breaking news
Nalgonda District News
-
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీలో రాజశేఖర్రెడ్డి, వెంకటేశం
నల్లగొండ టూటౌన్ : జనగామలో జరిగిన టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముదిరెడ్డి రాజశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా పెరుమాళ్ల వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని, రాష్ట్ర కమిటీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని తెలిపారు. ముదిరెడ్డి రాజశేఖర్రెడ్డి పెరుమాళ్ల వెంకటేశం -
బ్యాటరీ వాహనం ఇప్పించండమ్మా..
నల్లగొండ : ‘చేత్తో తిప్పే రిక్షా, ట్రై సైకిల్తో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు బ్యాటరీ వాహనం ఇప్పించి ఆదుకోండి’ అంటూ పలువురు దివ్యాంగులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి విన్నించారు. ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్న మాకు బ్యాటరీ వాహనం ఇప్పిస్తే.. ఏదో ఒక పని చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరో విడత వచ్చే వాహనాల్లో ప్రాధాన్యం ఇస్తామని వారితో చెప్పారు. పథకాలపై అవగాహన కల్పించాలి సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వివిధ బ్యాంకుల్లో ప్రజలు, ప్రభుత్వ శాఖలు నిర్వహించని బ్యాంకు అకౌంట్లలో సుమారు రూ.66 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.20 కోట్లు ఉండగా మిగతావి ప్రజలకు సంబంధించినవని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. యూరియా పంపిణీలో వివాదాలు రాకుండా మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసిన యాప్లో సమస్యలు రాకుండా చూడాలన్నారు. జిల్లాకు త్వరలో రవాణ శాఖ కమిషనర్ వస్తారని.. చిట్యాల అండర్ పాస్, రోడ్డు ప్రమాదాలపై సమీక్షిస్తారని తెలిపారు. దేవరకొండ, పెద్దవూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఈసీఐఎల్ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఆల్ట్రా సౌండ్ మిషన్లు, దివ్యాంగులకు పంపిణీ చేసిన ట్రైసైకిళ్లు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఫ గ్రీవెన్స్లో కలెక్టర్కు దివ్యాంగుల వినతి -
డీఎంహెచ్ఓతో రేపు ఫోన్ ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓతేదీ. 31.12.2025 బుధవారం సమయం: ఉదయం 11–00 నుంచి మధ్యాహ్నం 12–00 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ : 99082 73355 -
పత్తి మిల్లు వద్ద రైతుల ఆందోళన
చండూరు : స్లాట్ బుక్ చేసుకున్నా.. పత్తిని కొనుగోలు చేయడం లేదని చండూరు మండలంలోని బంగారిగడ్డ మంజీత్ పత్తి మిల్లు వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. స్లాట్బుక్ చేసుకున్న దానికి, ట్రాక్టర్లో తెచ్చిన పత్తికి వ్యత్యాసం ఉండటంతో కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్లాట్ బుకింగ్ ఉండి పత్తి ఎక్కువ తెచ్చినా కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు సీసీఐ కేంద్రం నిర్వాహకులు దళారులతో కుమ్మకై ్క రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు సీసీఐ కేంద్రం అధికారి బాలచందర్ నింజేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను ఉంచి ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్లను మిల్లులోకి పంపారు. కానీ కొనుగోలుపై సీసీఐ అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. -
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలు
ఫ వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల కసరత్తు వేగవంతం కానుంది. వార్డుల వారీగా తుది ఓటరు జాబితాలతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఖరారు చేసి జనవరి 10న ప్రకటించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నెల 30న మున్సిపాలిటీల వారీగా వివరాలు సరిచూసుకోవాలని, 31వ తేదీన వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. జనవరి 1న పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాల ముసాయిదా ప్రకటించాలని స్పష్టం చేసింది. 5వ తేదీన మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని వివరించింది. 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాలు ప్రకటించాలని వెల్లడించింది. అలాగే మున్సిపాలిటీల వారీగా 2011 ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలను కూడా జారీచేసింది.డీసీసీబీ పర్సన్ ఇన్చార్జిగాబాధ్యతల స్వీకరణనల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. బ్యాంకు అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సీఈఓ శంకర్రావు, అధికారులు నర్మద, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, పశుసంవర్థక అధికారి డాక్టర్ రమేష్, సంపత్రెడ్డి, శ్రీనివాస్, మైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు డీసీసీబీ అభ్యున్నతికి కృషి చేశాం తన రెండేళ్ల పదవీ కాలంలో బ్యాంకు అభ్యున్నతికి తమ పాలకవర్గం కృషి చేసిందని డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని డీసీసీబీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే నాటికి రూ.900 కోట్ల టర్నోవర్లో ఉన్న బ్యాంకును రూ.3680 కోట్ల టర్నోటర్కు తెచ్చి రూ.60 కోట్ల లాభాల దిశగా నడిపించామన్నారు. రైతులు, విద్యార్థులకు, ఇతర రుణాలను అందించడంలో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ముందున్నామన్నారు. రాష్ట్రంలోనే బ్యాంకును రెండో స్థానంలో నిలిపిన ఘనత తమ పాలక వర్గానికి దక్కిందన్నారు. బ్యాంకు అభ్యున్నతికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మాజీ డైరెక్టర్ సంపత్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పనులుకాలే!
నిధులొచ్చినా.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టినా.. అనుకోకుండా ప్రమాదం జరిగి ఫిబ్రవరి 22వ తేదీన పనులు ఆగిపోయాయి. సొరంగం కూలిన ప్రాంతానికి సమాంతరంగా 100 మీటర్లు జరిపి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వాలని భావించారు. ఇందుకోసం మిలిటరీలో వినియోగించే హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వేను చేయించారు. ఈ సర్వే నివేదిక కూడా ఇటీవల ప్రభుత్వానికి చేరింది. అయితే సొరంగంలో భారీ నీటి ప్రవాహం ఉందని, రాళ్ల నుంచి నీరు, బురద వస్తున్నట్లుగా నివేదించినట్లు తెలిసింది. మరోవైపు ఔట్లెట్ నుంచి తవ్వేందుకు అమెరికా నుంచి బేరింగ్ తెప్పించినా ఆదీ ఆగిపోయింది. మొత్తానికి ఈ సంవత్సరంలో సొరంగం పనులు ముందుకు సాగలేదు. వచ్చే ఏడాదైనా పనులు ప్రారంభం అవుతాయా? లేదా? వేచి చూడాల్సిందే. సింగరాజుపల్లి రిజర్వాయర్ఫ జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు ఫ ఈ ఏడాది డిండి ఎత్తిపోతలకు రూ.1800 కోట్లు.. ఫ ఏఎమ్మార్పీ కాల్వల ఆధునీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఫ అనుకోని ప్రమాదంతో నిలిచిన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఫ 2025లో అభివృద్ధి, సంక్షేమం మాత్రం కాస్త మెరుగు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు 2025 సంవత్సరంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అనే చందంగానే మారాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ఏనాడో ప్రారంభమైనా పూర్తి కాలేదు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించినా కుడి, ఎడమ కాల్వల పనులు ముందుకు సాగలేదు. డిండి ఎత్తిపోతల పథకం పనులు అనేక అవాంతరాల నడుమ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఈ పనులకు ప్రభుత్వం రూ.1800 కోట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)కాలువల లైనింగ్ పనులకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే కొత్త సంవత్సరంలోనైనా వీటి పనులు ముందుకు సాగుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. జిల్లాలో 40 ఏళ్ల కిందట తవ్విన ఏఎమ్మార్పీ కాల్వలు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు, అక్కడినుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయ సముద్రానికి నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మరో 36 కిలోమీటర్ల వరకు కాలువ ఉంది. ఈ కాల్వల లైనింగ్, ఆధునుకీకరణకు రూ.443 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాదైనా ఈ పనులు ప్రారంభమవుతాయా? లేదా? చూడాల్సిందే. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు పూర్తయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో ప్రారంభించారు. అయితే డిస్ట్రిబ్యూటరీల పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కుడి, ఎడమ కాల్వలకు సంబందించి 2,888 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా.. 1,200 ఎకరాలు సేకరించారు. వచ్చే ఏడాదైనా ఎంతమేరకు జరుగుతుందో చూడాలి. జిల్లాలో ఈ ఏడాది సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల గృహ ప్రవేశాలు చేశారు. జిల్లాలో రెండు విడతల్లో 19,697 ఇళ్లను కేటాయించగా, అందులో 17,246 ఇళ్లు ఇప్పటికే మంజూరు చేశారు. వాటిల్లో 13,494 ఇళ్లు గ్రౌండ్ లెవల్ పనులు సాగుతుండగా, 1,868 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 650 ఇళ్లు రూప్లెవెల్లో ఉన్నాయి. మండలానికి 5 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజక వర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాలు నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్ నుంచే ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా అనేక రంగాల్లో ప్రోత్సాహం ఇస్తోంది. పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిలను విడుదల చేసింది. పెట్రోలు బంక్ల ఏర్పాటుకు మహిళ సంఘాలు ముందుకు రావడంతో వాటి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నల్లగొండలోని పానగల్ ఫ్లై వోవర్ నుంచి ఎస్ఎల్బీసీ మెడికల్ కాలేజీ వరకు రూ.500 కోట్లతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణ పనులను ఈ ఏడాది ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాంగా డిండి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏడు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టగా, నాగర్కర్నూల్ జిల్లాలో రెండు, నల్లగొండ జిల్లాలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే వాటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. కాలువల పనులు పెండింగ్లోనే ఉన్నాయి. డిండి ఎత్తిపోతలకు ఏదుల నుంచి నీటిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పెండింగ్లో ఉన్న రిజర్వాయర్ల పనులను పూర్తి చేసేందుకు, కాలువలు తవ్వేందుకు ఇటీవల రూ.1800 కోట్లను కూడా మంజూరు చేసింది. టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమతున్నారు. అయితే ఆ పనులు 2026 సంవత్సరంలో ఎంత మేరకు సాగుతాయో వేచి చూడాల్సిందే. -
ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ చూపాలి
చిట్యాల, నార్కట్పల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్శాఖ శ్రద్ధ చూపాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, చిట్యాల పట్టణంలో హైవేపై నిర్మిస్తున్న ఫ్రై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను, రైల్వే అండర్ బ్రిడ్జి కింద గల హైవే రోడ్డును, నార్కట్పల్లి వద్ద నల్లగొండ బైపాస్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. రోడ్డుపై అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో హైవే రోడ్డుపై లైటింగ్, ప్రమాదకర హెచ్చరిక బోర్డులను, రిప్లెక్టివ్ సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ కె.శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐలు రవికుమార్, క్రాంతికుమార్, చిట్యాల మున్సిపల్ కమిషన్ శ్రీను, హైవే అధికారులు ఉన్నారు. గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 42 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
సాఫ్ట్వేర్ లోపం.. పత్తి రైతుకు శాపం
ఫ కపాస్ కిసాన్ యాప్లో పత్తి క్వింటాళ్ల నమోదులో తేడాలు ఫ యాప్లో చూపించకపోతే కొనుగోలు చేయలేమన్న సీసీఐ కేంద్రం నిర్వాహకులు ఫ చిట్యాలలో ఆందోళనకు దిగిన రైతులు చిట్యాల : కష్టపడి పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి పంటను సాఫ్ట్వేర్ లోపం కారణంగా క్వింటాళ్ల నమోదులో తేడాలు వచ్చాయి. దీంతో కొనుగోలు చేయలేమని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో చేసేది లేక పత్తి రైతులు చిట్యాలలో సోమవారం ఆందోళనకు దిగారు. పత్తి రైతులంతా కలిసి చిట్యాల–ఉరుమడ్ల రహదారి వెంట ఉన్న పత్తి మిల్లు ఎదుట ధర్నా చేశారు. యాప్ నమోదులో తేడాలు.. నల్లగొండ జిల్లాలోని మునుగోడు, నల్లగొండ మండలాలకు చెందిన వందాలాది రైతులు తాము పండించిన పత్తి పంటలను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో చిట్యాలలోని కృష్ణా కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రానికి కేటాయించారు. దీంతో సోమవారం సుమారు 175 మందికి పైగా పత్తి రైతులు పత్తిని మిల్లుకు తీసుకొచ్చారు. స్లాట్బుక్ చేసే సమయంలో ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా పత్తిని అమ్ముకునేందుకు స్లాట్బుక్ అయ్యింది. సోమవారం సీసీఐ కేంద్రంలో విక్రయానికి వచ్చే సమయానికి ఎకరాకు 4 క్వింటాళ్ల పత్తిని విక్రయించేందుకుగాను యాప్లో చూపిస్తోంది. యాప్లో చూపించిన మేరకే పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో కపాస్ కిసాన్ యాప్లో తాము మొదటగా స్లాట్బుక్ నమోదు చేసుకున్నప్పుడు నమోదైన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు అందోళనకు దిగారు. చిట్యాల–ఉరుమడ్ల రోడ్డులో కాటన్ మిల్లు ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఐదు రోజుల్లో రెండుసార్లు.. యాప్లో ఏర్పడిన సాఫ్ట్వేర్ లోపంతో ఐదు రోజుల్లో రెండుమార్లు రైతులు ఇబ్బందులు పడ్డా.. సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి పత్తిని తీసుకొచ్చి తిరిగి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు.. అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్.. సీసీఐ ఏరియా మేనేజర్ మున్షికి ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అయితే యాప్లో వచ్చిన దానికి అదనంగా ఐదు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. చిట్యాలలో కిసాన్ యాప్లో తమకు నమోదైన పత్రాలను చూపుతున్న రైతులుచిట్యాలలో కాటన్ మిల్లు ఎదుట ధర్నా చేస్తున్న పత్తి రైతులుగుజ్జ గ్రామంలో నాకున్న నాలుగెకరాల్లో పండిన పత్తి పంటను అమ్ముకునేందుకుగాను కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే 43 క్వింటాళ్ల పత్తిని అమ్ముకునేందుకుగాను బుక్ అయ్యింది. విక్రయానికి కాటన్ మిల్లు వద్దకు రాగానే యాప్లో 14 క్వింటాళ్లు మాత్రమే నమోదైందని.. అంతే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. స్లాట్ బుక్ చేసిన సమయంలో నమోదైన పత్తిని కొనుగోలు చేసేందుకుగాను అధికారులు సహకరించాలి. – దోడ క్రిష్ణారెడ్డి, పత్తి రైతు, గుజ్జ గ్రామం రైతులు పత్తి విక్రయానికి తీసుకువచ్చినప్పుడు కిసాన్యాప్లో నమోదైన క్వింటాళ్ల మేరకు పత్తిని కొనుగోలు చేస్తాం. సాఫ్ట్వేర్ లోపంతో జరిగిన తప్పిదాలకు తాము ఏమీ చేయలేం. ఆందోళన చేసిన రైతుల సమస్యనుపై అధికారులకు తెలియజేసి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తాం. – కోటేశ్వరరావు, సీసీఐ కేంద్రం సీపీఓ, చిట్యాల -
కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీస్శాఖ ముందంజ
నల్లగొండ: పోలీసు శాఖ తీసుకున్న చర్యల వల్ల 2024తో పోల్చితే 2025లో నేరాలు తగ్గాయి. మహిళల భద్రత, పిల్లల రక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతతోపాటు యువత సాధికారత వంటి రంగాల్లో పోలీస్శాఖ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మహిళలపై నేరాలు కాస్త పెరిగాయి. సైబర్ కేసులు పెరిగినప్పటికీ వారు కోల్పోయిన సొత్తును రికవరీ చేయడంలో మెరుగ్గా ఉంది. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. చాలా కేసుల విషయంలో సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను న్యాయస్థానం ముందు ఉంచి శిక్షలు పడేలా పోలీస్ శాఖ కృషి చేసింది. జిల్లా పోలీస్ శాఖ జిల్లాలో వివిధ కేసుల్లో నేరస్తులకు నేర నిరూపన చేయడంలో పోరెన్సిక్ మద్దతు, డిజిటల్ ఆధారాలతో పాటు, అభియోగ అధికారులతో సమన్వయం, సాక్షులకు రక్షణ కల్పించడం, వాంగ్మూలం నమోదు వంటి చర్యలు తీసుకుంది. దీంతో నిందితులకు జీవిత ఖైదు, మరణ శిక్షలు పడేలా కృషి చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 130 మంది నేరస్తులకు శిక్షపడేలా సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు ఉంచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాలు పెరిగాయి. గత సంవత్సరం 235 కేసులు నమోదు కాగా దానిలో బాధితులు రూ.16,31,08,000 కోల్పోగా.. రూ.1,25,50,279 రికవరీ చేశారు. ఈ సంవత్సరం 255 కేసులు నమోదు చేయగా కేవలం రూ.4,62,03,509 కోట్లు నష్టపోయారు. దానిలో రూ.1,48,20,918 రికవరీ చేశారు. అంటే కేసులు అధికంగా నమోదు అయినా రికవరీలో ఈ సంవత్సరం పోలీస్ శాఖ మెరుగు పడింది. గత సంవత్సరంతో పోలిస్తే పోలీస్ శాఖ తీసుకున్న వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గత సంవత్సరం 41 బ్లాక్ స్పాట్లు ఉంటే ఈ సంవత్సరం అవి 30కి తగ్గాయి. గత సంవత్సరం మొత్తం 907 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 1,197 మంది బాధితులు ఉన్నారు. ఈ సంవత్సరం 897 ప్రమాదాల్లో.. 1075 మంది బాధితులు ఉన్నారు. జిల్లాలో 2024లో దోపిడీ కేసులు నాలుగు నమోదయ్యాయి. కానీ, ఈ సంవత్సరం ఒక్కటి కూడా నమోదు కాలేదు. చోరీ కేసులు గత సంవత్సరం 10 నమోదుకాగా.. ఈ ఏడాది 6కు తగ్గాయి. గత సంవత్సరం 700 ఆస్తి నేరాల కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం 600కే పరిమితం అయ్యాయి. గత సంవత్సరం 35 మర్డర్ కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 24కు తగ్గాయి. నేరపూరిత హత్యలు మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5 పెరిగాయి. రేప్ కేసులు గత సంవత్సరం 101 నమోదు కాగా ఈ సంవత్సరం 87కు తగ్గాయి. వివిధ సంఘటనల్లో గాయపడిన, మోసాలు తదితర కేసులు కూడా తగ్గాయి. ఈ కేసుల్లో ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మత్తు పదార్థాలను అరికట్టే విషయంలో కేసులు నమోదు చేయడంతో పోలీస్ శాఖ ముందంజలో ఉంది. గత సంవత్సరం 36 కేసులు నమోదు చేసి 139 మందిని అరెస్టు చేయగా, ఈ సంవత్సరం 53 కేసులు నమోదు చేసి 251 మందిని అరెస్టు చేసింది. ఫ సైబర్ కేసులు పెరిగినా.. సొత్తు రికవరీలో మెరుగు ఫ దోపిడీ, చోరీ కేసుల్లోనూ తగ్గుదల ఫ అవగాహన కార్యక్రమాలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు ఫ ఈ ఏడాది జిల్లాలో తగ్గిన క్రైం రేటు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళలపై నేరాలు స్వల్పంగా పెరిగాయి. 2024లో 684 కేసులు నమోదైతే, ఈ సంవత్సరం 703 కేసులు నమోదయ్యాయి. వరకట్నం కేసులు గత సంవత్సరం ఒక్క కేసు నమోదు.. ఇప్పుడు రెండు నమోదయ్యాయి. మహిళల వేధింపు కేసులు గత సంవత్సరం 313 నమోదైతే.. ఈ సంవత్సరం 346కు పెరిగాయి. మహిళ హత్యలు 9 నుంచి 11కు పెరిగాయి. అత్యాచారం కేసులు గత సంవత్సరం 101 నమోదుకాగా.. ఈ సంవత్సరం 87కు తగ్గాయి. కిడ్నాప్ కేసులు గత సంవత్సరం 26 నమోదు కాగా, ఈ సంవత్సరం 27 నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులు గత సంవత్సరం 216 నమోదు కాగా ఈ సంవత్సరం 196కు తగ్గాయి. బహుభార్యత్వం కేసులు తగ్గాయి. పోక్సో చట్టం కింద చిన్నపిల్లల నేరాలకు సంబంధించిన కేసులు గత సంవత్సరం 201 నమోదు కాగా అవి 117కు తగ్గాయి. ఈ విషయంలో పోలీస్శాఖ కొంత మెరుగు పడిందనే చెప్పాలి. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ సభను కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అద్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఎన్జీకాలేజీ నుంచి శివాజినగర్, రామగిరి, బస్టాండ్, ప్రకాశంబజార్ మీదుగా గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారం సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తనను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. నల్లగొండ జిల్లాను, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నల్లగొండలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రాజెక్టులు కట్టి, సీలింగ్ విధానం తెచ్చి పేదలకు భూములు పంచారని తెలిపారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలే.. తనకు పేరు వస్తుందని పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం శ్రీశైలం సొరంగంలో ఒక్క పనీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు ప్రారంభించామని, సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ సహకారంతో రెండేళ్లలో సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో కాలు అడ్డం పెడితే ప్రతి ఎకరాకు నీరందే విధంగా చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం కోమటిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి నాయకత్వంలో నల్లగొండ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 45 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హపీజ్ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, సంపత్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, అనూప్రెడ్డి, ఇంతియాజ్ అలీ, నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఫ ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తా ఫ రెండేళ్లలో శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేస్తా ఫ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి -
విలపించిన పుల్లెంల
గట్టుప్పల్,చండూరు : పుల్లెంల కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ హనుమంతు ఎటుపోయిండని బోరున విలపించింది. ఒడిశా రాష్టంలో ఈనెల 25న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు ఆలియాస్ గణేష్ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన పుల్లెంలకు చేరుకుంది. ఆయన కడసారి చూపు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. గ్రామాన్ని ముందుగానే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నా.. ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉదయం నుంచే గ్రామంలో ఎదురు చూశారు. అంబులెన్స్లో ఆయన పార్థివదేహం వచ్చాక ప్రజలు ఎర్ర జెండాలు చేతబూని అంబులెన్స్పై పూలు చల్లుతూ ర్యాలీగా హనుమంతు ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా హనుమంతు ఇంటి దగ్గరకు పరుగులు పెట్టారు. ఆయన పార్థివదేహాన్ని చూపిన జనం బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని గుండెలవిసేలా రోదించారు. ఆయనకు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ‘జోహార్ హనుమంతు’ నినాదాలతో ఆయన అంతిమయాత్ర గ్రామంలో మూడు గంటలపాటు సాగింది. ఫ అశ్రునయనాలతో మావోయిస్టు నేత హనుమంతుకు అంతిమ వీడ్కోలు -
నల్లగొండ మున్సిపల్ కమిషనర్కు పదోన్నతి
నల్లగొండ టుటౌన్ : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్కు గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేడ్–2 కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ముసాబ్ అహ్మద్ గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్గా అవకాశం దక్కింది. పదోన్నతి పొందిన ఆయనకు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అబినందనలు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం మిర్యాలగూడ అర్బన్ : రైలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ఆరోమాసింగ్ ఠాకూర్ అన్నారు. మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన రైల్వే రక్షణ దళ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. రైల్వే ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆధునిక రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాసింజర్ల సామగ్రి భద్రతతో పాటు ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. దక్షణమద్య రైల్వే పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాశ్వత ఐడీలను సేకరిస్తున్నామని, భద్రతా బృందాలను పెంచి సెల్ఫోన్, చైన్ స్నాచింగ్ అరికట్టే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయ రైల్వేలో భద్రతను పటిష్టం చేసేందుకు సురఖా సమ్మేళన్, మేరీ సహేళి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గాంధీ పేరు తొలగింపు దుర్మార్గం నల్లగొండ : ఉపాధిహామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరు తొలగింపు దుర్మార్గపు చర్య అని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. ఆదివారం నల్లగొండలో శివాజీనగర్ నుంచి రామగిరిలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ చిత్రపటాలతో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రపంచంలో నేడు భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి గాంధీ, నెహ్రూ దూరదృష్టి కారణమన్నారు. కార్యక్రమంలో కన్నారావు, ఎండీ.ముంతాజ్ అలీ, బోడ స్వామి, నూనె కోటి, జిల్లా పరమేష్, సుధాకర్, పుట్ట వెంకన్న, రాంబాబునాయుడు, రవితేజ, బాలకృష్ణ, రఫీ, శివ, బ్రహ్మచారి, టి.యాదగిరి, మహేష్, కోటేష్, సంతోష్, సాయితేజ, దశరథ, శరత్, సాయి, లక్ష్మణ్, ఉమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. డిండి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదలడిండి: డిండి ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం 14.53లక్షల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ రాజారాం మాట్లాడారు. ప్రభుత్వం చెరువులో ఉచితంగా వదిలే చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మత్స్యకారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్లగంతుల రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ సొసైటీ చెర్మన్ మేకల కాశన్న, ఎఫ్డీఓ మారయ్య, వెంకటేష్, బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. క్రిస్మస్తో పాటు వారాంతపు సెలవులు ముగియడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు రాజధానికి తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అదనంగా రెండు లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాలు భారీ సంఖ్యలో వస్తుండటంతో టోల్ప్లాజా దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి
నకిరేకల్ : తెలంగాణ గర్వించదగ్గ మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన గింజల నర్సింహారెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా బాలాచారి మాట్లాడుతూ గింజల నర్సింహారెడ్డి సాహిత్యంలోని గాఢత, అభివృద్ధికి, అలంకారీక సౌందర్యం నేటి తరం కవులు అలవర్చుకోవాలన్నారు. కవి, చరిత్రకారులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచేపోయే కవిత్వాలను గింజల నర్సింహారెడ్డి రాశారని గుర్తు చేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ముసుగు కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, కందాల పాపిరెడ్డి, కవులు జిలకర జమదగ్ని, బరిగల శ్రవణ్, షీలా అవిలేను, మెంతబోయిన సైదులు, మామిడి లింగస్వామి, సంగభట్ల నర్సయ్య, ఎం.జానకిరాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, కోల్లోజు కనకాచారి, చిక్కు చంద్రమౌళి, కందుల సోమయ్య, కుకడాల గోవర్ధన్, సాగర్ల సత్తయ్య, సారంగి వెంకన్న, తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మంచి పనులే చరిత్రలో నిలుస్తాయి
మిర్యాలగూడ : గొప్ప వ్యక్తులు చేసిన మంచి పనులే చరిత్రలో నిలుస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నభీమోజు మదనాచారి పుస్తకావిష్కరణ సభలో వారు పాల్గొని మాట్లాడారు. మదనాచారి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారని అన్నారు. తన తోటి కాంగ్రెస్ మిత్రుడు రాంరెడ్డిని హత్య చేసేందుకు వచ్చిన ప్రత్యర్ధులను నిలువరించే క్రమంలో ఆయన హత్యకు గురయ్యారని గుర్తుచేశారు. ధైర్యం, ప్రేమగుణం మదనాచారి నైజమని.. అది భావితరాలకు మార్గదర్శకమన్నారు. తక్కువ కాలమే జీవించినప్పటికీ ఇతరులకు ఆదర్శంగా మదనాచారి బతికారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారని, ఆనాటి పోరాట యోధులకు ఆయుధాలు తయారుచేసి అందించిన ఘనత ఇక్కడి విశ్వకర్మలదేనన్నారు. పోలీసుల దాడులు చిత్రహింసలకు సైతం విశ్వకర్మలు బలి అయ్యారని.. నాటి విశ్వకర్మల నుంచి నేటి మావోయిస్ట్ మల్లోజు వీరన్న, శ్రీకాంతాచారి, కొత్తపల్లి జయశంకర్ అనేక మంది త్యాగాలు ఇమిడి ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్నాయక్, ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. మదనాచారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన విగ్రహ ప్రతిష్ఠించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు సిడి రవికుమార్, చిరుమర్రి కృష్ణయ్య, సిద్దార్ధ, బంటు సైదులు, సాధినేని శ్రీనివాస్, గౌరు శంకర్, అన్నభీమోజు నాగార్జునచారి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, మదనాచారి, వేణుగోపాల్రెడ్డి, పుస్తక రచయిత తాటికొండ సురేష్, చిట్టిబాబునాయక్, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఇలియాస్ తదితరులు ఉన్నారు. ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి -
ఒడిదుడుకుల సాగు
నల్లగొండ అగ్రికల్చర్ : 2025 వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తి 5,56,826 ఎకరాల్లో, వరి 5,48,134 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే వర్షాలకు పంటలు దెబ్బతిని ఓవైపు, పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఎదురైన సమస్యలతో మరోవైపు ఇబ్బందులు తప్పలేదు. ఇక యూరియా కోసం రైతులు రాత్రింబవళ్లు పీఏసీఎస్ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముంచిన అత్యధిక వర్షం.. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ అక్టోబర్, నవంబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా అధిక వర్షం కురిసింది. అప్పటికే పత్తి కాయ పగులే దశలో ఉండటంతో కాయలు రాలడంతో పాటు పగిలిన పత్తి కారిపోయింది. 25,919 ఎకరాల్లో 30 శాతానికి పైగా పంట దెబ్బతిందని యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. వర్షంతో ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న పత్తి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 35,487 ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. వర్షాల వల్ల వరి చేలు నీటిలో మునిగి ధాన్యం మొలకెత్తింది. దీని కారణంగా వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అమ్ముకోవడానికి అష్టకష్టాలు.. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో పండించిన పత్తి, ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడ్డారు. పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి పోతే తేమ శాతం ఎక్కువగా ఉందని నెల వరకు కొనుగోలు చేయలేదు. పత్తి అమ్మకానికి కపాస్ కిసాన్ యాప్లో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉండగా దానిపై అవగాహన లేక నేటికీ ఇంకా పత్తిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం కోసం తెచ్చి రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలు లేని కారణంగా పచ్చి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తెచ్చారు. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడంతో దాన్యాన్ని రోజుల తరబడి కేంద్రాల వద్ద ఆరబెట్టుకుని అమ్ముకోవాల్సి వచ్చింది. యూరియా కోసం పడిగాపులు.. వానాకాలం సీజన్లో ఒకేసారి పత్తి, వరి చేలకు యూరియా వేసే సమయం రావడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. డిమాండ్కు తగినట్లుగా ప్రభుత్వం యూరియాను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు చెప్పులను, పాస్బుక్లను లైన్లో పెట్టి రాత్రిళ్లు కూడా ఆయా కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. యాంత్రికరణ పథకం వాయిదా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం తప్ప అడుగు ముందుకు పడలేదు. పథకం అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుందే తప్ప.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులకు 2025 సంవత్సరంలో వ్యవసాయం కలిసి రాలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వానాకాలంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులకు అతివృష్టి, అనావృష్టి కన్నీరు మిగిల్చింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు అప్పుల పాలయ్యారు. యాసంగి సీజన్ ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సీజన్ ఆరంభమైనందున విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, వరి నాట్ల కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు, పొలాలు, దున్నకాల కోసం రైతులు పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు చెల్లిస్తుందో అన్న ఎదురు చూపుల్లో రైతులు ఉన్నారు. ఫ వానాకాలంలో భారీ వర్షాలతో రైతులు ఆగం ఫ సగానికి పడిపోయిన దిగుబడులు ఫ పంటలు అమ్ముకునేందుకు తిప్పలు ఫ యూరియా కోసం తప్పని పడిగాపులు ఫ రైతు భరోసాకు తప్పని ఎదురుచూపులు ఫ రైతులకు కలిసిరాని 2025 సంవత్సరం -
సరికొత్తగా సెలబ్రేషన్స్
మూడు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లోని యువకులు గ్రూపులుగా ఏర్పడి విందు, మందు, వినోదం ఉండేలా వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 31వ తేదీ రాత్రి కేక్ కట్ చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఫ ఇయర్ ఎండ్ వేడుకలకు సిద్ధమవుతున్న యువత ఫ పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ ఫ ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేసేందుకు కొందరి ఆసక్తి ఫ ఫామ్హౌస్లలో విందు, వినోదాలకు ప్రణాళిక ఫ ‘మ్యూజికల్ నైట్స్’ నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు సూర్యాపేట టౌన్, రామగిరి(నల్లగొండ), భువనగిరిటౌన్ : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికే సమయం దగ్గర పడింది. ఆట పాటలతో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరిపేందుకు యువత ప్రణాళికలు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలో యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే యోచనలో ఉన్నారు. కొందరు యువకులు గోవా, వైజాగ్, అరకుతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్ శివారులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్, పబ్లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు, వ్యాపారులు తమ కుటుంబంతో కలిసి రిసార్ట్స్లో వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 31న ఉదయమే హైదరాబాద్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువకులు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాలు, గ్రామాల సమీపంలోని తోటల్లో న్యూఇయర్ వేడుకలకు జరుపుకునేందుకు యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుండగా.. ఇప్పుడు ట్రెండ్ మార్చుకుని స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వంటకాలు చేసుకుని పల్లె పదాలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాటి కల్లు తీసుకుని.. కుండ చికెన్, వివిధ మాసాంహార వంటలు, రొట్టెలు స్వయంగా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏడాది 31 రోజు వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు పెడుతుంటారు. హోటళ్ల ఎదుట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకుంటే కిలో కేక్.. కిలో కేక్ తీసుకుంటే లీటరు కూల్ డ్రింక్ ఇలా ఆఫర్లు పెడుతూ బేకరీలు, హోటళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. యువత అభిరుచికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నారు. 31వ తేదీన నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ఇక, నల్లగొండ పట్టణం సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో న్యూ ఇయర్ నైట్ పార్టీకి ఏర్పాట్లు చేశారు. పార్టీకి హాజరయ్యే సింగిల్, జంటలకు ఎంట్రీ ఫీజు వసూలు చేయనున్నారు. -
చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు గాను ఆలయ ఆవరణలో కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్బాబు సమక్షంలో శనివారం వేలం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేఎం హెయిర్స్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు రూ.2.50 కోట్లకు తలనీలాల సేకరణ హక్కును దక్కించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు బీజేపీ నేతల పంచాయితీనల్లగొండ టూటౌన్ : నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, పార్టీ నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజుయాదవ్ వర్గాల మధ్య జరిగిన వివాదం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వద్దకు చేరింది. ఈ ఘటనపై ఇద్దరు నాయకులతో మాట్లాడిన రాంచందర్రావు జనవరి 2వ తేదీ వరకు దీనిపై ఎవరూ మాట్లాడవద్దని తనదైన శైలిలో చెప్పినట్లు తెలిసింది. జనవరి 2వ తేదీన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే జిల్లా నాయకుల వ్యవహారశైలి, నాయకుల మధ్య వర్గపోరు, పార్టీ బలోపేతం చేయకుండా కొట్టుకుంటున్న వ్యవహారంపై చర్చించనున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. తాను మాట్లాడే వరకు ఏ సమావేశంలో కూడా ఈ ఘటనపై గప్చుప్గా ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. కాగా.. శనివారం పిల్లి రామరాజు యాదవ్.. రాంచందర్రావును కలిసి జరిగిన ఘటనపై వివరించారు. హనుమంతు కుటుంబానికి పరామర్శచండూరు : ఒడిశాలో ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి శనివారం చండూరు మండలం పుల్లెంలలో పరామర్శించారు. హనుమంతు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్న ఆయన బావ మల్లిక్తో మాట్లాడారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. హనుమంతును లొంగిపొమ్మని చెప్పేందుకు తాను ప్రయత్నించానని, అందులో భాగంగానే ఒడిశా వెళ్లి 10 రోజులు ఉన్నా.. హనుమంతును కలవడం కుదరలేదని మల్లిక్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నలపరాజు రామలింగయ్య, నలపరాజు సతీష్, పుల్లెంల మాజీ సర్పంచ్లు పాలకూరి సత్తయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, సర్పంచ్ ముక్కాముల వెంకన్న, తిప్పర్తి రాములు, అంజాచారి, కరీం, వెంకట్రెడ్డి, శివర్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ సభను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి కోరారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ యూరియా విషయంలో కొత్తగా తీసుకొచ్చిన యాప్పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీపీఐ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్లను సన్మానించారు. సమావేశంలో బుచ్చిరెడ్డి, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్రెడ్డి, లోడంగి శ్రావణ్ కుమార్, ఉజ్జని యాదగిరిరావు, వీరస్వామి, నర్సింహ, రామచంద్రం, వెంకటేశ్వర్లు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రజలతో మమేకం కావాలి
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నకిరేకల్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికై న వారు రాజకీయాలకతీతంగా ప్రజలతో మమేకమై గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నకిరేకల్లో శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ గతంతో పోలిస్తే గ్రామ రాజకీయాలు పూర్తి మారిపోయాయన్నారు. సామాన్య కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజలతో మమేకమైతే ఎప్పుడూ ఆశ్వీరదిస్తారని, తన రాజకీయ జీవితమే అందుకు ఉదాహరణ అని చెప్పారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో సర్పంచ్ పదవి కీలకమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులుగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, పూజర్ల శంభయ్య, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితా, చామల శ్రీనివాస్, గాజుల సుకన్య, నకిరెకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, పన్నాల రాఘవరెడ్డి, యాసా కరుణాకర్రెడ్డి, గాదగోని కొండయ్య, నరేందర్ పాల్గొన్నారు.కృష్ణపట్టెలో మొసళ్ల భయం కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. - 8లోఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి -
మున్సిపోల్స్కు రెడీ..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది. పదవీ కాలం ముగిసి 11 నెలలు.. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పునర్విభజన లేకపోతే జనవరిలోనే షెడ్యూలు ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది. ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ఫ ముందుగా మున్సిపాలిటీ.. ఆ తరువాతే పరిషత్ ఎన్నికలు! ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తంచండూరు 5,653 5,717 1 11,370 చిట్యాల 5,519 5,450 0 10,969 దేవరకొండ 11,712 12,270 1 23,983 హాలియా 6,132 6,439 0 12,571 మిర్యాలగూడ 42,744 44,685 0 87,429 నకిరేకల్ 11,755 12,463 0 24,218 నల్లగొండ 62,215 64,828 1 1,27,044 నందికొండ 6,560 6,975 0 13,535 ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,32,291 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 64,900 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి
నల్లగొండ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటారని తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలు ఇలా.. ఫ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దు. ఫ ఫామ్ హౌస్, క్లబ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దు. ఫ ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దు. ఫ మైనర్లకు బైకులు ఇవ్వొద్దు. వాహననడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తాం. ఫ త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లను తీసివేసి వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తాం. ఫ గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
వైభవంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం వంటి పూజలు నిర్వహించారు. -
లైనింగ్కు మోక్షం
ఏఎమ్మార్పీ ప్రధానకాల్వగుర్రంపోడు : ఎలిమినేటి మాదవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ లైనింగ్ పనుల్లో ముందడుగు పడింది. లైనింగ్ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ పూర్తయింది. ఏఎమ్మార్పీ లైనింగ్ పనులకు మే నెలలో ప్రభుత్వం రూ.442 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసి.. టెండర్లు పిలిచింది. రూ.339 కోట్లకు ఓ కంపెనీ టెండర్ దక్కించుకుంది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. ప్రస్తుతం నీటి విడుదల జరుగుతున్నందున యాసంగి సీజన్ ముగియగానే వేసవిలో పనులు ప్రారంభించేలా కంట్రాక్టు సంస్థ సన్నద్ధమవుతోంది. ముందస్తుగా త్వరలో కంపచెట్ల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. జనవరి నెలలో సీఎం చేతుల మీదుగా లైనింగ్ పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. చివరి భూములకు అందని నీరు ఏఎమ్మార్పీ కాల్వ చివరి భూములకు నీరు అందకపోవడానికి కారణం ప్రధాన కాల్వతోపాటు ఏ మేజర్కు సీసీ(సిమెంట్ కాంక్రీట్) లైనింగ్ లేకపోవడమే. మూడు దశాబ్దాలుగా సీసీ లైనింగ్ లేకుండా నీరు అందిస్తున్నారు. ప్రధానకాల్వకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే కోతకు గురైన గండ్లు పడే ప్రమాదం ఉండటంతో 3 వేల క్యూసెక్కులకుగాను కేవలం 1200 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. దీంతో చివరి భూములు బీళ్లుగా మారుతున్నాయి. మేజర్ల లైనింగ్ ప్రతిపాదనలు పెండింగ్ డిస్ట్రిబ్యూటరీల్లో 50 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండి ఎక్కువ ఆయకట్టు గల ప్రధానమైన డి–19, డి–22, డి–25 మేజర్లకు లైనింగ్ పనులకు రూ.150 కోట్లతో ఇప్పటికే పంపిన ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క డి–25 మేజర్ కింద 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ నిధులు కూడా మంజూరైతే ప్రధాన మేజర్లకు లైనింగ్ జరిగి పూర్తిస్ధాయిలో ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. కాల్వ వెడల్పు చేయాలని డిమాండ్ ప్రస్తుతానికి ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ పనులకే పరిమితంగా కాగా జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి కాల్వ వెడల్పునకు డిమాండ్ వస్తుండడంతో.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రధాన కాల్వను మూడు వేల క్యూసెక్కులకు సరిపడా డిజైన్ చేశారు. అప్పట్లో 2.20 లక్షల ఆయకట్టుతో డిజైన్ చేయగా.. ప్రస్తుతం బ్రహ్మణవెల్లంల, ఉదయ సముద్రం, అయిటిపాముల ప్రాజెక్టులు వచ్చాయి. వీటి ఆయకట్టు 1.10 లక్షలు ఉంది. తొలుత ఆరుతడి పంటలకే కాల్వను డిజైన్ చేయగా.. ఇప్పుడు వరిసాగే ఎక్కువగా జరుగుతోంది. అన్నింటికి మూడు వేల క్యూసెక్కులు సరిపోవు. దీంతో ప్రధాన కాల్వను మరో ఆరు మీటర్ల వెడల్పు పెంచి లైనింగ్ పనులు చేపట్టాలనే డిమాండ్ ఉంది. పనులు ప్రారంభమయ్యేలోగా కాల్వ వెడల్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 136 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పొడవునా 55 మేజర్ల ద్వారా 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్లగొండ పట్టణంతోపాటు హైదరాబాద్కు నీరందించే కోదండాపురం నీటి శుద్ధి కేంద్రానికి తాగునీరు ఏఎమార్పీ నుంచే అందాల్సి ఉంది. ఏఎమార్పీ ప్రధానకాల్వ కామన్ పాయింట్ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ వరకు 113 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వకు సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. యాసంగి నీటి విడుదల ముగిసేలోగా కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, సామగ్రిని సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఆంధ్రా పాంతంలో పలు ప్రాజెక్టుల లైనింగ్ పనులు చేసిన అనుభవం ఇక్కడి లైనింగ్ పనులు దక్కించుకున్న కంపెనీకి ఉన్నట్లు తెలుస్తోంది. ఫ రూ.339 కోట్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఫ పూర్తయిన అగ్రిమెంట్ ఫ యాసంగి సీజన్ ముగియగానే ప్రారంభం కానున్న పనులు ఫ నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేలా లక్ష్యం ఫ కాల్వ వెడల్పుపై స్పష్టత కరువు -
4.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
నల్లగొండ : వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దగ్గర పడ్డాయి. రెండు నెలల క్రితం జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 4.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా కేంద్రాల్లో 25 నుంచి 30 టన్నుల ధాన్యం ఉంది. ఈ నెల చివరిలోగా అవి కూడా కాంటాలు వేస్తే.. కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. 60 కేంద్రాల్లో ధాన్యం రాశులు ఈ సీజన్లో మొత్తం 392 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయ్యాయి. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలో ఆలస్యంగా కోతలు ప్రారంభం కావడంతో అక్కడ ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వస్తోంది. అక్కడ 60 కేంద్రాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి. వెంటనే ట్రక్ షీట్ ఇవ్వని మిల్లర్లు.. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 85,175 మంది రైతుల నుంచి రూ.1158 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు చెల్లించింది రూ.1078 కోట్లే. ఇంకా రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ట్యాబ్ ఎంట్రీలు చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపినా మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో ఆలస్యం అవుతోంది. దీంతో ట్యాబ్ ఎంట్రీలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులకు చెల్లింపుల్లోనూ ఆలస్యం అవుతోంది. ఫ కేంద్రాల్లో మరో 30 టన్నులు ఉన్నట్లు అంచనా ఫ ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం -
జీవాల ఆరోగ్యం పదిలం
ఈ నెల 31వ తేదీ వరకు జీవాలకు నట్టల నివారణ మందు తాగిస్తాము. లక్ష్యాన్ని నూరుశాతం పూర్తి చేస్తాం. పెంపకం దారులంతా తమ జీవాలకు నట్టల మందును తాగించాలి. గ్రామాలకువచ్చే పశువైద్య సిబ్బందికి సహకరించాలి. – డాక్టర్ జీవీ రమేష్, జిల్లా సంవర్థక శాఖ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించే కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. జీవాల్లో నట్టలను నివారించడానికి జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 10 లక్షల గొర్రెలు, 3 లక్షల మేకలు ఉన్నట్లు జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటికి మందు తాగించడానికి 250 మందితో 78 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఉదయం 8 గంటలకే మందల వద్దకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును తాగిస్తున్నాయి. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 60 శాతం జీవాలకు నట్టల నివారణ మందును తాగించారు. ఈ నెలఖరు నాటికి నూరు శాతం మందును తాగించే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా జిల్లా పశు వైద్య సంవర్థక శాణ ముందుకు సాగుతోంది. మందు తాగించడం వల్ల ప్రయోజనాలు జీవాలైన గొర్రెలు, మేకల్లో నులిపురుగులు, కార్జపు జలగలు, పొట్ట జలగలు, బద్దె పురుగులు మొదలైనవి ఉండడం వల్ల జీవాలు నీరసించిపోతాయి. దీని కారణంగా పెరుగుదల మందగించడం, రక్తహీనత, ఎదకురాకపోవడం, బలహీనమైన పిల్లలు జన్మించడం, ఇతర వ్యాధుల బారిపడుతాయి. నట్టల నివారణ మందును తాగించడం వల్ల అంతర పరాన్న జీవులు చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగుదల బాగుండి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు కూడా సోకవు ఫ జిల్లాలో ముమ్మరంగా నట్టల నివారణ కార్యక్రమం ఫ గొర్రెలు, మేకలకు మందు తాపిస్తున్న పశువైద్య బృందాలు -
ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29, 30తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 సాయంత్రం 5 గంటలకు మంగళవాయిద్యం, వేదమంత్రపఠనం, శాసీ్త్రయ సంగీత కచేరీతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రాత్రి 8 గంటలకు భక్త రామదాసు హరికథ, లక్ష్మీనృసింహనామ ససంకీర్తనం నిర్వహించనున్నారు. 30వ తేదీ తెల్లవారుజామున స్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయంలో లక్షారేపత్రి పూజ, గ్రామోత్సవం, స్వామి వారి ఆలయ ప్రవేశం, రాత్రి 8 గంటలకు మట్టపల్లి క్షేత్ర మహత్యం బుర్రకథ ఉంటుందని కమిటీ ఆలయ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, ప్రసాదాలు, దైవదర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై శుక్రవారం సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు రద్దు చేసి కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తేవడం సరికాదని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, చిన్నవెంకులు, దండంపల్లి సరోజ, ఎండీ.సలీం, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, గంజి నాగరాజు, మన్నె భిక్షం, పోలె సత్యనారాయణ, సర్దార్ అలీ, అంజయ్య, రవీందర్, రాజేష్, ఆవుల అనురాధ, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్కు పదోన్నతి
మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ను బదిలీ అయ్యారు. ఆయనను నారాయణ్పేట జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసింది. నారాయణ్ అమిత్ 2024 సెప్టెంబర్ 5న మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ 15 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు కృషి చేశారు. అక్రమదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడంతో జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. పుల్లెలంలో రేపు హనుమంతు అంత్యక్రియలుచండూరు : ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత పాక హనుమంతు అంత్యక్రియలు స్వగ్రామమైన చండూరు మండలంలోని పుల్లెంలలో ఆదివారం జరుగనున్నాయి. ఆయన పార్థివదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రానికి ఒడిశా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి పుల్లెంలకు హనుమంతు పార్థివదేహాన్ని తీసుకొస్తారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పుల్లెంలలోని పాత ఇంటి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అంత్యక్రియల ఏర్పాట్లను హనుమంతు బావ మల్లిక్ పరిశీలించి గ్రామంలోని ముఖ్యులతో సమావేశమై చర్చించారు. సీసీఐ కేంద్రం తనిఖీచిట్యాల : చిట్యాల పట్టణ శివారులోని కృష్ణ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల ఈ కేంద్రం పత్తిని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేసిన నేపథ్యంలో అధికారులు తనిఖీ చేపట్టారు. సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు తీరును పరిశీలించారు. స్లాట్ బుకింగ్లో ఏర్పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ సీరియల్ ప్రకారం పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. నేటి నుంచి డిండి ఉర్సుడిండి: మండల కేంద్రంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుపొద్దీన్ దర్గా 77వ ఉర్సె షరీఫ్ను శని, ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి సయ్యద్ షర్పొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గంధోత్సవం, ఆదివారం దీపారాధన, ఖత్మేఖునాన్ వంటి పూజా కార్యక్రమాలతోపాటు ఖవ్వాలి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కుల మతాల కతితంగా ఉర్సును విజయవంతం చేయాలని కోరారు. ఉర్సుకు హాజరయ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ధనుర్మాస వ్రత పూజలు హాలియా : పట్టణంలోని స్వయంభూ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గోవర్ధన రాఘవాచార్యులు పర్యవేక్షణలో అష్టాక్షరి సహిత సుదర్శన నరసింహ హోమం, లోక కల్యాణార్థం కోసం కోసం నిత్య మూల మంత్ర హోమం, భగవతారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, నిత్య పూర్ణహుతి తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అరుణ, చంద్రకళ, లావణ్య, సుమలత, వరలక్ష్మి, శోభారాణి, శేఖర్, సాయి చందు ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపిక
మోత్కూరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 జూడో పోటీలు శుక్రవారం మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పోటీలకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. బాలికల విభాగంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన ఎస్.శ్రీజ, కె.సిరిచందన, కె.సిరి, డి.సహస్ర, సీహెచ్.అస్మిత, పి.మేఘన, టి.రుచిత, వి.హాసిని ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే బాలుర విభాగంలో డి.అభిషేక్, మనిసాత్విక్, కె.సాయిరాం, ఉపేందర్, కె.విజ్ఞాన్ ప్రథమ స్థానం సాధించారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో బి.వైష్ణవి, కె.భానుశ్రీ, ఆర్.హారిక, అంజలి ద్వితీయ స్థానం సాధించారని జూడో కోచ్ అన్నెపు వెంకట్ తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సభ్యుడు ప్రసాద్, ఎంఈఓ టి.గోపాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జూడో సీనియర్ ఇన్స్ట్రక్టర్ పి.బాలరాజు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిశెట్టి అవిలుమల్లు, బీసీ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పోచం సోమయ్య, మెంట నగేష్, పీఈటీలు జి.జ్ఞానసుందరి, పి.శ్వేత, ఇన్స్ట్రక్టర్ కనుకు రాజు, చొల్లేటి నరేష్, పోచం మచ్చేందర్, పుల్కరం నిఖిల్, ఊర మత్స్యగిరి పాల్గొన్నారు. -
చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలి
మునగాల : కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేసే వరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన కొనసాగుతూనే ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాముల శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ను ఆయన సందర్శించారు. కర్ల రాజేశ్ ఇదే బంక్లో పనిచేయడంతో ఆయన బంక్లో పని చేస్తున్న సిబ్బందిని కలిసి విచారించారు. అనంతరం మాట్లాడుతూ కోదాడ రూరల్ సీఐ, ఇతర పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడం వల్లే రాజేశ్ మృతిచెందాడని పేర్కొన్నారు. దళిత వర్గాలపై పోలీసుల వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిఽధి ఏపూరి రాజుమాదిగ, కర్ల రాజేశ్ సోదరుడు కమల్, నాయకులు ఉన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
రామగిరి(నల్లగొండ) : క్రీస్తు బోధనలు ప్రపంచానికి సేవాగుణాన్ని నేర్పించాయని, అవి మనకు అనుసరణీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి హాజరై కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు మనకు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని గుర్తుచేస్తాయన్నారు. ఏసు ప్రభువు కృపతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు క్రిస్టోఫర్, బెనర్జీ, విలియమ్స్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, పశల శౌరయ్య తదితరులు పాల్గొన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు బలిదానాలకు పాల్పడుతుంటే చలించిన సోనయాగాంధీ ఆమె పుట్టిన రోజు డిసెంబర్ 9న రాష్ట్రాన్ని ప్రకటిచిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెల్చుకోవడం శుభపరిణామన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఫార్మసీ, లా కోర్సులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి ఫ నల్లగొండలో క్రిస్మస్ వేడుకలకు హాజరు -
జనవరి 8న ప్రసాద విక్రయానికి వేలం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకేంద్రం పరిధిలోని పానగల్లులో గల ఛాయాసోమేశ్వారాలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయానికి వచ్చేనెల 8వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రాపోలు బాలకృష్ణ తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని కోరారు. ‘ఉపాధి’ బిల్లును ఉపసంహరించుకోవాలినల్లగొండటౌన్: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్చుతూ కొత్తగా తీసుకొచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టం పేరును ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. కొత్త బిల్లు వల్ల కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో పడిపోతున్న ఉపాధి పనిదినాల వల్ల పేదలు బతకలేరని వాపోయారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ, ములకపల్లి రాములు, దండెంపల్లి సరోజ, దండెంపల్లి సత్తయ్య, చినపాక లక్ష్మీనారాయణ, మల్లం మహేష్, పోలె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘టాప్రా’ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలినల్లగొండ టూటౌన్ : హైదరాబాద్లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీష్చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్ కోరారు. గురువారం నల్లగొండలోని టీఎస్ యూటీఎఫ్ భవ న్లో జరిగిన టాప్రా జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. 2024 మార్చి తరువాత నుంచి పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండి.ఖాదర్, కోశాధికారి కుకుడా ల గోవర్ధన్, పాదురు విద్యాసాగర్రెడ్డి, వై.సత్తయ్య, పులి కృష్ణమూర్తి, చాపల అంజిరెడ్డి, పట్టేటి కృష్ణయ్య, వనం వాణిశ్రీ, రమేష్, భద్ర య్య, యోగేంద్రనాధ్, నరసరాజు పాల్గొన్నారు. ముదిరాజ్లు రాజకీయంగా ఎదగాలినల్లగొండ టౌన్ : ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా ఎదుగుతూ బలోపేతం కావాలని ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, దాసరి స్వామి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గెలుపొందిన ముదిరాజ్లకు ఈ నెల 30న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం పోస్టర్లను గురువారం నల్లగొండలోని ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జనార్దన్, దొంతరగోని గణేశ్, హరీష్, ముఖేష్ పాల్గొన్నారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు రాజాపేట : రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల రాష్ట్ర కన్వీనర్, సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. 5,6,7,8,9 క్లాసుల్లో ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు గడువు జనవరి 21 వరకు ఉందని, రూ.100 ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంపై ఒకరి ఫొటో బదులు మరొకరిది పెట్టి అప్లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. -
మనుధర్మశాస్త్రంతోనే సామాజిక అసమానతలు
నల్లగొండ టౌన్ : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మనదేశంలో సామాజిక అసమానతలకు మనుధర్మ శాస్త్రమే కారణమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువు రాసిన మనుధర్మ శాస్త్రాన్ని తొంభై ఏళ్ల క్రితమే డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దహనం చేశారని, ఆ రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అశాసీ్త్రయమైన ఈ మనుస్మృతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేసేలా జీవో తెచ్చి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పందుల సైదులు, మానుపాటి భిక్షం, ఇందూరి సాగర్, గోలి సైదులు, కొండ వెంకన్న, అద్దంకి రవీందర్, తెలగమల యాదగిరి, గాదె నరసింహ, బొల్లు రవీందర్, అవుట రవీందర్, దండెంపల్లి సత్తయ్య , మల్లం మహేష్, కోట సైదులు, నలుపరాజు సైదులు, మురళి, సీహెచ్.తిరుపతయ్య, గోలి మల్లేష్, జయచందన్, పెరికె నరసింహ, చింత రామలింగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
కరుణానంద స్వామి ఆరాధనోత్సవాలు
నకిరేకల్ : పట్టణంలోని అచల గురు మందిరంలో కరుణానంద (మంచుకొండ పాపయ్య) స్వాములవారి 33వ రాజయోగి ఆరాధన మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. సద్గురు శ్రీ పూర్ణానంద కర్నాటి పాండరమ్మ మాతాజీ తన శిష్య బృందంతో ఆరాధన కీర్తనలు ఆలపించారు. స్వామీజీ చిత్రపటంతో ఊరేగింపు, జెండా పూజలు చేశారు. గురువులు మిట్టపల్లి కృష్ణమూర్తి, సుగుణ, మల్లికార్జున, పసుపర్తి ధనమ్మ, శ్రీదేవి, శివకుమార్, గుండా అనసూయ, కాసం సుకన్య, చిలుకురి ప్రసాద్, గుండా భిక్షపతితోపాటు మరో 25 మంది సద్గురువులు ప్రవచనాలు వినిపించారు. సర్వశ్రీఅబ్బాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గురు మందిర అధ్యక్షుడు దేవరశెట్టి మధుసూదన్, ఉపాధ్యక్షులు శివకోటి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కోటగిరి పద్మజారమేష్, కోశాధికారి కోటగిరి రమాదేవి, గౌవర సలహాదారులు కాసం దయానందం, తొనుపూనురి గాంధీ, గుండా సోమనాథం, అనసూయ, పాలవర్గ సభ్యులు రేపాల నిర్మల, గుడిపాటి జయ, శివకోటి రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఫ అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వరశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మహంకాళి కిరణ్శర్మ, లహరి నరసింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్శర్మ, ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంతాచార్యులు, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్, సహాయ కార్యదర్శులుగా ఫణికుమారాచార్యులు, వలివేలు, విద్యాధరశర్మ, హరీష్శర్మ, ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశ గోపాలచార్యులతో పాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫ ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడిగా జినుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా రాజ్యలక్ష్మి, అధ్యక్షుడిగా అలుగుబెల్లి సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్రెడ్డి, కోశాధికారిగా కె. ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్. అంజనేయులు, కొండారెడ్డి, డి. శ్రీనివాస్, సమన్వయ సభ్యులుగా ఎన్. రమణ, గోవిందరెడ్డి, వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్బీవీ యోగానందంతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డీవీకే శర్మ, ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శ్రవణ్కుమారాచార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్శర్మ, అర్చక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్శర్మ, బండారు శ్రీనివాస్, అనిల్కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న యలగందుల వెంకన్న(50) తన కుమారుడు రాకేష్తో కలిసి స్థానికంగా మిల్క్ సెంటర్ నడుపుకుంటున్న తన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 21న రాత్రి వెళ్లారు. వెంకన్న కూమారుడు రాకేష్ శ్రీకాంత్ వద్ద పాల వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ షాపులోనే అతడి స్నేహితుడైన చీమలగడ్డకు చెందిన పుట్ట కిరణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. వెంకన్న తన కుమారుడు రాకేష్కు రావాల్సిన జీతం డబ్బుల గురించి శ్రీకాంత్ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అసభ్య పదజాలంతో వెంకన్నను దూషిస్తూ డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. దీంతో వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్పై చేయి ఎత్తడానికి ప్రయత్నించగా.. రాకేష్ అడ్డుగా వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మరింత ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ పక్కనే ఉన్న పాల ట్రేతో రాకేష్పై దాడి చేయబోగా.. వెంకన్న అడ్డురావడంతో అతడి తలపై పాల ట్రేతో కొట్టి గాయపర్చాడు. అంతేకాకుండా సిమెంట్ ఇటుకతో వెంకన్న ముఖంపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వెంకన్న కుమారుడు రాకేష్, పుట్ట కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి వెంకన్నను అంబులెన్స్లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకన్న కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గట్టు శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్రెడ్డి, వెంకటేశం, ఎస్ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్ : రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తరువాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుకు రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. బెనిఫిట్స్ అందక చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, ముజాహిద్ అలీఖాన్, గణేష్, శంకరయ్య, వెంకటేశ్వర్లు, వెంకట్రెడ్డి, భిక్షం, లక్ష్మారెడ్డి, భాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్యాంసుందర్, నారాయణరెడ్డి, భాస్కర్, ఏడుకొండలు, భాలయ్య, రాధాకృష్ణ, సుధారాణి, సుజాత, నాగమణి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి ● మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చిట్యాల : హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్ని గతేడాది మేడ్చల్లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది. -
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
రామగిరి(నల్లగొండ) : క్రీడాపోటీలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ అన్నారు. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–26 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎండి.అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా క్రీడలకు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అనంతరం గెలుపొందిన జట్లకు, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నర్సింహారావు, సైదులు, వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, మాధురి, నీరజ, నరసింహ, ఎస్జీఎఫ్ సెక్రెటరీ విమల, పీడిలు ప్రసాద్, అంజయ్య, జ్యోతి, వనిత, ధరణి, క్రీడా ఉపాధ్యాయులు, శంభు లింగం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చివరి రోజు హోరాహోరీగా.. చివరి రోజులు క్రీడలు ఆధ్యంతం హోరాహోరీగా కొనసాగాయి. వివిధ క్రీడా విభాగాల్లో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కబడ్డీ విన్నెర్స్గా కోదాడ, రనర్స్గా ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ, ఖోఖో విన్నెర్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నాగార్జునసాగర్, రన్నర్స్గా ప్రభుత్వ పాలిటెక్నిక్ నల్లగొండ నిలిచింది. ఫ అదనపు ఎస్పీ రమేష్ ఫ ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడాపోటీలు -
మంత్రి కోమటిరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
నల్లగొండ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం పండుగ శుభాకాంక్షలు. ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని మనకు గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు. 30 రోజుల్లో మూత్రశాలలు నిర్మిస్తాం పెద్దవూర : ముప్పై రోజుల వ్యవధిలోనే మూత్రశాలల నిర్మాణం పూర్తిచేస్తామని పెద్దవూర ఎంఈఓ తరి రాములు, పోతునూరు గ్రామ సర్పంచ్ పెండ్యాల సంతోష్రావు అన్నారు. పెద్దవూర మండలం పోతునూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే మూత్రశాల ఉండడంతో బాలికలు, మహిళా టీచర్లు పడుతున్న ఇబ్బందులపై బుధవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఎంఈఓ, గ్రామ సర్పంచ్ స్పందించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ.3 లక్షలతో నాలుగు మూత్రశాలలు, ఒక మరుగుదొడ్డి నిర్మించనున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజులలో పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా పాఠశాలలో 38 మంది బాలికలతోపాటు ఐదుగురు మహిళా ఉపాధ్యాయులకు ఒకే మూత్రశాల ఉంది. బాలురు, పురుష ఉపాధ్యాయులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితమే పాఠశాలలో మూత్రశాలల పనులను ప్రారంభించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచాయి. జిల్లా కబడ్డీ జట్లకుక్రీడాకారుల ఎంపికనాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా సీనియర్స్ సీ్త్ర, పురుషుల కబడ్డీ జట్లకు ఎంపికై న క్రీడాకారుల జాబితాను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎంపికై న వారు ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్లో జరిగే అంతర్ జిల్లాల తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పురుషుల విభాగంలో కె.కోటేష్(తుంగతుర్తి), టి.రాజశేఖర్(మల్లేపల్లి), డి.సాయికిరణ్(తుంగతుర్తి), ఎన్.లక్ష్మణ్(ఆలగడప), జి.లోకేష్(అనుముల), పి.ఉదయ్(ఆర్జాలబావి), అఖిల్చారి(దేవరకొండ), ఎం.డి.నౌషద్(నిడమనూరు), శ్రీకాంత్(దేవరకొండ), సీహెచ్.శ్రీనయ్య(నర్కట్పల్లి), వి.మల్లేష్(పాల్వాయి), ఎంఈ.రాకేష్(కాల్వపల్లి), టి.ఉదయరాజు(మదారిగూడెం), బి.అంజి(గుడిపల్లి), పి. భరత్(గర్నెకుంట) ఎన్నికయ్యారు. వీరికి కోచ్గా కె.సైదులు, మేనేజర్గా జి. కృష్ణమూర్తులు వ్యవహరిస్తారు. సీ్త్రల విభాగంలో ఎస్కె.నౌషియా(హాలియా), ఆర్.నందిని(మల్లేపల్లి), టి.హన్సిక(తిరుమలగిరిసాగర్), కె.అంజలి(దుగ్గెపల్లి), ఎం.అభినయశ్రీ(కట్టంగూ రు), పి.వైష్ణవి (నారాయణపురం), యూ.సంతోషిని(నల్లగొండ), వి.వర్షిత(కేతపల్లి), ఐ. చందన్(కుర్మేడ్), బి.గిరిజ(నల్లగొండ), ఎ.పూజిత(మల్లేపల్లి), కె.మానస(చిల్కాపురం), ఆర్.శిరీష(మదారిగూడెం), బి.శిరీష(మొల్కపట్నం) ఎంపికయ్యారు. వీరికి కోచ్గా అన్వర్ఖాన్, మెనేజర్గా చంద్రశేఖర్ వ్యవహరిస్తారని వారు పేర్కొన్నారు. పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయంరామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టు కు ఏఎస్పీ రమేష్ టోర్నీ కప్ అందజేశారు. -
విద్యార్థులు మత్తుకు బానిసలు కావొద్దు
నల్లగొండ : విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా కావొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు మందుల నివారణ, రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో గాంజా వంటి మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా నిఘా పెట్టి అవగాహన కల్పించాలన్నారు. నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలోని డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జనవరి 26న పాఠశాలల్లో మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేకంగా రూపకం ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో 2025 నాటికి బ్లాక్స్పాట్లను తగ్గించడంతోపాటు ప్రమాదాలను అరికట్టామన్నారు. సమావేశాల్లో డీఈఓ భిక్షపతి, ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికా రులు చత్రునాయక్, శశికళ, సంధ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, రహదారుల సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ ఆర్ఎం పాల్గొన్నారు. -
నేర నిరూపణలో బెస్ట్
నల్లగొండ : నేరాల నిరూపణలో నల్లగొండ పోలీసులు ది బెస్ట్గా నిలిశారు. ఫోనెన్సిక్ డిజిటల్ ఆధారాలతో వివిధ నేరాలను నిరూపించి నిందితులకు జీవిత ఖైదుతోపాటు మరణ శిక్షలు పడేలా ఎంతో కృషిచేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొత్తంగా నేరాల సంఖ్య తగ్గింది. 2024–25 సంవత్సరంలో జరిగిన నేరాల వివరాలను బుధవారం నల్లగొండలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 132 మంది నేరస్తులకు శిక్షలు జిల్లాలో 2024–2025 సంతవ్సంలో వందలాది కేసుల్లో ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారాలు సేకరించడంతో 132 మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయి. గతేడాది మాత్రం కేవలం 65 మందికే శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది పడిన శిక్షల్లో మరణ శిక్షలు, జీవిత ఖైదు, 14 ఏళ్లు, ఏడేళ్లు, ఏడాదికిపైగా శిక్షలు పడ్డాయి. ప్రధానంగా పలు విషయాల్లో గతేడాది 62 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 55 కేసులకు తగ్గాయి. 24 మర్డర్ కేసులను ఛేదించాం. లోక్ అదాలత్లో పెండింగ్ కేసులు పరిష్కారం జిల్లా పోలీస్ శాఖ వివిధ కేసులకు సంబంధించి లోక్అదాలత్లో గతేడాది 18,257 కేసులు పరిష్కారం కాగా, ఈ సంవత్సరం 49,943 కేసుల పరిష్కారమయ్యాయి. దీంతో పెండింగ్ కేసులు భారీగా తగ్గాయి. గతేడాదిలో 700 ఆస్తినేరాల కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 637కు తగ్గాయి. మహిళలపై జరిగిన నేరాల్లో కేసులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది 684 కేసులు నమోదు కాగా 703కు చేరాయి. వరకట్న హత్యకేసులు రెండే నమోదయ్యాయి. ఆత్మహత్య ప్రేరేపణ కేసులు తటస్థంగా ఉన్నాయి. మహిళా వేధింపు కేసులు గతంలో 313 నమోదు కాగా ఈ సంవత్సరం 346కు పెరిగాయి. మహిళల హత్య కేసులు 9 నుంచి 11కు పెరిగాయి. హత్యాచార కేసులు 101నుంచి 87కు తగ్గాయి. మహిళల అపహరణ కేసులు 26 నుంచి 27కు పెరిగాయి. లైంగిక వేధింపుల కేసులు 216 నుంచి 196కు తగ్గాయి. పోక్సో చట్టం కింద గతేడాది 121, ఈఏడాది 117కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా పెరిగిన సైబర్ నేరాలు గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాలు స్వల్పంగా పెరిగాయి. 2024లో 235 కేసులు నమోదు కాగా బాధితులు పోగొట్టుకున్న రూ.16.31 కోట్లలో రూ.1.25 కోట్లు రికవరీ చేశాము. ఈ ఏడాది 255 కేసుల్లో రూ.4.62 కోట్లకు రూ.1.48 కోట్లు బాధితుల ఖాతాల్లో జమ చేశాం. పక్కాగా రోడ్డు ప్రమాదాల నివారణ జిల్లాలో గతేడాది 109 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,197 మంది గాయాలపాలయ్యారు. ఈ సంవత్సరం 87 ప్రమాదాల్లో 1,078మంది గాయాలపాలయ్యారు. ఎంవీ యాక్టు కేసులు 2024లో 1,58,138 కేసులు నమోదు కాగా రూ.5.33 కోట్లు జరిమానా విధించాం. ఈ సంవత్సరం 2,13,137 కేసులు నమోదు కాగా రూ.5.48 లక్షల జరిమానా విధించాం. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ గతేడాది బాల కార్మికులు కేసులు 102 నమోదు కాగా ఈ ఏడాది 151 కేసులు నమోదు అయ్యాయి. తద్వారా 205 మంది బాల కార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. జిల్లా పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపింది. గతేడాది 108 కేసులు నమోదు కాగా వారి వద్ద నుంచి రూ.9.97 కోట్ల ప్రాపర్టీని సీజ్ చేయగా, ఈ సంవత్సరం 17 కేసుల్లో రూ.63.65 లక్షల ప్రాపర్టీని సీజ్ చేశాం. గంజాయి తాగే అమ్మే వారి విషయంలో వారి తల్లితండ్రులతో కలిసి కౌన్సిలింగ్ ఇచ్చాం. ఎస్హెచ్ఓ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు నిర్వహించడంతో కేసులు తగ్గాయి. గత సంవత్సరం కంటే తగ్గిన నేరాల సంఖ్య ఫ ఫోరెన్సిక్ డిజిటల్ ఆధారాలతో కేసులను ఛేదించిన జిల్లా పోలీసులు ఫ శిక్షలు పడిన నేరస్తుల సంఖ్య పెరుగుదల ఫ సైబర్ నేరాలతోపాటు మహిళలపై పెరిగిన వేధింపులు ఫ 2025–వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లాలో పోలీసులతోపాటు రెండు షీ టీమ్లు సమర్థవంతంగా పనిచేశాయి. తద్వారా మహిళా అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం కేసులను పూర్తిగా అరికట్టగలిగాం. మత్తు పదార్థాల రవాణా విషయంలో 253 కేసుల్లో 251 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.79.88 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. కేసుల వివరాలు ఇలా.. విభాగం గతేడాది ఈ ఏడాది వివిధ కేసుల్లో శిక్షలు 65 132 లోక్అదాలత్లో పరిష్కారం 18,257 49,943 ఆస్తినేరాలు 700 637 లైంగిక వేధింపులు 216 196 పోక్సో చట్టం కింద 121 117 గంజాయి కేసులు 108 17 సైబర్ 235 255 రోడ్డు ప్రమాదాలు 109 87 -
దివ్యాంగులందరికీ ట్రై సైకిళ్లు అందిస్తాం
నల్లగొండ : జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులందరికీ దశలవారీగా బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని టీటీడీసీలో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనేకమంది దివ్యాంగులు తమకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు ఇవ్వాలని ప్రజావాణిలో దరఖస్తులు చేస్తున్న నేపథ్యంలో ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి మొదటి విడతగా 105 మంది దివ్యాంగులకు మోటార్ ట్రైసైకిళ్లు ఇప్పిస్తున్నామన్నారు. ఇందులో 50 మందికి పంపిణీ చేశామన్నారు. తాను జిల్లా కలెక్టర్గా వచ్చిన వెంటనే సర్వే నిర్వహించి జిల్లాలో 55వేల మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్ల మాదిరిగానే కృత్రిమ అవయవాలు అవసరం ఉందని, ఇందుకు సర్వే నిర్వహించి రిపోర్టు వచ్చిన తర్వాత అలింకో, ఈసీఐఎల్కు సమర్పిస్తామన్నారు. మోటార్ సైకిళ్లు సమకూర్చి ఇచ్చిన ఈసీఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులకు తమ సంస్థ ద్వారా ట్రై సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబమూర్తి, డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతనాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఈఓ భిక్షపతి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్, అలింకో ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మహిళా సౌరభం
మోత్కూరు : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజరు భూములతో లీజు ఒప్పందం చేసుకొని పరస్పర అంగీకారంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో దేవాదాయ భూములను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. ఈ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వీరారెడ్డి, ఆర్డీఓ ఎం. కృష్ణారెడ్డి, డీఆర్డీఓ కె. నాగిరెడ్డితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే బుజిలాపురం సోలార్ పవర్ ప్లాంట్ మొదటిదని అధికారులు చెబుతున్నారు. బుజిలాపురంలోని 8 ఎకరాల దేవాదాయ భూమిలో రూ.6 కోట్లతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ ద్వారా ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఎకరాకు రూ.15వేల చొప్పున డీఆర్డీఏ ద్వారా చెల్లించడానికి మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో జమవుతాయి. జిల్లా మహిళా సమాఖ్య, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల మహిళా సమాఖ్యలు కలిసి రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక మెగావాట్కు రూ.3 కోట్ల చొప్పున 2 మెగావాట్లకు కలిపి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 10 శాతం అనగా రూ.60 లక్షలు, మహిళా సంఘాల వాటా 1 మెగావాట్ యూనిట్కు రూ.కోటి ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల యూనిట్లకు గాను రూ.2కోట్ల రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల ద్వారా సంవత్సరానికి రూ.16.60 లక్షల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1 యూనిట్ విద్యుత్కు రూ.3.13 చెల్లించి తెలంగాణ రెడ్కో కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.52 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణం, వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాం బుజిలాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ అధికారుల సహకారంతో 8 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని లీజుకు తీసుకున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వాటా ధనం చెల్లించాం. అన్నిరకాల ఒప్పందాలను కంపెనీతో కుదుర్చుకున్నాం. సోలార్ పవర్ ప్లాంట్తో మహిళా సంఘాలకు పెద్దఎత్తున ఆదాయం చేకూరనుంది. – టి. నాగిరెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం యాదాద్రి జిల్లా మహిళా సమాఖ్యకు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బుజిలాపురంలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఆర్డీఓ అధికారుల కృషి ఎంతో ఉంది. జిల్లా అధికారులకు మహిళా సంఘాల పట్ల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. – కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, యాదాద్రి భువనగిరిజీవనోపాధి పొందుతాం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో జీవనోపాధి పొందుతాం. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నాం. దీంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పడం సంతోషంగా ఉంది. – మిడిదొడ్డి శైలజ, మోత్కూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం రాష్ట్రంలోనే ప్రథమంగా మోత్కూరు మండలం బుజిలాపురంలో శంకుస్థాపన -
ఉపాధిహామీ పేరు మార్పు వద్దు
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ గ్రామీణ్ విబి జి రామ్ జి –2025 తీసుకురావడానికి నిరసిస్తూ సీసీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండలోని సుభాష్ సెంటర్లో మంగళవారం రాస్తారోకో చేసారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పేదలకు ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే పథకం పేరును మార్చుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వామక్షాల నాయకులు హశం, సాగర్, వీరస్వామి, నరసింహ, వి.లెనిన్, ఎం.ముత్యాలు, అక్కలయ్య, వీరయ్య, షరీఫ్, బండ శ్రీశైలం, పి.ప్రభావతి, సలీం, దండంపెల్లి సత్తయ్య, అవుట రవీందర్, తుమ్మల పద్మ, కృష్ణారెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. -
నోటాకు 3,132 ఓట్లు
ఫ పంచాయతీ ఎన్నికల్లోతొలిసారి నోటా ఫ సర్పంచ్ అభ్యర్థుల్లో నోటాకు భారీగా పోలైన ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేక చెల్లకుండాపోయిన 12,253 ఓట్లు మండలాల వారీగా వివరాలు.. మండలం నోటాకు చెల్లనిఓట్లు నల్లగొండ 122 417 తిప్పర్తి 65 279 కనగల్ 60 387 దేవరకొండ 125 431 కొండమల్లేపల్లి 57 328 డిండి 107 570 గుడిపల్లి 54 175 పీఏపల్లి 54 325 చందంపేట 55 347 నేరేడుగొమ్ము 38 297 చింతపల్లి 40 504 మునుగోడు 105 449 చండూరు 59 312 మర్రిగూడ 104 346 నాంపల్లి 236 427 గట్టుప్పల్ 50 266 నకిరేకల్ 94 347 కట్టంగూర్ 68 369 నార్కట్పల్లి 122 450 శాలిగౌరారం 84 544 చిట్యాల 90 359 కేతేపల్లి 62 512 మిర్యాలగూడ 156 691 §éÐ]l$-Æý‡-^èl-Æý‡Ï -153 -376 మాడుగులపల్లి 113 181 అడవిదేవులపల్లి 34 188 వేములపల్లి 51 274 అనుముల 69 285 పెద్దవూర 267 348 త్రిపురారం 118 521 తిరుమలగిరి(సాగర్) 82 387 నిడమనూరు 145 128 గుర్రంపోడు 93 433 మొత్తం 3,132 12,253సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాకు (నన్ ఆఫ్ ది ఎబోవ్) వేల సంఖ్యలో ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సర్పంచ్లుగా ఇష్టం లేదంటూ 3,132 మంది ఓట్లు నోటాకే ఓటు వేశారు. ఓటు వేసే విధానంపైనా అవగాహన కొరవడి సర్పంచ్లకు సంబంధించి 12,253 ఓట్లు చెల్లకుండా పోయాయి. అయితే.. అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 34 మంది, పెద్దవూర మండలంలో అత్యధికంగా 267 మంది నోటాకు వోటేశారు. మొదటిసారి నోటా ఎన్నికల కమిషన్ మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహించి.. అందులో నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే ఆ ఓటరు ఎవరు నచ్చలేదంటూ తమ అభిప్రాయం తెలియజేసేలా నోటా గుర్తును సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్పై ముద్రించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3,132 మంది ఓటర్లు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి బ్యాలెట్పై నోటాకు ఓటు వేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మూడు వితల్లో ఎన్నికలు జిల్లాలో 33 మండలాల పరిధిలో మూడు విడతల్లో (ఈనెల 11, 14, 17 తేదీల్లో )ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో మాడుగులపల్లి మండలం ఇందుగులలో న్యాయవివాదంతో, అదే మండలంలోని అభంగాపురం, అనుముల మండలం పేరూరులో అభ్యర్థుల్లేక సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా 866 గ్రామ పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీల పరిధిలో 10,37,411 మంది ఓటర్లుండగా 9,00,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జిల్లాలో 3,132 మంది అభ్యర్థులు నోటాకు ఓటు వేసి తమకు అభ్యర్థులు నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో వేల మందికి ఓట్లు వేయడం కూడా రాలేదు. ఇన్నాళ్లూ ఈవీఎంలకు అలవాటు పడిన ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సులో స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉండగా.. అది కూడా సరిగ్గా వేయకపోవడంతో ఓట్లు చెల్లకుండా పోయాయి. అలా జిల్లా వ్యాప్తంగా 12,253 ఓట్లు చెల్లలేదు. ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ఓట్లు చెల్లకుండా పోయాయని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ముగిసిన ఎన్నికల కోడ్
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల కోడ్ ఈ నెల 19తో ముగిసింది. ఈ నెల 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉప సర్పంచ్ ఎన్నికల నేపధ్యంలో 19వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ ముగిసిపోయింది. దర్వేశిపురం హుండీ ఆదాయం రూ.13,71,173కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపును మంగళవారం నిర్వహించారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం సమకూరిందని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సర్పంచ్ రాయల శేఖర్, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్రెడ్డి, రాజయ్య, ఆంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలినల్లగొండ టౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్యులంతా సమయ పాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో వైద్యాదికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనితీరు బాగాలేని పీహెచ్సీల అధికారులను మందలించడంతో పాటు పరితీరు మెరుగ్గా ఉన్న అధికారులను ప్రసంశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు దీప, కళ్యాణ్చక్రవర్తి, కృష్ణమూర్తి, పద్మ, తిరుపతిరావు, విష్ణు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేటీఆర్వి మతిస్థిమితంలేని మాటలునల్లగొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై కేటీఆర్వి మతిస్థిమితం లేని మాటలని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీలో తట్టెడు మట్టి తీయలేదని.. ఇప్పుడు కృష్ణా జలాలు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ నల్లగొండలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తు తగ్గించి తెలంగణకు ద్రోహం చేసింది కేసీఆరే అన్నారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలను ఎడారి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. సమావేశంలో నాయకులు కన్నారావు, బోడ స్వామి, జిల్లా పరమేష్, చింతమల్ల వెంకటయ్య, పుట్ట వెంకన్నగౌడ్, తిరుమలేష్, శివగౌడ్, నరేష్, కర్నాటి మత్స్యగిరి, వేణు, సైదులు తదితరులు పాల్గొన్నారు. 25న వార్షికోత్సవ మహాసభలునల్లగొండ టౌన్ : సుశృత గ్రామీణ వైద్యుల(ఫస్ట్ ఎయిడ్) సంఘం జిల్లా 19వ వార్షికోత్సవ మహాసభలను ఈ నెల 25న పానగల్ బైపాస్లోని సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివారాజు తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మహాసభలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నామన్నారు. ఈ మహాసభకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీఎంహెచ్ఓ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నర్సింహారెడ్డి, డీఎస్ఎన్ చారి, నసీరుద్దీన్, వెంకటేశ్వర్లుగౌడ్, కృష్ణారెడ్డి, మధనాచారి, రాజశేఖర్రావు, యాదగిరి, దశరథ, ప్రశాంత్, శ్రీనివాస్, ఖదీర్, నాగరాజు పాల్గొన్నారు. -
సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలి
సూర్యాపేట : కర్ల రాజేష్ మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థపాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిపై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేనే కాపాడుతున్నారంటూ ఆరోపించారు. ఎస్ఐని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఎస్ఐ బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే వదిలేశారని ధ్వజమెత్తారు. కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఎస్పీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ఎస్పీ స్వతంత్రుడిగా లేడన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, చిలుకూరు ఎస్ఐ సురేశ్రెడ్డిని సస్పెండ్ చేయలేదని ఆరోపించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో లక్ష్మీకాంత్రెడ్డితోనే ఎందుకు పోస్టుమార్టం చేయించారని, కోదాడ నుంచి హైదరాబాద్ వరకు పోలీసుల వాహనంలో రామకృష్ణారెడ్డినే వీడియోగ్రాఫర్గా తీసుకెళ్లి ఎందుకు వీడియోలు తీయించారని ప్రశ్నించారు. నవంబర్ 10న కోదాడ కోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ.. డిసెంబర్ 1న హైకోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ ఎలా మారుతుందన్నారు. కోర్టు ముందు ఐకాన్ ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ ఎలా చేస్తారన్నారు. ఈ అవకతవకలకు చిలుకూరి ఎస్ఐ మూలకారకుడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంజేఎఫ్ సీనియర్ అడ్వకేట్ డప్పు మల్లయ్య, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, చింతలపాటి చిన్న శ్రీరాములు, యాతాకుల రాజన్న, చింత వినయ్బాబు, ఎర్ర వీరస్వామి, ములకలపల్లి రవి, తళ్లమళ్ల హుస్సేన్, కోట గోపి, బొల్లెద్దు వినయ్, కనుకుంట్ల వెంకన్న, గ్యార కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
సరైన భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
చౌటుప్పల్ : సరైన భద్రతా చర్యలతో ప్రమాదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో మంగళవారం లింగోజిగూడెంలోని ఓ ఫంక్షన్హాల్లో భద్రతపై ఒకరోజు శిక్షణ, అవగాహన సెమినార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న పలు పరిశ్రమల నుంచి సేఫ్టీ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతపై ఏమాత్రం రాజీపడొద్దన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతుందని తెలిపారు. సెమినార్ నిర్వహించిన దివీస్ పరిశ్రమను అభినందించారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ యాదాద్రి జిల్లా ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సాంబశివరావు, సేఫ్టీ జనరల్ మేనేజర్ జి. బాలకిషోర్, బి. కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ పరిశ్రమల శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి -
కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి భయం పటుకుని.. ఎన్నికలపై వెనుకడుగు వేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.తారకరామారావు అన్నారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీలపై ప్రజలు నిలదీస్తారని సీఎం భయపడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలపై అన్యాయం విషయంలో మాట్లాడకుండా నల్లగొండ జిల్లా రైతులకు తీరని నష్టం చేస్తున్నాడని మండిపడ్డారు. అబద్దాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులకు కేసీఆర్ అంటే భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు రూ.15 వేలు, పెన్షన్లు రూ.4 వేలు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే, రైతులకు మంచి చేసామన్న నమ్మకం ఉంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సహాకార సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యమై ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్లో గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు ఏ పార్టీలో ఉన్నామో అని చెప్పుకునే ధైర్యం, దమ్ములేదన్నారు. కరెంట్, కాళేశ్వరం అవినీతి అని మొత్తుకున్న కాంగ్రెస్ వాళ్లకు కోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రాలేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా మా కార్యకర్తలు భయపడలేదన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచ్లు, ఉప సర్పంచ్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, పాల్వాయి స్రవంతి, కర్నె ప్రభాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్రెడ్డి, చెరుకు సుధాకర్, నల్లమోతు సిద్దార్ధ, చకిలం అనిల్కుమార్, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఇస్లావత్ రామచందర్నాయక్, రాకేష్రెడ్డి, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, కొండూరు సత్యనారాయణ, జమాల్ఖాద్రి, అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గమధ్యలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద కాసేపు ఆగారు. బీఆర్ఎస్వీ కార్యకర్తలు కేటీఆర్కు బోకే అందజేసి స్వాగతం పలికారు. యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యలను ఆయనకు వివరించారు. కార్యక్రమంలో వాడపల్లి నవీన్, శివకుమార్, పొలగోని శివ, అశోక్, కోటేష్, లావణ్య, మహేశ్వరి, మానస పాల్గొన్నారు. ఫ ఎన్నికలపై వెనుకడుగు వేస్తోంది ఫ సర్పంచ్ల అభినందన సభలో మాజీ మంత్రి కేటీఆర్ -
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
రామగిరి(నల్లగొండ): క్రీడలు విద్యార్థుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండీ అక్బర్ అలీ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో 2025–26 జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఆటలు ఆడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహరావు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఐలయ్య, సత్తయ్య, పీడీ ప్రసాద్, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీమాధురి, అంజయ్య, జ్యోతి, సిబ్బంది విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా కొనసాగిన పోటీలు.. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితరల పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు కోదాడలోని అనురాగ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. బుధవారంతో ఈ స్పోర్ట్స్ మీట్ ముగియనుంచి. మొదటి స్థానంలో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఫ నల్లగొండ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ ఫ మేకల అభినవ్ స్టేడియంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
సహకార సేవలు విస్తృతం
ఉమ్మడి జిల్లాకు కొత్తగా 22 పీఏసీఎస్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు నల్లగొండ అగ్రికల్చర్ : సహకార సంఘాల సేవల విస్తరణకు సహకార శాఖ పూనుకుంది. కొత్త సహకార సంఘాలను (పీఏసీఎస్)ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు ఉన్న సంఘాల నుంచి కొన్ని గ్రామాలను వేరు చేసి.. కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 కొత్త పీఏసీఎస్ల ఏర్పాటకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త సంఘాలు ఏర్పాటై రైతులకు సేవలు విస్తృతం కానున్నాయి. రైతులకు సేవలు విస్తరించేలా.. 2013 తరువాత కొత్త సంఘాలు ఏర్పాటు కాలేదు. రెండు గ్రామాలకు ఒక సంఘం ఉండగా.. మరికొన్ని సంఘాల్లో మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఇక, కొన్ని సంఘాల్లో 500 మంది రైతులు సభ్యులుగా ఉంటే మరికొన్ని చోట్ల.. మూడు నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర సేవలను అందిండంలో ఆయా సంఘాలు రైతులకు సరైన న్యాయం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంఘాల సేవలను విస్తరించడం కోసం రెండు సంవత్సరాలుగా కొత్త సంఘాల ఏర్పాటు కోసం రైతులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 132కు చేరనున్న సంఘాలు కొత్త సంఘాల కోసం ప్రతిసాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం కోరింది. దీంతో కొత్త సంఘాల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలో సంఘాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 110 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా 22 సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే మొత్తం సంఘాల సంఖ్య 132కే చేనుంది. ప్రస్తుతం పీఏసీఎస్ ఇలా జిల్లా పీఏసీఎస్లు నల్లగొండ 42సూర్యాపేట 47యాదాద్రి 21 మొత్తం 110 నల్లగొండ జిల్లాలో మాడుగులపల్లి, గట్టుప్పల్, గుడిపల్లి, తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి. సూర్యాపేట జిల్లాలో వెలిదండ, దిర్శించర్ల, త్రిపురవరం, రామాపురం, గుడిబండ, తొగర్రాయ్, గనపవరం . యాదాద్రి భువనగిరి జిల్లాలో కంచనపల్లి, ఎస్.లింగోటం, యల్లంకి, మునిపంపుల, మోటకొండూరు, కూరెళ్ల, వర్కట్పల్లి, జబ్లక్పల్లి, బట్టుగూడెం. ఫ ప్రభుత్వం ఆమోదిస్తే 132కు చేరనున్న సంఘాల సంఖ్య ఫ తీరనున్న రైతుల ఇబ్బందులు -
ఫ పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎంపిక ఫ కేంద్ర హోం శాఖలోని ఓఆర్జీఐకి డిజిటల్ నివేదిక అందజేత
ముందస్తు జన గణనను రాష్ట్ర సెన్సెన్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆన్లైన్లోనే కేంద్ర హోంశాఖలోని ఓఆర్జీఐకి నివేదిక పంపించారు. దీని ఆధారంగానే 2027లో జన గణనను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో ఆ సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు పూర్తిస్థాయి జన గణన చేపట్టనున్నారు. నల్లగొండ : 2027లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జన గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మూడు భిన్నమైన మండలాలను ఎంపిక చేసి ముందస్తు జన గణన నిర్వహించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలాల్లో ఎన్యుమరేటర్లు ఆన్లైన్ యాప్లో జన గణన వివరాలు నమోదు చేశారు. దీనికి తోడు ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్కు అనుసంధానం చేశారు. కేంద్ర హోం శాఖలోని ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఓఆర్జీఐ) ముందస్తు జన గణన నిర్వహించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు, మామిడాల, తిప్పర్తి, జంగారెడ్డిగూడెం, సర్వారం గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ముందస్తు జన గణన నిర్వహించేందుకు గాను 40 మంది ఎన్యుమరేటర్లు, ఏడుగురు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. మొదట సూపర్వైజర్లు ఆయా మండలాల్లో గ్రామాలకు వెళ్లి ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించారు. హౌజ్ లిస్టింగ్ బ్లాక్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ను గూగుల్కు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు ముందస్తు జన గణన పూర్తిచేశారు. మొట్టమొదటిసారి పెన్ను, పేపర్ లేకుండా డిజిటల్ విధానంలో ముందస్తు జన గణన నిర్వహించారు. ఇళ్లను జియో ట్యాగింగ్తో గుర్తించడంతో పాటు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబాలతో పాటు మిగతా వివరాలను కూడా అందులో పొందుపర్చారు. రేడియో వింటారా, ఎలాంటి భోజనం చేస్తారు, బాత్రూమ్ ఉందా, ఇంట్లో ఎన్ని గదులున్నాయి, పైళ్లెన జంటలు ఎన్ని, ఇంటికి కరెంట్ సరఫరా ఉందా, గ్యాస్, టీవీ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వాడుతున్నారా, సైకిల్, బైక్, కారు తదితర వివరాలను సేకరించారు. ఐదు గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా వదలకుండా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కోసం నిర్వహించిన ముందస్తు జన గణన విజయవంతంగా పూర్తయ్యింది. ఇందులో భాగంగా మొదట ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిప్పర్తి మండలంలోని ఐదు గ్రామాల్లో డిజిటల్ యాప్లో జనాభా లెక్కలు సేకరించారు. రాబోయే ప్రధాన జన గణన ప్రక్రియను మెరుగుపర్చడానికి ఈ ముందస్తు జన గణన ఎంతో ఉపయోగపడనుంది. -
మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
కృష్ణా నదిలోని నీటి నమూనాల సేకరణమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కృష్ణా నదిలోని నీటి నమూనాలను మంగళవారం కేంద్ర అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణ్ మాట్లాడుతూ.. కృష్ణా నదిలో వ్యర్థ రసాయనాలు కలిసి రంగు మారిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలని సూచించారని, ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, నీటి పరిశోధనశాఖ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సెంటర్కు చెందిన బృందాలు మట్టపల్లికి చేరుకుని నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. శాసీ్త్రయ నిర్ధారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రామ్కిషోర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్ తదితరులున్నారు.ఫ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదగిరిగుట్ట : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా కాంగ్రెస్ మంత్రులే 40 టీఎంసీలు చాలు అని లేఖలు రాయడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం కొండపైన హరిత టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీటి ప్రాజెక్టులు తీసుకువస్తే.. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తగ్గించి, రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందన్నారు. యాదగిరి దేవస్థానం నుంచి ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు పెట్టవద్దని నోటీసులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇష్టానుసారంగా జెండాలు, ఫ్లెక్సీలు పెట్టి నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ప్లెక్సీలు ఏర్పాటును వ్యతిరేకించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్కు అక్రమంగా తీసుకెళ్లారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ పెరిగిందని, అందుకే సర్పంచ్లుగా అధిక సీట్లు గెలిపించారన్నారు. కేసీఆర్ అద్భుతమైన పాలనతో పరిపాలన చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం వేంపాడు శివారులోని కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి కోటయ్య. ఆయన తనకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలకు పైగా భూమిలో బత్తాయి, మిగతా భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.3.5 లక్షలతో రాతి స్తంభాలతో పందిరి ఏర్పాటు చేసుకుని బీర, దొండ, కాకర వంటి తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నాడు. వారానికి ఒకసారి మిర్యాలగూడ, నల్లగొండ మార్కెట్కు కూరగాయలు తరలిస్తున్నారు. నిడమనూరు : ఇతర పంటలతో పోలిస్తే రైతులకు పందిరి సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. మార్కెట్కు అనుగుణంగా గ్రామీణ యువత పందిరి సాగుపై దృష్టి సారిస్తున్నారు. నిడమనూరు మండలంలోని నాన్ ఆయకట్టు గ్రామాల్లో ఒకప్పుడు బత్తాయి, కంది, పెసర, మినుము వంటి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. బత్తాయి సాగులో ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకంతో ఫలసాయం కంటే తోట పోషణ రైతుకు ఆర్థిక భారంగా మారింది. దీంతో కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించి, వాటిపై వచ్చిన ఆదాయాన్ని బత్తాయి తోటకు పెట్టుబడిగా పెడుతున్నారు. బత్తాయిపై వచ్చిన ఆదాయాన్ని రైతు స్థిరమైన వార్షిక ఆదాయంగా చెప్పకుంటున్నారు. తీగ జాతి కూరగాయల సాగుతో రైతులు వారానికి మార్కెట్, రవాణా ఖర్చులు పోను సగటున రూ.25వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తీగ జాతి పంటల సస్యరక్షణ చర్యలకు ఎరువులు, పురుగు మందల వాడానికి నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా బీర, కాకర తీగ పంటకాలం ముగిసేలోపు టమాట కూడా అంతరంగా ముందుగానే వేస్తున్నారు. దీంతో సగటున రైతులు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పందిరి సాగుతో స్థిరమైన ఆదాయంఫ 20 గుంటల్లో కాకర సాగు చేస్తూ.. వారానికి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడితో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం రైతు కోటయ్య చెబుతున్నాడు. ఫ అదేవిధంగా అర ఎకరంలో దొండ సాగుతో వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, వారానికి రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫ 10 గుంటల భూమిలోనే (5 నుంచి 8 వరుసలు) బీర సాగు చేశానని, వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, క్వింటాల్కు రూ.3 వేల వరకు లభిస్తోందని కోటయ్య చెబుతున్నారు. -
దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు
నల్లగొండ : దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించిన కలెక్టర్.. సొంతంగా కదలలేని దివ్యాంగుల కోసం బ్యాటరీ సహాయంతో నడిచే మూడు చక్రాల సైకిళ్లను ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి జిల్లాలోని సుమారు 105 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ను ఇప్పించనున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని మహిళా ప్రాంగణంలో బ్యాటరీ ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కార్యక్రమానికి ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణు బాబు, ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ హాజరుకానున్నారు. ఒక్కో ట్రైసైకిల్ విలువ సుమారు రూ.70 వేల ఉంటుంది.. మొత్తం 105 బ్యాటరీ ట్రై సైకిల్స్ను ఈసీఐఎల్ అందించనుంది. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ వల్ల దివ్యాంగులలో ఆత్మస్థైర్యం పెరగడమే కాకుండా, వారు జీవనోపాధులను పెంపొందించుకునేందుకు మంచి అవకాశం కలుగుతుంది. ఫ 105 వాహనాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఈసీఐఎల్ ఫ ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పరిశ్రమల్లో సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి
నల్లగొండ, త్రిపురారం : పరిశ్రమల్లో సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, విపత్తుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు. సోమవారం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ పరిధిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో విపత్తుల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో కెమికల్ లీకేజీ, భవనం కూలిపోవడం, గ్యాస్ లీకేజ్ వంటి సంఘటనలు జరిగినప్పుడు వివిధ శాఖల సహకారంతో ఎక్కువ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని శాఖల సహకారంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడడం, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం జరుగుతుందన్నారు. వివిధ సంస్థలు, ఫ్యాక్టరీల్లో కార్మికులు పనిచేసే చోట విపత్తులు సంభవిస్తే వారు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, అనుకోని సందర్భంలో విపత్తు సంభవిస్తే ఎలా స్పందించాలో అనే అంశాలపై కార్మికులకు, సిబ్బందికి, సంస్థల యజమానులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. బ్లాసింగ్ జరిగిన సమయంలో ఘటనా స్థలం నుంచి ఏవిధంగా బయటపడాలో వివరించినట్లు చెప్పారు. భవిష్యత్ కూడా పరిశ్రమల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు శ్రీదేవి, సతీష్, సందేశ్, డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ నరసింహ, వెంకటేశ్వర్లు, ఆయా కంపెనీల సిబ్బంది చక్రవర్తి శంకరన్, వెంకట కొండల్రావు, రవికుమార్ పాల్గొన్నారు. ఫ ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్ -
లెక్చరర్లకు రేషన్కార్డులా!
కొంత మంది అధ్యాపకులకు ఆహార భద్రత కార్డులు ఉన్నట్లు ఇటీవల ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ను ఆదేశించాం. నివేదిక రాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. – దస్రునాయక్, డీఐఈఓ నల్లగొండ టూటౌన్: దారిదర్య రేఖకు దిగువ ఉన్న వారికి ప్రభుత్వం అందించిన ఆహార భద్రతా కార్డులు ప్రభుత్వ అధ్యాపకుల చెంత కూడా ఉన్నాయి. రేషన్ దుకాణాల్లో నెల, నెలా సన్న బియ్యం సైతం తీసుకెళ్లడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 60 మందికి పైగా అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. ప్రభుత్వ అటెండర్ ఉద్యోగం చేసే వారు కూడా ఆహార భద్రత కార్డు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గెజిట్ అధికారి హోదాలో ఉన్న జూనియర్ కాలేజీ అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు తీసుకోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. మిగతా అధ్యాపకులే వారిని చూసి నివ్వెరపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొంత మంది అధ్యాపకులు ఆహార భద్రత కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్కు కూడా వీటిని వినియోగించుకున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ కాలేజీలో చదివే తమ పిల్లల కోసం వారు తహసీల్దార్ కార్యాలయాల్లో తక్కువ ఆదాయం ఉన్నట్లు ధ్రువపత్రాలు పొందినట్లు తెలిసింది. ఇంకొందరు ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స కూడా చేయించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం. ఆహార భద్రత కార్డుల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే వందల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బయటపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేక విచారణ బృందాలు ఏర్పాటు చేయకుండా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారన్న దానిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నత స్థాయి విచారణ బృందం ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫ ప్రభుత్వ పథకాలు పొందుతున్నట్లు ఇటీవల అధికారులకు ఫిర్యాదు ఫ పిల్లల చదువుల కోసం తక్కువ ఆదాయం ఉన్నట్లు ధ్రువపత్రాలు ఫ నెలనెలా రేషన్ బియ్యం తీసుకెళ్తున్నా పట్టింపులేని వైనం -
నూతన పాలకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు
నల్లగొండ: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. నూతన స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నెరవేర్చే విధంగా గ్రామాభివృద్ధికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం నాయకత్వంలో గ్రామాలు ప్రగతి పథంలో నిలవాలని కోరారు. పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసానల్లగొండ: బాధిత పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉండి ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. ఎస్ఐ సీత్యానాయక్ కొండమల్లేపల్లి పీఎస్లో పని చేస్తూ మృతి చెందగా.. బాధిత కుటుంబ సంక్షేమానికిగాను ఆయన భార్య దాస్లీబాయికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.2లక్షల చెక్కు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వినతుల స్వీకరణ నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ 37 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు. నేడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళానల్లగొండ టూటౌన్: నల్లగొండలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాను అన్ని రకాల ఆహార వ్యాపార సంస్థలు, హోటళ్ల యాజమాన్యాలు వినియోగించుకోవాలని కోరారు. నేడు రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపుకనగల్: మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని పేర్కొన్నారు. నేడు, రేపు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ రామగిరి(నల్లగొండ): జిల్లాలోని కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో మంగళవారం, బుధవారం జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన జడ్జినాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి మహ్మద్ ఇస్రత్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు. వీరికి బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర స్వాగతం పలికారు. అనంతరం జాతక వనం మహాస్థూపంపై చెక్కిన బుద్ధుడి చరిత్రను వివరించారు. -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి
నల్లగొండ: విద్యార్థులకు చదువుపై ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గురుకుల విద్యాలయాల్లో కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులపై విద్యాభారం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితుల ఒత్తిడిని అధిగమించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ప్రతి గురుకుల విద్యాలయంలో రెండు నెలలకు ఒకసారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని, అన్ని మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లతో చైల్డ్ వెల్ఫేర్ మీటింగ్ పెట్టి పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ అమిత్, ఇన్చార్జ్ డీఆర్ఓ అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలి నల్లగొండ: జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఓటర్ల మ్యాపింగ్పై సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ రోజుకి 10 వేల చొప్పున చేస్తూ గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం –8 ద్వారా ఫొటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని, ఈ ప్రక్రియ వచ్చేనెల 13 లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జ్ డీఆర్ఓ అశోక్ రెడ్డి, స్పెషల్ ఈఆర్వో వెంకటేశ్వర్లు నల్లగొండ, కనగల్, తిప్పర్తి తహసీల్దార్లు పరుశురాం, పద్మ, రామకృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
విద్యార్థులకు కంటి పరీక్షలు
నల్లగొండ టౌన్ : విద్యార్థుల్లో దృష్టి లోపం నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం ద్వారా కంటి పరీక్షల శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. మొదటిరోజున 1,166 మంది బాలబాలికలకు కంటి పరీక్షలు చేశారు. 105 బాలికలు, ఆరుగురు బాలురకు కంటి అద్దాలు అవసరమని గుర్తించి ఇంటెంట్ పెట్టారు. జిల్లాలో 89,873 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 89,873 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో బాలురు 43,688 మంది, బాలికలు 46,185 మంది ఉన్నారు. వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏడు నుంచి ఎనిమిది వైద్య బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో కంటి వైద్య నిపుణుడితో పాటు ఆప్తాలమిస్టు ఇతర సిబ్బంది ఉన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన వైద్య శిబిరాలు సెలవు దినాలు మినహాయించి అన్ని పాఠశాలల్లో పనిదినాల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24 వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. ఫ పాఠశాలల్లో ప్రారంభమైన కంటి వైద్య శిబిరాలు ఫ మొదటిరోజు 1,166 మందిని పరీక్షించిన వైద్యులు ఫ అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ ఫ ఫిబ్రవరి 24 వరకు కొనసాగనున్న క్యాంపులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తారు. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
బిహార్ సీఎం ప్రవర్తన తీరు దేశానికే అవమానకరం
రామగిరి(నల్లగొండ): ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్ను లాగిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని జమీయత్ ఉలేమా ఏ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహేసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ముస్లింలు, మైనారిటీ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం దేశానికే అవమానకరమన్నారు. ఈ నిరసన కేవలం ముస్లిం మహిళల గౌరవం కోసమే కాకుండా దేశంలోని ప్రతి మహిళ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాట మన్నారు. కార్యక్రమంలో జమియత్ ఉలేమా ఏ హింద్ జిల్లా కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, ఎండీ అఫ్జల్ ఉద్దీన్, ఫుర్ ఖాన్, సీపీఎం నాయకుడు ఎండీ సలీం, మహబూబ్ అలీ, ఎండీ మాజీబుద్దీన్, కౌన్సిలర్ అమీర్, లతీఫ్ పాషా, ఐద్వా మహిళా నాయకులు పాల్గొన్నారు. -
ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలి
● జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీరామగిరి(నల్లగొండ) : కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమియత్ ఉలేమాయే హింద్ కోరిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన హామీని నెరవేర్చాలన్నారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ప్రజల నుంచి వేరుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జమియత్ ఉలేమాయే హింద్ నల్ల గొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ. హఫీజ్ఖాన్, జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, అబ్దుల్ రెహమాన్, జియాఉద్దీన్, హఫీజ్ ఫుర్ఖాన్, సమీ, హఫీజ్ శంషుద్దీన్, హఫీజ్ అయూబ్ పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దాతలకు, ఆర్మీ అధికారులకు కల్పిస్తున్న ప్రొటోకాల్ దర్శన సదుపాయాలు, దర్శనం సమయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శనాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ప్రొటోకాల్ విభాగం సిబ్బంది పూర్తిస్థాయి బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అన్ని దర్శనాలు నిబంధనల ప్రకారం ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. అనంతరం వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే వైకుంఠద్వారం స్థలం వద్ద నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన అద్దెలు, లీజులు తదితర ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, అధికారులు తదితరులున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
నేటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
నల్లగొండ : జిల్లాలోని గొర్రెలు, మేకలకు ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు సామూహికంగా నట్టల నివారణ మందు వేయనున్నట్లు జిల్లా పశు సంవర్థక అధికారి డాక్టర్ జీవీ రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 250 మంది సిబ్బంది 78 మంది బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జీవాల పెంపకందార్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ.అక్బర్ అలీ అన్నారు. ఫిట్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే ఫిట్నెస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాల నుంచి ఆర్టీసీ కాలనీ మీదుగా రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులచే సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వివిధ క్రీడల్లో పాల్గొనడంతోపాటు వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ వరప్రసాద్, ప్రిన్సిపాల్ అంథోని, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులకు ఆదాయం చిట్యాల : రైతులంతా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ నిరంతర ఆదాయం పొందాలని స్టేట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కె.సురేంద్రమోహన్ పేర్కొన్నారు. చిట్యాల మున్సిపాలిటీ శివారులోని కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో కూరగాయల పంటలు, వ్యవసాయ పద్ధతులు, ఆదాయం, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ రైతులంతా సుస్థిర వ్యవసాయం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన నేలను అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బాబునాయక్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారులు ప్రవీణ్కుమార్, శ్వేత, ఏఓ గిరిబాబు, రహీమ్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. నృసింహుడికి పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రబాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ముఖ మండపంలో అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు. -
గాంధీ పేరు తొలగింపుపై నిరసన
నల్లగొండ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా ఆదివారం నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు నల్ల రిబ్బన్లు ధరించి, గాంధీ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మోదీ ఫాసిస్టు ఆలోచనలు చేస్తున్నారని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, మాధవి, సునీత, కన్నారావు, సుధాకర్, దేవదాస్, ముంతాజ్ అలీ, వెంకటయ్య, శ్రీనివాస్, కోటి, పరమేశ్, శివ, గౌతమ్, కిరణ్, వెంకటేశ్వర్లు, సోమన్న, స్వామి, వెంకన్న, రాజేందర్రెడ్డి, సాగర్రెడ్డి, పర్వతాలు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకన్నగౌడ్ పాల్గొన్నారు. -
జాతీయ కథల పోటీల్లో శ్రీవర్ధన్ ప్రతిభ
రామగిరి(నల్లగొండ): హైదరాబాద్కు చెందిన బాల చెలిమి సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి బాలల కథల పోటీలో నల్లగొండకు చెందిన సాగర్ల శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. ఈ కథల పోటీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి నుంచి 750 కథలు రాగా.. 16 కథలను ఉత్తమ కథలుగా ఎంపిక చేశారు. అందులో శ్రీవర్ధన్ రాసిన కథ ఎంపికై ంది. రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్, బాల చెలిమి సంస్థ అధ్యక్షుడు వేద కుమార్, బ్రెడ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ రావి శారద, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. రఘు తదితరుల చేతుల మీదుగా శ్రీవర్ధన్ ఉత్తమ కథా పురస్కారం అందుకున్నాడు. శ్రీవర్ధన్ను సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ప్రముఖ బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్, శ్రీవర్ధన్ తల్లిదండ్రులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, ధనలక్ష్మి తదితరులు అభినందించారు. -
పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి సరికాదు
మిర్యాలగూడ అర్బన్ : పెన్షనర్లపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాజ్యాగం ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలు పాటించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విద్యారంగాన్ని సంస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఉచిత పథకాల వలన ప్రయోజనం లేదని వాటి స్థానంలో ఉత్పాదక శక్తిని పెంచే పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరారు. పెన్షనర్లకు 5 డీఏలు పెండింగ్లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రెండో పీఆర్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పాదూరి విద్యాసాగర్రెడ్డి, వి. బంగారయ్య, నూకల జగదీష్చంద్ర, అనుముల మధుసూదన్రెడ్డి, ఎం. జనార్దన్రెడ్డి, కడారి ప్రేమ్చంద్, వెంకటేశం, రాఫెల్, శ్యాంసుందర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి, ప్రకాశరావు, రామావతారం, శంకర్రెడ్డి, శ్రీనిసరెడ్డి, అంజిరెడ్డి, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
గోల్డెన్ అవర్లో వైద్యం!
జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్ ప్రాంతీయ ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుతో రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందనుంది. ట్రామాకేర్ సెంటర్ పనులు త్వరలో ప్రారంభిస్తాం. దేవరకొండ ఆస్పత్రిలో అదనంగా మరో ఐదు డయాలసిస్ బెడ్లు సైతం ఏర్పాటు కానున్నాయి. – మాతృనాయక్, డీసీహెచ్ఎస్, నల్లగొండ దేవరకొండ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి వెంటనే చికిత్స అందించేలా ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో కొత్తగా నాలుగు ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ట్రామాకేర్ సెంటర్ ద్వారా క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన, తక్షణ చికిత్స అందడంతో ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొదట దేవరకొండ, మిర్యాలగూడలో.. జిల్లాలో నాలుగు ప్రాంతీయ ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుండగా మొదటి విడతలో దేవరకొండ, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రుల్లో పనులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగార్జునసాగర్, నకిరేకల్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఆస్పత్రులకు ఇప్పటికే రోజూ వందల సంఖ్యలో ఓపీ నమోదు అవుతుండగా.. వీటిలో రోడ్డు ప్రమాదాల కేసులు కూడా ఉంటున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను అత్యవసర సమయాల్లో హైదరాబాద్, నల్లగొండలోని ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోంది. ఏరియా ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటైతే ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందనుంది. సమకూరనున్న సౌకర్యాలు.. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటైతే ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే విభాగం, ఆల్ట్రాసౌండ్, ప్రత్యేక బ్లడ్బ్యాంక్, 5 ఐసీయూ బెడ్స్, మరో 5 స్టెప్డౌన్ బెడ్స్ అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్గా పిలిచే మొదటి గంటలోగా ఆస్పత్రికి తీసుకొస్తే తక్షణ మెరుగైన వైద్య సహాయం అందనుంది. ఫ జిల్లాకు నాలుగు ట్రామాకేర్ సెంటర్లు మంజూరు ఫ దేవరకొండ, మిర్యాలగూడ, సాగర్, నకిరేకల్లో ఏర్పాటు ఫ క్షతగాత్రులకు అందనున్న తక్షణ చికిత్స -
ఓటమి.. గెలుపునకు నాంది
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు చిన్ననాటి నుంచే తమకు నచ్చిన క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఓటమితో కుంగిపోకుండా గెలుపునకు నాంది పలుకాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడల వైపు దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నేడు కొలువుదీరనున్న పంచాయతీ పాలకవర్గాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీలు సమస్యల సుడిగుండంలో ఉన్నాయి. 23 నెలల నుంచి గ్రామాల్లో పత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగియడంతో.. సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. వారికి గ్రామాల్లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు, అప్పుల చిట్టా, పెండింగ్ బిల్లులు చెల్లించడమే వారికి ప్రధాన సవాల్గా మారనుంది. ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే.. కాస్త ఉపశమనం లభించనుంది. 866 పంచాయతీల్లో పాలకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 2019లో గ్రామ పంచాతీయల ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన బాధ్యతల స్వీకరించిన పాలక వర్గాల కాల పరిమితి గతేడాది (2024) ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో కలిసి 866 పంచాయతీల్లో ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. వివిధ కారణాలతో మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆగిపోయిన ఆర్థిక సంఘం నిధులు జిల్లాలో 23 నెలల ప్రత్యేక అధికారుల పాలనతో అంతకుముందు 2, 3 నెలలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిబంధల ప్రకారం పాలక వర్గాలు ఉంటేనే కేంద్రం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు సర్పంచ్లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఇటు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం చేపట్టిన ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యారు. పారిశుద్ధ్యం, వీధి లైట్ల మరమ్మతు, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు తెచ్చి పనులు చేశారు. చివరకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండడంతో.. పాత బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే పడనుంది. ఫ కొత్త సర్పంచ్లకు సమస్యల స్వాగతం ఫ నిధుల్లేక అస్తవ్యస్తంగా పల్లె పాలన ఫ ప్రభుత్వాలు కరుణిస్తేనే.. గ్రామాల్లో అభివృద్ధి పనులునల్లగొండ : కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువు దీరనున్నాయి. ఇటీవల పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 869 గ్రామపంచాయతీలకు గాను 866 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటి పరిధిలో సోమవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు.. సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ పాలకవర్గం మొదటి సమావేశం నిర్వహించనున్నారు. ç³…^éĶæ$-¡ÌZÏ VýS™èl {糿¶æ$-™èlÓ… {糆 ¯ðlÌê MóS…{§ýl… C^óla BÆý‡-Šి£ýl®MýS çÜ…çœ$… °«§ýl$-ÌS-™ø Æ>çÙ‰ {糿¶æ$-™èlÓ… MýS*yé MýSÍí³ °«§ýl$-Ë$ CçÜ*¢ Ð]l_a…¨. ©…™ø _¯]l² ç³…^éĶæ$-†MìS Æý‡*.50 ÐólË$, ò³§ýlª ç³…^éĶæ$-¡ÌSMýS$ Æý‡*. 2 ÌS„ýSÌS ¯]l$…_ Æý‡*.3 ÌS„ýSÌS Ð]lÆý‡MýS$ {糆 ¯ðlÌê BĶæ* {V>Ð]l*-ÌZϰ f¯é¿ê¯]l$ ºsìæt °«§ýl$-ÌS¯]l$ C_a…¨. B °«§ýl$-ÌS-™ø {V>Ð]l$…-ÌZ AÀ-Ð]l–-¨® 糯]l$-ÌS¯]l$ ^ólÔ>Æý‡$. ´ëÌS-¯]l-ÌZ GÌê…sìæ Cº¾…-§ýl$-Ë$ G§ýl$-Æý‡$-M>Ìôæ§ýl$. ©…™ø ´ër$ G…ï³, GÐðl$ÃÌôæÅ C™èlÆý‡ °«§ýl$-Ë$ MýS*yé §é°MìS ™øyýl$-V> Ð]l^ólaÑ. §é…™ø {V>Ð]l*-ÌZÏ A°² AÀ-Ð]l–-¨® 糯]l$-Ë$ fÇVóSÑ. C糚yýl$ G°²MýS-Ë$ ç³NÇ¢ AƇ$$-¯]l…-§ýl$¯]l BǦMýS çÜ…çœ$… °«§ýl$-Ë$ Ð]lÝë¢-Ķæ$°, {ç³çÜ$¢™èl… MöË$Ð]l#-©Æó‡ Mö™èl¢ ´ëÌSMýS Ð]lÆ>Y-Ë$ ¿êÑçÜ$¢-¯é²Æ‡$$. AÑ Ð]lõÜ¢¯ól AÀ-Ð]l–-¨® 糯]l$-Ë$ Ð]l¬…§ýl$MýS$ ÝëVýS-¯]l$-¯é²Æ‡$$. -
ఏఐలో నార్కట్పల్లి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల యాదవరెడ్డి, రజిత దంపతుల కుమారుడు జయచందర్రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు. గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్రెడ్డి తెలిపారు. -
రాజీతో కేసుల సత్వర పరిష్కారం
రామగిరి(నల్లగొండ) : రాజీతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆదివారం జిల్లాలో పలు కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులో సివిల్ 46, క్రిమినల్ 8,112, మోటార్ వాహన ప్రమాదబీమా 83, చెక్ బౌన్స్ 07, బ్యాంక్ 31, సైబర్ క్రైం 31, ట్రాన్స్కో 49, ట్రాఫిక్ చలాన్ 48,354, బీఎస్ఎన్ఎల్ 33 మొత్తం 48,388 (పెండింగ్ మరియు ప్రి లిటిగేషన్) కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రమాద బీమా కేసుల్లో రూ.4,93,30,000 నష్టపరిహారం ఇప్పించగా, బ్యాంక్ కేసుల్లో రూ.37,76,896 రుణపరిహారం, సైబర్ క్రైం కేసుల్లో రూ.2,73,191 రికవరీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, జడ్జిలు ఎన్.రోజారమణి, కె.కవిత, కె.దిలిప్రావు, ప్రమీల జైన్, కె.శిరీష, కె.సౌందర్య, కె.అనంతరెడ్డి పాల్గొన్నారు. -
సరికొత్తగా సాగు.. దిగుబడులు బాగు
నడిగూడెం : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సాగు నీటి లభ్యత ఎక్కువగా పెరగడంతో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో నారుమడి అవసరం లేకుండా పంట కాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో, డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నారు పోయడం, నీరు పెట్టడం, నాట్లు వేయించడం.. ఇవన్నీ పాత తరం వరి సాగు పద్ధతులు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు సాగుపై చేసే ఖర్చు పెరగడం, మరో వైపు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రమ్సీడర్ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో నడిగూడెం మండల వ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 శాతం డ్రమ్సీడర్, 70 శాతం వెదజల్లే పద్ధతిలోనే పంట సాగు చేపట్టారు. డ్రమ్సీడర్ను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్సీడర్తో విత్తనాలు వెదజల్లడంతో నిర్ధిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. డ్రమ్సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. 3 నుంచి 4 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులపై రైతుల్లో పెరుగుతున్న అవగాహన -
ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిన్నకాపర్తిలో జరిగిన సంఘటన విషయంలో సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కలెక్టర్ను కోరింది. శనివారం ఐక్య వేదిక నాయకులు నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించారని.. అయితే సర్పంచ్కు సంబంధించిన ఒక అభ్యర్థి బ్యాలెట్ పత్రాలు కౌంటింగ్ కేంద్రంలో వదిలేయడం వల్ల ఆర్ఓను సస్పెండ్ చేశారని, దీనికి సంబంధం లేని 10 మంది పీఓలను సస్పెండ్ చేయడం సరి కాదన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చే గౌరవ భత్యం కూడా అన్ని జిల్లాల్లో ఒకేలా లేదన్నారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండిండ్లో ఉన్న 5 డీఏలు, హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు, జనార్దన్, రాములు, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మేకల జాన్రెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్రెడ్డి, నలపరాజు వెంకన్న, గాదె వెంకట్రెడ్డి, చింతల విజయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన ఎన్పీఎల్ టోర్నమెంట్
నల్లగొండ : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున సహకరిస్తామన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద క్రీడాకారులను ఆదుకుంటామన్నారు. టోర్నమెంట్ విజేత డీకే వారియర్స్ జట్టుకు ప్రథమ బహుమతిగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీల్డ్, రూ.2,22,222 నగదు, రన్నరప్గా నిలిచిన ఆదా సిసి జట్టుకు నల్లగొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున షీల్డ్, రూ. 1,11,111 బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, ఎస్పీ శరత్చంద్ర పవార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, అబ్బగోని రమేష్గౌడ్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, పాశం సంపత్రెడ్డి, ప్రదీప్నాయక్, కేసాని వేణుగోపాల్రెడ్డి, ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, రంగా, పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ
చలి కాలంలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్, రాగి జావ, సూప్లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, బత్తాయి పండ్లతో పాటు ఆకు కూరలు తినాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఉత్తమం. విటమిన్–డి అందేలా సూర్యరశ్మిలో నిల్చోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఐస్క్రీమ్లకు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. విటమిన్–సి, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. – ఎం. శ్రీనివాసరావు, డైటీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండ -
ప్రజావాణి యథాతథం
నల్లగొండ : కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22వ తేదీనుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు వారి ఫిర్యాదులు అందజేయడానికి ఈ నెల 22న జరిగే ప్రజావాణికి హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్రామగిరి(నల్లగొండ) : న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. పెండింగ్లో ఉన్న కేసులు, ప్రీ లిటీగేషన్ కేసుల పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదలరామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలను ఎంజీ యూనివర్సిటీ సీఓఈ జి.ఉపేందర్రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్తో కలిసి శనివారం విడుదల చేశారు. 2025 నవంబర్లో డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడవ సెమిస్టర్ 31శాతం, ఐదవ సెమిస్టర్ 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, అంతటి శ్రీనివాసులు, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ఎం.శ్రీనివాస్రెడ్డి, జే.నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు తదితరులు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ నిరసన ర్యాలీనల్లగొండ : జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జి రామ్జి పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఈ నెల 21న నల్లగొండలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని క్లాక్టవర్ నుంచి ర్యాలీ ప్రారంభించి రామగిరి గాంధీ విగ్రహం వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 23న కేటీఆర్ రాకనల్లగొండ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 23న నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సన్మానించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పరిశీలించారు. కార్యదర్శులకు బిల్లులు ఇప్పించాలినల్లగొండ : పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతున్నందున ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు పెట్టిన బిల్లులు ఇప్పించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో డీపీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో పనులు చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని తెలిపారు. కొత్తగా సర్పంచ్లు వచ్చారని.. ఇప్పుడు విడుదలయ్యే 15 ఫైనాన్స్ నిధుల నుంచి మొదటగా పంచాయతీ కార్యదర్శులు ఖర్చుపెట్టిన బిల్లులకు చెక్కులు జారీ చేసేలా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. -
చిన్నారులను ఉదయం ఎండలో ఉంచాలి
● చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, శాస కోశ సంబంధిత సమస్యలు, జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. ● చిన్న పిల్లలకు స్వెటర్లు వేసి చెవులకు మంకీ క్యాపు పెట్టాలి. కాళ్లకు చేతులకు సాక్సులు, గ్లౌజ్లు వేయాలి. ● పాలు తాగే నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ● ఉదయం ఎండలో ఉంచాలి. ● చిన్నారులతో ఉదయం సమయంలో ప్రయాణం చేయొద్దు. ● రాత్రి వేళల్లో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచి.. వెచ్చదనం కోసం వేడినిచ్చే హైవోల్టేజీ బల్బులు వేయాలి. ● కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. వేడి ఆహారం తినిపించాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయం తాగించొద్దు. – డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, పిల్లల వైద్యుడు, నల్లగొండ -
– సాక్షి నెట్వర్క్
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, చల్లని గాలులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు వణుకు పుట్టిస్తోంది. మంచు కురుస్తుండడంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. చలి నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చల్లదనంతో ఆస్తమా కూడా పెరుగుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా జరిగి నిమోనియా కేసులు నమోదవుతాయి. రద్దీగా ఉండే విహార యాత్రలకు వెళ్లవద్దు. రోగులు సక్రమంగా మందులు వేసుకోవాలి. ఏమైనా సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రాఘవేందర్రెడ్డి, పల్మనాలజిస్ట్, నల్లగొండ వృద్ధులు మరింత జాగ్రత్త -
డ్రైవింగ్.. అలర్ట్
పొగ మంచు ఉండే సమయాల్లో డ్రైవర్లు వాహనాల వేగాన్ని తగ్గించుకోవాలి. ● పొగమంచులో దృశ్యమానత తక్కువగా ఉంటున్నందున సరైన లైట్లు ఉపయోగించాలి, లోబీమ్ హెడ్లైట్లు, ఫాగ్ లైట్లు ఉపయోగించాలి. హైబీమ్ లైట్లు ఉపయోగించరాదు. అవి పొగమంచులో ప్రతిఫలించి దృశ్యమానతను తగ్గిస్తాయి. ● వెనుక వైపు టెయిల్ లైట్లు ఆన్లో ఉండేలా చూడాలి. ● వాహనాల మధ్య సురక్షిత దూరం పాటించాలి. ● రోడ్డు మార్కింగ్ను అనుసరించాలి. ● అత్యవసరమైతే తప్ప ఓవర్ టేక్ చేయరాదు. ● అకస్మాత్తు మలుపులు నివారించాలి. ● విండ్ స్క్రీన్ స్పష్టంగా ఉండాలి. డీఫాగర్, వైపర్లు ఉపయోగించి విండ్ స్క్రీన్ స్పష్టంగా ఉండేలా చూడాలి. ● అద్దాలు, కిటికీలు శుభ్రంగా ఉంచాలి. ● పాదచారులు , సైకిల్ నడిపే వారు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ● ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోతే పార్కింగ్ లైట్లు, హజార్డ్ లైట్లు ఆన్ చేయాలి. ● రోడ్డు మధ్యలో వాహనం ఆపవద్దు. ప్రమాదాలు జరిగే ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. – వాణి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, నల్లగొండ -
‘యాప్’తో సకాలంలో ఎరువులు
ఆర్థిక హక్కులపై అవగాహన ఉండాలినల్లగొండ : ఆర్థిక హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో శనివారం అన్ క్లెయిమ్డ్ ఖాతాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకుల్లోని పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, షేర్లపై వచ్చే డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్లపై సరైన సమాచారం లేక క్లెయిమ్ చేయకుండా మిగిలిపోతున్నాయన్నారు. కొందరు ఖాతాదారులు చిరునామా, ఫోన్ నంబర్ మార్పు, నామినేషన్ లేకపోవడం, కేవైసీ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో తమ సొంత డబ్బును పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఖాతాదారులు తన బ్యాంకు ఖాతా వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మీ డబ్బు మీరు సొంతం చేసుకోవాలని, దీనిపై బ్యాంక్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒక ఖాతాదారునికి సంబంధించి రూ.18 లక్షలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన ప్రకాశం బజార్లోని ఎస్బీఐ మేనేజర్ మైత్రిని అభినందించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఆర్బీఐ జీఎం ఎంజీ.సుప్రభాత్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్రెడ్డి, హౌసింగ్ ిపీడీ రాజ్కుమార్, ఎస్బీఐ ఆర్ఎం శివకృష్ణ, టిజిబి ఆర్ఎం విజయ్కుమార్, నాబార్డు పీఎం వినయ్, ఎల్డీఎం శ్రామిక్ పాల్గొన్నారు. నల్లగొండ టౌన్ : రైతులకు సకాలంలో అవసరమైన యూరియా, ఎరువులను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఫర్టిలైజర్స్ యూరియా ఆన్లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం నల్లగొండలోని మన గ్రోమోర్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో ఫర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకుని, నేరుగా సమీప డీలర్ వద్ద పొందవచ్చన్నారు. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలు, దళారుల బెడద తగ్గుతుందని చెప్పారు. ఈ యాప్ వినియోగంపై అధికారులు, డీలర్లు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్, మార్కెట్ చైర్మన్ జూకూరు రమేష్, ఏఓ శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు రాంరెడ్డి, మధుసూదన్రెడ్డి, డీలర్లు నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జాగ్రత్తలు పాటిద్దాం..
13.6 28.5 14.0 29.0 13.0 29.5 13.2 29.0 13.4 29.5 14.0 28.5 13.6 29.0 చలిలో బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా రోగులు శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ● చలికి చర్మం పొడిబారి చర్మ వ్యాధులు వస్తాయి. ● ఉదయం, రాత్రి వేళల్లో చర్మం పొడిబారకుండా కోల్డ్ క్రీములు లేదా కొబ్బరి నూనె రాయాలి. ● ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలి. ● ఉదయం పూట పది నిమిషాలైనా ఎండలో ఉండాలి. ● ఉదయం 7 గంటల తర్వాతే వ్యాయామం చేయాలి. ● చలికి మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించి బయటకు రావాలి. – డాక్టర్ వూర రామ్మూర్తి, జనరల్ ఫిజీషియన్ , సూర్యాపేట నల్లగొండ జిల్లాలో వారం రోజుల ఉష్ణోగ్రతలు కనిష్టం గరిష్టం -
లెక్క చెప్పాలి!
పంచాయతీ పోటీదారులు ఎన్నికల ఖర్చు సమర్పించాలి ఫ 45 రోజుల్లోగా ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఫ ఈ సారి ‘టీఈ–పోల్’ పోర్టల్లో లెక్కలు అప్లోడ్ చేయనున్న అధికారులు ఫ పారదర్శకంగా ఉండేలానూతన విధానం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. అదే వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థి అయితే రూ.30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2,50,000 వరకు.. వార్డు అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదిలా ఉంటే జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడత జనవరి 27న, మూడో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాలి. నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల లెక్కలను అధికారులకు సమర్పించాల్సి ఉంది. 45 రోజుల్లోగా ఎంపీడీఓలకు లెక్కలు సమర్పించి రశీదు తీసుకోవాలి. ఈ సారి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. గడువులోపు సమర్పించకపోతే వేటే.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలను అప్పచెప్పకుంటే వారిపై అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు.. వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీఓలకు అప్పగించి రశీదు తీసుకోవాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మరో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన అభ్యర్థులు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. 666 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 666 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అదే విధంగా 6,120 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మూడు పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు ఆగాయి. గెలిచిన వారితోపాటు.. ఓడిన వారు కూడా లెక్కలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సర్పంచ్లు తమ బాధ్యతలను గుర్తెరిగి ఆ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలల కోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొదట వారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్లు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. -
22న మాక్ డ్రిల్ నిర్వహించాలి
నల్లగొండ: విపత్తుల నిర్వహణకు ఈ నెల 22న మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం.. ఇక్కడ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి కీలకమని, అందుకు అవసరమైన అన్ని సాధనాలు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాల రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవల టోల్ ఫ్రీ నంబర్ల సమాచారం ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ . శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఫైర్ అధికారి సందీప్కుమార్ పాల్గొన్నారు. పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లపై విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత, నిర్ధారణ, బ్యాంకు ఖాతాల ధ్రువీకరణ వంటి అన్ని దశలను సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాల అనుసంధానంలో లోపాలు, ఆధార్ సీడింగ్ సమస్యల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా లీడ్ బ్యాంక్ అధికారులు చూడాలన్నారు. 100 శాతం దరఖాస్తులు పూర్తిచేసిన తిరుమలగిరి సాగర్ ఎంఈవోను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
త్వరలో సహకార ఎన్నికలు
డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుత పాలవర్గాల గడువును ఈసారి గడువును పొడగించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్ ఇన్చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు వీరి ఆధ్వర్యంలో డీసీసీబీ, సహకార సంఘాలు పని చేస్తాయి. గతేడాది కాంగ్రెస్ చేతికి వచ్చిన డీసీసీబీ జిల్లాలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్ఎస్ పాలనలో డీసీసీబీ చైర్మన్గా గొంగిడి మహేందర్రెడ్డి వ్యవహరించారు. అయితే ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీసీసీబీలోని కొందరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్కు చెందిన డైరెక్టర్లు కూడా మద్దతు పలికారు. 20 మంది డైరెక్టర్ల సహకారంతో కుంభం శ్రీనివాస్రెడ్డి డీసీసీబీ చైర్మన్గా గతేడాది జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాదిన్నర పాటు చైర్మన్గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి ఆగస్టు 14వ తేదీన గడువు పొడిగించింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో మన డీసీసీబీ నల్లగొండ డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్తో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అధునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీలోనూ ముందంజలో ఉంది.ఫ సొసైటీలకు పర్సన్ ఇన్చార్జీలుగా సంఘం సీఈఓలు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠికి నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు జిల్లాల వారీగా పీఏసీఎస్లు ఇలా.. సూర్యాపేట 47 నల్లగొండ 42యాదాద్రి 21 మొత్తం 110 -
జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్ఎల్బీసీలో గల టీజీఎంఆర్ బాలుర పాఠశాలలో శుక్రవారం క్రీడా పోటీలను టీజీఎంఆర్ అసిస్టెంట్ సెక్రటరీ ఎంఏ.ఖమ్యూం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడా పోటీలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. క్రీడా పోటీలు విద్యార్థుల భవిష్యత్కు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఏసీ సురేష్, విజిలెన్స్ అధికారులు ప్రభు, అబ్దుల్ హమీద్, ఏఏ.ఖాన్, హాశం, వేణుగోపాల్, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, మునీర్, వెంకట్రెడ్డి, ఫారూక్ పాల్గొన్నారు. రేషన్ డీలర్లు ఇ–కేవైసీ పూర్తి చేయాలి నల్లగొండ : రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇ–కేవైసీని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహసీల్దార్లను శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ 74.10 శాతం పూర్తయిందని మిగిలిన ఇ–కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ఇ–కేవైసీ పూర్తికి అధికారులు క్షేత్రస్థాయిలో రేషన్షాపులకు వెళ్లి డీలర్లకు తగిన సూచనలు చేసేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సమావేశాలను విజయవంతం చేయాలినల్లగొండ టూటౌన్ : జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి కోరారు. శుక్రవారం నల్లగొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశాల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశాలకు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎడ్ల సైదులు, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, సైదులు, కొమర్రాజు సైదులు, మిట్టపల్లి మురళయ్య, మధుసూదన్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యామూర్తి బదిలీ చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహన్ సికింద్రాబాద్ జ్యూడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆయన పదోన్నతిపై హుజూర్నగర్ కోర్టు నుంచి సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా అకాడమీకి వెళ్లారు. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించనున్నారు. వైభవంగా గోదాదేవికి పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఆగమ శాస్త్రానుసారంగా పూజలు నిర్వహించారు. గోదాదేవికి ఇష్టమైన నాల్గొ పాశురాన్ని అర్చకులు, పారాయణికులు పఠించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కట్టెపొంగళిని అమ్మవారికి ఆరగింపుగా సమర్పించారు. మహిళలు మంగళహారతులతో నీరాజనం పట్టారు. -
ఉద్రిక్తత నడుమ ఉపసర్పంచ్ ఎన్నిక
కట్టంగూర్ : కట్టంగూర్ ఉపసర్పంచ్ ఎన్నిక శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది. కట్టంగూర్లో 14 వార్డులు ఉండగా.. ఈ నెల 11న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి తరఫున బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో ఏడుగురు వార్డు సభ్యులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ముక్కాముల శ్యామలాశేఖర్ సర్పంచ్గా గెలుపొందారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉన్నా.. ఉపసర్పంచ్ పదవికి పోటీ నెలకొనటంతో వాయిదా పడింది. 12వ తేదీన ఉపసర్పంచ్ ఎన్నికకు సమావేశం ఏర్పాటు చేసినా సభ్యులు హాజరు కాకపోవడంతో ఈనెల 19కి వాయిదా పడింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశానికి సర్పంచ్తో పాటు 14 మంది వార్డు సభ్యులు సకాలంలో హాజరయ్యారు. అధికారులు ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు వార్డు సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వార్డు సభ్యులకు అడ్డుగా వచ్చిన పోలీసులను, అధికారులను తోసివేసినట్లు తెలిసింది. అయితే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఉపసర్పంచ్ అభ్యర్థిగా 8వ వార్డుకు చెందిన గుండు రాంబాబుకు చేతులెత్తి మద్దతు తెలిపారు. రాంబాబుతో కలిపి 8 మంది కావటంతో ఎన్నికల అధికారి అంబటి అంజయ్య ఉపసర్పంచ్గా గుండు రాంబాబు ఎన్నికై నట్లు ప్రకటించారు. ఎన్నిక సమయంలో జరిగిన తోపులాటలో 4వ వార్డు సభ్యురాలు ఏకుల సుజాత, 5వ వార్డు సభ్యురాలు శ్రీరామ సంధ్యకు స్వల్పగాయాలయ్యాయి. ఏకుల సుజాతను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్రావు, శాలిగౌరారం రూరల్ సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ మునుగోటి రవీందర్ ఉన్నారు. -
బీజేపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
బీజేపీ కార్యాలయం ముట్టడికి ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు నల్లగొండ టూటౌన్ : నేషనల్ హెరాల్డ్ విషయంలో అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని నిరసిస్తూ గురువారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్ నేత ముట్టడిస్తామని ప్రటించిన నేపథ్యంలో తమ కార్యాలయంపై దాడికి వస్తే ఎదురుదాడి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా వెళ్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది కార్యకర్తలు కోడి గుడ్లతో అక్కడికి రావడంతో ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యాలయం నుంచి బయటికి రాకుండా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకు ముందే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డిని ఆయన ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్ నేత, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ట్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ బోడ స్వామి, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మర్ల చంద్రారెడ్డి, కసిరెడ్డి నరేష్, ఐఎన్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరుమర్తి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్, ముంతాజ్అలీ, పారిజాత, సుజాత, మల్లేష్గౌడ్, ఆరిఫ్, రాజేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకుల చర్యలకు బీజేపీ శ్రేణులు కూడా కార్యాలయంలోనే ఉండి వ్యతిరేక నినాదాలు చేపట్టారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకే అక్రమ కేసులు : డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అరెస్టు అయి పోలీస్ స్టేషన్కు తరలించిన సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత మాట్లాడుతూ ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని మోదీ.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్న మోదీని ప్రశ్నిస్తున్న రాహుల్పై అక్రమ కేసులు పెట్టిస్తూ వేఽధిస్తున్నారని అన్నారు. ఫ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ఫ బీజేపీ శ్రేణులనూ బయటకు రాకుండా కట్టడి ఫ అంతకుముందే ఇరు పార్టీల అధ్యక్షుల అరెస్టు -
ధ్యానంతో మానసిక ప్రశాంతత
నల్లగొండ టూటౌన్ : రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా కన్హా హార్ట్ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యత వస్తుందని, నిత్య సాధనతో ఉత్సాహంగా పని చేయవచ్చన్నారు. ధ్యాన దినోత్సవం ప్రధాన లక్ష్యం శాంతి కరుణ, ఐక్యత అని పేర్కొన్నారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగారెడ్డి, వెంకటాచారి, నారాయణరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రేపు హాలియాకు కేటీఆర్ రాకహాలియా : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 20న (శనివారం) హాలియా పట్టణానికి రానున్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరగనున్న ఈ అభినందన సత్కార కార్యక్రమానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు హాజరుకానున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. యువజన సంఘాల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి : 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రీడా సామగ్రి పంపిణీకి యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి గంట రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెహ్రూ యువ కేంద్రంలో అనుసంధానమైన యువజన సంఘాల వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు గత ఐదేళ్ల నుంచి సంఘాలు చేసిన కార్యక్రమాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాపీని జత పర్చాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 91338 96009, 90597 98602 నంబర్లను సంప్రదించాలని కోరారు. పోలీసులు తీరు దారుణంనల్లగొండ టూటౌన్ : జిల్లాలో పోలీసుల తీరు దారుణంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపైకి దాడికి వస్తుంటే తనను హౌస్ అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేయాలంటూ పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను వదిలేసి, బీజేపీ నాయకులను నిర్భందించడం విడ్డూరంగా ఉందని మడ్డిపడ్డారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి కనగల్: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని డీఈఓ బి.భిక్షపతి ఆదేశించారు. గురువారం కనగల్ మండలం జి.యడవల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి బోధన అభ్యసన అమలు తీరును తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి , సీఆర్పీటీ సంతోష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అవసరమున్న ప్రతిరైతుకూ యూరియా
తిప్పర్తి : అవసరమున్న ప్రతి రైతుకూ ఫర్టిలైజర్ యూరియా అవైలబుల్ యాప్ ద్వారా సులువుగా అందనుందని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. గురువారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. యూరియా కొరతను నివారించడానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు పట్టదారు పాసుపుస్తకాలు ఉంటే సాగుచేసిన పంటలకు ఎంత యూరియా అవసరమో అంత అందిస్తామన్నారు. వరి పంటకు ఎకరానికి రెండు బస్తాలు, మొక్కజొన్నకు ఐదు బస్తాలు, పత్తి ఎకరానికి రెండు బస్తాల చొప్పున సరఫరా చేస్తామన్నారు. ఈ యాప్లో వివరాలను నమోదు చేసిన వెంటనే సంబంధిత దుకాణాలకు వెళ్లి యూరియా తీసుకోవచ్చన్నారు. కొత్త యాప్ వల్ల యూరియాను అధిక ధరలకు అమ్మడం.. బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశం లేదన్నారు. కార్యక్రమంలో ఏఓ సన్నిరాజు, ఏఈఓలు సంతోషి, రజిత, ఫర్టిలైజర్ డీలర్లు యాదగిరిరెడ్డి, శంకర్రెడ్డి, రవి, బస్వ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ -
306 స్థానాల్లో బీసీలే..
పంచాయతీ పోరులో 165 జనరల్ స్థానాల్లో విజయం మండలాల వారీగా బీసీలకు లభించిన స్థానాలు మండలం జీపీలు జనరల్ జనరల్లో బీసీ బీసీ రిజర్వు నల్లగొండ 31 16 10 07 తిప్పర్తి 26 13 07 07 కనగల్ 31 16 10 08 దేవరకొండ 41 13 05 02 చందంపేట 30 10 04 01 కొండమల్లేపల్లి 27 07 03 02 డిండి 39 14 03 02 నేరడుగొమ్ము 21 04 02 00 చింతపల్లి 36 14 04 07 పీఏపల్లి 25 09 04 03 గుడిపల్లి 12 06 01 01 మిర్యాలగూడ 46 19 03 04 మాడ్గులపల్లి 28 14 07 07 త్రిపురారం 32 15 09 03 దామరచర్ల 35 16 04 00 అడవిదేవులపల్లి 13 05 02 00 వేములపల్లి 12 06 03 03 అనుముల 23 12 00 05 నిడమనూరు 29 15 10 07 తిరుమలగిరిసాగర్ 35 11 03 01 పెద్దవూర 28 12 04 03 గుర్రంపోడు 38 18 10 10 నకిరేకల్ 17 10 09 03 చిట్యాల 18 09 03 06 కేతేపల్లి 16 08 02 04 కట్టంగూర్ 22 06 03 03 నార్కట్పల్లి 29 15 08 08 శాలిగౌరారం 24 12 07 06 చండూరు 19 10 07 05 మర్రిగూడ 18 09 06 04 మునుగోడు 28 15 02 08 నాంపల్లి 32 14 06 09 గట్టుప్పల్ 07 04 04 02 మొత్తం 866 377 165 141 ఫ రిజర్వేషన్లో 141 స్థానాల్లో సర్పంచ్లు వారే.. ఫ 866 పంచాయతీల్లో 35.33 శాతం బీసీలే గెలుపు ఫ రిజర్వుడ్ కంటే జనరల్ కేటగిరీలోనే అత్యధికం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలు 35.33 శాతం విజయం సాధించారు. బీసీ రిజర్వేషన్లలో కంటే జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధికంగా గెలుపొందారు. ఇటు జనరల్ స్థానాలు, అటు బీసీ రిజర్వు స్థానాలు రెండింటిలో కలిపి జిల్లాలో మొత్తం 35.33 శాతం బీసీ సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. 306 స్థానాల్లో బీసీ ప్రజాప్రతినిధులే.. జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేస్తామని ప్రకటించినప్పటికి అది అమలుకు నోచుకోలేదు. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో జనరల్తో పాటు ఆయా కేటగిరీల వారీగా పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో వచ్చిన రిజర్వేషన్ను కచ్చితంగా మార్పు చేయాలని ఎన్నికల సంఘం నిబంధన ఉండడంతో రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేశారు. దీంతో 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన బీసీ రిజర్వేషన్ స్థానాల కంటే ఈసారి బీసీలకు తగ్గిపోయాయి. బీసీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో జనరల్కు, వివిధ కేటగిరీల వారికి మారిపోయాయి. మొత్తం 869 పంచాయతీల్లో 377 స్థానాలు జనరల్ కేటగిరీకే మారాయి. ఇందులో జనరల్, బీసీ రిజర్వేషన్లలో 306 స్థానాల్లో (35.33 శాతం) బీసీలు విజయం సాధించినట్లయింది. జనరల్లో 43.76 శాతం బీసీలే.. జిల్లాలో జనరల్ స్థానాలు 377 ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. ఈ జనరల్ స్థానాల్లో బీసీలు 165 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో జనరల్ స్థానాల్లో వారు సాధించిన స్థానాలను బట్టి 43.76 శాతం గెలుచుకున్నారు. బీసీ రిజర్వేషన్లలో 16.28 శాతం గెలుపు.. బీసీలకు రిజర్వు అయిన స్థానాల్లో బీసీలు 141 స్థానాల్లో విజయం సాధించారు. దాంతో 16.28 శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ స్థానాలు దక్కాయి. ఇటు జనరల్, అటు బీసీ రిజర్వేషన్లలోనూ మొత్తం 306 మంది బీసీ సర్పంచ్లు విజయం సాధించడంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కినట్లయింది. -
న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండలం శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన తాను ఆర్ఓ, పీఓల తప్పిదం వల్లే ఓటమి పాలయ్యాయని ఆరోపిస్తూ రమావత్ సునిత గురువారం నల్లగొండలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మొత్తం వార్డుల ఓట్లు 990 పోలవ్వగా సర్పంచ్ ఓట్లు 992 ఓట్లు పోలయ్యాయని, అలాగే ఆర్ఓ, పీఓ అవతలి అభ్యర్థికి సానుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ఫాం–27పై సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. రిజెక్టెడ్, పోలైన ఓట్ల సీరియల్ నంబర్లతోపాటు ఫాం–26, 27, 28లను పరిశీలించి తగిన న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు గోరి కడతాం
సాక్షి, యాదాద్రి : రానున్న జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గోరి కడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు గురువారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. కేసీఆర్ అనుమతితో జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ సేకరణ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిహిస్తామన్నారు. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో భువనగిరి జిల్లాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 30 మంది సర్పంచ్లను అక్రమంగా ఓడించారని, కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతామన్నారు. సీఐలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్ఐలు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలేదని పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాల కుట్రలు పన్నినా క్యాడర్ వెన్ను చూపకుండా విజయం సాధించిందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, క్యామా మల్లేష్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, దూదిమెట్ల బాల్రాజ్యాదవ్, కొలుపుల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి పాల్గొన్నారు. ఫ వచ్చే నెల నుంచి సంస్థాగత ప్రక్రియ ప్రారంభం ఫ భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగరాలి ఫ నూతన సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనాలి
పెద్దవూర : తాలు, తరుగు లేకుండా 17శాతం తేమతో నాణ్యతాప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పెద్దవూర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పారబట్టాలని, ప్రస్తుతం మంచు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం మీద పట్టాలు కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. అధికారులు తేమ శాతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ల వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 107 లారీల ధాన్యం కొనుగోలు చేయగా అందులో 23,400 క్వింటాళ్ల సన్నధాన్యం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, ఉంపీడీఓ ఉషాదేవి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నిబంధనలు అతిక్రమించొద్దు
చందంపేట : ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని డీఐజీ చౌహాన్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక గ్రామమైన చందంపేట మండలం కోరుట్లలో పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. వారి వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ బీసన్న, ఎస్ఐ లోకేష్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనకొండమల్లేపల్లి : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొండమల్లేపల్లి మండలం కేశ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జోగ్యతండా వద్ద, కొండమల్లేపల్లిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ స్వర్ణలత పంచాయతీ కార్యదర్శి దాకునాయక్, వెంకటయ్య ఉన్నారు. ప్రశాంతంగా పోలింగ్దేవరకొండ : మూడో విడత పంచాయతీ పోలింగ్ దేవరకొండ డివిజన్లో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. దేవరకొండ మండలం తాటికోల్లో మూడో విడత పంచాయతీ పోలింగ్ సరళిని బుధవా రం పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఉన్నారు. నేడు నిరసన ర్యాలీనల్లగొండ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం ఈడీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిచనున్నట్టు డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నిరసన ర్యాలీ చేపడతామని పేర్కొన్నారు. -
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అయ్యింది. మొదటి, రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ స్థానాలు అధికంగా గెలుచుకోగా.. మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ మంది విజయం సాధించారు. 42 పంచాయతీలు ఏకగ్రీవం మూడో విడత నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 9 మండలాల పరిధిలో 269 గ్రామాల్లో సర్పంచ్లకు 2,206 వార్డు సభ్యులకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వాటితో 596 వార్డులలో కూడా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 40 మంది సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్నికయ్యారు 227 పంచాయతీల్లో ఎన్నికలు మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా కొనసాగింది. మొత్తం 227 సర్పంచ్ స్థానాలకు, 1603 వార్డులకు ఎన్నికలు జరగ్గా 186 మంది కాంగ్రెస్ మద్దతుదారులు (40 మంది ఏకగ్రీవం కలుపుకొని) సర్పంచ్లుగా విజయం సాధించగా 56 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు (ఇద్దరు ఏకగ్రీవం) విజయం సాధించారు. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, బీజేపీ, సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్రులు 25 మంది విజయం సాధించారు. చందంపేట మండలంలోని పోలేపల్లిలో రీకౌంటింగ్ నిర్వహించి సర్పంచి అభ్యర్థుఽలను ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్ఎస్కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి. 1,779 పంచాయతీల్లో ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,779 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 1,781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు. వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1,779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 1,136 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం. నల్లగొండలోనే కాంగ్రెస్కు అత్యఽధిక సర్పంచ్ స్థానాలు నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో కాంగ్రెస్ మద్దతుదారులకు 68.23 శాతం స్థానాలు లభించాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 23.24 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులకు 64.60 శాతం, బీఆర్స్ మద్దతుదారులకు 25.51 శాతం దక్కాయి. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులకు 53.75 శాతం, బీఆర్ఎస్ మద్దతుదారులకు 34.97 శాతం సర్పంచి స్థానాలు లభించాయి. -
గ్రామ పాలనకో పాఠం
గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మొదట్లో నాకు అవగాహన లేదు. సర్పంచ్లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులపై మా క్లాస్ సాంఘిక శాస్త్రంలో ఉన్న పాఠంలో వివరించారు. తద్వారా సర్పంచ్ల బాధ్యతల గురించి తెలిసింది. – కొర్ర కిరణ్, ఆరో తరగతి విద్యార్థి పెద్దవూర : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను నిజం చేస్తోంది మన గ్రామ పాలన వ్యవస్థ. దీంతో గ్రామ పాలన పారదర్శంగా సాగించాలనే ఉద్దేశంతో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నినకల సందడి నెలకొంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అందరూ పల్లెపాలనపై చర్చించుకుంటున్నారు. గ్రామ పాలనపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో శ్రీగ్రామ పంచాయతీలుశ్రీ శీర్షికతో ఓ పాఠం చేర్చారు. సర్పంచ్లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రజల కర్తవ్యం, ప్రజాస్వామ్యం తదితర విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేలా ఈ పాఠ్యాంశాన్ని పొందుపరిచారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ముగిసిన సందర్భంగా ఆరో తరగతిలోని ఈ పాఠం ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరుల బాధ్యతలను విద్యార్థులకు వివరించేలా.. గ్రామసభ, సమావేశాలు, సమస్యల పరిష్కారం, పౌరుల బాధ్యతలు తదితరాలపై విద్యార్థులకు వివరించేలా ఈ పాఠ్యాంశంలో పొందుపరిచారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం, వ్యయం, పన్నుల రకాలు, సర్పంచ్ కృషిచేస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు అన్న సూచనలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలనపై విద్యార్థులు అవగాహన పెంచుకుని తల్లిదుండ్రులకు కూడా వివరిస్తే పల్లెల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడంతోపాటు పారదర్శకమైన పాలనను అందించవచ్చని ఈ పాఠ్యాంశం ఉద్దేశం. పంచాయతీ నూతన పాలకవర్గాలు కూడా ఈ పాఠంలో అంశాలను తెల్చుకుంటే తమ ఐదేళ్ల పాలన కాలంలో పల్లెలకు ఏమేమి చేయాలో అర్థమవుతుంది. ఫ ‘గ్రామ పంచాయతీలు’ పేరుతో పాఠ్యాంశం ఫ ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపర్చిన ప్రభుత్వం ఫ పాలకవర్గం విధులపై అవగాహన కల్పించేలా కూర్పు -
పల్లె సారథులు వచ్చేస్తున్నారు
22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారంనల్లగొండ: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారానికి నిర్ణయించింది. ప్రభుత్వం మొదట ఈ నెల 20న సర్పంచ్ల ప్రమాణ స్వీకార సమయం ఖరారు చేసింది. ఆ రోజు మంచిగా లేకపోవడం, శనివారం కావడంతో 22వ తేదీకి వాయిదా వేసింది. బాధ్యతలు చేపట్టనున్న కొత్త పాలకవర్గాలు గ్రామ పంచాయతీల్లో ఇరవై రెండున్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 ఫిబ్రవరి 2న గత పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కారణంగా అది జరగలేదు. దీంతో సంవత్సరం పదిన్నర నెలలుగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఈ నెల 22వ తేదీన గ్రామ పంచాయతీలో కొత్త పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. జిల్లాలో గతంలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా 25 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. మొత్తం 869 పంచాయతీలకు గాను ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా కోర్టు కేసు కారణంగా మాడ్గులపల్లి మండలం ఇందుగుల పంచాయతీలో ఎన్నికలు ఆగిపోయాయి. అదే మండలం అబంగాపురం గ్రామంలో ఎస్టీ రిజర్వు కావడం అక్కడ ఒక్కరు కూడా ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో నామినేషన్లు రాలేదు. దాంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది. అనుముల మండలం పేరూర్లో ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో అక్కడా ఆ ఓటర్లు లేరు. దానికి తోడు 4 వార్డులు ఎస్టీ రిజర్వు కావడంతో గ్రామస్తులే ఎన్నిక బహిష్కరించారు. దీంతో జిల్లాలో ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోవడంతో 866 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఆయా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న కార్యవర్గాలు ఈ నెల 22న కొలువుదీరనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్పంచ్లు బాధ్యతలు చేపట్టడడంతో పంచాయతీ కార్యదర్శులకు భారం తగ్గనుంది. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. ఫ ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం ఫ కొలువుదీరనున్న 866 మంది సర్పంచ్లు ఫ మూడు గ్రామాల్లో నిలిచిన ఎన్నికలు -
సంగ్రామం సమాప్తం
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.72 శాతం పోలింగ్ మూడో విడతలో మండలాల వారీగా పోలింగ్ వివరాలు... మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం చందంపేట 24,158 21,286 88.11 చింతపల్లి 42,651 38,384 90.00 దేవరకొండ 32,968 29,166 88.47 డిండి 12,271 11,034 89.92 గుండ్లపల్లి 39,391 34,241 86.93 గుర్రంపోడు 36,325 33,067 91.03 కొండమల్లేపల్లి 25,775 21,939 85.12 నేరడుగొమ్ము 18,894 17,286 91.49 పీఏపల్లి 24,702 21,732 87.98 మొత్తం 2,57,135 2,28,135 88.72సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ జోరు కొనసాగింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. మొదటి విడతలో 90.53 శాతం నమోదు కాగా.. రెండు, మూడో విడతలో స్వల్పంగా తగ్గింది. రెండో విడతలో 88.74 శాతం, మూడో విడతలో 88.72 శాతం పోలింగ్ నమోదైంది. కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీ, డీఐజీ చౌహాన్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. మొదటి రెండు గంటల్లోనే.. మూడో విడత ఎన్నికలు బుధవారం దేవరకొండ డివిజన్లోని 9 మండలాల పరిధిలో జరిగాయి. మొత్తం ఓటర్లు 2,57,135 మంది ఉన్నారు. ఇందులో మొదటి రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్ నమోదైంది. 74,732 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య 1,48,863కి చేరింది. పోలింగ్ 57.89 శాతానికి పెరిగింది. ఆ తరువాత నుంచి ఒంటి గంట వరకు 2,25,215 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ 87.59 శాతానికి చేరింది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం ఓటర్లు 2,28,135 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,14,310 మంది, మహిళలు 1,13,816 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తంగా 88.72 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నేరడుగొమ్ములో.. మూడో విడత అత్యధికంగా నేరడుగొమ్ములో 91.49 శాతం పోలింగ్ నమోదు కాగా.. తక్కువగా కొండమల్లేపల్లిలో 85.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో మహిళల కంటే పురుషులే అత్యధికంగా ఓటు వేశారు. దేవరకొండ డివిజన్లో మొత్తం ఓట్లు 2,57,135 మంది ఓటర్లుండగా.. పురుషులే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఊపిరిపీల్చుకున్న అధికారులు పంచాయతీ ఎన్నికల మూడో విడత ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 11న చండూరు, నల్లగొండ డివిజన్ పరిధిలోని 14 మండలాల్లో పోలింగ్ పూర్తయింది. రెండో విడత మిర్యాలగూడ డివిజన్కు ఈ నెల 14న ఎన్నికలు ముగిశాయి. రెండు విడత ఎన్నికల్లోను చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మూడో విడత ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ పకడ్బందీగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా అధికారులను కూడా ఎన్నికల తీరును పరిశీలించేందుకు కేటాయించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ రెండు రోజుల నుంచి దేవరకొండ డివిజన్లోనే మకాం వేసి భద్రతను పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మితో పాటు డీఐజీ చౌహన్ కూడా పోలింగ్ తీరు, భద్రతను పర్యవేక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను నియమించారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
దేవరకొండ : మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం చూపకూడదని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి మండలానికి 200 మందికిపైగా డివిజన్లోని 9 మండలాల్లో మొత్తం 2వేల మంది పోలీసులకు విధులు కేటాయించామన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
ధాన్యం లారీలతో రైతుల ఆందోళన
రామన్నపేట: ధాన్యం కొనుగోలు చేసి 11 రోజులు గడుస్తున్నా.. మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతో ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు మంగళవారం రామన్నపేటలోని సుభాష్ సెంటర్లో ధాన్యం లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 1600బస్తాల ధాన్యాన్ని ఈ నెల 10న పీఏసీఎస్ వారు తూకం వేసి లారీల్లో లోడ్ చేసి ఇంద్రపాలనగరం శివారులోని రైస్ మిల్లుకు పంపారని, అయినా రెండురోజుల వరకు ధాన్యం దిగుమతి చేసుకోలేదన్నారు. క్వింటాకు 15 కిలోలు తగ్గించి దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెప్పడంతో పీఏసీఎస్ అధికారులను ఆశ్రయించగా మరోమిల్లుకు లారీలను పంపించారని పేర్కొన్నారు. అక్కడా దిగుమతి చేసుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్ఐ నాగరాజు అధికారులతో మాట్లాడి ధాన్యం వెంటనే దిగుమతి అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. దీంతో లారీలను ఆయా మిల్లుల వద్దకు పంపించారు. -
రెండు నెలల్లో ముగ్గురు సస్పెన్షన్
చిట్యాల : మండలంలో ఈ మూడు నెలల కాలంలోనే చిట్యాల తహసీల్దార్, ఎంపీడీఓ, ఓ పాఠశాలకు చెందిన హెచ్ఎం ఇలా వరుసగా ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు వరుసగా సస్పెండ్ అవుతుండడంతో పాలనా వ్యవస్థ గాడితప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖల జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్లు ఇలా.. ● చిట్యాల పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన మాధవి ఈ ఏడాది సెప్టెంబర్ 2న సస్పెండ్ అయ్యారు. పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు విచారణకు వచ్చిన అధికారులతో వాగ్యాదం, ఘర్షణకు దిగడంతో ఆమెను డీఈఓ సస్పెండ్ చేశారు. ● చిట్యాల తహసీల్దార్ కృష్ణనాయక్ ఈ ఏడాది అక్టోబర్ 9న తన కార్యాలయంలో రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. ● మండలంలోని చిన్నకాపర్తిలో ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం బ్యాలెట్ పేపర్లు మురికి కాల్వలో లభ్యమయ్యాయి. ఈ ఘటనకు చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మిని బాధ్యురాలుగా చేస్తూ ఆమెను ఈనెల 13న కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండైనవారి స్థానంలో నేటికీ ఇతరులను నియమించకపోవడంతో ఇన్చార్జ్ పాలన కొనసాగుతోంది. విచారణలతోనే సరి.. మండలంలో అధికారుల సస్పెన్షన్లు ఇలా ఉంటే మరోవైపు పలు సమస్యలు, అక్రమాలకు మండల స్థాయి అధికారులపై ప్రజలు ఫిర్యాదులు చేస్తే డివిజన్ స్థాయి అధికారులు విచారణలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● అక్టోబర్ 5న రసాయన పరిశ్రమలు వదిలిన వ్యవర్థాలతో పిట్టంపల్లిలో అరవై గొర్రెలు, మేకలు మృతిచెందాయి. ప్రజల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఆర్డీఓ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● వట్టిమర్తి పరిధిలోని ఓ ఆగ్రో కెమికల్స్ పరిశ్రమలో నింబధనలకు విరుద్ధంగా రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు అక్టోబర్ 30న ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినా చర్యల్లేవు. ● చిట్యాల, పెద్దకాపర్తి, వెలిమినేడు, పిట్టంపల్లి, వెంబావి గ్రామాల పరిధిలో అక్రమంగా మైనింగ్, సుంకెనపల్లి, పెద్దకాపర్తి, శివనేనిగూడెంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. ● మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమ డిప్యుటేషన్పై పలువురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నా..అవసరం లేకున్నా విద్యా వలంటీర్లను నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి సస్పెండైన వారిస్థానంలో వెంటనే కొత్తవారిని నియమించడంతోపాటు అన్ని శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి తమకు మెరుగైన సేవలు అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.చిట్యాలలో తహసీల్దార్, ఎంపీడీఓ, హెచ్ఎంపై వేటు ఫ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఫ వరుస ఘటనలు జరుగుతున్నా ఆయా శాఖలపై పర్యవేక్షణ కరువు ఫ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు అధికారులను నియమించాలి చిట్యాల తహసీల్దార్, ఎంపీడీఓ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. వీరి బాధ్యతలను కిందిస్థాయి అధికారులు నిర్వహిస్తున్నారు. సస్పెండైన వారి స్థానాల్లో వెంటనే కొత్తవారిని నియమించాలి. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – చికిలంమెట్ల అశోక్, చిట్యాల -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టిసారించాలి
దేవరకొండ : మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించాలని జోన్–6 డీఐజీ ఎల్ఎస్.చౌహాన్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లిలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై పోలీస్ సిబ్బందితో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర గస్తీ, పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉండే అధికారులు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ -
కాంగ్రెస్ ధర్నాను జయప్రదం చేయాలి
నల్లగొండ : జాతీయ ఉపాధిహామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో మహాత్మాగాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న బుధవారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిచనున్నామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ గాంధీజీ చిత్రపటాలతో నిరసన వ్యక్తం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ‘రీజినల్’ పనులకు అనుమతులివ్వాలిసాక్షి, యాదాద్రి : హైదరాబాద్ చుట్టూ ప్రణాళికాపరమైన పట్టణాభివృద్ధికి ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్థాయి కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, మెట్రో ఫేజ్–2, వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించాలని కోరినట్లు చెప్పారు. వీటన్నింటికి అనుమతులు లభిస్తే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందని వివరిచినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలి మఠంపల్లి: దేవాలయాల్లో భక్తులకు సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఎస్ శర్మ, దేవాదాయ శాఖ వెల్ఫేర్బోర్డు మెంబర్ సీహెచ్ శ్రవణ్కుమారాచార్యులు కోరారు. మంగళవారం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయాల్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులకు మాత్రమే ట్రెజరీల ద్వారా వేతనాలు అందుతున్నాయని, ఇదే తరహాలో అందరికీ వచ్చేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 24న నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ సంఘం చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి జిల్లాలోని 6ఏ, 6బీ, 6సీ దేవాలయాల్లో పనిచేస్తున్న స్వీపరు నుంచి ప్రధాన అర్చకుల వరకు హాజరుకాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దామోదర్రావు, ఉపేందర్రెడ్డి, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, తూమాటి శ్రీనివాసాచార్యులు, చివలూరి పద్మనాభాచార్యులు, దుర్గాప్రసాద్, బదరీనారాయణాచార్యులు, ఆంజనేయాచార్యులు, రాజేష్, రమేష్, అంజి పాల్గొన్నారు. -
తుది విడత దేవరకొండ డివిజన్లోని 227 పంచాయతీల్లో పోలింగ్
ఎన్నికల నిర్వహణ సిబ్బంది స్టేజ్–1 ఆర్ఓలు 81స్టేజ్–1 ఏఆర్ఓలు 81 వ్యయ పరిశీలకులు 09 స్టేజ్–2 ఆర్ఓలు 300జోనల్ ఆఫీసర్లు 52రూట్ ఆఫీసర్లు 82పీఓలు 2,647ఓపీఓలు 2,959మైక్రో అబ్జర్వర్లు 89 దేవరకొండ : మూడో విడత పంచాయతీ పోరులో భాగంగా బుధవారం జిల్లాలోని దేవరకొండ డివిజన్లో పోలింగ్కు యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఈ మేరకు డివిజన్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 42 ఏకగ్రీవాలు మినహా 227 సర్పంచ్, 1,603 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు మొత్తం 1,827 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పది ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర ఎన్నికల సిబ్బందిని నియమించారు. నాలుగైదు పోలింగ్ కేంద్రాకు కలిపి ఒక జోనల్ ఆఫీసర్ చొప్పున 70 మందిని నియమించారు. 300 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉండనున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు పోలింగ్ కేంద్రానికి స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ వరకు అంతా వీరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుంచే.. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించనున్నారు. కాగా ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది మంగళవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు తరలివెళ్లారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పటిష్ట బందోబస్తు.. దేవరకొండ డివిజన్ పరిధిలో బుధవారం జరుగనున్న తుది విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డివిజన్లో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,78,940 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సజావుగా నిర్వహిం చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్ని పార్టీల శ్రేణులు, ప్రజలను పోలీస్ అధికారులు కోరుతున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాలు, ఓటర్ల వివరాలు ఇలా.. మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు పోలింగ్ ఓటర్లు జరిగేవి కేంద్రాలు దేవరకొండ 41 06 35 280 35,716 మల్లేపల్లి 27 07 20 169 29,599 డిండి 39 04 35 299 41,525 చందంపేట 30 09 21 155 30,679 నేరెడుగొమ్ము 21 02 19 118 21,661 చింతపల్లి 36 04 32 271 45,054 పీఏపల్లి 25 05 20 180 23,864 గుడిపల్లి 12 00 12 70 12,271 గుర్రంపోడు 38 05 33 285 38,571 మొత్తం 269 42 227 1,827 2,78,940 ఫ పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి, సిబ్బంది ఫ ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.78 లక్షల మంది ఓటర్లు -
‘కుష్టు’ బాధితులను గుర్తించేలా..
నల్లగొండ టౌన్: కుష్టు వ్యాధి (లెప్రసీ) లక్షణాలున్న వారిని ముందుగా గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 2017 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) సర్వేను ఏటా రెండుసార్లు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఎల్సీడీసీ సర్వే నిర్వహించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆశా వర్కర్ల ద్వారా సర్వే.. జిల్లాలో లెప్రసీ క్యాంపెయిన్ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఆశా వర్కర్లతో కలిసి 1,466 బృందాలను ఏర్పాటుచేసింది. ఒక్కో ఆశా వర్కర్ పట్టణంలో అయితే రోజుకు 50 నుంచి 60 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నుంచి 30 ఇళ్లను సర్వే చేయనున్నారు. కుటుంబంలోనే ప్రతి ఒక్కరి పూర్తి శరీరాన్ని పరిశీలించి తెల్ల, ఎర్ర మచ్చలు, స్పర్శ లేని మచ్చలు, నరాల బలహీనత ఉందా లేదా అనే దాన్ని పరిశీలిస్తారు. వారిలో లెప్రసీ లక్షణాలున్న వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాలకు పంపుతారు. అక్కడ వారికి బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపీ–ఎండీటీ) అందించనున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే జిల్లా కేంద్రంలోని లెప్రసీ సెంటర్కు పంపించి చికిత్స అందించనున్నారు. ఈ ఎల్సీడీసీ సర్వేపై ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్ ఆపీసర్లు, సూపర్వైజర్లు, ప్రోగ్రామ్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గతంలో జిల్లాలో లెప్రసీ కేసులు వందల సంఖ్యలో ఉండగా 2017 నుంచి చేపట్టిన ఎల్సీడీసీ సర్వే కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 113 లెప్రసీ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కుష్టు లక్షణాలు ఇవీ.. కుష్టు వ్యాధి (లెప్రసీ) అనేది మైక్రో బ్యాక్టిరియమ్ లెప్రో అనే బ్యాక్టిరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా నరాలు, చర్మం, ముక్కు ద్వారం, ఎగువ శ్వాస నాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమ రంగు (పాలిపోయిన) స్పర్శ లేని తిమ్మిరి మచ్చలుంటే కుష్టు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. శరీరంపై ఎక్కడైనా స్పర్శలేని తెల్లని, గోధుమ, ఎర్రటి మచ్చలున్న రోగులు ఎల్సీడీసీ సర్వేకు వచ్చే ఆశా వర్కర్లకు చూపించాలి. లెప్రసీ లక్షణాలుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రేపటి నుంచి ఎల్సీడీసీ సర్వే ఫ 1,466 బృందాల నియామకం ఫ లక్షణాలున్న వారికి చికిత్స అందించేలా కార్యాచరణ ఫ లెప్రసీ నిర్మూలనే లక్ష్యంగా ప్రోగ్రామ్ -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
దేవరకొండ, కొండమల్లేపల్లి : దేవరకొండ డివిజన్లో బుధవారం (నేడు) జరుగనున్న పంచాయతీ ఎన్నికలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలింగ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆమె దేవరకొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి సందర్శించారు. అంతకు ముందు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో 3వ విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొండమల్లేపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను ముందే చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఓటింగ్ కంపార్ట్మ్మెంట్ కిటికీలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 2.15గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎవరైనా అభ్యర్థి రీకౌంటింగ్ కోసం ఫిర్యాదు చేయదలిస్తే 15నిమిషాలలోపే రాత పూర్వకంగా ఆర్ఓకు దరఖాస్తు ఇవ్వాలన్నారు. జిల్లాలోని 80శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో వీడియోగ్రఫీ చేయిస్తున్నామని తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, కొండమల్లేపల్లి ప్రత్యేకాధికారి విజయేందర్రెడ్డి, డీపీఓ వెంకయ్య, ఆయా మండలాల తహసీల్దార్లు, సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సాగర్లో ఆక్టోపస్ మాక్డ్రిల్
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు పరిధిలో సామవారం ఆక్టోపస్ దళాలు మాక్డ్రిల్ నిర్వహించాయి. దేశంలోని పలు ప్రాంతాలకు ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేసేందుకు మాక్డ్రిల్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆక్టోపస్ దళాలు డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్లోని ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్హౌజ్ లోపలి భాగాలను పరిశీలిస్తూ మారఖ డ్రిల్ నిర్వహించారు. ఈ తరహా మాక్డిల్స్ ద్వారా భద్రతా సిబ్బందికి మరింత అవగాహన, పలుశాఖల మధ్య సమన్వయం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ మాక్డ్రిల్లో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ దళాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
104 సిబ్బంది వేతన వెతలు
వెంటనే వేతనాలు చెల్లించాలి వేతనాలు సక్రమంగా చెల్లించని కారణంగా అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోంది. తొమ్మిది నెలలుగా వేతనాలను ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని వెంటనే వేతనాలను చెల్లించాలి. – గజవెల్లి శివకిరణ్, డేటాఎంట్రీ ఆపరేటర్ నల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 సిబ్బందికి తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. అసలు వీరు ఏ శాఖ కింద పని చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ విభాగం నుంచి వేతనాలు ఇస్తారో కూడా స్పష్టత లేదు. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెల్లదీస్తున్నారు. ఇచ్చేదే తక్కువ వేతనాలు.. అవి కూడా నెలనెలా ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022 నుంచి ఇతర శాఖల్లో సర్దుబాటు జిల్లా వ్యాప్తంగా 2008 సంవత్సరం నుంచి 104 వాహనాల్లో 2022 సంవత్సరం వరకు 75 మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిని పనిచేశారు. వారిలో డేటాఎంట్రీ ఆపరేటర్లు 12 మంది, డ్రైవర్లు 14 మంది, ఫార్మసిస్టులు 22 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 21 మంది, సెక్యూరిటీ గార్డులు ఆరుగురు పనిచేశారు. వారంతా అప్పుడు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేశారు. పథకాన్ని నిలిపివేసిన తరువాత వారిని వివిధ మెడికల్ కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఆ సమయంలో నల్లగొండ మెడికల్ కళాశాలలో వివిధ రకాల పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ వారిని ఇక్కడ నియమించకుండా.. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట మెడికల్ కళాశాలలకు, మరికొందరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనరేట్ నుంచి వేతనాలు అందాయి. కానీ, ఏప్రిల్ నుంచి వారికి వేతనాలను చెల్లించడం లేదు. మెడికల్ కళాశాలల నుంచి వేతనాలు ఇస్తారా.. లేక వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ చెల్లిస్తుందా అనే విషయం స్పష్టం చేయడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా వేతనాలు రాక ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ తొమ్మిది నెలలుగా అందని వేతనాలు ఫ కుటుంబాలు గడవక ఇబ్బందులు -
మూడో విడత సిబ్బంది ర్యాండమైజేషన్
నల్లగొండ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా దేవరకొండ డివిజన్లోని మండలాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ను సోమవారం కలెక్టరేట్లో గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 17న దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లోని 2,206 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,647 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2959 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డీఈఓ భిక్షపతి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఈ– జిల్లా మేనేజర్ దుర్గారావు, ఎన్ఐసీ ప్రతినిధి ప్రేమ్ పాల్గొన్నారు. -
నార్కట్పల్లి డిపోను పరిశీలించిన ఎండీ
నార్కట్పల్లి : నార్కట్పల్లి ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో నార్కట్పల్లి డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే బస్సుల వివరాలను ఆర్టీసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ డిపో ఎప్పుడు ప్రారంభమైంది.. ఎన్ని బస్సులు ఉన్నాయి.. అనే పూర్తి వివరాలను నల్లగొండ ఆర్ఎం జాన్రెడ్డి ఆయనకు వివరించారు. అంతకు ముందు ఆయన డిపోలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం సుచరిత, ప్రభాకర్, కర్నాటి శ్రీనివాస్, చారి, బెల్లి సత్తి, సమత పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి గుర్రంపోడు : కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత అన్నారు. సోమవారం గుర్రంపోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.రాష్ట్రంలో రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, సర్పంచ్ అభ్యర్థి కుప్ప అమరేందర్గౌడ్, నాయకులు కుప్ప రాములు, చనమల్ల జగదీశ్వర్రెడ్డి, షేక్ సయ్యద్మియా, పగిళ్ల లాలయ్య, మండలి లింగయ్య, కుప్ప సురేందర్, మేడి వెంకన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నాటికల సంపుటి ఆవిష్కరణరామగిరి(నల్లగొండ) : నాటక రచయిత గజవెల్లి సత్యం రచించిన ‘ఓ మహిళా మేలుకో’ నాటికల సంపుటిని నల్లగొండ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఆలిండియా పెన్షనర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ డి.సుధాకర్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు జి.వెంకట్రెడ్డి, గాయం నారాయణరెడ్డి, ఎంవీ.గోనారెడ్డి, ఎం.పురుషోత్తమచార్యులు, తడకమళ్ల రాంచందర్రావు, జెల్లా శ్రీశైలం, మారోజు కేశవాచారి, టి.రమేష్, భిక్షం తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహాసభలను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : ఏపీలో విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 1, 2, 3, 4 తేదీల్లో జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సీఐటీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐటీయూ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, అద్దంకి నర్సింహ, గంజి నాగరాజు, సైదాచారి, లింగయ్య, నర్సింహ, శ్యాంసుందర్, పల్లె నగేష్, రాజేష్, యాదయ్య, అనురాధ, శ్రీవాణి, వెంకన్న, సోములు, శంకర్, లక్ష్మిపతి, ధనమ్మ, మల్లయ్య, లింగస్వామి, బుచ్చిరాములు, వెంకటేశం పాల్గొన్నారు. -
యాసంగి పంటకు మూసీనీటి విడుదల
కేతేపల్లి : యాసంగి సాగు కోసం మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. 645 అడుగుల(4.46టీఎంసీలు) గరిష్ఠ నీటిమట్టం గత మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 644.70 అడుగుల(4.38 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏటా యాసంగి పంటకు మూసీ ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 18న కాల్వలకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు విడతలుగా సాగు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడత 25 రోజుల పాటు నిరంతరాయంగా కాల్వలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీటిని రైతాంగం పొదుపుగా వాడుకుని చివరి ఆయకట్టుకు చేరే విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మూసీ ఏఈలు ఉదయ్, మమత, కీర్తి, ఉమామహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్పంచ్లకు హరీష్రావు సత్కారం
నాంపల్లి, మర్రిగూడ : నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉస సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ మంత్రి హరీష్రావు సోమవారం ఘనంగా సత్కరించారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి హరీష్రావ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ మాతృమూర్తి, సోదరుడి ప్రథమ వర్ధంతికి హజరయ్యారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, నోముల భగత్, నాయకులు పాల్వాయి స్రవంతి, నర్సింహారావు, సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఇట్టెం వెంకట్రెడ్డి, రోరె ప్రమీల, రాములు, చరణ్, కర్నె యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచ్లు రొక్కం భాస్కర్రెడ్డి, వెంకటేశ్, ఆంబోతు తులసీరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తుది విడత పోరుకు సన్నద్ధం
దేవరకొండ : దేవరకొండ డివిజన్లో జరుగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 17న పోలింగ్ జరుగనుండగా సోమవారంతో ముగిసింది. దీంతో ఆయా ప్రధాన పార్టీల మద్దతుదారులు, రెబల్ అభ్యర్థులు ప్రలోబాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సమకరించాలని అధికారులు కోరుతున్నారు. 9 మండలాల్లో ఎన్నికలు దేవరకొండ డివిజన్లో దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, డిండి, గుడిపల్లి మండలాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో అధికారులు డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు నడుమ చేరుకోనున్నారు. 7గంటల నుంచి పోలింగ్ ఈనెల 17న డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుండగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. డివిజన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించిన పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వెబ్కాస్టింగ్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఫ రేపు పంచాయతీ మూడో విడత ఎన్నికలు ఫ సోమవారంతో ముగిసిన ప్రచారం ఫ 227 గ్రామాల్లో పోలింగ్ -
ధనుర్మాస శోభ
ఫ నేటి నుంచి జనవరి 14 వరకు వైష్ణవ ఆలయాల్లో ఉత్సవాలురామగిరి(నల్లగొండ) : జిల్లాలో ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతాయి. వేంకటేశ్వరస్వామి, శ్రీరామ మందిరాలు ధనుర్మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ఆయా ఆలయాల్లో రోజూ తెల్లవారుజామున అష్టోత్తర శత నామావళి, తులసి మాల కై ంకర్యం, గోదా దేవి విరచిత పాశరాల పఠనం చేపడుతారు. సాయంత్రం పుష్పాలంకరణలు, కుంకుమార్చన, పల్లకి సేవలు నిర్వహిస్తారు. జనవరి 11న కుడారై ఉత్సవంలో 108 కాంస్య పాత్రల్లో పాయసం నివేదన చేస్తారు. 14వ తేదీన గోదా రంగనాథుడి కల్యాణ మహోత్సం శాస్త్రోత్తంగా నిర్వహిస్తారు. -
యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట : ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో వజ్రవైడూర్యాలతో అలంకృతులైన ఉత్సవమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారంగా వూదమంత్ర పఠనాలతో అర్చకులు లక్ష పుష్పార్చన చేశారు.ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర ఆరాధనలు చేపట్టారు. అనుబంధ శివాలయంలో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పల్లెల్లో పాగా
రెండు విడతల్లోనూ అధికార పార్టీకే పట్టంరెండో విడత ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో న్యాయ వివాదంతో ఎన్నికలు ఆగిపోయాయి. అదే మండలంలోని అభంగాపురంలో సర్పంచ్ స్థానం, అనుముల మండలంలోని పేరూరులో సర్పంచ్ స్థానం ఎస్జీలకు రిజర్వ్ కావడంతో.. అభ్యర్థుల్లేక ఎన్నికలు జరుగలేదు. దీంతో 3 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఆగిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో మూడు గ్రామాలు మినహా 1240 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 772 స్థానాలను కై వసం చేసుకుని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ రెండు విడతల్లో 355 స్థానాలను దక్కించుకుని రెండో స్థానంలో ఉంది. బీజేపీ 13 స్థానాల్లోనే గెలుపొంది ప్రభావం చూపలేకపోయింది. అధికార పార్టీకే అందలం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీనే అందలం ఎక్కించారు. మొదటి విడతలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో 630 పంచాయతీల్లో, రెండో విడతలో 610 స్థానాల్లో.. రెండూ కలిపి 1240 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మొదటి విడతలో 394 మంది, రెండో విడతలో 378 స్థానాల్లో విజయం సాధించారు. రెండు విడతల్లో 772 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు విడతల్లో 62.25 శాతం సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్కు 28.63 శాతం స్థానాలు.. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఉమ్మడి జిల్లాలో 355 స్థానాలను దక్కించుకున్నారు. మొదటి విడతలో 186, రెండో విడతలో 169 స్థానాల్లో సర్పంచ్లుగా గెలుపొందారు. రెండు విడతల్లో బీఆర్ఎస్ మద్దతుదారులకు 28.63 శాతం స్థానాలు లభించాయి. ఇక, సీపీఎం, సీపీఐ, స్వతంత్రులకు వంద స్థానాలు (8.07 శాతం) లభించాయి. అందులో స్వతంత్రులే అత్యధికంగా ఉన్నారు. ఇక బీజేపీ మద్దతుదారులకు 13 స్థానాలు (1.05 శాతం) లభించాయి. మొదటి విడతలో వివిధ పార్టీల మద్దతుదారులకు లభించిన స్థానాలు జిల్లా జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/ ఇతరులు నల్లగొండ 318 213 79 3 23 సూర్యాపేట 159 92 55 3 9 యాదాద్రి 153 89 52 3 9 మొత్తం 630 394 186 9 41 రెండో విడతలో జిల్లా జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/ ఇతరులు నల్లగొండ 282 194 67 1 17 సూర్యాపేట 181 114 40 2 25 యాదాద్రి 150 70 62 1 17 మొత్తం 613 378 169 4 59 ఫ 1,243 పంచాయతీల్లో 871 స్థానాలు దక్కించుకున్న హస్తం పార్టీ మద్దతుదారులు ఫ మరోసారి కాంగ్రెస్కు కంచుకోట అని నిరూపించిన ఉమ్మడి జిల్లా ఫ 355 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఫ బీజేపీకి వచ్చింది 13 స్థానాలే.. ఫ సీపీఐ, సీపీఎం, స్వతంత్రులకునామమాత్రంగానే.. -
పోటెత్తిన ఓటర్లు
ముగిసిన రెండవ విడత పంచాయతీ పోలింగ్ ఫ 88.74 శాతం పోలింగ్ నమోదు ఫ మొదటి విడత కంటే స్వల్పంగా తగ్గుదల ఫ అత్యఽధికంగా మాడ్గులపల్లి మండలంలో 92.34 శాతం, అత్యల్పంగా మిర్యాలగూడలో 85.79 శాతం నమోదు ఫ మొదటి రెండు గంటల్లో 28.15 శాతమే.. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన జనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 241 గ్రామ పంచాయతీలకు 1,832 వార్డు మెంబర్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 88.74 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల తర్వాత పోలింగ్ బూత్లకు జనాలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే మొదటి విడత కంటే రెండో విడత జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. ఈసారి పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి రెండు గంటల్లో 28.15 శాతం నమోదు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పది మండలాల పరిధిలో మొదటి రెండు గంటల్లో అంటే 9 గంటల వరకు 28.15 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,99,576 మంది ఉండగా మొదటి రెండు గంటల్లోనే 84,333 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా 9 నుంచి 11 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 1,69,086కు పెరిగింది. దీంతో 56.44 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మధాహ్నం ఒంటి గంట వరకు ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య 2,47,859 చేరుకోగా 82.74 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తంగా 2,65,852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రెండో విడతలో 88.74 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడత కంటే తగ్గిన పోలింగ్ శాతం మొదటి విడతలో కంటే రెండో విడతలో స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 90.53 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్లోని 10 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 88.74 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్లో అత్యధికంగా మాడుగులపల్లి మండలంలో 92.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మిర్యాలగూడలో 85.79 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసేందుకు వృద్ధురాలిని మోసుకొస్తున్న యువకులురెండో విడత ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,30,941 మంది ఓటు వినియోగించుకోగా, మహిళలు 1,34,900 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్జెండర్లు 11 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు.. మండలం మొత్తంఓట్లు పోలైన ఓట్లు అడవిదేవులపల్లి 13,915 12,687 అనుముల 20,349 18,587 దామరచర్ల 40,314 35,898 మాడ్గులపల్లి 24,212 22,357 మిర్యాలగూడ 53,537 45,928 నిడమనూరు 36,094 32,075 పెద్దవూర 32,742 28,496 త్రిపురారం 31,763 28,124 తిరుమలగిరిసాగర్ 26,082 23,276 వేములపల్లి 20,568 18,424 మొత్తం 2,99,576 2,65,852 -
మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం
నూతనకల్ : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఇటీవల హత్యకు గురైన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డితో కలిసి పరామర్శించారు. మల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పదేళ్ల పరిపాలనలో హత్యా రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, మున్న మల్లయ్య, ఎస్ఏ రజాక్, చూడి లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, మహేశ్వరం మల్లికార్జున్, బత్తుల సాయిలుగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. లింగంపల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
పోలింగ్ ప్రశాంతంగా సాగింది
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం ఆమె.. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కుర్ర లక్ష్మితో కలిసి దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో ఓ పోలింగ్ బూత్లో ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో ప్రొసిడింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో వీధి నిర్వహాణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పీఓ సంధ్యకు షోకాజ్ నోటీసును జారీ చేయాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. అన్ని పొలింగ్ కేంద్రాల నుంచి పోలైన బ్యాలెట్స్తో పాటు ఎన్నికల సామగ్రిని దగ్గరలోని ఎస్టీఓలో భద్రపరచాలని ఆదేశించారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎంపీడీఓ మంగ, ఎంపీఓ అశోక్, డీపీఓ వెంకయ్య, డీసీఓ పత్యానాయక్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులున్నారు. -
మలి విడతలోనూ అధికార పార్టీ మద్దతుదారులకే అధిక స్థానాలు
ఫ మిర్యాలగూడ డివిజన్లోని 282 పంచాయతీల్లో 38 ఏకగ్రీవం ఫ మూడు గ్రామాల్లో జరగని ఎన్నికలు.. 241 చోట్ల పోలింగ్ ఫ కాంగ్రెస్ పార్టీకి 194 పంచాయతీల్లో పట్టం ఫ 67 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ ఫ తిరుమలగిరి సాగర్, నిడమనూర్ మండలాల్లో రెబల్స్ హవా మొదటి, రెండో విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. మొదటి, రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాల్లో గెలుపొందారు. సీపీఐ/సీపీఎం/ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా, బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. రెండు విడతల్లోనూ బీజీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ 13 మంది రెబల్స్ కలుపుకొని 213 స్థానాలను దక్కించుకోగా, రెండో విడతలో కాంగ్రెస్ 24 మంది రెబల్స్ కలుపుకొని 194 స్థానాలను దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మొదటి విడతలో 79 స్థానాలను దక్కించుకోగా, రెండో విడత ఎన్నికల్లో 67 స్థానాలను పొందింది. ఇతరులు మొదటి విడతలో 23 మంది, రెండో విడతలో 17 మంది గెలుపొందారు. మాడుగులపల్లి సర్పంచ్గా ఎన్నికైన నరేష్ను భుజాలపై ఎత్తుకుని ఊరేగిస్తున్న గ్రామస్తులుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాల్లోని 282 గ్రామ పంచాయతీల్లో 194 స్థానాలను అధికార కాంగ్రెస్ మద్దతు దారులు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ 67 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ గెలుపొందిన స్థానాల్లో ఆ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులు 24 స్థానాల్లో విజయం సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 17 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. తిరుమలగిరి సాగర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులపై రెబల్స్ విజయం సాధించగా, నిడమనూరు, త్రిపురారంలోనూ కాంగ్రెస్ రెబల్స్ కొంతమంది గెలుపొందారు. 38 స్థానాలు ఏకగ్రీవం.. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు మిర్యాలగూడ డివిజన్లోని పది మండలాల పరిధిలో ఆదివారం జరిగాయి. డివిజన్ పరిధిలోని 282 గ్రామ పంచాయతీలు ఉండగా 38 స్థానాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగలేదు. దీంతో 241 పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ సాగింది. మొత్తం 2,408 వార్డులకు గాను 23 వార్డుల్లో ఎన్నికలు జరుగలేదు. ఇక 553 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 1,832 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వరకు అన్ని గ్రామాల్లో ఫలితాలను ప్రకటించారు. తిరుమలగిరి సాగర్లో రెబల్స్ విజయం తిరుమలగిరి సాగర్ మండలంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. అక్కడ అధికార పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తిరుమలగిరి సాగర్లో బీఆర్ఎస్ పోటీ చేసిందే 4 స్థానాల్లో అందులో 3 స్థానాలలో బీఆర్ఎస్ సర్పంచ్లు విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు దారులకు పోటీగా ఉన్న 10 మంది రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం మండలంలో 35 స్థానాలు ఉండగా అందులో 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మిగిలిన 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 10 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. నిడమనూరులో 5 స్థానాల్లో, త్రిపురారంలో 3, అడవిదేవులపల్లిలో 3, దామరచర్లలో 3 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు గెలుపొందారు.మండలాల వారీగా ఫలితాలు.. మండలం జీపీలు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/ ఏకగ్రీవం ఏకగ్రీవం ఇతరులు అడవిదేవులపల్లి 13 2 9 (రె.3) 0 2 0 0 దామరచర్ల 35 1 25 (రె.3) 0 8 0 1 మిర్యాలగూడ 46 1 23 0 14 0 8 మాడుగులపల్లి 28 5 12 0 9 0 0 వేములపల్లి 12 0 9 0 3 0 0 అనుముల 24 3 12 1 3 0 4 పెద్దవూర 28 4 15 0 8 0 1 తిరుమలగిరిసాగర్ 35 11 20 (రె.10) 1 3 0 0 నిడమనూరు 29 0 23 (రె.5) 0 4 1 1 త్రిపురారం 32 7 12 (రె.3) 1 10 0 2 మొత్తం 282 34 160 3 64 1 17 (నోటు: మూడు గ్రామాల్లో ఎన్నికలు జరుగలేదు.) -
ఇసుకబావిగూడెంలో బీఆర్ఎస్ ధర్నా
మాడుగులపల్లి : మండలంలోని ఇసుకబావిగూడెంలో నిర్వహించిన ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తంగెళ్ల లలితకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సాయంత్రం 6.30గంటల నుంచి 11గంటల వరకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కొన్ని బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ ఇంక్ అంటీఅంటనట్లుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారికి అనుకూలంగా వ్యవహరించారని.. బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన గుర్తుపై ఇంక్ కొంచెం అంటినా.. వాటిని తిరస్కరించడంతో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారని ఆరోపించారు. అధికారులు రీకౌంటింగ్ చేసి కూడా ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. మూడు చోట్ల సాగని ఎన్నికలు మాడుగులపల్లి : మండలంలోని అభంగాపురం, అనుముల మండలంలోని పేరూరు సర్పంచ్ స్థానాలు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. అక్కడ ఎస్టీలు లేకపోవడంతో ఎవరూ పదవికి సర్పంచ్ నామినేషన్ వేయకపోవడంతో స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అదేవిధంగా మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో ఎస్టీ మహిళ రిజర్వ్ కాగా ఎస్టీ అభ్యర్థి ధీరావత్ కల్పన ఇటీవల హైకోర్టుకు వెళ్లి తనకు ఓటు కల్పించాలని, తన నామినేషన్ను అంగీకరించాలని కోరగా హైకోర్టు ఈనెల 15వ తేదీ వరకు గ్రామంలో ఎన్నిక నిర్వహించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ వివాదం కారణంగా ఎన్నిక ఆగింది. ఈ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. పోలింగ్ కేంద్రాల తనిఖీ హాలియా, మాడుగులపల్లి : అనుముల మండలంలోని ఇబ్రహీంపేట, మాడుగులపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ శరత చంద్ర పవార్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. -
ఫ బరువు..బాధ్యత
ఆర్టీసీ కాదు.. ఎన్నికల బస్సు తిరుమలగిరి(సాగర్) : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బందిని పాఠశాల బస్సుల్లో వివిధ గ్రామాలకు తరలించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది నిల్చునే ప్రయాణించాల్సి వచ్చింది. ఒక చేత్తో సామాగ్రిని పట్టుకొని ఒంటికాలిపై నిలబడి ప్రయాణించాల్సి రావడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల వేళ చికెన్ కొరత!పెద్దవూర: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు గాను అభ్యర్థులు చాలా గ్రామాలలో చికెన్, కూల్డ్రింక్స్, మద్యం పంపిణీ చేస్తున్నారు. పెద్దవూర మండలంలో ఏ గ్రామంలో చూసినా చికెన్ దుకాణాలలో శనివారం మధ్యాహ్నం కోళ్లు అయిపోయాయి. ఎన్నికల వేళ చికెన్ దుకాణాలు, కూల్డ్రింక్స్ దుకాణాల్లో భారీగా వ్యాపారం సాగింది. రాజీనామా చేశారు.. సర్పంచ్గా గెలిచారుఆత్మకూరు(ఎం) : మండలంలోని మొదుగుకుంటకు చెందిన సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్కు చెందిన సుంకరి మంజుల గ్రామ వీఓఏలుగా పని చేస్తున్నారు. ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలించడంతో సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మోదుగుకుంట సర్పంచ్గా సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్ సర్పంచ్గా సుంకరి మంజుల విజయం సాధించారు. నాలుగోసారి వరించిన విజయంతిప్పర్తి : మూడు సార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా నాలుగోసారి విజయం సాధించాడు తగుళ్ల శ్రీనయ్య. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన తగుళ్ల శ్రీనయ్య 2006లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్వారం సర్పంచ్ స్థానానికి సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు. 2013లో ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఓడిపోయాడు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమవుతూనే వారి నమ్మకాన్ని సంపాదించాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి మండలంలోనే అత్యధికంగా 834 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.నాడు వార్డు మెంబర్.. నేడు సర్పంచ్రాజాపేట : మండలంలోని బసంతపురం గ్రామానికి చెందిన మెండు రత్నమాల మూడు పర్యాయాలు వార్డు సభ్యురాలిగా విజయం సాధించాగా.. ఈ సారి సర్పంచ్గా గెలుపొందారు. బసంతపురం గ్రామపంచాయతీకి 2006లో జరిగిన ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో 5వ వార్డు సభ్యురాలిగా, 2019లో 6వ వార్డు సభ్యురాలిగా గెలిచారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బసంతపురం గ్రామ సర్పంచ్గా పోటీచేసి 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
బొట్టుగూడ స్కూల్కు.. కార్పొరేట్ హంగులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నడిబొడ్డున బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ హంగులతో సిద్ధమైంది. 70 సంవత్సరాలుగా సొంత భవనం లేని ఈ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. ఈనెల 20వ తేదీన.. ఈ స్కూల్ను ప్రారంభించడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 70 సంవత్సరాలుగా ఈ స్కూల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకొని దేశ, విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ స్కూల్కు మంత్రి కోమటిరెడ్డి ఔధార్యంతో సొంత భవనం కల నెరవేరింది. ఈ పాఠశాలను ఈనెల 20వ తేదీన సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిర్ణయించారు. దాంతో స్కూల్ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలిపోయిన పనులు పూర్తి కానున్నాయి. జీప్లస్ త్రీ భవనం.. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొట్టుగూడ (ప్రకాశంబజార్)లో రూ.8 కోట్లతో జీ ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించారు. సుమారు 600 మంది విద్యార్థులు చదువుకునేలా నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల అయినా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ భవనంలో 36 గదుల్లో ఏసీ సమకూర్చారు. పైఅంతస్తులో ఆడిటోరియం, ల్యాబ్ ఏర్పాటు చేశారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి ఈ పాఠశాల ఉపాధ్యాయుడు సలీమ్కు అప్పగించారు. 16 నెలలుగా ఆయన రోజూ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. బొట్టుగూడ స్కూల్ భవనం ఫ జీ ప్లస్ త్రీ భవనం నిర్మించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఫ ఏసీతో కూడిన 36 తరగతి గదులు ఫ ఈ నెల 20న ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం -
యాదగిరి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై నో ఫ్లయింగ్ జోన్లో శనివారం ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేశాడు. ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని గాజులరామారంలో నివాసముంటున్నాడు. శనివారం స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆ వ్యక్తి కొండ కిందకు వెళ్లి డ్రోన్ ఎగురవేసి కొండ పైన పరిసరాలు, నో ఫ్లయింగ్ జోన్ను చిత్రీకరిస్తుండగా.. స్థానికుల ద్వారా ఎస్పీఎఫ్ పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వెంటనే అతడి వద్దకు ఎస్పీఎఫ్ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిని అప్పగించడంతో పట్టణ సీఐ కేసు నమోదు చేశారు. -
గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ శనివారం గుండెపోటుతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బస్వాపురం గ్రామానికి చెందిన వనగంటి లక్ష్మి(58) ఆ గ్రామంలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో నిలబడింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని శుక్రవారం వరకు ప్రచారం నిర్వహించింది. శనివారం ఆమె ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో● డ్రైవర్కు తీవ్ర గాయాలుకేతేపల్లి : ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కోట్ల శివ ఆటోలో శుక్రవారం రాత్రి సూర్యాపేట నుంచి నకిరేకల్కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండల కేంద్రంలోని బస్ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న శివ తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాళం వేసిన ఇంట్లో చోరీకేతేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన మారగోని సైదులు ఈ నెల 11న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు సైదులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు, 6 గ్రాముల బంగారు చెవుల పట్టీలు, 20 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన సైదులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు సందర్శించి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. -
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మాడుగులపల్లి : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో పోలింగ్తోపాటు ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి వివాదాలకు, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. ముఖ్యంగా పోలైన బ్యాలెట్ల భద్రత, బాధ్యత పూర్తిగా స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులపై ఉందన్నారు. దగ్గరలోని ఎస్టీవోలో జమ చేసే వరకు వారు బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించి సమయానికి కౌంటింగ్ను ప్రారంభించాలని, ఫలితాల వెల్లడికి జాప్యం చేయవద్దని, ఎవరి అనుమతి కోసం ఆగవద్దన్నారు. సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం ఎన్నికలు జరగనున్న పది మండలాల్లో 250 పోలింగ్ కేంద్రాల లొకేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్, డీపీఓ వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్రావు, తహసీల్దార్, ఎంపీడీఓ ఉన్నారు. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు నల్లగొండ : పంచాయతీ రెండవ విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రతి 200 ఓట్లకు ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా రీ కౌంటింగ్ సమస్య వస్తే కౌంటింగ్ పూర్తయిన 15 నిమిషాల్లో రాత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలా, వద్దా అన్నది పూర్తిగా స్టేజ్–2 ఆర్ఓపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రీ కౌంటింగ్కు వచ్చిన ఫిర్యాదుకు స్టేజ్ –2 ఆర్ఓ సమ్మతిస్తే లేదా తిరస్కరిస్తే ఆ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసేటప్పుడు ముగ్గురు మాత్రమే లోపల ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,338 మంది విద్యార్థులకుగాను 3241 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. దీంతో ఒక్క సీటుకు 40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగిందని పేర్కొన్నారు. 24న అర్చక ఉద్యోగుల సమావేశంరామగిరి (నల్లగొండ) : ఈ నెల 24న దర్వేశిపురంలో అర్చక ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు అర్చక ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ డీవీఆర్.శర్మ తెలిపారు. శనివారం నల్లగొండలోని తులసీ నగర్ భక్తాంజనేయస్వామి ఆలయంలో అర్చక ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అర్చక ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనం చెల్లించాలని కోరారు. దూప, దీప నైవేద్యం అర్చకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ చిలకమర్రి శ్రవణ్చార్యులు, పెన్నా మోహనశర్మ, మామిళ్లపల్లి రాంబాబుశర్మ, జి.హరీష్శర్మ, మోహనాచార్యులు, షటగోపాలచార్యులు, జి.శేఖర్, మహేష్, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. ఆ తర్వాత కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ‘సీసీ’లో పర్యవేక్షించి.. సమస్యలు తెలుసుకొని యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ విభాగాల్లో తిరుగుతూ, సీసీ టీవీలో పర్యవేక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ముఖ మండపం, ప్రసాద వితరణ, పశ్చిమ రాజగోపురం వద్ద, భక్తులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొండపైన ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. శనివారం సీసీ పుటేజీలను పరిశీలించి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వసతుల కల్పన, ప్రసాద వితరణ సజావుగా జరిగేలా చూడాలని వారికి సూచించారు. ఆకట్టుకున్న నృత్యాలు భువనగిరి : భువనగిరి మండలం రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్కు చెందిన మీరా నాట్య గురువు పూజిత శిష్య బృందం భరత నాట్యం ప్రదర్శించి అలరించారు. తమ అభినయంతో సందర్శకులను మొప్పించారు. కార్యక్రమంలో కళాకారిణిలు తరుణి అరుషి, భావిక, నిహిత, తనస్వి, వైష్ణవి, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికే పట్టం కట్టారు
నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించినా కేంద్రంలోని బీజేపీ మోకాలడ్డిందని అయినా.. బీసీలకు కాంగ్రెస్ 52 శాతం టికెట్లు ఇచ్చిందన్నారు. గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓడిన వారు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్లో ఎన్నో అవకాశాలు పార్టీ కల్పిస్తుందన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అత్యదిక స్థానాలను కై వసం చేసుకుంటే మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అత్తెసరు మార్కులతో గెలిచి కాంగ్రెస్ను విమర్శించడం సరైంది కాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచారంటూ మాట్లాడటం జగదీశ్రెడ్డికి తగదన్నారు. జిల్లాలో ఏ గ్రామానికై నా వస్తానని.. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్లలో కాంగ్రెస్ ద్వారా ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పది శాతం సీట్లు కూడా గెలువలేదన్నారు. 2, 3వ విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, గోట వెంకన్నగౌడ్, సలీం, ప్రవీణ్, గోపినాథ్, కూర లింగయ్య, వెంకన్నగౌడ్, యోగానందం, ప్రకాష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ -
రాత్రి 8 గంటల వరకు పూర్తి కానున్న కౌంటింగ్
ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పది మండలా పరిధిలో 3,28,016 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,60,821 మంది పురుషులు, 1,67,166 మంది మహిళలు, 29 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ తరువాత ముందుగా వార్డు సభ్యుల ఓట్లను, ఆ తరువాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ల ఎన్నిక తర్వాత అక్కడే వెంటనే ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు. దీంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. -
రెండో విడత పోలింగ్కు పటిష్ట భద్రత
మిర్యాలగూడ టౌన్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం దామరచర్ల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించేలా.. ప్రతి మండలానికి 200 మంది చొప్పున 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణమే అక్కడికి చేరుకొని పరిష్కరించేందుకు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంకు బాటిళ్లు, పెన్నులు అనుమతించమన్నారు. విజేతల ఊరేగింపు, డీజెలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఆయన వెంట డీఎస్పీ రాజశేఖర్రాజు, మిర్యాలగూడ రూరల్ ీసీఐ పీఎన్డీ ప్రసాద్ ఉన్నారు.ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్ -
ప్రజలకు కావాల్సింది.. ఫ్యూచర్ గ్రామాలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రజలకు కావాల్సింది ఫ్యూచర్ సిటీలు కాదని.. ఫ్యూచర్ గ్రామాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైజింగ్ తెలంగాణ పేరుతో ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో గ్రామీణ పాలనకు నేరుగా 40శాతం నిధులు విడుదల చేస్తున్న ఏకై క రాష్ట్ర కేరళ అని, కేరళను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వినోద్నాయక్, కోటిరెడ్డి, ఉన్నం వెంకటేశ్వర్లు, నాగయ్య, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మీ ఓటు చెల్లదు
ముద్ర సరిగా వేయకుంటే..ఫ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో చెల్లని ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేకనే ఇబ్బందులు కేతేపల్లి : బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్పై గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేక పోవడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు తారుమారవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. ఒక ఓటు సర్పంచ్ అభ్యర్థికి, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాల్సి ఉన్నప్పటికీ కొందరు ఓటర్లు సర్పంచ్ బ్యాలెట్పైనే రెండు గుర్తులకు ఓటు వేసి వార్డు సభ్యుడి బ్యాలెట్పై ఓటు వేయకుండానే బ్యాలెట్ బాక్స్లో వేశారు. మరి కొందకు గుర్తులపై వేలిముద్రలు కూడా వేశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్పై ఓటువేసి సరిగా మడత పెట్టక పోవడంతో వేరొక వైపు కూడా స్వస్తిక్ గుర్తు పడి ఓటు చెల్లకుండా పోయింది. చెల్లని ఓట్లు 462 మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో కేతేపల్లి మండల వ్యాప్తంగా 27,260 ఓట్లు పోలవ్వగా అందులో 462 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక్క కేతేపల్లిలోనే 101 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో పాటు చెర్కుపల్లిలో 59, భీమారంలో 62, ఇనుపాములలో 30, కొత్తపేటలో 28, తుంగ తుర్తిలో 27, గుడివాడలో 40, కొప్పోలులో 33, కొర్ల పహాడ్లో 21, మిగతా అన్ని గ్రామాల్లోనూ 10 నుంచి 20 ఓట్లు చెల్లకుండా పోయాయి. మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం యాదగిరిగుట్ట రూరల్ : మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆయా గ్రామాల్లో చెల్లని ఓట్లు సర్పంచ్ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 19 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించాడు. ఇక్కడ 26 ఓట్లు చెల్లకుండా పోగా 6 ఓట్లు నోటాకు వచ్చాయి. ● మసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా 23 ఓట్లు చెల్లకుండా పోయాయి. -
అన్నపై తమ్ముడి విజయం
బొమ్మలరామారం : మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడగా అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ ఇస్లావత్ ఈర్యానాయక్ కుమారులు ఇస్లావత్ పాండు అతడి తమ్ముడు ఇస్లావత్ కృష్ణానాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. తిమ్మాపూర్కు చెందిన కుతాడి యాదగిరి కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఇస్లావత్ కృష్ణానాయక్కు 567 ఓట్లు, ఇస్లావత్ పాండుకు 361, కుతాడి యాదగిరికి 351 ఓట్లు వచ్చాయి. దాంతో ఇస్లావత్ కృష్ణానాయక్ తన అన్న పాండునాయక్పై 206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. నాడు భర్త ఓటమి.. నేడు భార్య గెలుపుకేతేపల్లి : గత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసిన భర్య ఓటమి పాలయ్యాడు. అయినా ఆయన ప్రజలతోనే ఉండి వారి నమ్మకాన్ని కూడగట్టుకొని ప్రస్తుత ఎన్నికల్లో భార్యను పోటీ చేయించగా ఆమె విజయం సాధించింది. 2019లో కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. దాంతో అదే గ్రామానికి చెందిన వంటల చేతన్కుమార్ పోటీ చేశాడు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా చేతన్కుమార్ వెనుకడుగు వేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందాడు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా చేతన్ భార్య సాహితి సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు. గురువారం జరిగిన పోలింగ్లో 133 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. అప్పుడు భార్యలు.. ఇప్పుడు భర్తలుబొమ్మలరామారం : గత ఎన్నికల్లో భార్యలు సర్పంచ్లుగా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో వారి భర్తలు పోటీ చేసి విజయం సాధించారు. మండలంలోని బండకాడిపల్లికి 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి లావణ్య సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రిజర్వేషన్ మారడంతో ఆమె భర్త పెద్దిరెడ్డి మల్లారెడ్డి పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందారు. మైసిరెడ్డిపల్లి గ్రామంలో.. మండలంలోని మైసిరెడ్డిపల్లిలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన నోముల రమాదేవి సర్పంచ్గా విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె భర్త నోముల రాంరెడ్డి సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. పాతికేళ్లకే సర్పంచ్..రాజాపేట : రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన పాతికేళ్ల యువతి ఇండ్ల అనూష గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందింది. బేగంపేట గ్రామానికి చెందిన ఇండ్ల(మంత్రాల) సుమన్తో 2019లో అనూషకు వివాహం జరిగింది. అత్తగారింటికి వచ్చాక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. అదేవిధంగా దూదివెంకటాపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల నడిమింటి నరేష్, రాజాపేటకు చెందిన 29 ఏళ్ల కోయ మధు కూడా సర్పంచులుగా గెలుపొందారు. -
రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత దుర్మరణం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత బొమ్మిడి నర్సిరెడ్డి(67) మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపల్పహాడ్ గ్రామానికి చెందిన బొమ్మిడి నర్సిరెడ్డి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో స్థిరపడ్డారు. స్థానికంగా బంగారిగడ్డ కాలనీ శివారులో బీఎస్ సీడ్స్ పేరుతో వరి విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పారు. శనివారం స్వగ్రామం పీపల్పహాడ్లోని తన వ్యవసాయ క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి చౌటుప్పల్కు వస్తుండగా.. పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మేనబావ అవుతారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి పట్టివేతభువనగిరి : బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం భువనగిరి ఎక్సైజ్ సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా వద్ద శుక్రవారం ఓ వ్యక్తి గంజాయి విక్రయించేందుకు వస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పండుగ భానుచందర్ గంజాయి విక్రయిస్తుండగా అతడిని పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన బొబ్బల నరేందర్రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. 1.120 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకుని భువనగిరి ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
నల్లగొండ: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండలోని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ర్యాండమైజేషన్లో వారు మాట్లాడారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని 2,418 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 2,898 మంది ప్రీసైడింగ్ అధికారులు, 3,334 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు అవసరమన్నారు. ఇందుకు 2,418 బృందాలను ఏర్పాటు చేస్తూ ర్యాండమైజేషన్ చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, ఎన్ఐసీ అధికారి ప్రేమ్, అబ్జర్వర్ నోడల్ ఆఫీసర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు. ఉపకార వేతనాల పంపణీలో జాప్యం చేయొద్దు నల్లగొండ: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో జాప్యం చేయకుండా వేగంగా అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల పంపిణీపై శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపకార వేతనాల దరఖాస్తులపై సమీక్ష, ధ్రువీకరణ, ఫండ్ విడుదల అన్నింటినీ నిర్దిష్ట గడువుల్లోనే పూర్తిచేయాలన్నారు. తహసీల్దార్లు త్వరగా విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. అన్ని మండలాల్లో స్కాలర్షిప్ల దరఖాస్తులను వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్. జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శశికళ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, ఎంఈఓలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, లీడ్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. ఫ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆరోగ్య చట్టాలపై అవగాహన అవసరం
నల్లగొండ టౌన్ : ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రక్షణ చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ భీమార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్వమానవ ఆరోగ్య రక్షణ చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టాలపై అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవచ్చన్నారు. ఎవరివల్ల అన్యాయానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. దీనికోసమే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ మాట్లాడుతూ ఆరోగ్య భద్రత ప్రతిఒక్కరి హక్కు అని మన భారత రాజ్యాంగం పీఠికలోనే ఉందన్నారు. అన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
చిన్న మాధారంలో రీకౌంటింగ్ జరపాలి
నల్లగొండ టూటౌన్ : కనగల్ మండలం చిన్నమాదారంలో తొలి విడత పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పిండి భాగ్యమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. గురువారం సాయంత్రమే రీకౌంటింగ్ జరపాలని పోలింగ్ అధికారులను కోరామని, రీకౌంటింగ్ చేస్తామని చేయకుండా రాత్రి 10 గంటల సమయంలో మరో అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వివరించారు. పోలింగ్ అధికారులు, పోలీసులు తమపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అవకతవకలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకొని, రీకౌంటింగ్ జరిపి న్యాయమైన ఫలితాలు వెల్లడించాలని విన్నవించారు. వారి వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. -
పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలి
నల్లగొండ టూటౌన్ : సర్పంచ్లుగా గెలుపొందిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కొత్త సర్పంచ్లను శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించి సన్మానించారు. 834 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీనయ్యను ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోనగిరి దేవేందర్, పల్రెడ్డి రవీందర్రెడ్డి, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్రెడ్డి, ఎలుక శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హిందీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు
నల్లగొండ: చండూరు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో హిందీ బోధించుటకు పార్టు టైం ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 13 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సమర్పించాలని, అనంతరం డెమో ద్వారా ఉపాధ్యాయుడిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. సంబంధిత హిందీ సబ్జెక్టులో ఎంఏ, బీఏ, హెచ్పీటీ అర్హతతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. మిర్యాలగూడలో విజిలెన్స్ తనిఖీలుమిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో 2024–2025, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులను శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ యూనిట్ అధికారి మనోహర్ తనిఖీలు చేశారు. ముందుగా ఇంజనీరింగ్ విభా గంలోని రికార్డులను ఏఈ నవీన్ ద్వారా తెప్పించుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టిన పనులు, ఖర్చయిన నిధు ల వివరాలు కోరుతూ గతనెల 25న మున్సిపల్ కమిషనర్కు మెయిల్ పెట్టినట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవాలినార్కట్పల్లి : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునేలా పాఠశాల యాజమాన్యం కృషిచేయాలని ఎంజీ యూనివర్సిటీ కెమిసీ్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.ప్రశాంతి, కామినేని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్ అన్నారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని శ్రీవిద్యాపీఠ్ స్కూల్లో నిర్వహించిన మేథా ఎక్సో ఎగ్జిబిషన్ను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిట్రా సున్మిత తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములను కాపాడాలి మర్రిగూడ : మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో గల నీలకంఠ రామస్వామి ఆలయ భూములను కాపాడాలని అదే గ్రామానికి చెందిన కంబాలపల్లి రాజేశ్వర్రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండలో దేవాదాయ శాఖ జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములను సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విన్నవించారు. ఆయన వెంట పలువురు గ్రామస్తులు ఉన్నారు. కనుల పండువగా ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్ దేవికి ఊంజల్ సేవోత్సవం కనులపండువగా చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి ఊంజల్ సేవ జరిపించారు. ఆండాళ్దేవికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయ పర్వాలు కొనసాగాయి. సుప్రభాత సేవ, అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
రేపే మలి విడత పంచాయతీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారంతో ప్రచార పర్వం ముగియడంతో అంతటా అభ్యర్థులు, వారికి మద్దతు తెలిపే పార్టీల నేతలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్ మద్దతుదారులతోపాటు ప్రతి పక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈనెల 11న నల్లగొండ, చండూరు డివిజన్లలో మొదటి విడత ఎన్నికలు పూర్తికాగా, 14న మిర్యాలగూడ డివిజన్లో జరుగునున్నాయి. అవసరమైన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్రాలకు పోలింగ్ సామగ్రిని శనివారం పంపిణీ చేయనుంది. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగే మిర్యాలగూడ డివిజన్లోని గ్రామాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ను పూర్తిచేశారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది బ్యాలెట్, పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ బాక్సులను తీసుకోనున్నారు. వారికి ఏర్పాటు చేసిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు శనివారం తరలి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఆదివారం 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 1 గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లున్నా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు. చివరకు సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. అంతటా పోలీస్ బందోబస్తు పది మండలాల పరిధిలో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అధిక సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం వరకు జోరుగా సాగిన ప్రచారం సాయంత్రం బంద్ అయింది. గ్రామాల్లో ర్యాలీలు, ప్రచారాలతో గోలగోలగా ఉండగా ప్రచారం ముగియడంతో గ్రామాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. పోల్ మేనేజ్మెంట్లో ఈ 36 గంటలే కీలకం కావడంతో అధికార, ప్రతిపక్ష, ఇతర అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ప్రచారాలతో ఒక్కో కుటుంబాన్ని పలుమార్లు కలిసిన పోటీదారులు ఇప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకునే కార్యాచరణకు దిగినట్లు సమాచారం. అనేక చోట్ల మద్యం పంపిణీ కొనసాగుతుండగా డబ్బు పంపిణీపైనా దృష్టిపెట్టారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చిపోయే కిరాయిలతోపాటు వారికి మర్యాద చేస్తామని చెప్పి పోలింగ్ రోజు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సర్పంచ్, అటు వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు. ఫ శుక్రవారంతో ముగిసిన ప్రచారం ఫ పది మండలాలు, 244 గ్రామాల్లో ఎన్నికలు ఫ సాయంత్రం వరకు ఫలితాల వెల్లడి ఫ మిర్యాలగూడ డివిజన్లో ఏర్పాట్లు పూర్తి -
సోలార్ విద్యుత్తో అనేక ప్రయోజనాలు
చౌటుప్పల్ : సోలార్ విద్యుత్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ రీజినల్ అధికారి వెంకన్న తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన 680 కేవీ సోలార్ పవర్ ప్లాంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని, విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. పారిశ్రామికవేత్తలు తమ కంపెనీల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో దివీస్ పరిశ్రమ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.సురేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు బి.శ్రీనివాస్రావు, రాఘవేంద్ర, దివీస్ పరిశ్రమ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు చేయాలి
గుర్రంపోడు : పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు చేయాలని, ప్రత్యేమైన బ్యాంకు ఖాతా ద్వారా జమ, ఖర్చులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఆదిత్య అన్నారు. శుక్రవారం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని క్రాంతి ఫంక్షన్ హాల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిమితికి మించి ఖర్చు చేయాలని, ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా ఖర్చు వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలు ఇవ్వకుంటే సర్పంచ్లుగా గెలిచినా ఆ తర్వాత అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్, వార్డుల అభ్యర్థులు, అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి పాటుపడాలి
నల్లగొండ: గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్లు పాటుపడాలని, ఎన్ని నిధులైనా కేటాయిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు శుక్రవారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. వారిని అభినందించి మాట్లాడారు. మంత్రిని కలిసిన వారిలో నల్లగొండ మండలం పెద్ద సూరారం, చెన్నుగూడెం, బుద్ధారం, చందనపల్లి, నర్సింగ్బట్ల, వెలుగుపల్లి, కాంచనపల్లి, తొర్రగల్, దొనకల్, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామాల నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. -
కంగ్రాట్స్ డాడీ..
ఫ తండ్రికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్రెడ్డి నాగారం : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు. మద్యం, డబ్బులు ఇస్తే ఓటు వేయంభూదాన్పోచంపల్లి : గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో ఎవరైనా తమకు మద్యం, డబ్బులు ఇచ్చేందుకు యత్నిస్తే వారికి ఓటు వేయమంటూ భూదాన్పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన బిజిలి యోగేశ్ చెబుతున్నాడు. ఇదే విషయాన్ని పోస్టర్ రూపంలో తన ఇంటి ప్రహరీకి అతికించాడు. ఓటర్లను ప్రలోభ పెట్టి బలవంతంగా డబ్బులు, మందు ఇచ్చే వారికి ఎప్పటికీ ఓటు వెయ్యమంటూ కరపత్రాల ద్వారా హెచ్చరించాడు. గ్రామ సర్పంచ్ను నిజాయితీగా ఎన్నుకోవాలనే యోగేశ్ ఆలోచనను స్థానికులు అభినందిస్తున్నారు. రేగట్టెలో ‘భారత’ ఫ్యామిలీ హవాకనగల్ : మండలంలోని రేగట్టే గ్రామంలో భారత ఫ్యామిలీకి చెందిన వారు ఏకంగా మూడు సార్లు సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2001లో రేగట్టే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా భారత వెంకటేశం పోటీ చేసి గెలుపొందారు. 2006లో వెంకటేశం భార్య కవిత టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2011లో భారత వెంకటేశం ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యాడు. గురువారం జరిగిన ఎన్నికల్లో వెంకటేశం భార్య కవిత రేగట్టె పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యారు. -
ఈటూరులో తీవ్ర ఉత్కంఠ
ఫ డ్రా ద్వారా తేలిన ఫలితం నాగారం : మండలంలోని ఈటూరు గ్రామ పంచాయతీకి గురువారం జరిగిన పోలింగ్, ఓట్ల లెక్కింపు అర్థరాత్రి వరకు కొనసాగింది. గ్రామంలో మొత్తం 3013 ఓట్లు ఉండగా 2,609 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి వంగూరి భిక్షపతి, స్వతంత్ర అభ్యర్థి వంగూరి దామోదర్కు సమానంగా చెరో 1227 ఓట్లు వచ్చాయి. ఫలితంపై తవ్ర ఉత్కంఠ నెలకొంది. దాంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్లో ఇద్దరు అభ్యర్థులకు ఒక్కో ఓటు చెల్లకుండా పోవడంతో మళ్లీ ఇద్దరికి 1226 చొప్పున ఓట్లు రాగా ఫలితం టై అయ్యింది. అనంతరం సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు సమక్షంలో రిటర్నింగ్ అధికారులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చీటీలపై రాసి డ్రా తీశారు. డ్రాలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి దామోదర్ గెలుపొందారు. -
నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
పెద్దవూర : చలకుర్తి క్యాంపులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 4,338 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,339 మంది బాలురు, 1939 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లోనే హాల్టికెట్లు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు యాదాద్రి జిల్లాలో 492 మంది, సూర్యాపేట జిల్లాలో 1575, నల్లగొండ జిల్లాలో 2,271 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్ష కోసం నల్లగొండ జిల్లాలో 13, భువనగిరి యాదాద్రిలో 4, సూర్యాపేట జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తున్న చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10.30లోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అదనంగా మరో 40 నిమిషాల వరకు అనుమతించనున్నట్లు తెలిపారు. అందుబాటులో 80 సీట్లు 6వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. ఇందులో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కెటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, 7.5 శాతం ఎస్టీలకు, 3 శాతం దివ్యాంగులకు, 27 శాతం ఓబీసీలకు, మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు వీటితో రావాలి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్ వెంట తీసుకొని రావాలి. ఫ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఫ అడ్మిట్ కార్డులో వివరాలు తప్పుగా పడితే వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ను సంప్రదించాలి. ఫ విద్యార్థులు ఓఎంఆర్ షీటుతో పాటు ప్రశ్నపత్రంపై హాల్ టికెట్ నంబరు వేయాలి. ఫ విద్యార్థులు 1.30 గంటకు ముందు హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ఫ 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహణ ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు ఫ హాజరు కానున్న 4,338 మంది విద్యార్థులు ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ -
పోరాటం చేశాడు.. సర్పంచ్ అయ్యాడు
నిబంధన ఎత్తివేయడంతో సర్పంచ్ అయ్యారాజాపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు సంతానం నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం వల్లే ప్రస్తుతం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పారుపల్లి గ్రామ సర్పంచ్గా తనకు అవకాశం లభించిందని పారుపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన జ్యోతి తెలిపారు. ముగ్గురు పిల్లలున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిబంధన వల్ల ఎంతోమంది ఎన్నికల్లో పోటీ చేయలేక అనేక అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఈ నిబంధన సడలించడంతో తనతో పాటు చాలా మంది సర్పంచ్లుగా పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. తాను సర్పంచ్గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.నాల్గవసారి సర్పంచ్గా.. చిట్యాల : వెలిమినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా సీపీఎం బలపర్చిన బొంతల చంద్రారెడ్డి 85 ఏళ్ల వయస్సులో ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 307 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఇదే గ్రామ పంచాయతీకి మూడు పర్యాయాలు పద్నాలుగేళ్ల పాటు సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం నాలుగోసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.యాదగిరిగుట్ట : ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేసే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేశాడు యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన కవిడే మహేందర్. ముగ్గురు పిల్లల నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్తో పోరాట కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అభిమాన్ గాంధీనాయక్తో కలిసి కవిడె మహేందర్ కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందించాడు. వీరి పోరాటాల ఫలితంగానే ఈ జీఓను రాష్ట్ర కెబినెట్ రద్దు చేసింది. దాంతో మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాహుపేట గ్రామ సర్పంచ్ స్థానానికి కవిడె మహేందర్ బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేశాడు. గురువారం జరిగిన పోలింగ్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు. తాను చేసిన పోరాటం ఫలించి బాహుపేట గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యే అవకాశం దక్కించుకున్నాడు మహేందర్. ‘ముగ్గురు సంతానం’ నిబంధనపై పోరాడిన మహేందర్ -
సాయుధ పోరాట యోధురాలు మృతి
నూతనకల్ : సీపీఎం సీనియర్ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తొట్ల మల్లమ్మ(95) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సాయుధ పోరాట దళ కమాండర్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొట్ల మల్సూర్కు మల్లమ్మ సహచరి. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డితో కలిసి తుంగతుర్తి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో, ఎర్రపహాడ్ గడిపై దాడిలో ఆమె పాత్ర కీలకం. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటను అల్లిన బండి యాదగిరి మల్సూర్కు సహచరుడు. పార్టీ సిద్ధాంతం కోసం, పేదల పక్షాన తుదిశ్వాస వరకు పోరాడారు. ఆమె మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె మృతదేహాన్ని సీపీఎం, గౌడ సంఘం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మల్లమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిస్టు నాయకులు కోరారు. అటవీ శాఖకు గుడ్లగూబ పిల్లల అప్పగింతనకిరేకల్ : మండలంలోని చందంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల శుక్రవారం గుడ్లగూబ పక్షి పిల్లలు అస్వస్తతకు గురై పడిపోయాయి. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గుడ్లగూబ పిల్లలు పడి ఉన్న విషయాన్ని పాఠశాల హెచ్ఎం కనుకుంట్ల నవీన్రెడ్డికి తెలిపారు. దాంతో ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ అశోక్రెడ్డి పాఠశాలకు చేరుకొని రెండు గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకవెళ్లి చికిత్స చేయించిన తరువాత అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని ఆయన తెలిపారు.


