ప్రజాసేవకు అమర జవాన్ కూతురు
జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే
కోదాడ : పట్టణంలోని 18వ వార్డు అభ్యర్థిగా
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్కు బదులుగా చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన ఉప్పగండ్ల శ్రీనివాస్కు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస్ కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలను పట్టుకొని వార్డులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్న కర్రి సుబ్బారావు రెబల్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.
సూర్యాపేట : కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన లాన్స్నాయక్ గోపయ్యచారి కూతురు పోలోజు మౌనిక సూర్యాపేట పట్టణంలో 46వ వార్డు నుంచి కౌన్సిలర్ స్థానానికి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఎన్నికల్లో నిలబడినట్టు ఆమె చెప్పారు.
ప్రజాసేవకు అమర జవాన్ కూతురు


