వీపీఓలతో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వీపీఓలతో సమస్యలు పరిష్కారం

Apr 16 2025 11:04 AM | Updated on Apr 16 2025 11:04 AM

వీపీఓలతో సమస్యలు పరిష్కారం

వీపీఓలతో సమస్యలు పరిష్కారం

మాడ్గులపల్లి : విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (వీపీఓ) ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండలంలోని ఆగామోత్కూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉంటే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు విలేజ్‌ పోలీసు అధికారికి అందించాలన్నారు. ప్రజలు సైబర్‌ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మాధక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో గ్రామానికి చెందిన ముగ్గురికి ఉపాధి అవకాశం లభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, రూరల్‌ సీఐ పీఎండీ.ప్రసాద్‌, ఎస్‌ఐ కృష్ణయ్య, వీపీఓ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement