గాంధీ వర్ధంతి సంస్మరణ శాంతి ర్యాలీ
రామగిరి(నల్లగొండ): గాంధీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో సంస్మరణ శాంతి ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి రామగిరి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, ముఖ్య సలహాదారులు ఎం.వి. గోనారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్, నీరుడు దయాకర్రెడ్డి, పాముల అశోక్, కరుణాకర్ రెడ్డి, గిరిధర్ గౌడ్, గిరిబాబు, కందిమల్ల నాగమణిరెడ్డి, సుధారాణి, సరళ, జీనుగు జ్యోతి, వెంకట్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, జవహర్ లాల్, శ్రీనివాస్, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.


