సిద్ధమవుతున్న పోలింగ్ కేంద్రాలు
భూదాన్పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజే గడువు ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి మున్సి పాలిటీలోని జడ్పీహెచ్ఎస్, సీతావానిగూడెం, నారాయణగిరి, ముక్తాపూర్, రేవనపల్లి ప్రాథమిక పాఠశాలలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలుగా వినియోగించే గదులను శుభ్రం చేస్తున్నారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్లోని గుర్తులు స్పష్టంగా కన్పించేలా అన్ని పోలింగ్ కేంద్రాలలోని కంపార్ట్మెంట్ పైన లైట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి తెలిపారు.


