస్ ఫుల్గా ‘మిషన్ పరివర్తన్’ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మిషన్ పరివర్తన కార్యక్రమంతోపాటు ఆపరేషన్ చబుత్ర సక్సెస్ ఫుల్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషిచేస్తున్న జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీలపై అలసత్వం వద్దు
నల్లగొండ: ప్రజావాణి అర్జీలపై అలసత్వం చూపకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. 15 మంది ఫిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారని తెలిపారు. అర్జీల పురోగతిని కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగానికి వెంటనే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి డిండి: కొనుగోలు కేంద్రాల్లో తేమ వచ్చిన వరి ధాన్యాన్ని కాంటాలు వేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం డిండి మండల కేంద్రంతోపాటు తవక్లాపూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం, తూకం చేసిన ధాన్యానికి సంబంధించి అకౌంట్లలో జమ అయ్యే డబ్బుల వివరాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డీటీసీఎస్ హన్మంతు శ్రీనివాస్గౌడ్, సీఈఓలు బాల్రెడ్డి, అంతిరెడ్డి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
న్యాయ సేవలు ప్రజలకు చేరువ కావాలి
నిడమనూరు : పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరిస్తూనే న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం వర్చువల్ విధానంలో నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్ మాట్లాడుతూ లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్రెడ్డి కృషితో నిడమనూరు కోర్టును రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా పోర్టు పోలియో జడ్జి టి.వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించవచ్చన్నారు. అలాగే జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు నిడమనూరులో మాట్లాడుతూ కోర్టు, న్యాయమూర్తి నివాస భవనాలు నిర్మించుకోవడం సంతోషకర విషయమన్నారు. కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిడమనూరు కోర్టులో ఇన్చార్జి న్యాయమూర్తి పవన్కుమార్ మొదటి కేసును పరిశీలించారు. వర్చువల్ విధానంలో న్యాయమూర్తి కె.లక్ష్మణ్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సుజనాకలిసిరాం తదితరులు హాజరుకాగా నిడమనూరులో కోర్టు భవనం ప్రారంభం కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ, న్యాయమూర్తలు సంపూర్ణ ఆనంద్, వేణు, ఎమ్మెల్సీ, నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఫ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్పాల్ ఫ వర్చువల్గా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం -
నేడు ‘రైతు నేస్తం’
నల్లగొండ టౌన్: జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు విధిగా హాజరు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, మినీ కిట్లను రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగుపై వ్యవసాయాధికారులు తగిన సలహాలు, సూచనలు అందజేస్తారని, ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు నల్లగొండ: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు అర్హత గల విద్యార్థులు ఈ నెల 21లోగా iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఐటీఐల కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విద్యార్థులు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో సంప్రదించాలని కోరారు. అంతర్జాతీయ సదస్సుకు ఎంపికనల్లగొండ టూటౌన్ : సింగపూర్ యూనివర్సిటీలో జూలై నెలలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వాణిజ్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు. ఈ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. సదస్సుకు వెళ్లనున్న వెంకటరమణారెడ్డికి సోమవారం వీసీ ఖాజాఆల్తాఫ్ హుస్సేన్ ఆహ్వాన పత్రం అందజేసి అభినందించారు. పెట్టుబడిదారి వర్గానికి కేంద్రం వత్తాసు గట్టుప్పల్ : కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి వత్తాసుగా ఉంటూ శ్రామిక వర్గాలను అణగదొక్కే కుట్ర చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం గట్టుప్పల్ మండలం వెల్మకన్నెలోని యాదయ్య ప్రాంగణంలో నిర్వహించిన సీపీఐ 2వ మండల మహాసభలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవి నీతి, అక్రమాలతో ప్రజాధనం దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రజలను పక్కదో పట్టించేందుకే కవిత రోజుకో ప్రకటనతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. కారింగు శ్రీను అధ్యక్షతన జరిగిన మహాసభలో నాయకులు తీర్పారు వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, లాలయ్య, చాపల శ్రీనివాస్, భీమనపల్లి రమేష్, చలం పాండురంగారావు, జగన్, గడ్డం నవీన్, కట్ట దశరథ, రాపోలు సత్తయ్య, ధనంజయ, కందాల ముత్యం పాల్గొన్నారు. నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాటంసూర్యాపేట అర్బన్: నేరాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సీ) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చింతపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని కాంప్లెక్స్లో ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బండ్ల రమేష్, వైస్ చైర్మన్ నవిలె నాగయ్య, కన్వీనర్ సారగండ్ల సైదులు, మహిళా పోర్ట్ చైర్మన్ మాదాన స్వప్న, జనరల్ సెక్రటరీ బి.సునీత పాల్గొన్నారు. -
జిల్లా కోర్టులో అభివృద్ధి పనులు ప్రారంభం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్డులో పలు అభివృద్ధి పనులను హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. జిల్లా కోర్టులో హెల్త్ డిస్పెన్సరీ, రాక్ గార్డెన్, ఎలక్ట్రాన్ వెహికిల్ను ఆన్లైన్ ద్వారా వర్చువల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నల్లగొండ అడ్మినిస్ట్రేటివ్ అధికారి టి.వినోద్కుమార్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, బి.విజయ్సేన్రెడ్డి, కె.సుజన, నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సంపూర్ణ ఆనంద్, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేష్ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన సాగుకు ఊతం
రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల పథకం కింద.. రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల పథకం కింద ఆయిల్పామ్తోపాటు పండ్లు, కూరగాయలు, మిరప తోటల సాగుకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించనున్నారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించనున్నారు. నల్లగొండ అగ్రికల్చర్: ఉద్యాన పంటల సాగుకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా 2025–26 ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలైన ఆయిల్పామ్, పండ్లు, కూరగాలయలు, పూల తోటల సాగుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు చెందిన రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తూనే సబ్సిడీలు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఆయిల్పామ్ తోటల విస్తీర్ణ పథకం ఆయిల్పామ్ తోటల విస్తీర్ణ పథకం కింద ఉద్యాన పంటల సాగును ప్రోత్సాహించాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, సూక్ష్మ నీటిపారుదల పథకం సమన్వయంతో ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను పతంజలి ఫుడ్స్ కంపెనీ ద్వారా లబ్ధిదారులకు మొక్కలను సరఫరా చేసి రైతుల వ్యవసాయ భూముల్లో నాటించనున్నారు. నాటిన మొక్కల పెంపకానికి గాను సబ్సిడీపై రైతులకు డ్రిప్ (బిందు, తుంపర సేద్యం) పరికరాలు అందించనున్నారు. ఫ ఆయిల్పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు పెంపే లక్ష్యం ఫ సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేత ఫ రైతులకూ ప్రోత్సాహకాలు ఫ కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పండ్ల తోటలు, ఇతర కూరగాయల సాగును ప్రోత్సహించడానికి సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. లాభదాయకంగా మారిన తోటలు, కూరగాయలు సాగుపై రైతులు దృష్టిసారించాలి. – పి.అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తాచాటాలి
మిర్యాలగూడ : రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జి.అంజయ్య, అధ్యక్షుడు డాక్టర్ టి.ప్రశాంత్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–11, 13, 15, 17, 19 విభాగాల క్రీడాకారులకు రెండు రోజుల నుంచి పోటీలు కొనసాగుతున్నాయి. దీంల్లో భాగంగా సోమవారం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయిలో టోర్నీకి ఎంపిక చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు త్వరలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మధుబాబు, కార్యదర్శి పి.నవీన్కుమార్, సెలక్షన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.శ్రీనివాస్, జిల్లా కోచ్ ఎం.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాలకులు మారినా విధానాలు మారలే
మిర్యాలగూడ : పాలకులు మారినా విధానాలు మారడం లేదని.. రాష్ట్ర అభివృద్ధి నేటికీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని దీనివల్ల ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయించడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామపంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, పాదూరి శశిధర్రెడ్డి, పారేపల్లి సత్యనారాయణరావు, లింగయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
యాదవ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి
నల్లగొండ : యాదవ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి వృత్తి గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘ భవనంలో నూతన యాదవ ఉద్యోగుల ఆత్మీయ సన్మానోత్సవంలో ఆయన మాట్లాడారు. నూతన ఉద్యోగులంతా తమ శక్తి మేరకు, కుటుంబ సభ్యుల సహకారంతో ఉద్యోగాలు పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. గొల్లకురుమలు నీతికి నిజాయితీకి మారుపేరని, నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన యాదవులు అంకితభావంతో పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పోలీస్ కంప్లయింట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లును సన్మానించారు. కార్యక్రమంలో బడుగుల లింగయ్యయాదవ్, జవ్వాజి వెంకటేశంయాదవ్, తరాల పరమేశ్యాదవ్, అర్వ అశోక్యాదవ్, బెల్లి యాదయ్య, లొడంగి గోవర్ధన్, ముచ్చర్ల ఏడుకొండలు, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పిల్లి రామరాజుయాదవ్, ఎల్వీ.యాదవ్, పల్లెబోయిన శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య -
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
నల్లగొండ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపునకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతాను ఆదివారం ఆయన నల్లగొండలోని క్లాక్టవర్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫాం ఉచితంగా అందిస్తుందన్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తెలిపారు. ఫీజుల భారం లేని.. ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు, అత్యున్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓ కత్తుల రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస్చారి, పెరుమాళ్ల వెంకటేశం, నాయకులు ఎడ్ల సైదులు, అరుణ, సరళ, జగదీష్ బాబు, బద్రీనాథ్, మంగ్లానాయక్, గేరా నరసింహ, నల్లపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర సైదులు, మురళయ్య, మధుసూదన్, ఎర్రనాగుల సైదులు, జానకి, సంధ్యారాణి, రవి, లక్ష్మీనారాయణ, రమణ, కృష్ణ, సయ్యదుద్దీన్, రాములు రాజశేఖర్రెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఫ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి -
యాదగిరి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భారీగా తరలివచ్చిన భక్తులతో యాదగిరి క్షేత్రం ఆదివారం కోలాహలంగా మారింది. వేకువజామున సుప్రభాత సేవతో నిత్యారాధనలు ఆరంభించిన అర్చకులు.. రాత్రి వేళ మహా నివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. తొలుత ఉదయం గర్భగుడిలో కొలువైన స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించి అర్చనలు చేశారు.అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు.రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ఆయా వేడుకల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
అద్దె చెల్లించక అవస్థలు!
నల్లగొండ : ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల యజమానులకు అవస్థలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి అద్దె బిల్లులు ఆగిపోవడంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వాహనాలు నడుపుతున్నారు. డీజిల్, ఇతర వస్తువుల రేట్లు భారీగా పెరిగినా 2014లో నిర్ణయించిన అద్దెనే చెల్లిస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. 2014లో నిర్ణయించిన అద్దె ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు అద్దె ప్రాతిపదికన జిల్లాలో దాదాపు 100 కార్లు నడుస్తున్నాయి. ప్రతి కారు నెలకు సంబంధిత అధికారికి 2,500 కిలోమీటర్లు తిప్పాల్సి ఉంటుంది. అందుకు రూ.33 వేలు అద్దె చెల్లిస్తారు. ఈ అద్దెను 2014లో నిర్ణయించారు. అయితే నాడు లీటరు డీజిల్ దర రూ.57 ఉండగా.. ఇప్పుడు రూ.97కు పెరిగింది. ఇతర స్పేర్ పార్ట్స్, టైర్ల ధరలు భారీగా పెరిగాయి. కానీ అద్దె మాత్రం అప్పటిదే ఇస్తున్నారు. అదికూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఎంపీడీఓలకు పెట్టిన అద్దె వాహనాలకు రెండేళ్లుగా బిల్లులు రాలేదు. మిగతా శాఖల్లో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు రాక అప్పులు చేస్తూ.. ప్రభుత్వ అధికారులకు అద్దె ప్రాతిపదికన కార్లు నడుపుతున్న డ్రైవర్ కం ఓనర్లకు ప్రతి నెలా అద్దె చెల్లించకపోవడం వల్ల వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కారు మెయింటెనెన్స్, డీజిల్ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కుటుంబాలను పోషించలేక, ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా చెల్లించే శాఖల్లో సొంత కార్లే.. ప్రతి నెలా బిల్లులు చెల్లించే శాఖల్లో అధికారులే బినామీ పేరుతో వాహనాలు పెట్టుకుంటున్నారు. దీంతో అద్దె వాహనదారులకు నష్టం జరుగుతోంది. జిల్లాలో ఒక అధికారి ఏకంగా లోన్ మీద కారు తీసుకుని తానే సొంతంగా నడుపుకుంటూ అద్దె కారు పెట్టినట్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇలా చాలా మంది అధికారులు బినామీ పేర్ల మీద సొంతంగా కార్లు కొని పెట్టుకుంటున్నారు. కానీ.. అద్దె ప్రాతిపదిక కార్లు పెట్టినవారికి మాత్రం బిల్లులు చెల్లించడం లేదు. ఫ ప్రభుత్వ అద్దె వాహనదారులకు నెలల తరబడి అందని బిల్లులు ఫ అప్పులు చేసి వాహనాలు నడపాల్సిన దుస్థితి ఫ డీజిల్ రేట్లు భారీగా పెరిగినా 2014 నాటి అద్దెనే చెల్లింపు ప్రతినెలా బిల్లులు ఇవ్వాలి ప్రభుత్వం కార్ల అద్దెను ప్రతి నెల చెల్లించాలి. ఇక 2014లో నిర్ణయించిన రూ.33 వేల అద్దె ఇంకా కొనసాగుతోంది. తక్కువ అద్దె ఉండటం వల్ల కనీసం డబ్బులు కూడా మిగలడం లేదు. ఈఎంఐ, డీజిల్ ఖర్చులకే సరిపోతుంది. డ్రైవర్కు మిగలడం లేదు. అద్దె పెంచి ప్రతి నెల చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి. – మహ్మద్ ఫయాజ్, ప్రభుత్వ అద్దె వాహనాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
హెడ్ కానిస్టేబుల్కు సేవా పతకం
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పోలీస్ అదికారులు, సిబ్బందికి సేవా పతకాలను అందించనుంది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలోని ఐటీ సెల్లో పనిచేసే హెడ్కానిస్టేబుల్ కె.గోవర్ధన్ను సేవా పతకానికి ఎంపిక చేసింది. ఆయన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పతనాన్ని అందుకోనున్నారు. పంట నష్టపరిహారం విడుదల నల్లగొండ టౌన్ : గత యాసంగిలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 726 ఎకరాలకు సంబంధించి 679 మంది రైతులకు రూ.72.69 కోట్ల పరిహారం విడులైంది. ఈ నిధులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. నేడు నిడమనూరు కోర్టు భవనం ప్రారంభంనిడమనూరు : నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం సోమవారం ప్రారంభం కానుంది. హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సుజన తదితరులు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రూ.6.5 కోట్ల వ్యయంతో కోర్టు భవనాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా న్యాయమూర్తి ఎం.నాగరాజు నిడమనూరు కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, పలువురు బార్ అసోసియేషన్ నాయకులతో చర్చించారు. బుద్ధవనానికి థాయ్లాండ్ బౌద్ధ భిక్షువులునాగార్జునసాగర్ : సాగర్ తీరంలోని బుద్ధవనాన్ని థాయ్లాండ్ దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు ఆదివారం సందర్శించారు. అంతర్జాతీయ నటుడు, సిద్దార్థ గౌతమ పాత్రధారి గగన్మాలిక్ ఆధ్వర్యంలో వీరి సాగర్కు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, జాతకవనం, జ్ఞానవనం, స్థూపవనాలను సందర్శించారు. మహాస్థూపంలోని జ్ఞానమందిరంలో కొంతసేపు ధ్యానం చేశారు. వీరితో పాటు బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, మేనేజర్ తపతి శ్యాంసుందర్రావు ఉన్నారు. హామీలు అమలు చేయాలిచిట్యాల: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యకారుల సంక్షేమ సంఘం వ్యవప్థాపక అధ్యక్షుడు కూనురు సంజయ్దాస్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యకారులకు ఇళ్ల స్థలాలు, అమరుల కుటుంబాలకు, జైలు జీవితం గడిపిన ఉద్యమకారులను రాష్ట్ర సాధకులుగా గుర్తించి పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆయిల్పామ్తో ప్రతినెలా ఆదాయం
చండూరు, గట్టుప్పల్ : నీటి వసతి కలిగిన రైతులు ఆయిల్పామ్ సేద్యం చేసి మూడేళ్ల తర్వాత నెలనెలా ఆదాయం పొందవచ్చని సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. ఆయన తన స్వగ్రామం చండూరు మండలం కొండాపురంలో 2021–2022లో తన సొంతభూమి 8 ఎకరాల్లో ఉద్వానశాఖ ద్వారా ఆయిల్పామ్ మొక్కలను నాటారు. మొక్కలు నాటి నేటికి మూడేళ్లు ముగిసిన సందర్భంగా ఆదివారం మొదటిసారి ఆయిల్పామ్ గెలలను తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ మొక్కలు నాటిన నుంచి అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ సేంద్రియ ఎరువుల వాడడం వల్ల ఎనిమిది ఎకరాల్లో తొలిసారి 3 టన్నుల దిగుబడి సాధించామని తెలిపారు. ఈ పంట సాగు చేస్తే 30 సంవత్సరాలపాటు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి రైతు ఆయిల్పాం సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్వాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, నియోజకవర్గ అధికారి రావుల విద్యాసాగర్, పతంజలి కంపెనీ ఫీల్డ్ అధికారి శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ రైతులు పాల్గొన్నారు.ఫ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ -
ఫార్మర్ రిజిస్ట్రీ 10 శాతమే!
వివరాలు నమోదు చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది. భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటే పదకొండు నంబర్ల యూనిక్ కోడ్ కేటాయిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ఉపయోగ పడుతుంది. రైతులు వ్యవసాయ విస్తరణాధికారులకు తమ ఆధార్ కార్డు, పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్తో అనుసంధానమైన సెన్ఫోన్ నంబర్తో వచ్చే ఓటీపీ వివరాలను ఇచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – పాల్వాయి, శ్రవణ్కుమార్, డీఏఓ అవగాహన కల్పించాలి సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలి. ఆధార్కార్డుకు.. ఫోన్ నంబర్ అనుసంధానం వంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏఈఓలు వారికి కేటాయించిన క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల వివరాలను రైతులకు తెలియజేయాలి. – అనుముల శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ డైరెక్టర్ ఫ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం ఫ రైతుల్లో అవగాహన లోపంతో నత్తనడకన సాగుతున్న ప్రక్రియ ఫ 5,60,652 మంది రైతులకు.. 50,165 మందే నమోదు హాలియా : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు 11 అంకెల యూనిక్ కోడ్తో గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిసీ్ట్ర) ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. గ్రామాల్లో నెట్సిగ్నల్స్ సరిగా అందకపోవడం, కొందరికి అవగాహన లేకపోవడం, రైతుల మొబైల్కు ఓటీపీ రాకపోవడం వంటి కారణాలతో ఈ ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలోని వ్యవసాయ క్లస్టర్లలో మొత్తం 5,60,652 మంది రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ప్రారంభమై 10 రోజులు దాటినా 50,165 మందివి మాత్రమే నమోదు చేయగలిగారు. అంతే పదిశాతం కంటే తక్కువగానే ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తయింది. వ్యవసాయ పథకాలకు ప్రామాణికం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన తదితర పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సరైన వివరాలు లేకపోవడంతో పథకాలు రైతులకు సక్రమంగా అందడం లేదు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 11 అంకెల యూనిక్ కోడ్తో గుర్తింపు కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ ఈ రిజిస్ట్రేషన్లో రైతుకు ఉన్న భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్తో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద వివరాలు నమోదు చేస్తే రైతు సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ఆధార్కార్డుతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు జారీ చేయనున్నారు. ఈ వానాకాలంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అందించే పెట్టుబడి సాయాన్ని దీని ప్రాతిపదికనే చెల్లించనున్నారు. నమోదుకు అనేక సమస్యలు ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ నమోదు ప్రక్రియలో పలు సమస్యలు ఎదరవుతున్నాయి. జిల్లాలోని చాలా మంది రైతుల సెల్ఫోన్లకు ఓటీపీ రావడం లేదు. ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్ను వాడడం లేదు. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా నమోదు పక్రియ ఒకేసారి జరుగుతుండడంతో సర్వర్ సమస్య ఏర్పడుతోంది. ఒక పాసుబుక్ వివరాల నమోదుకు మూడు పర్యాయాలు ఓటీపీ రావడం, 30 సెకన్ల వరకే ఓటీపీ ననమోదుకు గడువు ఉండడం, ఆధార్కార్డుతో లింక్ అయిన ఫోన్ అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒక్కోసారి వివరాలన్నీ నమోదు చేసి చివరి ఓటీపీ కన్ఫాం చేసుకునేలోపు లాగ్అవుట్ అవుతుంది. తిరిగి నమోదు ప్రక్రియను మొదటి నుంచి చేపట్టవలసి వస్తుంది. దీంతో ఒక్కో విస్తరణాధికారి రోజంతా 80 నుంచి 100 మంది రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయగలుగుతున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం అందించనున్న విశిష్ట గుర్తింపు కార్డు కోసం రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, ఫోన్ నంబర్తో స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ నంబర్ను కేంద్ర ప్రభుత్వ పథకాలకు లింక్ చేస్తారు. మండల వ్యవసాయ కార్యాలయాల్లో లేదా వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) వద్ద రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు, త్వరలో ఈ సేవలు మీ సేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. -
సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
నల్లగొండ : పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ముడ్ రిజర్వు సిబ్బందికి నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీస్ల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో సాయుధదళ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. సిబ్బంది వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నిరంతరం విధుల్లో ఉండే సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబ పరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు తాను ముందుంటానని ఎస్సీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ముడ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏవో శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, సూరప్పనాయుడు, శ్రీనివాస్, హరిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.సహకార సంస్థలను అనుసంధానించాలినల్లగొండ టౌన్ : సహకార సంస్థలను జాతీయస్థాయిలో అనుసంధానం చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో పాడి సహకార సంఘాలను డీసీసీబీలతో అనుసంధానం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–2026ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. సహకార సంఘాలను అనుసంధానం చేయడం వల్ల సహకార వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. పాడి సహకార సంఘాలు డీసీసీబీలో సేవింగ్ ఖాతా ఓపెన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, బ్యాంకు డీజీఎంలు, ఏజీఎంలు పాల్గొన్నారు. -
అభివృద్ధికి పునరంకితం
ఉమ్మడి జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలిఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం మాట్లాడారంటే.. ● భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టకుండా, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులు లేకుండా చూడాలని కోరారు. ● ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఐలయ్య మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ముందుగానే ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ● మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇసుక ఇచ్చేందుకు మిర్యాలగూడలో ఇసుక డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ● నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. ● ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందన్నారు. ● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫ పేదల సంక్షేమానికి అధికారులు కట్టుబడి పనిచేయాలి ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఫ హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, ఎంపీ, ఎమ్మెల్యేలుభానుపురి (సూర్యాపేట) : ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి మనందరం పునరంకితమవుదా.. జిల్లా సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవాలి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అధికారులు నిర్లిప్తత వదిలేసి పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తూ ఉమ్మడి జిల్లాను అన్నింటా అగ్రస్థానంలో నిలపాలన్నారు. రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి ప్రజల సేవకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాకు ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను మంజూరు చేస్తామని, ఇందుకుగాను స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లను కోరారు. నల్లగొండ జిల్లాకు అదనంగా ఏఈఓలు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఏఈఓలను నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్.. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఆయా జిల్లాలకు సంబంధించిన వివరాలను సమీక్ష సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో సూర్యాపేట ఎస్పీ నరసింహ, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఆయా జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఇరిగేషన్ పనులు
ఫ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ పనులు వేగంగా చేపట్టి అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం సేకరించిన కలెక్టర్లను, ప్రత్యేకించి నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అభినందించారు. వచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం శుభ్రపరిచే, ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని పేర్కొన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో సన్నబియ్యంతోపాటు, ఇతర రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో ఫారెస్ట్ భూములన్నింటికి తిరిగి పచ్చదనం తెచ్చేలా తన కోటా నుంచి నిధులు ఇస్తానని ప్రకటించారు. విధి నిర్వహణలో అధికారులు అలసత్వం వీడాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండొద్దన్నారు. -
కలెక్టర్లదే ముఖ్యపాత్ర
ఫ మంత్రి కోమటిరెడ్డి కేబినెట్ నిర్ణయాలను అమలు చేయడంలో కలెక్టర్లదే ముఖ్యపాత్ర అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్నింటా ముందుంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈఓ పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అత్యధికంగా రూ.1,700 కోట్లను కేటాయించామని పేర్కొన్నారు. -
ముమ్మరంగా సాగర్ క్రస్ట్గేట్ల మరమ్మతు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్గేట్లు మరమ్మతుల పనులను అధికారులు ముమ్మరం చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 590 అడుగులుకాగా.. 546 అడుగుల నుంచి 26 రేడియల్ క్రస్ట్గేట్లు ఉంటాయి. స్పిల్వేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన వాక్వే బ్రిడ్జి మీదుగా వెళ్లి మరమ్మతు పనులు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తిచేసి.. క్రస్ట్గేట్లను ట్రయల్ రన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు గేట్లకు పట్టిన తుప్పును వదిలించడంతో పాటు క్రాక్లు, వంకరలు తిరిగిన వాటిని గుర్తించి సరిచేయడం, వెల్డింగ్ జాయంట్లను గుర్తించి బలంగా లేని చోట్ల తిరిగి వెల్డింగ్ పెట్టడం లాంటి పనులు చేశారు. తుప్పు నివారణకు యాంటీ కరోషన్ పెయింటింగ్ వేయడం, హైడ్రాలిక్ స్ట్రక్చర్ల కోసం ప్రత్యేకంగా తయారైన పెయింట్లను వేసే పనులు చేస్తున్నారు. గతేడాది వరదలు అధికంగా వచ్చి పలుమార్లు ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రబ్బరు సీళ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి మార్చుతున్నారు. పాతవి పనికి వచ్చే దగ్గర వాటిని వంకరలు తీసి మళ్లీ వేస్తున్నారు. గేట్లను ఎత్తేందుకు వినియోగించే ఇనుపత్రెడ్కు గ్రీజింగ్, ఆయిలింగ్ చేస్తున్నారు. అలాగే గేట్లను ఎత్తేందుకు వినియోగించే మోటర్లకు సంబంధించిన స్టార్టర్లు, గేర్బాక్సులు, కుబుల్స్ తదితర సామగ్రిని తనిఖీ చేస్తున్నారు. విద్యుత్ సరఫరా అయ్యే ప్యానల్ బోర్డుల్లో గల సామగ్రినంత చెక్ చేస్తున్నారు. అనుమానాలున్న చోట్ల స్ట్రక్చరల్ ఆడిట్ (ఐఐటీ, ఎన్డీఎస్ఏ వంటి సంస్థలతో) చేయిస్తారు. మరమ్మతు పూర్తికాగే గేట్లను డ్రైరన్ చేస్తారు. ఫ రెండు మూడు రోజుల్లో ట్రయల్రన్ -
భవిత కేంద్రాల్లో పనులు పూర్తిచేయాలి
నల్లగొండ: భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలకు సివిల్ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేశామన్నారు. భవిత కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు. అన్ని భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, రైలింగ్, ర్యాంపు, యాక్టివిటీ రూమ్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిత కేంద్రాల్లో వినియోగించనున్న సామగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ప్రదర్శించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్లగొండ, దేవరకొండ ఆర్డీకోలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
2 నుంచి యువ రుణాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల్లో ఎంపిక చేసినవారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న తొలి విడతగా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అర్హుల జాబితాను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించారు. 79,493 మంది దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతీయువకులు ఆయా శాఖలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 79,493 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి జాబితాలను జిల్లా అధికారులకు నివేదించారు. నియోజకవర్గాల్లో రుణాల పంపిణీ జూన్ 2న అన్ని నియోజకవర్గాల పరిధిలో రూ.లక్షలోపు రుణాలకు ఎంపికై న లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు. రాజీవ్ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం ఫ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాలు అందజేత ఫ తొలి విడతగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు.. ఫ జిల్లా కమిటీకి చేరిన అర్హుల జాబితా జూన్లో 3 వేల మందికి రుణాలు రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.లక్ష లోపు రుణాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన దాదాపు 3 వేల మందికి జూన్లో కేటగిరీల వారీగా రుణాలు అందించేలా కార్యాచరణ రూపొందించాం. – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ, నల్లగొండఐదు విడతల్లో రుణాలు ఇచ్చేలా.. ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద ఐదు విడతల్లో రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జూన్ నెలలో రుణాలు అందించనున్నారు. ఇందు కోసం దాదాపు 3వేల మంది వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇవ్వనున్నారు. ఇందులో మిగిలిన లబ్ధిదారులకు ఇదే నెలాఖరులోగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే రెండో విడతలో భాగంగా జూలైలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందించనుంది. అలాగే ఆగస్టులో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలు, చివరగా సెప్టెంబర్లో నాలుగు, ఐదు విడతల్లో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్లు ఆమె పేర్కొన్నారు. డిండి విద్యార్థులకు సీఎం అభినందనలుడిండి: డిండి అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పది మంది విద్యార్థులను బుధవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ఫెలిసిటేషన్ సెర్మోనీ–2025 కార్యక్రమంలో సీ ఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించి అభినందించారు. ఇందులోభాగంగా డిండి మండల కేంద్రానికి చెందిన అవుల అఖిల, నారిమళ్ల ప్రవళిక ఉన్నారు. వీరికి సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, కోచ్ పరశురాం అభినందనలు తెలిపారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలిచండూరు: కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన చండూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో మాట్లాడి రికార్డులు, కార్యకలాపాలపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ యాదగిరి, సూపరింటెండెంట్ నర్సింహ, సిబ్బంది ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలి నకిరేకల్ : హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కుంభం నర్సిరెడ్డి అన్నారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో కొనసాతుతున్న హ్యాండ్బాల్ బాలబాలికల ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో మాట్లాడారు. జూన్ 4 నుంచి 6 వరకు మంగళపల్లిలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్బాల్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ ఉస్మాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు.వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభేషికం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. తరువాత స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం నిర్వహించారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్: నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆయుష్ డిపార్టుమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ చక్రధర నర్సింహారావు అన్నారు. ప్రపంచ యోగా మాసోత్సవాల సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణ్, యోగా ఇన్స్పెక్టర్లు సింగం ప్రవీణ్యాదవ్, కోమల, జ్యోతి, చంద్రయ్య, చంద్రమౌళి, అమీన్బాబా, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
చింతపల్లి: మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయంలో గురువారం శ్రీస్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీధర్స్వామి ఆధ్వర్యంలో రామ్చరణ్ శర్మ, కిరణ్ శర్మలు పూర్ణాహుతి హోమం జరిపారు. సాయిబాబా విగ్రహానికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ్య పావని, ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి వెంకటయ్య చంద్రకళ, కుంభం పుల్లారెడ్డి సుకన్య, టి.శ్రీనివాస్ లతా దంపతులు, కోశాధికారి ఊరె కృష్ణయ్య, ట్రస్ట్ సభ్యులు మంచి కంటి జనార్దన్, ఆలంపల్లి చంద్రశేఖర్, కొమిరిశెట్టి అశోక్, ఆలంపల్లి పాండురంగయ్య, రవి, మంచి కంటి శ్రీనివాస్, ఆగిరి రవి, గోవింద్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఫ ముగిసిన సాయి ఆలయ వార్షికోత్సవాలు -
బీజేపీని తరిమికొడితేనే దేశాభివృద్ధి
మునుగోడు: మతోన్మాదం పెంచడంతోపాటు పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొడితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో గురువారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీకి మద్దతులేని రాష్ట్రాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తోందన్నారు. బీజేపీ నాయకుల కుట్రలు, ఎత్తుగడులను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ కూటమితో జత కట్టామని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం కాల్చిచంపడం సరైందికాదన్నారు. ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్గఢ్ అడవుల్లోని యూరేనియం తవ్వి కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే మావోయిస్టులను చంపేస్తున్నారని ఆరోపించారు. ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈసభలో గుర్జ రామచంద్రం, సురిగి చలపతి, బిలాలు, చాపల శ్రీను, లింగయ్య, మందుల పాండు, యాదయ్య, వెంకన్న, కై లాస్, జానీ, వంశీకృష్ణ, శంకర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తించాలి?– గపూర్, నకిరేకల్, వినయ్కుమార్, కురంపల్లి, కనగల్ మండలం, జేడీఏ : ప్రభుత్వ లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి. కోనేటప్పుడు ప్యాకెట్ ధర, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, లాట్ నంబర్, కంపెనీ పేరు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. అన్ని సక్రమంగా ఉంటేనే అసలైన విత్తనాలు. అవి లేకపోతే నకిలీవని గుర్తించాలి. ధర ప్యాకెట్కు రూ.901 మాత్రమే ఎక్కువ ధరకు అమ్మినా, ఎలాంటి అనుమానాలు ఉన్నా వ్యవసాయ అఽధికారులకు తెలియజేయాలి. విత్తనాల కొన్నాక తప్పకుండా రశీదుని తీసుకుని దాన్ని పంటల సాగు సీజన్ సమయం ముగిసే వరకు భద్రంగా ఉంచుకోవాలి. నల్లగొండ అగ్రికల్చర్ : ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురవడంతో రైతులు సాగు పనులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చే నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పాల్వాయి శ్రవణ్కుమార్ సూచించారు. అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి రశీదు తప్పకుండా పొందాలి.. మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలని అంటున్నారు. వానాకాలం పంటల సాగులో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు గురువారం సాక్షి ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. రైతులు వెలిబుచ్చిన సందేహాలను జేడీఏ సావదానంగా విని నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి పి.అనంతరెడ్డి, కేవీకే కంపాసాగర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాస్, సైంటిస్టు కె.సంధ్యారాణి, మండల వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాస్, టెక్నికల్ ఏఓ కీర్తి, స్టెనోగ్రాఫర్ పాల్గొన్నారు. ప్రశ్న : వర్షాలు కురిసినందున ఇప్పుడు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చా?– బండి ఆంజనేయులు, అడవిదేవులపల్లి జేడీఏ : దుక్కులు దున్నుకోనివారు దుక్కులను దున్నుకోవాలి. దున్నుకుని సిద్ధంగా ఉన్న రైతులు మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. ప్రశ్న : నందిపాడు సీడ్స్ కార్పొరేషన్ నుంచి జనుము విత్తనాలను అందుబాటులో ఉంచాలి?– ఇంద్రారెడ్డి, నిడమనూరు జేడీఏ : తప్పక మీ మండల కేంద్రంలో రేపటి వరకు జనుము, ఇతర వరి విత్తనాలను సీడ్స్ కార్పొరేషన్ ద్వారా అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రశ్న : వానాకాలం వరినారు పోసుకోవచ్చా.. ఎప్పటి వరకు నాట్లు వేసుకోవాలి?– శ్రీశైలం దోరెపల్లి, కనగల్ మండలం జేడీఏ : దొడ్డురకం కేఎన్ఎం 118, రకం, బీపీటీ సన్నాలతో నారు పోసుకోవచ్చు, ఆగస్టు 15 వరకు వరినాట్లు పూర్తి చేసుకోవాలి. ప్రశ్న : డీఆర్ఆర్ వరిరకం విత్తనాలు ఇస్తున్నారా?– నర్సిరెడ్డి, వెలుగుపల్లి, నల్లగొండ మండలంజేడీఏ : డీఆర్ఆర్ రకం వరి విత్తనాలు మినికిట్లు వచ్చాయి. అయిపోయాయి. మళ్లీ రాగానే సహకార సంఘాల ద్వారా ఇప్పిస్తాం. ప్రశ్న : భూసార పరీక్షలను చేసి కార్డులను ఇవ్వడం లేదు. అసలు పరీక్షలు చేస్తున్నారా? –కోట వెంకటేశ్వర్రావు, చీకటిగూడెం జేడీఏ : పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి తప్పకుండా భూసార పరీక్షలను చేసి రైతులకు కార్డులను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిస్తాం. ప్రశ్న : రైతు విశిష్ట కార్డులు తీసుకోవాలా.. వద్దా?–సైదులు, అన్నెపర్తి జేడీఏ : మనకు ఆధార్ కార్డులు ఎలాగో భూములకు విశిష్ట కార్డులు అవసరం. తప్పకుండా వాటిని తీసుకోవాలి. ఏఈఓలు గ్రామాలకు వచ్చి నమోదు చేసుకుంటున్నారు. ఫ అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి ఫ ముందస్తు వర్షాలతో వరినార్లు పోసుకోవచ్చు ఫ మరో వర్షం కురిసిన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలి ఫ ‘సాక్షి ఫోన్ఇన్’లో రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్కుమార్ సూచనప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని అరికట్టి రైతులను కాపాడాలి?–బ్రహ్మయ్య, అడవిదేవులపల్లి జేడీఏ : ఆంధ్రా ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనాలను అమ్మే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. అదేవిధంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి దాడులను చేయిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలి. ప్రశ్న : ఈ వానాకాలంలో ఏరకం వరి విత్తనాలు సాగు చేసుకోవాలి– జానయ్య, రమేష్రెడ్డి, తిప్పర్తి, ఈశ్వర్, జీకే అన్నారం, నల్లగొండ మండలం జేడీఏ : ముందుస్తుగా కురిసిన వర్షాల వల్ల వరినార్లు పోసుకోవచ్చు. సన్నాలైన బీపీటీ, దొడ్డురకమైతే కేఎన్ఎం118 రకం వరి విత్తనాలు విత్తుకోవచ్చు. విత్తనాలు కేవీకే కంపాసాగర్లో అందుబాటులో ఉన్నాయి. సన్నాల సాగుకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ను సద్వినియోగం చేసుకోవాలి. -
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి మోస్తారుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగాఉన్నా.. మూడునెలల ముందుగా మేలోనే వరదలు మొదలవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు భారీ వర్షాలకు ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చింది. ఎగువ నుంచి 82 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లు రెండు మీటర్ల ఎత్తు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరదలు మొదలైతే గత ఏడాది కన్నా ముందుగానే ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉంటాయని సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 512.50 అడుగులుగా కాగా 135.9545 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు). ఫ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు అనుమతులు
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 25 ఎకరాల్లో రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి కొండమల్లేపల్లి మండలం కోల్మంతల్పహాడ్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. నేరేడుగొమ్ములో దాదాపు రూ.47కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. సమావేశంలో నాయకులు ఆలంపల్లి నర్సింహ, ఎంఏ సిరాజ్ఖాన్, నాయిని మాధవరెడ్డి, మారుపాకల సురేష్గౌడ్, శిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేష్గౌడ్, కొర్ర రాంసింగ్, సుగుణయ్య ఉన్నారు. ఫ ఎమ్మెల్యే బాలునాయక్ -
ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్నగర్లో డీఎస్పీ కె.రాజశేఖరరాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీసులు పలు బృందాలుగా విడిపోయి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అద్దెకు ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 ద్విచక్రవాహనాలు, 16ఆటోలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్తో పాటు 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కాలనీలో మొత్తం 50మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా వారిలో ఎనిమిది మందికి టెస్టుల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐదుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
మిర్యాలగూడ మున్సిపల్ సిబ్బందికి మెమోలు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీలో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రూ.70లక్షలు కాజేసిన వ్యవహారంపై మున్పిల్ డీఈతోపాటు మరో ముగ్గురు సిబ్బందికి అదనపు కలెక్టర్ మెమోలు జారీ చేయడంతోపాటు సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అందించారు. ఈ విషయంపై బుధవారం సాక్షి దినపత్రికలో మొక్కలు మింగేశారు అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ స్పందించారు. బుధవారం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటకుండా చెక్కు ఎలా జారీ చేశారంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఆ చెక్కు పాస్ కాకుండా హోల్డ్లో పెట్టించారు. దీనికి బాధ్యులుగా మున్సిపల్ డీఈ వెంకన్నకు, అకౌంటెంట్ ధనుంజయ, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, మరో సిబ్బంది సుబ్రహ్మణ్యంకు మెమోలు జారీ చేసి షోకాజ్ నోటీసులు అందించారు. అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి చెక్కు జారీలో మీ ప్రమేయం ఏంటో మూడు రోజుల్లో మీ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలపాలని ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు. ఫ డీఈతోపాటు ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ ఫ ‘మొక్కలు మింగేశారు’ కథనంపై స్పందించిన సబ్ కలెక్టర్ -
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడులు
నిడమనూరు : వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ విధానంలో వరిసాగు చేస్తే వ్యయం తగ్గడంతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ రైతులకు సూచించారు. బుధవారం నిడమనూరు మండలం వల్లభాపురం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. సాగర్ ఆయకట్టులో జగిత్యాల విత్తనం జేజేజీఎల్–27536 రకాన్ని కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధి చేసిందని, 135 రోజుల్లోనే ఎకరాకు 42 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని వివరించారు. ధాన్యం చింట్లు మాదిరిగా ఉంటుందన్నారు. భూమి సారాన్ని కాపాడుకునేందుకు సాగుకు ముందు జీలుగా, జనుము వేసుకోవాలన్నారు. యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అధికారి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విత్తనాలను రైతులు వాడాలన్నారు. విత్తన కార్పొరేషన్ నందిపాడు(మిర్యాలగూడ), నిడమనూరు ప్రాథమిక సహకార సంఘంలో లభించే విత్తనాలను వివరించారు. వానాకాలంలో అధికంగా సాగుచేసే సన్న రకాల గురించి వివరించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాగులో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి తనూజ, అభ్యుదయ రైతులు నన్నెబోయిన రవి, వెంకట్ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఫ కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఫ వల్లభాపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం -
మా మనసు దోచాయి
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మా మనసును దోచాయని ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రతినిధులు కొనియాడారు. - 8లోదేవరకొండలో పది బెడ్లు సిద్ధం దేవరకొండ: దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కిట్లు, పది బెడ్లతో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఆస్పత్రికి ఇటీవల జిల్లా కలెక్టర్ నాలుగు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. -
కోవిడ్పై అలర్ట్!
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025నల్లగొండ టౌన్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా (కోవిడ్) కొత్త వేరియంట్ ప్రబలి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ నల్లగొండలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)తోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసింది. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలతోపాటు చికిత్సకు పది బెడ్ల చొప్పున సిద్ధం చేసుకోవాలని మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ నిల్వలున్నా..! నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 700 పడకలు ఉండగా అన్ని బెడ్లకు ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 20 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉండడంతో పాటు ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో గతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 పడకల వార్డు అందుబాటులో ఉంది. మిర్యాలగూ ఏరియా ఆస్పత్రిలో 200 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆసుపత్రుల్లో వంద పడకలు ఉండగా ఆక్సిజన్ ఆందుబాటులో ఉంది. మర్రిగూడ ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అవసరమైన మందులు సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నల్లగొండతో పాటు అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్ష కిట్లు అందుబాటులో లేనట్టు తెలిసింది. 2020 మార్చిలో తొలి కేసు కరోనా దేశాన్ని గడగడలాడించింది. ఈ నేపథ్యంలో 2020 మార్చి నెలలో జిల్లాలో తొలి కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా 1,107 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మందులు, ఆక్సిజన్ అందుబాటులో.. మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ డివిజన్లో కరోనా వైరస్ సోకినట్లు ఇంతవరకు ఎవరిని గుర్తించనప్పటికీ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంచారు. మందులు, ఆక్సిజన్తో పాటు ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు గదులు అందుబాటులో ఉన్నాయి. కరోనాతో ప్రజలు భయాందోళన చెందవద్దు.. జలుబు మాదిరిగా అది మారిపోయిందని, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరథ్ తెలిపారు. ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు సన్నాహాలు నాగార్జునసాగర్: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇరవై రోజుల క్రితం ప్రపంచ సుందరీమణులు సాగర్కు వచ్చిన సందర్భంగా వారికోసం 20 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఐసీయూ పడకలు ఏర్పాటు చేయడానికి సామగ్రిని తీసుకొచ్చారు. 20 బెడ్లలో కొన్నింటిని వేరు చేసి ప్రత్యేకంగా ఐసీయూను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నకిరేకల్ల్లో ఐసోలేషన్ వార్డు లేదు నకిరేకల్: నకిరేకల్లోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు కేటాయించ లేదు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో లేవు. కేవలం నకిరేకల్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓగోడు, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా కిట్లు అందుబాటులో లేవు. వీటిని సమకూర్చుకునే పనిలో వైద్యసిబ్బంది నిమగ్నమైంది.న్యూస్రీల్ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఫ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మౌఖిక ఆదేశాలు ఫ ముందస్తు ఏర్పాట్లకు సూచన ఫ అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టిన జిల్లా యంత్రాంగం -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 144 మంది హాజరు
నల్లగొండ: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షకు 136 మంది విద్యార్థులకు 106 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్ పరీక్షలకు 56 మంది హాజరు కావాల్సి ఉండగా 38 మంది విద్యార్థులు హాజరయ్యారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్రిమినల్ కేసులునల్లగొండ టౌన్: లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడించే కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అడ్వయిజరీ సలహా మండలి నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగినజిల్లా అడ్వయిజరీ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ చేసే గర్భిణుల పూర్తి వివరాలు ఫార్మాట్ రూపంలో వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో అర్హత లేని రేడియాలజిస్టులు, గుర్తింపు పొందిన సంస్థలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో ఎంసీహెచ్ ప్రాజెక్టు ఆఫీసర్ డాక్టర్లు అరుంధతి, స్వరూపారాణి, సుచరిత, వందన, గీత, కళ్యాణచక్రవర్తి, రవి, కృష్ణకుమారి, నర్సయ్య, రమేష్ పాల్గొన్నారు. ఎస్టీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులునల్లగొండ: జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని త్రిపురారం మినీ గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 14, 3లో 6, 4లో 4, 5 వ తరగతిలో 10 బ్యాక్లాగ్ సీట్లు, పెద్దవూర గురుకులంలో 1వ తరగతిలో 30, 2లో 18, 3లో 9, 4లో 8, 5లో 5సీట్లు, చందంపేటలో 1లో 30, 2లో 1, 5లో 11సీట్లు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీ కోసం గిరిజన విద్యార్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలననాగార్జునసాగర్: సాగర్ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నందికొండ మున్సిపాలిటీలో బుధవారం మి ర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ స్థల పరిశీలన చేశారు. హిల్కాలనీ బీసీ గురుకుల పాఠశాల వెనక భాగంలో నాట్కో ట్రస్టు క్వా ర్టర్ల పక్కన స్కూల్ నిర్మాణానికి అనువైన స్థలా న్ని పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆయనవెంట ప్రాజెక్టు ఇన్చార్జ్ మల్లికార్జునరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డి, ఫారెస్టు అధికారులు రాఘవేందర్రావు, రమేష్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలినల్లగొండ: కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని సురక్ష బీమా పథకం కింద ఖాతాదారుడు ఏడాదికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. జీవన జ్యోతి బీమా పథకం కింద ఖాతాదారుడు సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, 18 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగి ఉండాని పేర్కొన్నారు. -
నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయాలి
నల్లగొండ: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు రవాణా కాకుండా కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. జిల్లాలో వరి, పత్తి, ఇతర ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కల్తీ విత్తనాలు అంటగట్టేవారిపై నిఘా ఉంచాలన్నారు. రైతులు అనుమతి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని, లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వస్తే పోలీసుల సహకారం తీసుకుని దాడులు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ముందే వానాకాలం ‘రైతు భరోసా’
జిల్లా వ్యవసాయాధికారితో నేడు ఫోన్ ఇన్ ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 51294 తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు -
అనరు్హలను తొలగించేలా..
విచారించిన తర్వాతే తొలగింపు ప్రస్తుతం ఆరు నెలల పైచిలుకు రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు 5,092 మంది ఉన్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి వారి జాబితా మాకు అందింది. మండలాల వారీగా ఆ వివరాలను తహసీల్దార్లకు పంపించాం. నివేదిక వచ్చిన తర్వాతే దాన్ని పూర్తిగా విచారించి అనర్హులను తొలగిస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ నల్లగొండ: రేషన్ షాపుల ద్వారా అందించే సన్న బియ్యం అర్హులైన పేదలకే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల క్రితం వరకు దొడ్డు బియ్యం ఇచ్చిన ప్రభుత్వం రెండు నెలల నుంచి సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అర్హులైన పేదలకు మాత్రమే ఈ బియ్యం అందాలనే ఉద్దేశంతో అనర్హులను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోని కార్డుదారుల వివరాలు గుర్తించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. మొదలైన విచారణ జిల్లాలో గత ఆరు మాసాల నుంచి దాదాపు సంవత్సరం కాలంగా 5,092 మంది రేషన్ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడం లేదని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా కార్డుదారులు అసలు ఉన్నారా.. లేరా వలస వెళ్లారా.. లేక చనిపోయారా అనే దానిపై విచారణ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తొలగించేందుకు నివేదిస్తారు. అయితే గత జనవరి నుంచి పరిశీలిస్తే మార్చి వరకు జిల్లాలో లక్ష మంది వరకు ఒక్కో మాసంలో కార్డుదారులు బియ్యం తీసుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వడంతో బియ్యం తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరు నెలల పైచిలుకు ఒక్కసారి కూడా బియ్యం తీసుకోనివారిని మాత్రమే సర్వే చేస్తున్నారు. ఆరు నెలల పైచిలుకు బియ్యం తీసుకోని వారి జాబితాను రేషన్ షాపుల వారీగా సేకరించి తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పంపించారు. ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు, ఆర్ఐలు ఇతర సిబ్బందిచేత గ్రామాల్లో, పట్టణాల్లో ఆ కార్డుదారులు ఉన్నారా లేరా అనే దానిపై విచారణ చేసి నివేదిక సమర్పిస్తారు. అర్హులకు న్యాయం చేయాలనే.. ఒక పక్క ప్రభుత్వం అర్హులైన వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో 15 వేల మందికి కొత్త కార్డులు మంజూరయ్యాయి. ఇంకా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అర్హులకు అందించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనర్హుల కార్డులు ఏరివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నెలల తరబడి బియ్యం తీసుకోని కార్డుదారులను పరిశీలించి ఆ పేర్లను తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఫ ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులపై నజర్ ఫ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఫ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఫ ఇప్పటికే రేషన్ తీసుకోని కార్డుదారులు 5,092గా గుర్తింపు ఫ ఐదు నెలలుగా బియ్యం తీసుకోని వారి సంఖ్య లక్షల్లోనే..2025 జనవరి నుంచి రేషన్ తీసుకోని వారి వివరాలు నెల మొత్తం కార్డులు తీసుకోనివారు జనవరి 4,65,998 1,04,278 పిబ్రవరి 4,66,649 1,09,731 మార్చి 4,66,522 1,10,033 ఏప్రిల్ 4,65,941 87,515 మే 4,74,681 98,083 -
మహిళలకు ఇది మంచి అవకాశం
ఉల్లాస్ పథకం ద్వారా చదువురాని మహిళలకు చదవడం, రాయడం, నేర్పించడంతోపాటు మధ్యలో బడి మానేసినవారిని ఓపెన్ టెన్త్, డిగ్రీ చదివించడం కోసం ప్రత్యేక తరగతులను కూడా మండల స్థాయిలో నిర్వహిస్తారు. దివ్యాంగులకు కూడా చదువుకునేందుకు ఇందులో అవకాశం లభిస్తుంది. వయోజన విద్యా శాఖ అధికారులకు ఇప్పటికే మహిళా సంఘాల జాబితా అందించాం. ప్రస్తుతం చదువురాని వారు ఎవరు, చదువుకున్న వారు ఎవరనేది గుర్తించే కార్యక్రమం జరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు ఇది మంచి అవకాశం – శేఖర్రెడ్డి, డీఆర్డీఓ -
మొక్కలను మింగేశారు..!
ఫ అవెన్యూ ప్లాంటేషన్ పేరిట నిధులు స్వాహా ఫ పనులు చేయకుండానే బిల్లులు డ్రా ఫ సోషల్ మీడియాలో మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ పోస్టు వైరల్ మిర్యాలగూడ: మున్సిపాలిటీలకు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులను పనులను చేయకుండానే అధికారులు స్వాహా చేస్తున్నారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతున్నా మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయలు కాజేసినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ అవినీతి అంతా ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇద్దరు అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.70లక్షల నిధులు మంజూరు.. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై 2023లో అవెన్యూ ప్లాంటేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ బడ్జెట్ కింద మిర్యాలగూడ మున్సిపాలిటీకి నందిపాడు బైపాస్ (2.33 కి.మీ) నుంచి ఖలీల్ దాబా (4.66 కి.మీ) వరకు ఇన్నర్, ఔటర్లో అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు రూ.70,14,616.60 నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను చేసేందుకు 5 సెప్టెంబర్ 2023న టెండర్లను ఆహ్వానించారు. సెప్టెంబర్ 14న టెండర్ల గడువు ముగియడంతో అదేరోజు సాయంత్రం టెండర్లను ఓపెన్ చేశారు. ఈ పనులు 90 రోజుల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మొక్కలను నాటలేదు. దీంతో అప్పటి అధికారులు బిల్లులు చేయలేదు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. అప్పుడున్న మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్, ఏఈ బదిలీ అయ్యారు. హడావిడిగా చెక్కు జారీ మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ నుంచి ఖలీల్ దాబా వరకు రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను నాటాల్సి ఉంది. అప్పటికే బైపాస్ వెంట కోనోకార్పస్, గన్నేరు మొక్కలు నాటి ఉన్నాయి. ఎక్కువ క్వాలిటీ ఉన్న మొక్కలను నాటాలని రూ.70 లక్షల నిధులు మంజూరు చేయగా మొక్కలను నాటకుండానే మున్సిపల్ అధికారులు ఇటీవల బిల్లులు నమోదు చేసి చెక్కు జారీ చేశారు. హడావుడిగా కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, ఏఈలు బిల్లులు చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మొక్కలను నాటకుండానే నాటినట్లు అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారు. మున్సిపాలిటీలో అవినీతిపై జోరుగా చర్చ అవెన్యూ ప్లాంటేషన్లో జరిగిన అవినీతిపై మున్సిపల్ మాజీ చైర్మన్ మంగళవారం మన మిర్యాలగూడ ఫేస్బుక్ పేజీలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో అధికారుల ఇష్టారాజ్యమా? అని పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. బైపాస్రోడ్డు వెంట అవెన్యూ ప్లాంటేషన్ పేరిట లక్షల రూపాయల నిధులు స్వాహా చేశారని, దానికి సంబంధించిన టెండర్, నోటిఫికేషన్ పోస్టు చేయడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మొక్కలను నాటకుండానే నాటినట్లు మున్సిపల్ అధికారులు బిల్లులు రాసి రికార్డు చేసి చెక్కు జారీ చేశారని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సమగ్ర విచారణ చేయాలని కోరడంతో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై జోరుగా చర్చ సాగుతోంది. కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ను, డీఈ వెంకన్నను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
ఘనంగా లక్ష పుష్పార్చణ
నార్కట్పల్లి : చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు వేద మంత్రాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సాయంత్రం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చారు. భక్తులు రాత్రి కొండపైన నిద్రించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. లక్ష పుష్పార్చనలో ఈఓ నవీన్కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు
ఫ విత్తే సమయమొచ్చే..నల్లగొండ : ధాన్యం సేకరణ, వ్యవసాయ సీజన్ సంసిద్ధత, భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాపాలన మాదిరిగానే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన 10 శాతం ధాన్యం సేకరించాలని సూచించారు. ఎంత ఎరువులు, విత్తనాలు కావాలో ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎవరైనా ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి జాబితా తయారుచేసి వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పక్కగా అమలు చేయాలని, మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదన కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఇన్చార్జ్ డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల జాబితా రూపొందించాలి
జిల్లా వ్యవసాయాధికారితో 29న ఫోన్ ఇన్ ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్నందున ఆరుద్ర కార్తె కంటే ముందే పంటల సాగుకు సన్నద్ధం కావచ్చా.. పత్తి తదితర మెట్టపంటలు ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వానాకాలం వరినార్లు పోసుకునేందుకు అనువైన సమయం ఎప్పుడు.. విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తుపట్టాలి.. తదితర సమాచారం రైతులు తెలుసుకునేందుకు జిల్లా వ్యవసాయాధికారితో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. రైతన్నలు నేరుగా వ్యవసాయాధికారికి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్ : 89777 51294 తేది. 29.05.2025 (గురువారం) సమయం : ఉదయం 10 నుంచి 11 గంటల వరకు -
మున్సిపాలిటీల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్
నివేదిక సిద్ధం చేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తాం. మున్సిపాలిటీల్లోని అన్ని విభాగాల ఉద్యోగులు 100 రోజుల్లో చేయాల్సిన పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించి అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నాం. –సయ్యద్ ముసాబ్ అహ్మద్, నీలగిరి మున్సిపల్ కమిషనర్ ఫ జూన్ 2 నుంచి ప్రారంభం ఫ అభివృద్ధి పనుల పూర్తి, రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు లక్ష్యం ఫ ప్రణాళిక రూపొందిస్తున్న అధికారులు నల్లగొండ టూటౌన్: మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అన్ని విభాగాలు 100 రోజుల యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులతో కలిసి జూన్ 2వ తేదీన పెద్ద ఎత్తున 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించడం, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, ఎక్కడ పంపిణీ చేయాలి, ఎక్కడ నాటాలి అనే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను తప్పుఒప్పులను సవరించడం లాంటి కార్యక్రమం 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు. ఈ నెలాఖరులోగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించేందుకు మున్సిపాలిటీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలాంటివి చేపట్టాలి. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు.. ఇంజనీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు పూర్తి చేయడంతోపాటు వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, క్రమబద్ధీకరించడం, లేదా తొలగించడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు వైద్యశిబిరాలు చేపట్టాలి. పార్కుల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 100 రోజుల్లో ఏ విభాగం ఎంతమేర పనితీరు మెరుగుపర్చారో నివేదిక అందజేయాల్సి ఉంటుంది. వార్డులకు నోడల్ ఆఫీసర్ల నియామకం చేపట్టి నిరంతరం పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయా మున్సిపాలిటీలు తేదీల వారీగా జాబితా రూపొందించే పనిల్లో పడ్డాయి. -
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ 45 మంది నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్నల్లగొండ: స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా నారాయణ అమిత్కు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణ అమిత్కు కలెక్టర్ బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సోమవారం విధుల్లో చేరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి నల్లగొండ అగ్రికల్చర్: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఇండోనేషియాలోని బాలిలో బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా, రీజనల్ పాలసీ ఫోరం 78వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి ఇస్తున్న రుణాలు, అభివృద్ధి తదితర అంశాలను సదస్సులో వివరించారు. వ్యవసాయ రంగంలో వేస్టేజీ, పొల్యూషన్ లేకుండా వనరులు వాడుకునే విధానం, ఇండోనేషియాలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధి విధానాలను తెలుసుకోవడం కోసం క్షేత్ర పర్యటనలో ఆయన పర్యటించారు. ఈ సదస్సులో అన్ని జిల్లాల సహకార బ్యాంకుల చైర్మన్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షయ రహిత జిల్లాగా మార్చాలినల్లగొండ టౌన్: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు కృషిచేసి క్షయ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క అర్బన్ హెల్త్ సెంటర్లో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మందుల ద్వారా క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే జిల్లా కేంద్రంలోని టీబీ ఆస్పత్రిలో సంప్రదించి పరీక్షలు చేయించుకుని కోర్సు ప్రకారం మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కళ్యాణచక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
నల్లగొండ: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లైసెన్స్డ్ సర్వేయర్లకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూ సేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్ లైన్ సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అన్నారు. అనంతరం 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు కలెక్టర్ సర్వే సామగ్రి అందజేశారు. సర్వేయర్లకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్చార్జ్ ఏడీ సుజాత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణయ్య, సూపరింటెండెంట్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కొనుగోళ్లలో రెండో స్థానం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచింది. ఆఖరి స్థానంలో అతి తక్కువ ధాన్యం కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. మొదటగా నల్లగొండలో కేంద్రాలు ప్రారంభం రాష్ట్రంలోనే మొదటగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. యాసంగి కోతలు నల్లగొండ జిల్లాలో ముందస్తుగా రావడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదేరోజు మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. రెండో స్థానంలో నల్లగొండ.. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా.. 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా ఆదిలాబాద్ 249 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఇబ్బందులు ఎదుర్కొంటూ.. జిల్లాలో ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు సక్రమంగా అంచనా వేయలేకపోయారు. ప్రతిసారి వారు వేసిన అంచనాకు మించి ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. దాంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అధికంగా వస్తోంది. అయితే ఈసారి యాసంగి సీజన్ సమయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు రిటైర్డ్ కావడంతో డీఎం హరీష్కు ఇన్చార్జ్ డీఎస్వో బాధ్యతలు అప్పగించారు. రెండు కీలక పోస్టుల్లోను ఆయనే వ్యవహరించాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మహబూబ్నగర్ నుంచి వెంకటేశ్వర్లు డీఎస్వోగా బదిలీపై వచ్చారు. కొనుగోళ్ల భారం కలెక్టర్ మీద వేసుకుని జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఏరోజుకారోజు తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వచ్చారు. ధాన్యం సంచుల కొరత, లారీల కొరత ఎదురైనప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ధాన్యం కొనుగోళ్లు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో 5.83 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఫ జిల్లాలో అంచనాకు మించి దిగుబడి ఫ సమన్వయంతో పనిచేసిన అధికారులుసమన్వయంతో పనిచేశాం యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కలెక్టర్ ఇలా త్రిపాఠి నిత్యం అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయడంతో కొనుగోళ్లలో ముందు వరుసలో ఉన్నాం. లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్తోపాటు ఇటు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు తీసుకున్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు విడుదలయ్యాయి. వాటిని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. –హరీష్, పౌర సరఫరాల శాఖ డీఎం అంచనాకు మించి కొనుగోళ్లు.. జిల్లాలో మొత్తం 5.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అంచనాకు మించి మొత్తం 5.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇచ్చిన టార్గెట్ 5.36 లక్షలు అయితే.. 5.83 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అంటే 47 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశారు. దాదాపు రూ.1350 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 82 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. -
ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
వేములపల్లి: ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. గతంలో ఉపాధి హామీ పథకానికి రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రూ.86 వేల కోట్లకు కేంద్రం కుదించిందన్నారు. అదేవిధంగా గతంలో 23 కోట్ల జాబ్కార్డులు ఉంటే ఇప్పుడు 13 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఉపాధి కూలీలకు రూ.500 రోజువారి వేతనంతోపాటు పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వలు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు గౌతంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, నాయకులు చల్లబొట్ల ప్రణీత్రెడ్డి, వడ్డెగాని సైదులు, రెమడాల భిక్షం, సుకన్య తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి -
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి
నల్లగొండ టూటౌన్: నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, రైతులందరికీ రుణమాఫీ చేసి, రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలని కోరారు. మిల్లెట్ పంటలను ప్రోత్సహించడంతోపాటు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల ఎరువులను రైతులను అందుబాటులో ఉంచాలని, చెరువులు, కుంటలు, కాల్వలకు మరమ్మతులు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, యాసంగి ధాన్యానికి వెంటనే బోనస్ ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్, పిండి పాపిరెడ్డి, గడ్డం మహేష్, కన్మంతరెడ్డి అశోక్రెడ్డి, బీపంగి జగ్జీవన్రామ్, గుండా నవీన్రెడ్డి, సాయన్నగౌడ్, రమణముదిరాజ్, బైరు సత్తయ్య, దాసోజు యాదగిరాచారి తదితరులు ఉన్నారు. -
సాగు పనుల్లో రైతన్న బిజీ
ఫ వర్షంతో ఊపందుకున్న దున్నకాలు ఫ విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు ఫ 11.60 లక్షల ఎకరాల్లో సాగు అంచనా నల్లగొండ అగ్రికల్చర్: తొలకరి వర్షాలు ముందే కురుస్తుండడతో జిల్లా అంతటా రైతులు దుక్కులను దున్నుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు పత్తిచేలలో కట్టెను తొలగించుకుని సిద్ధంగా ఉండడంతో పత్తి సాగుకు అవసరమైన దుక్కులను దున్నుకుంటున్నారు. వరి, పత్తి విత్తనాల కొనుగోలు కోసం రైతులు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్ గత వానాకాలం సీజన్ కంటే వారం ముందుగా ప్రారంభం కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఆదివారం రోహిణి కార్తె ప్రారంభం కాగా.. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అదేవిధంగా జూన్ 11న ఏరువాక పౌర్ణమి కావడంతో రైతులు ఆ రోజు ఏరువాక ప్రారంభించనున్నారు. పెట్టుబడుల కోసం తిప్పలు.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో పంటల సాగుకు రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పేలా లేవు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నాలుగు ఎకరాలపై భూమి ఉన్న రైతులకు నేటివరకు అందని పరిస్థితి. ప్రస్తుతం వానాకాలం సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్కు జూన్ మొదటి వారంలోనే గత ప్రభుత్వం పెట్టుబడి సాయం రైతు బంధు పేరుతో అందించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతుభరోసా వస్తుందో రాదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్లో కూడా రైతులందరికీ రైతు భరోసా అందలేదు. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుబాటులో విత్తనాలు.. రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 13 లక్షల 80 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉందని గుర్తించి దానికి అనుగుణంగా జిల్లాలోని విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. అదేవిధంగా లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలను కూడా డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. కంది, పెసర, వేరుశనగ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యాబై శాతం సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.పత్తి సాగు వైపే మొగ్గు.. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 11లక్షల 60 వేల ఎకరాల్లో వరి, పత్తి ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో సింహభాగంగా పత్తి 5,47,735 ఎకరాల్లో, వరి 5,25,350 ఎకరాల్లో, మిగతా కంది, పెసర, వేరుశనగ, సజ్జ, జొన్న పంటలు సాగు కానున్నాయి.దుక్కులు దున్నుకుంటున్నారు నైరుతి రుతుపనాలు మూడు రోజుల ముందే రావడం మంచి పరిణామం. ఇప్పటికే జిల్లా అంతటా రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. వానాకాలం సీజన్ జూన్ నుంచే ప్రారంభమవుతుంది. రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలను పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. –పాల్వాయి శ్రవణ్కుమార్, జేడీఏ