breaking news
Nalgonda District News
-
మునుగోడులో ‘ప్లాస్టిక్’పై చైతన్యం
మునుగోడు: పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ కవర్లు మునుగోడు మండలంలో కనుమరుగయ్యాయి. మూడు నెలల క్రితం వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వినియోగించేవారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మండల, గ్రామ స్థాయి అధికారులంతా రంగంలోకి దిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపర్చారు. దీంతో మండలంలో దశలవారీగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానిపించారు. ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి చెక్ పెట్టారు. చాటుమాటుగా వినియోగిస్తున్న దాదాపు 30మందికిపైగా దుకాణాదారులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు జరిమానాలు విధించారు. దీంతో ప్రస్తుతం మండల వ్యాప్తంగా వివిధ దుకాణాల్లో చూద్దామన్నా ప్లాస్టిక్ కవర్లు కన్పించడం లేదు. -
భవిష ్యత్ భారత్దే..
నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ తర్వాత నైపుణ్యాల్లో అసమానతలు మరింత పెరిగాయి. లక్షలాది మంది యువత శిక్షణ లేక నిరుద్యోగులుగా మారారు. పారిశ్రామిక అవసరాలకు తగిన ప్రతిభ లోపించడం ప్రధాన సమస్య. ఈ పరిస్థితి అధిగమించాలి. – ఎండీ. మీరాజుద్దీన్ ● విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది ● కీలకం కానున్న యువత పాత్ర ‘సాక్షి’ టాక్ షోలో ఎన్జీ కళాశాల విద్యార్థుల మనోగతం -
స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: నల్లగొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించనున్నారు. వివిధ రకాల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్తుల పంపిణీలో మంత్రి పాల్గొననున్నారు. వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన ఎన్జీ కాలేజి, గడియారం సెంటర్, ఇతర కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమయ్యాయి. మండల ప్రత్యేకాధికారుల పాత్ర కీలకంనల్లగొండ: అభివృద్ధి కార్యక్రమాల అమలులో మండల ప్రత్యేకాధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు మండలాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. విద్య, వైద్య పథకాల అమలు తీరుపై నివేదికలు సమర్పించాలని సూచించారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని జిల్లా రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, యూరియా బయటికి పోకుండా చూడాలన్నారు. అనంతరం ప్రత్యేకాధికారులు వారి పరిధిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థల సందర్శన, అధికారుల పనితీరుపై నివేదికలను కలెక్టర్కు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జ్ డీఆర్ఓ అశోక్ రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.ప్రవేశాలకు స్పాట్ కౌన్సిలింగ్ నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో 2025– 26కు సంబంధించి గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు 19వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు నల్లగొండ రీజియన్ ప్రాంతీయ సమన్వయ అధికారి బలరాం గురువారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సిలింగ్కు హాజరుకావాలని పేర్కొన్నారు. 30న డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చదివి 6వ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వారికి ఈనెల 30న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ సీఓఈ ఉపేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరిశోధనలతో విజ్ఞానం పెంపొందుతుందినల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పరిశోధనలపై మక్కువ పెంచుకుంటే విజ్ఞానం పెంపొందుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం విద్యార్థిని వాణి గాయత్రి, ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థిని సనా కౌసర్ ప్రభుత్వ వైద్య సేవల్లో సిబ్బంది, వారి పని ప్రదేశాల్లో ఎదురయ్యే ప్రమాదాలు అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధన అంశం స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ జనరల్లో ప్రచురితం కావడంతో గురువారం వీసీ వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, ప్రొఫెసర్ సరిత, డా. సబినా హరాల్డ్, డా.సురేష్రెడ్డి, డా.వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగులో రాణిస్తున్న పట్టభద్రుడు
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్రెడ్డి ఉన్నత చదువులు చదివి వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్నారు. అర్ధశాస్త్రంలో పోసు్ట్రగాడ్యుయేషన్ పూర్తిచేసిన గోవర్ధన్రెడ్డి గత నాలుగేళ్లుగా గోఆధారిత సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతరించిపోతున్న దేశీయ వరి రకాలను కాపాడటం, పర్యావరణాన్ని, భూమి, నీరు పరిరక్షించుకోవడం, తగ్గుతున్న భూసారాన్ని కాపాడాలనే లక్ష్యంతో సేద్యం చేస్తున్నారు. రసాయన మందులు లేని ఆహారాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం కృషిచేస్తున్నారు. గోవుల పెంపకంతో వాటి మలమూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం, గో కృపామృతం, కషాయాలు ఉపయోగించి దేశవాళి పంటలను పండిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు వరిలో దేశవాళి రకాలైన నవార, రత్నచోళి, మైసూర్, మల్లిక, మట్ట రైస్, కులాకర్, కృష్ణప్రియ, బహురూపి పండిస్తున్నారు. సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆశించిన లాభాలు వస్తున్నాయని ఆయన పేర్కొంటున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుడమి పుత్ర పురస్కారాన్ని గతేడాది డిసెంబర్లో యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి అందుకున్నారు. సేంద్రియ వ్యవసాయంపై తాను అవగాహన పెంచుకుంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నానని ఆయన చెబుతున్నారు. -
ఒకే మాట.. ఒకటే బాట
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో మద్యం అమ్మకాల నిషేధం కఠినంగా అమలవుతోంది. అల్లందేవిచెర్వు గ్రామం నుంచి ప్రారంభం.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరేళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. బెల్టుషాపులు మూసివేసి మద్యం అమ్మకాలను నిషేధించిన గ్రామాల అభివృద్ధి కోసం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరిట రూ.5లక్షలు ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామస్తులు సమావేశమై తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా గ్రామంలో బెల్టుషాపులను మూసివేసి, మద్యం అమ్మకాలను నిషేధించారు. ఆ తర్వాత చిమిర్యాల గ్రామస్తులు కూడా ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ రెండు గ్రామాల స్ఫూర్తితో గ్రామాగ్రామాన బెల్టుషాపుల మూసివేత పోరాటం కొనసాగింది. మద్యం అమ్మకాలు నిషేధించిన అల్లందేవిచెర్వు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐదేళ్ల కిందట రూ.5లక్షలు ప్రోత్సాహకం అందజేశారు. ఆ నిధులతో గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో అమలు చేశా ఎమ్మెల్యే ప్రకటనతో గ్రామస్తుల సహకారంతో మద్యం అమ్మకాలను నిషేధాన్ని కఠినంగా అమలు చేశాం. దీంతో మా గ్రామానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు నిధులు ఇవ్వడంతో ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించుకున్నాం. – సుర్వి యాదయ్య, మాజీ సర్పంచ్ -
స్వేచ్ఛ, సమానత్వం అంతంతే..
77 ఏళ్లుగా మువ్వన్నెల రెపరెపలురాజాపేట: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతాంగ సాయుధ పోరాటం తర్వాత 1948 సెప్టెబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో రాజాపేట మండలం బేగంపేట గ్రామం నడిబొడ్డున అదే గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 ఏళ్లుగా బేగంపేట గ్రామం నడిబొడ్డున మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. తమ పెద్దలు చూపిన మార్గాన్ని ఇప్పటికీ గ్రామస్తులు అనుసరిస్తూ నిరంతరాయంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కలిసి ఆ జెండా ఎగురవేసే ప్రదేశంలో 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. యువతతో పాటు భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15వ తేదీ, దసరా పండుగ రోజున పాత జెండాను మార్చి నూతన జెండాను ఎగురవేస్తూ జాతీయ నాయకులను స్మరించుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశ వ్యాప్తంగా 79 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలోనూ స్వేచ్ఛ సమానత్వం లేకుండాపోయిందని నేటి యువతరం వాపోతోంది. సమాజంలో అవినీతి, పేదరికం ఇంకా ప్రధాన సమస్యగానే ఉన్నాయని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవం వేళ.. ప్రజలు, ముఖ్యంగా యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, స్వేచ్చ, సమానత్వం అందుతున్న తీరు, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ఏం చేయాలన్న అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. 90 మంది నుంచి అభిప్రాయాలు సేకరించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా సమాజంలో ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేకుండా పోయిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అవినీతి పేదరికం కొనసాగుతోందని, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే.. అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతో పనిచేయాలని, చట్టసభలు సమర్థవంతంగా వ్యవహరించాలని, న్యాయ వ్యవస్థ మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందులో మీడియా పాత్ర ప్రధానమేనని వివరించారు. బేగంపేట గ్రామంలో నిరంతరాయంగా ఎగురుతున్న జాతీయ పతాకంమీడియాకులవివక్ష6చట్టసభలు 21అధికార యంత్రాంగం న్యాయ వ్యవస్థ3924కొద్దిగాఅవునులేదు78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. 1. మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏదీ? ఫ అవినీతి, పేదరికమే అసలు సమస్య ఫ అధికార యంత్రాంగం నీతి, నిజాయితీతోనే మేలు ఫ నాణ్యమైన విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే ‘సాక్షి’ సర్వేలో యువత మనోగతం 3. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగం ఏదీ? -
మన నడిగూడెంలోనే.. జాతీయ జెండా రూపకల్పన
నడిగూడెం : భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశాన్ని ఏకం చేస్తూ దేశ కీర్తిని తన మువ్వన్నెల్లో ప్రతిబింబిస్తూ భారతీయులంతా సగర్వంగా సెల్యూట్ చేస్తున్న మన జాతీయ పతాకానికి నడిగూడెం రాజావారి కోటలో రూపకల్పన జరిగింది. నాటి మునగాల పరగణాను నడిగూడెంలోని కోటను కేంద్రంగా చేసుకుని జమీందారు బహుద్దూర్ రాజా నాయిని వెంకటరంగారావు పాలన సాగిస్తున్నారు. ఈ సమయంలో రాజావారికి పింగళి వెంకయ్య పరిచయం కాగా తన కోటకు ఆహ్వానించి వ్యవసాయ అధికారిగా నియమించారు. ఈ సమయంలోనే పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పనకు పూనకున్నారు. కోట సాక్షిగా త్రివర్ణ పతాకం.. నడిగూడెం రాజావారి కోటలో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న పింగళి వెంకయ్య కోట సాక్షిగా జాతీయజెండాకు రూపకల్పన చేశారు. 1916 లక్నోలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయజెండాను ఎగురవేశారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో నేటి విజయవాడ (నాటి బెజవాడ)లో ఎగురువేశారు. గాంధీజీ ఈ సమావేశానికి వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులతోపాటు సత్యం, అహింసకు నిదర్శనమైన తెలుపు రంగు మధ్యలో రాట్నంగల ఒక జెండాను రూపొందించమని కోరారు. దీంతో గాంధీ సూచన మేరకు వెంకయ్య 1921 మార్చి 31న జెండాను పూర్తిస్థాయిలో రూపొందించారు. ఈ జెండాకు రూపకల్పన జరిగి 2021 మార్చి 31న వందేళ్ల వేడుకలను జరుపుకుంది. అయితే 1947 జూలై 22న భారత్య రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ పతాకంలోని రాట్నాన్ని తీసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఏర్పాటు చేశారు. చిహ్నం మార్పు తప్పితే మన పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. కోటలో డక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన నడిగూడెం రాజావారి కోటను మునగాలకు చెందిన చరిత్ర నిపుణుడు జితేంద్రబాబు మరమ్మతులు చేయించి అభివృద్ధి పరిచారు. ఇదే కోటలో ప్రస్తుతం జితేంద్రబాబు ఆధ్వర్యంలో డక్కన్ ఆర్కియాలజీ అండ్ కల్చరల్ రీసెర్చ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనా కేంద్రంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా పుస్తకాలు, లక్ష తాళపత్ర గ్రంథాలు ఉంచారు. జెండా చారిత్రక నేపథ్యానికి గుర్తుగా నడిగూడెంలో 108 అడుగుల ఎత్తుగల స్తంభంపై 30 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు కలిగిన జాతీయజెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తిచేశారు. అధికారికంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఫ పింగళి వెంకయ్య చేతుల్లో రూపుదిద్దుకున్న త్రివర్ణ పతాకం ఫ జమీందారు నాయిని వెంకటరంగారావు కోటలో జెండా కూర్పు ఫ గాంధీజీ సూచనతో తెలుపు రంగుతో తుది మెరుగులు -
డీసీసీబీ పాలకవర్గ పదవీకాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా నాగార్జున మార్కెటింగ్ సొసైటీ (ఎన్డీసీఎంఎస్), జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. గురువారం పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గురువారమే వాటి పదవీకాలాన్ని పొడిగిస్తూ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్రావు ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 107 పీఏసీఎస్లు, ఎన్డీసీఎంఎస్తోపాటు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు మరో ఆరునెలలపాటు ఆ పదవుల్లో కొనసాగుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ తరువాత మళ్లీ పొడిగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అంశంపై జనవరి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలోని పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాల నియామకం కోసం ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించింది. అదే నెల 14వ తేదీన పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించాయి. దాని ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ నాటికి కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అందులో భాగంగా డీసీసీబీ, పీఏసీఎస్లకు కూడా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. ఇప్పుడు తాజాగా రెండోసారి మరో ఆరు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. రైతు సంక్షేమానికి మరింతగా కృషి ప్రభుత్వం రైతుల సంక్షేమ, అభివృద్ధికి మరోసారి కృషి చేసే అవకాశాన్ని తమకు కల్పించిందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో బ్యాంకును మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాని పేర్కొన్నారు. పీఏసీఎస్ పాలకవర్గాల గడువు సైతం పొడిగించిన ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డీసీసీబీ చైర్మన్గా కుంభం శ్రీనివాస్రెడ్డి -
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ నల్లగొండ టౌన్: బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పించే అర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద ఉన్నందున వాటినిఆమోదించడానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజీపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్రావులు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు కుల గణన సక్రమంగా జరగలేదని, బీసీల 42 శాతంలో ముస్లీంలకు 10 శాతం ఎలా ఇస్తారని అంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై న రాష్ట్ర బీజీపీ నాయకులు ఢిల్లీలో ధర్నాలు చేసి కేంద్రంపై వత్తిడి తెచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు ముందుకుపోవాలని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ బీసీల రిజర్వేషన్లపై పార్లమెంట్లో చర్చించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కేశబోయిన శంకర్ ముదిరాజ్, నకిరేకంటి కాశయ్యగౌడ్ పాల్గొన్నారు. -
వరదలతో అప్రమత్తంగా ఉండాలి
మిర్యాలగూడ : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇర్కిగూడెం ఘాట్ వద్ద చేపలు పట్టేందుకు మత్స్యకారులు లోపలికి వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా నియమించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంతకు ముందు తెలంగాణ –ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం, ఇసుక, యూరియా అక్రమంగా రవాణా కాకుండా పటిష్ట నిఘా ఉంచాలని అఽధికారులను ఆదేశించారు. అనంతరం దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు పాము, తేలు కాటు వంటి మందులతోపాటు సీజనల్ మందులను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పీహెచ్సీ పరిధిలోని పాఠశాలలను ప్రతి గురువారం వైద్యాధికారి సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి, తహసీల్దార్ జవహర్లాల్, పీహెచ్సీ వైద్యుడు నాగేశ్వర్రావు ఉన్నారు. ఫ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ దామరచర్ల మండలం ఇర్కిగూడెం వద్ద కృష్ణమ్మ ఉధృతి పరిశీలన -
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయాలి
నల్లగొండ : స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. నేడు వాలీబాల్ సెలక్షన్ పోటీలునల్లగొండ టూటౌన్ : అండర్ –15 వాలీబాల్ పోటీలకు బాలబాలికలను ఎంపిక చేసేందుకు గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9948987026 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. గవర్నర్ను కలిసిన ఎంజీయూ వీసీనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. యూనివర్సిటీలోని పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి, కోర్సులు తదిరత అంశాలను గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో నిర్వహించనున్న కాన్వకేషన్కు గవర్నర్ను ఆహ్వానించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ అలువాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్రెడ్డి ఉన్నారు. బోధనోపకరణాతో సృజనాత్మకతకట్టంగూర్ : ఉపాధ్యాయులు బోధనోపకరణాల(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)తో బోధిస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి బోధనోపకరణల మేళాను ఆయన పరిశీలించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు రావాలన్నారు. ఈ మేళాలో విద్యార్థులు మోడల్ చార్ట్స్, శాసీ్త్రయ పరికరాలు, గణిత ఉపకరణాలు, భూగోళశాస్త్ర పరికరాలు, భాషా అభ్యసన సాధనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, ఎంఈఓ అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. నీటి పారుదల ఎస్ఈకి.. సీఈగా పదోన్నతి నల్లగొండ : నీటిపారుదల శాఖలో ఎస్ఈగా పనిచేస్తున్న అజయ్కుమార్కు సీఈగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎస్ఈగా ఎవరికీ బాధ్యతలను అప్పగించలేదు. పదోన్నతి పొందిన అజయ్కుమార్ను బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శేఖర్రెడ్డి, డిఐ.రాజు, మేడి జయరావు, మధుసూదనాచారి, కత్తుల మనోజ్ప్రదీప్, మహేష్, లక్ష్మయ్య, సైదులు, శ్రీనివాస్, యూనస్, రాజరత్నం పాల్గొన్నారు. -
పొంగుతున్న వాగులు
రాకపోకలకు అంతరాయం నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పైనుంచి వచ్చిన వరదతో కాలనీలు నీటిమయం అయ్యాయి. పెద్దవూర మండలంలోని పర్వేదుల–పెద్దవూర రహదారిలో కల్వర్టుపై నుంచి చిన్నవాగు పొంగి పొర్లుతోంది. నిడమనూరు, తుమ్మడం చెరువులు అలుగుపోస్తున్నాయి. బంకాపురం–నిడమనూరు మధ్యలో వర్షపు నీటి కారణంగా లోలెవల్ కల్వర్టు దెబ్బతింది. దానిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై రాకపోకలు బంద్ చేశారు. చండూరు మండలం చామలపల్లి వాగు, నాంపల్లి మండలం శశిలేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండమల్లేపల్లి మండలం అబ్బనోనిగూడెం నుంచి వర్షపు నీరు గౌరీకుంటతండాకు చెందిన ఇళ్లల్లోకి చేరింది. దీంతో వారంతా రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములపల్లి మండలంలో ఆమనగలు చెరువు అలుగుపోస్తోంది. భీమారం – సూర్యాపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడవిదేవులపల్లి – మిర్యాలగూడ మధ్య రామన్నపేట వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పట్టణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 77.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 250.8 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా, ఇప్పటికే 339.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక సూర్యాపేట జిల్లాలోని పాలకీడులో 114.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్లో 326 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, ఇప్పటికే 402 మిల్లీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేట జిల్లాలో బీభత్సం..సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలంలోని చెరువులన్నీ అలుగు పోస్తున్నాయి. ఏపూరు వద్ద బిక్కేర్ వాగుపై వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో మంగళవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. తుమ్మల పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుస్తుండడంతో ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. చివ్వెంల మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు వచ్చాయి, ఆత్మకూరు ఎస్ మండలం పాతసూర్యాపేటలో వర్షం కారణంగా విద్యుత్తు షార్ట్ సర్క్యూట్లో ఇల్లు కాలిపోయింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఇళ్లల్లోకి నీరు చేరి వస్తువులు తడవడంతో రెండు రోజులుగా బాధితులకు అధికారులు భోజనాలు అందిస్తున్నారు. చింతలపాలెం మండలం కిష్టాపురం వద్ద చింత్రియాల మేజర్ (ఎన్ఎస్పీ) కాలువ తెగిపోయింది. దీంతో పంటలు నీటమునిగాయి. పిల్లలను బస్సులో పంపించిన పేట కలెక్టర్ మఠంపల్లి మండలంలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మఠంపల్లి, చౌటపల్లి ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో రాకపోకలను నిలిపివేశారు. మఠంపల్లి మోడల్ స్కూల్ నుంచి 11 మంది విద్యార్థులు ఆటోలో రఘునాథపాలెం వెళ్తుండగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చూసి తన కారులో స్కూల్ వద్దకు తీసుకువచ్చి, ప్రత్యేక బస్సులో వారిని ఇళ్లకు పంపించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల మీదుగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బీమలింగం, రుద్రవెళ్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కెరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫ గ్రామాలకు రాకపోకలు బంద్ ఫ లోతట్టు ప్రాంతాలు జలమయం ఫ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన ఇల్లు ఫ పాలకీడు, దామరచర్ల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు -
అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి
● ఎస్పీ శరత్చంద్ర పవార్మిర్యాలగూడ, మిర్యాలగూడ టౌన్ : వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి వెళ్లవద్దని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. బుధవారం రాత్రి మాడుగులపల్లి వద్ద అద్దంకి–నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎడతేరపి లేకుండా వర్షాలు వస్తున్న నేపథ్యంలో మూసీ, కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వాగులు, వంకలు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. పాడుబడిన మిద్దెలు, పడిపోయే స్థితిలో ఉన్న గృహాలు, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని సూచించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లే రైతులు మోటార్ స్వీచ్లు ఆన్ ఆఫ్ చేయవద్దన్నారు. రోడ్ల వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు పట్టుకుంటే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ యంత్రాంగం 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని.. ఏమైన సమస్య వస్తే వెంటనే 100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, ఎస్బి సీఐ రాము తదితరులున్నారు. -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. బుధవారం ఎన్జీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, కోకై న్ లాంటి డ్రగ్స్ ప్రమాదకరమన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ కళాశాలలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టాలని పోలీసు శాఖను కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామ్రెడ్డి, సిఐ. రాఘవరావు, ఎస్ఐ వై.సైదులు, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు బొజ్జ అనిల్కుమార్, ఏ.మల్లేశం, వెంకట్రెడ్డి, కోటయ్య, సావిత్రి, శివరాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
సంఘటితమై దేశ ఐక్యతను చాటుదాం
నల్లగొండ టూటౌన్ : ప్రజలంతా సంఘటితమై దేశ ఐక్యతను చాటుదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రకాశం బజారు మీదుగా పెద్ద గడియారం సెంటర్ వరకు తిరంగయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ యే శ్రీరామ రక్ష అన్నారు. భారతీయులంతా జాతీయ జెండాను ముద్దాడి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గోలి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్గౌడ్, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, పల్లెబోయిన శ్యాంసుందర్, దాయం భూపాల్రెడ్డి, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవి, నీరజ తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి..?
నల్లగొండ : పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గుంటకండ్ల జగదీష్రెడ్డి.. 80 ఎకరాల్లో ఫామ్హౌస్ సంపాదించకున్నాడు తప్ప జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ శంకర్నాయక్ విమర్శించారు. జిల్లా ప్రాజెక్టులను బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేయాల్సింది. అప్పుడు గాలికి వదిలేశారు. నిండుకుండలా ఉన్న పానగల్ ఉదయ సముద్రం వద్దకు వెళ్లి నీరు లేదని మాట్లాడుతున్నావు .. కళ్లున్నాయా.. లేవా.. అని మండిపడ్డారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్నాయక్ మాట్లాడారు. వర్షాలు పడతున్నాయి.. చెరువులు, కుంటలకు నీరు చేరుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోరన్నారు. కేసీఆర్కు, కేటిఆర్కు ఊడిగం చేశాడు తప్ప జగదీష్రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు ఎస్ఎల్బీసీని చేపట్టి 30 కిలోమీటర్లకు పైగా పూర్తి చేస్తే.. ఆ తరువాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. పదేళ్ళలో మిగిలిన 10 కిలో మీటర్ల సొరంగం తీసి ఉంటే నేడు గ్రావిటీ ద్వారానే జిల్లాకు నీరు అందేదన్నారు. మీ పాపం, చేతగాని తనం వల్ల జిల్లా ప్రజలకు నష్టం జరిగిందని విమర్శించారు. రూ.90 కోట్లు విడుదల చేస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయి లక్ష ఎకరాలకు నీరు అందేదని, కానీ కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న కారణంగా పట్టించుకోలేదన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జగదీష్రెడ్డి భూదందాలు, ఇసుక దందాలు, కంకర దందాలు చేశాడని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు. వర్షం నీరు సముద్రంలో కలుస్తుందని విమర్శించడం సిగ్గుచేటు ఎమ్మెల్సీ శంకర్నాయక్ -
పత్తికి అదునైన వాన..!
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్లో మెట్టపంటలకు అనుకూలంగా మంచి ఆదునైన వర్షాలు కురుస్తున్నాయి. జాన్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికి జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలే కురిసాయి. ఈ వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 5,57,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అనుకూలమైన వర్షాలు కురవడంతో పత్తి చేలలో గుంటకలు తోలుకుని కలుపు తీసుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎరువులు పెట్టుకోవడంతో చేలు మంచి ఏపుగా పెరిగి పూత, పిందె దశలో కనిపిస్తున్నాయి.వారం రోజుల్లో కాయదశకు చేరుకుంటాయి. దసరా పండుగ నాటికి పత్తి తెంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేలు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ సీజన్లో పత్తి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షపాతం నమోదు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడం మండలంలో మాత్రం లోటు వర్షం కురిసింది. ఇప్పటి వరకు సగటున జిల్లాలో 246.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 309.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మర్రిగూడ, పీఏపల్లి, కొండమల్లేపల్లి, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో అత్యధిక వర్షం కురవగా చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం, నకిరేకల్, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, టి.సాగర్, పెద్దవూరలో అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. ఫ జిల్లాలో 5,57,641 ఎకరాల్లో సాగు ఫ పూత, పిందె దశలో పత్తి చేలు ఫ మంచి దిగుబడి వస్తుందని రైతుల ఆశాభావం -
మహిళా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లాలి
నల్లగొండ : మహిళ పోలీస్ సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మహిళా పోలీసు సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మహిళా పోలీసులు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు. మహిళా సిబ్బంది పోలీస్స్టేషస్లో విధులకే పరిమితం కావొద్దన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు సెల్ఫ్ డిఫెన్స్పై శిక్షణలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బంది బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సూరప్పనాయుడు, సంతోష్, శ్రీను మహిళా ఎస్ఐలు శ్రావణి, విజయబాయి పాల్గొన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కారొ్పరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో మంత్రులు సిద్ధం చేసిన జాబితాలను రాష్ట్ర పార్టీకి పంపించారు. అందులో కొందరికి త్వరలోనే డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు వందవరకు ఉండగా, ఒక్కో దాంట్లో నాలుగైదు డైరెక్టర్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు జాబితాలు ఇవ్వాలని గతంలోనే మంత్రులకు రాష్ట్ర పార్టీ సూచించింది. అందుకు అనుగుణంగా ఆయా పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున పేర్లను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. అందులో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశం లభించనుంది. స్థానిక ఎన్నికలకు ముందే భర్తీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. పార్టీలో పనిచేసే వారికే పదవులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. అంతకంటే ముందుగానే కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బాగా పని చేస్తుందనే అంచనాల్లో ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడి పని చేస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అందుకే ముందుగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. చైర్మన్ పదవులు ఎప్పుడు...? ప్రస్తుతం కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆశావహులు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో చైర్మన్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తామన్నది ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది. ఫ రాష్ట్ర పార్టీకి జాబితాలను పంపించిన జిల్లా మంత్రులు ఫ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి దక్కనున్న డైరెక్టర్ పదవులు ఫ వీరి నియామకం తర్వాతే స్థానిక ఎన్నికలు ఫ చైర్మన్ పదవులపై వీడని సందిగ్దం -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, నీటిమట్టం, కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో వివరాలు, ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలు నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గేట్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్రస్ట్గేట్లు ఎత్తాలని సూచించారు. అనంతరం వారు మూసీ ప్రాజెక్టు దిగువన కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద మూసీ నదిపై నిర్మించిన లోలెవల్ కాజ్వేను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కులకు పైగా వరదనీటిని వదిలినప్పుడు మాత్రమే లోలెవల్ కాజ్వే వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు కలెక్టర్కు చెప్పారు. కలెక్టర్ వెంట నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి, సూర్యాపేట డివిజన్ ఐబీ ఈఈ ఎన్.వెంకటరమణ, మూసీ డీఈలు చంద్రశేఖర్రెడ్డి, వాణి, జేఈ కీర్తి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ వెంకన్న తదితరులు ఉన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దునల్లగొండ : రానున్న 72 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ్ అమిత్, దేవరకొండ ఏసీపీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీతో కలిసి మూసీ ప్రాజెక్టు సందర్శన -
జిల్లా మంత్రులు దద్దమ్మలు
నల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఏపీకి నీరు వదిలేంత ఆతృత జిల్లాలో రైతులకు ఇవ్వడంలో లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏఎమ్మార్పీ కింద కనగల్, నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 70 వేల ఎకరాలకు నీరందించిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డికి పట్టింపు లేదని మండిపడ్డారు. కృష్ణానది జలకళ సంతరించుకున్నా.. జిల్లాలోని చెరువులు ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మోటార్లు మరమ్మతుకు గురైతే సమీక్షించే బాధ్యత జిల్లా మంత్రి కోమటిరెడ్డికి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ నడిబొడ్డున ఆర్అండ్బీ అతిథి గృహాన్ని మంత్రి సొంత క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు. నిజాం కాలం నాటి అతిథి గృహాన్ని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అంతకు ముందు పానగల్ ఉదయసముద్రాన్ని నాయకులతో పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, సింగం రామ్మోహన్, చీర పంకజ్యాదవ్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, బోనగిరి దేవేందర్, రవీందర్రావు, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, ఐతగాని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, తండు సైదులుగౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఫ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ పరిధిలో నీరిచ్చే సోయి లేదు ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి -
సమ్మెలోకి కేటరింగ్ కాంట్రాక్టర్లు
నల్లగొండ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఓ 17కు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో భోజనం అందించే కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ ఈ నెల 14వ తేదీనుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే వారు కలెక్టర్కు నోటీసు అందజేశారు. వారితోపాటు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా సమ్మె బాట పడుతున్నారు. నేటి నుంచి గురుకులాల్లో వంట సేవలు ఆగిపోనున్నాయి. దీంతో విద్యార్థులు ఎవరు వంట చేస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది. బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా జీఓ 17 ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం కేటరింగ్ కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో జీఓ నంబర్ 17 తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక కాంట్రాక్టర్, ఒక స్కూల్కు సంవత్సర కాలంలో రూ.20 లక్షలు సరుకులు సరఫరా చేస్తే రూ.4 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జీవో వల్ల చిన్న కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే పరిస్థితి లేదని.. బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొత్త జీఓ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు నెలలుగా ఎలాంటి బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే.. ప్రస్తుతం కొత్త టెండర్ విధానం తేవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లో పాల్గొనే ఆర్థిక స్థోమత లేదని సడలింపులు ఇవ్వాలని ఇప్పటికే పలువురు చిన్న కాంట్రాక్టర్లు కలెక్టర్కు విన్నవించారు. పాత టెండర్ విధానం కొనసాగించాలని కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. వంట ఎలా..! గురుకుల, కేజీబీవీల్లో వంటలను మహిళా సంఘాలకు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. నెలకు సరిపడా కిరాణ సామాను ఇప్పటికే హాస్టళ్లకు చేరింది. కూరగాయలు 2, 3 రోజులకోసారి సరఫరా చేస్తారు. మటన్, చికెన్ వారంలో 2 పర్యాయాలు అందిస్తారు. కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తే వీటి సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది. వంట సిబ్బంది సమ్మె బాట పడితే పిల్లలకు భోజనానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి గురుకులాలు, కేజీబీవీల్లో వంటలు బంద్ జీఓ 17కు నిరసనగా ఆందోళన బాట -
గిరిజనులకు వైద్యం అందించాలి
నాగార్జునసాగర్ : అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని చెంచుగూడేలు, తండాల్లోని గిరిజనులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో ఏప్రాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, మేనరిక వివాహాలు, పౌష్టికాహారలోపం, యుక్తవయస్సుకు ముందే గర్భం దాల్చడం, వివిధ జబ్బులకు సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, రక్తహీన తదితర కారణాలతో గిరిజనులు బాధపడుతున్నారని తెలిపారు. గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించిన లోపాలను గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘నైస్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాఖీ నాగర్కర్నూల్ జిల్లా అప్పాపూర్, రాంపూర్, చెంచుపేటలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని గిరిజనుల ఆరోగ్యం కోసం పనిచేసిన అనుభవాలను వివరించారు. చందంపేటను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి చందంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అక్కడి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవిని నోడల్ అధికారిగా, డీటీడీఓ చత్రునాయక్, గృహనిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ను సమన్వయ సమస్యల పరిష్కారానికి అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్ మాతృనాయక్ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, రిచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రష్మీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మహిళా పోలీసులు అన్ని విధులు నిర్వర్తించాలి
నల్లగొండ : నేరాలర నియంత్రణలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది అన్ని విధులు నిర్వర్తించడానికి సిద్ధం కావాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అన్ని ప్రాంతాల పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పురుష సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యలు, కుటుంబం తరఫున వస్తున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. షీ లీడ్స్–నల్లగొండ బిలీవ్స్ అనే నినాదంతో నూతన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహిళా సిబ్బంది పోలీస్స్టేషన్ రిసెప్షన్, రికార్డు వర్క్, సీసీటీఎన్ఎస్, టెక్ టీమ్, కమ్యూనిటీ పోలిసింగ్ ప్రోగ్రాం, బ్లూ క్లోట్స్, నైట్ పెట్రోలింగ్, పిటిషన్ ఎంక్వయిరీ చేయాలన్నారు. కోర్ట్ సమన్స్, వెహికల్ చెకింగ్, ఎస్కార్టు, ట్రాఫిక్, బందోబస్తు, మెడికల్, కోర్టు డ్యూటీలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ రాము, డబ్ల్యూపీఎస్ సీఐ కరుణాకర్, ఆర్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
రామగిరి(నల్లగొండ) : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణ ఆనంద్, కార్యదర్శి మంద నగేష్, కోశాధికారి బరిగల నగేష్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణనల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్చంద్రపవార్ 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు చట్ట పరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీసులకు సూచించారు. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలిచిట్యాల : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని ఎఫ్ఆర్ఎస్ హాజరు, టీచర్స్ డైరీలు,, విద్యార్థుల వర్క్బుక్స్ను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో ఆయన మాట్లాడి గణితం, ఆంగ్లం, తెలుగు అంశాలపై ప్రశ్నించి సమాధానాలను రాబట్టారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని కోరారు. విద్యార్థులకు అర్థమయ్యే రితీలో పాఠ్యాంశాలను బోఽధించాలన్నారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లను పైకెత్తి దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి మూసీకి 4,718 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. మూడు క్రస్ట్గేట్ల ద్వారా 4,375 క్యూసెక్కులు, మూసీ కుడి, ఎడమ కాల్వలకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో.. ప్రస్తుత నీటిమట్టం 643.50 అడుగుల (4.04 టీఎంసీలు) వద్ద ఉంది. -
అదనపు చార్జీలపై ఆగ్రహం
రామగిరి(నల్లగొండ) : రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. అయితే బస్సుల్లో చార్జీలను పెండంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ సాధారణ టికెట్ ధర రూ.210 ఉంటే.. ప్రత్యేక బస్సులో రూ.280 వసూలు చేశారు. కాగా.. నల్లగొండ బస్టాండ్ సోమవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బస్ చార్జీలు అధికంగా ఉండడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రద్దీగా మారిన బస్టాండ్.. మూడు రోజులు సెలవులు ముగియడంతో ప్రయాణికులు సొంతూళ్ల నుంచి ఆయా ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ సోమవారం కిక్కిరిసిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు. బస్సు ప్లాట్ఫాం మీదకు వచ్చే సమయంలోనే బుస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఇక బస్సులు ఎక్కే సమయంలో తొక్కిసలాట సైతం జరిగింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం -
డీసీసీబీ.. నంబర్ వన్
రాష్ట్రంలోనే ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డు సొంతం ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపార లక్ష్యం రూ.3,500 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా రూ.70 కోట్ల లాభాలను సాధించేలా చర్యలు చేపడుతోంది. సహకార వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే మిగతా డీసీసీబీల కంటే నల్లగొండ డీసీసీబీ రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. దీంతో నాబార్డు ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ బ్యాంకు అవార్డుకు ఈసారి నల్లగొండ బ్యాంకును ఎంపిక చేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివా స్రెడ్డి, ఇతర డైరెక్టర్లు, అధికారులకు అందజేసింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ రాష్ట్రంలోనే ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఆర్థికంగా చేయూతను అందించి ముందంజలో నిలువడమే కాకుండా డిపాజిట్ల పెంపుతో వ్యాపార వృద్ధిని సాధించింది. మొండిబకాయి(ఎన్పీఏ)లను తగ్గించుకోవడంతోపాటు రూ.42 కోట్ల లాభాలను ఆర్జించి, రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను నాబార్డు నల్లగొండ డీసీసీబీకి బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంకు అవార్డును అందజేసింది. లాభాల బాటలో నల్లగొండ బ్యాంకు నల్లగొండ డీసీసీబీ గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని రూ.2,342.13 కోట్ల నుంచి రూ.2,940.13 కోట్లకు పెంచింది. తద్వారా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.598.16 కోట్లు వృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ఏ ఇతర డీసీసీబీలు ఇంతగా వృద్ధి రేటును సాధించలేదు. ఇక లాభాల విషయంలోనూ రూ.22 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచగలిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రెట్టింపు లాభాలను గడించి ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. గతంలో 1.85 శాతం ఉన్న మొండిబకాయి(ఎన్పీఏ)లను 1.38 శాతానికి తగ్గించుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పంట రుణాల బడ్జెట్ పెంపు రైతులకు పంట రుణాల విషయంలోనూ ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు నాబార్డు గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.110 కోట్లు రైతులకు రుణాలుగా అందించి వారి సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క వానాకాలం సీజన్లోనే రైతులకు రూ.50 కోట్ల పంట రుణాలను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అవసరమైతే మరో రూ.50 కోట్లు రైతులకు పంట రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచింది. అనుబంధ రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలైన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద రెతులకు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమకు రుణాలు ఇస్తోంది. సొసైటీల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడేలా గోదాముల నిర్మాణానికి రుణాలు, సహకార సంఘాలకు నాబార్డు రీఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్లు ఇచ్చి బలోపేతానికి కృషి చేస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టింది.ఫ గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.598.16 కోట్ల వృద్ధి ఫ మిగతా బ్యాంకులతో పోల్చితేరెట్టింపు లాభాలు ఫ మొండి బకాయిలు తగ్గుదల ఫ రైతులకు చేయూత అందించడంలోనూ ముందంజ బ్యాంకు సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించేలా చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో ఆరు కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందించడం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా పాలకవర్గం కృషి చేస్తోంది. – కుంభం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014–15 నుంచి అమల్లో ఉంది. కాగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్ మార్కులు వేస్తున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గత ఏడాది అక్టోబర్ 28 ప్రభుత్వం ప్రకటించింది. ఉత్కంఠకు తెర జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యా యి. మూడు నెలలు కావస్తున్నా వార్షిక పరీక్షలు 100 మార్కులతో నిర్వహించాలనే దానిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన కోసం ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పాత పద్ధతిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఫ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ ఫ ఉపాధ్యాయ వర్గాల్లో వీడిన ఉత్కంఠ ఫ రాత పరీక్షకు 80, ఇంటర్నల్కు 20 మార్కులు -
గౌరికుంటతండా జలమయం
కొండమల్లేపల్లి : భారీ వర్షానికి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంటతండా జలమయం అయ్యింది. భారీ వర్షం వల్ల తండా పైనున్న అబ్బనబోయినగూడెం నుంచి వచ్చిన వరద అంత తండాను ముంచెత్తింది. సుమారు 15 మంది ఇళ్లలోకి నీరు చేరింది. అబ్బనబోయిన గూడెం సమీపంలో నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ ఎత్తు పెంచుకొని వరద కట్టపోయడంతో పట్టణంలోని నల్లకుంటకు వెళ్లాల్సిన వర్షపు నీరు మొత్తం కూడా తండాకు చేరింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే అధికారులు గ్రామాన్ని సందర్శించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తండావాసులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ అజ్మీర రమేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. -
ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
నల్లగొండ టౌన్ : నులి పురుగుల నివారణ కోసం 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్, రేణుక, డీఈఓ భిక్షపతి, జిల్లా మాస్ మీడియా అధికారి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై బాధితులకు వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించారు. ఏ స్థాయిలో ఆ సమస్య ఉందో ఆ అధికారికి వాటిని పంపి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. -
సరికొత్తగా ఓటరు జాబితా
నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో సరికొత్త ఓటరు జాబితా సిద్ధమవుతోంది. గతంలో ఎంపీడీఓ పరిధిలో ఉన్న టీపోల్ లాగిన్లో ఆయా గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు ఓటర్ల జాబితాలను అప్లోడ్ చేశారు. అయితే గత విధానాన్ని పంచాయతీరాజ్ శాఖ మార్పు చేసింది. కొత్తగా ప్రతి గ్రామానికి ఒక టీపోల్ లాగిన్ ఇచ్చి గ్రామ పంచాయతీ లాగిన్లో ఓటర్ల జాబితాను అప్లోడ్ చేయాలని ఆదేశించింది. దీంతో ఇరవై రోజుల నుంచి కార్యదర్శులు జీపీ లాగిల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్లోడ్ చేశారు. జిల్లాలో కొత్త ఓటరు జాబితా తయారీ చివరి దశకు చేరిందని మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎంపీడీఓ లాగిన్లో.. పంచాయతీ ఎన్నికలు గత ఫిబ్రవరిలోనే నిర్వహిస్తారనే ఉద్దేశంతో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎంపీడీఓ లాగిన్ ద్వారా ఓటరు జాబితాను రూపొందించింది. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాలు, ఆవాసాలలో ఉన్న ఓటర్ల జాబితాను ఎంపీడీఓ లాగిన్లో అప్లోడ్ చేశారు. అలా జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఓటరు జాబితా తయారు చేశారు. ఎంపీడీఓ దాన్ని పరిశీలించి డీపీఓకు పంపించారు. డీపీఓ వాటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించారు. అయితే ఎంపీడీఓ లాగిన్ ద్వారా ఓటర్ల జాబితా అప్లోడ్ చేయడం వల్ల చిన్న మార్పు వచ్చినా డీపీఓ స్థాయి నుంచి ఓటర్లను సరిచేయాల్సి రావడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ఆ విధానం మార్చి జీపీకి ప్రత్యేక లాగిన్ ఇచ్చింది. ప్రతి జీపీకి ప్రత్యేక లాగిన్ ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీపోల్ లాగిన్ ఇచ్చింది. ఆ లాగిన్లో ప్రతి గ్రామంలో ఉన్న ఓటరు జాబితాను వార్డుల వారీగా అప్లోడ్ చేశారు. గతంలో ఒక గ్రామం పరిధిలో గూడెం ఉంటే వాటికి ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేశారు. దాంతో ఓటరు జాబితాలో పక్కగా ఏ ఓటరు ఎక్కడ ఉన్నాడనేది తెలిసేలా జీపీ లాగిన్ ద్వారా స్పస్టంగా తెలియనుంది. ఒక వేళ ఏదైనా జాబితాలో పొరపాటు అయితే ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంపీడీఓలాగిన్కు వెళుతుంది. మార్పులు చేర్పులు ఉంటే ఎంపీడీఓ గ్రామ పంచాయతీ లాగిన్కు పంపి వాటిని సరిచేసే అధికారం ఇచ్చారు. గతంలో ఇలాంటి అవకాశం ఉండేది కాదు. జీపీ లాగిన్ వల్ల ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఎంపీడీఓ లాగిన్ నుంచి తిరిగి డీపీఓ లాగిన్కు ఓటరు జాబితా పంపుతారు. అక్కడ పరిశీలించిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో కొత్త ఓటరు జాబితా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జీపీ టీపోల్ లాగిన్ ద్వారా కొత్తగా తయారు చేసిన ఓటరు జాబితాతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీల వారీగా రూపకల్పన ఫ ప్రతి పల్లెకు ప్రత్యేక టీపోల్ లాగిన్ ఫ వార్డుల వారీగా అప్లోడ్ చేసిన కార్యదర్శులు ఫ మరో మూడు రోజుల్లో జాబితా ప్రకటన ఫ ఈ జాబితాతోనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశంగ్రామ పంచాయతీలు 869 వార్డుల సంఖ్య 7,494 ఓటర్లు 10,53,920 (పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం) -
అన్ని రంగాల్లో విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. - 8లోఆదాయ వనరులు పెంచుతాం కరెంట్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాలు పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
మూసీకి స్వల్పంగా తగ్గిన ఇన్ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి 4,365 క్యూసెక్కుల వదరనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండడంతో అధికారులు శనివారం ఐదు గేట్లు తెరవగా రెండింటిని ఆదివారం మూసి వేశారు. మిగతా మూడు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 3,850 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్ ప్రస్తుతం 643.50 అడుగుల వద్ద ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఫ మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
చేనేత కార్మికులందరికీ భరోసా కల్పించాలి
గట్టుప్పల్ : ఎలాంటి షరతులు లేకుండా జియోట్యాగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించిన చేనేత కార్మిక సంఘం మండల మహాసభకు హాజరై మాట్లాడారు. చేనేత కార్మికులు, సహకార సంఘాల దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. చేనేత సహకార సంఘాలు తీసుకున్న రుణాలను క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలన్నారు. ఇల్లులేని పేదలకు 120గజాల స్థలం ఇవ్వడంతోపాటు కేంద్రం రూ.10 లక్షలు, రాష్టం రూ.5 లక్షలు అందజేసి హౌస్ ఫ్రం వర్క్ షెడ్డు నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా గంజి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా కర్నాటి వెంకటేశంతోపాటు పలువురు కమిటీ సభ్యులుగా నియమించారు. కర్నాటి వెంకటేశం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కర్నాటి మల్లేశం, పున్న కిషోర్, గణేష్, బావండ్ల ఆంజనేయులు, చెరుపల్లి సత్యనారాయణ, అందె రాము, చెరుపల్లి కృష్ణయ్య, శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాబడి స్వల్పం.. ఖర్చు అధికం
నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు రాని ఆదాయం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలి సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఖర్చులకు తగ్గట్టు ఆదాయం రావడం లేదు. నెలనెలా రూ.2.84 కోట్ల ఖర్చు వస్తుంటే..ఆదాయం మాత్రం రూ.2 కోట్లలోపే ఉంటోంది. దీంతో ఖర్చులను సర్దుబాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రతినెలా ఇబ్బందులు పడుతున్నారు. నీలగిరి మున్సిపాలిటీ విస్తరణకు తగ్గట్టుగానే కార్మికులు, ఉద్యోగులను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలోని 48వార్డుల్లో మొత్తం 43 వేలకు పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.18 కోట్ల ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుంది. నల్లా కనెక్షన్లు మాత్రం 29వేల వరకే ఉండగా వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.21 కోట్ల రాబడి వస్తుంది. భవనాలకు అనుమతుల ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. కానీ ఈ డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతాలో జమ అవుతుండగా.. ఐదారు నెలలకు ఒకసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతుంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు 34.08 కోట్ల వరకు అవుతుందని అధికారులు చెబుతున్నారు. 813 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 813 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వీరికి నెలకు వేతనాల కింద రూ.1.20 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వాహనాల డీజిల్కు రూ.22 లక్షలు, పంప్హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.75 లక్షల వరకు వస్తుంది. ఎన్ఎంఆర్ ఉద్యోగులు వేతనాలు నెలకు రూ.7.50 లక్షలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్ నెలకు రూ.40 లక్షలు, పైప్లైన్, లీకేజీ మరమ్మతుల నిర్వహణ ఖర్చులు రూ.10 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీకి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతుండగా, ఆదాయం మాత్రం అనుకున్నంతగా రావడంలేదని తెలుస్తోంది. 010 పద్దు ద్వారా వేతనాలు ఇస్తే సరి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు కార్మికులు చెబుతున్నారు. ఆ హామీ ప్రకారం కార్మికులను రెగ్యులరైజ్ చేసి 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీకి వేతనాల భారం తప్పనుంది. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా.. వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు ఇస్తే మున్సిపాలిటీకి నిర్వహణ భారం నుంచి విముక్తి కలగనుంది. న్యూస్రీల్ఫ ఖర్చు రూ.2.84 కోట్లు.. ఆదాయం రూ.2 కోట్ల లోపే.. ఫ నెలనెలా జమకాని భవనాల అనుమతుల సొమ్ము ఫ మున్సిపల్ సిబ్బందికి తప్పని సర్దుబాటు ఇక్కట్లు ఫ కార్మికుల వేతనాలు ప్రభుత్వం ఇస్తే తప్పనున్న భారం ఆదాయ వనరుల పెంపుపై దృష్టేదీ? పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటినీ ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ అధికారులు, సిబ్బంది సమన్వయలోపం, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే చర్చ సాగుతోంది. ఆదాయ వనరును అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేడయంలేదు. ఆస్తి పన్ను, నల్లా బిల్లుల ద్వారా ఆదాయం దాదాపు రూ.40 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా.. ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
సరిహద్దులో రేషన్ బియ్యం దందా!
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా, దందాకు సహకరించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. అక్రమ దందాపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు సరైన పారితోషకాన్ని అందిస్తాం. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తాం. – రాజశేఖర్రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ మిర్యాలగూడ ప్రాంతంలో ఆగని అక్రమ వ్యాపారం ఫ పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా షరామామూలే.. ఫ ఏపీకి చెందిన వ్యాపారులే సూత్రధారులు ఫ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కొనుగోలు ఫ పల్నాడు జిల్లాలో మిల్లులకు విక్రయం ఫ అక్కడ పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా మిర్యాలగూడ : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టి పట్టుకుంటూ చర్యలు తీసుకుంటున్నా.. చివరికి పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నా మిర్యాలగూడ ప్రాంతంలో రేషన్ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. గతంలో తెలంగాణ నుంచి ఏపీ రాష్టానికి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరిగేది. కానీ, ఇప్పుడు ఇక్కడి వారి సహాయంతో ఏపీకి చెందిన వ్యాపారులు కొందరు ఇక్కడా అక్కడా తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని మిల్లులకు అమ్ముతున్నారు. ఆ బియ్యాన్నే మిల్లుల యజమానులు పాలిష్ చేసి తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటు న్నారు. తాజాగా రాష్ట్ర సరిహద్దులోని మిర్యాలగూడ పరిధిలో గల వాడపల్లి చెక్ పోస్టు వద్ద 600 బస్తాలు (300 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇందులో అరెస్టయిన వారంతా ఏపీకి చెందిన వారు కావడం గమనార్హం. కిలో పది రూపాయలకు కొని.. తెలంగాణలో ఆరు నెలలుగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. పక్కనున్న ఏపీ రాష్ట్రంలో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నారు. సరిహద్దులో ఉన్న తెలంగాణ గ్రామాల నుంచి ఏపీకి చెందిన కొందరు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.11కు కొనుగోలు చేసి మిల్లులకు అమ్ముకుంటున్నారు. అలాగే సరిహద్దులోని ఇరు రాష్ట్రాలకు చెందిన గ్రామాల రేషన్ షాపుల డీలర్లు కూడా కిలోకు రూ.10 నుంచి 12 వరకు లబ్ధిదారుల నుంచి కొని మిల్లులకు కిలోకు రూ.25 నుంచి రూ.30ల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు మిల్లుల యజమానులు ఆ రేషన్ బియ్యాన్ని సన్నగా పాలిష్ చేయించి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి ప్రత్యేక వాహనాల్లో వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తూ కిలో రూ.40 నుంచి రూ.50లకు అమ్ముంటున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి.. ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని ఓ రైస్ మిల్లో పనిచేసే ఓ గుమస్తా తమ జిల్లాకు సరిహద్దులో ఉన్న తెలంగాణ పల్లెల్లో రేషన్ బియ్యం సేకరించి అదే మిల్లుకు తరలిస్తూ పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి తెల్ల సంచుల్లో నింపి ఇతర రాష్టాలకు తరలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దు దాటించేందుకు ఒక ఏజెంట్ను నియమించుకుని అతనికి నెలకు రూ.3లక్షలకుపైగా కమీషన్ ఇస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులకు చిక్కని సూత్రధారులు.. ఇటీవల రాష్ట్ర సరిహద్దులోని వాడపల్లి చెక్పోస్టు వద్ద పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుకున్నప్పటికీ అసలు సూత్రధారులు ఇప్పటివరకు చిక్కలేదు. ఆ సూత్రధారులకు ఏపీలో అధికార పార్టీ అండదండలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు జంకుతున్నారు. ఇప్పటివరకు అనేక మంది రేషన్ బియ్యం అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసినా దందా ఆగడం లేదు. ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం కేసులో ఎనిమిది మందికిగాను ఐదుగురిని అరెస్ట్ చేయగా ముగ్గురు అసలు సూత్రధారులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారంతా ఏపీ రాష్ట్రానికి చెందిన వారే. -
రోగులకు ఇబ్బందులు రానివ్వద్దు
నల్లగొండ టౌన్: రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వార్డుల్లో ఉన్న పేషెంట్లకు ఎక్స్రేలు, స్కానింగ్, ఇతర పరీక్షలు చేయాలంటే వార్డు నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న రేడియాలజీ డిపార్ట్మెంట్ వరకు ఎండలో స్ట్రక్చర్, వీల్చైర్లపై, నడిపిస్తూ తీసుకెళ్తున్న పరిస్థితిపై ‘రోగులకు పరీక్ష కష్టాలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి కలెక్టర్ స్పందించి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఏఎంసీయూ, సర్జికల్, మెడికల్ వార్డులతోపాటు రేడియాలజీ విభాగాన్ని పరిశీలించి వైద్యులు, నర్సులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉండడంతో నడవలేని రోగులకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీస్తున్నట్లు, నడవగలిగే వారిని వీల్చైర్ మీద రేడియాలజీ రూమ్కు తీసుకెళ్తున్నట్లు వైద్యులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డాక్టర్లు, సిబ్బంది, నర్సులు అందుబాటులో ఉంటూ సకాలంలో వైద్యం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్, ఆర్ఎంఓ కిరణ్కుమార్, టీఎస్ఎంఐడీసీ రాజశేఖర్, జితేందర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నేడు చిట్యాలకు మంద కృష్ణమాదిగ రాక
చిట్యాల : చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చిట్యాలలో సోమవారం నిర్వహించనున్న నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి చేయూత పింఛన్దారులు, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రజాసేవ చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యంనల్లగొండ టౌన్: పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ముందుకెళ్తోందని లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం నల్లగొండలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 2025–26 జిల్లా కేబినెట్ ఇన్స్టాలేషన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జ్వోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సేవే పరమావధిగా స్థాపించబడిన లయన్స్ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా పేదప్రజలకు చేయూతగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా సమయంలో కూడా పేదప్రజలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్కుమార్ రూమాల్ల, గోపాల్రావు, దీపక్ బట్టాచార్య, టి.రాజేంద్రప్రసాద్, రాజిరెడ్డి, భీమయ్య, కేవీ.ప్రసాద్, సతీష్ కుమార్, రామకృష్ణ, అశోక్రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆత్మగౌరవ పోరుకు యాదవులు సిద్ధంకావాలి నల్లగొండ టౌన్: యాదవులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన ఆ మహాసభ సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సోమవారం చేపట్టిన రెజాంగ్లా రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలన్నారు. యాత్రలో భాగంగా దేవరకొండ, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, కనగల్ ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అలాగే 12వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకు నల్లగొండలోని క్లాక్టవర్లో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. యాదవుల ఆత్మ గౌరవం పెంచడానికి అహిర్ రెజిమెంట్ ప్రకటించాలని ఇండియన్ ఆర్మీని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుందన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్, సోమనబోయిన సుధాకర్ యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, కొలగాని పర్వతాలు యాదవ్, ఎల్వీ.యాదవ్, తరాల పరమేశ్ యాదవ్, గంగుల చందువంశీ యాదవ్, గుండెబోయిన జానయ్య యాదవ్, ముప్పిడి మల్లయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, జాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. యాదగిరీశుడికి నిత్యారాధనలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రఽభాత సేవ, ఆరాధన.. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. -
బుద్ధవనం సందర్శనకు అమెరికన్ల ఆసక్తి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని, నాగార్జునకొండను సందర్శించటానికి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల మహాయాన బుద్ధ విహార ప్రధానాచార్యుడు ఆసక్తి కనబర్చారని బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. బౌద్ధాలయాల సందర్శనలో భాగంగా శనివారం ఆయన న్యూయార్క్ కెనాల్ వీధిలోని మహాయాన బౌద్ధాలయాన్ని సందర్శించి బుద్ధవనం, నాగార్జునకొండను సందర్శించమని ప్రధానాచార్యుడిని ఆహ్వానించినట్లు తెలిపారు. బుద్ధవనంలో ఆచార్య నాగార్జునుడి రచనలపై ఒక పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పాలని, కృష్ణా నది తీరంలో విలసిల్లిన ప్రముఖ బౌద్ధ స్థావరాల వివరాలను తెలుసుకోవడానికి తగిన సమాచారం అందజేయమని బుద్ధ విహార ప్రధానాచార్యుడు కోరారని ఆయన పేర్కొన్నారు. బుద్ధవనం అధికారులను కలిసి ఈ విషయంపై చర్చించి కేవలం దక్షిణాసియా దేశాల నుంచే కాక యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, న్యూయార్క్ తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతినిధి, కథా రచయిత డాక్టర్ కలశపూడి శ్రీనివాసరావు ఉన్నారు. లారీల్లో నుంచి డీజిల్ చోరీకి యత్నం ఫ పోలీసులను చూసి పారిపోయిన దొంగలు నార్కట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రం పరిధిలో నల్లగొండ బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేసేందుకు యత్నించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు పారిపోయారు. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై నార్కట్పల్లి మండల కేంద్రం సమీపంలో నల్లగొండ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీల వద్ద శుక్రవారం రాత్రి ఇన్నోవా కారు అనుమానాస్పదంగా ఆగి ఉండడంతో పక్కనే ఉన్న టీస్టాల్ యజమాని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని కారును పరిశీలిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వాహనాన్ని పరిశీలించంగా 50 లీటర్ల సామర్ధ్యం గల 30 డీజిల్ క్యాన్లు, మూడు ప్లాస్టిక్ పైపులు లభించాయి. అందులో 24 క్యాన్లలో డీజిల్ ఉండగా.. 8 క్యాన్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1200 లీటర్ల డీజిల్, ఇన్నోవా కారు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలను పరిశీలించగా చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో నుంచి డీజిల్ దొంగిలించి పట్టుబడిన ఇన్నోవా వాహనంలో తరలిస్తున్నట్లు రికార్డయ్యిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇన్నోవా వాహనంలో వచ్చి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారితో పాటు నార్కట్పల్లి–అద్దంకి రహదారి పక్కన ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో పాము భువనగిరి: భువనగిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి పాము రావడంతో రోగులు గమనించి దానిని చంపేశారు. ఆస్పత్రి ఆవరణలో చెత్త వేస్తుండడం, విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని రోగులు అంటున్నారు. ఆస్పత్రి ఆవరణను శుభ్రంగా ఉంచడంతో పాటు రాత్రి సమయంలో విద్యుత్ లైట్లు వేయాలని కోరుతున్నారు. -
మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ
కోదాడ: మొక్కలను రక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, ప్రతిఒక్కరూ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలకు రాఖీలను కట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు అన్నారు. రాఖీ పర్వదినాన్ని పరస్కరించుకొని కోదాడ పట్టణ పరిధిలోని అశోక్నగర్ వద్ద ఆయన ఆధ్వర్యంలో శనివారం మొక్కలకు రాఖీలు కట్టారు. ప్రతి ఇంట్లో చిన్నా పెద్దా మొక్కల ప్రాధాన్యతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి నుంచే ప్రారంభించాలని, ముందు ఇంట్లో మొక్కలను, ఆ తర్వాత ఇంటి ముందు మొక్కలను రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీరుద్దీన్, ఆవుల శివప్రసాద్, షేక్ షరీపుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న సోదరుడి వద్దకు వెళ్లి.. ● రాఖీ కట్టిన సోదరిఅర్వపల్లి: కానిస్టేబుల్గా విధుల్లో ఉన్న సోదరుడి వద్దకే వెళ్లి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది ఓ సోదరి. వివరాలు.. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్ సుధాకర్ భార్య సుజాత శనివారం తన సోదరుడికి రాఖీ కట్టడానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లింది. ఆమె సోదరుడు లునావత్ శ్రీను సూర్యాపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా శనివారం పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉండగా సుజాత నేరుగా అక్కడికి వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహం పక్కనే సోదరుడు శ్రీనుకు రాఖీ కట్టింది. కుటుంబ కలహాలతో బలవన్మరణంకేతేపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కేతేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాంరెడ్డి(47) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా మద్యం సేవిస్తూ కొంతకాలంగా పనికి వెళ్లడం లేదు. ఈ విషయమై భార్య స్వాతితో తరుచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన రాంరెడ్డి ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
బోనాల పండుగ.. ఉపాధి మెండుగ
ఫ సోదరా నీవే రక్ష రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సాక్షి నిర్వహించిన ‘సెల్ఫీ విత్ రాఖీ’ ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు రాఖీ కట్టి సెల్ఫీ తీసుకుని పంపించారు. అందులో కొన్ని.. రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్: ఉమ్మడి జిల్లాలో శ్రావణ మాసం బోనాల సందడి నెలకొంది. హైదరాబాద్లో ఆషాడమాసంలో బోనాలు నిర్వహిస్తే, పల్లెల్లో మాత్రం శ్రావణమాసంలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఇంటికొచ్చే బంధువులు, ఆడపడుచుల రాకతో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల పండుగ సామాజికంగా, ఆర్థికంగా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. ఫ గ్రామాల్లో శ్రావణమాసం బోనాల సందడి ఫ కుండలు, నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు, బ్యాండ్, డప్పులు, ఎల్ఈడీ లైటింగ్కు ఫుల్ గిరాకీ బోనాల పండుగలో భాగంగా అమ్మవార్లకు ప్రతి కుటుంబం నుంచి బోనం సమర్పిస్తారు. కుమ్మరి వృత్తివారు వివిధ ఆకారాల్లో బోనం కుండలతో పాటు దానిపై దీపం పెట్టే మూతను ఒక సెట్లాగా తయారుచేసి అమ్ముతున్నారు. బోనాల సీజన్లో కుండలకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో నెల రోజుల ముందు నుంచే కుండల తయారీ ప్రక్రియ ప్రారంభించారు. ఆర్డర్లకు అనుగుణంగా కుండలు, చిన్న గురిగిలను తయారు చేసి ఇస్తున్నారు. నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లు అ‘ధర’హో.. సాధారణ రోజుల కంటే శ్రావణమాసం బోనాల సమయంలో నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి నాటుకోళ్లు, గొరెర పొట్టేళ్లను బలిస్తారు. సాధారణంగా నాటుకోడి కిలో రూ.500 ఉంటుంది. ప్రస్తుతం డిమాండ్ ఎక్కుగా ఉండడంతో రూ.600 నుంచి 700 వరకు ధర పలుకుతోంది. కుల వృత్తులకు కలిసొచ్చే పండుగ.. బోనాల ఊరేగింపులో బ్యాండ్, డప్పు చప్పుళ్లు, డీజేలు ఉపయోగిస్తుతండడంతో వారికి ఉపాధి లభిస్తోంది. మాంసం విక్రయించే వారు, చాకలి, మంగలి కుల వృత్తుల వారు, ఎల్ఈడీ లైటింగ్, నైవేద్యం తయారీకి కిరాణా సామాను కొనుగోలు చేస్తుండడంతో ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది. వ్యాపారులు, ప్రభుత్వానికి లబ్ధి బోనంతో పాటు అమ్మవారిని అంకరణకు పూలు, మామిడి ఆకులు అవసర ఉండడంతో పూల మార్కెట్లలో వ్యాపారం ఊపందుకుంది. కొబ్బరికాయలు విక్రయించే వారికి కూడా గిరాకీ పెరిగింది. బస్సుల్లో ప్రయాణించే వారితో ఆర్టీసీకి, బోనాల సందర్భంగా మద్యానికి డిమాండ్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.గిరాకీ బాగుంది శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా కుండల గిరాకీ బాగానే ఉంది. సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ పార్కు దగ్గర కుండలు పెట్టి విక్రయిస్తున్నాను. వివిధ సైజులను బట్టి రూ.150 నుంచి 300 దాకా అమ్ముతున్నాం. – నిమ్మనకొట్టి పూలమ్మ, కుండల వ్యాపారి, సూర్యాపేట రకరకాల డిజైన్లతో తయారు చేస్తున్నాం వివిధ రకాలుగా బోనం కుండలను డిజైన్ చేసి అమ్ముతున్నాం. బోనం కుండ మూత దానిమీద పెట్టే గురిగి, వెయ్యి గండ్ల బోనం, సాదా బోనం కుండ, అలంకరణ చేసిన బోనం కుండలను విక్రయిస్తున్నాం. వైరెటీని బట్టి ధర ఉంటుంది. – మురళి, కుమ్మరి బజార్, సూర్యాపేట ముందుగానే ఆర్డర్లు ఇస్తారు బోనాల పండుగ కోసం మట్టి కుండలు, చిన్న గురుగులు, దీపం మూతలను ముందుగానే ఆర్డర్లు ఇస్తారు. దానికి అనుగుణంగా తయారుచేసి పంపుతాం. ఇంటి వద్ద కూడా విక్రయిస్తాం. నెల రోజుల పాటు ఆర్ధికంగా చేదోడుగా ఉంటుంది. – బొడ్డుపల్లి మల్లయ్య, కుండల తయారీదారుడు, నల్లగొండమట్టి కుండలకు గిరాకీ -
పూర్తిస్థాయి నీటిమట్టానికి సాగర్
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్ గరిష్టస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 589.70 అడుగులు (311.1486 టీఎంసీలు)గా ఉంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా కృష్ణా నదిలోకి 29,313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాలువల ద్వారా మరో 15,577 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడం.. ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆదివారం ఉదయం క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఫ మరోసారి తెరుచుకోనున్న క్రస్ట్గేట్లు -
ఏరియల్ లైడార్ సర్వే
ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకం పనులపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఇన్లెట్లోని 14వ కిలోమీటరు వద్ద జరిగిన ప్రమాదంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన చోట టన్నెల్ను తవ్వే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా టన్నెల్ పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రెండు రకాల సర్వేలు చేయిస్తోంది. వాటి నివేదికల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో టెన్నల్ తవ్వకం పనులను పక్కాగా చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఏరియల్ లైడార్ సర్వే నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేషనల్ జియో ఫిజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ఈ సర్వేలు చేపట్టేందుకు రూ.2.36 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం పాలనపరమైన అనుమతులు జారీ చేసింది. అవాంతరాలతో ఆలస్యం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి వరకు నీటిని తరలించేందుకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. ఇన్లెట్, ఔట్లెట్ కలిపి 34.37 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అందులో ఔట్లెట్లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లోనే నిధులను వెచ్చించి అమెరికా నుంచి బేరింగ్ తెప్పించ్చింది. బేరింగ్ ఏప్రిల్ నెలలో మన్నెవారిపల్లికి చేరుకుంది. బేరింగ్ను టీబీఎంకు అమర్చేందుకు అవసరమైన పరికరాలు కెనడా నుంచి రావాల్సి ఉంది. డబ్బుల సమస్యతో అవేవీ రాలేదు. దీంతో బేరింగ్ వచ్చినా టన్నెల్ లోపలికి కూడా తీసుకెళ్లలేదు. ఇన్లెట్లో ప్రత్యామ్నాయాలపైనే ప్రత్యేక దృష్టి సొరంగం ఇన్లెట్ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్ జోన్ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో పనులు 2019లోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి అక్కడ డీవాటరింగ్ మాత్రమే కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన పనులను ప్రారంభించారు. టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాద దాటికి టీబీఎం ముక్కలైపోయింది. 8 మంది గల్లంతయ్యారు. వారిని వెలికితీసేందుకు 60 రోజులకుపైగా సహాయక చర్యలు కొనసాగాయి. ఇద్దరు కార్మికుల మృతదేహాలను మాత్రమే వెలికితీయగా, ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. పైకప్పు మళ్లీ కూలేందుకు అవకాశం ఉండటంతో సహాయక చర్యలు ఆపేశారు. అయితే ఇన్లెట్లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతానికి కంటే ముందు నుంచి యాభై మీటర్ల పక్కకు జరిగి, అక్కడి నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రెండు జాతీయ సంస్థల ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. వేగం పుంజుకోనున్న సర్వే పనులుటన్నెల్ ప్రాంతం అంతా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం కాకుండా టీబీఎం ద్వారా తవ్వకాన్ని చేపట్టింది. అయితే ఇన్లెట్ కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ఎలా ముందుకు సాగాలనే విషయంలో పలు అంశాలను పరిశీలిస్తోంది. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో టన్నెల్ తవ్వాలన్న దానిపై రెండు రకాల సర్వే చేపట్టేందుకు ఉపక్రమించింది. అందుకు నిధులు కూడా విడుదల చేసింది. ఔట్లెట్లోనూ బేరింగ్ బిగించేందుకు అవసరమైన పరికరాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఫ ఆరు నెలలుగా నిలిచిన పనుల్లో కదలిక ఫ తాజాగా రెండు రకాల సర్వేకు ప్రభుత్వం కసరత్తు ఫ సర్వేకు రూ.2.36 కోట్లతో పరిపాలనా అనుమతులు ఫ 9.56 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయితే నల్లగొండకు జలసిరి -
మూడు నెలలుగా మందుల కొరత
నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్కు మందుల కొరత పట్టిపీడిస్తుంది. మూడు నెలలుగా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉండడం లేదు. కేవలం మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్లు, కొన్ని క్రీమ్లు, చిన్నా చితక మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నెలనెలా మందుల కోసం వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడికే.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, జర్నలిస్టులు.. వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. హెల్త్ కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ , కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతి నెలా వెల్నెస్ సెంటర్కు వచ్చి ఉచితంగా మందులను తీసుకెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వారు ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపించుకుని మందులు తీసుకుంటారు. కానీ మూడు నెలలుగా సక్రమంగా మందులు లేకపోవడంతో ఉన్న మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్లు, సిరప్లు, క్రీమ్లు ఇచ్చి పంపుతున్నారు. మిగతా మందులు వచ్చాగా వచ్చి తీసుకుపోవాలని ఫార్మసిస్టులు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో మందులు లేని కారణంగా దూరం ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మందులు అందుబాటులో ఉంచేలా చూడాలని కోరుతున్నారు.ఫ వెల్నెస్ సెంటర్లో మూడు నాలుగు రకాలు మాత్రలే అందుబాటులో.. ఫ దీర్ఘకాలిక వ్యాధుల ట్యాబ్లెట్లు లేవంటున్న సిబ్బంది ఫ ఇబ్బంది పడుతున్న హెల్త్ కార్డుదారులు ఇండెంట్ పంపించాం వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందుల కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇండెంట్ పంపించాం. దశల వారీగా పంపుతున్నారు. పేషంట్ల సంఖ్యకూడా గణనీయంగా పెరిగింది. మందులు తక్కువగా పంపిస్తున్నారు. రోగులకు ఇంబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లావణ్య, వెల్నెస్సెంటర్ ఇన్చార్జి -
ఫ మూసీ ఉధృతి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 5,082 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 9,598 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. నీటిమట్టాన్ని 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద మొత్తం దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 286 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
పంట పొలాల్లో ఇసుక మేట
ఫ భారీగా దెబ్బతిన్న పంటలు ఫ ధ్వంసమైన లింకురోడ్లు ఫ శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసిన వర్షం శాలిగౌరారం : మండలంలో గురువారం కురిసిన అతి భారీ వర్షం శాలిగౌరారం మండలాన్ని అతలాకుతలం చేసింది. 14.1 సెంటీమీటర్ల వర్షంతో మండలకేంద్రంతో పాటూ మండలంలోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగి చెరువులు, కుంటలను తలపించాయి. భారీ వర్షంతో పోటెత్తిన వరదలకు ఆయా గ్రామాల్లో వరి, పత్తి పంటపొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం నాటికి వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద గల లోతట్టు ప్రాంతంలో వరదనీటి ప్రభావం అత్యధికంగా ఉండటంతో వరి చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వలతో పాటూ రామగిరి, తిరుమలరాయునిగూడెం, శాలిగౌరారం గ్రామాల వరదనీరు మొత్తం శాలిగౌరారం బస్టాప్ వద్ద ఉన్న లోతట్టు భూములమీదుగానే ప్రవహించడంతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దెబ్బతిన్న అనుసంధాన రోడ్లు.. భారీ వర్షానికి మండలంలోని గ్రామాలకు మధ్యన అనుసంధానంగా ఉన్న లింక్రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా రోడ్లపై రాకపోకలు సాగించడం కష్టతరంగా మారింది. అందులో ప్రధానంగా ఊట్కూరు–బండమీదిగూడెం గ్రామం రోడ్డు, భైరవునిబండ–అద్దెలోనిబావి రోడ్డు, శాలిలింగోటం–తుడిమిడి రోడ్డు, అంభారిపేట–చిత్తలూరి రోడ్లు ఉన్నాయి. బండమీదిగూడెం మెటల్రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాళ్లు తేలడంతో వాహనాలు సైతం నడుపలేని అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది.పొలం ఇసుకమేటలు వేశాయి శాలిగౌరారం బస్టాప్ వద్ద నాకున్న ఎకరం భూమిలో ఇటీవలే వరినాటు వేశాను. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాల్వ కట్ట తెగి పొలంమీదుగా వరద ప్రవహించింది. పొలం మొత్తం రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. రూ.30 వేలు ఖర్చుపెట్టి పంటసాగు చేస్తే వర్షం నా పొలాన్ని రాళ్ల కుప్పగా మార్చింది. ప్రభుత్వమే మమ్ములను ఆదుకుని న్యాయం చేయాలి. – షేక్ మహబూబ్అలీ, రైతు, శాలిగౌరారం -
13 వరకు రైతు బీమా దరఖాస్తులు
నల్లగొండ అగ్రికల్చర్ : కొత్తగా పాస్బుక్తో వచ్చిన రైతులంతా రైతు బీమా కోసం ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన, 18 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న రైతులందరూ రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్లతో పూర్తి చేసిన దరఖాస్తులను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంకట్టంగూర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. ఈ నీటితో కొండకిందిగూడెం, బండపాలెం, ఇనుపాముల, కేతేపల్లి, కొర్లపహాడ్, నోముల, నకిరేకల్ చెరువులను నింపుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, రెడ్డిపల్లి సాగర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నంద్యాల వెంకట్రెడ్డి, బెజవాడ సైదులు, చెవుగోని సాయిలు, ఎడ్ల పెదరాములు, చెవుగోని రవి, మర్రి రాజు, ముక్కాముల శేఖర్, ఇరిగేషన్ డీఈ భూషణాచారి, ఏఈలు పాండు, చందన ఉన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కృషిదేవరకొండ : ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా దేవరకొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసీ సొంతమన్నారు. దేశంలో ఆదివాసీలు సమానత్వం, హక్కులు, వివక్ష లేని సమాజం కోసం ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారని వారి హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, ఎంపీడీఓ డానియల్, తహసీల్ధార్ మధుసూదన్రెడ్డి, ఆలంపల్లి నర్సింహ, వేణుధర్రెడ్డి, బిక్కూనాయక్, కొర్ర రాంసింగ్ తదితరులు ఉన్నారు. పండుగ వేళ ఆర్టీసీ బాదుడుమిర్యాలగూడ టౌన్, కొండమల్లెపల్లి : పండుగలకు ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. రాఖీ పండుగ సందర్భంగా రీజియన్ పరిధిలో బస్ చార్జీలను 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచింది. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సుకు చార్జీ రూ.310 ఉండగా.. రాఖీ రోజున రూ.430కి పెంచింది. అంటే ఒక్క టికెట్పై రూ.120 అదనంగా వసూలు చేసింది. దేవరకొండ నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్చార్జీ రూ.160 ఉండగా రూ.220 వసూలు చేశారు. ఓ పక్క మహిళలకు ఫ్రీ ఇస్తూనే.. పండగ స్పెషల్ అంటూ అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముంచెత్తిన వాన
జిల్లా అంతటా జోరు వర్షం ఫ శాలిగౌరారంలో అత్యధికంగా 14.1 సెంటీమీటర్లు నమోదు ఫ పలుచోట్ల పొంగిన వాగులు.. రాకపోకలకు అంతరాయంఫ పత్తి చేలలో నిలిచిన నీరుపెద్దవూర, తిరుమలగిరి(నాగార్జునసాగర్), త్రిపురారం : అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 14.1 సెంటీమీటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా నాంపల్లి మండలంలో 8.0 మిల్లీమీటర్ల వాన కురిసింది. వర్షంతో పలుచోట్ల పత్తి చేలలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగాయి. దీంతో లోలెల్ వంతెనల పైనుంచి వరద నీరు పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే.. మొన్నటి వరకు వేసవిని తలపించేలా ఎండలు ఉండటంతో పత్తి, మిరప చేలు వాడు దశకు చేరుకున్నాయి. ఈ వర్షంతో పంటలకు డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీటమునిగిన చేలు ● పెద్దవూర మండలంలో కురిసన భారీ వర్షంతో మండలంలోని పెద్దవూర, నాయినివానికుంట, సంగారం, పోతునూరు చెరువులు అలుగులు పో స్తున్నాయి. పెద్దవూర–పర్వేదుల రహదారిపై మండల కేంద్రంలో చిన్నవాగుపై ఉన్న వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో నీటిలోనుంచే పశువులు, వాహనాలు వెళ్లాల్సి వచ్చింది. ● తిరుమలగిరి సాగర్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురింసింది. మండలంలో చాలా గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. పత్తి పంట చెరువును తలపించేలా మారాయి. ● త్రిపురారం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురి సింది. దీంతో మండల కేంద్రం నుంచి కుక్క డం వెళ్లే రహరారిలో బాబుసాయిపేట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శాలిగౌరారంలో కుండపోత శాలిగౌరారం : మండలంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. వరదలకు మండల కేంద్రంలో కాల్వలకు గండ్లు పడటంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్కు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఊట్కూర్ వద్ద కాజ్వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మండలంలోని ఊట్కూర్, మాదారం కలాన్, పెర్కకొండారం, ఇటుకలపాడ్, వంగమర్తి గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వందల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఊట్కూర్ నుంచి బండమీదగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో బండమీదగూడెం వెళ్లడం కష్టతరంగా మారింది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన ముగ్గురు తాపిమేసీ్త్రలు ఊట్కూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముగించుకుని బైక్పై తిరిగి వెళుతుండగా ఊట్కూర్ మాదారంకలాన్ గ్రామాల మధ్య కాజ్వేపై వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వారిని తాళ్ల సాయంతో బయటకు లాగి ప్రాణాపాయం తప్పించారు. శుక్రవారం ఉదయం బైక్ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. వర్షపాతం వివరాలు ఇవీ.. నల్లగొండ టౌన్ : చిట్యాల 49.1మి.మీ, నార్కట్పల్లి 35.5, కట్టంగూర్ 60.3, నకిరేకల్ 42.5, కేతేపల్లి 31.9, తిప్పర్తి 11.9, నల్లగొండ 47.5, కనగల్ 15.2, అనుముల హాలియా 41.7, నిడమనూరు 26.8, త్రిపురారం 36.8, మాడ్గులపల్లి 25.5, వేములపల్లి 59.1, మిర్యాలగూడ 15.8, దామరచర్ల 24.5, అడవిదేవులపల్లి 45.4, తిరుమలగిరి సాగర్ 26.7, పెద్దవూర 37.8, చింతపల్లి 19.5, గుర్రంపోడు 11.5, పీఏపల్లి 26.8, నేరడుగొమ్ము 10.8, కె.మల్లేపల్లి 16.8, దేవరకొండ 27.6, గుండ్లపల్లి 56.9, చందంపేట 18.0, గుడిపల్లి 17.7, మునుగోడు 22.8, చండూరు 21.6, గట్టుప్పల్ 10.3, మర్రిగూడ మండలంలో 9.4 మిలీమీటర్ల వర్షం కురిసింది. -
గుజరాత్ నుంచి నల్లగొండకు బ్యాలెట్ బాక్సులు
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నందున జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులు సరిపోయే అవకాశం లేదు. దీంతో గుజరాత్ నుంచి 4280 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. వాటిని శుక్రవారం నల్లగొండలోని జిల్లా పరిషత్ పాత భవనంలో భద్రపరిచారు. బ్యాలెట్ బాక్సులను జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు పరిశీలించారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పీజీ సెమిస్టర్ పరీక్షలను అధికారులు తనిఖీ చేశారు. యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్రెడ్డి పర్యవేక్షించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరంచిట్యాల : వానాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల పీహెచ్సీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఆనంతరం మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఇటీవల డెంగీ వ్యాధి సోకిన ఇంటి పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైడే నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డీఎంఓ ప్రదీప్, డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సీహెచ్ఓ నర్సింహారావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కేజీబీవీ తనిఖీ హాలియా : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ బొల్లారం భిక్షపతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన హైజెనిక్ ఆహార పదార్థాలను అందించాలని స్పెషల్ ఆఫీసర్ హైమావతికి సూచించారు. స్టోర్, కిచెన్, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థుల ప్రగతిని సమీక్షిస్తూ గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు. నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. -
ఎన్నెస్పీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రిపురారం : భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నెస్పీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వద్ద కంపాసాగర్ పరిధిలో సాగర్ఎడమ కాలువకు ఉన్న ఎమర్జెన్సీ గేట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దదేవులపల్లి చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యం, ఎమర్జెన్సీ గేట్ల పనితీరుపై ఆరా తీశారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని తెలసుకున్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎన్నెస్పీ డీఈ గోపీనాథ్, తహసీల్దార్ గాజులు ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎన్నెస్పీ ఏఈ ప్రవీన్ ఉన్నారు. ఎడమకాల్వ పరిశీలన హాలియా : భారీ వర్షాలు వస్తే అత్యవసర సమయంలో అప్రమత్తంగా ఉంటూ సాగునీటిని నియంత్రించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాలియాలోని 17వ మైలురాయి వద్ద ఎడమకాల్వను పరిశీలించారు. అత్యవసర పరిస్ధితుల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే నీటిని ఎస్కేప్ ఛానెల్ ద్వారా స్ట్రీమ్కు పంపించాలన్నారు. -
విధులకు వెళ్లకుండా ఫేక్ అటెండెన్స్!
నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం నల్లగొండ జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ వేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలో గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ వారి వివరాలను జిల్లా అధికారులకు పంపించి చర్యలకు ఆదేశించింది. దీంతో ఫేక్ అటెండెన్స్కు పాల్పడ్డ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం.. అందుకు వారు సమాధానం కూడా ఇచ్చారు. త్వరలోనే వారిపై కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉదయం 9.30 గంటలకు హాజరు వేయాలి జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 844 ఉన్నాయి. వాటి పరిధిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు రోజూ ఉదయం 9.30 గంటలకు ఆయా గ్రామాలకు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలి. కానీ.. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతూ ఫేక్ అటెండెన్స్ వేసి పంచాయతీరాజ్ శాఖను మోసం చేస్తున్నారు. ఇలా జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మారుమూల ప్రాంతాల గ్రామాలకు చెందిన వారే ఉండడం గమనార్హం యాప్లోనే లొసుగులు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు కోసం యాప్ను రూపొందించి అమలు చేస్తోంది. కానీ ఆ యాప్లో పలు లొసుగులు ఉన్నాయి. యాప్లో ఉద్యోగి ఆధార్కు అనుసందానం లేదు. దానికి తోడు ఎవరి ఫొటో పెట్టినా అటెండెన్స్ పడుతుంది. దీంతో కార్యదర్శులు ఆ గ్రామంలో పనిచేసే కార్మికుల సెల్లో యాప్ను డౌన్లోడ్ చేసి కార్యదర్శుల పాస్ ఫొటోలను వారికి ఇవ్వడంతో వీరు విధులకు వెళ్లని రోజు కార్మికులే వీరి పాస్పొటోను చూపి అటెండెన్స్ వేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం పంచాయతీ కార్యదర్శులు రోజూ ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరువేస్తారు. వారి హాజరును పరిశీలించాల్సింది ఎంపీఓ. సదరు అధికారి రోజూ 2, 3 గ్రామాలు వెళ్లి పరిశీలించాలి. కానీ జిల్లాలో అధికారులు ఫేక్ అటెండెన్స్లు గుర్తించలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్కు పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. ఫ 69 మంది కార్యదర్శులను గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ ఫ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కార్యదర్శులు ఫ క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్న జిల్లా కలెక్టర్ క్రిమినల్ చర్యలకు అవకాశం.. జిల్లాలో తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్కు సమర్పించనున్నారు. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం కార్యదర్శులను సస్పెండ్ చేయవచ్చు. ఇంక్రిమెంట్ కట్ చేయడం, ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది. దీనిపై త్వరలోనే కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
దేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు పురోగతి తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ఇల్లు మంజూరై నిర్మించుకు నేందుకు ఆర్థిక స్థోమత లేని వారిని గుర్తించి వారికి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం ఇప్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇళ్ల పురోగతిని పరుగులు పెట్టించాలని అధికారులకు సూచించారు. జాబితాలో అర్హులైన వారిని చేర్చాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రమణారెడ్డి, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
64,884 మందికి రేషన్ కార్డులు
నల్లగొండ: కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డుల పంపిణీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటన్నింటిని పరిశీలించి గతనెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. మొత్తంగా 72,100 మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోగా 64,884 దరఖాస్తులను అప్రూవల్ చేసి లబ్ధిదారులకు అందించారు. మిగతావి వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్నాయి. పేర్లు చేర్చేందుకు 87,122 అర్జీలు రేషన్ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు 87,122 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 82,185 దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో వాటిల్లో కొత్తగా పేర్లు చేర్చారు. మిగతావి ఆర్ఐ, తహసీల్దార్, డీఎస్ఓ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. ఫ పూర్తయిన పంపిణీ ప్రక్రియ ఫ కొత్త కార్డులకు సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డులేని అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హతల ప్రకారం కొత్త కార్డు మంజూరు చేస్తాం. – వెంకటేశ్వర్లు, డీఎస్ఓ -
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై గురువారం నల్లగొండ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి శాఖల వారి ప్రగతికి సంబంధించిన నివేదికలను ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని సూచించారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకావిష్కరణ, వందన స్వీకరణ, సందేశం, శకటాలు, స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే వారందరికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి
నల్లగొండ: జిల్లా పరిధిలోని రసాయన, ఔషధ పరిశ్రమల్లో నెల రోజుల్లోగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులతో గురువారం ఆమె కలెక్టరేట్లో సమావేశమయ్యారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో జూన్లో జరిగిన పెద్ద విస్పోటన ఘటనకు సంబంధించి భద్రతా సమస్యలపై తనిఖీలకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తనిఖీలు దశల వారీగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. రెవెన్యూ అర్జీలను వేగంగా పరిష్కరించాలినల్లగొండ: భూభారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నల్లగొండ డివిజన్లోని తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు, డీటీలు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మూసీకి 2,200 క్యూసెక్కుల వరదకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో గురువారానికి 643.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 2,580 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగకు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 620 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గేట్లు, కాల్వల ద్వారా మొత్తం 3,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.07 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బ్యూటీషియన్, టైలరింగ్లో శిక్షణనల్లగొండ: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఈ నెల 18 నుంచి బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ ఎ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 08682 244416 నంబర్నుం సంప్రదించాలని ఆమె కోరారు. ఆర్జిత సేవలు పునఃప్రారంభంయాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. శ్రీస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నిత్య కై ంకర్యాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరిపించారు. -
ఇన్నోవేషన్ హబ్
..మనకేనా?స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా.. రీజనల్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని కేంద్రం భావిస్తోంది. పరిశోధన – అభివృద్ధి కేంద్రాల్లో ఉద్యోగాలు, నూతన సాంకేతికతలపై పరిశోధనలో పాలుపంచుకునే అవకాశాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్టార్టప్లకు సహకారం అందించడం, ఫండింగ్, మార్కెట్ లింకేజీలో సహకారం అందించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందించనుంది. దక్షిణ తెలంగాణలో రీజనల్ హబ్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత ఫ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలకం ఫ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు ఫ పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దక్షిణ తెలంగాణలో రీజనల్ ఇన్నోవేషన్ హబ్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పరిశీలన జరుపుతున్నామని వెల్లడించింది. అంతేకాదు నల్లగొండలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి పార్లమెంటులో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇన్నోవేషన్ హబ్ను నల్లగొండలోనే ఏర్పాటు చేసేలా ఎంపీ కేంద్రాన్ని కోరారు. దీంతో జిల్లాలో హబ్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధన, పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రీజనల్ ఇన్నోవేషన్ హబ్లను/సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చైన్నె తదితర ప్రాంతాల్లో ఇన్నోవేషన్ హబ్లు ఉన్నాయి. అవికాకుండా ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో రీజనల్ హబ్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో ఒకటి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంపీ రఘువీర్రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ హబ్ నల్లగొండకు మంజూరు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది దానిపైనా అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చించనున్నారు. ప్రాంతీయ అవసరాలపైనా ప్రాజెక్టులు రీజనల్ హబ్లో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించి అమలు చే యనుంది. తద్వారా స్థానిక అవసరాలకు పెద్దపీట వేయనుంది. స్థానిక యువత, విద్యార్థులు, పరిశోధకులకు ప్రోత్సాహం అందించనుంది. స్టార్టప్లకు ప్రోత్సాహంతో కొత్త సంస్థలు ఏర్పడటం ద్వారా వాటిల్లోనూ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఆధునిక సాంకేతికతపైనా ప్రత్యేక దృష్టి రీజనల్ ఇన్నోవేషన్ హబ్లో నూతన ఆవిష్కరణలతో పాటు స్టార్టప్లకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంపైనా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. అందులో ఏర్పాటు చేసే నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్, డాటా సైన్స్, ఫ్యాబ్రికేషన్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టనుంది. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ప్రదర్శన కేంద్రాలు (ప్రోటోటైపింగ్), చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉత్పత్తుల పరీక్ష వేదికలను ఏర్పాటు చేయనుంది. అలాగే వృత్తి శిక్షణ కేంద్రాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లు, వర్చువల్ లాబ్స్ – టెక్ లాబ్లు, ఇండస్ట్రీ, అకాడమీ కొలాబ్రేషన్ కేంద్రాలను ఇందులో ఏర్పాటు చేయనుంది. -
భూభారతి చట్టం.. రైతులకు వరం
మిర్యాలగూడ, నిడమనూరు, చింతపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు వరమని తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా గురువారం మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం, నిడమనూరు, చింతపల్లి రైతు వేదికల్లో రైతులకు భూ చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ రైతులు భూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ చట్టాలపై అవగాహన అవసరమని, తద్వారానే రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రైతుల హక్కులు, సాగు చట్టాలపై అవగాహన కల్పించేందుకు జూలై 28 నుంచి సాగు న్యాయ యాత్ర చేపట్టామని, అక్టోబర్ 2 వరకు 800 పైచిలుకు గ్రామాల మీదుగా 2,400 కిలోమీటర్ల పర్యటన సాగుతుందన్నారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు రసీదు అడిగి తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని పేర్కొన్నారు. అనంతరం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి లీవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పీఏ హరివెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్, ప్రకృతి సాగు నిపుణుడు గున్న రాజేందర్రెడ్డి, అడ్వకేట్స్ జీవన్, అభిలాష్, మల్లేష్, ప్రవీణ్, సందీప్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్రెడ్డి, నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, ఏడీఏ సరితా, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ -
ఇసుక దందాను అరికట్టేందుకే..
ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మైనింగ్ శాఖ ఎండీ భవేష్ మిశ్రా అన్నారు. - 8లోవ్యర్థాలు తొలగింపు నల్లగొండ టౌన్ : జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాలను ఎట్టకేలకు తొలగించారు. ఆస్పత్రిఆవరణలోని వ్యర్థాలతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారిందని ‘సాక్షి’లో గురువారం ఆరుబయటే ఆస్పత్రి వ్యర్థాలు అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. వెంటనే ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాల కుప్పలను ఆగమేఘాల మీద తొలగించి పరిశుభ్రం చేయించాయి. -
ప్రబలుతున్న విషజ్వరాలు
జ్వర పీడితులతో ఆస్పత్రులు కిటకిట ఫ మలేరియా, టైపాయిడ్ బాధితులే అధికం ఫ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ వందల సంఖ్యలో ఓపీ ఫ మార్చి నుంచి ఎనిమిది డెంగీ పాజిటివ్ కేసులు నమోదు ఫ పరీక్షల పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు వైద్యాధికారుల సూచనలు ఇవీ.. ● దోమలు పెరగకుండా ఇళ్ల ముందు మురికి గుంతల్లో రసాయన ద్రవాలను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ● పాత ట్యూబులు, కుండల్లో నీరు నిల్వ ఉంకుండా చూడాలి. ● దోమ తెరలను వినియోగించుకోవాలి. ● జ్వర లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలి. ● చిన్న పిల్లలను పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. ● ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. నల్లగొండ టౌన్: వానాకాలం కావడంతో సీజనల్గా వచ్చే విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు డెంగీతోపాటు మలేరియా, టైపాయిడ్ వంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నాయి. ఇందులో మలేరియా, టైపాయిడ్, సాధారణ జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం మార్చి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా రక్త పరీక్షలు చేయగా ఎనిమిది డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, నార్కట్పల్లి, కేతేపల్లి, దామరచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాల్లోని ప్రజలు డెంగీ లక్షణాలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జూన్ నుంచి ప్రతిరోజూ 400 నుంచి 600 వరకు ఓపీ నమోదవుతోంది. సాధారణ రోజుల్లోనైతే 300 వరకు ఓపీ నమోదయ్యేది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షాలు కురిస్తే డెంగీ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. మురుగునీటి నిల్వే కారణం.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి గుంతలతో పాటు మురుగు కాల్వల్లో, ఇళ్లలో నీటి తొట్లు, పగిలిపోయిన కుండలు, పాత డ్రమ్ములు, కొబ్బరిబోండాల వంటి వాటిల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమల వ్యాప్తి పెరిగి డెంగీ ప్రబలుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని వీధులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వర్షాలకు ముందు తర్వాత డ్రెయినేజీల్లో పూడిక తీసివేసి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించి పేరుకుపోయిన నీటి నిల్వలను పారబోయడం వల్ల డెంగీని అరికట్టవచ్చు. ముఖ్యంగా అర్బన్ మలేరియా విభాగంలో ఒక్క నల్లగొండ పట్టణంలో 60 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వీరంతా దోమల నివారణకు మందు చల్లడం, ఫాగింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది. పెరుగుతున్న రోగులు జిల్లాలో సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్, మర్రిగూడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా డెంగీ, మలేరియా, టైపాయిడ్ వంటి లక్షణాలతో బాధితులు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇదే పరిస్థితి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కనిపిస్తోంది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షల పేరుతో బాధితుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం డెంగీ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలిశా పరీక్ష ద్వారా చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు డెంగీ బూచిని చూపి వివిధ పరీక్షల పేరుతో బాధితులను నిలువ దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి 01ఏరియా ఆస్పత్రులు 04అర్బన్ హెల్త్ సెంటర్లు 05కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 01పీహెచ్సీలు 34 బస్తీ దవాఖానాలు 195పల్లె దవాఖానాలు 07సిబ్బందిని అప్రమత్తం చేశాం జిల్లాలో డెంగీ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశాం. అన్ని గ్రామాలు, పట్టణాల్లో మురుగునీటి గుంతల్లో దోమల నివారణకు మందులు స్ప్రే చేయాలని ఆదేశించాం. ప్రజలు కూడా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పారిశుభ్రత పాటించాలి. డెంగీ లక్షణాలు కనపడితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి సరైన వైద్యసేవలు పొందాలి. – పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
కేతేపల్లి : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు నిర్మాణ పనుల వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఐకేపీ ఏపీఎంలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆమె సమీక్షించారు. గ్రామాల్లో వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి తక్కువగా ఉన్న విషయాన్ని కలెక్టర్ గుర్తించారు. ఈనెల 13వ తేదీ నాటికి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కనీసం 20 శాతం పురోగతి సాధించేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం వనమహోత్సవం కింద మొక్కలు నాటారు. భూ భారతి దరఖాస్తులపై సమీక్షించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆరుబయటే.. ఆస్పత్రి వ్యర్థాలు!
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వ్యర్థాలు ఆరుబయటే దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రిలోని బయోవేస్ట్ (ఆస్పత్రి వ్యర్థాలు) శానిటేషన్ సిబ్బంది ఇష్టానుసారంగా పడేస్తున్నారు. వాటిని నిత్యం తరలించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోని కారణంగా ఆస్పత్రి ఆవరణలో పేరుకుపోతున్నాయి. వాటిని పాడి గేదెలు, మేకలు, పందులు, కుక్కల తింటున్నాయి. అందులో రకరకాల కాలం చెల్లిన మందులు, సిరంజీలు, కాటన్, ఇతర వ్యర్థాఽలు ఉండడం వల్ల వాటని తిని జీవాలు చనిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదకర వ్యర్థాలు.. ఆస్పత్రి వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. అందులో సర్జికల్ వేస్టేజీ, సిరంజీలు, గ్లౌజ్లు, ఇతర ఇంజెక్షన్లు, బాటిళ్లు, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల వార్టులోని వ్యర్థాలు ఉంటాయి. వాటిని రోజూ సేకరించి ఎంపిక చేసిన ప్రాంతంలో పడేయాలి. అక్కడి నుంచి ఆస్పత్రి వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టర్ వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. శానిటేషన్ సిబ్బంది ఎక్కడపడితే అక్కడ పారవేయడంతోపాటు వ్యర్థాలు సేకరించాల్సిన కాంట్రాక్టర్లు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా కంపుకొడుతోంది. పట్టించుకోని సెక్యూరిటీ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోకి పశువులు, గేదెలు, మేకలు, కుక్కలు, పందులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వచ్చిన జీవాలు ఆస్పత్ర వ్యర్థాలను తింటున్నా పట్టించుకునే వారు లేకుండాపోయారు. ఆస్పత్రిలోకి జీవాలు రాకుండా మూడు ప్రధాన గేట్లు ఉన్నాయి. ఆ ప్రధాన గేట్ల నుంచి జీవాలు రాకుండా సెక్యూరిటీ గార్డులను కూడా ఆస్పత్రి వర్గాలు నియమించాయి. ఆస్పత్రిలో సుమారు 260 మంది వరకు శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు, పేషంట్ కేర్లు ఉన్నప్పటికీ గేట్ల వద్ద ఎవ్వరినీ ఉంచని పరిస్థితి ఏర్పడింది. సుమారు 550 పడకల సామర్థ్యం కలిగిన జీజీహెచ్కు ప్రతి రోజు 600 వరకు అవుట్ పేషంట్లు, 200 వరకు ఇన్పేషంట్లు వైద్య సేవలను పొందుతున్నారు. వారందరికీ అందించే సేవల సందర్భంగా పెద్ద ఎత్తున వ్యర్థాలు వెలువడుతుంటాయి. కానీ వాటిని సక్రమంగా తరలించకపోవడం వల్ల జీవాలు ప్రాణాలు కోల్పేయే అవకాశం ఉంది. న్యూస్రీల్గేదెలు, మేకలు, పందులకు ఆహారంగా మారిన వైనం ఫ మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఫ వ్యర్థాలు తరలింపునకు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫ పట్టించుకోని సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు -
అన్ని రకాల వైద్యసేవలు అందించాలి
నల్లగొండ టూటౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచల్క పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ, ఏఎన్సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. టెస్టులు, ఇతర రిజిస్ట్రర్లను తనిఖీ చేసి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తయినందున ఇతర అంతర్గత పనులు త్వరగా చేపట్టి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, జిల్లా క్షయనియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
ధాన్యం దారి మళ్లింపుపై విచారణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరు మిల్లుల అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. పభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ను (సీఎంఆర్) ఆరుగురు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌర సరఫరాల శాఖ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దాని ద్వార ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని ఫిర్యాదులు అందడంతో పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. పక్కదారి పట్టిన బియ్యంపై విచారణ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు చెందిన మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వలేదు. ఆరుగురు మిల్లర్లు 4.15 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి సంబంధించి 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంపై విచారణ చేయించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఫ సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. రంగంలోకి పౌర సరఫరాల శాఖ ఫ సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్కు ఆదేశాలు ఫ ఐదుగురు సభ్యులతో విచారణకు కమిటీ నియామకం ఫ కన్వీనర్గా జిల్లా పౌర సరఫరాల అధికారి -
ఉపాధ్యాయులు.. ఉరుకులు పరుగులు
నల్లగొండ : ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీనుంచి ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదు చేస్తోంది. ఉదయం 9 గంటలకు.. సాయంత్రం 4.15 గంటల తర్వాత రెండు సార్లు ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఉదయం 9 గంటల్లోపే స్కూల్కు వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన ఆన్లైన్లో అటెండెన్స్ రెడ్మార్కు చూపిస్తుండడంతో ముందుగానే పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. సాకులకు ఇక చెక్.. మొన్నటి వరకు ఉపాధ్యాయులు కొందరు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఒకవేళ హెచ్ఎం అడిగితే.. కొందరు ఎదురుతిరిగేవారు. మరికొందరు రాజకీయ నేతల అండతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారు. దేవరకొండ, చందంపేట, డిండి తదితర దూర ప్రాంతాల ఉపాధ్యాయులైతే ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఒకరోజు.. మరొకరు ఇంకోరోజు పాఠశాలకు వెళ్లేవారు. ఇక కొందరైతే ఒకపూటే వెళ్లేవారు. సాయంత్రం 4 గంటలు కాకముందే ఇంటిబాట పట్టేవారు. బస్ల్లో ప్రయాణం చేసే వారి.. బస్లు దొరకడం లేదనే సాకుతో ముందే తోటి ఉపాధ్యాయులకు చెప్పి బడి నుంచి బయటపడే వారు. వీటన్నింటికీ ఎఫ్ఎర్ఎస్ అటెండెన్స్ యాప్ చెక్ పెట్టింది. సెలవులూ ఆన్లైన్లోనే.. ఏ ఉపాధ్యాయుడైన తనకు సెలవు కావాలంటే గతంలో లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా హెచ్ఎంకు చెప్పి తీసుకునేవారు. హెడ్మాస్టర్ సెలవు కాదంటే లీవ్ లెటర్ రాసి స్కూల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ అందుకు కాలం చెల్లింది. సెలవు కావాలనుకునే ఉపాధ్యాయుడు ఈ యాప్లోనే సెలవు పెట్టుకుంటే అది స్కూల్ హెడ్మాస్టర్కు వెళుతుంది. హెచ్ఎం దాన్ని ఆమోదిస్తేనే సెలవు తీసుకోవచ్చు. రిజక్ట్ చేస్తే కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. లేదంటే అతనికి ఆటోమెటిక్గా ఆబ్సెంట్ పడుతుంది. ఫ ఎఫ్ఆర్ఎస్తో అటెండెన్స్తో ఉదయం 9 గంటల్లోపే పాఠశాలకు ఫ నిర్ణీత సమయం దాటితే రెడ్మార్క్ ఫ రెండు పూటలా హాజరుతో డుమ్మా కొట్టేందుకు నోచాన్స్ ఫ మంచి పరిణామం అంటున్న పలువురు టీచర్లు ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వం ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగు పడతాయి. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరవుతారు. విద్యార్థులు కూడా సమయానికి వస్తారు. తద్వార ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం. – రాములు, హెడ్మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ నకిరేకల్ నిర్ణీత సమయం పాఠశాలలో ఉండాల్సిందే.. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి. ఆ పాఠశాల ఆవరణలో ఉండి అటెండెన్స్ వేస్తేనే వారి ఫొటో క్యాప్చర్ అవుతుంది. 9 గంటలకు ఒక్క నిమిషం దాటినా యాప్లో అటెండెన్స్ ప్రజెంట్ అని చూపించినా పక్కన రెడ్మార్కు చూపుతుంది. 9 గంటల్లోపు అయితే గ్రీన్ మార్కు చూపుతుంది. రెడ్ మార్కు చూపితే సమయానికి పాఠశాలకు హాజరు కాలేదని హైదరాబాద్ డీఎస్ఈలోనే నమోదవుతుంది. అలాగే సాయంత్రం 4.15 గంటల లోపు వెళ్లినా హాజరు తీసుకోదు. దీంతో ఉపాధాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. -
నిలిచిన పదోన్నతుల ప్రక్రియ
నల్లగొండ : ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నెల 11వ తేదీ వరకు నిలిపివేయాలని బుధవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గెజిటెడ్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి సీనియార్టి జాబితాను ప్రకటించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. గెజిటెడ్ హెడ్మాస్టర్లకు సంబంధించి 56 ఖాళీలు ఉన్నాయి. అందులో రెండు పాఠశాల్లో విద్యార్థులు లేరు. ఆ రెండు పాఠశాలలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేయనున్నారు. బుధవారం జీహెచ్ఎంలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు తీసుకున్నారు. గురువారం వారికి పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8వ తేదీన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పించేలా షెడ్యూల్ రచించారు. అయితే పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను సరిచూసిన తరువాత ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశిస్తూ.. వెబ్ ఆప్షన్ల ప్రకియను ఈనెల 11వ తేదీ వరకు ఆపాలని సూచించింది.రాములబండ పీహెచ్సీ తనిఖీరామగిరి(నల్లగొండ) : మండలంలోని రాములబండ పీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమం వివరాలు అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోస్టాఫీసులో ఖాతాదారుల ఆందోళనరామగిరి(నల్లగొండ) : నల్లగొండ హెచ్ పోస్టాఫీసు కార్యాలయంలో ఖాతాదారులు బుధవారం ఆందోళన చేశారు. రెండు రోజులుగా సేవలు అందడం లేదని కార్యాలయం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవల కోసం కొత్త సాఫ్ట్వేర్ తీసుకువచ్చారు. సాఫ్ట్వేర్లో లోపాల వల్ల సరిగ్గా పని చేయడం లేదు. సేవలు అందకపోవడం వల్ల ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు. క్రీడలతో మానసిక ప్రశాంతతనల్లగొండ : క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృత్తి రిత్యా నిత్యం మానసిక ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద, కులకర్ణి, శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్, న్యాయవాదులు ప్రసన్నకుమార్, కీసర శ్రీనివాస్రెడ్డి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, నాంపల్లి నరసింహ, నాంపల్లి భాగ్య, కూకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీ రిజర్వాయర్కు ఎగువ నుంచి 2030 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు అధికారులు రెండు క్రస్ట్గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 1,276 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా.. 643 అడుగుల (3.94 టీఎంసీలు)మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 404 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 62 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కట్టంగూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సమగ్ర శిక్షా అభియాన్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏఎస్పీడీ) ఎం.రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె జీసీడీఓ కె.అరుంధతి, డీఈఓ బొల్లారం భిక్షపతితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్ కళాశాల భవనాన్ని, వంటగది, స్టోర్రూం, మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో సమావేశమై పాఠశాలలో నిర్వహిస్తున్న గుణాత్మక విద్యా కార్యక్రమాల అమలుతీరును తెలుసుకున్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి బస చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఎస్ఓ నీలాంబరి ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
తిప్పర్తి : పోలీస్స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను అమ్ముతున్నారని, సెటిల్మెంట్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారని తేలడంతో తిప్పర్తి పోలీస్స్టేషన్లోని ఇద్దరు కానిస్టేబుళ్లు వసీం, ఉపేందర్పై ఎస్పీ శరత్చంద్ర పవార్ సస్పెన్షన్ వేటు వేశారు. సదరు కానిస్టేబుళ్లు ఇటీవ ఒక గుర్తుతెలియని బైక్ను మెకానిక్ వద్ద మరమ్మతు చేయించి ఓ వ్యక్తికి విక్రయించారు. ఆ డబ్బు పంపకాల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య రూ.500 తేడా వచ్చింది. దీంతో విషయం అందరికి తెలిసింది. దీనిపై తిప్పర్తి ఎస్ఐ శంకర్.. ఎస్పీకి నివేదిక పంపారు. విచారణన చేపట్టిన ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరాలిడిండి : ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే చేరాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు అధికారి భీమ్సింగ్ సూచించారు. మంగళవారం డిండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఎంసెట్, నీట్ ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆయన వెంట అధ్యాపకులు ఆంజనేయులు, సంతోష్కుమార్, శ్రీరాములు, హన్మంతు, లింగస్వామి, ప్రేమానందం, జానయ్య తదితరులు ఉన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేయొద్దుఅడవిదేవులపల్లి : విద్యరంగాన్ని నిర్వీర్యం చేయొద్దని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ– ప్రభుత్వ విద్యా పరిరక్షణ’ పేరుతో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవన్నారు. అడవిదేవులపల్లి కేజీబీవీకి ప్రహరి గోడలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణాకు విద్యా శాఖ మంత్రి కూడా లేకుండా పోయాడని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎప్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, స్పందన, రవీందర్ ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ చేయాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల్ల గ్రౌండింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంతో పాటు, లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికస్థోమత లేకపోతే స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం ఇప్పించాలన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటరు జాబితాను ఆధునీకరించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, గనుల శాఖ ఏడీ శామ్యూల్ జాకబ్ పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ విషం చిమ్ముతోంది
నల్లగొండ టూటౌన్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ పేరుతో విషం చిమ్ముతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావుపై కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన.. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, నాయకులతో కలిసి వీక్షించారు. అనంతరం రవీంద్రకుమార్ విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరంపై హరీష్రావు పవర్ పాయింట్ ప్రజెంషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారని తెలిపారు. ప్రాజెక్టులు ఏం జరగకపోయినా జరిగి నట్లు సీఎం రేవంత్రెడ్డి అభూతకల్పన సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని అనుమతులతో గోదావరిపై బ్యారేజ్లు నిర్మించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్ట్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, పూర్తి అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, చీర పంకజ్యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీపోర్టుకు.. సీఎంఆర్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వానికి రావాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పక్కదారి పడుతోంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించి మిల్లర్లు కొందరు సీఎంఆర్ ఇవ్వకుండా ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి విదేశాల్లో విక్రయించి రూ.కోట్లు అర్జిస్తున్నారు. జిల్లాలోని ఆరు మిల్లులు సీఎంఆర్ పక్కదారి పట్టించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. ఈ అక్రమాన్ని నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. మిల్లుల్లో లేని 4.15 లక్షల క్వింటాళ్ల ధాన్యం జిల్లాలోని ఆరు మిల్లుల్లో 4.15 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం మిల్లుల నుంచి మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. గత జనవరిలో అధికారులు ఆయా మిల్లుల్లో తనిఖీ చేసినప్పుడు కూడా ధాన్యం క్షేత్రస్థాయిలో లేవని తేలింది. ఆ ధాన్యానికి సంబంధించిన 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యం కాకినాడ పోర్టుకు తరలినట్లు తెలిసింది. 15 రోజుల్లో సీఎంఆర్ ఇవ్వాలి.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే, ఆ ధాన్యం అందిన 15 రోజుల్లో మిల్లర్లు వాటిని మర ఆడించి సీఎంఆర్ కింద తిరిగి సివిల్ సప్లయ్ శాఖకు క్వింటా ధాన్యానికి 68 కిలోల బియ్యాన్ని అందించాలి. కానీ జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు చెందిన ఆరు మిల్లుల యజమానులు ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించినట్లు తెలిసింది. దీనిపై గతంలోనే అధికారులకు ఫిర్యాదులు అందినా, తనిఖీల్లో ధాన్యం లేదని తేలినా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. రూ.కోట్ల రూపాయల సీఎంఆర్ ఏళ్ల తరబడి ప్రభుత్వానికి ఇవ్వకున్నా స్పందించకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆరు మిల్లులపై ఎన్నో ఆరోపణలు ● జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలానికి చెందిన ఓ మిల్లుకు 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి సీఎంఆర్ కోసం 1,18,132 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వగా, 30,450 క్వింటాళ్ల బియ్యం ఇచ్చింది. అయితే గతేడాది ఆ మిల్లుల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేయడంతో 13,789 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుదారుడు తీసుకెళ్లారు. ఇంకా మిల్లులో 59,539 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉన్నా అక్కడ లేనట్లు తెలుస్తోంది. ● నల్లగొండకు చెందిన ఓ మిల్లుకు కేటాయింపు, ఇచ్చింది పోగా, ఇంకా 3,17,492 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉన్నా అక్కడ 2,39,381 క్వింటాళ్లే ఉందని, 78,110 క్వింటాళ్ల ధాన్యం మాయం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ● మునుగోడుకు చెందిన ఓ మిల్లులోనూ 4,500 క్వింటాళ్ల ధాన్యం, నల్లగొండలోని ఇంకో మిల్లులో ఉండాల్సిన 34,622 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టించారని తెలుస్తోంది. ● నల్లగొండకు చెందిన మరో మిల్లులోనూ 1,59,803 క్వింటాళ్లు, మరో మిల్లులో 79,133 క్వింటాళ్ల ధాన్యం ఉండాల్సి ఉన్నా, దానిని ఆయా మిల్లులు పక్కదారి పట్టించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యం కాకినాడకు తరలింపు ఫ జిల్లాలోని ఆరు మిల్లుల్లో అక్రమాలు ఫ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందిన ఫిర్యాదు ఫ విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ బియ్యం అమ్ముకుంటున్న మిల్లులు జిల్లాలో పలు మిల్లులు ఇప్పటికే పీడీఎస్ బియ్యం దందా చేస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి అండదండలతోనే 2022–23 నుంచి 2024–25 యాసంగి సీజన్ వరకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోగా, అందులో కొంత వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ధాన్యాన్ని కూడా అప్పగించకుండా, డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం చేకూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ధర్నా
నల్లగొండ : ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. విద్యలో కార్పొరేట్ శక్తులను నియంత్రించకపోవడం వల్ల సామాజిక అంతరాలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చి హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 23న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. కార్యక్రమంలో యూఎస్పీఎస్సీ నాయకులు బక్క శ్రీనివాసచారి, రత్నయ్య, వెంకటేశం, జి.నాగమణి, పెరుమాళ్ల వెంకటేశం, పి.వెంకులు, ఖుర్షిద్మియా, నర్రా శేఖర్రెడ్డి, వడ్త్యా రాజు, జి.అరుణ, యాట మధుసూదన్రెడ్డి, మురళయ్య, పగిల్ల సైదులు, కొమర్రాజు సైదులు, గణేష్, అంజయ్య, లక్ష్మయ్య, జగతి పాల్గొన్నారు. -
గుణాత్మక విద్య అందించాలి
మర్రిగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆమె మర్రిగూడలోని కేజీబీవీని సందర్శించి పాఠశాలలో పారిశుద్ధ్యం, విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని అంతేకాకుండా నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థినులకు పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అంతకుముందు మర్రిగూడలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్, ఇతర విభాగాలను పరిశీలించి ఓపీ, ఐపీ, ఏఎన్సీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శంకర్నాయక్, ఎస్ఓ జ్యోతి, వైద్యురాలు శాలిని, హరిప్రియ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
కొత్త డిజైన్ అవార్డు తెచ్చింది
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను శంకర్ లెనిన్ డబుల్ ఇక్కత్ చీర తయారుచేశారు. లెనిన్ డబుల్ ఇక్కత్ చీర నేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ చీర 15 షేడులు, సున్నితమైన దారాలతో రంగు వెలిసిపోని చీర. ఈ చీర డిజైన్ కోసం సంవత్సరం కాలం పట్టిందని శంకర్ తెలిపారు. చీర తయారీకి రూ.50వేలు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన 30సంవత్సరాల అనుభవంలో ఎన్నో రకాల చీరలు తయారు చేశానని, కానీ అవార్డు కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఈ చీరకు దరఖాస్తు చేసుకోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
మన చేనేత.. ఘనత
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు 13 మంది చేనేత కార్మికులు ఎంపికజాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేతలో విశేష ప్రతిభ కనబర్చిన కళాకారులను ప్రతి యేటా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సత్కరిస్తోంది. ఈ అవార్డుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పుసర్కరించుకుని హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చేతులమీదుగా వారు రూ.25వేల నగదు పురస్కారం, మెమొంటో, ప్రశంసా పత్రం అందుకోనున్నారు. జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా మడ్తాస్ ఇక్కత్ చీర భూదాన్పోచంపల్లి: పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు మంగళపల్లి శ్రీహరి వినూత్న డిజైన్లతో మడ్తాస్ ఇక్కత్ చీరను రూపొందించి ఉత్తమ వీవర్గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు, రిపిట్ లేకుండా ఆరు వరుసల్లో వైట్ బేస్ చీరలో ప్రకృతి అందాలతో పరవశించి నృత్యం చేస్తున్న అంబారీ, నెమలిని రూపొందించారు. అంతేకాక మధ్యమధ్యన మన తెలంగాణ పండుగను ప్రతిబించేలా బతుకమ్మ, పద్మాల డిజైన్లను వేశారు. డిజైన్లు స్పష్టంగా కన్పించేలా వైట్ బేస్ చీరలో ఆనంద, బ్లాక్, మెరూన్, పసుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించారు. డిజైన్లును రూపొందించడం, వాటిని గ్రాఫ్పై గీయడం, అందుకనుగుణంగా చిటికి కట్టడం, మగ్గం నేయడం కోసం మూడు నెలలు కష్టపడినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆయన నాలుగు మగ్గాలను పెట్టి నాలుగు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితంగట్టుప్పల్: గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు గుర్రం యాదయ్య గత 50 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. చేనేతలో కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తేనే మార్కెట్లో మంచి ఆదరణ ఉంటుందని గుర్తించి.. తన భార్య జయమ్మ సహకారంతో పోచంపల్లి డబుల్ ఇక్కత్ మల్బరీ సిల్క్తో వైరెటీ చీర తయారు చేశారు. ఇందుకు గాను ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. నలభై ఏళ్ల అనుభవానికి గుర్తింపు వలిగొండ: మండలంలోని గొల్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు చల్లమల్ల కృష్ణ కొండా లక్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. గత 40 ఏళ్లుగా చేనేత కళాకారుడిగా పనిచేస్తున్న ఆయన తెల్ల రుమాల్, డబుల్ ఇక్కత్ 100% కాటన్ చీరలు నేస్తున్నారు. తన అనుభవానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తనను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన అన్నారు. అవార్డుకు ఎంపికై న కృష్ణను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.డబుల్ ఇక్కత్ చీర నేస్తున్న చిట్టిప్రోలు ధనుంజయ్య త్రీడీ ఎఫెక్ట్తో రూపొందించిన చీర సంస్థాన్ నారాయణపురం:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామానికి చెందిన సామల భాస్కర్ ఎంపికయ్యారు. భాస్కర్ తన 33 సంవత్సరాల చేనేత అనుభవంతో త్రీడీ ఎఫెక్ట్ ఉండేలా కొత్త డిజైన్తో చీరను రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే.. భాస్కర్ 1450 మెట్లతో నెమలి దేవత ఆకృతులతో గ్రాఫిక్ డిజైన్తో రూపొందించారు. నిలువు, 4అచ్చెలతో ప్యూర్ సిల్క్ చీరను 10 నెలల్లో తయారు చేశారు. ఈ చీర తయారీకి 7 రంగులను వాడినట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య విజయలక్ష్మి సహకారంతో కొత్త చీరను రూపొందించానని, దానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని భాస్కర్ తెలిపారు. ఈ అవార్డుతో తమ చీరకు మార్కెటింగ్ ఏర్పడి తమ జీవనపాధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీర..చిట్యాల: చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు చిట్టిప్రోలు ధనుంజయ్య మగ్గంపై నేసిన పోచంపల్లి డబుల్ ఇక్కత్ తరహాలోని చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధనుంజయ్యకు అవార్డు రావటం పట్ల చిట్యాల మండలానికి చెందిన పలువురు పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు. డిజైనింగ్లో ప్రతిభ గట్టుప్పల్: చేనేత చీరల డిజైనింగ్లో ప్రతిభ కనబర్చిన గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన గాజులు అనిల్ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు ఎంపికయ్యారు. ఆయన 2012 నుంచి పోచంపల్లి ఇక్కత్(జకార్డ్) చీరల బార్డర్లపై అన్ని రంగులతో డిజైన్లు వేస్తున్నారు. ఈ చీరలకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అనిల్ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అనిల్కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
108 డిజైన్లు.. 29 రంగులు
గట్టుప్పల్: ఎంతో శ్రమించి 108 డిజైన్లు, 29 రంగులతో చీరను తయారుచేశారు గట్టుప్పల్కు చెందిన కర్నాటి కృష్ణయ్య. ఆయన గత 40 ఏళ్లుగా చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేనేతలో కొత్తదనం సృష్టించాలనే తపనతో కృష్ణయ్య ఏడాది క్రితం 108 డిజైన్లు, 29 రంగులతో చీర తయారు చేయడం ప్రారంభించారు. నెలరోజుల క్రితం ఈ చీర తయారీ పూర్తయ్యింది. క్వాలిటీ, కలర్స్, డిజైన్స్ను పరిశీలించిన చేనేత శాఖ అధికారులు కృష్ణయ్యను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్నేళ్ల తన కష్టానికి సరైన గుర్తింపు దక్కడంతో కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నతనం నుంచే జీతమున్నా..
చండూరు: చండూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన అవ్వారి రవీందర్ తయారు చేసిన ఇక్కత్ రాజ్కోట్ చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఇవి వేరే దేశాలతో పాటు రాజస్తాన్, అహ్మదాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మగ్గం పనిచేసే వారి వద్ద జీతం ఉన్నానని, ఆ తర్వాత బొంబాయికి వలస వెళ్లి అక్కడ పదేళ్లు ఉండి సాంచన్లు నడిపి తిరిగి కొండాపురం గ్రామం వచ్చినట్లు రవీందర్ తెలిపారు. కొత్తగా వచ్చే డిజైన్లను గమనించి చీరలు తయారు చేయడం తనకు అలవాటని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందటే 5 మగ్గాలతో చీరలు నేయించినట్లు వివరించారు. ప్రసుత్తం తనకు 69 ఏళ్లని, ఇన్నేళ్లకు తనకు గుర్తింపు లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
మూడేళ్లు.. ముగ్గురు అన్నదమ్ములకు అవార్డులు
చండూరు: చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి శ్రీనివాసులు సహజ సిద్ధమైన రంగులతో డబుల్ ఇక్కత్ దుపట్టాను తయారు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి క్రిష్ణయ్య 2023లో, తమ్ముడు చిలుకూరి ధనుంజయ 2024లో కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబుల్ ఇక్కత్ పైనే ప్రావీణ్యం సంపాదించారు. మూడేళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబుల్ ఇక్కత్ వస్త్రాలు నేసినా ఆ తర్వాత నుంచి సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది. దుపట్టా తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందని, శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై ముడి సరుకులు ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహిస్తే ఉత్పత్తిని పెంచి తక్కువ ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. -
పదహారు ఆకృతులతో తేలియా రుమాల్పై..
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్ పదహారు ఆకృతులతో తేలియా రుమాల్ అనే వస్త్రంతో చీర తయారుచేసి కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ చీర బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్తో పాటు అనేక డిజైన్లతో కూడి ఉంటుంది. మడతలు పడకుండ మృదవైన పట్టును వాడినట్లు ఆయన తెలిపారు. రంగు వెలవని ఈ చీర తయారీకి రూ.75వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే చీరకు ఆయన జాతీయ చేనేత అవార్డు కూడా అందుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం
● ఇబ్బందులు పడిన వాహనదారులుచౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట గ్రామంలో ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి నల్లగొండ వైపు నుంచి సిమెంట్ లోడ్తో హైదరాబాద్కు వెళ్తున్న లారీ తూప్రాన్పేట గ్రామంలో హైవేపై మరమ్మతులకు గురైంది. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను పంపించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడంతో మధ్యాహ్నం వరకు తూప్రాన్పేట గ్రామంలో హైదరాబాద్ వెళ్లే వైపు సుమారు 2 కి.మీ. మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని రోడ్డు పక్కకు తొలగించడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలిలాయి. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణంచివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బైక్ వస్తున్న కానిస్టేబుల్ ట్రాక్టర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్ తండా గ్రామానికి చెందిన ధరావతు సోమాని(55) సూర్యాపేట సబ్ జైలులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్పై సూర్యాపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం వద్ద మండల కేంద్రం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. వెనుక నుంచి బైక్పై వస్తున్న సోమాని అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న మరో బైక్ సోమాని పైనుంచి వెళ్లడంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదబాద్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వి. మహేశ్వర్ తెలిపారు. రైలు ఢీకొని వృద్ధురాలు మృతివలిగొండ: వలిగొండ మండలం ఏదుళ్లగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజపూర్కు చెందిన గుళ్ళని పోచమ్మ (90) ఏదుళ్లగూడెంలో తన బంధువుల ఇంటికి వస్తుండగా.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచి ఉండడంతో బ్రిడ్జి పైనుంచి రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
విద్యుత్ మోటార్ల చోరీ నిందితుల రిమాండ్
కట్టంగూర్: దొంగిలించిన విద్యుత్ మోటార్లను ట్రాలీ ఆటోలో హైదరాబాద్కు తరలిస్తుండగా కట్టంగూర్ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో నల్లగొండ ఏఎస్పీ జి. సురేష్, మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణానికి చెందిన ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య, గోపగాని రమేష్, ఆవుల రాజాలు, నాగిళ్ల ఎల్లయ్య కలిసి ఇటీవల కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ శివారులోని వెంకటేశ్వర డెయిరీ ఫాం వద్ద, అయిటిపాముల గ్రామ శివారులో, శాలిగౌరారం మండల పరిధిలో వ్యవసాయ బావులు, ఫాంహౌజ్ల వద్ద విద్యుత్ మోటార్లు, పైపులు చోరీ చేశారు. చోరీ చేసిన విద్యుత్ మోటార్లు, పైపులను ఆటోలో హైదరాబాద్కు తరలిస్తుండగా.. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 14 విద్యుత్ మోటార్లు, 33 బోర్ పైపులు, 8 బ్యాటరీలు, రాగి వైరు, మంచం, రెండు సీలింగ్ ఫ్యాన్లులు, రెండు కుర్చీలు, ఫ్రిజ్, చోరీకి ఉపయోగించిన ట్రాలీ ఆటో, రూ.1,74,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అంతేకాకుండా నిందితుల ఇంటి వద్ద ఉన్న మిగతా వస్తువులను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్తో పాటు ఐదుగురు నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించినట్లు తెలిపారు. ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య మూడేళ్ల క్రితం తిప్పర్తి మండల పరిధిలో ఆగి ఉన్న రైలు బోగీ నుంచి 39 బ్యాటరీలను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ విలేకరు సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కొండర్రెడ్డి, ఎస్ఐ మునుగోటి రవీదర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నకిరేకల్ పట్టణంలో కార్డెన్ సెర్చ్
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 300మంది పోలీస్ సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తాటికల్ రోడ్డులోని ఎస్సీ కాలనీ, వడ్డెర కాలనీ, మొండివారి కాలనీల్లోని ఇళ్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటల వరకు ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, గంజాయి అనుమానితులను, వివిధ కేసుల్లో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ ముగిసిన తర్వాత నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ నకిరేకల్కు చేరుకుని తాటికల్ రోడ్డులోని ఎస్సీ కమ్యూనిటీ హల్ నందు ఉంచిన పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ముందుస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగానే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలను సమన్వయం చేస్తూ శాంతిభద్రతలను కాపాడటం కోసం కార్డెన్ సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డెన్ సెర్చ్లో సరైన ధ్రువపత్రాలు లేని 130 బైక్లు, 10 ఆటోలు, మరో 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 8 మంది పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 18 మంది గంజాయి అనుమానితులను కూడా పట్టుకున్నామన్నారు. ముగ్గురు నేపాల్ దేశస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఒక షెడ్డులో 15 గోవులను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఆయా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం, చండూరు, నల్లగొండ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల సీఐలు కొండల్రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, వివిధ మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. 300 మంది పోలీసులతో సోదాలు 250 ద్విచక్ర వాహనాలు స్వాధీనం గంజాయి అనుమానితుల అరెస్ట్ పాత నేరస్తుల గుర్తింపు -
న్యూ మ్యాట్రిక్ టిల్ శారీ ఎంతో స్పెషల్
చండూరు: న్యూ మ్యాట్రిక్ టిల్ ఇక్కత్ విధానంలో చీర నేసి చండూరు మండల కేంద్రానికి చెందిన కర్నాటి సద్గురు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ స్పెషల్ ఇక్కత్ చీర నేసేందుకు ఐదు నెలల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. డిజైన్ ఫైనల్ చేయడం, మగ్గంపై డిజైన్ నూలుపై సెట్ చేయడానికే రెండు నెలల సమయం పట్టిందన్నారు. 25 ఏళ్లుగా మగ్గం నేస్తున్నానని, తనకున్న అనుభవంతో కొత్త డిజైన్లతో చీరలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ చీర ధర రూ.25వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తరహా చీర నల్లగొండ జిల్లాలో తానొక్కడినే చేశానని, అంత ప్రత్యేకం కాబట్టే అవార్డుకు ఎంపికై ందని ఆయన తెలిపారు. సబ్సిడీ ముడి సరుకుల డిపో నల్లగొండ లేదా చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సాగర్లో తెలంగాణ లోకాయుక్త
నాగార్జునసాగర్ : తెలంగాణ లోకాయుక్త ఏ.రాజశేఖర్రెడ్డి సోమవారం నాగార్జునసాగర్కు వచ్చారు. స్థానిక విజయవిహార్లో పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ దండ శ్రీనివాసరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. వారి వెంట సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ ముత్తయ్య ఉన్నారు. 23.1 మిల్లీమీటర్ల వర్షంనల్లగొండ టౌన్ : అల్పపీడన ద్రోణి కారణంగా 30 మండలాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 23.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకిరేకల్ మండలంలో 76.1 మిల్లీమీటర్లు, కట్టంగూర్లో 60.8, అత్యల్పంగా దేవరకొండ మండలంలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చిట్యాల మండలంలో 31.8, నార్కట్పల్లి 23.7, శాలిగౌరారం 36.5, కేతేపల్లి 48.0, తిప్పర్తి 45.3, నల్లగొండ 39.7, కనగల్ 9.6, మునుగోడు 31.0, చండూరు 7.8, మర్రిగూడ 11.6, నాంపల్లి 7.8, గుర్రంపోడు 31.7, అనుముల హాలియా 39.6, నిడమనూరు 21.0, త్రిపురారం 17.6, మాడ్గులపల్లి 12.6, వేములపల్లి 9.1, మిర్యాలగూడ 5.2, దామరచర్ల 26.8, అడవిదేవులపల్లి 46.3, తిరుమలగిరి సాగర్ మండలంలో 46.8, పెద్దవూర 37.0, పెద్దఅడిశర్లపల్లిలో 5.5, గట్టుప్పల్ మండలంలో 23.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో..
ముమ్మరంగా వరి నాట్లు ఫ ఐదు రోజుల క్రితం 1.25 లక్షల ఎకరాల్లోనే సాగు ఫ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో ఇప్పుడు 2.25 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి ఫ నెలాఖరు వరకు మరో 3లక్షల ఎకరాల్లో సాగు కానున్న వరి సాగు అంచనా ఇలా.. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో మొత్తం 11.60 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 5,47,735 ఎకరాలు, వరి 5,25,350 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు పత్తి 5,42,641ఎకరాల్లో, వరి 2,25,284 ఎకరాల్లో, కంది 1,541, మినుము 16, పెసర 166, ఎకరాల్లో ఇతర పంటలు కలిపి ఇప్పటివరకు 7,69,073 రైతులు సాగు చేశారు. వరి సాగు ఇంకా మూడు లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం ఉంది. నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం వరకు కేవలం 1.25 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేసుకున్నారు. నాగార్జునసాగర్ ఎడమకాల్వకు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువకు, వరద కాలువకు, మూసీ కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరినాటు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే రైతులు లక్ష ఎకరాల్లో నాట్లు వేసుకోవడం విశేషం. ఇప్పటివరకు రెండు 2,25,254 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు మరో మూడు లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసుకోనున్నారు. నాన్ ఆయకట్టులో 90 శాతం పూర్తి.. జిల్లాలోని నాన్ ఆయకట్టు మండలాల్లో ఇప్పటికే 90 శాతం వరకు వరినట్లు పూర్తికాగా ఆయకట్టు ప్రాంతంలో 30 శాతం మాత్రమే రైతులు వరినాట్లు వేసుకున్నారు. ఈ సారి ఆయకట్టు ప్రాంతంలో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి అంచనాకు నుంచి వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. రైతులను వేధిస్తున్న కూలీల కొరత.. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్లో వరినాట్లకు కూలీలు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చత్తీస్గడ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందిన మగ కూలీలతో రైతులు వరినాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు రూ.4 వేల నుంచి 5 వేల వరకు కూలీ చెల్లించాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు యాంత్రికరణ పద్ధతిన సాగు చేసుకుని ఖర్చు తగ్గించుకుంటున్నారు. అధికారుల సూచనలు పాటించాలి ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు 3.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసుకునే అవకాశం ఉంది. రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు వెదజల్లే, డ్రమ్ సీడర్, యంత్రాలు సాగు పద్ధతులను ఎంచుకోవాలి. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలి. – పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ -
నలుగురి అరెస్ట్
బైక్ల నంబర్ ప్లేట్స్ మారుస్తూ గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని నార్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.- 8లోపోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణనల్లగొండ : గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. -
ఆర్అండ్బీ అతిథి గృహంగా మార్చాలి
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్అండ్బీ భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్గా మార్చుకోవడం సిగ్గుచేటని, వెంటనే ఆర్అండ్బీ అతిథి గృహంగా మార్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి మెప్పు కోసం కోమటిరెడ్డి తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశాడు. ఎంతో మంది ప్రముఖులు బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్గా మార్చుకోవడం మూర్ఖత్వం కాదా అని ప్రశ్నించారు. 500 మంది విద్యార్థులకు భోజనాలు పెట్టి 5 వేల మందికి పెట్టించానని ఫోన్లో సీఎంతో చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, వారు ఎప్పుడు ఏం మాట్లాడుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజుయాదవ్, పోతెపాక సాంబయ్య, పోతెపాక లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి -
సమస్యలపై ప్రజా ఉద్యమాలు
నల్లగొండ టౌన్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం నల్లగొండలో జరిగిన ఆ పార్టీ జిల్లా విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఉద్యమించాలన్నారు. ఈ నెల 6 నుంచి15 వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటనలు, ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంతకాల సేకరణ, 20 నుంచి 30వ తేదీ వరకు అధికారులకు వినతులు, గ్రామ పంచాయతీల వద్ద ధర్నాలు చేయాలన్నారు. సెప్టెంబరు 1నుంచి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి చైతన్యం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం తమకు ఓటు వేయని ముస్లిం మైనార్టీల పౌర సత్వాలను రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్లు తొలగిస్తోందని ఆరోపించారు. బిహార్ ఎన్నికల వేళ 65 లక్షల ఓట్లను తొలగించారని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన ధైర్యం మోదీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, శ్రీశైలం, లక్ష్మీనారాయణ, సయ్యద్ హశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
విద్యాహబ్గా తీర్చిదిద్దుతాం
నల్లగొండ : నల్లగొండ జిల్లాను విద్యాహబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ సమీపంలోని గంధంవారిగూడెంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని తీర్చిదిద్దాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలన్నారు. నల్లగొండలో బాలురకు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్లగొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను 25 ఎకరాలలో నిర్మించనున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు మంచి స్థలాన్ని గుర్తించడం జరిగిందని త్వరలోనే అక్కడ శంకుస్థాపన చ,ఏస్తామన్నారు. టీజీఈడబ్ల్యూఎంఐడీసీ ఈఈ బాలప్రసాద్ నల్లగొండలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల వివరాలను తెలియజేశారు. క్యాంపు కార్యాలయం అందరిది.. నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అందరిదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని క్లాక్టవర్ సెంటర్లో రూ.13 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్యాంపు కార్యాలయాన్ని ఆధునాతన సౌకర్యాలతో నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లగొండ వచ్చినప్పుడు ఉండేలా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామన్నారు. ఈ కార్యాలయానికి ‘ఇందిర భవన్’గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, పోలీస్స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మొదటి ఫైల్పై సంతకం చేశారు. నార్కట్పల్లి పెద్ద చెరువును కూడా నీటితో నింపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.1.20 కోట్లతో నిర్మించనున్న బ్రాహ్మణవెల్లెంల గ్రామపంచాయతీ భవనం దక్షిణ భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో చింతపల్లి, నందిపాడులో రెండు బ్రిడ్జిలను హామ్ విధానంలో చేపట్టనున్నామని, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రధాన రహదారి నుంచి వైటీపీఎస్కు రోడ్డు నిర్మాణానికి రూ.260 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, భూసేకరణకు రూ. 31 కోట్లను విడుదల చేసామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఈవో భిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆఫీస్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు రాగా వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 56, జిల్లా అధికారులకు సంబంధించినవి 43 ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు దీనిపై దృష్టి పెట్టి పథకాలు వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్య, వైద్యం, స్థానిక పరిపాలన అంశాల్లో మండలాల ప్రత్యేక అధికారులది కీలకపాత్ర అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓలు వై.అశోక్రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్. నరసింహరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా కోర్సులో చేరడానికి ఆసక్తి కలగి.. ప్రవేశపరీక్ష రాసి సీటు పొందని వారు, ప్రవేశపరీక్ష రాయకుండా డైరెక్ట్గా చేరాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాను 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో స్వీకరించి, సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచి సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 8వ తేదీన 10 గంటల నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 13న రైతు పోరాట యాత్రనల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భారత్ కిసాన్ సభ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రైతు పోరాట యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మోయినోద్దీన్, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, బిల్లా కనకయ్య, రంగారెడ్డి, బండమీద వెంకన్న, బొర్ర శేకర్, దోటి పాండరి, వెంకట్రెడ్డి, శాంత, బండమీద యాదయ్య, అంజల్రావు, పాండు, దేవేందర్, కాంతారావు, శ్రీశైలం పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది : చిరుమర్తినార్కట్పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పత్రిక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్పై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన సీఎం రేవంత్రెడ్డి దాసోహమై నీటిని ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చెరువులన్నీ నీటితో కళకళలాడేవని.. ఇప్పుడు మట్టిని అమ్ముకునేందుకు చెరువులను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. గొర్రెల పంపిణీలో అవకతవకలపై విచారణ నల్లగొండ టౌన్ : గత ప్రబుత్వ హయాంలో రాయితీ గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై నల్లగొండలో సోమవారం నుంచి విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల ఆస్పత్రుల్లో వెటర్నరీ డాక్టర్లను కలువడంతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 28,236, రెండో విడతలో 5,696 యూనిట్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, గొర్రెల మందలేనివారు, గొర్రెలకు బదులు డబ్బులు తీసుకున్నట్లు, గొర్రెలు పంపిణీ చేయకుండా కేవలం ఫొటోలు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే గొర్రెలు తెచ్చిన వాహనాల నంబర్లు, రికార్డుల్లోని వాహనాల నంబర్లక సరిపోలక పోవడం గమనార్హం. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండు విడతలుగా పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించిన రికార్డులను గత సంవత్సరం రాష్ట్ర విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు తీసుకెళ్లిన విషయం విదితమే. -
నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8.15 గంటలకు నల్లగొండకు చేరుకుని రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు. ప్రశాంతంగా టీటీసీ పరీక్షలునల్లగొండ : నల్లగొండలో ఆదివారం నిర్వహించిన టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ మహ్మద్ యూసుపుద్దీన్, కోర్సు కోఆర్డినేటర్ కొమ్ము శ్రీనివాసు తెలిపారు. దేవరకొండరోడ్డులోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టైలరింగ్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 199 మంది, సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్ పరీక్షకు 250 మంది హాజరైనట్లు వెల్లడించారు. బుద్ధవనాన్ని సందర్శించిన నటి యముననాగార్జునసాగర్ : సినీనటి యమున ఆదివారం బుద్ధవనాన్ని సందర్శించారు. పది రోజులుగా నాగార్జున విపస్యన ధ్యాన కేంద్రంలో జరిగే విపస్యన కోర్సుకు హాజరయ్యారు. కోర్సు పూర్తికావడంతో బుద్ధవనాన్ని సందర్శించారు. మహా స్థూపంలోని పంచముఖ బుద్ధుడి వద్ద జ్యోతి వెలిగించారు. నిర్వాహకులు రవిచంద్ర ఆమెను పంచశీల కండువాతో సత్కరించారు. అనంతరం గైడ్ సత్యనారాయణ మహాస్థూపం, ధ్యానవనం, జాతకపార్కు విశేషాలను వారికి వివరించారు. సమావేశ మందిరంలో బుద్ధవనం లఘు చిత్రాన్ని వీక్షించారు. కేంద్ర పథకాలపై ఇంటింటి ప్రచారంరామగిరి (నల్లగొండ): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఆదివారం మండలంలోని వెలుగుపల్లి పోలింగ్ బూత్లో ఆ పార్టీ స్థానిక ఎన్నికల జిల్లా ప్రభారి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటికి తిరిగి కేంద్ర పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, పోతేపాక లింగస్వామి, బోగరి అనిల్కుమార్, బాకి నర్సింహ, సురుకంటి వెంకట్రెడ్డి, చింతపల్లి వెంకన్న, పోతెపాక శంకర్, కొప్పోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెన్షన్పెన్పహాడ్ : భూ తగాదాలో ఇద్దరిపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఆదివారం పెన్పహాడ్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన శానం వెంకటేశ్వర్లు కుమారులు శానం లక్ష్మణ్రావు, నాగేంద్రబాబు అన్నెపర్తి 12వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 3న పెన్పహాడ్ మండలంలోని లింగాల గ్రామ శివారులో గల వ్యవసాయ భూమి విషయంలో శానం రామలింగయ్య, ఆయన కుమారుడు భరత్పై సైకిల్ చైన్లు, గొడ్డలితో హెడ్కానిస్టేబుళ్లు దాడిచేసి గాయపరిచారు. ఈ విషయమై బాధితుడు రామలింగయ్య పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన ఎస్ఐ గోపికృష్ణ నివేదికను ఎస్పీకి అందజేశారు. ఎస్పీ ఆ నివేదికను 12వ బెటాలియన్ కమాండెంట్కు పంపారు. దీంతో దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుళ్లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు 12వ బెటాలియన్ కమాండెంట్ తెలిపారని డీఎస్పీ వివరించారు. యాదగిరి క్షేత్రంలో కోలాహలంయాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం, పరిసరాలు సందడిగా మారాయి. వేకుజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. ఆ తరువాత గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తును అభిషేకం, సహస్రనామార్చనలతో కొలిచారు. సా యంత్రం వెండిజోడు సేవను ఆలయంలో భక్తు ల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామికి శయనోత్సవం నిర్వహించి ద్వారబంధనం చేశారు. -
హైవే అధ్వానం
చిట్యాల, నార్కట్పల్లి : హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది. నల్లగొడ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి మండలాల పరిధిలో ఈ హైవేపై గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రెండు మీటర్ల పొడవు మేర రోడ్డు పొరలు లేచిపోయాయి. ముఖ్యంగా చిట్యాల పట్టణ శివారులో, పెద్దకాపర్తి గ్రామ శివారులో, నార్కట్పల్లి ఫ్లై ఓవర్ వద్ద ఈ రోడ్డు ఎక్కువగా దెబ్బతిని వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా ఈ రోడ్డుపై ఫీటు మేర అక్కడక్కడ గుంతలు పడ్డాయి. వీటి మీదుగా ప్రయాణించే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. జాతీయ రహదారిపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో జీఎంఆర్ సంస్థ రోడ్డు నిర్వహణ బాధ్యత చూసుకుంది. ప్రస్తుతం టోల్గేట్ నిర్వహిస్తున్న నేషనల్ హైవే అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతోనే రోడ్డు ధ్వంసమవుతోంది. సంబంధిత అధికారులు పర్యవేక్షించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కాల్వకట్ట తవ్వేస్తున్నారు!
ఫ రైల్వే పనుల కోసం కాల్వ మట్టి తరలింపు ఫ పట్టించుకోని అధికారులు ఫ కట్టలు బలహీన పడే ప్రమాదం మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ తవ్విన సమయంలో కాల్వ తవ్వకాల మట్టిని కాల్వ పటిష్టత కోసం ఇరువైపులా నింపి ఉంచారు. ఆ మట్టిని ఇప్పుడు మిర్యాలగూడ మండలంలో రైల్వే పనుల కోసం అక్రమంగా తవ్వుతున్నారు. రోజుకు లారీల కొద్దీ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. దీని కారణంగా కాల్వ కట్ట బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం ఎడమకాల్వకు నీటిని విడుదల చేయడం వల్ల కాల్వ కట్ట బలహీనపడి గండి పడే ప్రమాదం కూడా ఉంది. టిప్పర్లతో తరలింపు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని బీబీనగర్– నల్లపాడు, కుక్కడం– విష్ణుపురం వరకు 55 కిలోమీటర్ల మేర రెండవ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రైల్వే లైన్కు కింది భాగాన అవసరమైన మట్టిని సదరు కాంట్రాక్టర్ కొనుగోలు చేసి తరలించాల్సి ఉంది. కానీ మిర్యాలగూడ మండలంలోని రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో వాటర్ ట్యాంక్ తండా, మైసమ్మకుంటతండా, ఐలాపురం, చిల్లాపురం, నందిపాడు శివారులో ఎన్ఎస్పీ కాల్వ కట్ట మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లలో నింపి పగలు రాత్రి తేడా లేకుండా వందల టిప్పర్ల మట్టి తరలిస్తున్నారు. కోట్లు విలువల చేసే మట్టి తరలిపోతున్నా ఎన్ఎస్పీ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం రైల్వే పనులకు గాను ఎన్ఎస్పీ కాల్వ కట్ట మట్టిని తరలించే విషయం మా దృష్టికి రాలేదు. మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. కాల్వ కట్టల మట్టిని తరలించే అధికారం ఎవరికీ లేదు. మేము కూడా ఎవరికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై విచారించి తక్షణమే చర్యలు తీసుకుంటాం. – వెంకటయ్య, ఎన్ఎస్పీ ఈఈ -
బ్యాకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చిట్యాల : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు భద్రతతో కూడిన మెరుగైన బ్యాకింగ్ సేవలతోపాటు బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అమర రామమోహన్రావు కోరారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి నిర్వహించిన జన సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తుల ద్వారా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా యాబై కోట్ల మంది జీరో బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈ బ్యాంకు ఖాతాదారులు ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగాను తప్పనిసరిగా పదేళ్లకోసారి రీ–కేవైసీ చేయించుకోవాలని, ఖాతాదారులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బీమా పథకాలను అతి తక్కువ ప్రీమీయంతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ డిజిటల్ బ్యాకింగ్ సిస్టమ్ను మరింత పెంపొందించాలని, వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులకు తెలియజేయవద్దని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు నెట్వర్క్ ఇన్చార్జి జనరల్ మేనేజర్లు రవికుమార్వర్మ, సతీష్కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియభ్రత మిశ్రా, డీసీఎం కే.శివక్రిష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్, చిట్యాల బ్రాంచి మేనేజర్ సతీష్కుమార్ పాల్గొన్నారు. ఫ ఎస్బీఐ ఎండీ అమర రామమోహన్రావు -
బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించబోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీసీ జాబితాలో ముస్లింలను కలిపారనే నెపంతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ వైఖరి మార్చుకోకపోతే వారి పర్యటనలను అడ్డుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల రెండో వారంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో చర్చించడానికి బీజేపీ నాయకులు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం , సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎక్కడైనా సరే అని ఆయన ఛాలెంజ్ చేశారు. అవసరమైతే హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చకు కూడా సిద్ధమే అన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి మోదీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓసీ అయి కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాసోజు విశ్వనాథం, నేలపట్ల సత్యనారాయణ, నాయకులు చొల్లేటి రమేష్, గోపాలకృష్ణ, ఆదినారాయణ, కేసబోయిన శంకర్, నల్ల మధు యాదవ్, లాలయ్య, కృష్ణగౌడ్ పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ -
భవనాలు ఎక్కువ.. రాబడి తకు్కవ!
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో ఉన్న భవనాలకు తగ్గట్టుగా మున్సిపాలిటీకి వాటి ద్వారా ఆదాయం రావడంలేదు. పట్టణ శివారు పెరగడంతో పాటు ఆయా కాలనీల్లో ఐదారు అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టడం, ఇటీవల పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా వెలిసిన విషయం తెలిసిందే. పెరిగిన పట్టణం కారణంగా సేవలు పెరగడంతో పాటు మున్సిపాలిటీకి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆదాయం సమకూరకపోవడంతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టణంలో 48 వార్డులు మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 43 వేల భవనాలకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ 43 వేల భవనాల ద్వారా అనుకున్న స్థాయిలో ఆస్తి పన్ను రావడంలేదు. 10 సంవత్సరాల నుంచి ఆస్తి పన్ను ద్వారా కచ్చితంగా రావల్సిన ఆదాయం కోల్పోతోంది. 43 వేల భవనాలకు దాదాపుగా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను సమకూరాల్సి ఉంటుంది. కానీ ప్రసుతం ఆస్తి పన్ను ద్వారా రూ.18 కోట్లు మాత్రమే వస్తోంది. కొన్ని చోట్ల స్థానిక నాయకుల జోక్యం, కొందరి మున్సిపల్ సిబ్బంది చేతివాటం కారణంగా మున్సిపాలిటీ ఆదాయం కోల్పోవాల్సి వస్తుందనేది బహిరంగ రహస్యమే. ఐదు అంతస్తులున్నా.. ఒకటి రెండింటికే పన్ను చెల్లింపు నీలగిరి పట్టణంలోని షాపింగ్ కాంప్లెంక్స్లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్పత్రులు, కార్ల షోరూమ్లను రీ అసెస్మెంట్ చేస్తే ఆస్తి పన్ను పెరగనుంది. నాలుగైదు అంతస్తుల భవనాలు ఉన్న వారు ఒక అంతస్తు, రెండస్తులకు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ రోడ్లోని ఓ బైక్ షోరూం భవనం ఐదు అంతస్తులు ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఇదే రోడ్లో మరో బైక్ షోరూం వారు అన్ని అంతస్తులకు కాకుండా మూడు అంతస్తులకు రూ.లక్ష మాత్రమే వస్తోంది. అదే విధంగా బోయవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఐదంతస్తుల భవనం ఉండగా, కేవలం రెండంతస్తులకు మాత్రమే చెల్లిస్తున్నట్లు తెలిసింది. రామాలయంలో సమీపంలోని ఓ కార్పొరేట్ షాపింగ్ మాల్ భవనం, దానికి సమీపంలోనే ఉన్న మరో షాపింగ్ కాంప్లెక్స్, ఎన్జీ కాలేజీ సమీపంలో ఉన్న ఓ మాల్ భవనం, ఎల్వీ బంక్ సమీపంలో ఉన్న మరో రెండు భవనాలు ఇలా అనేక భవనాలకు ఆస్తి పన్ను చాలా తక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇలా ఒక్కటి రెండు కాదు కార్పొరేట్ మాల్స్, పాత భవనాల స్థానంలో కొత్తగా నిర్మించిన దుకాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసెస్మెంట్ చేస్తే ఆస్తి పన్ను రూ.18 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఫ నీలగిరిలో 43 వేల భవనాలు ఫ ఆదాయం మాత్రం రూ.18 కోట్లే.. ఫ రీ అసెస్మెంట్ చేస్తే మున్సిపాలిటీ ఆదాయం పెరిగే అవకాశం మున్సిపాలిటీలో పెరిగిన ఖర్చులు పట్టణంలో పెరుగుతున్న జనాబాకు అనుగుణంగా సేవలందించడం కోసం మున్సిపాలిటీ కొత్తగా జేసీబీలు, ట్యాక్టర్లు, ఇతర వాహనాల కొనుగోలు చేయడంతో నిర్వహణ కూడా భారీగా పెరిగింది. ఆ ఖర్చులకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయం పెంచుకునే వెసులుబాటు ఉన్నా ఆ దిశగా దృష్టి సారించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మున్సిపల్ సిబ్బంది ఆస్తి పన్ను మదింపు చేయడానికి వెళ్తే స్థానిక నాయకులు ఆపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రీ మదింపు వలన స్థానిక నాయకులకు ఎలాంటి నష్టం జరిగే అవకాశమే లేదు. ఎందకంటే భారీ భవనాలు, సముదాయాలు కట్టిన వారికి ఆ వార్డులో ఓట్లు లేవు అనే విషయం గ్రహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
గుట్టలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. యాగ నిర్వహణకు ప్రథమ ప్రాకార మండపంలో యాగశాలను సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం విష్వక్సేన ఆరాధనతో అర్చకులు పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకతో పాటు రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల రెండో రోజు ఉదయం నవకలశ అభిషేకాలు, నిత్య మూర్తి, మూలమంత్ర, శ్రీనృసింహ, సుదర్శన, దేవతా హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి విమాన గోపురానికి పూజలు చేసి, శ్రీసుదర్శన చక్రానికి పవిత్ర మాలలు ధరింపజేస్తారు. చివరిరోజు బుధవారం మహా పూర్ణాహుతి నిర్వహించి, స్వామి వారికి పవిత్రమాలలను సమర్పించడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. -
ఉపవాసంతో పూజలు చేస్తాం
తీజ్ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిష్టతో జాగరణలో ఉంటూ పూజలు చేస్తాం. ఉత్సవాలు ముగిసే వరకు తండాను వదిలి బయటికి వెళ్లం. చివరిరోజు పూర్తిగా ఉపవాసంతో ఉంటాం. తండా పెద్దలు, తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తాం. – రమావత్ అనిత, తిరుమలగిరిసాగర్ మండలం తండా అంతా ఒక్కటిగా జరుపుకుంటాం తీజ్ పండుగను తండావాసులంతా కలిసి జరుపుకుంటాం. పంటలు బాగా పండాలని అమ్మవార్లకు పూజలు చేస్తాం. గోధుమ నారును తెంచి కుటుంబ సభ్యులకు ఇచ్చి, అమ్మవారి దీవెనలు అందుకుంటాం. చివరి రోజున చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. – నీలా బాయి, తుర్కపల్లి మండలం -
1600 మెగావాట్ల విద్యుత్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని రెండు యూనిట్లలో ఉత్పత్తి సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ద్వారా శుక్రవారం నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జనవరి నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పవర్ ప్లాంట్లోని రెండో యూనిట్ను జాతికి అంకితం చేశారు. దాంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి చేస్తుండగా, శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనిట్–1 నుంచి జాతికి అంకితం చేశారు. దాంతో మరో 800 మెగావాట్లు కలుపుకొని 1600 మెగావాట్ల సామర్థ్యంతో కమర్షియల్ విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వైటీపీఎస్ యూనిట్ –1 ప్రారంభం అనంతరం రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మరో మూడు యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు ఆదేశించారు. పవర్ ప్లాంట్ ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలోనే స్టేజ్–1లోని రెండు యూనిట్లను పూర్తి చేయడంపై ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పవర్ ప్లాంట్లో అన్ని సౌకర్యాలు బాగుండేలా.. అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆస్పత్రి నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. పవర్ ప్లాంట్ ఆవరణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలిస్తున్నాం : మంత్రి ఉత్తమ్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూములు పోయిన పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు అయ్యిందని.. ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వైటీపీఎస్ వద్దకు రహదారుల పూర్తికి రూ.280 కోట్లు మంజూరు చేయడంతోపాటు.. క్లీయరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పవర్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదన్నారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ వైటీపీఎస్లోని అన్ని విభాగాల్లో లాగ్బుక్ ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎ్స్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖర్రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్రాజు తదితరులు పాల్గొన్నారు.చివరి దశకు చేరుకున్న నాలుగో యూనిట్ పనులు పవర్ ప్లాంట్లోని 3, 4, 5 యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. నాలుగో యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నారు. గత ఏడాది నవంబర్లోనే నాలుగో బాయిలర్ లైటింగ్ (స్టీమ్ జనరేషన్) పనులు పూర్తికాగా, ప్లాంట్ సింక్రనైజేషన్కు సంబంధించి బాయిలర్ స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్, నార్మలైజేషన్ పనులను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక యూనిట్–3 బాయిలర్ లైటింగ్ పనులు గత ఏడాది ఫిబ్రవరిలోనే పూర్తి కాగా, బాయిలర్ కెమికల్ క్లీనింగ్ కూడా పూర్తయింది. ఇక స్టీమ్ బ్లోయింగ్ ఆపరేషన్ పనులను గత నెల 22వ తేదీన ప్రారంభించారు. మొత్తానికి యూనిట్–3 సింక్రనైజేషన్ను వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, అక్టోబర్లో కమర్షియల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా పనులను చేపట్టారు. యూనిట్–5 బాయిలర్ హైడ్రాలిక్ పరీక్ష పూర్తికాగా, బాయిలర్ లైటింగ్ పనులను ఈ నెలలోనే చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టర్బైన్ నిర్మాణ పనులను ఇంకా కొనసాగుతున్నాయి. డిసెంబర్లో సింక్రనైజేషన్ పూర్తి చేసి, 2026లో ఫిబ్రవరిలో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ పేర్కొంది. ఫ ఈ ఏడాది జనవరిలో సీఎం చేతుల మీదుగా యూనిట్–2 ప్రారంభం ఫ శుక్రవారం యూనిట్–1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఫ వచ్చే ఏడాది జనవరి నాటికి మిగతా మూడు యూనిట్లు పూర్తి చేయాలని ఆదేశం ఫ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన ఫ పనులపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష -
డుమ్మా కొట్టలేరు..!
నల్లగొండ : డుమ్మా టీచర్లకు ఇక చెక్ పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని విద్యాశాఖ తీసుకొచ్చింది. పాఠశాలలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విధులకు గైర్హాజరతున్న ఉపాధ్యాయులను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఉపాధ్యాయుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని శుక్రవారం నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. సంబంధిత ఉద్యోగి సెల్ఫోన్లోనే టీజీఎఫ్ఆర్ఎస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి హాజరును నేరుగా ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. గత విద్యా సంవత్సరం నుంచి ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తున్నారు. అదే తరహాలో ఉపాధ్యాయుల హాజరును కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో 1483 ప్రభుత్వ, జిల్లా పరిషత్, యూఆర్ఎస్, కేజీవీబీలు, మోడల్ స్కూల్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 6,556 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల సమయ పాలనకు కొత్తగా ప్రవేశపెట్టి టీజీఎఫ్ఆర్ఎస్ యాప్ను సంబంధిత ఉద్యోగి స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశాల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను టెక్నీషియన్ అప్లోడ్ చేస్తారు. ఒక్కసారి లాగిన్ అయిన తరువాత యాప్ నిరంతరంగా వినియోగించవచ్చు. ఇక ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి పాఠశాలకు వచ్చిన తర్వాత యాప్ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే ఆప్షన్ నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్లైన్లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. పాఠశాలలో పని సమయం ముగిసిన తర్వాత క్లాక్ ఔట్ అనే ఆప్షన్పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయాన్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారి ఆన్లైన్లో చేరుతుంది. ఉత్తమ బోధనే లక్ష్యంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. విద్యార్థులకు ఉత్తమ బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది. చాలామంది పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ స్కూళ్లకు వేళకు చేరుకోవడం లేదు. ప్రధాపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలకు ఉపాధ్యాయులు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు అమల్లోకి తెచ్చింది. ఇక విద్యార్థులకు మరింతగా నాణ్యమైన, ఉత్తమ బోధన అందనుందని పలువురు విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తాం ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదులో మొదటిరోజు కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో కొందరు ఉపాధ్యాయులు హాజరు నమోదులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. రెండుమూడు రోజుల్లో అవి పూర్తిగా పరిష్కారమవుతాయి. ప్రతి ఉపాధ్యాయుడు కచ్చితంగా ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4.15 గంటలకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాల్సిందే. అలా చేయకపోతే గైర్హాజర్ ఆన్లైన్లో చూపుతుంది. – భిక్షపతి, డీఈఓ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు ఫ హాజరు పక్కాగా ఉండేలా విద్యాశాఖ చర్యలు ఫ జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు ఫ 6,556 మంది ఉపాధ్యాయులు.. తొలిరోజు 3,854 మంది రిజిస్ట్రేషన్ ఫ మెరుగుపడనున్న విద్యా బోధనమొదటి రోజు 3854 మంది నమోదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి తమ సెల్ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసి ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఆయా పాఠశాలల్లో 3854 మంది ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ విధానం పూర్తయిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని టెక్నికల్ సమస్య వల్ల మొదటి రోజు 2,712 మంది ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. రెండు మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేలా విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. -
106 మంది బాల కార్మికులకు విముక్తి
నల్లగొండ : జూలై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 106 మంది బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖతోపాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖల అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి 106 మందికి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, చత్తీస్గడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. బాల కార్మికుల చేత ఎవరైనా పనులు చేయించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికై నా బాల కార్మికుల సమాచారం తెలిస్తే డయల్– 100, 1098 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ శిక్షణకు బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని, గుర్తింపు పొందిన యూ నివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఆగస్టు 15లోగా దరఖాస్తులను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్మర్రిగూడ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్పై సస్సెన్షన్ శివ స్వరూపారాణిపై వేటు పడింది. ప్రిన్సిపాల్ అక్రమాలకు పాల్పడుతున్నారని.. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు ఫిర్యాదులు అందడంతో గత నెల 28న పాఠశాలలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ విచారణ చేపట్టి నివేదికను డైరెక్టర్కు అందచేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.శివస్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులురామగిరి (నల్లగొండ) : విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్టీసీ సిబ్బందికి రీజియన్ స్థాయిలో ఏప్రిల్, మే, జూన్ నెలల ప్రగతిచక్ర అవార్డులను ఆర్ఎం జానిరెడ్డి శుక్రవారం నల్లగొండలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు. రీజియన్ పరిధిలో 28 మంది సిబ్బందికి ప్రగతిచక్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం, అన్ని డిపోల మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుదారుల జాబితా విడుదలనల్లగొండ: మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేసే.. మోటరైజ్డ్ వాహనాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల7 న సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించాలికనగల్ : విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కనగల్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం పాఠశాలలో, కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ వి.పద్మ, కాంప్లెక్స్ హెచ్ఎం డి.విద్యాభార్గవి, కేజీబీవీ ఎస్ఓ స్వప్న పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొట్టండిమిర్యాలగూడ అర్బన్ : డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవినాయక్, మల్లం మహేష్ కోరారు. జిల్లావ్యాప్త చైతన్య సైకిల్ యాత్రలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సైకిల్ యాత్రలో వారు మాట్లాడారు. మత్తుకు బానిసలుగా మారుతున్న యువత అగాయిత్యాలకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. ఆన్లైన్ యాప్ల వల్ల లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సైకిల్ యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, సుధాకర్, శశిధర్, రాజేష్, సాయితేజ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాల్సిందే
మిర్యాలగూడ టౌన్ : ఎన్నికల సమయంలో చేయూత పింఛనుదారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు వరకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం మిర్యాగూడలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చేయూత పింఛన్దారుల జిల్లా సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. తీవ్ర అంగవైకల్యం కలిగిన కండరాల క్షిణిత వ్యాధి గ్రహాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రూ.15 వేలు ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేరకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్లో దివ్యాంగుల మహాగర్జనకు సంబంధించిన సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సమన్వయకర్త జానకిరామయ్య చౌదరి, రాష్ట్ర నేత అహ్మద్ఖాన్, అందె రాంబాబు, గడ్డం ఖాసీం, వెంకటాచారి, సైదులు, రాజేష్, చైతన్యరెడ్డి, ఇంద్రచౌదరి, శ్రీనివాస్, రామేశ్వరీ, లక్ష్మి, సువర్ణ, శంకర్, మధన్నాయక్, నాగరాజు, సైదులు, నర్సింహ, వెంకన్న పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
స్పీడ్ గన్ చూస్తోంది..
చౌటుప్పల్ రూరల్: వాహనాలను అతివేగంతో నడపడం వల్ల చోదకులు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటివారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.ఈ నేపథ్యంలో వాహనాల వేగ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం పరిధిలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చెట్లమాటున స్పీడ్గన్లు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని రికార్డ్ చేశారు. పరిమితికి మించిన వేగంతో వెళ్తే వెంటనే వాహనదారుడి సెల్ఫోన్ లేదా, వాహనం నంబర్ ఆధారంగా ఎంత జరిమానా చెల్లించాలనే సమాచారం వస్తుంది. గంటకు 90 కి.మీ వేగం మించితే చలానా వస్తుందని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్మోహన్ తెలిపారు. -
సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
నల్లగొండ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ రద్దు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలె పెట్టిందన్నారు. దాన్ని అమలు చేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడు రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారని.. తెలంగాణలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కాలం నారాయణరెడ్డి మాట్లాడుతూ మహాధర్నాకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వెళ్లేలా సమాయత్తం చేస్తామన్నారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి జాన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకరి బిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, శ్రీనివాసరెడ్డి, యూసుఫ్పాష, మారం వెంకటరెడ్డి, సునీల్, శంకరయ్య, సువర్ణ, సత్తిరెడ్డి, గోపాల్, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ -
248 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
నల్లగొండ : విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. జిల్లాలో ఎన్రోల్మెంట్ లేని పాఠశాలలు, విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలనుంచి ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో జిల్లాలో 248 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. స్కూల్ అసిస్టెంట్లను కాంప్లెక్స్ నుంచి నియోజకవర్గ పరిధిలో.. ఎస్జీటీను కాంప్లెక్స్ పరిధిలో అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేశాయని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 69 మంది స్కూల్ అసిస్టెంట్లును, 179 మంది ఎస్జీటీలను సర్దుబాటు చేస్తూ డీఈఓ భిక్షపతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు ఆయా ఉపాధ్యాయులను పాఠశాలల నుంచి రిలీవ్ చేయడంతో పాటు సర్దుబాటు చేసిన పాఠశాలల్లో రిపోర్టు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైన ఉపాధ్యాయులు జాయిన్ కాకపోతే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కొత్త దుకాణాలు లేనట్టే..!
టెండర్ డిపాజిట్ ధర పెంపు ? గతంలో టెండర్లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే ఈసారి దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.జనాభా లెక్కలు తేలితేనే అదనపు మద్యం షాపులు ఫ 2023లో ఉన్నవాటికే టెండర్లు పిలువనున్న ఎకై ్సజ్ శాఖ ఫ ఈ సారి కూడా ఆగస్టులోనే షెడ్యూల్ జారీకి అవకాశం ఫ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈసారి అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్ జారీ చేసేందుకు ఎకై ్సజ్ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున ప్రతి 5వేల మందికి ఒక మద్యం దుకాణం చొప్పున అధికారులు గతంలోనే పెంచారు. వాటి ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా షాపులకు అనుమతి ఇవ్వకుండా ఉన్న దుకాణాలకే టెండర్లు పిలువనున్నారు. క్లస్టర్ పరిధిలో షాపుల మార్పు.. నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. ఒక్క వార్డుకు రెండు నుంచి మూడు లెక్కన కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న షాపులు ఏవైనా సక్రమంగా నడడవం లేదని, దరఖాస్తు చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలోనే ఒకే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మద్యం షాపును మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. సాధారణంగా జిల్లాలో క్లస్టర్ జనాభా స్లాబ్ను బట్టి షాపుల లైసెన్స్ ఫీజులను ఫీజులను ఖరారు చేశారు. 5 వేల జనాభా ఉంటే రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 నుంచి 10 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 10నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉంటే రూ.65 లక్షలు, లక్షకు జనాభా ఆపైన ఉంటే రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్లాబ్ల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 155 మద్యం షాపులు ఉండగా అందులో 95షాపులు మాత్రమే పది రెట్ల రెవెన్యూ దాటాయి. మిగిలినవి ఏడెనిమిది రెట్లు మాత్రమే అమ్మకాల లక్ష్యాన్ని దాటాయి. ఇంకా నాలుగు నెలలు గడువు ఉంది కాబట్టి అన్ని షాపులు పది రెట్ల అమ్మకాలను దాటే అవకావం ఉందని ఽఅధికారులు చెబుతున్నారు. ఏదైనా ఒక షాపులో ఆ మేరకు అమ్మకాలు జరక్కపోతే ఆ క్టస్టర్ పరిధిలో, అదే స్లాబ్ విధానం ఉన్న ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 2023లో దరఖాస్తులు 7,057 రెండేళ్ల కిందట జిల్లాలోని 155 మద్యం షాపులకు టెండర్లు పిలువగా 7,057 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కనగల్ మండలం దర్వేశిపురం మద్యం దుకాణానికి 187 మంది పోటీ పడి దరఖాస్తు చేశారు. రాష్ట్రంలోనే ఈ దుకాణానికే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పోటీపడిన వారిలో కొందరు ఐదారు దరఖాస్తు చేయగా, సింగిల్ టెండర్ వేసిన వ్యక్తికే డ్రాలో దక్కింది. ఈ సారి పెరగనున్న దరఖాస్తులు ఈసారి కూడా మద్యం షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గతంలో చాలా మంది టీంలుగా ఏర్పడి 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. షాపులు వచ్చిన వారినుంచి రానివారు చాలా మంది కొన్నారు. దాంతో ఈసారి కూడా టెండర్లలో పాల్గొనేందుకు చాలామంది సిద్ధమవుతన్నారు. త్వరలో మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్ జిల్లాలో త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల తెరిచారు. ప్రస్తుతం జిల్లాలోని 155 మద్యం షాపుల లైసెన్స్ గడవు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తిచేయాల్సి ఉంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగస్టు నెలలోనే మొదలైతే అందుకు కనీసంగా మూడు నెలల సమయం పట్టనుంది. ఆ సమయంలో దుకాణాల టెండర్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే గతంలో మాదిరిగానే టెండర్ల ప్రక్రియను ముందుగానే నిర్వహించాలని ఎకై ్సజ్ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. -
కేసుల దర్యాప్తునకు సాంకేతికత దోహదం
నల్లగొండ: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో క్లూస్ టీమ్కు కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం జరిగిన ప్రదేశానికి క్లూస్ టీం త్వరగా చేరుకొని నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. వివిధ సాంకేతిక పరికరాల సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఆర్ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ, క్లూస్ టీమ్ ఇన్చార్జి ఎస్ఐ శివ సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మ పాలే ఆరోగ్యం
పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు అంశాలపై పూర్తి స్థాయిలో వివరిస్తాం. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన పరుస్తారు. కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భిణులకు తల్లిపాల పాముఖ్యతను తెలియజేస్తాం. – కృష్ణవేణి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మిర్యాలగూడ టౌన్ : తల్లిపాలు అమృతంతో సమానం. శిశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తాపించడం తప్పనిసరి. తద్వారా తల్లిబిడ్డలకు ఎంతో శ్రేయస్కరం. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇంటింటికి అంగన్వాడీ పేరుతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించేందుకు ఐసీడీఎస్ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామాలు, పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తల్లి పాల ప్రాముఖ్యతతోపాటు పిల్లలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తారు. ముర్రుపాలు ఎంతో మేలు.. బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే తల్లి ముర్రుపాలు కచ్చితంగా శిశువుకు తాపించాలి. ఈ పాలలో మాంసకృత్తులు పోటీన్లు, ఏ,సీ,డీ,ఈ,కే మిటమిన్లు, కొవ్వు, చక్కర పదార్థాలు, మినరల్స్ బిడ్డకు అందుతాయి. ఇవన్నీ బిడ్డలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలు పట్టాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. దీంతో తల్లులు రోమ్ము క్యాన్సర్కు గురికారు. తల్లిపాలలో ఇనుము, కాల్షియం ఉండడంతో బిడ్డలో రక్తహీనత ఏర్పడదు. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. శిశువుకు మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవు. పాలు పుష్కలంగా రావాలంటే గర్భం దాల్చినప్పటి నుంచే పోషక విలువలు ఉన్న ఆహారం పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు ఫ ఇంటింటికి అంగన్వాడీ సిబ్బంది ఫ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ఫ 7వ తేదీ వరకు కార్యక్రమంఐసీడీఎస్ ప్రాజెక్టులు 09అంగన్వాడీకేంద్రాలు 2,0937 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 71,397గర్భిణులు 8,538బాలింతలు 6,595 -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో జిల్లా విద్యార్థులు రాణించాలని తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట సింహాద్రి, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను అన్నారు. తెలంగాణ యోగా సభ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగంలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారు ఈ నెల 7, 8 తేదీల్లో ఆదిలాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి యోగా చాంపియన్ షిప్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనం నాగిరెడ్డి, నామిరెడ్డి సుష్మ, మంగ, మహేశ్వరీ, సునీత, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘యంగ్ ఇండియా’ మోడల్గా నిలవాలి
ఫ 4న ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి పూజకు ఏర్పాట్లు చేయండి ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం రాష్ట్రానికే మోడల్గా నిలవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా, నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణాలకు 4వ తేదీన భూమి పూజకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీజీఈడబ్ల్యూఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి, కలెక్టర్లకు వివరించారు. భవన నిర్మాణాల్లో మార్పులుంటే నా దృష్టికి తేవాలని కలెక్టర్కు సూచించారు. బోధనేతర సిబ్బందికి ముందుగా వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమీక్షలో అదనపు ఇన్చార్జి కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ అశోక్రెడ్డి, టీజీఈడబ్ల్యూఐసీడీ డిప్యూటీ ఇంజనీర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందిస్తాం నల్లగొండ టౌన్: నర్సింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనానికి భూమిపూజ చేసి మాట్లాడారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నర్సింగ్ కోర్సులు చేయడం ద్వారా భవిష్యత్తులో మెడికల్ టూరిజంలో అనేక ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నా. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు. -
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
రామగిరి(నల్లగొండ): జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డాక్టర్ ఎండి అబ్దుల్ హఫీజ్ ఖాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి మునుగోడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం మునుగోడు ఎంపీడీఓ కార్యాలయంలో చండూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలు, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణాలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రారంభించిన ఇళ్లు వారం రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తిచేయించి బిల్లులు చెల్లించాలన్నారు. నిర్మాణ పనులు ప్రారంభించడంతో నిర్లక్ష్యం వహించిన మర్రిగూడ ఎంపీడీఓకి షోకాజ్ నోటీసు జారీచేయాలని ఆదేశించారు. అనంతరం మునుగోడు పీహెచ్సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తన సెల్ఫోన్ లైట్ వేసుకుని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయాలన్నారు. ఆమె వెంట హౌసింగ్ పీడీ రాజ్కుమార్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మునుగోడు డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నృసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రరుక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఇక ప్రాకరా మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం
డిండి : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. బుధవారం డిండి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టు కింద సాగు చేసిన ప్రతి ఎకరాకు సరిపడా నీరందిస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. అంతకుముందు స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ప్రహరి గోడను ప్రారంభించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. వీఏఎస్ ఫంక్షన్ హాల్లో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాెస్గౌడ్, ఎంపీడీఓ వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, రాజేష్రెడ్డి, గడ్డమీది సాయి, రాంకిరణ్, దామోద్రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, శ్రీను, వెంకటేష్, సలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇస్తాం
చింతపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం చింతపల్లిలో నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి మండలానికి 1,666 నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, మార్కెట్ చైర్మన్ దొంతం సంజీవరెడ్డి, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్యగౌడ్, ముచ్చర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి చందంపేట : కేజీబీవీ, గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం నేరెడుగొమ్ము మండల కేంద్రంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వంట గదిని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ ఉమాదేవి, ఎంపీడీఓ నీలిమ, ఎస్ఓ శ్వేత ఉన్నారు. -
ఉపాధ్యాయులకు పదోన్నతులు
నల్లగొండ : ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం.. అందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత సంవత్సరం నిర్వహించారు. ఆ తరువాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల ద్వారా ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. జూలై మాసం పూర్తి కావొస్తున్నందున ముందుగా పదోన్నతుల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. ఆ జాబితాపై బుధ, గురువారాలో అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.. సంవత్సర కాలంలోనే మళ్లీ పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ సన్నద్ధం కావడంతో ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొంది. ఖాళీల ఆధారంగా.. జిల్లా పరిధిలో ఎస్జీటీలకు, మల్టీజోన్న్–2 పరిధిలో గెజిటెడ్ (జీహెచ్ఎం) ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. జిల్లాలో మొత్తంగా వివిధ కేటగిరిల్లో 304 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో జీహెచ్ఎంల ఖాళీలు 54 కాగా.. మిగతావి స్కూల్ అసిస్టెంట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితా సైతం రూపొందిస్తున్నారు. జూన్న్30వ తేదీ వరకు ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 304 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. ఫ ఏడాది కాలంలోనే రెండోసారి అవకాశం ఫ ఆన్లైన్లో సీనియారిటీ జాబితా ఫ అభ్యంతరాలు స్వీకరిస్తున్న విద్యాశాఖ ఫ జిల్లాలో 304 మంది ప్రమోషన్ పొందే అవకాశం త్వరలో షెడ్యూల్ ప్రస్తుతం పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ మొదలుపెట్టారు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ సైతం విడుదల కానుండడంతో విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సీనియారిటీతో పాటు వివిధ కేటగిరిల్లో ఖాళీలను గుర్తిస్తున్నారు. షెడ్యూల్ వెలువడితే 15 నుంచి 20 రోజులు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పదోన్నతులు, బదిలీలు ఇప్పుడు చేపడితే విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పలువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
మర్రిగూడ : కేసుల దర్యాప్తు విషయంలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ శరత్చంద్రపవార్ అన్నారు. బుధవారం మర్రిగూడ పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిసరాలపై ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేసుల రికార్డులను పరిశీలించి రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్డెస్క్, స్టేషన్ రైటర్, లాక్అప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఎస్ఐ ఎం.కృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్రపవార్ -
4న ‘యంగ్ ఇండియా స్కూల్’కు శంకుస్థాపన
నల్లగొండ : జిల్లా కేంద్రంలో నిర్మించే య.ుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు ఆగస్టు 4న భూమి పూజ చేయనున్నారు. అదే రోజు మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. 22 ఎకరాల్లో 5,36,194 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు రూ.200 కోట్ల అంచనాతో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయనున్నామని మంత్రి వెల్లడించారు. భూమి పూజ తర్వాత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నల్లగొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షలో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ పాల్గొన్నారు. నేడు మంత్రి కోమటిరెడ్డి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నల్లగొండ చేరుకొని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలువనున్నారు. 11 గంటలకు ఎస్ఎల్బీసీలో నర్సింగ్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ రోగులను కలుస్తారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షిస్తారు. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలిస్తారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
యూరియా దందాపై విచారణ చేపట్టాలి
చిట్యాల : మండలంలోని వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. చిట్యాలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలకు యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే వెలిమినేడు పీఏసీఎస్ ద్వారా యూరియా బస్తాలను ప్రైవేట్ పరిశ్రమలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ దందాలో కీలక వ్యక్తులను తప్పించి సొసైటీ అటెండర్పై నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు సహకరిస్తున్న ఆ సొసైటీ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల అయిలయ్య, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కొలను సునిత వెంకటేష్గౌడ్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన సత్తయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్రెడ్డి, సాగర్ల భిక్షం, బాతరాజు రవీందర్, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఉత్తి’పోతలేనా!
నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిధిలో కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకాల పనులు సాగుతున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవం. నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేయడం ఆలస్యమవుతోంది. నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాపం. పనుల వేగవంతంగా సాగేలా చర్యలు తీసుకుంటాం. – కర్నాకర్, ఎన్ఎస్పీ ఈఈ మిర్యాలగూడ : సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో అందులో నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. వీటి పనులు ప్రారంభించి ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ఫలితంగా చివరి భూములకు నీరండం లేదు. ఎన్ఎస్పీ పరిధిలో.. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో చివరి భూములకు నీరందించేందుకు ఆరు ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టారు. ఎన్ఎస్పీ డివిజన్–1 పరిధిలో సాగర్ డ్యాం ఉండగా ఎన్ఎస్పీ డివిజన్–2 పరిధిలో ఐదు లిఫ్టులను మంజూరు చేశారు. అందులో నెల్లికల్, బొత్తలపాలెం– వాడపల్లి, దున్నపోతులగండి, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్టులు ఉన్నాయి. డివిజన్–3 పరిధిలో కేశవాపురం – కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఈ ఆరు ఎత్తిపోతల పథకాల్లో 9 పంప్హౌజ్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల వద్ద మాత్రమే ఒక పంప్హౌజ్ పూర్తయింది. నిధులు మంజూరులో జాప్యం ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించినప్పటికీ పనుల పురోగతికి అనుగుణంగా నిధులు మంజూరు కాకపోవడంతో వాటి పనులు నిలిచిపోతున్నాయి. నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.664.80 కోట్లతో చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.131.420 కోట్ల పనులు జరిగాయి. ఇలా బొత్తలపాలెం, దున్నపోతలగండి, వీర్లపాలెం, తోపుచర్ల, కేశవాపురం – కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాల పరిస్థితి కూడా అంతే ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఫ ఐదేళ్ల క్రితం ఆరు ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభం ఫ ఇప్పటి వరకు 30 శాతం కూడా పూర్తికాలే.. ఫ నిధుల లేమితో ముందుకు సాగని పనులు ఫ ఆయకట్టు చివరి భూములకు అందని నీరు ఎత్తిపోతల పథకాల వివరాలు ఇలా.. లిఫ్టు నిధులు ఆయకట్టు పనుల పురోగతి (రూ.కోట్లలో) నెల్లికల్ 664.80 24,624 24.34 శాతం బొత్తలపాలెం 229.25 8,610 11 శాతం వీర్లపాలెం 32.22 2500 10 శాతం తోపుచర్ల 9.3 315.98 10 శాతం దున్నపోతులగండి 219.9 12,239 12 శాతం కేశవాపురం 53 5875 30శాతం -
1న వైటీపీఎస్కు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (వైటీపీఎస్)కు ఆగస్టు 1న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రానున్నారు. పవర్ ప్లాంట్లోని యూనిట్–1ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అనంతరం కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్ కోసం భూమి పూజ చేయనున్నారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు మంజూరుచిట్యాల : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలల వేతనాలు విడుదలయ్యాయి. ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ నెల 26న ‘సాక్షి’లో ‘ఉపాధి సిబ్బందికి వేతన ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వారికి మూడు నెలల వేతనాలను మంగళవారం రాత్రి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. యూరియా అక్రమ రవాణాపై విచారణచిట్యాల: మండలంలోని వెలిమినేడు గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన యూరియా అక్రమ రవాణా ఘటనపై బుధవారం జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి పి.శ్రావణ్కుమార్ విచారణ చేపట్టారు. వెలిమినేడు పీఏసీఎస్ కార్యాయంలోని సిబ్బందితో మాట్లాడి జరిగిన యూరియా రవాణాపై వివరాలను సేకరించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ గిరిబాబు ఉన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవాలి నల్లగొండ టూటౌన్ : అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు గుర్తించి వాటికి అనుమతులు ఇవ్వడంతో పాటు అసిస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకోవాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన డంపింగ్యార్డు, పలు వార్డులకు వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై మాట్లాడారు. ప్రతి ఇంటికి అసిస్మెంట్ చేసి ఇంటి నంబర్ ఇవ్వాలని, ఇందుకు వార్డు ఆఫీసర్లు వార్డుల్లో తిరిగి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో 43 వేల భవనాలు ఉండగా, నల్లా కనెక్షన్లు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమ కనెక్షన్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకు సాధించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ శివరాంరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రదీప్రెడ్డి, జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్ : విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. గురుకులాల్లో ఫుడ్పాయిజన్తో విద్యార్థుల చనిపోతున్నా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, సైదానాయక్, కుంచం కావ్య, కోరె రమేష్, వెంకటేశ్, మారుపాక కిరణ్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగదీష్, జగన్నాయక్, వీరన్న, రాకేష్, సాయి, నవదీప్, ప్రణయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వర్షపాతం సాధారణమే!
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాపై వరుణుడు కరుణచూప లేదు. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షమే కురిసింది. ఇప్పటి వరకు 196.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 188.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత వారం అల్పపీడనం కారణంగా వర్షం కురిసినప్పటికీ చిరుజల్లులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. ఆ వర్షంతో కేవలం మెట్టపంటలైన కంది, పత్తికి కొంత మేలు చేకూరింది. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు కేవలం మర్రిగూడ మండలంలో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. ఆ మండలంలో 158.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 262.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 9 మండలాల్లో అధిక వర్షం జిల్లాలో ఇప్పటి వరకు 9 మండలాలల్లో అధిక వర్షం కురిసింది. చింతపల్లి, అడవిదేవులపల్లి, పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, గుడిపల్లి మండలాల్లో సాధారణ వర్షం కంటే అధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకిరేకల్, మునుగోడు, గుర్రంపోడు, నిడమనూరు, దామరచర్ల, తిరుమలగిరిసాగర్, నేరెడుగొమ్ము, గట్టుప్పల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగిలిన 11 మండలాలైన కేతేపల్లి, తిప్పర్తి, నల్ల గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, అనుముల హాలియా, త్రిపురారం, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో సాధారణం కంటే తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదైంది. 5,32,641 ఎకరాల్లో పత్తిసాగు సీజన్ మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో సాగు అంచనాలు తగ్గాయి. ఈ సీజన్లో పత్తి సాగు అంచనా 6,25,276 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 5,32,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వరినాట్లు కూడా ఊపందుకోలేదు. వరిసాగు అంచనా 5,45,620 ఎకరాలు కాగా.. అనుకూలమైన వర్షాలు కురవని కారణంగా ఇప్పటి వరకు కేవలం 1,25,284 ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. ఇటీవల మెట్ట పంటలకు అనుకూలమైన వర్షం కురవడంతో పత్తి, కంది పంటలు జీవం పోసుకున్నాయి. వరి సాగు ఊపందుకుంటుంది నాగార్జునసాగర్ ఆయకట్టు, వరదకాలువ, ఏఎమ్మార్పీ కాలువల పరిధిలో సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టుతో పాటు నాన్ఆయకట్టు కింద వరినాట్లు ఊపందుకుంటాయి. ఆగస్టు చివరి వరకు వరినాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు సరిపడా నార్లు సిద్ధంగా ఉన్నాయి. – శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కురవాల్సింది 196.3 మి.మీ, కురిసింది 188.7 మి.మీఫ ఇప్పటికీ 11 మండలాల్లో లోటు వర్షపాతం ఫ మర్రిగూడ మండలంలోనే అత్యధిక వర్షం ఫ సీజన్ మొదట్లో వర్షాభావంతో అంచనాలకు తగ్గిన పత్తిసాగు -
సంక్షేమమే ప్రభుత్వ అభిమతం
కట్టంగూర్ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్తో కలిసి నూతన రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 84 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం అందజేయటం దేశంలోనే చారిత్రాత్మకం అన్నారు. గతంలో రాష్ట్రంలో 89 లక్షల రేషన్కార్డులు ఉండగా ప్రస్తుతం 97 లక్షలకు పెరిగాయన్నారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్కార్డులు అందిస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రేషన్కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అర్హులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయిటిపాముల ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ బిల్లులను మంజూరు చేయాలని, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ కింద ఉన్న భూ సేకరణ నిధులు విడుదల చేయాలని ఆమె మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకబోయిన నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, డీటీ ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్, ఆర్ఐ కుమార్రెడ్డి, శ్యామల శ్రీనివాస్, బెజవాడ సైదులు, ఐతగోని నర్సింహ్మ, వివిధశాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ పెద్దవూర : రాష్ట్రంలో రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఇది కొనసాగుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా 62,155 మందికి నూతన రేషన్ కార్డులను మంజూరు చేశామని, 80,201 మంది పేర్లను నమోదు చేసినట్లు చేశామని తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సివిల్ సప్లయీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఏఎంసీ చైర్మన్ టి.చంద్రశేఖర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, గడ్డంపల్లి వినయ్రెడ్డి, పబ్బు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
‘విదేశీ విద్య’కు మరింత ప్రోత్సాహం
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం సీట్లను పెంచింది. ఇప్పటి వరకు 210 సీట్లు ఉండగా.. 500 సీట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరింత మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విదేశీ విద్య అందనుంది. 2013లో ప్రారంభం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు 2013లో అప్పటి ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సిస్ విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రవేశపట్టింది. ఈ పథకం కింద విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు చెల్లించింది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచారు. విదేశాల్లో చదివేందుకు సంబంధిత పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం కింద విదేశీ విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఈ పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే ఆయా ప్రాధాన్యత ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తుంది. 72 మందికి అవకాశం అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికే అవకాశం దక్కింది. 12 సంవత్సరాల్లో జిల్లా వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది విదేశాల్లో చదువుకునేందుకు రికమండ్ చేశారు. వారిలో 71 మందికి ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. జిల్లాలో మొత్తం రూ.6.49 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం విదేశీ విద్య కోసం ఖర్చు చేసింది. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు.. విదేశీ విద్యను అభ్యసించేందుకు 2025–26 సంవత్సరానికి సంబంధించి అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు షెడ్యూల్డ్ కులాల శాఖ అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అవకాశాన్ని అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద విదేశాలకు వెళ్లిన విద్యార్థులుసంవత్సరం దరఖాస్తులు రిజెక్టు విదేశాలకు వెళ్లింది 2013–14 1 0 1 2014–15 5 0 5 2015–16 7 3 4 2016–17 14 6 8 2017–18 10 5 5 2018–19 4 1 3 2019–20 8 1 7 2020–21 4 1 3 2021–22 12 1 11 2022–23 33 20 13 2023–24 28 21 7 2024–25 18 13 5 మొత్తం 144 72 72 ఫ అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధికి గతంలో కంటే రెట్టింపు సీట్లు ఫ మరింత మందికి అందనున్న విదేశీ విద్య ఫ జిల్లాలో ఇప్పటి వరకు 72 మందికి అవకాశం -
టెయిల్పాండ్ నుంచి నీటి విడుదల
అడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో కృష్ణానదిపై ఉన్న టెయిల్పాండ్ నుంచి దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ వెంకటరమణ మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి టెయిల్పాండ్కు 2,32,468 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో దిగువకు 2,38,727 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 75.50 (7.080 టీఎంసీలు)మీటర్లు కాగా.. ప్రస్తుతం 75.04(6,764 టీఎంసీలు) మీటర్ల మేరకు నీరు ఉందన్నారు. కార్యక్రమంలో టెయిల్పాండ్ అధికారులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, అవినాష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ టీబీ ఎక్స్రే పరికరం కొనుగోలుకు ఆర్థిక సాయం
నల్లగొండ : నల్లగొండలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో టీబీ కేసులను నిర్ధారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ టీబీ ఎక్స్రే పరికరం కొనుగోలు కోసం రూ.18 లక్షల చెక్కును మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణచౌదరి, ఉపాధ్యక్షుడు గంటా సంతోష్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, నల్లగొండ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి భద్రాద్రి తదితరులు పాల్గొన్నారు. -
మూసీ క్రస్ట్గేట్లు మూత
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గింది. దీంతో మంగళవారం ప్రాజెక్టు అధికారులు క్రస్ట్గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం 1,650 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో.. మంగళవారం ఉదయానికి 950 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ఐదు రోజులుగా తెరిచి ఉంచిన రెండు క్రస్ట్గేట్లను మంగళవారం ఉదయం పూర్తిగా మూసివేశారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో మంగళవారం సాయంత్రం వరకు నీటిమట్టం 643.18 అడుగుల (.94 టీఎంసీలు) వద్ద ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 547 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. స్వస్థలాలకు వలస కార్మికులు చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్కాలనీ కృష్ణా తీరంలో నిర్బంధం నుంచి విముక్తి పొందిన వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపుతున్నారు. మొత్తం 28 మంది కార్మికులను బిహార్, ఛత్తీస్ఘడ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని వారివారి ప్రాంతాలకు మంగళవారం దేవరకొండ నుంచి బయల్దేరి వెళ్లినట్లు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెలిపారు. 31న యోగాసన ఎంపిక పోటీలునల్లగొండ టూటౌన్ : జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నల్లగొండలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగానికి చెందిన ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట సింహాద్రికుమార్, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు 31న ఉదయం 10 గంటలకు బోనపైడ్, ఆధార్కార్డులతో నల్లగొండలోని ఫణి విహార్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 91820 46383 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. టీటీసీ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలినల్లగొండ : టీటీసీ (టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్) లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో భిక్షపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bse .telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఆగస్టు 3వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పేపర్–1 (ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ థియరీ), మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పేపర్–2 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్), 3.30 గంటల నుంచి 4.30 వరకు పేపర్ –3 (మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్) పరీక్షలు ఉంటాయని తెలిపారు. -
డెంగీ పేరుతో ప్రజలను భయపెట్టొద్దు
నల్లగొండ : ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ వ్యాధి పేరుతో ప్రజలను భయపెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. డెంగీ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా చేసిన ఆస్పత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి వైద్యాధికారి సమీపంలోని పాఠశాల, హాస్టల్ను తప్పనిసరిగా సందర్శించి అవసరమైతే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సారూ.. మా గోడు ఆలకించరూ..!
నల్లగొండ : సారూ.. మా సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్లో పిర్యాదులు సమర్పించారు. సోమవారం గ్రీవెన్స్డే సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. వినతులు స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి నాకు చిన్నప్పటి నుంచి కాళ్లు పని చేయడం లేదు. ఇన్నాళ్లూ మా నన్ను సాకింది. మా అమ్మ పెద్ద మనిషి. ఆమె పని చేయలేదు. ఇద్దరం ప్రభుత్వం ఇచ్చే పింఛన్తోనే జీవనం గడుపుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – ఏర్పుల మల్లయ్య, చర్లపల్లి, దివ్యాంగుడు మా అమ్మకు పింఛన్ ఇప్పించండి మా నాన్న తుపాకుల రాములు స్వతంత్య్ర సమరయోధుడు. ఆయన చనిపోయి ఆరు నెలలైంది. మా నాన్న పింఛన్ మా అమ్మకు మంజూరు చేయాలని దరఖాస్తు చేసాం. ఆరు నెలలైనా ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ విషయంలో అధికారులు వెంటనే మా అమ్మ తుపాకుల నర్సమ్మకు పింఛన్ అందేలా చూడాలి. – లక్ష్మయ్య, మిర్యాలగూడ భూమి పట్టా చేసుకుని పట్టించుకోవడం లేదు నా మనవడు మమ్ములను సాదుతానని చెప్పి మా పేరున ఉన్న ఎకరం 10 గుంటల భూమి పట్టా చేయించుకుండు. ఇప్పుడు సాదడం లేదు. నా చిన్న కొడుకుకు మాటలు రావు. మేము ముగ్గురం ఆ భూమి మీదే ఆదారపడి జీవించాలి. నా పెద్ద కొడుకు కుమారుడైన శ్రీనివాస్ మమ్మల్ని సాదుతానని చెప్పి పట్టా చేయించుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. విషయం అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. – జడల మట్టమ్మ, రామచంద్రు, నేతాపురం, తిరుమలగిరి సాగర్ మండలం ఫ గ్రీవెన్స్లో బాధితుల వినతి ఫ ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్ -
నవనీత.. సాగులో ఘనత
రెండు ఎకరాల విస్తీర్ణంలో అద్భుతాలు● పాలీహౌస్లలో సేంద్రియ పద్ధతుల్లో కీర సాగు ● కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, మరో పది మందికి ఉపాధి ● ఆదర్శంగా నిలుస్తున్న పంగాల నవనీతతుర్కపల్లి : ఆమె సాధారణ గృహిణి. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేద్యంలోకి అడుగుపెట్టింది. పాలిహౌస్లు ఏర్పాటు చేసి ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట పండించి.. ఇప్పుడు కీరదోస సాగు చేస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో మంచి దిగుబడి సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునందించడమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. పంగాల నవనీత. ఎకరాకు రూ.3లక్షల నుంచి రూ.4లక్షలుఏడాదికి రెండు విడతల్లో కీరదోస పండిస్తున్నారు. పంట వేసిన అనంతరం 25 రోజుల తరువాత కాత మొదలవుతుంది. ప్రతి రెండు, మూడు రోజులకోమారు దిగుబడి వస్తుంది. ఒక్క కాతకు 500 నుంచి 600 కిలోల దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఎకరాకు రూ.1.5 లక్షలు అవుతుంది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోనూ ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు లాభాలు పొందుతున్నారు. లాభాలు తగ్గడంతో కీరదోస వైపు దృష్టిఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్ అమ్మకాలకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు ఎదురవుతుండటం.. పెట్టుబడి, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో లాభాలు తగ్గాయి. దీంతో వాటిని తొలగించి ఆ స్థానంలో ఏడాది క్రితం కీరదోస సాగు ప్రారంభించారు. రెండు ఎకరాల్లోని పాలిహౌస్ల్లో కీరదోస సాగు చేస్తున్నారు. స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్కు ఎగుమతిపండిన కీరదోసను భువనగిరితో పాటు హైదరాబాద్లోని బోయిన్పల్లి తదితర ప్రధాన మార్కెట్లకు తరలిస్తుంటారు. కిలోకు రూ.25నుంచి 30 వరకు ధర పలుకుతుందని.. పెట్టుబడి, రవాణా ఖర్చులు, మార్కెట్ను ముందుగానే అంచనా వేసుకుని సాగు చేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతున్నామని మహిళా రైతు నవనీత చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుకీరదోస సాగులో ఆవుపేడతో పాటు ఇతర సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు తోట వద్దకు వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తుంటారని నవనీత చెబుతున్నారు. అంతేకాకుండా నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. మొదట్లో క్యాప్సికమ్, చెర్రీ టమాట, కాలిఫ్లవర్ సాగు తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన పంగాల నవనీత ఐదేళ్లుగా సాగులో రాణిస్తోంది. ఆమె భర్త బాలస్వామి వృత్తిరీత్యా ప్రైవేట్ అధ్యాపకుడు. వీరికి ఇద్దరు సంతానం. నవనీతకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. వారికున్న నాలుగు ఎకరాల్లో సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవారు. ఆ పంటల ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సొంత ఖర్చులతో రెండు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం రెండు పాలిహౌస్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఎరుపు, పసుపు రంగు క్యాప్సికం, చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్, దోసకాయ పండించేవారు. ఇందులో ఎరుపు, పసుపు క్యాప్సికంను హైదరాబాద్, బెంగళూర్, ముంబయికి ఎగుమతి చేసేవారు. చెర్రీ టమాట, క్యాబేజీ, కాలిఫ్లవర్ను స్థానిక మార్కెట్లతో పాటు హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు తరలించేవారు. మార్కెట్కు తరలించడానికి సిద్ధంగా ఉన్న కీరదోసకాయలు ఎక్కువ లాభాలు గడించవచ్చు కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నందుకు గర్వకారణంగా ఉంది. సేద్యంపై నేను చూపుతున్న శ్రద్ధ ఇతర మహిళలు, రైతులకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ఏ సాగులోనైనా ఆధునిక, సేంద్రియ పద్ధతులు అవలంబించడం వల్ల తక్కువ భూమిలోనూ ఎక్కువ లాభాలు గడించవచ్చు. సాగులో నా భర్త సహకారం ఎంతో ఉంది. – నవనీత, మహిళా రైతు -
నందికొండ.. నిండుకుండ
పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో సాగర్ జలాశయం.. నేడు గేట్ల ఎత్తివేత నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585.00అడుగుల (297.7235 టీఎంసీలు)కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మంగళవారం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నాగార్జునసాగర్ రానున్నారు. మంత్రుల పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బీసీ గురుకుల మైదానంలో హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో మంత్రులు కృష్ణమ్మకు వాయినమిచ్చి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఈసారి జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకుంటున్నాయి. శ్రీశైలానికి భారీగా వరద ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు మందుస్తుగానే జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదను శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి సోమవారం రాత్రి 2,10,920 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, సోమవారం ఉదయం రెండు గేట్ల నుంచి, మధ్యాహ్నం 12గంటలకు మూడు గేట్లు, సాయంత్రం 4 గేట్లు, రాత్రి వరకు మొత్తం ఐదు గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్వే మీదుగా 1,35,325 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,904 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. సాగర్ విద్యుదుత్పాదన కేంద్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో విద్యుదుత్పాదన చేస్తున్నారు. ఆ నీరంతా టెయిల్పాండ్ ద్వారా పులిచింతల జలాశయానికి చేరుతోంది. ఇక, నిన్నటి వరకు కుడి కాల్వకు కేవలం 511 క్యూసెక్కుల నీటినే విడుదల చేశారు. మంగళవారం నుంయి ఐదు వేల క్యూసెక్కులకు పెంచారు. నదిలోకి వెళ్లవద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి సాగర్ క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున మత్స్యకారులు, రైతులు నదితీర ప్రాంతాలకు నదిలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నదిలో మోటర్లు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, మత్స్యకారులు వలలు, పుట్టీలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు. వరద కాల్వకు నీటి విడుదల పెద్దవూర : మండలంలోని పూల్యాతండా సమీపంలోని ఏఎమ్మార్పీ లోలెవల్ వరద కాలువకు గ్రావిటీ ద్వారా సోమవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఈ వి.వేణు మాట్లాడుతూ 85 కిలోమీటర్ల కాలువ కింద 42 డిస్ట్రిబ్యూటరీలు, 30 చెరువులు ఉన్నట్లు తెలిపారు. చెరువులను నింపి రైతులకు సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు. మొదట 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు దశలవారీగా సాయంత్రానికి 300 క్యూసెక్కులకు పెంచారు. మంగళవారానికి 600 క్యూసెక్కులకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ ఎండీ. ఖదీర్ పాల్గొన్నారు. ఏఎమ్మార్పీ ఆయకట్టుకు కూడా..పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ డివిజన్ –4 పరిధిలో ఉన్న ఆయకట్టుకు సోమవారం ఏఎమ్మార్పీ అధికారులు నీటి విడుదల చేశారు. డి–5 నుంచి డి–18 వరకు ఆయకట్టు అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. సాగర్ వెనుక జలాల నుంచి మూడు అత్యవసర మోటార్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని ఏకేబీఆర్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఉదయ సముద్రానికి 1100 క్యూసెక్కులు, హైదరాబాద్కు 520 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ నాగయ్య తెలిపారు. సాగర్ ఆయకట్టుకు నేడు నీటి విడుదల నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆయకట్టుకు మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. మంత్రులు ఉదయం 10గంటల వరకు సాగర్కు చేరుకుని 11 గంటలలోపు కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. గడిచిన 18 సంవత్సరాల్లో జూలై మాసంలో కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు లేవు. 2006లో జూలై 21, 2007లో జూలై 14న నీటిని విడుదల చేశామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. 10.38లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద 10.39లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాలు, కృష్ణాజిల్లా 3,68,536 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,734 ఎకరాలకు సాగర్ నీరు అందనుంది. 2007 తర్వాత ఇప్పుడే.. గడిచిన 18 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఇంత ముందస్తుగా సాగర్ జలాశయానికి వరద రాలేదు. కేవలం 2007లో ముందస్తుగా వరదలు వచ్చి జలాశయం గరిష్టస్థాయికి చేరడంతో జూలై 14వ తేదీన జలాశయం 587.80 అడుగులకు చేరడంతో క్రస్ట్గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తిరిగి ఈ ఏడాది రికార్డు స్తాయిలో వరద వచ్చి చేరడంతో జూలై మాసంలోనే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫ ఎగువ నుంచి భారీగా వరద ఫ నేడు క్రస్ట్గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న మంత్రులు ఫ 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకుంటున్న క్రస్ట్గేట్లు -
నేడు ఎంజీయూకు విద్యా కమిషన్ బృందం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మంగళవారం విద్యా కమిషన్ బృందం రానుంది. కమిషన్ చైర్మన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్రావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జోష్ణ శివారెడ్డి ఎంజీ యూనివర్సిటీని సందర్శించనున్నారు. వారు ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్కు చేరుకొని విద్యా అంశాలపై చర్చించనున్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, విద్యార్థి సంఘాల నాయకులు, అప్పిలేటేడ్ కళాశాలల యాజమాన్యాలు, టీచింగ్, నాన్చీటింగ్ ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో విద్యా కమిషన్ బృందం సమావేశం కానుందని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి తెలిపారు. 30న జాబ్మేళానల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమా(అగ్రికల్చర్, హార్టికల్చర్) ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో జాబ్మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్లో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలిమిర్యాలగూడ : ప్రభుత్వ విద్యాలయాల్లో చదవే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులకు ఆయా పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం వంటగదిలోని ఆహార సామగ్రిని పరిశీలించి నాణ్యమైన భోజనం, తాగునీరు అందించాలన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పార్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణరామగిరి(నల్లగొండ): స్వయం ఉపాధి కోర్సులను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని నల్లగొండ సెట్విన్ శిక్షణ సంస్థ కో ఆర్డినేటర్ ఎం.సరిత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ నల్లగొండలోని శిక్షణ కేంద్రంలో 27 కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోర్సుల్లో ప్రధానంగా కంపూటర్, బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనంగ్, ప్లంబింగ్, డీటీపీ, ఎలక్ట్రీషియన్, టెక్స్టైల్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయంగా ఉపాధి పొందవచ్చని, జాబ్మేళా కూడా నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 97050 41789, 08682 281101 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
నల్లగొండ టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలన్నారు. సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు సాగునీటి విడుదల చేసేందుకు వెంటనే షెడ్యూల్ ప్రకటించాలన్నారు. నిరంతరం సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసి పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేశ్, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, హశం తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మూసీకి 1604 క్యూసెక్కుల వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. సోమవారం 1,604 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1,281 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు కాగా 643.20 మేర అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 549 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 72 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. గేట్ల ద్వారా, కాల్వలకు కలిపి మొత్తం 1904 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.99 టీఎంసీల నీరు ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు. ఫ రెండు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల -
కాల్వలకు హద్దుల నిర్ధారణ
నకిరేకల్ : ఏఎమ్మార్పీ డి–53 కాల్వ భూములకు అధికారులు హద్దులు ఏర్పాటు చేశారు. ఈనెల 21న ‘సాక్షి’లో ‘కాల్వకట్టలు కబ్జాల మయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 291, 292లలో కబ్జాకు గురైన కాల్వలను సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బోళ్ల శ్యాం, చిరంజీవి, ఇరిగేషన్ అదికారులు సాయికృష్ణ, వర్క ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పరిశీలించారు. కాల్వలకు ఇరువైపులా సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేశారు. కాల్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
త్రిపురారం : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన త్రిపురారం మండలంలోని కామారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిగూడేనికి చెందిన గుండెబోయిన నాగయ్య(50) మాడుగులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామంలోని ఓ వైన్ షాపులో క్యాషియర్గా పని చేస్తున్నాడు. ఆదివారం నాగయ్య భార్య చెరువుగట్టుకు వెళ్లగా నాగయ్య ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. సోమవారం ఉదయం నాగయ్య వైన్ షాపునకు వెళ్లకపోవడంతో షాపు నుంచి అతడికి ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో ఇంటి సమీపంలోని వారికి ఫోన్ చేసి నాగయ్య దగ్గరికి వెళ్లమని చెప్పారు. వారు వెళ్లి చూడగా అతను అపస్మారకస్థితిలో కనిపించాడు. గ్రామస్తులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్కు సమాచారం అందించారు. నాగయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. మృతుడి భార్య గుండెబోయిన నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ఫ పరారీలో మరో ఇద్దరు పెన్పహాడ్: గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంచెం సాయిగణేష్, శాంతినగర్కు చెందిన పవన్, అమరగాని లోకేష్లు గంజాయికి అలవాటుపడ్డారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు వద్ద గంజాయి కొనుగోలు చేసి వారు తాగడంతో పాటు కావాల్సిన వారికి సరఫరా చేస్తున్నారు. అనంతారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీసులు వారి స్కూటీని ఆపి తనిఖీ చేశారు. కొంచెం సాయిగణేష్ వద్ద 100గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పవన్, లోకేష్లు పరారయ్యారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలుచిట్యాల: భార్యాభర్తల మద్య నెలకొన్న మనస్పర్థలతో మనస్థాపానికి గురైన భర్త సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టంపల్లి గ్రామానికి చెందిన అంతటి ఉపేందర్(40)కు మునుగోడు మండలం క్రిష్టపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపేందర్ హైదరాబాద్లో స్ట్రీల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్టంపల్లి గ్రామానికి వచ్చారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వివాదం రావడంతో మనస్థాపానికి గురైన ఉపేందర్ తన ఇంటి సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు. గ్రామస్తులు సర్దిచెప్పడంతో కిందకు దిగాడు. ● మనస్థాపంతో సెల్టవర్ ఎక్కిన భర్త -
యాంత్రీకరణకు నిధులు
కమిటీల ద్వారా ఎంపిక.. అర్హులైన లబ్ధిదారుల నుంచి గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏఈఓల ద్వారా వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలోని వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో కమిటీ స్క్రూట్నీ చేసి జిల్లా వ్యవసాయ అధికారికి పంపుతుంది. అక్కడ జాబితాను తయారు చేసి కలెక్టర్ అనుమతితో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికై న రైతులకు అక్టోబర్ చివరి నాటికి పరికరాలను అందించే విధంలా ప్రణాళిక రూపొందించారు. ఫ రూ.3.14 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఫ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఫ అక్టోబర్ చివరివారంలో పరికరాలు అందజేసేలా జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసే.. యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథఽకం అమలు కోసం జిల్లాకు రూ.3.14 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం భరిస్తూ ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. ఈ పథకం కోసం గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినప్పటికీ మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల నిధులు రాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పరికరాల కోసం నుంచి ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, జనరల్ కేటగిరి రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. ఫిబ్రవరిలోనే రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులను స్వీకరించింది. వాటితోపాటు ఆగస్టు 5 నుంచి తీసుకునే దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి 21 నుంచి 27వ తేదీ వరకు ఎంపికై న రైతుల నుంచి సబ్సిడీ పోను పెట్టుబడి వాటాను డీడీల రూపంలో తీసుకోనున్నారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 5 వరకు ఎంపికై న రైతులకు పరికరాల మంజూరీ ఉత్తర్వులను అందజేస్తారు. అక్టోబరు చివరి వారంలో లబ్ధిదారులకు పరికరాలను అందజేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 15 రకాల పరికరాలు అందజేత.. యాంత్రికరణలో భాగంగా రోటోవేటర్, ఎంబీ ప్లగ్, అల్టివేటర్, డిస్క్ యారో, కేజీవీల్, బండ్ పార్మర్, రోడో పడ్లర్, పవర్ టిల్లర్, సీడ్ ఫ్రం పర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్ప్రేయర్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రే, పవర్ వీడర్, బ్రష్కట్టర్, స్ట్రా బేలర్స్ తదితర పరికరాలను రైతులకు సబ్సిడీపై అందజేయనున్నారు. రైతులు దరఖాస్తు చేసుకోవాలి... జిల్లాలోని అర్హులైన రైతులు వ్యవసాయ యాంత్రికరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేస్తాం. అక్టోబరు చివరి నాటికి పరికరాలను పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించాం. – పాల్వాయి శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
నగదు అపహరించిన ముగ్గురి అరెస్ట్
చౌటుప్పల్ : సెకండ్హ్యాండ్లో కారు కొనేందుకని ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నలుగురితో కలిసి చౌటుప్పల్కు వెళ్లగా అతను వెంట తెచ్చుకున్న నగదును వారు అపహరించుకుపోయారు. ఈ ఘటన ఈనెల 26న చౌటుప్పల్ పట్టణంలో చోటుచేసుకోగా.. ముగ్గురు నిందితులు సోమవారం పోలీసులకు చిక్కారు. ఒకరు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను సీఐ మన్మథకుమార్ వెల్లడించారు. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన వీరగంధం శ్రీనివాస్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్లో కార్లు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. గత 20రోజుల క్రితం సెకండ్హ్యాండ్లో కార్లు కొనబడును, అమ్మబడును అని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టును చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వేముల పుల్లారావు అలియాస్ శివ(38), కర్నూలు జిల్లా కల్లూరు మండలం శరీన్నగర్కు చెందిన కర్వాల సునీల్కుమార్(45), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మిద్దె జగదీష్బాబు(46)తోపాటు బత్తుల సాంబశివరావు అనే వ్యక్తులు శ్రీనివాస్ను సంప్రదించారు. తమ వద్ద సెకండ్హ్యాండ్ కార్లు ఉన్నాయని, కావాలంటే చూపిస్తామని శ్రీనివాస్ను నమ్మబలికారు. అతను చేసేది అదే వ్యాపారం అయినందున కారు కొనుగోలుకు చేసేందుకు సిద్ధమేనని శ్రీనివాస్ వారితో చెప్పాడు. అందరూ కలిసి అద్దె కారులో చౌటుప్పల్కు.. సెకండ్హ్యాండ్లో కారును శ్రీనివాస్కు ఇప్పించేందుకుగాను పుల్లారావు, సునీల్కుమార్, జగదీష్బాబు, సాంబశివరావులు కలిసి ఈనెల 26న అద్దెకారులో నాగోల్కు చేరుకున్నారు. శ్రీనివాస్ను తమ వెంటబెట్టుకొని చౌటుప్పల్ పట్టణంలోని చిన్నకొండూర్రోడ్డులో ఉన్న మసీదు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అమ్మకానికి ఉన్న ఓ సెకండ్హ్యాండ్ కారును చూపించారు. సంబంధిత కారు యజమాని కొద్దిసేపటి తర్వాత వస్తానని చెప్పడంతో వీరంతా అద్దెకు తీసుకువచ్చిన కారులోనే కూర్చున్నారు. ఇంతలోనే శ్రీనివాస్కు ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ కారు దిగి బయటకు వెళ్లాడు. శ్రీనివాస్ తెచ్చిన రూ.4లక్షలు కారు డ్యాష్బోర్డులో ఉండగా.. ఇదే అదునుగా భావించిన మిగతా నలుగురు నిందితులు నగదును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కొంత సేపటి తర్వాత శ్రీనివాస్ రాగా.. వీరు కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ మన్మథకుమార్ విచారణ చేపట్టారు. ఆ క్రమంలో ధర్మోజిగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వారి వద్ద రూ.4లక్షల నగదు, అద్దె కారు, 5గ్రాముల బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల సాంబశివరావు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితులంతా గతంలో దొంగనోట్లు, దొంగ బంగారం కేసుల్లో వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ అయ్యారని చెప్పారు. పరారీలో మరొకరు రూ.4లక్షల నగదు, కారు, బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం -
నృసింహుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి క్షేత్రంలో ఆదివారం నిత్యపూజలు, భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రికి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
హాస్టళ్ల అద్దె బకాయి!
యజమానుల అప్పులపాలు ప్రభుత్వం ప్రతి నెలా అద్దె ఇస్తుందని యజమానులు హాస్టళ్లకు భవనాలు ఇచ్చారు. కానీ ఏడాదిన్నర నుంచి అద్దె రాకపోవడంతో ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భవనాల అద్దె మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొందరు ప్రతినెలా బ్యాంకులకు భవనాల ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అద్దెలు చెల్లించపోవడంతో వారు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు భవనంలో చిన్నపాటి మరమ్మతు వచ్చినా అద్దె రాలేదనే కారణంతో యజమానులు బాగు చేయించడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయమై ఎస్సీ డీడీ బి.శశికళను వివరణ కోరగా.. అద్దెకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అద్దె బకాయిలు రాగానే చెల్లిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ : కళాశాల హాస్టల్ భవనాలకు అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం హాస్టల్ భవనాలకు అద్దెను చెల్లించకపోవడం వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనంలో చిన్న మరమ్మతు వచ్చిన యజమానులు చేయించడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు తప్పడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 కళాశాల హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. వీటిలో నల్లగొండలో 5, దేవరకొండలో 2, మిర్యాలగూడలో 2, నకిరేకల్లో 1 హాస్టల్ ఉంది. వీటిలో 4 హాస్టళ్లు బాలికలకు, 6 హాస్టళ్లు బాలురవి ఉన్నాయి. ఈ హాస్టళ్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా రూ.4,28,783 అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నకు పైగా అద్దె చెల్లించపోవడంతో రూ.74,68,821 బకాయిలు పేరుకుపోయాయి. ఫ ఎస్సీ కళాశాల వసతి గృహాలకు కిరాయి చెల్లించని ప్రభుత్వం ఫ ఇబ్బందులు పడుతున్న యజమానులు, విద్యార్థులు -
రాష్ట్రంలో ప్రజారంజక పాలన
చందంపేట : రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లో నూతన రేషన్కార్డులు మంజూరైన లబ్ధిదారులకు ఆయన.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్నాయక్తో కలిసి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా జిల్లాతోపాటు దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి తన శాఖా నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ రూ.1800 కోట్లతో ఎదుళ్ల నుంచి డిండి ప్రాజెక్టు నీటిని మళ్లించి ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని అంబాభవాని, కంబాలపల్లి, పొగిళ్ల లిఫ్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగునీరు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో ఎస్ఎల్బీసీ పూర్తిచేసి ఈ ప్రాంతంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అర్హులైన వారు రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు దశలవారీగా కేటాయిస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఊపందుకుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డదో రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేశం, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి చత్రునాయక్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డి.శైలజ, మార్కెట్ చైర్మన్ జమున, తహసీల్దార్లు శ్రీధర్బాబు, ఉమాదేవి, ఎంపీడీఓ లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీశైలంయాదవ్, వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకసాని కృష్ణయ్య, బద్యానాయక్, సర్వయ్య, గోవిందుయాదవ్, కిన్నెర హరికృష్ణ, బస్వారెడ్డి, గడ్డం వెంకటయ్య, మల్లారెడ్డి, అనంతగిరి తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ -
పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ నెల 28న సోమవారం జరగాల్సిన పోలీస్ గ్రీవెన్స్డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇతర కార్యక్రమాల వల్ల గ్రీవెన్స్డేను రద్దు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుర్యీ విషయాన్ని గమనించాలని సూచించారు. కొనసాగుతున్న మూసీ నీటి విడుదలకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆదివారం ప్రాజెక్టు రెండు క్రస్ట్గేట్లు పైకెత్తి ఉంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక్కో గేటును అడుగు మేర పైకెత్తి ఉంచి 1,286 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీకి 1,287 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 643.30 అడుగుల వద్ద నిలకడగా ఉంచుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టుకు 525 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా, ప్రధాన కాల్వలకు, సీపేజీ, లీకేజీల ద్వారా మొత్తం 1,885 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. మూసీ రిర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోవా మహాసభను జయప్రదం చేయాలి నల్లగొండ టౌన్: గోవాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఆగస్టు 7వ తేదీన జరుగనున్న జాతీయ ఓబీసీ మహాసభలకు బీసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ భవన్లో మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమమల్లయ్య, గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కార్యదర్శులు ఇంద్రయ్య, గంజి భిక్షమయ్య, ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, నల్లం మధుయాదవ్, కందుల వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంనల్లగొండ : గ్రామ పాలనాధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ఆదివారం నల్లగొండలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముసిగినట్లు జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు 300 మంది హాజరుకాగా, 78 మంది గైరాజరయ్యారని, గ్రామపాలన అధికారుల పరీక్షకు 110 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణం భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో అదివారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిత్యకల్యాణం కనుల పండువగతా నిర్వహించారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామర్చన తదితర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో రాణించాలి
నల్లగొండ : కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అధికారి భవేశ్మిశ్రా ఆకాంక్షించారు. వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 40 మంది నల్లగొండ్ర కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో చేస్తున్న సాగుకు సంబంధించి మార్కెటింగ్పై రూపొందించిన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
మూసీ రెండు గేట్ల ఎత్తివేత
● 1,300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ● పరీవాహక ప్రాంతాలు అప్రమత్తంకేతేపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. వారం రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 1,423 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా శుక్రవారం ఉదయానికి 1,650 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 643.50అడుగులు (4.07టీఎంసీలు) నీరు ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. శుక్రవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ ఉదయం 10 గంటలకు మూసీ ప్రాజెక్టు 3, 8 నంబరు క్రస్ట్గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1300 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. కుడి కాల్వకు 167 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 215 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నీటి విడుదల నేపథ్యంలో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, మూసీ ఏఈలు ఉదయ్, కీర్తి పాల్గొన్నారు. మొరాయించిన గేట్లు.. విద్యుత్ లోవోల్టేజీ సమస్య కారణంగా మూసీ గేట్లు మొరాయించాయి. మూసీ ప్రాజెక్టుకు సూర్యాపేట మండలం ఎర్కారం విద్యుత్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరపరా అవుతుంది. అయితే లోవోల్టేజీ సమస్య కారణంగా అధికారులు గేట్లు ఎత్తేందుకు స్విచ్ ఆన్ చేసినప్పటికీ గేట్లు పైకి లేవలేదు. దీంతో డ్యాం వద్ద అందుబాటులో ఉన్న జనరేటర్ సహాయంతో అధికారులు గేట్లను పైకెత్తారు. -
జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచందర్ను ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. నాణ్యమైన విద్యనందించాలిమాడుగులపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం మాడుగులపల్లి మండలంలోని కుక్కడం కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఎస్ఓ వసంత, సిబ్బంది సునీత ఉన్నారు. టీబీ వ్యాధి నివారణకు కృషినాగార్జునసాగర్ : టీబీ వ్యాధి నివారణకు జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం నాగార్జునసాగర్లోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, బస్తీ దావఖానను ఆయన సందర్శించారు. అనంతరం దత్తత తీసుకున్న పేషంట్లకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. టీబీ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. చికిత్స తీసుకుంటే టీబీ పూర్తిస్థాయిలో నయమవుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది గంగాబాయి, ఝాన్సీ, లింగయ్య, తిరుమలాచారి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జీపీఓ పరీక్షకు ఏర్పాట్లు పూర్తినల్లగొండ : గ్రామ పాలనాధికారుల (జీపీఓ) నియామకానికి ఈనెల 27న ననల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాని చేరుకోవాలని సూచించారు. లబ్ధిదారుల నమోదు పెంచాలిమిర్యాలగూడ టౌన్ : ప్రతి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారుల నమోదును పెంచాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంపై పిల్లలకు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. పోషణ్ అభియాన్ డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ సతీష్ మాట్లాడుతూ పోషణ ట్రాకర్స్ యాప్లో సాంకేతిక లోపాల, సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఆర్.మమత, సూపర్వైజర్ రాధిక, నాగమణి, లీలాకుమారి, పద్మ, వాణి, హేమాదేవి, మహ్మద్ నజీమాబేగం తదితరులున్నారు. -
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం
ఫ శ్రావణం.. శుభప్రదం చేనేత రుణాలు మాఫీచేయాలినల్లగొండ టౌన్ : చేనేత సహకార సంఘాల రుణాలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం మాఫీ చేయాలని చేనేత సహకార సంఘాల సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మీనరసయ్య కోరారు. శుక్రవారం నల్లగొండలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలలో నేసిన వస్త్రాలు నిలువలు పేరుకుపోయాయన్నారు. వాటిని ధాన్యం తరహాలో ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి టెస్కో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, సత్యనారాయణ, దత్త గణేష్, నల్ల సత్యనారాయణ, జల్లా నరసింహ, కర్నాటి యాదగిరి, పున్న వెంకటేశం, పుట్టబత్తుల శ్రీనివాస్, కడేరు భిక్షం తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ : మండలంలోని తడకమళ్ల గ్రామంలో సర్వే నంబర్ 719లో కబ్జాకు గురైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్స్టేషన్కు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసుకోగా ఈనెల 22న ‘సాక్షి’లో ‘సబ్స్టేషన్ భూమి కబ్జా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన స్థలాన్ని గురువారం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్కుమార్ మాట్లాడుతూ సర్వే నంబర్ 719లో సబ్స్టేషన్కు కేటాయించిన భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించామని, 1.12 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డును ఏర్పాటు చేశామని, ఎవరైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ జొన్నపాల కృష్ణయ్య, పోలీస్సిబ్బంది ఉన్నారు. -
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరం
నల్లగొండ : భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. భావి పౌరులైన విద్యార్థులు ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడమే కాకుండా, వాటికి సంరక్షించాలని సూచించారు. మహిళలు బాగా చదువుకోవాలని, చదువు ఒక్కటే సమస్యలకు పరిష్కార మార్గం అన్నారు. మహిళా డిగ్రీ కళాశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తెలిపారు. మార్చిలో డిజిటల్ తరగతులను ప్రారంభించామని, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అనర్హులకు ఇళ్లు ఇస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తాం
డిండి : ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కేటాయిస్తే సంబంధిత అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం డిండి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించుకోలేని స్థితిలో ఉన్న వారికి స్వయం సహాయక సంఘం నుంచి రుణం ఇప్పించేలా చూడాలని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్ను ఆదేశించారు. అంతకు ముందు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఎరువులు స్టాక్, రిజిస్టర్, ఈ పాస్ మిషన్ను పరిశీలించారు. స్థానిక ఐటీఐ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించి కోర్సులు, అడ్మిషన్ల వివరాలను ప్రిన్సిపాల్ రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహం ఏర్పాటు చేసేందుకుగాను ఐదు ఎకరాల స్థలాన్ని చూడాలని తహసీల్దార్ శ్రీని వాస్గౌడ్కు సూచించారు. ఆమె వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి, చత్రునాయక్, ఎంపీడీఓ వెంకన్న ఉన్నారు. -
నిందితులకు శిక్షపడాలి : ఎస్పీ
నల్లగొండ : నిందితులకు శిక్షపడే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అదుపు చేయడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీలు నర్సింగరావు, శివ నాయుడు.. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో చట్ట ప్రకారం నిందితులను సెర్చ్ చేసే విధానం, స్వాధీన పరుచుకున్న గంజాయిని సీజ్ చేయడం, నిందితులకు కోర్టులో శిక్ష ఎలా పడాలనే అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, రవి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.