
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం
కనగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం రాత్రి ఆమె కనగల్ మండలంలోని శేరిలింగోటం, చెట్ల చెన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా శేరిలింగోటం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు సరిగా రావటం లేదని తెలుసుకున్నారు. దీంతో ఆమె కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. అనంతరం చెట్ల చెన్నారం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడంపై సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ అమిత్ నారయణ్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి