చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి లక్షపుష్పార్చన నిర్వహించారు. అమావాస్య రాత్రి నిద్ర చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈఓ మోహన్బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ పూజలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్ఐ విష్ణుమూర్తి గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు.
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన


