
విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
మునుగోడు: విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుందన్నారు. విద్యా పరమైన సమస్యల పరిష్కారానికి తాను నిత్యం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చొరవతో మునుగోడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రూ.5కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కై లాస్నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి, మిర్యాల వెంకన్న, పాలకూరి నర్సింహగౌడ్, బొడ్డు నాగరాజుగౌడ్, పీఆర్టీయూ నాయకులు జాన్రెడ్డి, యూసుఫ్పాష, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకరి భిక్షంగౌడ్ పాల్గొన్నారు.
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి