
రజతోత్సవ సభకు తరలిన గులాబీ శ్రేణులు
నల్లగొండ టూటౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు జిల్లా కేంద్రం నుంచి పార్టీ నాయకులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం నుంచి 200కు పైగా వాహనాల్లో వరంగల్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్కుమార్, కటికం సత్తయ్యగౌడ్, బొర్ర సుధాకర్, నిరంజన్ వలీ, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.