మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం

Apr 27 2025 1:24 AM | Updated on Apr 27 2025 1:24 AM

మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం

మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం

మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుభోదయా యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను స్థానిక మాంట్‌ఫోర్డ్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఫాదర్‌ మార్టిన్‌ పసల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ పోటీలను రాత్రి పది గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తామని కమిటీ అధ్యక్షుడు జయభారత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదూరి కిషోర్‌రెడ్డి, గాదె జయభారత్‌రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, గాదె లూర్థుమారెడ్డి, టీఆర్‌ బాలశౌరెడ్డి, విక్టర్‌రెడ్డి, బాలరెడ్డి, కర్నె వెంకటేశ్వర్లు, చిన్నరామారావు, గోపయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement