తక్షణమే మోటార్లు అందించాలి
జిల్లాలోనే ఎక్కువగా తేనపల్లితండా పరిధిలో 14 బోర్లు వేశారు. ఒక్క మోటారు బిగించలేదు. బోర్లుకు సొంతంగా విద్యుత్ సౌకర్యం, మోటారు ఏర్పాటు చేసుకొనే విషయంతో రైతుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కరెంటు సౌకర్యం, మోటార్లకు నిధులు విడుదల చేయాలి.
–వడిత్యా రజిత, సర్పంచ్, తేనపల్లితండా
గిరి వికాసం పథకం కింద రెండేళ్ల క్రితం జిల్లాలో 56 బోర్లు వేయగా వాటికి కరెంటు సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇందుకుగాను నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కరెంట్ సౌకర్యం వస్తేనే మోటార్లు ఇతర వసతులు కల్పించేందుకు వీలవుతుంది.
– వై. శేఖర్రెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి


