నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్చల్ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు. ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం.


