
బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలి
కట్టంగూర్ : వరంగల్లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కట్టంగూర్లో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతో త్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, గుండగోని రాములు, గుర్రం సైదులు, వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాలనర్సింహ, దాసరి సంజయ్, మంగదుడ్ల వెంకన్న, నకిరేకంటి నర్సింహ, కిషోర్ ఉన్నారు.