
మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుభోదయా యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను స్థానిక మాంట్ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో ఫాదర్ మార్టిన్ పసల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ పోటీలను రాత్రి పది గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తామని కమిటీ అధ్యక్షుడు జయభారత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదూరి కిషోర్రెడ్డి, గాదె జయభారత్రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, గాదె లూర్థుమారెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, విక్టర్రెడ్డి, బాలరెడ్డి, కర్నె వెంకటేశ్వర్లు, చిన్నరామారావు, గోపయ్య పాల్గొన్నారు.