
బీపీ మండల్ సిఫారసులు అమలుచేయాలి
మునుగోడు: దేశంలో అధికశాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తగినా వాటా ఇవ్వాలని బీపీ మండల్ చేసిన సిఫారసులను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం బీపీ మండల్ 43వ వర్ధంతి సందర్భంగా మునుగోడులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీల సామాజిక స్థితిగతులపై బీపీ మండల్ సమగ్ర అధ్యయనం చేసి ఇచ్చిన 40 సిఫారసుల్లో కేవలం 2 మాత్రమే అమలు చేయడం విచారకరమన్నారు. మిగిలిన సిఫారసులను అమలుచేసే వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వంకటాచారి, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్గౌడ్, బూడిద మల్లిఖార్జున్గౌడ్, మిర్యాల వెంకన్న, ఈదులకంటి కై లాస్గౌడ్, పాలకూరి కిరణ్, మేకల మల్లయ్యయాదవ్, యాదప్ప, లింగయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్